పలికే పుస్తకమే వెలగా వెంకటప్పయ్య -బుద్ధ ప్రసాద్

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సరసభారతి ఈరోజు 31-12-14- బుధవారం సాయంత్రం 6గం.లకు స్థానిక శాఖా గ్రంధాలయం లో ప్రత్యెక సమావేశం -స్వర్గీయ వెలగా ,గూడపాటిలకు శ్రద్ధాంజలి

స్వర్గీయ వెలగా ,గూడపాటిలకు శ్రద్ధాంజలి

సరసభారతి ఈరోజు 31-12-14- బుధవారం సాయంత్రం 6గం.లకు స్థానిక శాఖా  గ్రంధాలయం లో ప్రత్యెక సమావేశం జరిపి గ్రంధాలయ గాంధి ,పలికే పుస్తకం బాల సాహిత్య సృష్టికర్త ,రామ మోహన ఫౌండేషన్  సభ్యులు ,ఉయ్యూరు ఏ సి లైబ్రరీ నిర్మాణం లో సూత్ర ధారి స్వర్గీయ వెలగా వెంకటప్పయ్య గారి మరణానికి ,,ఉయ్యూరు సాహితీ మండలి వ్యవస్థాపక సభ్యులు ,ప్రస్తుత నిర్వాహకులు ,క్షేత్రయ్య సాహిత్య పరి శోధకులు ,సాహితీ మూర్తి  శ్రీ గూడపాటి కోటేశ్వర రావు  గారి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తోంది .సాహిత్యాభిమానులు ,గ్రంధాలయాభిమానులు  మిత్రులు కుటుంబ సభ్యులు  శ్రద్ధాంజలి కార్యక్రమం లో పాల్గొన వలసినదిగా అభ్యర్ధిస్తున్నాం .

జోశ్యుల శ్యామలా దేవి  మాదిరాజు శివలక్ష్మి  గబ్బిట వెంకట రమణ   వి బి.జి.రావు   గబ్బిట దుర్గా                                                                                                                ప్రసాద్

గౌరవాధ్యక్షులు           కార్య దర్శి              కోశాధికారి         సాంకేతిక నిపుణులు   అధ్యక్షులు –సరసభారతి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆరడి నేస్ ల మోడీ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ చిన జీయర్ ఆధ్వర్యం లో మహా గోదా కల్యాణం -14-1-2015 జింఖాన గ్రౌండ్స్ విజయవాడ

godakalyanam 1 001 godakalyanam 2 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మర్చిపోలేనివ్యక్తి శ్రీ సి సుబ్బా రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆందోళన లో తిరుమల భద్రత-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

2014 in review

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 90,000 times in 2014. If it were an exhibit at the Louvre Museum, it would take about 4 days for that many people to see it.

Click here to see the complete report.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తిరుప్పావై ప్రవచనం కరపత్రం

Inline image 1

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పెద్దింటి అశోక్ కుమార్ ,పై కధనం జూకంటి కవిత ,విరాగి కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి తెలుగు కదా మూలాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రికార్డుల వేటలో కూచి భొట్ల – హరప్పా కంటే ముందే యు.పి .లొ నాగరకత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా తెలుగు తల్లి ”శంకరంబాడి శతజయంతి

Untitled

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సుమంగళి -తెలుగు సినిమా -28-12-14ఆంధ్రజ్యోతి మరియు స్టేట్ బాంక్ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య –

sbi chairperson 001 sumangali 1 001 sumangali2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా తెలుగు తల్లి గేయ రచయితస్వర్గీయ శంకరంబాడి సుందరాచారి గారి శత జయంతి సభ సరసభారతి, ఫ్లోరా స్కూల్ సంయుక్త ఆధ్వర్యం లోఫ్లోరా స్కూల్ లో శనివారం 27-12-14

This gallery contains 53 photos.

More Galleries | Tagged | Leave a comment

మహారాజ‘యోగ’ం

మహారాజ‘యోగ’ం (ఈ వారం స్పెషల్)

  • 28/12/2014
  •  ఆదిత్య

యోగా.. ఇప్పుడు అందరికీ ఓ ఆరోగ్యసూచిక యోగా.. ఇప్పుడు అన్ని సమస్యలకూ ఓ పరిష్కారం. యోగా… ఇప్పుడు అందరి అవసరం. ‘యోగా.. ఒంటికి మంచిదేగా..’- అంటూ ఆ మధ్య ఓ సినిమా పాట చెవుల్లో మారుమోగింది. అది నిజమే కూడా. ఇది ఇప్పటిమాటకాదు. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన రహస్యం ఇది. అంతకుముందే కొన్నివేల ఏళ్లక్రితం వేదాలూ ఆ మాటే చెప్పాయి. ఆ పాయింట్‌నే పతంజలీ పవర్‌ఫుల్‌గా చెప్పాడు. ఆ తరువాత బుద్ధుడూ అదే చెప్పాడు. కానీ, యోగాపై హిందూమతం ముద్రవేసి దూరంగా ఉంచేశారు. కొన్ని దశాబ్దాలుగా క్రమంగా యోగాకు పూర్వవైభవం వస్తోంది. ప్రత్యేకించి ఓ పదేళ్లుగా మరింత ప్రాధాన్యం పెరిగింది. ఆధునిక జీవనశైలి తెచ్చే అనర్థాల నుంచి తెరిపిన పడేందుకు మేలైన, సులువైన మందుగా యోగాను గుర్తించడం ప్రారంభమైంది. భారతీయ యోగాను పశ్చిమ దేశాలు ప్రేమించడం మొదలైంది. సెలబ్రిటీలు, ప్రముఖులు యోగాతో యోగ్యమైన స్థానాలకు చేరుకోవడంతో, ఉత్తమ ఫలితాలు పొందడంతో, మానసిక, శారీరక ఆరోగ్యం సాధించడంతో యోగాకు మంచిరోజులొచ్చాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగాపై చేసిన ఓ కసరత్తు సత్ఫలితాన్నిచ్చింది. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. భారతీయ యోగాకు అంతర్జాతీయ గౌరవం దక్కింది. **** ఇంటర్నెట్ పుణ్యమాని ఇంట్లో కూర్చుని ఒక్క ‘క్లిక్’ కొడితే చాలు.. కిరాణా దుకాణం, బట్టల కొట్టు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల షాపు అన్నీ మన కళ్లెదుట ప్రత్యక్షం.. ‘ఆన్‌లైన్ షాపింగ్’ అందుబాటులోకి రావడంతో మనం కాలు కదపకుండానే అన్నీ నేరుగా ఇంటికే వచ్చేస్తాయి.. ఆఫీసుకెళితే సమయం తెలియకుండా పనిలో పడిపోవడం.. ఇంటికెళ్లాక కాలక్షేపం పేరుతో గంటలకొద్దీ టీవీకి అతుక్కుపోవడం.. శరీరానికీ, మనసుకూ ఏ మాత్రం పని లేకుండా అంతా యాంత్రికంగా గడిచిపోవడం… *** ఉదయం లేవగానే తప్పదు కనుక- కొన్ని పనుల్ని మొక్కుబడిగా ముగించడం.. బైకో, కారో ఉంటో ‘స్టార్ట్’ చేసి ఎక్కేయడం.. ‘లిఫ్ట్’లో పనిచేసే చోటకు చేరుకోవడం.. నడకను కూడా దూరం చేసుకోవడం.. అనేకానేక అనారోగ్యాలకు దగ్గర కావడం.. వినూత్న జీవనశైలితో రాజీపడిపోవడం.. ఒత్తిడి పెరిగిపోయిందని అనుక్షణం విసుగెత్తిపోవడం… మార్కులు, ర్యాంకుల ధ్యాసలో పిల్లలు, ఇంటి బాధ్యతలతో గృహిణులు, ఆఫీసు వ్యవహారాల్లో ఉద్యోగులు.. నేటి నవ నాగరిక కాలంలో అందరిదీ ఉరుకులు,పరుగుల జీవనమే.. ఒత్తిళ్లు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు నిత్య జీవితంలో అంతర్భాగమయ్యాయి.. ధనిక, పేద తేడా లేదు.. చిన్నా పెద్దా వ్యత్యాసం లేదు.. ఎవరిని కదిపినా కష్టాలు, కలతలే.. సాంకేతిక విజ్ఞానం విస్తరించినా, ఆధునిక సౌకర్యాలు ఎంతగా సమకూరినా అన్నీ సజావుగా సాగుతాయన్న నమ్మకం లేకుండా పోయింది… పరిపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యం ప్రశ్నార్థకం కావడంతో అనేక దుష్ఫలితాలను చవిచూడక తప్పడం లేదు.. అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, మనోవైకల్యం వంటివి సర్వసాధారణమై పోయాయి.. .. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శారీరక, మానసిక ఉత్తేజానికి ‘యోగా’ ఓ ఆశాకిరణమైంది. వ్యక్తిత్వ దీపాన్ని వెలిగించుకోవడానికి, జీవన రథాన్ని ముందుకు నడిపించడానికి, అనుబంధాలను పెంచుకుంటూ నిత్యం ఆనందం పొందడానికి ‘యోగా’ దోహద పడుతోంది. మానసికంగా సర్వోన్నత స్థితికి చేరేందుకు ‘ఆధ్యాత్మికత’ ఓ మార్గమైతే.. ఆ దారిలో గ మ్యాన్ని చేరుకోవడానికి ‘యోగా’ కూడా అవసరమే. ‘ఆధ్యాత్మిక ప్రజ్ఞ’ సాధించేందుకు సత్యసంధత, నీతి, నిజాయితీ, ఇంద్రియ నిగ్రహంతో పాటు యోగా, ధ్యానం, ప్రార్థన వంటివి ఎంతగానో సహకరిస్తాయి. వ్యాపారం, ఉద్యోగం, చదువు.. ఎందులో రాణించాలన్నా- చేసే పనిమీదే మనసంతా కేంద్రీకృతం కావాలి. ఏకాగ్రతతో విజయపథంలో పయనించాలంటే యోగా ఓ దిక్సూచిలా పనిచేస్తుంది. అందుకే- ఒత్తిళ్లను జయించే సాధనంగా నేడు దేశవిదేశాల్లో చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. యాంత్రిక జీవనంలో యోగా ఓ దివ్యౌషధంలా పనిచేస్తుందని అనేక అధ్యయనాల్లో తేలడంతో ఇపుడు అందరి దృష్టి దీనిపైనే పడింది. ‘యోగా’ చరిత్ర… ప్రపంచానికి ‘యోగా’ను పరిచయం చేసిన ఘనత మన దేశానిదే. వేద కాలానికి పూర్వమే ‘యోగా’ భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైంది. వేల సంవత్సరాల క్రితం ఇది మన దేశంలో పుట్టి అనతికాలంలోనే విశ్వవ్యాప్తమైంది. సంస్కృత పదమైన ‘యోగా’కు ‘విజ్ఞానం’ అనే అర్థం ఉందని విజ్ఞులు చెబుతారు. నాలుగు వేదాల్లో ఒకటైన రుగ్వేదంలో యోగాకు సంబంధించిన అంశాలెన్నో కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ‘్భగవద్గీత’లోనూ దీని ప్రస్తావన ఉంది. ‘యోగా’ను ఆచరించిన వాడే- కోర్కెలపై మమకారం లేకుండా కర్మలపై దృష్టి కేంద్రీకరించగలడన్నది ‘గీతా’ సారాంశం. ‘యోగా’ అన్నది మతసంబంధమైన అంశం కాదు. శారీరక, మానసిక సమస్యలను జయించి ‘ఆధ్యాత్మిక ప్రజ్ఞ’ సాధించేందుకు ఇది ఓ అద్భుత సాధనం. ఈ స్థితికి చేరుకునేందుకు యోగాలో అనేక పద్ధతులను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. వ్యాయామం, ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం వంటివి ఇందులో ప్రధానాంశాలు. మూడు రకాల ఆరోగ్యాలను చేకూర్చే శక్తి ఉన్నందునే దీనికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది. వ్యాయామం, ఆసనాలతో శారీరక ఆరోగ్యం, ప్రాణాయామంతో మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, ధ్యానంతో ఆధ్యాత్మిక ఆరోగ్యం సిద్ధిస్తాయి. యోగాలో కనిపించే ‘శిక్షణ, క్రమశిక్షణ’ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఎల్లలు లేనిది.. నిజానికి యోగా ఓ మహా సముద్రం లాంటిది. లోతుకు వెళ్లేకొద్దీ ఇందులో అన్నీ అద్భుతాలే. నేర్చుకున్నకొద్దీ ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది. సాధకుడి శరీరంపై, మనసుపై ఇది ఎంతో ప్రభావం చూపుతుంది. యోగ శాస్త్రంలో నిగూఢమైన అంశాలను అవగతం చేసుకుంటే – ఆధునిక జీవితంలో అనేక సమస్యలకు, సవాళ్లకు సమాధానాలు లభిస్తాయి. యోగాకు సంబంధించిన ప్రతి ఫలితాన్ని శాస్ర్తియ దృక్పథంతో విశే్లషించుకుంటే దీనిపై తప్పకుండా నమ్మకం ఏర్పడుతుంది. యోగాను ఆచరిస్తే మనం ఆలోచించే పద్ధతుల్లోనే కాదు, జీవన విధానంలోనూ మార్పును గమనించవచ్చు. మానసిక రుగ్మతలతో పాటు అనేక శారీరక సమస్యలను అధిగమించేందుకు యోగా తోడ్పడుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. వెన్నునొప్పి, ఆస్తమా, కీళ్ల సమస్యలు, ఒత్తిళ్లు, జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనేక సమస్యల నుంచి విముక్తి ప్రసాదించే దివ్యశక్తి యోగాలో ఉందని ఇప్పటికే పలు పరిశోధనలు ఘోషిస్తున్నాయి. ‘ఎనిమిది మెట్ల’తో ఎంతో ఉన్నతికి.. ‘యోగా’ అంటే శరీరాన్ని విల్లులా వంచడం, ముద్దలా చేసి మెలికలు తిప్పడం కాదు. ఇలాంటి విద్యలన్నీ సాధారణ వ్యాయామం కింద వస్తాయి. ‘యోగా’కు ఉన్న అర్థం ఎంతో విస్తృతమైనది. యోగా సాధనలో ఎనిమిది సోపానాలు అధిగమిస్తే శారీరక, మానసిక వికాసం పొందవచ్చు. ‘యమ’ ( అహింస, సత్యసంధత, ఇంద్రియ నిగ్రహం వంటివి), ‘నియమ’ ( తపస్సు, దైవ చింతన), ఆసన ( పలు రకాల ఆసనాలు), ప్రాణాయామం (శ్వాసను నియంత్రించడం), ధ్యానం ( ఒక లక్ష్యం మీద మనసు కేంద్రీకరించడం), ప్రత్యాహారం ( బాహ్య సంబంధ విషయాల నుంచి మనసును తప్పించడం), ధారణ ( ఒకే విషయంపై మనసు పెట్టి ఏకాగ్రతతో పనిచేయడం), సమాధి ( సాధనలో అత్యున్నత స్థితి ఇది. దీన్ని చేరాలంటే మిగతా ఏడు మెట్లనూ ఎక్కి రావాలి) ..అనే 8 సోపానాలు యోగాలో కీలకాంశాలుగా పేర్కొంటారు. యోగా యోధులు.. ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువులు ఎవరంటే మనదేశానికి చెందిన ఇద్దరి పేర్లు చెబుతారు ఎవరైనా. ఆ ఇద్దరూ కర్నాటకకు చెందినవారే. మొదటి స్థానం బికెఎస్ అయ్యంగార్‌కే దక్కింది. పతంజలి చెప్పిన యోగాకు ప్రాచుర్యం కల్పించి, తన ఆలోచనల మేరకు చిన్నచిన్న మార్పులు చేసి అందరికీ నేర్పించారు. ప్రత్యేక శిక్షణ సంస్థను నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేశారు. మైసూరు సమీపంలోని బెల్లూరులో పుట్టి చిన్నతనంలోనే తన బావ సూచనతో యోగా నేర్చుకున్నారు. జిడ్డు కృష్ణమూర్తివంటి వారితో కలిసి బోధనలు చేశారు. ఈయన చెప్పే యోగాకు ‘అయ్యంగార్ యోగా’గా కీర్తి దక్కింది. 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ అవార్డులతో భారత ప్ర భుత్వం సత్కరించింది. ఆయన రాసిన పుస్తకాలు ‘లైట్ ఆన్ యోగా’, ‘లైట్ ఆన్ ప్రాణాయామ’, ‘లైట్ ఆన్ ది యోగసూత్ర ఆఫ్ పతంజలి’ వంటివి జనాదరణ పొందాయి. 90 ఏళ్ల వయసులోనూ రోజూ 3 గంటలపాటు యోగా, ఒక గంటపాటు ప్రాణాయామం చేసిన ఆయన 95 ఏళ్ల వయసులో, ఈ ఏడాది ఆగస్టు 20న పరమపదించారు. ప్రఖ్యాత యోగా గురువు రామ్‌దేవ్ బాబా యోగాశైలిని ఆయన విభేదించారు. పట్ట్భా జాయిస్ ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువుల్లో రెండోస్థానం కె.పట్ట్భా జోయిస్‌దే. సంప్రదాయ యోగాకు భిన్నంగా కొన్ని మార్పులు చేసి, జిమ్నాస్టిక్స్ తరహాలో అష్టాంగ విన్యాస యోగను ఆయన సృష్టించి బోధించారు. ఈ రంగంలో పరిశోధన, శిక్షణ కోసం కె.పట్ట్భా జోయిస్ అష్టాంగ యోగా ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించారు. మైసూరు మహారాజు కృష్ణ రాజేంద్ర వడయారు తీవ్ర అస్వస్థతకు గురైనపుడు ఎవరి చికిత్సా పనిచేయనప్పుడు తన యోగావిద్యతో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయడంతో ఇక జోయిస్‌కు తిరుగులేకుండాపోయింది. 1916లో పుట్టిన ఆయన 93 ఏళ్ల వయసులో సహజ మరణం పొందారు. ఆయన రాసిన ‘యోగమాల‘ పుస్తకం అత్యంత ప్రజాదరణ పొందింది. రామ్‌దేవ్ ప్రచారం.. బాబా రామ్‌దేవ్ ‘యోగా’ సృషికర్త కానప్పటికీ- ఆ విద్యకు నేడు బహుళ ప్రచారం తెచ్చిన వ్యక్తిగా ప్రఖ్యాతి పొందారు. వేల ఏళ్లకు పూర్వమే పతంజలి మహర్షి యోగా సూత్రాలను సంకలనం చేసి అనేక విషయాలను సూత్రీరించారు. ఆ తర్వాతి కాలంలోనూ ఎంతోమంది యోగులు, రుషులు యోగాను జనబాహుళ్యంలోకి తెచ్చారు. జీవనశైలి, దృక్పథం, ప్రవర్తన వంటివి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నది కాదనలేని వాస్తవం. యోగాను జనం భాషలో బోధించడం, ఆరోగ్యానికి అనుసంధానించడంలో బాబా రామ్‌దేవ్ ఇపుడు విభిన్న శైలిలో కృషి చేస్తున్నారు. ఆధునిక జీవితంలో మృగ్యమైపోతున్న ఆరోగ్య భాగ్యాన్ని తిరిగి అందించేందుకు యోగా ఓ అద్భుత సాధనమని ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రాణాయామంలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టిన రామ్‌దేవ్ యోగాకు సంబంధించిన అనేక అంశాలపై లోతుగా అధ్యయనం చేశారు. జనం మధ్యకు వెళ్లడమే కాదు, ఆధునిక ప్రసార మాధ్యమాలను ఆయన విస్తృతంగా వినియోగించుకుంటూ దేశవిదేశాల్లో యోగాకు ఒక ‘క్రేజ్’ సంపాదించిపెట్టారు. యోగాకు సంబంధించిన అనేక పుస్తకాలు, వీడియో సీడీలే కాదు, అంతర్జాలాన్ని, టీవీ చానళ్లను ఆయన సమర్థవంతంగా వాడుకుంటున్నారు. యోగాతో పాటు ఆయుర్వేద వైద్యానికి ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. నియంత్రణ, చట్టబద్ధత ఏదీ..? ఏ వస్తువుకైనా డిమాండ్ పెరిగితే దానికి మార్కెట్ మరింతగా విస్తరిస్తుందనే ఆర్థిక సూత్రం ‘యోగా’కు కూడా వర్తిస్తుంది. అన్ని వర్గాల వారిలో ఆసక్తి రానురానూ పెరగడంతో ‘యోగా’లో మెళకువలు నేర్పేందుకు ఎన్నో సంస్థలు తామరతంపరగా వెలుస్తున్నాయి. యోగా శిక్షకులూ అందుబాటులో ఉంటున్నారు. యోగా తరగతులు నిర్వహిస్తామంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. రోజూ ఉదయానే్న టీవీ చా నళ్లలో యోగా క్లాసులు ప్రసారం కావడంతో వాటిని చూసేవారే కాదు, నేర్చుకోవాలనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరో వైపు- తగినంత అనుభవం, అర్హతలు లేని వారు సైతం ‘యోగా టీచర్ల’ అవతారం ఎత్తుతూ దీన్ని వ్యాపార మయం చేస్తున్నారు. ‘్ఫన్ చేస్తే చాలు.. మీ ఇంటి ముంగిటకు వచ్చి ఆసనాలు, వ్యాయామం నేర్పుతాం..’ అంటూ ప్రచారం చేసుకునేవారూ రంగ ప్రవేశం చేశారు. అయితే, మిగతా చదువులకు ఉన్నట్లు యోగ విద్యకు సంబంధించి ప్రభుత్వం ఆమోదించిన సిలబస్ గానీ, ధ్రువీకరణ పత్రాలు గానీ లేకపోవడంతో మిడిమిడి జ్ఞానంతో ప్రమాదకరమైన ఆసనాలను నేర్పేవారూ పుట్టుకొస్తున్నారు. సరైన రీతిలో యోగాను అభ్యసిస్తే- ఆ పాఠాలు, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఉన్నత విలువలు వంటివి జీవితంలో ఎదగడానికి తోడ్పడతాయి. యోగాకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని- ఇదో మంచి ఆదాయ మార్గంగా భావించేవారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. విలువైన కాలాన్ని, ధనాన్ని వృథా చేసుకోకుండా సరైన శిక్షకుడి వద్ద తమకు అనువైన పద్ధతుల్లో దీన్ని నేర్చుకోవాలి. శిక్షకులపై అవగాహనతో పాటు ఆచితూచి నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. అనుభవజ్ఞులను ఆశ్రయిస్తే మనకు అవసరమైన యోగా పద్ధతులను నేర్చుకుని మంచి ఫలితాలను సాధించవచ్చు. ‘పేటెంట్’ దక్కేలా… యోగా విద్య ఇపుడు మంచి ‘కెరీర్’గానూ రూపొందుతోంది. గనుక ప్రభుత్వమే తగినన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో దీన్ని ఒక కోర్సుగా ప్రవేశ పెట్టేందుకు, నిష్ణాతులైన వారిచే తగిన సిలబస్ రూపొందించేందుకు ప్రయత్నాలు జరగాలి. ఏవో కొన్ని ఆసనాలను నేర్పిన వారు యోగా గురువులు కాలేరు. సుశిక్షితులైన యోగా నిపుణులను తీర్చిదిద్దడానికి పటిష్టమైన వ్యవస్థ ఏర్పడాలి. గుర్తింపు పొందిన శిక్షకులు మాత్రమే యోగా నేర్పేలా ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ ఉండాలి. అపుడు ఈ రంగంలోనూ ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఈ విద్య మన దేశానికే చెందినందున అంతర్జాతీయ స్థాయిలో ‘యోగా’పై మనకు ‘పేటెంట్’ దక్కేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. యోగాకు విశ్వవ్యాప్త గుర్తింపు, ఆదరణ లభించడం హర్షణీయమే అయినప్పటికీ.. ఈ విద్యపై చట్టపరంగా సర్వహక్కులూ మన దేశానికే ఉండాలి. ఆద్యుడు పతంజలి ఇప్పుడు అందరూ ఆరాధిస్తున్న యోగాకు ఆది గురువు పతంజలి. యోగా భారతదేశంలో పుట్టింది. యోగాను కనుగొన్నది, శాస్తబ్రద్ధం చేసినది ఆయనే. క్రీ.పూ. 200 సంవత్సరంలో ఆయన జీవించారని, శ్రీకృష్ణుని కాలానికి అటూఇటూగా జీవించారని చెబుతున్నప్పటికీ 5వేల ఏళ్లనాటికే పతంజలి యోగాను బోధించాడని అందరూ అంగీకరిస్తున్నమాట. యోగశాస్త్రం, యోగా సూత్రాలను ఆయన రచించారు. పాణిని రాసిన అష్ట్ధ్యాయికి పతంజలి భాష్యం రాశారు. మనిషి శరీరంలో ఉండే ప్రాణశక్తికి ఉత్తేజం కలిగించడం ద్వారా కుండలినీ శక్తి ఉద్భవిస్తుందని, దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం, బుద్ధి వికాసం కలుగుతాయని ఆయన భావించారు. అది సాధించడానికి యోగా ఉపకరిస్తుందని సూత్రీకరించారు. 195 యోగా సూత్రాలతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. ఈ శాస్త్రాన్ని నాలుగు పాదాలు (సమాధి, సాధన, విభూతి, కైవల్య)గా వర్గీకరిస్తూ 26 తత్వాలు రాశారు. మొత్తంమీద యోగ శాస్త్రాన్ని 8 అంగాలుగా (యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి) వర్గీకరించారు. ఆహారపు అలవాట్లు, శరీరస్థితి, మానసిక స్థితి, ఏకాగ్రత సాధన, భక్తి, చక్కటి శ్వాస, స్థిరచిత్తం వంటివి సాధించడం ద్వారా అలౌకిక స్థితికి చేర్చేది యోగా. దీనివల్ల నాడీవ్యవస్థ చేతనమై మానసిక, శారీరక, ఆధ్యాత్మికంగా శక్తిసంపన్నులై ఒత్తిడిని తట్టుకోగలిగి, ఆరోగ్యంగా ఉండగలిగేలా మనిషి తీర్చిదిద్దబడతాడని యోగా నిరూపించింది. మనసు, స్పృహ, చైతన్యం యోగాకు కీలకం. పతంజలి చెప్పిన సూత్రాలలో రాజయోగ, హఠయోగ విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. యోగా డే…ప్రత్యేకత జూన్ 21 తేదీని ‘అంతర్జాతీయ యోగా డే’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వినతికి స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తేదీనే ఎందుకు ‘యోగా డే’గా గుర్తించారో తెలుసా..? సూర్యుడి గమనం ఆధారంగా సంవత్సరంలో అత్యంత సుదీర్ఘమైన పగలు జూన్ 21నే ఉంటుంది. ఆ రోజునే యోగా డేగా గుర్తించాలని మోదీ కోరారు. సెప్టెంబర్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోదీ ఈ ప్రతిపాదన చేశారు. ఆ తరువాత కేవలం మూడు నెలల్లో అది అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితిలో ఇంతవరకు మరే ప్రతిపాదనా ఇంత తక్కువ వ్యవధిలో కార్యరూపంలోకి రాలేదు. అలాగే ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తరువాత మరే తీర్మానానికి యోగా డే తీర్మానానికి దక్కినంత మద్దతు లభించలేదు. ఈ సమితిలో 195 దేశాలుంటే ఇప్పటివరకు 177 దేశాలు యోగా డేను సమర్థించాయి. భద్రతామండలిలోని ఐదు దేశాలూ దీనికి మద్దతు తెలిపాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించినందువల్ల ఏటా జూన్ 21న ఆయా దేశాల్లో యోగాపై అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు, పోటీలు సాధికారికంగా నిర్వహిస్తారు. కరీనా…శిల్పా.. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వ్యాయామంగా యోగాను చెప్పుకోవాలి. మనిషి ఒత్తిడిని తట్టుకుని, శరీరాకృతిని మెరుగుపరుచుకుని, సంయమనంతో ప్రశాంతంగా జీవించడానికి యోగా ఉపయోగపడుతుంది. భారతదేశంలో పుట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న యోగా ఇటీవలి కాలంలో జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోవడానికి సినీతారలు, ఇతర సెలబ్రిటీలు, ప్రసార మాధ్యమాలు కారణం. జనంలో వచ్చిన చైతన్యమూ అందుకు తోడవుతోంది. పతంజలి మహర్షి చెప్పిన యో గాను ఆధునిక యుగానికి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసుకుని ఎవరికివారు ప్రత్యేకతలతోకూడిన యోగాను అనుసరిస్తున్నారు. ప్రాణాయామం, యోగాను రోజువారీ కార్యక్రమంగా, క్రమం తప్పకుండా చేస్తూ ఈ రంగంలోనూ రాణించిన సినీతారలు ఎందరో ఉన్నారు. బాలీవుడ్ తార కరీనాకపూర్‌కు యోగా అంటే ప్రాణం. టీవీ,సినీ వ్యాపార ప్రకటనల్లో తళుక్కున మెరిసే ఈ తార తన సౌందర్య రహస్యమంతా యోగాయే అంటోంది. ఆ మధ్య ఒళ్లు బాగా పెరిగిపోయినప్పుడు జీరోసైజ్ రావడానికి యోగాను ఆమె ఆశ్రయించి సత్ఫలితం సాధించారు. అయితే, సంప్రదాయ యోగాకు బదులు ఆమె ‘పవర్ యోగా’ను పాటిస్తారు. అంటే- ఓ గదిలో 105 డిగ్రీల ఫారన్‌హీట్ వేడి, 40 శాతం తేమతోకూడిన వాతావరణంలో ఆమె రోజూ గంటన్నర పాటు యోగా చేస్తారు. ప్రాణాయామం అందులో భాగమే. ఆరారా ఆహారం, వేడిచేసి చల్లార్చిన మంచినీళ్లు తరచూ తాగడం ఆమె హాబీలు. కరీనా యోగాపై వచ్చిన పుస్తకం ‘ఫ్రమ్ ఎక్సెల్ టు ఎక్సెస్’ మార్కెట్లో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది. భారతీయ సెలబ్రిటీల్లో శిలాశెట్టి కూడా యోగాలో ట్రెండ్ సెట్టరే. మెడనొప్పి, స్పాండిలైటిస్, వెన్ను సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బందిపడ్డప్పుడు యోగాను ఆశ్రయించారు. అద్భుతమైన ఫలితాలు సాధించారు. చూడముచ్చటైన శరీరాకృతి, మేని సౌందర్యం ఆమె సొంతమయ్యాయి. ఆమె విడుదల చేసిన ‘శిల్పాస్ యోగా’ అనే పుస్తకం సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రతీరోజు కనీసం గంటపాటు ఆమె యోగా చేస్తారు. ఇక ప్రముఖ నటీమణులు సోనమ్‌కపూర్, లారాదత్తా కూడా యోగా అంటే ఇష్టపడేవారే. వారు చేసిన యోగాకు సంబంధించి డివిడిలు మార్కెట్లో లభిస్తున్నాయ. పిల్లల్ని కన్న తరువాత శరీరం కొన్ని మార్పులకు లోనవుతుందని, వాటినుంచి తేరుకుని మళ్లీ నాజూకుగా తయారవడానికి యోగా తోడ్పడుతుందని అంటారు లారాదత్తా. తొలికాన్పు తరువాత యోగాతో మళ్లీ నాజూకుగా తయారయ్యాయని చెబుతున్నారు. అయితే సోనమ్‌కపూర్ మాత్రం బిక్రమ్ యోగాను అనుసరిస్తారు. ఇక ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని మడోన్నా అష్టాంగ, హఠ యోగ చేయడంలో దిట్ట. తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి యోగాతో ఉపశమనం పొందుతున్నట్లు ఆమె చెబుతారు. హాలీవుడ్ ప్రముఖులు మెగారియాన్, జెన్నిఫర్ అనిస్టిన్ సహా లెక్కలేనంతమంది తారలు ఇప్పుడు యోగాకు దాసులయ్యారు. ……………………………. ‘అనారోగ్యం, పేదరికం.. ఇవే మన దేశంలో ప్రధాన సమస్యలు. యోగాతో అనారోగ్యాన్ని, నల్లడబ్బు వెలికితీతతో పేదరికాన్ని దూరం చేయవచ్చు.’ – బాబా రామ్‌దేవ్ …………………………… మార్చిలో ప్రపంచ యోగా వీక్ ఉత్తరాఖండ్‌లోని రిషీకేష్‌లో ఏటా అంతర్జాతీయ యోగా వారోత్సవాలు నిర్వహిస్తారు. వేలాదిమంది యోగా అభ్యాసకులు, బోధకులు అక్కడికి వస్తారు. వచ్చే ఏడాది మార్చి 1నుండి 7వరకు ఈ వారోత్సవాలను నిర్వహించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. యోగాశిక్షణ, ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, గంగాహారతితో వేడుకలు ముగుస్తాయి. గంగానదీతీరంలో ఉండే ఏకైక యోగా శిక్షణ కేంద్రం ఇక్కడ ఉంది. దీనిని రిషీకేష్ యోగా పీఠ్ నిర్వహిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ వారోత్సవాలకు సహకరిస్తోంది. …………………………….

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు బొమ్మ’ పెద్ద కాంప్లిమెంట్‌..!

బాపు బొమ్మ’ పెద్ద కాంప్లిమెంట్‌..!

మానవ జీవితంలో మధుర ఘట్టమైన పెళ్లి తాలూకు జ్ఞాపకాల దొంతర బాపు సృష్టించిన ‘పెళ్లి పుస్తకం’. ఈ సినిమాతో తన కెరీర్‌కీ, వెండితెరకి సొబగులు దిద్దిన బాపు బొమ్మ దివ్యవాణి. తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరమై, క్రీస్తు సేవలో తరిస్తున్నారు. మళ్లీ నటించాలన్న ఆశ ఉన్నా, ఇకపై నటించనని, నటించలేనని చెబుతున్న దివ్యవాణి అంతరంగం ఇది…
‘‘మా ఊరు తెనాలిలోని ఆదినారాయణపురం. అమ్మ విజయలక్ష్మి, నాన్న కె.ఆదినారాయణరావు. నేను పుట్టి, పెరిగిందంతా తెనాలిలోనే. అమ్మ తరపుగానీ, నాన్న తరపునగానీ ఆర్టిస్ట్‌లు, నాటకాల్లో నటించినవాళ్లు ఎవరూ లేరు. అయితే అమ్మకి చిన్నప్పటి నుండి డ్యాన్స్‌ అంటే ఆసక్తి ఉండేది. మా అక్క హరిప్రియ నటించాలని ఆశపడితే ఆమెకోసం చెన్నైకి వచ్చాము. నేను అప్పుడు తెనాలిలోనే 9వ తరగతి చదువుతున్నాను. 10 వ తరగతి పరీక్షలు రాసేసి, అమ్మ, అక్కని చూద్దామని నేనూ చెన్నైకి వచ్చాను. ఊర్వశి శారదగారు అమ్మకి మంచి ఫ్రెండ్‌, తెనాలి అవ్వడం వల్ల. శారదా ఆంటీ నన్ను చూసి, ‘ఈ అమ్మాయికి మంచి ఆర్టిస్ట్‌ అయ్యే లక్షణాలున్నాయి’ అని అమ్మకు చెప్పారు. తరువాత ఫోటోసెషన్‌ చేయడం, అవి చాలా బాగా రావడం, నేను ఆర్టిస్ట్‌ని కావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇదంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది, అలా నేను సినిమా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టాను.
ఏమీ తెలియని వయసులోనే…
నిజానికి అప్పటికి ఇండస్ర్టీ గురించి నాకేమి తెలియదు. 14 ఏళ్లంటే ఏం తెలుస్తుంది చెప్పండి? మన గురించే మనకి అవగాహన ఉండని వయసు అది. కేవలం అమ్మ, అక్కల ఇంట్రస్ట్‌తోనే నేను సినిమాల్లోకి రావడం జరిగింది. చాలామంది ‘నేను అలా అవ్వాలి, ఇలా అవ్వాలి’ అని ఒక తపనతో వస్తుంటారు. నా వరకైతే అప్పటి వరకు స్కూల్‌కెళ్లడం, చదువుకోవడం, ఆడుకోవడం, తినడం తప్పించి ఇంకేమీ తెలియవు. అయితే నటన నాకు దేవుడిచ్చిన వరం. స్వతహాగానే నేర్చుకోగలిగాను. ఏ రోజూ నేను ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లింది లేదు. డ్యాన్స్‌ కూడా అంతే. మామూలుగా ఇంట్లో సరదాగా నేర్చుకున్నదే తప్పితే ప్రత్యేకంగా శిక్షణ ఏమీ పొందలేదు. మొదట అవకాశం కోసం అమ్మ, నేను పరుచూరి గోపాలకృష్ణ దగ్గరకి వెళ్లాం. నా సినిమా కెరీర్‌కి ఆద్యం పోసింది శారద ఆంటీ, పరుచూరి బ్రదర్సే. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వర్ణించలేనిది. ఇప్పటికి కూడా కష్టాలు వాళ్లవి, విజయాలు నావి.
సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్‌ అనేవారు…
నాకు అన్నయ్య కూడా ఉన్నాడు, రవిచంద్ర బాబు. ముగ్గురం చాలా ఆత్మీయంగా ఉండేవాళ్లం. అక్క తనకంటే ముందు నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషపడింది. కృష్ణగారి అమ్మాయిగా తొలిసారి కెమెరా ముందు నిలబడ్డాను. నా తొలి సినిమా ‘సర్దార్‌ కృష్ణమనాయుడు’. కృష్ణగారు డ్యూయల్‌ రోల్‌, శారద ఆంటీ కూడా ఉన్నారు. నేను చాలామంది పెద్ద పెద్దవాళ్ల ఇంటర్వ్యూలు చదివాను, దాదాపు అందరూ కూడా తొలి రోజు చాలా భయపడ్డామని, టెన్షన్‌గా ఉండేదని చెప్పారు. కానీ, నిజంగా చెబుతున్నాను నాకు అటువంటిదేమి లేదు. ధైర్యంగా వెళ్లి కెమెరా ముందు నిలబడ్డాను, తొలి షాట్‌ సింగిల్‌ టేక్‌లో ఓకే అయిపోయింది. అందులో – కృష్ణగారు ఆసుపత్రిలో మంచం మీద వుంటారు, ఆయన నాకు తండ్రి అని తెలియదు. శారద ఆంటీ లోపలే ఉంటారు. నేను తలుపు తెరచి ‘ఆంటీ’ అని పిలవాలి. అదీ నా తొలి సన్నివేశం. ఆ సినిమాలో అందరూ హేమాహేమీలే. బాగా నటించానని నన్ను మెచ్చుకున్నారు. ఎంతైనా అందరం తెనాలివాళ్లమే కదా. కళలకు పుట్టినిల్లు అది. దివ్యవాణి అంటే సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్‌ అని పేరు వచ్చింది. అది దేవుడి వరమే అనుకోవాలి.
ఇక సినిమాలు వద్దనుకున్నా… కానీ!
తరువాత కేఎస్‌ఆర్‌ దాస్‌ దర్శకత్వంలో ‘అడవిలో అర్ధరాత్రి’ చేశాను. ఇంకా ‘మా తెలుగు తల్లి’; రవిరాజాగారి ‘ముత్యమంత ముద్దు’.. హీరోయిన్‌గా నా తొలి సినిమా కన్నడంలో చేసిన ‘డ్యాన్స్‌ రాజా డ్యాన్స్‌’. చాలా పెద్ద హిట్‌. అప్పటికి తెలుగులో హీరోయిన్‌గా చేయలేదు. అవకాశాలు వచ్చేవి, కానీ హీరోయిన్‌గా ఓకే అయ్యాక కూడా చేజారిపోయేవి. ఇలా కొన్ని సినిమాలు చేసిన తరువాత నటన వరకు ఓకేగానీ, ఎందుకో ఇండస్ర్టీలో ఇమడలేకపోయాను. ఇండస్ర్టీ అంటే ఏంటో అర్ధమయ్యాక, ఇక సినిమాలు వద్దు, తెనాలి వెళ్లిపోయి చదువుకుందాం అని నిర్ణయానికి వచ్చేశాను. ఆ సమయంలో బాపుగారి దగ్గర నుండి కాల్‌ వచ్చింది.
నీ సొంత జుట్టేనా అనడిగారు…
‘అబ్బ.. ఈయన కూడా అందరిలాగే చూస్తారు. ఏవేవో అంటారు. మనం కాంప్రమైజ్‌ కాలేం. హీరోయిన్‌గా తీసుకోకపోతే మళ్లీ ఏడ్వాలి’ అనుకుని తలంతా నూనె పెట్టుకుని, మామూలుగా తెనాలిలో ఎలా ఉంటామో అలా జడ వేసుకుని వెళ్లాను. బాపు సహజత్వాన్ని బాగా ఇష్టపడే దర్శకులు. ఆయన దగ్గరకి వెళ్లగానే ఆయన ‘ఇది నీ సొంత జుట్టేనా’ అనడిగారు. అవునండి అన్నాను. కాళ్లు చూపించమ్మా అన్నారు. చూపించాను. వెంటనే ఇప్పుడు ఎలా ఉన్నావో, సినిమాలోనూ అలాగే ఉండాలి. మేకప్‌ అంతా నేను వేయను అన్నారు. చేస్తానని చెప్పాను. వెంటనే అగ్రిమెంట్‌ కూడా అయిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆంధ్రజ్యోతిలో ‘బాపు బొమ్మ – దివ్యవాణి’ అని న్యూస్‌ వచ్చింది. అది చూసి పెద్దపెద్ద దర్శకులు నాకు ఫోన్‌ చేశారు. దాసరిగారు ఫోన్‌ చేయడం నాకు బాగా గుర్తు. ఉదయం 6 గంటలకి, నేను ఇంకా నిద్రపోతున్నాను. ల్యాండ్‌లైన్‌కి ఫోన్‌ చేసి ‘బాపు బొమ్మ-దివ్యవాణి’ అని పేపర్‌లో వేశారు. నువ్వేనామ్మ? అని అడిగారాయన. అవునని చెబితే శుభాకాంక్షలు చెప్పారు.
సావిత్రిని చూసినట్టుందన్నారు…
‘పెళ్లి పుస్తకం’ మొదలుకావడానికి ముందు బాపుగారు ‘మిస్సమ్మ’ సినిమా చూశావా?’ అనడిగారు. నాకు సినిమా జ్ఞానం అస్సలు లేదు. క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ పరీక్షలు అయిపోతే, అదీ బ్రతిమిలాడితే ఎప్పుడైనా ఒక సినిమాకి పంపించేవారు. ‘చూడలేదండి’ అని చెప్పాను. ‘మిస్సమ్మ’లో ఉన్న క్యారెక్టర్‌ లాంటిదే నీది, చూడమని చెబితే, చూశాను. అప్పటికి బాపు విలువగానీ, బాపు బొమ్మ అంటే ఒక ఆడదానికి ఇంత గౌరవం ఉంటుందని గానీ తెలీదు. అటువంటి సమయంలో ‘పెళ్లి పుస్తకం’లో నటించడం నా భాగ్యం. దేవుడు కొన్ని అడిగితే ఇస్తాడు, కొన్ని అడక్కుండానే ఇస్తాడంటారు!! అలా నేను అడగకుండానే దేవుడు నాకిచ్చిన వరం ‘పెళ్లి పుస్తకం’. నాకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌ అంటే, ప్రివ్యూకి ఆరుద్రగారు వచ్చారు. సినిమా అయిపోయాక ఆరుద్రగారు ‘ఎవరు హీరోయిన్‌?’ అనడిగితే, నేను వెళ్లి ‘సార్‌ నమస్కారం’ అన్నాను. అప్పుడు ఆయన చెప్పిన మాట ‘మళ్లీ సావిత్రిని చూస్తున్నట్టుందమ్మ’ అని. ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను.
హ్యాట్రిక్‌ మిస్సయ్యా… చాలా బాధపడ్డా
రాజేంద్రప్రసాద్‌తో ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్‌’, శ్రీకాంత్‌తో ‘దొంగ రాస్కెల్‌’’, నరేష్‌తో ‘పెళ్లి కొడుకు’, ఇంకా ‘పెళ్లి నీకు శుభం నాకు’ అన్నీ మంచి పేరు తెచ్చాయి. తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేశాను. ‘మిస్టర్‌ పెళ్లాం’ విషయంలో నేను చాలా బాధపడ్డాను. నేను చేయాల్సిన సినిమా అది. బాపు-రమణలు కూడా నేనే నటించాలని చాలా ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. ఏదేమైనా, మరో మంచి ఆర్టిస్ట్‌ ఆ సినిమాలో నటించింది. నేను చేసిన దాని కన్నా ఆమని చేసినందుకు ఎక్కువ సంతోషపడుతున్నాను కానీ, కొన్ని పాలిటిక్స్‌ వల్ల ఆ సినిమాలో నేను చేయలేకపోయానన్నది కొంచెం బాధనిపించింది. ఈ మూవీ కూడా నేను చేసుంటే బాపుగారితో హ్యాట్రిక్‌ అయ్యేది. ఇండస్ర్టీలో నన్ను బాగా బాధపెట్టిన విషయమిది. బాపుగారితో ‘పెళ్లి పుస్తకం’, ‘పెళ్లి కొడుకు’, ‘కవి సార్వభౌమ’, ‘రాధాగోపాలం’ చేశాను. నేను హీరోయిన్‌గా నటించిన ఆఖరు సినిమా ‘దొంగ రాస్కెల్‌’.
వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కాలేదు…
మంచి పీక్‌ టైంలో ఉండగానే నాకు పెళ్లి అయిపోయింది. మావారి పేరు దేవానంద్‌. ఇండస్ర్టీలో దివ్యవాణి అంటే మంచి ఆర్టిస్ట్‌గా పేరు, మా పద్ధతులు, ఇంట్లో పెరిగిన పరిస్థితులు గురించి తెలుసు. పైగా నాపై ఒక్క రూమర్‌ కూడా లేదు. కాబట్టి సినిమా జీవితం మా వ్యక్తిగత జీవితానికి ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. ఒక బాబు కిరణ్‌ కాంత్‌, ఒక పాప కారుణ్యదేవి. బాబు ఇంజినీరింగ్‌, పాప టెన్త్‌ చదువుతున్నారు. మా వారు నా సినిమాలు చూసినప్పుడు సింపుల్‌గా బాగుంది అంటారంతే. పెళ్లి తరువాత నటించకూడదని షరతులేమి పెట్టలేదు. ఆ తరువాత కూడా నేను నటించాను. ‘కలవారికోడలు’, ‘పుత్తడి బొమ్మ’ సీరియల్స్‌ చేశాను. సినిమాలైతే బాపుగారు తీసిన ‘రాధాగోపాలం’ చేశాను. ఆఖరుగా ‘వీర’లో నటించాను. అందులో కడప అమ్మాయి పాత్ర నాది. ఓ సందర్భంలో
చోటాకె.నాయుడుగారు చెప్పారు – ‘పరుచూరి బ్రదర్స్‌ ఈ సినిమా చూసి బాపు బొమ్మ ఇలా కూడా ఉంటుందా’ అని అడిగారని. బాపు బొమ్మ కత్తిపట్టడం అంటే వింతే కదా మరి.
నిజమైన ఆర్టిస్ట్‌కి ఆ భావన ఎప్పుడూ ఉంటుంది…
టీవీలో నా సినిమాలు చూసినప్పుడు ఇంకాస్త బాగా చేస్తే బాగుంటుదని అనిపిస్తుంటుంది. చెప్పింది చెప్పినట్టు చేయడమే తప్ప, ఇంకేమి తెలియని వయసు అది. ఇప్పుడు చూస్తుంటే, ఇంకా బాగా చేసుండొచ్చు కదా అని అనిపిస్తుంది. నిజమైన ఆర్టిస్ట్‌కి ఈ భావన ఎప్పుడూ ఉంటుంది. ‘రాధాగోపాలం’లోనే తీసుకోండి, బాపు బొమ్మగా అంత పేరు తెచ్చుకున్న నేను, ఈ సినిమాలో వేణుమాధవ్‌కి జోడీగా కాసులమ్మ పాత్ర చేశాను. చాలామంది అన్నారు ‘కాస్త స్లిమ్‌ అయ్యి, మీరు, శ్రీకాంత్‌కి జంటగా చేస్తే ఇంకా బాగుండేది’ అని పెద్ద పెద్ద వాళ్లు ఫోన్‌ చేశారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చూపున్న పాపులర్ దర్శకుడు బాల చందర్ -మరియు విస్మృత మనీషి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముగ్గురు కలల బేహారులు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రపంచీకరణలో తెలుగు కథా సాహిత్యం

ప్రపంచీకరణలో తెలుగు కథా సాహిత్యం

  • – బానోత్ అనితబాయి, 9441680713
  • 22/12/2014
TAGS:

చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, ఉపాధి కోల్పోతున్న కుల వృత్తుల గురించి వ్యాఖ్యానించిన సాహిత్యం తెలుగులో విస్తృతంగా వచ్చింది. ప్రపంచీకరణ, అభివృద్ధీకరణ, నగరీకరణ తెచ్చిపెట్టే సమస్యలకుతోడు ప్రాజెక్టుల కింద భూములను తక్కువ ధరకు కొనుక్కుని వలసవాదులు తెలంగాణలో స్థిరపడ్డారు. దాంతో తెలంగాణ ప్రజలు వారి భుక్తినుండి, తరతరాల వ్యవసాయ కృషినుంచి, గ్రామాల నుండి మూలాల నుంచి దూరమై నైజాం పాలనకన్నా భయంకరమైన భూసమస్యను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ సంపదలను దోచుకొని తెలంగాణను వలస భూమిగా మారుస్తున్నారనే ఆవేదనను కథల్లో వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా పులుగు శ్రీనివాస్ ‘సంకర విత్తులు’, పి.చంద్ ‘్భ నిర్వాసితులు’, సుజాతారెడ్డి ‘గుడిసెలు గుడిసెలు’ కథలను ప్రత్యేకించి చెప్పవచ్చు.
ప్రపంచీకరణ వల్ల వ్యక్తికీ, సమూహానికి మధ్య ఒక కృత్రిమమైన దూరం ఏర్పడుతోంది. దాన్ని జయించడానికి చైతన్యవంతుడైన వ్యక్తి కొన్ని ప్రత్యామ్నాయాల్ని వెతుక్కోక తప్పదు. అది అనివార్యత. ఆ అనే్వషణకు ప్రధానమైన సాధనం స్థానికత. ఈ నేపథ్యంలో కాలువ మల్లయ్య కథలు రాసారు. నూతన వ్యవసాయిక, సాంకేతిక విధానాలు, పరిణామాలు, ఫలితాలు వస్తువుగా కలిగిన కథ ఇది. కుల వృత్తుల మూలాలను, వాటి విచ్ఛినాన్ని వాటిలో వచ్చిన ఆధునికీకరణను ఈ ‘పరారుూకరణ’ ఆవిష్కరించింది.
ప్రపంచీకరణ క్రమంలో గ్రామాలను, గ్రామ సంపదలను అందులో భాగంగా రైతు జీవితాన్ని ఆక్రమించుకొంటూ, మింగేస్తూ బహుళజాతి సంస్థలు విస్తరిస్తూ బలపడే క్రమాన్ని స్వామి రాసిన ‘తెల్లదయ్యం’ కథ సమర్థవంతంగా చిత్రించింది. కుల వృత్తులు అంతరిస్తూ జీవితాలలో తెచ్చే సంక్షోభాన్ని పెద్దింటి అశోక్‌కుమార్ తన కథలలో చిత్రించారు. ‘తెగిన బంధాలు’ కథలో పెండ్లిళ్ళ పద్ధతులు మారటంవలన కూరాడు కుండలకు, పోలు ముంతలకు పెళ్ళితంతులో స్థానం లేకుండాపోవటం అది కుమ్మరికి ఇంతకుముందున్న ప్రాధాన్యతను అభావం చేయటం, ఒక్క కుమ్మరులే కాదు డబ్బు పెట్టుబడి, వ్యాపారీకరణల ప్రాధాన్యతలో అభివృద్ధిచెందిన కొత్త పెండ్లి తీరులో చాకలి, మంగలి, మాదిగ మొదలైన అన్ని కులాల వాళ్ళూ ఉపాంతీకరించబడటం చిత్రితమయ్యాయి.
కాగుబొత్త కథ కుమ్మరి జీవన విషాదాన్ని చిత్రించిన కథ. జాతరలో చలివేంద్రం పెట్టడానికి మట్టికాగులు చేసే పని తండ్రి చేపడితే నీటి ప్యాకెట్లను అమ్ముకొనే కాంట్రాక్టు పట్టాడు కొడుకు. బతుకుతెరువు పాకులాటలో తండ్రీ కొడుకుల సంబంధాలు నిలబడనివే అయినాయి. నీళ్ళను ముల్లెగట్టి అమ్మే వ్యాపారం వచ్చి కాగు బొత్తకు స్థానం లేకుండా చేసిన క్రమంలో ఉన్న హింస ఈ కథ వివరిస్తుంది. వ్యాపార సంస్కృతి గ్రామీణ సహజ వనరులను కొల్లగొట్టే ప్రమాదం ఎంతగా ఉందో ‘పేగు ముడి’ కథలో అశోక్‌కుమార్ సూచించారు. ‘కీలుబొమ్మలు’ కథలో ప్రపంచీకరణ క్రమంలో కార్పొరేట్ వ్యవసాయ విధానం గ్రామాలలోకి చొచ్చుకొని వస్తూ రైతుల, కూలీల జీవితంలో నింపుతున్న సంక్షోభాన్ని ప్రతిఫలించింది.
కాలువ మల్లయ్య రాసిన కథలు ఒకవైపు నూతన ఆర్థిక విధానాల కారణంగా గ్రామీణ వ్యవసాయిక జీవితంలో వచ్చిన సంక్షోభాన్ని, మరొకవైపు పారిశ్రామిక విధానాలలో వస్తున్న మార్పులను చిత్రించాయి. ‘నేల తల్లి’లో వ్యవసాయం గిట్టుబాటుకాక, పెట్టుబడులకు అప్పులు తేలేక, మార్కెట్ తనకు అనుకూలంగా లేక, వ్యవసాయం వదులుకోలేక రైతు పడే వేదనను చిత్రించింది. పారిశ్రామికీకరణం, ప్రపంచీకరణం, యాంత్రీకరణం, వ్యాపారీకరణం మొదలైన దుష్టశక్తులు పల్లె-పట్టణ ప్రజాజీవితాల్లో చేసిన గాయాలను గూర్చి ఎంతో ఆవేదన చెందుతూ తెలంగాణ కథకులు అద్భుతమైన కథలందించారు.
ఈ కథల్లో మట్టివాసనలు మాయమవుతున్న తీరు, గ్రామ స్వరూప స్వభావాలు, వృత్తులు నశించిపోతూ పనిముట్లు మూలన పడేయాల్సి వచ్చి బాధపడే తీరు, భూములు అన్యాక్రాంతం కావడం, జానపద కళలు అడుగంటిపోవడం, వలసలు అనివార్యం కావడం, ఫ్యాక్టరీల మూసివేతతో బతుకుదెరువు కోల్పోయిన దీనస్థితికి దిగజారి మనోవేదన చెందుతూ, ఆత్మహత్యల పర్వంతో వాస్తవ జీవిత గాథలను అక్షరీకరించడం కనిపిస్తుంది. రెండవ తరం రచయితలు కథలు రాసేనాటికి రాయలసీమలో చెప్పుకోదగ్గ మార్పులు చాలానే వచ్చాయి. స్కూళ్ళు, కాలేజీలు బహుళ సంఖ్యలో పెరిగాయి. సెకండరీ స్థాయివరకూ ఉచిత విద్య లభించటంవల్ల మధ్యతరగతికి విద్య అందుబాటులోకి వచ్చింది. పల్లెపల్లెకూ రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. కపిల మోటల స్థానంలో కరెంటింజన్లు వచ్చాయి. కొంత కాలం గడిచేసరికి గొట్టపు బావులు వచ్చాయి. ఇంతకుముందు శ్రమను పెట్టుబడిగా మార్చి పంటలు పండించే రైతులు ఇప్పుడు డబ్బును పెట్టుబడిగా చేసి వ్యవసాయం చేయటం వల్ల క్రమంగా చితికిపోతున్నారు. ఓట్ల రాజకీయాల జోరు క్రమంగా పెరిగింది. ఓట్లకోసం రాజకీయ నాయకులు అమాయకపు పల్లెల్ని రెండువర్గాలుగా చీల్చటం ప్రారంభించారు. కులం మునుపెన్నడూ లేనంతగా పడగ విప్పింది. ఫ్యాక్షన్ పెరిగింది.
రాయలసీమ రైతుకు పండే పంటలు అంతంతమాత్రం. తీరా దాన్ని అమ్మబోతే ఎలాంటి మోసానికి, దోపిడీకి గురౌతున్నాడో తెలియజెప్పే కథలు రచయితలు రాసారు. శాంతి నారాయణ రాసిన ‘దళారీ’, సింగమనేని నారాయణ రాసిన ‘అడుసు’లాంటి కథలు ఇందుకు మంచి ఉదాహరణలు. అంతేకాదు ఈ నేపథ్యం పలు సందర్భాల్లో ఉత్తరాంధ్రకు చెందిన గ్రామీణ, సెమీ, అర్బన్, గిరిజన్ ప్రాంతాలకు చెందినది కావడంతో స్థానిక ముద్ర ఆయా కథలకు మరికొంత ప్రత్యేకతను సమకూర్చింది. అవాంఛనీయ యంత్ర నాగరికతలో చేతి వృత్తులను వెలివేస్తున్న పల్లెలు, ఈ హృదయ విదారక దృశ్యాలన్నీ ‘్భమి పుండు’, ‘తిరుగుడమ్మి’, ‘నీటి ముల్లు’, ‘ఏటి పాట’, ‘వలస పక్షి’ కథల్లో ఆవిష్కరించారు గౌరునాయుడు.
వృత్తులు నశించి ప్రత్యామ్నాయం లేని బతుకుతో జనం విలవిలలాడుతున్నారు. కొన్ని సంస్కృతులు, భాషలు కనుమరుగయ్యే పరిస్థితులొస్తున్నాయి. మానవతా విలువలు మృగ్యమవుతున్నాయి. సేవాభావం నశించి స్వార్థం పెరిగిపోతుంది. డబ్బుకు ప్రాముఖ్యం ఎక్కువై రక్తసంబంధాలను కూడా నశింపచేస్తుంది. మనుషుల మధ్య, జాతుల మధ్య, ప్రాంతాల మధ్య వైరుధ్యాలు ఎక్కువవుతున్నాయి. ‘మానవుణ్ణి అమానవుడిగ మార్చే పెట్టుబడిదారి వ్యవస్థ పరిణామ రూపం సామ్రాజ్యవాదం, దాని అంతిమ దశ ప్రపంచీకరణ.’ పెరుగుతున్న ప్రపంచీకరణలో పెరుగుతున్న డబ్బు అవసరాలు, ప్రాధాన్యత, వృత్తి పనివాళ్ళ జీవితాలలో వస్తున్న సంక్షోభం వీటికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి ఆవిష్కరించటంలో తెలుగు కథకులు సఫలీకృతులవుతూ రచయితలుగా తమ సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంటి ముందు గొబ్బెమ్మలు -బామ్మగారి రంగ వల్లులు, హరిదాసు చిందులు ముందే వచ్చిన సంక్రాంతి శోభ -28-12-14

మా ఇంటి ముందు గొబ్బెమ్మలు -బామ్మగారి రంగ వల్లులు, హరిదాసు చిందులు  ముందే వచ్చిన సంక్రాంతి శోభ -28-12-14
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఏకత్వంలో భిన్నత్వం.. ఆధునిక భాషాశాస్త్రం

ఏకత్వంలో భిన్నత్వం.. ఆధునిక భాషాశాస్త్రం

  • – సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి
  • 22/12/2014
TAGS:

చదువుకున్న వాళ్లు మాట్లాడే భాషకూ, చదువుకొనని వాళ్లు మాట్లాడే భాషకూ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందువల్ల? చదువుకొననివాళ్లు మాట్లాడేభాష వారి వారి ప్రాంతీయ మాండలిక భాష రూపంలో ఉంటుంది. చదువుకున్నవాళ్ల భాష దాదాపు 80 శాతం సంస్కృత పదాలతోనే నిండి ఉంటుంది. అందువల్లనే ఆ వ్యత్యాసం. చదువుకున్న వారి భాషను ‘శిష్ట వ్యవహార భాష’, లేక ‘ప్రమాణ భాష’ అంటారు. చదువుకోని వారి భాషను ‘జానపద భాష’ లేక ‘మాండలిక భాష’ అంటారు.
‘ప్రమాణ భాష’కు ముఖ్యంగా ఆరు లక్షణాలు కానవస్తాయి. 1) సమాజంలోని ఎక్కువ మందికి- నగరాలలో గ్రామాలలో నివసించే చదువుకున్న వారికీ, చదువుకొనని వారికీ అనగా చదువుకొనక పోయినా చదువుకున్న వారు అనుసరించే వారికీ అత్యధిక శాతం ప్రజలకు ‘ప్రమాణ భాష’ ఆమోదయోగ్యంగా ఉంటుంది. 2) ప్రమాణ భాష నేర్చుకొనడమే విద్యావంతుల ప్రధాన అర్హతగా, లక్ష్యంగా గుర్తింపబడుతున్నది. అందువల్లనే విద్యాబోధన అంతా ప్రమాణ భాషలలోనే జరుగుతుంది. 3) జానపదాలు, మాండలికాల ప్రయోగం కంటె ప్రమాణ భాషా ప్రయోగానికే వ్యాప్తి ఎక్కువ. ఉపన్యాసాలు, కవిత్వాలు,వచన రచనలు, వార్తాపత్రికలు, సినిమాలు, రేడియో, టెలివిజన్ మొదలైన విజ్ఞాన వ్యాపక సాధనాలన్నీ ప్రమాణ భాషనే వాడతాయి. 4) విద్యావంతుల సాంస్కృతిక, వైజ్ఞానిక ఐకమత్యానికి సంకేతంగా ప్రమాణ భాష గొప్ప పాత్ర నిర్వహిస్తుంది. ప్రజల ఐకమత్యానికి సంకేతం ప్రమాణ భాష అయితే వాళ్లను విడదీయడానికి దోహదం చేసేవిగా ప్రాంతాలకు, వర్గ మాండలికాలు తమ పాత్రలను నిర్వహిస్తాయి. 5) ప్రమాణ భాష ప్రాథమికంగా ఏదో ఒక ప్రాంతంలో ఉండి హెచ్చుగా చదువుకున్న వారి వాడుక భాష ఆధారంగా ఏర్పడి దానిలో కొద్దికొద్దిగా జానపదాలను, మాండలికాలనూ కలుపుకుంటూ వ్యాప్తం అవుతుంది. 6) కొన్ని భాషల్లో ప్రాచీన కావ్య భాషనే ప్రమాణ భాషగా వ్యవహరించడం జరుగుతుంది. అట్టి సందర్భాలలో మాండలికాల ప్రభావం ప్రమాణ భాషపై హెచ్చుగా ఉండదు.
నాలుగు మండలాలుగా తెలుగు ప్రజల విభజన
తెలుగు భాషలో నాలుగు మండలాలను గుర్తించడానికి వీలు కలిగిందనీ, ఒకటి- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు గల ‘పూర్వమండల’మనీ, రెండు- రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు గల ‘దక్షిణ మండలమ’నీ మూడు- తెలంగాణా, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో కోస్తా, రాయలసీమలను ఆనుకొని ఉన్న తాలుకాలు తప్ప మిగతా ప్రాంతంగల ‘ఉత్తర మండలం’ అనీ 4 ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు గల ‘మధ్య మండలమనీ’ – సామాజిక భాషా శాస్త్ర పితామహుడైన భద్రిరాజు కృష్ణమూర్తిగారికి వృత్తి పదకోశాల నిర్మాణంలో సహాయకుడుగా వ్యవహరించిన డాక్టర్ పొరటి దక్షిణమూర్తి తెలియజేశారు. ఈ నాలుగు మండలాలలోనూ వివిధ వృత్తులవారు వాడే తెలుగు పదాలలో కొన్ని తీవ్ర వ్యత్యాసాలూ, కొన్ని స్వల్ప వ్యత్యాసాలూ కూడా ఉన్నాయి. అయితే ఈ వేర్వేరు పదాలకు అన్నింటికీ వౌలికమైన అర్థాలిచ్చే వౌలిక మూలాధార సంస్కృత పదాలు ఉండడం భాషా శాస్త్ర పరిశోధనలు, అధ్యయనంలో ఉత్సాహం కలవారు అందరూ గమనించదగిన విషయం.
అన్ని తెలుగు పదాలకూ వేద సంస్కృత మూలాలు
‘నాగలి’ అనే పదం, రెండు మండలాల్లో ‘నాగలి’ అనే వాడుకలో ఉండగా ఒక మండలంలో మాత్రం ‘నాగేలి’ అని వాడుకలో ఉంది. ఈ పదాలకు సంస్కృత మూలం మామూలుగా వాడుకలో ఉన్న సంస్కృత పదం ‘హలం’ కాదు, కాజాలదు. కాని మామూలుగా వాడుకలో లేని సంస్కృత పదం ఒకటి ఉన్నది. ‘లాంగలి’, లాంగల అని, ‘ఈ ‘లాంగల’ అనే సంస్కృత పదం చదువురానివారి వాడుకలో ‘నాగలి’గా వాడుకలోనికి వచ్చిందని మనం ఊహించలేమా? ‘మోటబావి’లోని ‘మోట’ అనే పదం కూడా మరో రెండు మండలాల్లో వాడుకలో ఉంది. ఒక మండలంలో మాత్రం ‘కపిల’ అనే పదం వాడుకలో ఉంది.
మాండలికాలకు మూలం ప్రాచీన ద్రావిడ భాషలు
ఇలా అన్ని మాండలిక పదాలకూ వౌలిక రూపాలైన వేద సంస్కృత పదాలు కొద్ది శ్రమచేసి పరిశీలిస్తే ఎవ్వరికైనా తప్పక లభిస్తాయి. కాని ‘ఈ మాండలిక పదాల మూల రూపాలు వేద సంస్కృత పదాలు కాదు. ద్రావిడ పదాలు మాత్రమే వాటి మూల రూపాలు. అట్టి ప్రాచీన ద్రావిడ భాష సమగ్ర రూపాన్ని కనుగొనడానికే మేమిప్పుడు కృషిచేస్తున్నాం’ అంటున్నారు కొందరు మహానుభావులు. సూర్యోదయాన్ని చూడడానికి తూర్పు దిశగా పయనించడానికి బదులు పడమటి వైపుగా ఎంతో ఉత్సాహంతో, ఉద్రేకంతో, ఉద్వేగంతో అడుగులు వేస్తూ-. దాన్ని పురోగమనం అంటారా? ‘తిరోగమనం’ అంటారా? విజ్ఞులే గ్రహిస్తారు. ఇలా దక్షిణదేశాలన్నిటిలోకీ మొట్టమొదటగా భారతదేశంలో, అందునా ఆంధ్ర ప్రదేశాలు తెలుగు భాషలో వృత్తిపదకోశాలు తయారుచేసి- చూశారా? ఈ ద్రవిడ భాషలలో ఎంత వైవిధ్యం ఉన్నదో? ఇంతటి సమగ్రమూ, నిర్దుష్టమూ అయిన ద్రావిడ భాషా చరిత్ర రాయడానికి అనాగరిక భాషా సామగ్రి ఎంత అవసరమో గ్రహిస్తున్నారా? అని ఒకప్పుడు సామాజిక భాషా శాస్త్ర పితామహులు భద్రిరాజు కృష్ణమూర్తి అనడం ఆశ్చర్యం కలించక మానదు. ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం పరిశీలింవవలసి యున్నది. అదేమిటంటే- అసలు ‘శాస్త్రం’ అంటే ఏమిటి? ‘శాస్త్రం’ ప్రయోజనం ఏమిటి? అని. సృష్టిలోని మానవ జీవితంలోని వివిధ విషయాల పరిణామక్రమాన్ని యధాతథంగా తెలియపరుస్తూ, ‘ఈ క్రమమే, ఈ విజ్ఞానమే అనుసరణీయం’ అని శాసించేది ‘శాస్త్రం’. ఇలా శాసించడం వలన ప్రయోజనం ఏమిటి?
శాస్త్ర ప్రయోజనం భిన్నత్వంలో ఏకత్వం
ఇలా శాసించడం వలన, అనగా శాస్త్రం వలన ప్రయోజనం ఏమిటి?- అంటే- భిన్నత్వంలో ఏకత్వాన్ని సందర్శింపజేయడం.. తద్వారా ప్రతి మనిషి మనస్సునకూ ఏకాగ్రతను లభింపజేసి- తద్వారా అమంద ఆనందానుభూతిని కలిగించి జన్మచరితార్థం అయిందనే సంతృప్తిని కలిగించడం. మనస్సు ఏకాగ్రమై ఉండడమే ఆనందానికి ప్రతీక. మనస్సు పరిపరివిధాలుగా సంచరిస్తూ ఉండడమే అన్నిరకాలైన ఆందోళనలకు దుఃఖానికీ కారణం.
ఏకత్వంలో భిన్నత్వం సృష్టించే వారు ఏం చెయ్యాలి?
చదువుకున్న వాళ్లందరూ మాట్లాడే ‘ప్రామాణిక భాష’లో 80 శాతం సంస్కృత పదాలు, 20 శాతం మాత్రమే మాండలికాలూ ఉండగా మనం మాట్లాడుతున్న, వ్రాస్తున్న భాష అంతా- ‘్భష’ అనే పదంతో సహా ‘సంస్కృతమే’ అయి ఉండగా- ‘సంస్కృతం’ ఈ భాషలకు మూలం కాదు- ఈ ద్రావిడ భాషలన్నింటికీ మూలమైన ‘మూల ద్రావిడ భాష’ ఎక్కడ ఏ ప్రాంతంలో విశేషంగా వాడుకలో ఉందో పరిశోధించి ప్రజల ముందు ఉంచాల్సి ఉన్నది. ఈ ద్రావిడ భాషలకూ, ఆర్యల భాష, వేద భాష దేశ భాష అయిన సంస్కృతానికీ ఎక్కడా ఏ సంబంధమూ లేదు’ అంటూ తన భాషలోనే తన మాటల్లోనే 80 శాతం సంస్కృత పదాలను ఉపయోగిస్తూ ప్రకటించడం- వితండవాదం తిరోగమన వాదం కాక మరేవౌతుంది? ఇలా తిరోగమన దిశగా భాషా శాస్త్ర ప్రస్థానం జరుగుతుంది. అవాక్కులై చూస్తూ ఊరుకుండేవారిని ఏమని ప్రశంసించాలో అర్థం కావడంలేదు. తాటాకుల చప్పుళ్లకు కుందేళ్లు బెదరవులే అని దీని అర్థమా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్షరాలలో ఒధిగిన వ్యధార్థ కథలు

TAGS:

కథా వార్షిక – 2012
మధురాంతకం రాజారాం
సాహిత్య సంస్థ
వెల: రూ.60/-
ప్రతులకు: డా.ఎం.నరేంద్ర
15-54/1, శ్రీ పద్మావతినగర్,
తిరుపతి-2.
మరియు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హవుస్ అన్ని బ్రాంచీలు

ఆధునిక సమాజం ముసుగులో ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని కథలుగా చిత్రిస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే సంకలనమే ‘కథా వార్షిక- 2012’ మానవ జీవితాల్లోని పలురకాల కోణాల్ని ఇది బహిరంగంగా వ్యక్తపరుస్తుంది. ఈ లోతుపాతుల్ని తెలుసుకుని వీటిలోని కష్టనష్టాల తడిని పలకరించాలంటే ఒక్కసారి మనసు చూపుతో చుట్టిరావాల్సిందే!
తర్కబద్ధమైన హేతువాదానికి మానవీయ కోణాన్ని కర్తవ్య నిర్వహణ బాధ్యతారూపంలో ప్రకటించిన కథలాంటి.. జీవితం కథ ’దేవుణ్ణి అటకాయించిన మనిషి’ దీని రచయిత మెహర్ గొప్ప ఆశను కలిగిస్తుంది.
బహుళజాతి సంస్థ తమ పునాదులను పటిష్టం చేసుకోవడానికి భారతదేశంలోని ఆంధ్రరాష్ట్రంలో నాగరాజనే వ్యాపార విషయాల ఇన్‌చార్జి వేసిన పథకానికి, గ్రామస్థాయిలోని సామాన్య ఉమ్మడి ప్రతినిధి తిప్పణ్ణ చేతిలో ఏవిధంగా పరాభవం చెందాడో చాటి చెప్పేదే ‘ఒక దళారీ పరాభవం’ కథ. జి.ఉమామహేశ్వర్ రాసిన ఈ కథ సామ్రాజ్యవాదంలో భాగంగా ప్రపంచీకరణ పేరుతో జరుగుతున్న మోసానికి నిలువెత్తు దర్పణంలా నిలుస్తుంది.
‘గోమేజ్ ఎప్పుడొస్తాడో’ కథను వేలూరి వెంకటేశ్వరరావు రాసారు. అమెరికా నేపథ్యంలో రాసిన ఈ కథ గోమేజ్ లోపలి మనిషిని పరిచయం చేసి మనిషితనానికి సంబంధించిన ఒక ఆశను మనలో మిగిల్చిపోతుంది.
కథాంశానికి వస్తే-ఇంటి బయట ఉన్న లాన్‌ని కొయ్యడానికి గోమేజ్‌ని బేరమాడుకుంటారు సుజాత-కేథరిన్‌లు. గోమేజ్‌కు తోడుగా మార్సిలినోను తెచ్చుకుని ఆడుతుండగా మోవర్ పల్టీకొట్టి గోమేజ్‌కు గాయమై రక్తస్రావం కావడంతో హాస్పటల్‌లో జాయిన్ చేస్తుంది సుజాత. కానీ అతనక్కడినుండి పారిపోతాడు. వెతుక్కుని వెళ్లినా ప్రయోజనం కనిపించక ఆశవదులుకుంటుందామె. కొన్ని రోజుల తరువాత ఒక ఉత్తరాన్ని చదువుతుంటే-గోమేజ్ మాటలు గుర్తుకొచ్చి మనసు తడితో కంటనీరు పెట్టుకోవడంతో ఈ కథ ముగుస్తుంది. గొప్ప మానవతా దృక్పథం తొణికిసలాడి చెరగని ముద్ర వేస్తుందిది.
‘కాళాపు కథ’ గొప్ప శిల్ప వైవిధ్యంతో కొనసాగుతుంది. దీని రచయిత్రి మన్నం సింధుమాధురి.
‘కలాపు’ అని పిలువబడే ‘బిసివిని’ గౌడుతోపాటు అనేక మంది అనుభవిస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. ఈ క్రమంలో ఓ కొడుకు పుట్టాక, వాడు పెరిగి పెద్దవాడై అనుకోని రీతిలో గౌడు మిత్రుణ్ణి చంపి పారిపోతాడు. కొన్నాళ్లకి కాటి పాపడితో కలాపు లేచిపోయిందనే పుకారు గౌడుద్వారా లేస్తుంది. జోగిని వృత్తిలో ఉండే వారి జీవితాల్ని, ఎదురైన చేదనుభవాల్ని చాలా ఆర్ద్రంగా, విషాదభరితంగా ఈ కథ రూపుకడుతుంది.
మంచి కథాకథనంతో ఆద్యంతం రక్తికట్టించే కథ ‘కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్లు’. విమల రాసిన ఈ కథలో ఒకనాటి జ్ఞాపకాల సంఘటనను నెమరేసుకుని దాని మూలాలు వెతుకులాట కనిపిస్తుంది.
ఇతివృత్తానికొస్తే..ఉద్యోగరీత్యా కొనే్నళ్ల క్రితం ఆమె పనిచేసిన ప్రాంతంలో ఎన్నికల గందరగోళ స్థితిలో, ఉద్యమకారులు తిరుగాడుతుండగా- కొంతమంది కుర్రకారు వేర్వేరు బాధ్యతలతో గుంపులుగా విడిపోతారు. అందులో తిరుపతి, మాధవులు ముఖ్యులు. మాధవ ప్రేమించిన అమ్మాయి జ్యోతి. వాళ్ల పెద్దలు అంగీకరించరు వాళ్ల ప్రేమను. కానీ ఈలోగా అప్రయత్నంగా పోలీసు కాల్పుల్లో కుర్రాళ్లిద్దరు మృతి చెందుతారు. ఇవన్నీ పెళ్లిలో కలుసుకున్న ఆమెతో జ్యోతి భోజన సమయంలో కలుసుకుని గతాన్ని తలుచుకుని బాధపడుతుంది. అందులో భాగమే ఒకనాటి నక్షత్రకాంతి, అవ్యక్తానంద స్థితికి వెదుకులాటకి దారి తీయిస్తుంది. విషాదరేఖలు పురివిప్పి ఆర్ద్రపూరితమైన ముగింపునిస్తాయి.
ఒక ప్రధాన పాత్రతో కథను నడిపిస్తునే మధ్యమధ్యలో శివాని, బసంతి లాంటి చిన్నచిన్న పాత్రలతో జ్ఞాపకాల మధ్య అనే్వషిస్తుంటే అసంపూర్ణ జీవితానికి నిర్లిప్తత, పశ్చాత్తాప భావన వెదుకులాట వెంటాడుతాయి ‘వాంగ్మూలం’ కథలో. వీటికి కొసమెరుపుగా ఒక ఆత్మహత్య మరణ వాంఛతో ఊపిరాడని తనాన్ని మిగుల్చుతుంది ఇందులో. చాలా వైవిధ్యపూరితమైన కథనం కనిపిస్తుంది. శిల్పరహస్యం కూడా కొత్తగా అనిపిస్తుంది. స్వాతికుమార్ దీనిని రాసిన రచయిత్రి.
అంటరానితనం కేంద్రంగా శ్రమ జీవన ప్రాధాన్యతను వివరించి చెప్పిన కథ ‘కాకికి కడివెడు పిచ్చిక్కి పిడికెడు’ కథ. స.వెం.రమేశ్ రాసిన శైలి సరళమైంది. సున్నితమైంది. కాకమ్మకు అమ్మను, పిచ్చుకమ్మకు మంగమ్మను ప్రతీకగా చేసి ఇద్దరు తల్లుల బిడ్డలతో నాలుగు తరాల మనుషుల చరిత్రను చిత్రించిన తీరు అబ్బురపరుస్తుంది. అందర్నీ చదివింపచేస్తుంది.
‘కథలు లేని కాలం’ కథను రాసిన రచయిత్రి ఓల్గా. ఎనిమిదేళ్లు పెంచిన మనుమరాలు అనన్య తిరిగి ఎనిమిదేళ్ల తరువాత అమెరికానుండి తిరిగి వస్తుంది. గతంలో అమ్మమ్మ చేత కథలు చెప్పించుకోవడానికి అలవాటు పడిన ఆ పిల్లకి, కొనే్నళ్ల తర్వాత కొత్తగా కథలు మార్చి చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. అనన్యకి అమ్మమ్మైన సుమిత్ర ప్రేమించి పెళ్లి చేసుకుని పల్లె జీవితంలో రంగారావుతో స్థిరపడిపోవడాన్ని ఇష్టపడని కూతురు శ్రావణి, కొనే్నళ్లకు బాగా చదువుకుని వేరొకతనిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది. అలా శ్రావణికి పుట్టిన కూతురు అనన్యతోనే ఈ కథంతా నడుస్తుంది. కథన చిత్రణలో విలక్షణమైన కొత్త పార్శ్వాలను తడిమి చూపారు. ఇందులో రచయిత్రి ఓల్గా ప్రత్యేక ముద్ర తప్పక కనిపిస్తుంది.
‘దావత్’ కథ మహమద్ ఖదీర్‌బాబు శిల్ప నిర్మాణ పద్ధతిని కొత్తకోణంలో పాఠకులకు పరిచయం చేస్తుంది. ఆడ ముస్లిం పెళ్లింట జరిగిన భోజన కార్యక్రమంలో భాగంగా తిండి విషయంలో తలెత్తిన చిన్న తగాదా చివరికి పరిస్థితిని ఏ స్థాయికి దిగజారుస్తుందో తెలియజెప్పే కథ ఇది. మగపెళ్లి వాళ్ల పెత్తనం అన్నింటా ఆధిపత్య ధోరణి కలిగించి అస్లాం లాంటి తండ్రుల పాలిట ఎలా శాపంగా మారుతుందో ఇది వివరిస్తుంది. చాలా సహజంగా సాగి జీవన సత్యాన్ని ఆవిష్కరింపచేస్తుంది.
ఇలా వస్తు వైవిధ్యం పుష్కలంగా కలిగిన ఈ కథలు జీవన సంఘర్షణలను ఎత్తి చూపడమే కాకుండా, అందులోని కరుణ రసాత్మక దృశ్యాలను ఆకర్షీకరించి ఆలోచింపచేస్తాయి. డా.వి.చంద్రశేఖరరావుగారు ఒక కథా సమయంలో పేరుతో ఈ కథలపై ఇచ్చిన విశే్లషణలు సమగ్రంగా, సందర్భానుసారంగా మానవతా పరిమళాలను అద్ది ఈ కథావార్షికకు నిండుదనాన్ని చేకూర్చాయి. ఇందులోని తొమ్మిది జీవన చిత్రాల్ని ప్రతిబింబించి సాహిత్య లోకానికి కొత్తదారులు తెరలు తెరిచాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రుద్రవీణపై కోటి రాగాలు ప్రతులకు: డా.జలంధర్‌రెడ్డి,

రుద్రవీణపై కోటి రాగాలు
ప్రతులకు: డా.జలంధర్‌రెడ్డి,
ఇంటి నెం.12-13-336,
ప్లాట్ నెం.465,
వీధి నెం.2, తార్నాక,
సికింద్రాబాదు- 500 017.
మొబైల్.9848292715
వెల: రూ.200/-; పుటలు: 230.

డా.జలంధరరెడ్డి మహాకవి దాశరథి గురించి పెద్దఎత్తున సదస్సు నిర్వహించి ఆ ప్రసంగ పత్రాలతో ఒక బృహగ్రంథాన్ని వెలువరించారు. పాత పత్రికల్లో వచ్చిన వ్యాసాలన్నింటిని ఎంతో శ్రమకోర్చి సేకరించి 800 పుటల మరో గ్రంథాన్ని ప్రకటించారు. ఈ రెండు పుస్తకాలు దాశరథిని గురించి మాట్లాడే వారందరికీ ప్రధాన ఆధార గ్రంథాలుగా నేడు ఉపయోగపడుతున్నాయి. జలంధరరెడ్డి అం తటితో ఆగక రుద్రవీణపై కోటి రాగాలు పేరుతో దాశరథికి 81 మంది కవులతో కవిత్వ నీరాజనాన్ని సమర్పించారు.
దాశరథీ! మనోజ్ఞ కవితాశరధీ! శరదిందు చంద్రికా
పేశల కావ్యఖండముల పండిన నీ కలమందునన్ మహో
గ్రాశనిపాతముల్ వెలయునౌర! మహేశుని కంటిలో సుధా
రాశి తరంగముల్ కటు హలాహల కీలలు పొంగినట్లుగా.
(పుట.27).
-అన్న డా.సి.నారాయణరెడ్డి ‘‘జలపాతం’’ అంకిత పద్యాలు ఈ గ్రంథానికే మకుటాయమానం. నారాయణరెడ్డి దాశరథిని అగ్రజునిలాగ భావించారు. ‘‘అన్నలు లేని చింత హృదయాంతికమందు జనింపకుండా చేసి తమ్ముడాయని మనస్సుమముల్ విరబూయ’’ సినారెను సంభావించిన వ్యక్తి దాశరథి.
మద్దూరి రామమూర్తి, ఆశావాది ప్రకాశరావు, ఉన్నత జ్యోతివాసు, రామడుగు వెంకటేశ్వరశర్మ, ఎన్.యాదగిరిశర్మ లాంటి వారి పద్యాలు. టి.వీ. భాస్కరాచారి, వేదాటి రఘుపతి లాంటి వారి గేయాలు, అనిసెట్టి రజిత, దర్భశయనం శ్రీనివాసాచార్య, గిరిజా మనోహరబాబు, తిరునగరి లాంటి వారి వచన కవితలు అలరిస్తాయి. దాశరథి పట్ల ప్రశంసోక్తులు పలకడం, ఆయన పుస్తకాల పేర్లు వచ్చేలా రాయడం, ఆయన కవితా పంక్తులను కూ ర్చడం లాంటి వ్యూహాలను కవులు అనుసరించారు.
‘‘వీధిలో నడుస్తుంటే కనిపించనంతటివాడు, కవిగా వీధిలోకి వస్తే శృంగాయమానంగా కనిపించే ధీరు డు’’అంటారు కనపర్తి రామచంద్రాచార్యులు (పుట. 182). ‘‘ప్రాచీన అర్వాచీన కవిత్వానికి వారధి ఒళ్ళంతా కవిత్వం, మనసంతా కవిత్వం అన్ని రసాలను గుప్పించి మెప్పించడం అతని తత్వం’’ (పుట.199) అంటూ జి.వెంకటేశ్వర్లు దాశరథిని ప్రస్తుతించారు.
రుధిర సంధ్యల్లోని భానుడు
నెత్తురు కక్కుతున్న వేళ
ఉషస్సుల్లేని నిశీధిలో చంద్రుడు
అశ్రువులు రాలుస్తున్నాడు
మోదుగుపూలు రక్తం పూసుకొని
అరుణకాంతులను వెదజల్లుతున్న వేళ
ఇటు వసంతము లేక కోకిలలు
ఆర్తనాదాలతో రోదిస్తున్నాయి
పాషాణ హృదయ పారావతాలు
కిక్కురు మనకుండా మిన్నకున్నాయి. (పుట 133)
-అంటూ గడ్డం మోహన్‌రావు రాసిన కవిత కమనీయంగా సాగుతుంది.
తెలుగు తేజముతోడ వెలుగురేఖలు జిమ్ము
కవి దాశరథి- తెలంగాణ యింట
అగ్నిధారను పోసి అశ్రుధారను ఆపె
గద! దాశరథి- తెలంగాణ కంట
బీడు బుర్రలలోన స్వేచ్ఛాన్నముల నివ్వ
గల దాశరథి- తెలంగాణ పంట
జన్మజన్మల బూజు జాడించి దులిపిన
ఘన దాశరథి- తెలంగాణ జంట
ఇల్లు చక్కదిద్ది కళ్ల కలత దీర్చి
సాగుచేయు రైతు జతగ నిల్చు
రణనినాది దాశరథి కృష్ణమాచారి
నవ్యకవితకు నిధి భవ్య సుకవి.(పుట 79) అంటున్న సల్ల విజయ్‌కుమార్ ఇట్లాగే తన రచనాభ్యాసాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో మంచికవి కాగలడన్న ఆశను రేకెత్తిస్తున్నారు.
దాశరథి ఆస్థాన కవిగా నియమితులయ్యారంటే- అదేదో ఆ దాయం ఉండే ఉద్యోగం కాదు. సంవత్సరానికి ఆరువేల రూపాయల గౌరవ పారితోషికమట. అంటే నెలకు ఐదువందల రూపాయలు అన్నమాట. ఆస్థాన కవి నియామకం ఉత్తర్వును ఈ గ్రంథంలో పొందుపర్చడంవల్ల చరిత్రకు మేలుచేసిన వారయ్యారు. భవిష్యత్తరాలు దాశరథి పట్ల ఏవేవో ఊహించుకోకుండా రక్షింపబడ్డాడు.
సర్వేపల్లి రాధాకృష్ణ, ఇందిరాగాంధీ, బూర్గుల రామకృష్ణరావు, జలగం వెంగళరావు, మదర్ థెరీసా, నీలం సంజీవరెడ్డి లాంటి నేతలతో, జాషువా, సినారె, దేవులపల్లి లాంటి సమకాలీన కవులతో దాశరథి దిగిన ఫొటోలు, ఆకాశవాణిలో పనిచేసినప్పటి ఫొటోలు అందంగా అదనంగా ఉన్నాయి. ఈ చిత్రాలను ఎక్కడో ఒకచోట ఇలా పొందుపరచకపోతే అవి కాలగర్భంలో కలిసిపోయేవి. దాశరథి లాంటి మహనీయుడికి ఎంత నివాళి అర్పించినా తక్కువేనన్నది వాస్తవం. దాశరధి సాహిత్యాన్ని చదవడమే ఆయనకు నిజమైన నివాళి అన్నది మరింత వాస్తవం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాత్సల్య సేవ

ఎంత వాత్సల్యం!

 ఆడపిల్ల పుట్టిందని కొందరు చెత్తకుండీలో పడేస్తున్నారు. అంగవైకల్యంతో జన్మించిన పసికందులను రైల్వే ట్రాక్‌లు, రోడ్ల పక్కన పడేసి వదిలించుకుంటున్నారు. ఇలా ఎంతో మంది ఆడపిల్లలుగా పుట్టిన పాపానికి అనాధలు కాక తప్పడంలేదు.
తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఇలాంటి పిల్లలను శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని జనహిత వాత్సల్య సేవాసంస్థ అమ్మగా నిలుస్తోంది. వారికి ఓనమాల నుంచి ఉన్నత చదువులు చదివించి.. పునర్జన్మను ప్రసాదిస్తోంది. అనాధ పిల్లలకు అమ్మగా నిలిచిన వాత్సల్య సేవాసంస్థ గురించే ఈ కథనం..
అప్పుడే తల్లి గర్భం నుంచి పుట్టి కళ్లు కూడా తెరవని మూడు రోజుల పసికందును ఎవరో ఆసుపత్రి బయట అర్ధరాత్రి వదిలేసి వెళ్లిపోయారు. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ పసికూనను ఆసుపత్రి సిబ్బంది చూశారు. చిన్నారిని దగ్గరకు వెళ్లి పరిశీలించగా పుట్టుకతోనే చేతి, కాళ్ల వేళ్లు అతుక్కుని ఉన్నాయి. ఒక కన్ను లేదు. మరొక కన్ను సగం మాత్రమే కనిపిస్తోంది. అయితే పుట్టిన బిడ్డ అంగవైకల్యమని ఆ తల్లిదండ్రులు వదిలేసి వెళ్లారని ఆసుపత్రి సిబ్బంది ఓ నిర్ధారణకు వచ్చింది. ఈ విషయాన్ని వాత్సల్య సేవా సంస్థకు సమాచారం అందించారు. వెంటనే వారు ఆ బిడ్డను తీసుకెళ్లారు. ఆ చిన్నారికి సావిత్రి అని పేరు పెట్టారు. గత ఎనిమిదేళ్ల నుంచి ఆలనాపాలనా ఆ సంస్థనే చూస్తోందిప్పుడు. అంతే కాదు త్వరలో సావిత్రి చేతులకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా సుమారు 110 మంది పిల్లలకు వాత్సల్య సేవాసంస్థ ఆశ్రయం ఇస్తోంది.
అనాధలకు ఆశ్రయం ఇచ్చేందుకు 1989లో నెల్లూరులోని కొండాయపాళెం రోడ్డు దగ్గర వాత్సల్య సేవా సంస్థకు వేదాంతం సంఘమేశ్వరశాసి్త్ర పునాది వేశారు. నెమ్మదిగా ఎకరా స్థలంలో వసతి, పాఠశాల భవనాలతో పాటు వృద్దాశ్రమం కూడా ఏర్పాటు చేశారాయన.
 

అన్నీ తామై..
అమ్మా, నాన్నకు దూరమై అనాధలైన చిన్నారులకు చక్కటి జీవితాన్ని అందించగల శక్తి ఒక విద్యకే ఉంది. అందుకే వారికి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు వాత్సల్య ప్రాంగణంలోనే విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ బడిలో చుట్టుపక్కల గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులకు తక్కువ ఫీజులు చెల్లించి చదువుకునే అవకాశం కల్పించారు. చదువుతో పాటు కంప్యూటర్‌ విద్య, ఆటపాటలు, కుట్లు, అల్లికలు, విష్ణు సహస్రనామ పారాయణం, యోగా, ధ్యానం లాంటి అంశాలలోనూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వాత్సల్యలో చదువుకున్న విద్యార్థుల్లో ఎందరో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్నతస్థానాలకు వెళ్లడం విశేషం. తల్లిదండ్రులు ఒక ప్రమాదంలో మరణించడంతో 9వ తరగతిలో ఉన్నప్పుడు తమ్ముడిని తీసుకుని కార్తీక్‌ అనే ఓ బాలుడు వాత్సల్యకు వచ్చాడు. పై చుదువులు చదివించి ఇప్పుడు అహ్మదాబాద్‌లోని ఐసిఎస్‌ గ్రూపులో డేటాసెంటర్‌ ఆపరేషన్‌ మేనేజర్‌గా పని చేస్తూ ఏడాదికి రూ.6లక్షలు సంపాదిస్తున్నాడతను. తమ్ముడు ప్రస్తుతం వాత్సల్యలో ఉంటూ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు.
దాతల ఔదార్యమే కొండంత అండ….
దాతల సహాయంతోనే జనహిత వాత్సల్య సేవాసంస్థ ముందుకు వెళుతుంది. మనం చేసేది మంచి పనైతే దానికి నలుగురు తోడవుతారంటారు. అలాగే వాత్సల్య సేవలు కూడా ఎందరికో స్పూర్తినిచ్చాయి. తమ వంతు సహాయం చేస్తామంటూ దాతలు ముందుకు వస్తున్నారు. ప్రతి నెల సంస్థకు, నిర్వహణకు రూ.6 నుంచి రూ.8లక్షల వరకు ఖర్చవుతోంది. అందులో ప్రతీ పైసా దాతల నుంచే వచ్చినవే! హైదరాబాద్‌కు చెందిన ఎంసికెఎస్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఫుడ్‌ ఫర్‌ హ్యాండ్లీ సంస్థ ఏడాదిలో 11 నెలలు రూ.40వేల వరకు అందిస్తుంది. పాఠశాలకు రూ.5.5లక్షల విలువ చేసే వ్యానును అందజేసింది. చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి అనే వ్యాపారి ఏటా రూ.3లక్షలు విరాళంగా అందజేస్తారు. ఇలా ఎంతో మంది మనసున్న మానవమూర్తులు ముందుకు వచ్చి ఆ అనాధ పిల్లలకు మేమున్నామంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గత రెండేళ్ల కిందట ఎంపీ నిధుల నుంచి వృత్తి విద్య శిక్షణ కేంద్రానికి రూ.10 లక్షలు కేటాయించారు. అనాధ పిల్లలే కాదు, సంస్థలో 30 మందికి పైగానే అనాధ వృద్ధులు ఉన్నారు. వాత్సల్య సేవాసంస్థ విద్యాసంస్థలన్నింటిని సాంబశివరావు చూస్తున్నారు. పిల్లలను ఆణిముత్యాలుగా తయారు చేయడమే ఆయన లక్ష్యం.
శాసి్త్ర స్ఫూర్తితోనే నడుపుతున్నాం..
వాత్సల్య సేవాసంస్థ సేవలు ఆ సంస్థ వ్యవస్థాపకులు వేదాంత సంఘమేశ్వరశాసి్త్రకి దక్కాలి. గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచవరం అగ్రహారంలో జన్మించిన శాసి్త్ర రాషీ్ట్రయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యకర్తగా పని చేసేవారు. ఒకసారి ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడు రైల్వేస్టేషన్‌లో ఉన్న అనాధ పిల్లలను చూసి చలించిపోయారు. స్పందించి ఊరుకోలేదు. వాత్సల్య సేవాసంస్థను నిర్మించారు. కొన్నాళ్ల కిందటే ఆయన కాలధర్మం చేశారు. శాసి్త్ర స్ఫూర్తితోనే ఇంతమంది పిల్లలను తీర్చిదిద్దగలుగుతున్నాము.
– సామంతుల గోపాల్‌రెడ్డి, వాత్సల్య సేవాసంస్థ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హింస సోహం అంటున్న అస్సాం

అసోం హింస
అసోంలో బోడో మిలిటెంట్ల ఉన్మాద చర్య అత్యంత కీలకమైన ఈ సమస్య మీద సత్వరమే దృష్టిసారించవలసిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది. ఆదివాసీల ఊచకోత అనంతరం తలెత్తిన ఉద్రిక్తత కాస్తంత తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమే అయినప్పటికీ మరణించిన వారి సంఖ్య వందకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటలిజెన్స్‌ విభాగాలకు మిలిటెంట్ల దాడుల గురించి ముందస్తు సమాచారం అందినప్పటికీ, ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ దానిని కొట్టిపారేయడమూ, పోలీసు యంత్రాంగం తర్జనభర్జనల్లో ఉండటమూ ఊచకోత రెండు జిల్లాల్లో జరగడానికి వీలుకల్పించినమాట వాస్తవం.

అసోం జీవవైవిధ్యానికే కాదు, జాతి వైరుధ్యానికి కూడా మారుపేరు. వివిధ తెగలకు, మతాలకు నిలయం. ఆధిపత్య పోరాటాలకు పుట్టినిల్లు. బోడో మిలిటెంట్‌ బృందాలు కత్తులు, తుపాకులతో పాటు గ్రెనేడ్లు కూడా విసురుతూ గ్రామాలమీద పడి ఊచకోత కోయడం అత్యంత భయానకమైన సన్నివేశం. పసికందుల నుంచి పండుముందుసలి వరకూ ఎవరినీ వారు విడిచిపెట్టలేదు. మారుమూల ప్రాంతాలకు పోలీసు బృందాలు చేరుకొనేలోగా అనేక గ్రామాలు తగలబడిపోయాయి. ‘బోడో కానివాడిని తగలబెట్టండి’ అంటూ తన సాయుధబలగాలకు నిషేధిత నేషనల్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌ (సాంగ్‌బిజిత్‌) అధినాయకుడు ఇచ్చిన ఆదేశాలు తూచ తప్పకుండా అమలు జరిగాయి. ఆ వర్గంతో చర్చలు జరిపేది లేదని ఇప్పటికే ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటన తరువాత రెండునెలల్లోగా దీని అధినాయకత్వాన్ని నిర్మూలించాలని సంకల్పం చెప్పుకున్నాయి. చర్చలకు దిగిరాని ఈ మొండిఘటాన్ని తుదముట్టించాలనుకోవడం ఇదే మొదటిసారి కాదు. మూడుదశాబ్దాలుగా హింసకు మారుపేరుగా ఉన్న అసోంలో నిజానికి ఈ ఏడాది అది కాస్తంత తగ్గుముఖం పట్టింది.
రెండు ప్రధాన మిలిటెంటు గ్రూపులు అరబింద రాజ్‌ఖోవా నాయకత్వంలోని ఉల్ఫా, రంజన్‌ దైమారీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌ (ఎన్డీఎఫ్‌బీ) వర్గం చర్చలకు దిగిరావడం ఇందుకు కారణం. కానీ, ఎన్డీఎఫ్‌బీ సాంగ్‌బిజిత్‌ గ్రూపుమాత్రం చర్చలను తిరస్కరించి దాడులకు పాల్పడుతూ వచ్చింది. భారత్‌ భూటాన్‌ సరిహద్దుల్లోని బోడో ప్రాదేశిక ప్రాంతంలో భద్రతా దళాల ఏరివేత కార్యక్రమంలో ఈ వర్గం బాగా దెబ్బతిన్నది. ఇందుకు జవాబుగా ఈ వర్గం భారీ దాడులకు పాల్పడే అవకాశాలున్నాయన్న హెచ్చరికలను విస్మరించడమే రెండు జిల్లాల్లో భారీ ఊచకోతకు కారణమైంది. సాంగ్‌బిజిత్‌ వర్గం సంఖ్యాబలం మూడువందలు కూడా ఉండదనీ, దానిని నిర్మూలించడం త్వరలోనే సాధ్యమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వసిస్తున్నప్పటికీ, ‘స్వతంత్ర బోడోలాండ్‌’ కోసం ఉద్యమిస్తున్న ఇటువంటి సంస్థలకు బోడోల్లో ఉన్న సానుభూతిని విస్మరించలేనిది.

అత్యధిక సంఖ్యాకులు తమకు చారిత్రకంగా అన్యాయం జరిగిందని భావిస్తున్నప్పుడు వారి కోర్కెల్లో న్యాయబద్ధమైనవి పరిష్కరించే ప్రయత్నం నిజాయితీగా జరగాలి. హక్కుల విషయంలోనూ, అభివృద్ధి విషయంలోనూ అన్యాయాన్ని సరిదిద్దక తప్పదు. బోడోలకూ, బోడోయేతర ఆదివాసీ తెగలకూ మధ్య అగాఽధాన్ని పెంచుతున్న అంశాల్లో ప్రభుత్వాలు పరిష్కరించగలిగేవి అనేకం ఉన్నాయి. దీనితోపాటు రెండు గ్రూపులు చర్చలకు దిగివచ్చిన నేపథ్యంలో, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రక్రియను ముందుకు తీసుకుపోకుండా జాప్యం చేసిన పక్షంలో పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది.
అసోంలో భూమిపుత్రులు ఎవరన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. అందరికంటే ముందు వలస వచ్చిన బోడోలు పదిన్నర లక్షలమంది వరకూ ఉన్నారు కనుక తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండు చేస్తున్నారు. అనేక సంస్థలు సాయుధ పోరాటం చేస్తున్నాయి. 2003లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం బోడో లిబరేషన్‌ టైగర్‌ ఫోర్స్‌ (బీఎల్‌టీఎఫ్‌)తో ఒక ఒప్పందానికి వచ్చి బ్రహ్మపుత్ర ఉత్తర తీరంలో ఐదారు జిల్లాలతో బోడో ప్రాదేశిక మండలి ఏర్పాటు చేసింది. 70 శాతం బోడోలున్న ఈ ప్రాంతంలో మిగతా తెగలూ ఉన్నాయి. మతాలూ ఉన్నాయి. స్వతంత్ర రాష్ట్రం ముసుగులో వారిపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రెండు జిల్లాల్లో ఊచకోతకు గురైన ఆదివాసీలు ప్రధానంగా బెంగాల్‌లోని సంతాల్‌ పరగణాల నుంచి, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వలస వచ్చినవారు. వలసపాలనలో హక్కులకు నోచుకోని ఈ తేయాకు తోటల కూలీలకు 1951లో హక్కులు దఖలు పడ్డాయి. హిందూమతాన్ని అనుసరిస్తున్న బోడోలు ముస్లింలను ఊచకోతకోయడమూ, క్రైస్తవ బోడోలు సంతాల్‌లపై దాడులు చేయడమూ కనిపిస్తున్నదే.
ప్రధానంగా పరిమిత వనరుల కోసం జరుగుతున్న ఈ పోరాటాలను అదుపు చేయడం మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించగలిగినప్పుడు చాలా వైషమ్యాలు సమసిపోతాయి. వ్యవసాయమే ప్రధానమై, బ్రహ్మపుత్ర మాత్రమే బతుకు తెరువైనప్పుడు ఉన్నవారి మధ్యనా, వలసలు వస్తున్నవారితోనూ ఘర్షణలు తప్పవు. మతం పేరిట, తెగల పేరిట పడగవిప్పుతున్న వైషమ్యాలకు రాజకీయం కూడా తోడుకావడం దేశ సరిహద్దు ప్రాంతంలో ప్రమాదకరం. ఉపాధికి పెద్దపీట వేస్తూ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం అవసరం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం

కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం
గల్ఫ్‌ ఆంధ్ర మ్యూజిక్‌ అవార్డ్‌ (గామా అవార్డ్స్‌) ప్రదానోత్సవం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న దుబాయ్‌లో ఘనంగా జరగనుంది. 2013కుగానూ మ్యూజికల్‌ అవార్డ్స్‌తోపాటు ప్రముఖ దర్శకుడు బాపుని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కళాతపస్వీ కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నారు. ‘గామా’ అవార్డ్‌ కమిటీ చైర్మన్‌ కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ ‘‘2013కు సంబంధించిన అవార్డ్‌ ఫంక్షన్‌ను జనవరి 31న ఎంతో ఘనంగా జరిపాం. 2014లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ‘గామా’ అవార్డుప్రదానోత్సవం 2015 ఫిబ్రవరి 6న ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈసారి కె.విశ్వనాథ్‌గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నాం. పలువురు సినీ ప్రముఖులు, గాయనీగాయకులు, సంగీత దర్శకులు, పాటల రచయితలు పాల్గొనబోతున్న ఈ వేడుక దుబాయ్‌లోని తెలుగువారికి కనుల పండుగ అవుతుంది’’ అని అన్నారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రముఖ సాహితీ విమర్శకుడు , ఆత్మీయుడు స్వర్గీయ టిఎల్.కాంతారావు గారి మేనకోడలు,కవయిత్రి శ్రీమతి శేషుకుమారి దంపతుల నెప్పల్లి స్వగృహం లో మా దంపతులకు ఆతిధ్యం -26-12-14-

ప్రముఖ సాహితీ విమర్శకుడు , ఆత్మీయుడు స్వర్గీయ టిఎల్.కాంతారావు గారి మేనకోడలు,కవయిత్రి  శ్రీమతి శేషుకుమారి దంపతుల నెప్పల్లి స్వగృహం లో మా దంపతులకు ఆతిధ్యం -26-12-14-

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బాల చంద్రన్ -అర్బన్ లిబరల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంట్లో ఇవాళ 25-12-14గురువారం కొడుకు లు కోడళ్ళు మనవలు మనవరాళ్ళ అనుకోని కలయిక 

మా ఇంట్లో ఇవాళ 25-12-14గురువారం  కొడుకు లు కోడళ్ళు మనవలు మనవరాళ్ళ అనుకోని కలయిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘భారతరత్న’కు సార్థకత

‘భారతరత్న’కు సార్థకత

  • 25/12/2014
TAGS:

ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ దేశంకంటె గొప్పవాడు కాజాలడు…ఒక రాజకీయ పక్షం ఎంత శక్తివంతమైనదైనా కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం కంటె శక్తివంతమైనది కాజాలదు. ఇలా సూత్రీకరించిన వాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. 1977లో మురార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో అటల్ బిహారీ విదేశ వ్యవహారాల మంత్రి…పదవీ స్వీకార ప్రమాణం చేసిన రోజున సాయంత్రం కొత్త ఢిల్లీలో జరిగిన సార్వజనికోత్సవ సభలో వాజ్‌పేయి ఈ సూత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సూత్రాన్ని ఆయన ప్రచారం చేయలేదు. పాటించి ప్రస్ఫుటింప చేశారు. అందుకే ఆయన కేవల రాజకీయవేత్త కాలేదు. రాజకీయ పరిధిని అతిక్రమించి రాజ్యాంగ విస్తృత భూమికను పండించిన ప్రజాస్వామ్య కృషీవలుడయ్యారు. జాతీయ సాంస్కృతిక సస్యక్షేత్ర ఆదర్శ హరితాంచల విధాయకుడయ్యారు. అంతర్జాతీయ ప్రసిద్ధిని పొందగలిగిన భరతమాత వరాల బిడ్డడయ్యారు. రాజకీయాలను, నైతిక నిష్ఠతో మెరుగులు దిద్దిన వాజ్‌పేయి భారత రత్న పురస్కార అలంకృతుడు కావడం భారతీయులందరికీ మోదం కలిగిస్తున్న పరిణామం. ‘మాతృదేవి’ ఆమోదం పొందిన చారిత్రక శుభఘట్టం. మహాత్మాగాంధీ వంటి మహనీయులకు సైతం ఆరాధ్యుడైన ‘మహామనా’ బిరుదాంకితుడైన మదన మోహన మాలవీయ పండితుడు క్రీస్తుశకం 1861 డిసెంబర్ 25న జన్మించారు. అదే డిసెంబర్ 25న 1924లో పుట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయి మాలవీయ వలెనే మాననీయుడు అయ్యారు. మదనమోహన మాలవీయ వారణాసి హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా జాతీయ సంస్కార శోభితులైన విద్యావంతులను తీర్చిదిద్దే కార్యక్రమానికి 1916లో శ్రీకారం చుట్టారు. ఇలాంటి విద్యావంతుల పరంపరలోనివాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. హైందవ జాతీయ సంస్కారానికి అద్దంలాగా భాసిస్తున్నారు అటల్ బిహారీ…ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంటునకు వనె్న తెచ్చారు. ప్రధానమంత్రిగా ఆ పదవీ గరిమెను పెంచారు. సుపరిపాలన పరిమళాలను పంచిపెట్టారు. మదన మోహన మాలవీయ పండితుని వంటి మరో పండితుడు అటల్ బిహారీ, స్వాతంత్య్ర సమరయోధుడు. మదనమోహన మాలవీయ పండితునికి లభించిన నాడే భారతరత్న వాజ్‌పేయికి కూడ లభించడంలోని ఔచిత్యం ఇది. మాలవీయ ప్రసంగం పావన గంగా ప్రవాహం వలె శ్రోతల హృదయసీమలను ముంచెత్తేదట. అటల్‌జీ ప్రసంగం మరో గంగా ప్రవాహం…గుండె గుండెలో మహానుభూతులు తరంగ భంగిమలను పొంగులెత్తించిన మధుర విన్యాసం. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని సింధే కీ ఛావనీ గ్రామంలో చిరు సరితగా జాలువారిన వాజ్‌పేయి జీవితం మహా సింధువు వలె భారతావని నలు చెరగులను ముంచెత్తింది. ఆయన జీవన ప్రస్థానం సమకాలీన భారత చరిత్రకు ప్రతిబింబం… శక్తివంతమైన ఆయన వ్యక్తిత్వం జనసంఘ్ రాజకీయ పక్షానికి కల్లోల కడలిలో చుక్కాని అయింది. భారతీయ జనతాపార్టీ ప్రగతి ప్రస్థాన కరదీపిక అయింది. ఉజ్వల కాంతుల విజయ కేతనమైంది. భారతి చరణారవిందాలను నిరంతరం స్పృశించిన కుసుమం ఆయన వ్యక్తిత్వం. మాతృగళ హారంలోని రత్నం. ఆయన సహజమైన సజీవమైన భారత రత్నం. భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కార ప్రదానం ఈ వాస్తవానికి సరికొత్త ధ్రువీకరణ మాత్రమే. ఇది ఆ పురస్కారాలకు లభించిన సార్థకత!
తక్షశిల, నలంద వంటి చోట్ల సహస్రాబ్దుల క్రితం విలసిల్లిన మహా విద్యాలయాల బోధనా సంప్రదాయాలను పునరుద్ధరించడానికై మదనమోహన మాలవీయ ప్రారంభించిన జాతీయ సంస్థ వారణాసి విశ్వవిద్యాలయం. అన్ని రంగాలకు ఆధారభూతమైనది విద్యారంగమన్న వాస్తవానికి అనుగుణంగా మాలవీయ ఈ మహత్తర సంస్థను నిర్మించారు. శీలవంతులైన విద్యావంతులు జాతికి, జగతికి హితం కలిగిస్తారు. శీలం లేని విద్యావంతులు రాక్షసులుగా మారి సమాజ విఘాతం కలిగిస్తారు. ఇదీ చరిత్ర! మాలవీయ స్వాతంత్య్ర సమర యోధుడు, సామాజిక ఉద్యమ వీరుడు, దళిత జనోద్ధారకుడు, ఆచార్యుడు, కవి, పండితుడు, పత్రికా సంపాదకుడు, న్యాయవాది. కానీ వ్యక్తులను శీలవంతులుగా దిద్దే విద్యావేత్తగానే ఆయన ప్రసిద్ధుడు. అందుకే మదన మోహన మాలవీయ వ్యక్తి నిర్మాణ ఉద్యమం- ఎమ్.ఎమ్.ఎమ్-గా వినుతికెక్కారు. అయితే ఆయనకిప్పుడు భారత రత్న పురస్కారం ఇవ్వడం కొత్త వివాదాలకు, విచిత్ర పరిణామాలకు దోహదం చేయవచ్చు. 150 ఏళ్ల క్రితం జన్మించి 68 ఏళ్లకు పూర్వం పార్థివ దేహ పరిత్యాగం చేసిన ఆ మహనీయునికి సమకాలీనులైన మహనీయులు మరెందరో ఉన్నారు. బంకించంద్రుడు, లోక మాన్యుడు, వివేకానందుడు, లాలాలజపతిరాయ్…ఇంకా ఎందరో ఉన్నారు. వారందరికీ భారతరత్న పురస్కారం అవసరమా? ఈ సనాతన భూమి అనాది చరిత్రలో భారతరత్నాలు అసంఖ్యాకులు. అందువల్ల ఈ పురస్కారాన్ని వర్తమాన జాతీయ స్ఫూర్తి ప్రదాతలకు పరిమితం చేయడం మేలు. అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఇలాంటి వర్తమాన వాస్తవం…
అటల్ బిహారీ వాజ్‌పేయి జాతీయ భావనిష్ఠకు 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం శ్రీకారం. 18 ఏళ్ల వాజ్‌పేయిని బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించి, కారాగృహం పాలు చేసింది. 1975 నాటి ఎమర్జెన్సీ నాటి ఆయన జైలు జీవితం ఈ శ్రీకారానికి శిఖరం. రాజకీయపక్ష సంకుచిత ప్రయోజనం కంటె స్వజాతి హితం మిన్న అని విశ్వసించి సమాచరించిన రాజనీతిజ్ఞుడు అటల్ జీ. బంగ్లాదేశ్ అవతరణకు దారితీసిన యుద్ధ సమయంలో ఆయన జనసంఘ్ నాయకుడు, ఇందిరాగాంధీకి వ్యతిరేక పక్షంవాడు. కానీ యుద్ధ విజయం సాధించిన ఇందిరను ఆయన ‘దుర్గాదేవి’గా అభివర్ణిచారు. 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అణు పరీక్ష నిర్వహించినప్పుడు అభినందించిన జాతి హిత చింతకుడు వాజ్‌పేయి. 1993లో ఆయన పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు. భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పక్షం అధినేత. పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో మన దేశానికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టింది. మన ప్రభుత్వం మానవ అధికారాలను మంట గలుపుతోందన్నది ఆరోపణ. అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు అభ్యర్థనపై వాజ్‌పేయి మన ప్రతినిది బృందానికి నాయకత్వం వహించారు. సమితి సభకు వెళ్లి పాకిస్తాన్ తీర్మానాన్ని వమ్ము చేసి విజయుడై తిరిగి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడం జాతి హితానికి వాజ్‌పేయి యిచ్చిన ప్రాధాన్యానికి చెరగని సాక్ష్యం…ప్రధానిగా ఉండిన సమయంలో వాజ్‌పేయి సుపరిపాలనకు నమూనాను నిలబెట్టారు. ఆంతరంగిక భద్రత, ఆర్థిక భద్రత సరిహద్దుల భద్రత, సాంస్కృతిక చైతన్యం…ఇవన్నీ సుపరిపాలన స్వభావ స్వరూపాలు. వాజ్‌పేయి పాలన ఈ స్వభావగీతాన్ని వినిపించింది..
పదవికి ప్రాధాన్యం ఇవ్వడం వాజ్‌పేయికి తెలియని విద్య. పదవులు ఆయనను వరించాయి. వరించిన పదవులను త్యజించడం ఆయనకు తృణప్రాయం. ‘‘నిరీహణమీశః తృణమివ తిరస్కార విషయః’’-నిస్వార్ధపరునికి అధికార పదవి గడ్డిపోచవలె తిరస్కార విషయం- అన్న చాణిక్య సూక్తి వాజ్‌పేయి జీవితాన్ని నడిపించింది. లాల్‌కృష్ణ అద్వానీ అభివర్ణించినట్టు అటల్ బిహారీ వ్యక్తిత్వం నిష్కలంకతకు సజీవ విగ్రహం…

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉక్కుకాకాని అమర్ హై

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పీరతి మేధా పనికి రాదా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరో రెండు రత్నాలు -ఎడిటోరియల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అటల్‌జీ నాకు చుక్కాని (ఎల్‌.కె. అద్వానీ)

అటల్‌జీ నాకు చుక్కాని (ఎల్‌.కె. అద్వానీ)
నా రాజకీయ జీవనం ప్రారంభమైనప్పటి నుంచి అందులో అంత ర్లీనంగా భాగమైన ఒకే ఒక వ్యక్తి అటల్‌ బిహారీ వాజ్‌పేయి. గత 50 సంవత్సరాలుగా పార్టీలో నాకు అత్యంత సన్నిహిత సహచరుడు.. ఆయన నాయకత్వాన్ని నేను ఎప్పుడూ ఎలాంటి సందేహం లేకుండా అంగీకరించాను.
అటల్‌జీ 1948లో జాతీయవాద వారపత్రిక ‘పాంచజన్య’కు సంస్థాపక సంపాదకుడిగా పనిచేశారు. దాన్ని క్రమం తప్పకుండా నేను చదువుతున్నందువల్ల ఆయన పేరు అప్పటికే నాకు సుపరిచితం. శక్తివంతమైన ఆయన సంపాదకీయాల్నీ, అప్పుడప్పుడు ప్రచురించే ఆయన కవితల్నీ చదివి నేనెంతో ఉత్తేజితుడినయ్యేవాడిని. ధర్మప్రకాశన్‌ ఆధ్వర్యంలో లక్నోలో ఈ పత్రికను ప్రారంభించిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాద్యాయ ఆలోచనల్ని కూడా తెలుసుకునేందుకు అది అవకాశం కల్పించింది. రకరకాల పేర్లతో వ్యాసాలు రాయడమే కాక ప్రూఫ్‌రీడర్‌, కంపోజర్‌, బైండర్‌, మేనేజర్‌గా కూడా వారు పనిచేశారు. అప్పుడప్పుడే హిందీ నేర్చుకున్న నాలాంటి వారికి ఆ భాషలోని అంతర్లీనమైన సౌందర్యం, స్వచ్ఛత, దేశభక్తితో కూడిన ప్రేరణ కల్పించే అపార సామర్థ్యం పాంచజన్య ద్వారా అర్థమయ్యేవి.
1952లో నేను తొలిసారి అటల్‌జీని క లిశాను. భారతీయ జనసంఘ్‌కు చెందిన యువకార్యకర్తగా ఆయన రాజస్తాన్‌లోని కోటా నుంచి వెళుతున్నారు. అక్కడ నేను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేస్తున్నాను. కొత్తగా ఏర్పడిన పార్టీకి ప్రజల్లో ఆదరణ కల్పించడం కోసం ఆయన డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీతో పాటు రైలులో వెళుతున్నారు. ఆ రోజుల్లో అటల్‌జీ డాక్టర్‌ ముఖర్జీ రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు. అస్పష్టంగా ఉన్న ఆయన రూపురేఖలు నా మనస్సులో ఇంకా ముద్రితమై ఉన్నాయి. ఒక యువ రాజకీయ కార్యకర్తగా వాజ్‌పేయ్‌ సన్నగా ఉండేవారు. నేను కాస్త పొడవు కాబట్టి ఆయనకంటే సన్నగా కనిపించే వాడిని. యవ్వనపు ఆదర్శ భావాలు ఆయన పుణికి పుచ్చుకున్నారని నాకు సులభంగా అర్థమైంది. రాజకీయాల్లో ప్రవేశించినా, ఆయన చుట్టూ ఒక కవితాత్మక ఆకర్షణ నెలకొని ఉండేది. ఆయనలో ఏదో ఒక శక్తి జ్వలిస్తున్నట్లు కనిపించేది. ఆయనలోని అంతర్జ్వాల ఆయన ముఖంపై ప్రస్పుటంగా గోచరించేది. అప్పుడాయన వయసు 27 లేదా 28 సంవత్సరాలు ఉండవచ్చు. ఈ మొదటి పర్యటన ముగిసేనాటికి వాజ్‌పేయి ఒక అసాధారణమైన యువకుడని, ఆయన గురించి నేను తెలుసుకోవాలని నాలో నేను అనుకున్నాను. ఆ తర్వాత ఆయన రెండో సారి పర్యటనకు వచ్చారు. అద్భుతమైన ఆయన వ్యక్తిత్వం, లక్షలాది మంది ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేయగలగిన ప్రతిభావంతమైన ఆయన వక్తృత్వం, హిందీ భాషపై అసాధారణమైన ఆధిపత్యం, అత్యంత తీవ్రమైన రాజకీయ అంశాలపై కూడా చమత్కారికంగా, వ్యంగ్యంగా వ్యక్తీకరించగలిగిన ఆయన సామర్థ్యం.. ఇవన్నీ నా పై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపాయి. ఆయన రెండో పర్యటన ముగిసేనాటికి ఆయన ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడని ఒకరోజు భారతదే శానికి నాయకత్వం వహించగలిగిన లక్షణాలు ఆయనలో ఉన్నాయనే అభిప్రాయం నాకు ఏర్పడింది.
1957లో అటల్‌జీ పార్లమెంటుకు ఎన్నికైన తరువాత దీన్‌దయాళ్‌జీ నాకు సంబంధించిన మరో చర్య తీసుకున్నారు. రాజస్థాన్‌ నుంచి ఢి ల్లీకి మారి పార్లమెంటు పనిలో అటల్‌జీకి సహాయపడాల్సిందిగా దీన్‌దయాళ్‌జీ నన్ను కోరారు. అప్పటి నుంచి అటల్‌జీ, నేను జనసంఘ్‌, తరువాత బీజేపీ ప్రతి పరిణామ దశలోనూ కలిసికట్టుగా పనిచేశాము. లోక్‌సభలో ప్రవేశించిన తరువాత ఆయన పార్లమెంటులో పార్టీ వాణిని వినిపించారు. పార్టీకి సంఖ్యాబలం ఏమాత్రం లేకపోయినా, ఆయన అంతకు మించి ప్రతిష్టను గడించారు. 1968 ఫిబ్రవరిలో దీన్‌దయాళ్‌జీ విషాద మరణం తరువాత ఆయన పార్టీ అధ్యక్షపదవీ బాధ్యతల్ని కూడా చేపట్టవలసివచ్చింది. పార్టీ చరిత్రలో అది అత్యంత సంక్లిష్ట సమయం అయినప్పటికీ ఈ సంక్షోభం నుంచి జనసంఘ్‌ను ఆయన కాపాడి సమర్థవంతమైన నాయకుడిగా నిరూపించుకున్నారు. కార్యకర్తలు, మద్దతుదారుల్లో అటల్‌బిహారీ అధంకారంలో వెలుగురేఖలా భాసిల్లారు. అదే అప్పుడు వారి నినాదమైంది. (అంధేరీ మే ఏక్‌ చిన్గారీ… అట్‌ బిహారీ.. అటల్‌ బిహారీ)
ఆ తరువాత తారాజువ్వలా ఎదిగేందుకు కారణం అయోధ్య ఉద్యమం. అయితే ఈ సమయంలో అట్‌జీ దాదాపు నిష్ర్కియంగా ఉండిపోయారు. అయితే 1996లో అటల్‌జీ 13 రోజుల ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన పార్టీ వైఫల్యం నుంచి 1998లో విజయవంతంగా అధికారాన్ని చేపట్టడం వరకూ ఆయన వ్యక్తిగత ఆదరణే ప్రదానాంశమైందని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ ఆకర్షణ పార్టీకున్న మద్దతుకంటే అతీతమైనది. మరోసారి మేమిద్దరమూ రాజకీయ అస్పృశ్యతా సంకెళ్లను చేధించి ఎన్‌డిఏను ఏర్పరచేందుకు కలిసికట్టుగా కృషి చేశాము.
కొన్ని దశాబ్దాలుగా కొంత మంది వ్యక్తుల ఊహిస్తున్నదానికి భిన్నంగా అటల్‌జీకి నాకు ఉన్న బాంధవ్యంలో ఏనాడూ పోటీతత్వంకానీ, సంఘర్షణకానీ తలెత్తలేదు. అయితే మామధ్య ఎప్పుడూ అభిప్రాయభేదాలు లేవని చెప్పడం నా ఉద్దేశం కాదు. అవును.. కొన్నిసార్లు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మా వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉండటం వల్ల సహజంగానే వ్యక్తులపై, సంఘటనలపై, సమస్యలపై మా అంచనాలు కూడా చాలా సందర్భాల్లో బిన్నంగా ఉన్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యానికి విలువిచ్చే ఏ సంస్థలోనైనా ఇది సహజమే. అయితే మా సంబంధాలు ఇంత ప్రగాఢంగా ఉండడానికి మూడు కారణాలు ఉన్నాయి. మొదట దేశం, తరువాత పార్టీ, తరువాత వ్యక్తి ప్రయోజనానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తమ సభ్యులందరికీ పిలుపునిచ్చిన జనసంఘ్‌, బిజెపి సిద్ధాంతమూ, ఆదర్శాలు, విలువలను మేము బలంగా పంచుకున్నాము. పరస్పర విశ్వాసం, గౌరవాన్ని తగ్గించే విధంగా మేము మా అభిప్రాయాలకు ఏనాడూ తావివ్వలేదు. కానీ మూడవ అత్యంత ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది నేను ఎలాంటి ప్రశ్నలకూ తావివ్వకుండా నా అంతరాంతరాల్లో కూడా అటల్‌జీని నా సీనియర్‌గా, నా నాయకుడిగా అంగీకరించాను. అయితే, నా పట్ల అటల్‌జీ అనుసరించిన సర్దుబాటు ధోరణిని కూడా నేను ఇక్కడ ప్రస్తావించాలి. కొన్ని అంశాలపై నా ఆలోచన ఫలానా విధంగా ఉన్నదని ఆయనకు తెలిస్తే దానిపై తనకు పెద్ద వ్యతిరేక అభిప్రాయం లేకపోతే ఆయన దాన్ని అంగీకరించేవారు. ‘అద్వానీజీ ఏం చెప్పారో అదే సరైనది..’ అనేవారు. ఆ తరువాత మేము చర్చిస్తున్న విషయం అంతటితో సుఖాంతమయ్యేది.
లెక్కలేనన్ని సందర్భాల్లో అటల్‌జీతో నేను గడిపిన క్షణాల్ని తరచిచూస్తే, ఆయనకు ఈ నివాళిని ముగించే ఉత్తమ మార్గం గురించి ఆలోచిస్తుంటే నాకు 1959 ప్రాంతంలో మేమిద్దరమూ కలిసి చూసిన ఒక సినిమా గుర్తుకొస్తుంది. హిందీ సినిమాలను కలిసి చూడటం మా ఇద్దరికీ ఇష్టమైన అలవాటు. 1970 ద్వితీయార్థం వరకూ మేము ఢిల్లీలో రీగల్‌, ఇతర సినిమా హాళ్లకు కలిసి వెళ్లే వాళ్లం. అటల్‌జీ, నేను జనసంఘ్‌కు చెందిన వందలాది కార్యకర్తలతో కలిసి ఢిల్లీ మున్సిల్‌ కార్పొరేషన్‌ ఉప ఎన్నికల్లో కష్టపడి పనిచేశాము. మా ప్రయత్నాలు ఎన్ని చేసినా విజయం లభించకపోవడంతో నిరాశకు గురయ్యాం. ‘చలో కోయీ సినిమా దేఖ్‌నే చల్‌తే హై.’ అని అటల్‌జీ నాకు చెప్పారు. మేమిద్దరం పహాడ్‌గంజ్‌లో ఉన్న ఇంపీరియల్‌ సినిమాకు వెళ్లి ప్రముఖ నటుడు, నిర్మాత రాజ్‌కపూర్‌ నటించిన ఒక సినిమాను చూశాము. దాస్తో విస్కీ ప్రతిష్టాత్మక నవల ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ ఆధారంగా నిర్మించిన ఆ సినిమా భారత స్వాతంత్య్రం తరువాత జరిగిన ఘటనల్ని చిత్రీకరించింది. నెహ్రూకాలంలో హామీలు నెరవేరకపోవడంతో భ్రమలు కోల్పోయిన ప్రజల గురించి, పేదలకు జరిగిన అన్యాయాల గురించి అది చిత్రీకరించింది. అయితే నవోదయం రానున్నదని, ప్రజలు సహనంగా, విశ్వాసంగా ఉండాలని ఆ సినిమా పిలుపునిచ్చింది. దాని ఆశావహ సందేశం అటల్‌జీలో, నాలో ఉన్న నిరాశను పోగొట్టేవిధంగా ఉంది. ఆ సినిమా పేరు కూడా ‘ఫిర్‌ సుబాహోగీ’.
(అద్వానీ ఆత్మకథ ‘నా దేశం నా జీవితం’ నుంచి..)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇద్దరు భారత రత్నాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జమ్మూలో హీరో కాశ్మీర లో జీరో అయిన మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒరిగిన దర్శక శిఖరం

ఒరిగిన దర్శక శిఖరం

కథా రచయిత, స్ర్కీన్‌ప్లే రైటర్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌… అన్ని విభాగాల్లోను లెజండ్‌ అనిపించుకున్న సృజనాత్మక కళాకారుడు కె.బాలచందర్‌. విలక్షణమైన దర్శకత్వ శైలి, అసాధారణ కథాకథనాలతో, సమకాలీన సాంఘిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించిన తీరు బాలచందర్‌ను భారతీయ సినిమా శిఖరాగ్రాన నిలిపాయి.
తమిళ సినిమా దర్శక శిఖరంగా కొలిచింది. తెలుగులో కొద్ది సినిమాలే చేసినా వాటితో ‘మరో చరిత్ర’ సృష్టించారు. అంతర్గత మానవ సంబంధాలు, సామాజిక నేపథ్యాలు, సాహసోపేతమైన స్ర్తీ కథా పాత్రలు కేంద్రబిందువుగా మధ్యతరగతి జీవితాలను అనితరసాధ్యంగా ఆవిష్కరించడం ద్వారా వెండితెరపై ఓ విప్లవాన్నే సృష్టించారు బాలచందర్‌. స్ర్కీన్‌ రైటర్‌గా ఇండస్ర్టీలో అడుగుపెట్టి, దర్శక దిగ్గజంగా ఎదిగారు. దర్శకుడిగా 100కిపైగా సినిమాలు తెరకెక్కించి, నిర్మాతగా కవితాలయ ప్రొడక్షన్స్‌ పతాకంపై 58 చిత్రాలు నిర్మించి, ఎందరో తారలకు ప్రకాశాన్నిచ్చారు.
ఆయన తీసినవన్నీ కథాబలం ఉన్న సినిమాలే. మధ్యతరగతి కుటుంబాల్లోని సహజమైన పాత్రలతో ఆయన తీసినన్ని చిత్రాలు మరే దర్శకుడూ తియ్యలేదనేది నిర్వివాదం. కుటుంబ బంధాలు, సాంఘిక అసమానతలను చాలా లోతుగా చూపించి, వాటికి చక్కని పరిష్కారాలు కూడా చూపిన దర్శక రచయిత బాలచందర్‌. ఆయన సినిమాలు కళాత్మకతకు అద్దం పడుతూనే, కాసుల వర్షం కురిపించాయి. విమర్శకుల ప్రశంసలందుకుంటూనే కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించాయి. ఆయన కథలు, కథనశైలి, పాత్రలు విలక్షణమైన, వైవిధ్యమైన దర్శకుడిగా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో కొత్త దర్శకులు వచ్చినా, కమర్షియల్‌ సక్సెస్‌లు అందుకున్నా బాలచందర్‌ స్థానం చెక్కుచెదరలేదు. తన సినిమాలతో, తను సృష్టించిన సినీ ధృవతారలతో ఐదు దశాబ్ధాలుగా భారతీయ సినిమాలో ‘శిఖరం’గా నిలబడ్డారు. నటీనటుల నుండి నటన రాబట్టుకోవడంలోను, తను ఎంచుకున్న కథలను వెండితెరపై ఆవిష్కరించడంలోను బాలచందర్‌ శైలే వేరు. ఆయన సినిమాలపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు కూడా జరిగాయి.
బాల్యం – నాటకాల్లో ప్రాచుర్యం….
పూర్తి పేరు కైలాసం బాలచందర్‌. 1930, జూలై 9న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తంజావూరు జిల్లాలోని నన్నిలయం ఆయన స్వస్థలం. ప్రాథమిక విద్య అక్కడే జరిగింది. అన్నామలై విశ్వవిద్యాలయంలో జుయాలజీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనంతరం తిరువారూర్‌ జిల్లా ముత్తుపేటలో పాఠశాల టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. ఏడాది తరువాత మద్రాసులో అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో అప్రెంటిస్‌ క్లర్క్‌గా చేరారు. ఆ సమయంలో మద్రాసులో నాటకాలు ఎక్కువగా ప్రదర్శితమవుతుండేవి. ఉదోగ్యం చేస్తూనే నాటకాల వైపు ఆకర్షితులయ్యారు బాలచందర్‌. యునైటెడ్‌ అమెచ్యూర్‌ ఆర్టిస్ట్స్‌ అనే డ్రామా కంపెనీలో చేరారు. కొన్నాళ్లకి ఆంగ్లంలో ‘మేజర్‌ చంద్రకాంత్‌’ అనే నాటకాన్ని రాశారు. అప్పట్లో మద్రాసులో ఆంగ్లంపై ప్రజలకి అంత పట్టులేకపోవడంతో తిరిగి తమిళంలోకి అనువదించారు. సొంతంగా ఒక డ్రామా ట్రూప్‌ను ఏర్పాటుచేసుకొని ‘మేజర్‌ చంద్రకాంత్‌’ నాటకాన్ని ప్రదర్శించారు. ప్రజల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. పెద్ద సెన్సేషన్‌ సృష్టించింది. ఆ తరువాత స్వీయ దర్శకత్వంలో ‘సర్వర్‌ సుందరం’, ‘నీర్‌కుమిళి’ (నీటి బుడగ), ‘మెళుగువర్తి’ (కొవ్వొత్తి), ‘నానల్‌’ (పొడవాటి గడ్డి), ‘నవగ్రహం’ వంటి బహుప్రాచుర్యం పొందిన నాటకాలను ప్రదర్శించి, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
నాటకాలకు అపూర్వ జనాదరణ…
కేబీ నాటక రచనా కౌశలం గురించి విన్న పురట్చి తలైవర్‌ ఎంజీఆర్‌ తన ‘దైవతాయ్‌’ (1965) సినిమాకి స్ర్కీన్‌ప్లే, డైలాగులు రాయమన్నారు. అయితే అప్పటి వరకు నాటక అనుభవమే కలిగిన కేబీకి అపరిమిత ప్రజాదరణ కలిగిన ఎంజీఆర్‌ సినిమాకి మాటలు రాయడం కష్టమనిపించింది. తరువాత రోజుల్లో ఓ సందర్భంలో ఈ విషయాన్ని గుర్తుచేసుకొంటూ ‘ఆ సమయంలో నా పరిస్థితి నీటిలో నుండి బయటపడ్డ చేపలా ఉంది’ అని చెప్పారు. మొత్తానికి ‘దైవతాయ్‌’ నిర్మాత ఆర్‌ఎం వీరప్పన్‌ సాయంతో జనాదరణ పొందే విధంగా డైలాగులు రాయగలిగారు. నెమ్మదిగా ఎంజీఆర్‌ క్రేజ్‌, ఇమేజ్‌కి తగ్గట్టుగా డైలాగులు రాయడంలో పట్టు సాధించారు. అప్పుడే వినోదాత్మకంగా విశేష ప్రజాదరణ పొందిన ‘సర్వర్‌ సుందరం’ నాటకాన్ని సినిమాగా మలచాలని ఆనాటి దిగ్గజ నిర్మాత ఆవిచ్చి మెయ్యప్ప (ఏవీఎం) చెట్టియార్‌ నిర్ణయించి, బాలచందర్‌ నుండి హక్కుల్ని కొనుగోలు చేశారు. ఈ నాటకంలో నటించిన నాగేష్‌నే కథానాయకుడిగా పెట్టి కృష్ణన్‌ పంజు దర్శకత్వంలో ‘సర్వర్‌ సుందరం’ (1964) సినిమా తీశారు. అపూర్వ జనాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అవార్డులు, రివార్డులు దక్కాయి. అది తమిళ సినిమా ఆణిముత్యాల్లో ఒకటిగా నిలిచింది. కథా రచయితగా బాలచందర్‌ ప్రతిభ హిందీ దర్శకుల వరకూ పాకింది. ఆయన రాసిన తొలి నాటకం ‘మేజర్‌ చంద్రకాంత్‌’ను ‘ఊంచే లగే’ (1965) పేరుతో హిందీ సినిమా తీశారు. ఇది జాతీయ స్థాయిలో పేరు సాధించింది. అదే ఏడాది ముక్తా శ్రీనివాసన్‌ నిర్మించిన ‘పూజైక్కు వంద మలర్‌’కి డైలాగులు రాశారు.
దర్శకుడిగా ఆరంగేట్రం…
బాలచందర్‌ దర్శకత్వ ఆరంగేట్రం ఓ సంచలనం. తొలి సినిమాతోనే దర్శకుడిగా తనదైన ముద్ర వేసి, తమిళ సినిమాని తనవైపు తిప్పుకున్న అపార ప్రతిభాశాలి. ఆ సమయంలో సినిమాలన్నీ కథానాయక ప్రధానమైనవే. వాటికి భిన్నంగా సినిమా తీయాలన్న ఉద్దేశ్యంతో – మధ్య తరగతి కుటుంబ జీవితాలను వెండితెరపై ఆవిష్కరించాలనుకున్నారు. తను రాసిన నాటిక ‘నీర్‌కుమిళి’నని సినిమాగా తీయాలని నిర్ణయించి, మెగాఫోన్‌ పట్టారు. తొలి చిత్రంతోనే కొత్త ట్రెండ్‌ సృష్టించారు. అప్పటి వరకు వెండితెరపై హీరోయిజాన్నే చూసిన ప్రేక్షకులకు ‘నీర్‌కుమిళి’ (1965) కొత్త అనుభూతిని పంచింది. మధ్య తరగతి జీవితాలు ఆ పాత్రల్లో ప్రతిబింబించడంతో ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సినిమా మొత్తం దాదాపుగా ఒక సెట్‌లోనే తీసేశారు. సహజత్వానికి దగ్గరగా ఆయన తెరకెక్కించిన తీరు అందరికీ బాగా నచ్చింది. సినిమా హిట్టయ్యింది, దర్శకుడిగా కె.బాలచందర్‌కి గుర్తింపు వచ్చింది. తన నాటక బృందంలో ఉన్న నటీనటులతోనే ఈ సినిమా తీశారు. ఇక ఆ తరువాత దర్శకుడిగా బాలచందర్‌ ప్రస్థానం అప్రతహరితంగా కొనసాగింది. తను రాసిన నాటకాలనే సినిమాలుగా మలచి విజయాలందుకున్నారు. ‘నానల్‌’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’, ‘ఎదిర్‌ నీచ్చల్‌’ వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. తెలుగులో ‘అంతులేని కథ’, ‘మరో చరిత్ర’, ‘ఆకలి రాజ్యం’, ‘తొలికోడి కూసింది’, ‘కోకిలమ్మ’, ‘రుద్రవీణ’ వంటి ఆణిముత్యాలను రూపొందించారు. ‘మరో చరిత్ర’ను హిందీలో ‘ఏక్‌ దూజే కేలియా’గా రీమేక్‌ చేసి, అక్కడా నీరాజనం అందుకున్నారు.
నటుడిగా…
1996లో వచ్చిన ‘కల్కి’లో తొలిసారిగా వెండితెరపై కనిపించారు బాలచందర్‌. సినీ దర్శకుడిగానే ఆయన కనిపిస్తారు. ఆ తరువాత 2006లో తెలుగు నటుడు ఉదయ్‌ కిరణ్‌తో తీసిన ‘పొయ్‌’ చిత్రంలో అతిథి పాత్ర పోషించారు. అప్పటికి నాలుగేళ్ల తరువాత బాలచందర్‌ ప్రధాన పాత్రలో ‘రెట్టై సుళి’ వచ్చింది. కొత్త దర్శకుడు తామిరై తెరకెక్కించిన ఈ చిత్రంలో మరో దర్శక దిగ్గజం భారతీరాజా కూడా నటించారు. ఈ ఏడాదిలోనే వచ్చిన ‘నిన్నైత్తదు యారో’ చిత్రంలో గెస్ట్‌ రోల్‌ చేసిన బాలచందర్‌ తన ప్రియ శిష్యుల్లో ఒకరైన కమల్‌హాసన్‌ నటిస్తున్న ‘ఉత్తమ విలన్‌’లో నటించారు. ఈ సినిమా ఫైనల్‌ కాపీ పూర్తి కాకముందే ఆస్పత్రి పాలయ్యారు.
ధృవ‘తార’ల సృష్టికర్త…
భారతీయ సినిమాకి ముఖ్యంగా దక్షిణాదికి గొప్ప గొప్ప నటీనటులను, సాంకేతిక నిపుణులను అందించారు బాలచందర్‌. ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఉలగ నాయకుడు కమల్‌హాసన్‌, మ్యూజిక్‌ మ్యాస్ర్టో ఏఆర్‌ రెహ్మాన్‌లను పరిచయం చేసింది ఆయనే. నాజర్‌, సరిత, వివేక్‌, విమలారామన్‌… చెప్పుకుంటూనే పోతే 1980ల నుండి ఇప్పటి వరకు తమిళ, తెలుగు సినీ పరిశ్రమలను ఏలుతున్న అగ్ర నటీనటుల్లో చాలా వరకు బాలచందర్‌ శిష్యులే. తను తీసిన సినిమాల్లాగే 100 మందికిపైగా తారలను వెండితెరకు పరిచయం చేశారు. కమల్‌హాసన్‌ అత్యధికంగా 35 చిత్రాల్లో నటించారు. కథానాయికల్లో సరిత 22 సినిమాల్లో నటించింది.
తెలుగులో…
తమిళంలో ఘన విజయం సాధించిన ‘భామా విజయం’ను ‘భలే కోడళ్లు’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. ‘సుఖదుఃఖాలు’, ‘చిరంజీవి’, ‘సంబరాల రాంబాబు’, ‘జీవితతరంగం’, ‘తూర్పు పడమర’ చిత్రాలకు స్ర్కీన్‌ప్లే రచయిత. దర్శకుడిగా ‘భలే కోడళ్లు’ (1968), ‘సత్తెకాలపు సత్తయ్య’ (1969), ‘బొమ్మా బొరుసా’ (1971), ‘అంతులేని కథ’ (1976), ‘మరో చరిత్ర’ (1978), ‘అందమైన అనుభవం’ ‘1979), ‘గుప్పెడు మనసు’ (1979), ‘ఇది కథ కాదు’ (1979), ‘ఆకలి రాజ్యం’ (1981), ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ (1981), ‘47 రోజులు’ (1981), ‘తొలికోడి కూసింది’ (1981), ‘కోకిలమ్మ’ (1983), ‘రుద్రవీణ’ (1988) వంటి మంచి చిత్రాలు అందించారు.‘భామా విజయం’, ‘సర్వర్‌ సుందరం’ వినోదాత్మక చిత్రాలుగా ఎంతో పేరుతెచ్చాయి.
అవార్డులకే వన్నెతెచ్చిన బాలచంద్రుడు…
9 జాతీయ అవార్డులు, 13 ఫిలిం ఫేర్‌ అవార్డులు, 10 రాష్ట్ర అవార్డులు, 4 నంది అవార్డులు, 3 గౌరవ డాక్టరేట్‌లు.. చెప్పుకుంటూ పోతే బాలచందర్‌ కీర్తిసిగలో అవార్డులు ఎన్నో ఎన్నెన్నో! వినోద రంగంలో ఆయన చేసిన సేవలకు 1987లో పద్మశ్రీ వరించింది. 2010లో ఇండియన్‌ సినిమాలోనే అతిపెద్ద పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే, 2011లో ప్రతిష్టాత్మక ఏఎన్‌ఆర్‌ జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 1970లో తమిళనాడు రాష్ట్ర అత్యుతన్న పురస్కారం కలైమామణి దాసోహమంది. ఇక వివిధ సంస్థలు ఇచ్చిన అవార్డులు, చేసిన సన్మానాలకు లెక్కేలేదు.
బాలచందర్ జర్నీ 1930-2014

కె.బాలచందర్‌ మంగళవారంనాడు సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కన్నుమూశారు. 84 ఏళ్ల బాలచందర్ కు భార్య, ముగ్గురు పిల్లలు. ఆయన భార్య పేరు రాజం. కైలాసం, ప్రసన్న అనే ఇద్దరు కుమారులు. పుష్ప కందస్వామి అనే కుమార్తె.
సినిమారంగంలో ఎంతోమందిని నటీనటులుగా, సాంకేతిక సిబ్బందిని పరిచయం చేశారు. వారిలో కమల్‌ హాసన్‌, రజినీకాంత్‌, మమ్ముట్టి ముఖ్యులు. తమిళంలో చిరంజీవిని పరిచయం చేశారు. అదేవిధంగా శ్రీవిద్య, శ్రీదేవి, సరిత, వివేక్‌ (తమిళ హాస్య నటుడు) ప్రకాష్‌ రాజ్‌, వై. జి. మహేంద్రన్‌ (తమిళ నటుడు), సుజాత, చరణ్‌ (తమిళ దర్శకుడు), రమేష్‌ అరవింద్‌, మాధవి, జయసుధ, జయప్రద, శ్రీ ప్రియ, గీత, చార్లి (తమిళ హాస్య నటుడు), యువరాణి, విమలా రామన్‌ కూడా వున్నారు. సాంకేతిక విభాగంలో ఏ.ఆర్‌.రెహమాన్‌ ‘రోజా’ సినిమాను నిర్మించిన బాలచందర్‌, సంగీత దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చారు. తొలికోడి కూసింది, ఆకలిరాజ్యం, ఇదికథ కాదు, మరోచరిత్ర చిత్రాలు అప్పట్లో తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి.
నాటకాలతో తొలి అంకం
తమిళనాడు, తంజావూరు జిల్లాలోని నన్నిలం గ్రామం ఆయన స్వస్థలం. వస్త్రాలపై వేసే రంగురంగుల పెయింటింగులకు ఈ గ్రామం ప్రసిద్ధి. వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. నాన్న దండపాణి కైలాసం. అమ్మ సరస్వతి. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి బీయస్సీ పూర్తి చేశాడు. తరువాత అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో ఉద్యోగిగా ఆయన జీవితం ప్రారంభమైంది. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో సరదాగా నాటకాలు రాస్తుండేవాడు. అలా రాసిన ఒక నాటకం ఎం.జి. రామచంద్రన్‌ దృష్టిలో పడటంతో ఆయన్నుంచి ఆహ్వానం వచ్చింది. ఎంజీఆర్‌ నటించిన దైవతాయి అనే చిత్రానికి సంభాషణలు, స్క్రీన్‌ప్లే అందించాడు.
సినిమా ప్రవేశం:
ఆయన సినిమా పరిశ్రమలో అడుగు పెట్టేసరికి సినిమాలన్నీ హీరోయిజంతో నిండిన కథలే ఉండేవి. అంటే కథలన్నీ పురుష ప్రధానంగా సాగుతూ ఉండేవి. ఈ పంథాను మార్చడానికి, తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి ఆయన మధ్యతరగతి కుటుంబాలను, వారి ఆశలు, ఆశయాలను, ప్రేమను, అభిమానాలను కథా వస్తువులుగా ఎన్నుకొన్నాడు. ఆయన సినిమాలోని పాత్రలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి.
మొదటి సినిమా తరువాత ఆయన రాసిన నాటకాల్లో ఒకటైన ‘నీర్కుమిళి’ ని సినిమాగా తీశాడు. ఆ సినిమాలో అన్ని సన్నివేశాలు దాదాపు ఒకే సెట్‌‌లో ఉంటాయి. అలాంటి కథ అప్పటి ప్రేక్షకులకు కొత్త. అనుకున్నట్టే అది విజయం సాధించింది. దాంతో ఆయన చిత్ర దర్శకుడిగా మారాడు. తరువాత మేజర్‌ చంద్రకాంత్‌, ఎదిర్నేచ్చల్‌ లాంటి చిత్రాలు తీశాడు. అప్పుడాయనకు పెద్ద స్టార్లతో సినిమాలు తీయమని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ ఆయన ఎప్పుడూ హీరోలు దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేసుకోలేదు. ‘సర్వర్‌ సుందరం’ (1964) కథ తయారు చేసినప్పుడు మాత్రం ఆ పాత్రకు నగేష్‌ అయితే చక్కగా సరిపోతాడనిపించింది. అప్పటికి ఆయన చాలా బిజీ హాస్యనటుడు. కానీ ఆయన్ని కలిసి కథ వినిపించడంతో అందుకు అంగీకరించాడు. ఆ సినిమా బాలచందర్‌కు మేలిమలుపు నిచ్చింది. క్రిష్ణన్‌ పంజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే బాలచందర్‌ దానికి మాటలు రాశాడు. ఆ చిత్ర సంభాషణలకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అవకాశాలు బాగా పెరిగాయి.
ఉద్యోగం-సందేహం:
అవకాశాలు పెరగడంతో ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలా వద్దా? అని కొన్నాళ్ళు సందేహించాడు. అయితే మెయ్యప్పన్‌ అనే నిర్మాత ఆయనకు ధైర్యం చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేయించడమే కాకుండా వరుసగా మూడు అవకాశాలిచ్చాడు. దాంతో ఆయన సినిమా పరిశ్రమలో స్థిరపడ్డాడు.
అప్పట్లో ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో స్త్రీలు ఎదుర్కొనే బాధలు ఆయన కథల్ని బాగా ప్రభావితం చేశాయి. అలా వెలుగులోకి వచ్చినవే సుజాత నటించిన అంతులేని కథ, సుహాసిని ప్రధాన పాత్రలో వచ్చిన సింధుభైరవి, ప్రమీలతో తీసిన అరంగేట్రం. ‘సింధుభైరవి’లో మగవాడి సహాయం లేకుండా బ్రతకాలనుకునే పాత్ర సుహాసినిది. అరంగేట్రంలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కుటుంబాన్ని పోషించడం కోసం వేశ్యావృత్తిని స్వీకరిస్తుంది. అప్పటి సమాజంలో ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసేవారు కావడంతో ఈ కథలు వివాదాస్పదం అయ్యేవి. అంతేకాదు అప్పట్లో వచ్చే సినిమాల్లో విషాదాంతాలు ఉండేవి కావు. చాలావరకు పెళ్ళితో అంతమయ్యేవే. కానీ ఆయన సినిమాలు అందుకు భిన్నంగా ఉండేవి.
చిరంజీవితో….
చిరంజీవి, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రవీణ గ్రామాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్న ఓ యువకుడి కథ. దీనికి ఆయన ఆ చిత్ర నిర్మాత నాగేంద్రబాబుతో కలిసి ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు. కమల్‌ హాసన్‌, సరిత నటించిన ‘మరో చరిత్ర’ అప్పట్లో యువతను బాగా ఆకట్టుకున్న విషాదాంత ప్రేమకథ.
అందుకున్న పురస్కారాలు:
1973 లో తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి పురస్కారం, 1982లో ఏక్‌ దూజే కేలియే సినిమాకు గాను ఫిల్మ్‌ ఫేర్‌ ఉత్తమ స్క్రీన్‌ ప్లే అవార్డు గెలుచుకున్నారు. 1987లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం. 1989లో రుద్రవీణ సినిమా కోసం జాతీయ స్థాయిలో నర్గీస్‌ దత్‌ అవార్డు, వెండి కమలం బహుమతుల్ని చిరంజీవి, నాగేంద్రబాబులతో పంచుకున్నారు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాన పాటల వాణి అనేవాళ్ళు – వాణీవిశ్వనాథ్‌

వాన పాటల వాణి అనేవాళ్ళు – వాణీవిశ్వనాథ్‌

ఇదేమీ వర్షాకాలం కాదు. వణికిస్తున్న చలికాలం. అయితే వాణీవిశ్వనాథ్‌ గుర్తుకొస్తే.. వర్షంలో తడిసి ముద్దవుతాం. అప్పట్లో – ఒంపు ఒంపున హంపి శిల్పంలా పల్చటి సిల్కుచీరల మీద.. ఆ వయ్యారి ఒలకబోసిన అందాలకు దాసోహం అవ్వని ప్రేక్షకులు లేరు. వానపాటలంటే వాణీవిశ్వనాథే చెయ్యాలి అనేంత పేరు తెచ్చుకుందీ సుందరి. హీరోలతో పోటీపడి నటిస్తూ.. అదిరిపోయే స్టెప్పులేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకముద్రను చాటుకున్న వాణి.. అవకాశాలున్నప్పుడే.. బయటికొచ్చి ఓ మలయాళీ విలన్‌ను ప్రేమించి.. సెటిల్‌ అయిపోయింది.. ఇద్దరు పిల్లలతో హాయిగా కాలం వెల్లదీస్తున్న ఆమెను కదిపింది ‘నవ్య’..
అదే నా గ్లామర్‌ రహస్యం
నాకు ఇద్దరు పిల్లలు. 2003లో పాప ఆర్చ, 2008లో బాబు అద్రి పుట్టారు. వారితోనే లైఫ్‌ సాగిపోతోంది. మంచి అవకాశాలు వస్తున్నప్పుడే పరిశ్రమ నుంచి తప్పుకున్నాను. ఒకవైపు సినిమా ఛాన్సులు, మరోవైపు భర్త ఈ రెండింటిలో – భర్తే ప్రధానమనిపించింది. మంచి భర్త దొరకడం అదృష్టం. పెళ్లయిన తరువాత మనం మనల్ని చాలా మార్చుకోవాలి. హీరోయిన్‌గా వున్నప్పుడు నలుగురు సర్వెంట్లు వుండేవారు. అన్ని చోట్లా అలాగే కావాలనుకుంటే మన జీవితం చెడిపోయినట్లే..శ్రీ ఒక ఇంటికి ఇల్లాలైన తరువాత అన్నీ మనమే చూసుకోవాలి. మా ఇంటివరకు అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఒకరకంగా ఇంట్లో పనే నా గ్లామర్‌ రహస్యం!
రజనీతో నటించలేకపోయా..
పెద్ద నటులతో నటించే అవకాశం రావడం గొప్పగానే వున్నా అది కూడా నాకు మైనస్‌ అయిందేమో అనిపిస్తుంది. ఎన్‌టీఆర్‌తో చేయడం వల్ల బాలకృష్ణ గారితో కలిసి నటించలేకపోయా. వెంకటేష్‌గారితోను మిస్‌ అయ్యా! ఆయనతో ఓ సినిమా ప్రారంభమైనా ఎందుకో అది మధ్యలోనే ఆగిపోయింది. ఇక నా అభిమాన నటుడు రజనీకాంత్‌తో కలిసి పని చేసే అవకాశం రాలేదు. ఇది ఎప్పటికీ నాకు లోటే. 6వ తరగతి చదువుతున్న మా పాప ఇటీవల తన స్కూల్లో ‘రజనీకాంత్‌ జీవితం’పై వకృత్త్వ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించింది. అదే నాకు కొంత ఊరట.
ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత
ఎంతోమంది గొప్ప నటులతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ఎన్‌టీఆర్‌ వద్ద తోటివారిని గౌరవించడం నేర్చుకున్నాను. చిరంజీవి గారి వద్ద టైం పంక్చువాలిటీకి ఉన్న విలువను తెలుసుకున్నాను. ఆయనతో డ్యాన్స్‌ చేయడమంటే మాటలా? నేను టెన్షన్‌ పడకుండా చక్కగా మాట్లాడుతూ మంచి వాతావరణం కల్పించేవారు. నేచురల్‌గా నటించడం మోహన్‌లాల్‌కే సాధ్యం. కేవలం డైలాగ్‌ డెలివరీతో ఎలాంటి భావమైనా పలికించవచ్చన్నది మమ్ముట్టి గారిని చూసి నేర్చుకున్న విద్య.
విలన్‌తో లవ్‌
మాది ప్రేమ వివాహం. మలయాళ సినిమాల్లో బాబూరాజ్‌ విలన్‌. ఆయన ‘ది గ్యాంగ్‌’ తీశారు. అందులో నెపోలియన్‌ హీరో, నేను హీరోయిన్‌ని. బాబూరాజ్‌ విలన్‌. ఆ సమయంలోనే ఆయనతో ప్రేమలో పడ్డాను. విషయం బయటికి పొక్కడంతో ‘హీరోయిన్‌ని సొంతం చేసుకున్న విలన్‌’ అంటూ మీడియాలో పెద్దపెద్ద వార్తలు వచ్చాయి. 2002 ఫిబ్రవరి 28వ తేదీన తిరుపతిలో మా పెళ్లి జరిగింది.
‘‘నేను మలయాళీ అమ్మాయిని. అమ్మ పేరు గిరిజ. నాన్న విశ్వనాథ్‌ అప్పట్లో పేరు మోసిన జ్యోతిష్యులు. ఐదో తరగతి వరకు నా చదువంతా కేరళలోనే సాగింది. తర్వాత చెన్నై వచ్చేశాను. అక్కడే నాన్న జ్యోతిష్యం చెప్పేవారు. సరిగ్గా నేనప్పుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాననుకుంటా? ఒక రోజున – తన కొత్త సినిమాకు మంచి ముహూర్తం పెట్టమని నాన్నను అడిగేందుకు మా ఇంటికి వచ్చారు కోవై తంబి అనే నిర్మాత. అదే సమయంలో స్కూలు బ్యాగుతో ఇంట్లో అడుగుపెట్టాను నేను. నన్ను చూసిన ఆ నిర్మాత – ‘‘మీ అమ్మాయి చూడముచ్చటగా ఉంది. మీరు ఒప్పుకుంటే నా సినిమాలో అవకాశం ఇస్తాను..’’ అన్నారు. ‘‘అయ్యో వద్దు వద్దు. మా పాప ఇంకా చదువుకుంటోంది. అప్పుడే సినిమాలంటే దాని చదువు పాడైపోతుంది..’’ అన్నారు నాన్న. కానీ ఆయన వింటేగా! నాన్నను మొహమాట పెట్టేశారు. దాంతో నాకు తొలి అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు ‘మన్నుక్కువైరం’. మురళి, పాండ్యన్‌ హీరోలు. అందులో నాది శివాజీగణేశన్‌కు మనవరాలి పాత్ర. 1987 డిసెంబర్‌లో నా అభిమాన హీరో రజనీకాంత్‌ పుట్టినరోజు నాడే ఆ సినిమా విడుదలవ్వడం నా అదృష్టం. సినిమా యావరేజ్‌గా ఆడింది కానీ నా పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఏడాది తర్వాత విజయకాంత్‌ గారి ‘పూదోట్ట కావల్‌ కారన్‌’లో అవకాశం వచ్చింది. అందులో విజయకాంత్‌-రాధికల దత్తపుత్రిక పాత్ర నాది. అది కూడా మంచి పిక్చర్‌. దీన్నే తెలుగులో కృష్ణంరాజు, రాధిక జంటగా ‘ధర్మతేజ’ పేరుతో రీమేక్‌ చేశారు. అందులో కూడా నా పాత్ర నాకే వచ్చింది. అయితే తెలుగులో నా తొలిపిక్చర్‌ అది కాదు. జగపతిబాబు హీరోగా పరిచయమైన ‘సింహస్వప్నం’ నా తొలి తెలుగుచిత్రం.
కన్నడలో రాజ్‌కుమార్‌తో..
అప్పటికే తెలుగు భాష రాక.. నానా ఇబ్బందులు పడుతుంటే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. అది కూడా మహానటుడు రాజ్‌కుమార్‌కు హీరోయిన్‌గా. ఆ సినిమా పేరు ‘పరశురాం’. అప్పటికి నా వయసు 17 ఏళ్లు. ఆ తరువాత అక్కినేని-జయసుధ నటించిన ‘భలేదంపతులు’లో రాజేంద్రప్రసాద్‌ గారికి జంటగా నటించాను. అప్పటి నుంచి సీరియస్‌గా తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. ఏదోలే పార్ట్‌టైం అన్నట్లుగా తెలుగును పట్టించుకోలేదు. కాని ఆ సమయంలోనే చదవడం కూడా నేర్చుకోవడం చూసి జయసుధ గారు ‘తెలుగు భలే నేర్చుకున్నావే..!’ అంటూ ప్రశంసించారు. అది మరపురాని కాంప్లిమెంట్‌.
అలా తెలుగులో మకాం.. 
తెలుగులో నా కెరీర్‌ను పెద్ద మలుపు తిప్పిన చిత్రం ‘నా మొగుడు నాకే సొంతం’. అందులో మోహన్‌బాబుగారు హీరో. ఆ చిత్రం సక్సెస్‌తో తెలుగులోనే స్థిరపడ్డాను. భాషా సమస్యను అధిగమించేందుకు – సినిమా డైలాగుల్ని పదే పదే ప్రాక్టీసు చేసేదాన్ని. ఒక్కోసారి సెట్‌లో దాసరి నారాయణ రావు గారు అప్పటికప్పుడు డైలాగుల్ని మార్చేసేవారు. ‘‘సార్‌! నాకు వచ్చిందే అంతంతమాత్రం డైలాగులు. ఇప్పుడు మీరు హఠాత్తుగా మారిస్తే ఎలా’’ అంటూ మొరపెట్టుకునేదాన్ని. అందుకాయన ‘‘నువ్వు మలయాళ అమ్మాయివి కదా! తెలుగును ఈజీగా నేర్చుకోగలవు. సమస్యే లేదు’’ అని ప్రోత్సహించేవారు. ఆ సినిమా హిట్టవ్వడంతో నాకు మంచి పేరొచ్చింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘మా అల్లుడు’, ‘మా ఇంటి కథ,’ ‘చిన్న కోడలు’ వంటి చిత్రాలలో నావన్నీ హోమ్లీ పాత్రలు. కాని చిరంజీవి గారితో చేసిన ‘ఘరానా మొగుడు’ మాత్రం నన్ను గ్లామర్‌ గాళ్‌ని చేసింది. ఆయనతో నేను ‘కొదమసింహం’లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించా.
అక్కడికక్కడే ఎన్టీఆర్‌ పేమెంట్‌ ఇచ్చారు..
‘ఘరానా మొగుడు’ సెట్‌లో వుండగానే ఎన్‌టీఆర్‌ గారు ‘సామ్రాట్‌ అశోకా’కు హీరోయిన్‌ కోసం వెతుకుతున్నారని తెలిసింది. ‘మనమూ ఓ ట్రయల్‌ వేసి చూద్దాం’ అనుకుని అటు నుంచి అటే ఇంటర్వ్యూకు వెళ్లాను. నిజానికి అందులో హీరోయిన్‌ పాత్ర కోసం శ్రీదేవి, మాధురీదీక్షిత్‌, భానుప్రియ వంటివారిని తీసుకునే ఆలోచన వుందని ప్రచారం జరుగుతున్నా.. అదృష్టం పరీక్షించుకుందామనే ఇంటర్వ్యూకు వెళ్లాను. సెలెక్టవుతానన్న నమ్మకం అస్సలు లేదు. ఎన్‌టీఆర్‌ చాలా సంప్రదాయాలు పాటిస్తారని తెలుసు. అందులో అశోకుని భార్య పాత్ర కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నేనేమో ‘ఘరానా మొగుడు’ సెట్‌లో జీన్స్‌పై వుండడంతో ఆ డ్రెస్‌తోనే వెళ్లాను. అప్పుడు నా బ్యాగులో చీర లేదు. అయినా ధైర్యం చేసి వెళ్లాను. గదిలోకి వెళితే ఎన్‌టీఆర్‌ కూర్చొని వున్నారు. ‘‘ఊఁ.. మీరు మలయాళీయా’’ అని అడిగారు. టీ ఇస్తే తాగేశాను. కొన్ని ప్రశ్నలడిగారు. పేమెంట్‌ గురించి కూడా అడిగారు. నేను ఇచ్చిన జవాబులతో ఏమనుకున్నారో ఏమో.. టేబుల్‌లో నుంచి డబ్బు, డైలాగుల స్ర్కిప్ట్‌, ఓ క్యాసెట్‌ తీసి నా చేతిలో పెట్టారు. స్ర్కిప్ట్‌లో సంస్కృత డైలాగులున్నాయి. సంస్కృతం నాకు కొంత వచ్చు కాబట్టి ఇబ్బంది అనిపించలేదు. ఆయనకు థ్యాంక్స్‌ చెప్పి హోటల్‌కు వెళ్లిపోయాను. గదిలో చూసుకుంటే ఆయన చెప్పిన పేమెంట్‌కన్నా రూ.50 వేలు ఎక్కువే ఉంది. వెంటనే ఎన్‌టీఆర్‌ గారికి ఫోన్‌ చేసి విషయం చెప్పాను. ఆయన ‘‘ఒక్క నిమిషం’’ అని.. కొంతసేపాగిన తరువాత ‘‘వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని వెనక్కి పంపొద్దు. అది నా గిఫ్ట్‌ అనుకొని మీరే వుంచుకోండి’’ అని నవ్వేశారు.
ఆయన పక్కనే నాకొక కుర్చీ..
ఎన్‌టీఆర్‌ తోటి నటీనటులకు ఇచ్చే గౌరవం అంతాఇంతా కాదు. ‘సామ్రాట్‌ అశోకా’ షూటింగ్‌ సెట్‌లో ఆయనకు ప్రత్యేకంగా కుర్చీ వుండేది. దాని పక్కనే నాకొక సీటు వేసేవారు. షూటింగ్‌ విరామంలో వాటిల్లోనే కూర్చొనేవాళ్లం. ఆ సమయంలో సెట్‌కి అప్పుడప్పుడూ చిరంజీవి, బాలకృష్ణ, హరికృష్ణ వంటి వారంతా వస్తుండేవారు. ఎన్‌టీఆర్‌ను పలుకరించేందుకు వారు దగ్గరికి వచ్చేవారు. సెట్‌లో నిలబడే వారంతా మాట్లాడేవారు. దాంతో నేను కూడా లేచి నిలబడేదాన్ని. కానీ ఎన్‌టీఆర్‌ ‘‘మీరు కూర్చోండి’’ అని చేతులూపేవారు. ఆ వ్యవహారం నాకు చాలా ఇబ్బందిగా వుండేది. ఆ సినిమా షూటింగ్‌లోనే లక్ష్మీపార్వతిని పరిచయం చేశారాయన. ఆ సమయంలోనే ‘‘మీ ఇద్దరి చుబుకం ఒకే విధంగా వుంది’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ చిత్రం తర్వాత హిందీలో మూడు అవకాశాలు వచ్చాయి.
ఎట్టకేలకు మాతృభాషలోకి ఎంట్రీ..
తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించిన తరువాత.. నా మాతృభాష మలయాళంలో అవకాశం వచ్చింది. అంతే! మూడు షిఫ్టుల్లో పని చేయాల్సి వచ్చింది. ఇతర భాషల్లో పని చేయడానికి సమయమే లేదప్పుడు. తెలుగులో చేసిన ‘సర్పయాగం’ మలయాళంలోను నేనే చేశాను. అక్కడ బాగా రిసీవ్‌ చేసుకున్నారు ప్రేక్షకులు. తెలుగులో 50, మలయాళంలో 50 చిత్రాలకు పైనే చేశాను. మొత్తం 120 సినిమాలకు పైనే చేశాను. 12 వాన పాటలకు డ్యాన్స్‌ చేశా. అప్పట్లో ‘‘వాన పాటలు చేస్తే వాణీవిశ్వనాథే చేయాలి’’ అనేవారు.
అక్కడైతే హీరోలను కూడా తిట్టొచ్చు..
తెలుగు, తమిళం చిత్రాల్లో పోటీ ఏమీ లేదు. కానీ మలయాళంలో మాత్రం హీరోలే మాకు పోటీ. మలయాళంలో అన్ని రకాల పాత్రలు చేశాను. ముఖ్యంగా నేను చేసిన పోలీస్‌ పాత్రల్ని ప్రేక్షకులు బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ఏదైనా కార్యక్రమానికి వెళ్లినా నన్ను చూసి భయంభయంగా దూరం జరిగేవారు జనం. మమ్ముట్టి, మోహన్‌లాల్‌, సురేష్‌గోపీ వంటి వారందరితో చేశా. తెలుగు, తమిళం సినిమాల్లో హీరోల ఇమేజ్‌ దెబ్బతినకుండా కథలుంటాయి.
 డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌
Related News
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ తో ”డీ ”సాధ్యమా -ఇండియా గెట్ లో కృష్ణా రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూడోతరం అంబేద్కర్ కాకా

Displaying

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముగిసిన ”మరో చరిత్ర”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదా పాశురాలు -రమణ భావ గీతాలు

గోదాదేవి పాశురాలు
కీళ్‌వానమ్‌ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు
మేయ్‌వాన్‌ పరన్దన కాణ్‌! మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్‌
పోవాన్‌ పోగిన్రారై ప్పోగామల్‌ కాత్తు ఉన్నై
క్కూవువాన్‌ వన్దు నిన్రోమ్‌ కోదుకుల ముడైయ
పావాయ్‌! ఎళున్దిరాయ్‌ పాడిప్పరై కొండు
మావాయ్‌ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనై చ్చెన్రు నామ్‌ శేవిత్తాల్‌
ఆవావెన్రు ఆరాయ్‌న్దు అరుళ్‌ ఏల్‌ ఓర్‌ ఎంబావాయ్‌
మంచునురగలు నంచుకొంటూ
గరిక పరకల కరకరామని
కొరికి నమలీ – తీరుబడిగా నెమరువేయంగా
ఆలమందలు ఊరిబయటకు ఉరకలేయంగా
నల్లతూరుపు తెల్లబోయీ ఎర్రబారేవేళ లోపల
మూడుమారులు యమునలోనా మునిగిలేవంగా
కన్నెపిల్లలు చురుకు చురుకుగ పరుగు తీయంగా
వారినాపీ నీ వాకిట – నిలిపి ఉంచామే
ఎందుకో తెలుసా ?
మదపుటేనుగులంటి మల్లులిద్దరిబట్టి మట్టికరిపించీ
కేశి రాక్షసు గొంతు చించీ వధియించీ
ఆయాసపడకుండా హాయిగా నవ్వేటి
మేటివీరుని మనము మెప్పించవలెనంటే
మార్గశిరనోములే మనకు మార్గమ్ము
లేచిరావే పిల్ల లేచిరా చెల్లి – కన్నెపిల్లలు పడు కష్టాలు చూసి
తనకోసమని తెలిసి తానె దయతలిచి
మననాదరిస్తాడు మన బాలకిష్టయ్య
కాత్యాయనీ తల్లి దీవించగాను – పెళ్ళాడుతాడమ్మ కల్యాణమూర్తి
సిరినోము – హరిపూజ – గిరిపుత్రివరము
గోకులం కన్నెలకు కల్యాణకరము
లోకులం దిరికిదే సౌభాగ్యప్రదము
పల్లెపిల్లా మేలుకో
రే – పల్లె పిల్లా మేలుకో
(ఎమెస్కో పబ్లికేషన్స్‌ ప్రచురించిన‘మేలుకొలుపు’ నుంచి)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇందిరకు అన్యాయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాకా వెంకట స్వామి ఇక లేరు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి –వావిలాల వాసుదేవ శాస్త్రి

ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి –వావిలాల వాసుదేవ శాస్త్రి

అన్నిటా ప్రధములు

ఆదునికాంధ్ర ప్రధమ నాటక కర్తలలో నాల్గవ వారు ,ఆంగ్ల నాటకాన్ని అనువదించిన మొట్టమొదటి వారు ,విషాదాంత నాటక రచనలో ప్రప్ర ప్రధములు ,తోలి సాంఘిక నాటకం రాసిన వారు ఒక్కరే ఆయనే వావిలాల వాసుదేవ శాస్త్రి గారు .

ఆధునిక కవిత్రయం

వడ్డాది సుబ్బారాయుడు ,వీరేశలింగం వావిలాల వాసుదేవ శాస్త్రి గారాలను ఆధునిక కవిత్రయం అంటారు ముగ్గురూ రాజమండ్రి వాస్తవ్యులే .దీనిని గురించి వాసురాయ కవి అంటే వడ్డాది సుబ్బారాయకవి గారు పందొమ్మిదవ శతర్ధం ఉత్తరార్ధం లో ఒక పద్యం లో చెప్పుకొన్నారు –

‘’భావను ,రాన్మహేంద్రమున బాదము వెట్టితి,నాడిటంగవుల్ –వావిలాల వాసు దేవ గురు వర్యు డోకండు వివేక వర్దినీ

ధీవర పత్రికాధిపతి దేశిక వీరప లింగ మొక్కడుం – గావుట చే గావిత్రయముగా గనియించిరి మమ్మిటీవలన్ ‘’

నన్నయ లాంటి వాడు వాసు దేవా శాస్త్రి గద్య  తిక్కన  వీరేశ లింగం ,ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన వడ్డాది .ఇలా ఆధునిక కవిత్రయం అయ్యారు

వావిలాల వారు –మా బంధుత్వం

.ఇందులో వావిలాల వారి గురించి తెలుసుకొందాం ఆయన మాకు దూ —-రపు చుట్టం కూడా .ఆయన మనవడు వావిలాల కృష్ణ   ఆంద్ర దేశం నుండి అమెరికా వెళ్ళిన తోలి తరం వాడు .కృష్ణ ఉయ్యూరులో మా చిన్న తాతగుండు అంతర్వేది గారి  కుమారుడు ‘’అప్పన కొండ’’ అనబడే గుండు వరాహ లక్ష్మీ నరసింహ మూర్తి-జి వి.ఎల్ .యెన్ .మూర్తి  అంటే నాకు మేన మామ .అయన జంషెడ్పూర్ తాతా ఐరన్ స్టీల్స్ లో చీఫ్ కెమిస్ట్ .  ఆయన కుమార్తె లక్ష్మి భర్త వావిలాల కృష్ణగారు  .దాదాపు అరవై ఏళ్ళనుండీ అమెరికాలో ఉంటూ  సుమారు నలభై ఏళ్ళ నుండి టెక్సాస్ రాష్ట్రం లోని హూస్టన్ లోనే ఉంటున్నారు .తోలి తెలుగు సంఘాన్ని అమెరికాలో స్థాపించిన వారిలో కృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు .భార్య లక్ష్మి మంచి సాంఘిక సేవా కార్య ,వాలంటీర్ .మేము మొదటి సారి అమెరికా లో టెక్సాస్ లోని హూస్టన్ కు 2002లో మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,అల్లుడు ఛి కోమలి అవధాని వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు గాఢ పరిచయం ఏర్పడింది అంతకు ముందొక సారి లక్ష్మిగారు ఉయ్యూరుకు అప్పన కొండ మామయ్యఎదూరికి బాచీ వాళ్ళింటికి  వస్తేపరిచయం అయింది .వావిలాల కృష్ణ-లక్ష్మి  అంటే హూస్టన్ లో తెలియని తెలుగు వారుండరు .అంట కలుపుగోలు తనం గా ఉంటారు .మా అమ్మాయి ఆయన్ను పెదనాన్న అని ఆవిడను అమ్మక్కయ్యా అని ఆప్యాయంగా పిలిచేది . ఆవిడే  మాకు అక్కడి ప్రముఖ  మీనాక్షి,దుర్గా. ఇస్కాన్  దేవాలయాలను చూపింది ప్రసిద్ధ డాన్సర్ రత్న పాపను అంటే సీతా అనసూయ అనే కృష్ణ శాస్త్రిగారి మేనకోడళ్లలో ఒకరైన అనసూయా దేవి కుమార్తే. ‘’హూస్టన్ లో ‘’అంజలి ‘’అనే నృత్య శిక్షనాలయం స్థాపించి వందలాది మందికి కూచిపూడి ,భరతనాట్యం నేర్పిస్తోంది .అనసూయ గారు మా మద్రాస్ పెదబావ గారు గాడేపల్లి క్రుపా నిధి గారికీ బంధువే .వావిలాల వారికి ఇద్దరమ్మాయిలు పెద్దమ్మాయి అమెరికాలోనే ఉంది రెండవ ఆమ్మాయి’’ఎమెండా’’ హూస్టన్ లో ఉంటుంది .ఇదీ ఆకుటుంబ పరిచయం .

వాసుదేవ శాస్త్రిగారి జననం –విద్య –ఉద్యోగం

వావిలాల వాసుదేవ శాస్త్రిగారు 1851జూన్ లో జన్మించి 1897జూన్ లోనే మరణించారు .నలభై ఆరు సంవత్సరాలు మాత్రమె జీవించినా చరిత్రలో నిలిచిపోయారు .బి.ఏ.పాసైనారు .రాజమండ్రి  కాలేజిలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు .1895లో కృష్ణా  ,గుంటూరు జిల్లాలో ‘’అసిఅస్తంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ‘’గా కొంతకాలం ఉద్యోగించారు . వావిలాల వాసుదేవ శాస్త్రి ,వీరేశ లింగం వడ్డాది సుబ్బా రాయుడు లను” ఆధునిక కవి త్రయం ”అనే వారు

-వావిలాల వాసుదేవ శాస్త్రి గారు బి .ఏ .పరీక్ష లో (1877 )ఉత్తర సర్కారు లో ఇంగ్లిష్ లో మొదటి మార్కు పొందిmacdonaald  మెడల్ సాధించారు .”  -వావిలాల వాసుదేవ శాస్త్రి గారి పేరు ఆటవెలది పద్య పాదానికి సరిపోతుంది యతి తో సహా .వీరి బావ గారు వీరిని   ”బావ గారు ఆటవెలది పాదాలలో చిక్కు కున్నారు ”అని వుడికించే వారట. .

‘’సరిగ్గా ఆ కాలంలోనే వావిలాల వాసుదేవ శాస్త్రి అనే పట్టభద్రుడు, షేక్స్‌పియర్ రాసిన జూలియస్ సీజర్ ని “సీజర్ చరితము”అనే నాటకాన్ని 1874 లో అనువదించాడు. ఇదే ఇంగ్లీషు నాటికకి మొట్టమొదటి తెలుగు అనువాదం. ఈ నాటికలో తేటగీతి పద్యాలుపయోగించారు. వావిలాల వారు “నందక రాజ్యం” అనే సాంఘిక నాటకాన్ని కూడా రాసారు. ఇందులోనూ తేటగీతి పద్యాలు వాడారు. నందక అనే జమిందారు రాజ్యంలో ప్రజలకష్టాలు, ఆ కాలంలో ఉన్న సమస్యలూ, రాజకీయాలూ అన్నీ ఈ నాటికలో చిత్రీకరించబడ్డాయి. ఈ విధంగా వావిలాల వారే మొట్ట మొదటి సాంఘిక పద్య నాటక కర్త గా చరిత్రలో మిగిలిపోయారు.’’అని శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం తెలియ జేశారు .

 

వావిలాల వారి సాహితీ ప్రస్థానం

‘’నందక రాజ్యం ‘’అనే అయిదు అంకాల తోలి సాంఘిక నాటకం రాశారు వావిలాల వారు .ఇది 1888లో ముద్రణ పొందింది .తెలుగు స్వతంత్ర నాటకాలలో కోరాడ రామ చంద్ర శాస్త్రి గారి ‘’మంజరీ మధుకరం ‘’మొదటిది .నందక రాజ్యం రెండవది అయితే నందక రాజ్యం మొదటగా అచ్చు అయిన్దికనుక తోలి స్వతంత్ర నాటకం గా గుర్తింపు వచ్చింది .ఏ నాటకాన్నీ ,’’సీజరు ‘’నాటకాన్ని వావిలాల వారు ‘’తేట గీతుల’’లో రాశారు .అందుకని వావిలాల వారు ప్రధమాంధ్ర పద్య నాటక కర్త కూడా అయ్యారు .1853LO ‘ మర్చంట్ ఆఫ్ వెనిస్ ‘’ను ,హేమచంద్ర ఘోష్  ‘’చారుమతీ చిత్త విలాసం ‘’పేరుతొ ‘’బెంగాలీ భాష లోకి అనువదించాడు .ఇండియాలో షేక్స్పియర్ నాటకాల అనువాదానికి ఇదే  నాంది పలికింది .1872లో కే జి నేటర్ అనే ఆయన  నాటకాన్ని ‘’విజయ సింహుడు ‘’గా మరాఠీ భాషలోకి అనువాదం చేశాడు .ఇందులో కొంత స్వాతంత్రం కూడా తీసుకొని అనువదించాడు ..పూనా కాలేజిలో దాన్ని అప్పుడే ప్రదర్శించాడు .కనుక జూలియస్ సీజర్ నాటకానికి ఇండియాలో వచ్చిన అనువాదాలలో నేటర్ రాసిన మరాఠీ అనువాదమే మొదటిది .రెండవది తెలుగులో అనువాదం చేసిన వావిలాల వారిది .

వావిలాల వాసు దేవ శాస్త్రిగారు ‘’ముముక్షు తారకం ‘’(శంకరాచార్య  భజ గోవిందం ),’’ఆంద్ర రఘు వంశం ‘’కూడా రాశారు . మ్రుచ్చ కటికం ‘నాటకాంద్రీకరణాచేశారు .’’మాత్రు స్మ్రుతి ‘’,బ్రాహ్మణీయం ‘’,’’పిత్రారాధన ‘’,మాత్రారాధనా ‘’,రుక్మిణీ స్మరణం  (సతీ స్మ్రుతి) వ్రాశారు .

ఇన్ని రాసినా వావిలాల వారి రచనలు ఏవీ ప్రాచుర్యానికి రాలేదు .సంభాషణా చాతుర్యం ,పద్యం లో లోటు లేక పోవటం పెద్ద వెలితిగా కనిపిస్తుంది .1987లో శ్రీమతి మంగళగిరి ప్రమీలా దేవి  ‘’నందక రాజ్యం ‘’ను ముద్రించి లోకానికి తెలియ బర్చింది . 2002లో పౌత్రులు సర్వశ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి ,కృష్ణ శాస్త్రి ,వెంకటప్పయ్య శాస్త్రిలు కలిసి మళ్ళీ ముద్రించారు .

ఉయ్యూరుతో  బాంధవ్యం

వాసు దేవ శాస్త్రి గారి మొదటి భార్య శ్రీమతి రుక్మిణి గారుఒక పిల్ల  వాడిని ప్రసవించి  చనిపోతే శ్రీమతి పూర్ణ మహాలక్షమ్మ గారిని ద్వితీయం చేసుకొన్నారు .ఈమె రుక్మిణి గారి పిన తండ్రి కుమార్తెయే .పూర్ణమ్మ గారి కి శాస్త్రి గారి దాంపత్యం లో శ్రీమతిలక్ష్మమ్మ ,శ్రీమతి  భవాని , ,శ్రీ సత్యనారాయణ శాస్త్రి జన్మించారు .పెద్ద కూతురైన లక్ష్మమ్మ ను ఉయ్యూరులోని గుండు అంతర్వేదిలక్ష్మీ నృసింహం గారికిచ్చి వివాహం చేశారు .ఈయన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజ మండ్రి లో పని చేసి రిటైర్ అయ్యారు .ఈయనే మా అమ్మకు స్వయానా బాబాయి.లక్ష్మమ్మ గారు ఇరవై సంవత్సరాలు అంతర్వేదిగారితో కాపురం చేసి ఒక కొడుకును కని1921లో  చనిపోయారు .

వావిలాల వాసుదేవ శాస్త్రి గారి రెండవ కూతురు భవానిగారు 1891లోను ,కొడుకు సత్యనారాయణ శాస్త్రి 1906లోను అకాల మరణం చెందారు .అంటే శాస్త్రి గారికి పుత్రసంతానం మిగలలేదు .దౌహిత్రుడే అంటే లక్ష్మమ్మ గారి కుమారుడు వరాహ లక్ష్మీ నరసింహ మూర్తి అనే మా ‘’అప్పన్న కొండ మామయ్య ‘’మాత్రమె వారసుడు  అయ్యాడు .1911లో వావిలాల వారి మరణానంతరం భార్య పూర్ణ మహాలక్ష్మిగారు  భర్త వాసుదేవ శాస్త్రిగారి అన్న కుమారుడిని దత్తత చేసుకొన్నారు .ఈయనకు వాసుదేవ శాస్త్రి ,ఇద్దరు కూతుళ్ళు పుట్టారు .

నా చేతికి ‘’నందక రాజ్యం ‘’

నాకు అమెరికా లో వావిలాల కృష్ణ గారు బాగా పాతబడిన వాసుదేవ శాస్త్రిగారి ‘’నందక రాజ్యం ‘’గ్రంధాన్ని ఆప్యాయం గా అందజేశారు చదివేశాను .అమెరికాలో తెలుగు సాహిత్యం చదవటం అదే మొదలు .అందులో సాహిత్యం లో విఖ్యాతులైన ఆధునిక కవిత్రయం లో ఒకరైన వావిలాల వాసుదేవ శాస్త్రి గారి పుస్తకం  ఆయన మనవాడి ద్వారా పొంది చదివే అదృష్టం లభించి నందుకు గర్వపడ్డాను .అదొక థ్రిల్లింగ్ అనిపించింది .’’తేటగీతులు ‘’చాలా తెలిపోయినట్లనిపించింది .వ్యావహారికం గా అంటే’’ కలోక్వియాల్’’గా ఉంటుందని ఆయన అలా రాశారు .వ్రుత్తపద్యాలైతే ఇంకా సోగసుదనం వచ్చేదని అనుకొన్నాను .చెవులకు ఇంపుగా కూడా ఉండేవి .ఏమైనా తెలుగు సాహిత్యం లో ఒక అద్భుతాన్ని, సాహసాన్ని చేసిన సాహిత్య ఘనా పాటి శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి గారు.ఈ పుస్తక ముద్రణకు మహా పండితులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారు ఎక్కువగా తోడ్పడినట్లు వావిలాల వారి తమ్ముడు ముందుమాటలో రాశారు .

విశ్వనాధ ‘’సీతాయణం ‘’

వావిలాల కృష్ణ ,లక్ష్మి దంపతుల ఇంట్లో అమెరికా ‘’ఆటా ‘’వారి మాస పత్రిక చూసి చదివా .అందులో విశ్వనాధ సత్యనారాయణ గారి కుమారుడు శ్రీ అచ్యుత రాయలు ధారా వాహికం గా రాస్తున్న ‘’సీత ‘’చదివాను. తండ్రికి తగ్గ కొడుకు అనిపించారు .ఆయన అమెరికాలోనే ఉన్నారప్పుడు .రామాయణాన్ని ‘’సీతాయణం ‘’గా రాసినట్లు కనిపించింది .అందులోనే శ్రీమతి విశ్వనాధ కమలాదేవి ఒక పజిల్ నిర్వహించటం ఆకర్షించింది .విశ్వనాధ కుటుంబం అమెరికాలోనూ ‘’వైశ్వనాదీయాన్ని ‘’చాటుతున్నారు భేష్

2-11-2002 శనివారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment