ఆంద్ర జ్యోతి లో ఇవ్వాళ

krishna09

Posted in వార్తా పత్రికలో | Leave a comment

మళ్ళీ చే జారిన శతం

మళ్ళీ చే జారిన శతం

                      బాలును  చితక్కొట్టి” శత క్కొడ్తాడను”  కొని
                      కవిత్వం రాద్దా మని ఎదురు చూశా

” ఆరడుగుల్లో” గమ్యం దూర మైందంటే చతికిల పడ్డా

                      ఇంక  కవిత్వమేం వస్తుంది ?
                      అయినా” ఇది ఎన్నో సారో లే” నని ఊరట పడ్డా
                      పాపం శ్రమకు దైవం తోడు కాలేక పోయాడు
                      ”శత శతం ”కోసం ఇంకా ఎదురు చూడాల్సిందే
                       అవును నిరీ క్షణే మధురాతి మధురం
                       సచిన్ కు అది ”ఒక సంఖ్య మాత్రమే ”కాని
                       మనకు అది ఉత్కంత(utkantha )   రేపే క్రికెట్ పండగ
                       నరాలు తెగే టెన్షన్ ,పెరిగే రక్త పోటు లతో
                        ఎదురు చూడటం ఒక అలవాటై పోయింది జనానికి .
                        మాస్టర్ ,బ్లాస్ట్ మాన్  సచిన్ !
                        బూస్టు బాగానే తాగుతున్నావు కదా !
                        బంతిని బాదేయ్ పరుగుల  వర్షం కురిపించు  ,
                         కన్ను మూసి తెరిచే లోపు ”నాలుగు, ఆర్లేసి ”ఆరేయ్
                         నీ వెంట అశేష భారత జనమే కాదు ప్రపంచమంతా వుంది
                         కురుక్షేత్ర సంగ్రామం లోని అర్జుని లా సందేహించకు
                         విజయుడి వై వీర విహారం చేయ్
                        ” విశ్వ విజేత ”గా నిన్ను చూడాలనే
                          మా ఉత్కంత కు ఇక నైనా తెర దించు .
                                                మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in కవితలు | Leave a comment

స్వామి శివానందుల ఉపనిషత్ సార సంగ్రహం –5 బ్రహ్మ విచారణ

స్వామి శివానందుల ఉపనిషత్ సార సంగ్రహం –5

                                                      బ్రహ్మ విచారణ

—                    ”కోహం ”అంటే నేనెవరు ?అని ప్రశ్న వేసుకొని సాధన చేస్తే పరమాత్మను దర్శించ గలం .నిత్యం తపస్సు ,సత్యం ,బ్రహ్మ చర్యం ,నిగ్రహం ,సత్ప్రవర్తనలతో జోడించి ,నియమం తో సాధించి నప్పుడే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది .

                   ”తద్ హి  శాశ్వతం బ్రమన సోమనః -ప్రాణస్య ప్రాణం –శ్రోతష్య శ్రోతం ,చక్షుషస్చక్షుహ ,జిహ్వాయా జిహ్వ
                    స్వేభాసా దీప్య మాన ,మన్యత్చర్వం భాస యతి — ”
    అంటే -శాశ్వ త బ్రహ్మయే బుద్ధికి ,బృహస్పతి .మనస్సుకు మనస్సు ,చెవికి చెవి ,కన్నుకు కన్ను ,నోటికి నోరు ,అంటే సర్వం తానె అయిన స్వయం ప్రకాశ కుడు .అతని తేజం వల్లే అంతా ప్రకాశిస్తుంది .పరమాత్మ ”మాత్రు కుక్షా వివ శిశుహ్ ”అంటే తల్లి గర్భం లో శిశువు వలె వున్నాడు .అంటే కాదు పరమాత్మ వ్యాపకత్వం ఎలా వుందో  చూడండి .
           ”యదేక్షు రాసే త్తర్హితాశర్కరా ,యధాచ శర్కరాయాం -మాధుర్య తదా ,సూక్ష్మో యమాత్మా జగ దఖిలం -మనుష్య శరీరం ,చ వ్యాప్త తిష్టతి  ”.
  చెరకు రసం లో చక్కర అంతటా వ్యాపించి వున్నట్లు ,తీపి ,పంచ దార అంతటా వ్యాపించి నట్లు ,పరమాత్మ ప్రపంచం అంతటా వ్యాపించి వున్నాడు .మనిషి చేసే భావనలను బట్టి ,మనిషి మారుతూ ఉంటాడు .దేహ ధ్యాస మాత్రమే వుంటే పామరు డవుతాడు .”నేను సచ్చిదా నందున్ని ”అనే ధ్యాసతో ,వుంటే ,దైవ స్వరూపుడు గా మారు తాడు .అదే భేదం .
              ప్రపంచం లో అనేక అరిష్టాలకు ,రోగాలకు ,అకాల మృత్యువుకు మానవుని లోని ,దుష్ట సంకల్పమే కారణం .చెడు ఆలోచన భావాల వల్లే వ్యాధి జనిస్తుంది .మురికి దగ్గరే కదా దోమలు చేరేది ?సద్భావన కల వారు ఎప్పుడూ ,ఆనందాన్ని ,ప్రశాంత త ను పొందు తారు .అంతే కాదు దూరం గా వున్న వారికి కూడా ,వాటిని పంచిస్తారు .చెడ్డ ఆలోచన వల్ల తనకే కాదు ,సంఘానికీ కీడు జరుగు తుంది .ప్రపంచమే దుష్ప్రభావానికి లోను అవుతుంది .కనుకదాన్ని దూరం చేసి కోవటానికి వెంటనే ,మంచిఆలోచన   తెచ్చు కోవాలి .లేక పొతే ,సంఘమే ప్రమాద భరితం అవుతుంది .ఈ శరీరం తో పరమాత్మను చేర లేము .ఈ శరీరం లోని జీవాత్మను ,మన సాధన వల్లనే పరమాత్మలో లయం చేయ గలం .
              అంతే కాదు పరమాత్మ ఇలా అంటాడు ”సుఖ ,దుఖాలు నీకు చెందినవి కావు .నీ  మనస్సుకు చెందినవి .నీవుకర్తవే   కాని ఫలం అనుభవించే వాడివి కావు .ఎప్పుడూ నువ్వు స్వతంత్రుడవే ”.దీనికి ఉదాహరణ గా ఒక కధ తెలుసు కొందాం
 ఒకప్పుడు వామ దేవ మహర్షి తల్లి గర్భం లో వుండగా ,తల్లి తో ఇలా అన్నాడు ”తల్లీ !నేను పారి పోతానేమో నని ,ఇనుప ఇళ్ళ వంటి దేహాలు అనేకం నన్ను బంధించాయి .కాని బంధింప బడిన పక్షి ,ఎలా గైతే గూటి కింద సొరంగాన్ని తొలిచి ,బయటకు పారి పోతుందో ,అట్లాగే నేను ,ఆత్మ జ్ఞానం తో ,బంధాలన్నీ ,తొలగించు కోని ,బయట పడతాను .”వామ దేవ మహర్షి మహా జ్ఞాని .ఆయన విజ్ఞానం ,జన్మ జన్మ కు వృద్ధి చెందింది .అందుకనే ,అంత వివేక వంతం గా పలికాడు .చివరి సారిగా ,తల్లి గర్భం లోంచి ,భూమి మీద పడక ముందే ,ఆత్మ సాక్షాత్కారం పొందాడు  ,ఆత్మ జ్ఞాని .కనుక .
          ”  యోగ సాధనస్య ,సంస్కారా అను వర్తన్తే –కాలేచ ఫలా వంతో ,భవంతి ,-తస్మాన్ మాశుచః -ప్రత్యహం ,సాధన వ్యగ్రో భవ ”
            ఆంటే సాధన ,శిక్షణ ,ఫలితం ఎన్నటికీ నశించదు .తగిన సమయం లో ఫలిస్తుంది .అందుకే నిర్విచారంగా ,ప్రతి క్షణం సాధన  చేయాలి .
                                               జ్యోతిర్బిందువు
                            మంత్రాలు దాదాపు ఏడు కోట్లవరకు   వున్నాయి .అన్నీ పరమాత్మను దర్శించ టానికి ఉపయోగ పడేవే .అయితె ”అహం బ్రహ్మాస్మి ”అనే మంత్రం వీటన్నిటిలో ఉత్కృష్ట మైనది .ఈ మంత్రోచ్చాటన ఎప్పుడు చేస్తూ ,జప ద్యానాదులతో మోక్షం పొంద వచ్చు .  .
          ”యధా ఘటః పటోవా ,పరిశాల్య మనో నమ్రుదస్తన్తోర్వా –కించి ధన్యత ,తధైవ ప్రత్యక్ష మిదం ,విశ్వం
            విచార్య మానం ,ఆత్మనో వ్యతిరిక్తం ,న కించిత్ ”
         వస్త్రం ,కుండా ,మొదలైన వన్నీ ,మట్టి లో నుంచే లభిస్తాయని ,విచారణ వల్ల ఎలా తెలుసు కొంటామో ,అట్లాగే ”ప్రత్యగాత్మ ”నుండే ,ఈ లోకం అంతా,ఏర్పడిందని తెలుసు కోవాలి .మనమే ప్రతి దానికీ ,సాక్షీ భూతం .అందరి లో నుంచే చూస్తాం .”త్వం సర్వస్య సాక్షీ ,త్వం ,సర్వస్మిన్ ,ఎకో ,ద్రస్టాత ,త్వతః ”                                                        సశేషం
                                                   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -11-11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | 1 Comment

స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ —4 బ్రహ్మ రహశ్యం

          స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ —4
                                                              బ్రహ్మ రహశ్యం
—              ”బ్రహ్మ జ్యోతిషా మపి జ్యొథిహ్ -స్వయం ప్రకాశః -పరం జ్యోతి రనంతం –జ్యొథిహ్ జ్యోతి హి స్వరూపం -తస్య భాషా సర్వ మిదం విభాతి ”
పరబ్రహ్మ వెలుగు లకే వెలుగు .స్వయం ప్రకాశ కుడు ,పరంజ్యోతి ,ఆనంద జ్యోతి ,జ్యోతి స్వ రూపుడు .అతని తేజస్సు చేతనే ఇతరాలన్నీ వెలుగు తున్నాయి .ప్రతి జీవుని హృదయం లోను సూక్ష్మం లో సూక్ష్మం గా ,స్థూలం లో అతి స్థూలం గా పర మాత్మ వున్నాడు .కనుక పర బ్రహ్మాన్ని తలవటం ,ప్రార్ధించటం మాట్లాడటం ,అతని గురించి ఉపనయ శించటం ,అతని లో కలిసి పోవటాన్ని ,”బ్రహ్మా భ్యాసం ”అంటారు .గీత లో కూడా ,”మాచిట్టా ,మడత ప్రాణా ,బోధ యంతః పరస్పరం -కధ్యం తచ్చమాం -నిత్యం ,తుష్యన్తిచ  ,రమంతిచ ,”అని అంటాడు భగవాన్ కృష్ణుడు .
                ”నిత్య శుద్ధ స్వరూపోహం ,నిత్య బోధ స్వరూపోహం –నిత్య ముక్తి స్వరూపోహం –నిత్య విజ్ఞాన స్వరూపోహం ,-నిత్య చైతన్య స్వ రూపోహం ”అని పరమాత్మ ఉవాచ .అంతే కాదు అందరి ఆత్మను నేనే.అన్నిటికి నేనే ఆధారం అంతా నేనే .అన్నిటికి నేను అతీతున్ని .జాతి ,మత భేదం లేని నిర్మల ,నిష్కల్మష నిష్కలంక నిష్క్రియ బ్రహ్మను నేనే .”నిజం గా ఈ భావన ఈ నాటి కాలానికి ,జనానికి ఎంత అవసరమో ఉపనిషత్తులు ఆనాడే వివ రించాయి అందుకే అవి కాలానికి అతీతం గా నిలిచాయి ..
                ”ప్రజ్ఞాన ఘన బ్రహ్మ హమస్మి -విజ్ఞాన ఘన బ్రహ్మ మహా మస్మి -చిదాన బ్రహ్మ హమస్మి -ఆనంద ఘన బ్రహ్మ హమస్మి
                 ”సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మమ్ -అనాద్యనంత బ్రహ్మం -అధిష్టానా పరిచ్చిన్న బ్రహ్మాహం ”
   నేనే సత్య జ్ఞానానంద బ్రహ్మను .నేనే అనాది ,అనంత బ్రహ్మను ,నేనే అవినాష అధిష్టాన ,అపరిచ్చిన్న బ్రహ్మను .కర్ర లో వున్న నిప్పు లాగ ,అందర్లో డాగి వున్నాను .ఆకాశ రూపి .అంటే సర్వ వ్యాపి .సూక్ష్మి .దేశ కాలాలకు అతీతుణ్ణి .శాశ్వు డిని .
                 ”శాంతా జరామ్రుతాభయం -పర బ్రహ్మం -దివ్యామ్రుత ,ప్రాణ ,మనో బ్రహ్మం -శాశ్వత ,స్వతంత్ర ,కూటస్త బ్రహ్మాహం ”
  అంటే శాంత ,జరా ,అమృత ,అభయ ,పర బ్రహ్మను .నేనే దివ్య అమూర్తి ,అప్రాని ,అమన (మనసు ,ప్రాణం లేని )బ్రహ్మను .నేనే శాశ్వతం .నేనే కేవలం బ్రహ్మను .అతీంద్రియ బ్రమను .ఇదీ బ్రహ్మ స్థితి .
           ”సమొహం ,పురుషోత్త మొహం ,ఈశోహం –శ్రేష్టోహం ,శివోహం ,భాషా రహితోహం -అగంయాన్తర రహితోహం ,అమగ ,అభ్యంతర ,రహితోహం -అభ్యంతర స్థాప్య భ్యన్తర గతోహం ”
  నేను అన్నింటికీ  సమానుణ్ణి ,పురుషులలో ఉత్తమున్ని ,ఈశారుడిని ప్రసిద్ధుడిని .శివుడిని .భాషా రహితుడిని .అంతరంగం లోని అంతహ్కరణను నేనే .
దీన్నే గీత లో ”సమం సర్వేషు భూతేషు ,తిష్టంతం పరమేశ్వరం ”అంటాడు ”.ఇష్ ”అంటే దేవుడు,ప్రభువు అని అర్ధం .
         ”సర్వోహం ,సర్వస్మిన్ ,సర్వోహం ,సర్వస్మిన్నేకోహం -ఏకస్మిన్ ,సర్వోహం ,బహురహం ”
         అంతటా అన్నిటా నేనే .నా లోనే అన్నీ -సంఖ్యలకు అతీతున్ని ,అంత నిద్ర పోతుంటే మేలు కొనే వాణ్ని .ప్రళయం లో కూడా ప్రకాశించే వాణ్ని .నేనే అద్వితీయ ఏకైక పురాణ పురుషుడిని .
          ”అచక్షు షాహం పశ్యామి –అశ్రోత్ర్న శ్రునోమీ -అజిహ్వాయా రసయామి ,అత్వచా స్పర్శామను భవామి —అనాసయా ,జిఘ్రామి ,అపాదేన చరామి –ఆహాస్తే న గృహామి ,అమనసా జానామి -శుద్ధ చైతన్యోహం ”
         కన్నులు లేకుండా చూస్తాను .చెవులు లేకుండా వింటాను .నోరు లేకుండా రుచి చూస్తాను .శరీరం లేకుండా స్ప్రుశిస్తాను .ముక్కు లేకుండా వాసన చూస్తాను .కాళ్ళు లేకుండా నడుస్తాను .చేతులు లేకుండా ముట్టు కొంటాను .మనస్సు లేకుండా గ్రహిస్తాను .నేను పవిత్ర శుద్ధ అంతః కరణను .పర మాత్మను అని పర మాత్మ చైతన్య స్థితి ని తెలియ జేబు తున్నాడు .ఇంద్రియాలు లేక పోయినా ,ఆయన అన్ని పనులు చేస్తాడు .అంతటా వ్యాపిస్తాడు .అంగాలు లేని వాడు ,గుణాలు లేని వాడు .ప్రతి దాన్ని బల పరుస్తూ ,ఆనందిస్తాడు .అదే ఆయన చిద్విలాసం
                 ప్రపంచానికి మొలం ,ఆధారం ఆయన..కేంద్ర స్థానం .పునాది .వీటిని నశింప జేసేదీ ఆయనే .అంతా ఆయన లీల .
           ”సర్వ యోని రహం ,జగన్మూలోహం ,సర్వ దారోహం -పరందామాహం,సర్వ కేంద్రోహం ,అధిష్టాన మహం –ప్రభవోహం ,ప్రాళయ భూమి రహం ”
      అంతే కాదు ,పరమాత్మ అపర మేయం ,అపరిచ్చిన్న బ్రహ్మ ,వర్ణింప శక్యం కాని అంటే అన్యపదేష్య బ్రహ్మ
          ”నేతి నేతి వాక్య ప్రతి పాద్య బ్రహ్మాహం –జగదహల్లక్షనా ప్రతి పాద్య బ్రహ్మాహం –దహకారాకాష వర్తి బ్రహ్మాహం -తపో బ్రహ్మ వర్ణ సత్య దామ శ్రుథాధ్యయనైహ్ -సాధకైహ్ -ప్రేప్స మానం బ్రహ్మాహం ”
        భాగం త్యాగం ,లక్షణ మైన బ్రహ్మ ను నేను .నేతి నేతి అనే వ్యతి రేక భావ సిద్ధాంతం సూచించిన బ్రహ్మను .నేనే .హృదయ గుహ లో వున్న బ్రహ్మను నేనే .సాధకుల షమ ,దామ ,తపస్సు ,సత్యం ,బ్రహ్మ చర్యం మొదలైన అభ్యాసాల వద్ద ,కనుగొన బడే బ్రహ్మను నేనే .అంటే జీవునికి వన్న పొరలను తొలగిస్తే ,జీవుడే పరమాత్మ .బ్రహ్మ సారమే జీవాత్మ .గాహరాకాశం అంటే హృదయం లోని ప్రాణ వాయువే .దమం అంటే నిగ్రహం.
                                  సశేషం
                                              మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25 -11 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –6 కోదండ రామయ్య గారి ”నో వేకన్సి-సారి”

  ఊసుల్లో ఉయ్యూరు –6

                                                  కోదండ రామయ్య గారి ”నో వేకన్సి-సారి”

—                       మా చిన్న తనం లో అని రాస్తున్నాను అంటే సుమారుగా నాకు పది హీను ఏళ్ళ వయసు లోపు అని నా భావం అంటే ఇంకా హై స్కూల్ చదువు దాటని నేపధ్యం అని .అప్పుడు ఉయ్యూరు లో పెళ్లి ,పేరంటాలు చాలా సరదాగా ఉండేవి .ముఖ్యం గా బ్రాహ్మణుల ఇళ్ళల్లో .అప్పటికి ఇంకా ఇతరుల ఇలకు భోజనాలకు వెళ్ళటం లేదు .మేము వెల్ల లేదు .వాళ్ళు వచ్చే వారు కాదు .తిఫిన్లకు ఆఇబ్బంది లేదు . .వేసవి కాలం క్లాస్ పరీక్షల్లో పాస్ అయిన తర్వాతా అంటే పరీక్షా ఫలితాలు బోర్డు మీద పెట్టిన తర్వాతా కుర్రాళ్ళం ఇంటి దగ్గర టీ పార్టి ఏర్పాటు చేసు కొనే వాళ్ళం .స్నేహితులందర్నీ పిలిచే వారం .అందరు వచ్చే వారు ఇంట్లోనే స్వీటు హాట్ పండు టీ అందరికి ఇచ్చే వాళ్ళం .వాళ్ళ ఇళ్ళ కు మేము వెళ్ళే వాళ్ళం .మా పెద్ద లెవరు దీనికి అడ్డు చెప్పా లేదు .అప్పటికే హోటళ్లు బానే వచ్చాయి . . 
                 ఆ నాటి భోజనాలు మా ఇళ్ళ లో సరదా గా జరిగేవి .ఎవరింటి లో కార్యం అయినా అందరు సహకరించు కొనే వారు .ముఖ్యం గా ఆడ వాళ్ళు ,వంట వచ్చిన అమ్మ లక్కలు పిలిచినా వారింటికి మది కట్టు కొని వెళ్లి వంటలో సాయం చేసే వారు .కూరలు తరగటం ,పప్పు రుబ్బతం ,పచ్చళ్ళు చేయటం ,పిండివంటలు చేయటం కలిసే చేసే వారు .కొద్ది మంది వంట బ్రాహ్మ లను పెట్టు కొనే వారు .వారితో వంట చేయించే వారు .మగ వాళ్ళు చాతనయినా వారంతా బాదం ఆకు విస్తళ్ళు కుట్టే వార్రు .లేక పొతే తామ రాకు లు వాడే వారు .లేక పొతే మోడు గాకు విస్తరి కట్టలు కొని వాడే వారు .అడ్డాకు విస్తర్లు కూడా వాడటం వుంది .ఆ నాటి స్వీట్ అంటే ఎక్కువ గా లడ్డు .పరవాన్నం పూర్ణం బూరె బొబ్బట్టు ,అరిశే ,సగ్గు బియ్యం పరవాన్నం ,చక్కర పొంగలి .సేమ్యా మడికి వాడే వారు కాదు .హాట్ అంటే పులిహోర ,గారే ఆవడ ,బజ్జీ ,వండే వారు .  
            ఆ నాటి భోజనం పిలుపులు చాలా మర్యాద గా ఉండేవి .యజ మాని, భార్య ఇద్దరు కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ఆప్యాయం గా   బొట్టు పెట్టి పిలి చే వారు .ఆడ వారి చేతిలో కుంకుమ భరిణె వుండేది .”మీరు మీ కుటుంబం ,మీ ఇంటికి వచ్చిన బంధువులు మా ఇంటికి భోజనానికి రావాలని కోరుతున్నాం ”అని పిల్చే వారు శుభ లేఖ వుంటే పేరు రాసి మర్యాద గా పిలి చే వారు .”’మీరు అందరు వచ్చి ఆశీర్వ దించి ,అక్షింతలు వెయ వలసినది గా కోరుతున్నామం ”అని ఆహ్వానించే వారు .అసలు కార్య క్రమం రోజున ఇంకో గంటకు విస్తళ్ళు వేసి వడ్డిస్తారు అనగా కుర్రాళ్ళను,పిలిచినా ప్రతి ఇంటికి పంపి ”ఆలశ్యం లేదు .విస్తళ్ళు వేస్తున్నారు .త్వరగా రండి ”అని చెప్పి వచ్చే వారు .నేను ,మా తమ్ముడు ,మా మామయ్య గారి అబ్బాయి ఇలా మా ఇళ్ళలో జరిగే కార్య క్రమాలకు వెళ్లి పిలిచి వచ్చే వాళ్ళం .అలాగే మిగతా వాళ్ళు చేసే వారు .ఇదో గౌరవ మైన పిలుపు .
                   ఆ నాడు ఇళ్ళల్లో అందరికి సరి పడ గ్లాసులు ఉండేవి కావు .అందుకని భోజనానికి వెళ్ళే వారు ఎవరి గ్లాసు ,చెంబు నీళ్ళ తో తీసుకొని వెళ్ళే వారు .సాధారణం గా పెద్దలందరూ పంచె కట్టు కొని ,చొక్కా లేకుండా తువ్వాల పైన వేసు కొని,మడి తో  వెళ్ళే వారు .చిన్న పిల్లల మైనా మేము కూడా అంతే .మట్ట లాగు ,పైన తుండు ,చేతి లో గ్లాసు ,చెంబు లతో ప్రత్యక్షం .పెద్దలకు వేరుగా ,చిన్న లకు వేరుగా వడ్డన వుండేది .మడి వాళ్ళ ను ముట్టు కో కూడదు .అదో నియమం .చాలా ఆప్యాయం గా కొసరి కొసరి వడ్డిచే వారు .తింటే కాని వదిలే వారు కాదు .నెయ్యి కి ఝారీ ఉండేవి .దానితో చేయి నిండా నెయ్యి వడ్డించే వారు .పెరుగు వుండటం తక్కువే .మజ్జిగ ఎక్కువ గా పోసే వారు తృప్తి గా  తింటేనే యజమానికి ఆనందం ఒక వేల ఏ కుటుంబం లో నైనా రాక పొతే మళ్ళీ కబురు చేసే వారు .పంక్తి భోజనాలు మహా మజా గా ఉండేవి .చేతులు కడుక్కో వటానికి దొడ్లోనో ,వాకిట్లోనో గంగాలాలతో నీళ్ళు ,చెంబు పెట్టె వారు .వాటిని వాడు కోవాలి .చేతులతో పాటు ,కాళ్ళు కూడా పొడి లేకుండా కడుక్కో వాలి ..పొడి వుంటే శని అందు లోంచి ప్రవేశిస్తాడని భయం .అందుకని అంత జాగ్రత్త .తారు వాత తువ్వాలతో కాళ్ళు తుడు చు కో వాలి .ఒక పళ్ళం లో లేత తమల పాకులు ,ఫై.ఎస్ .ఆర్ .వాక్క పొడి ,ముద్దా సున్నం ఉండేవి .వాటిని కావలసిన వాళ్ళు హాయిగా కావలసినన్ని వేసు కొని నమిలే వారు .నోరు బాగా పండితే మహదానందం .యజ మానికి చెప్పి ఇంటికి బయల్దేరటం అలవాటు .అదీ ఆ నాటి భోజన పధ్ధతి .ఇంట్లోని ఆడ వాళ్ళే ఎంగిలి విస్తళ్ళు ఎత్తి పారేసే వారు .ధన వంతులు డబ్బిచ్చి ఎవరి తోనైనా తీయించే వారు .ఆనాడు అందరికి సరి పడ పీత లు ఉండేవి కావు .చాపల మీద కూర్చొని తినటం నిషిద్ధం .వుంటే నెల బల్ల లు ,లేక పొతే కింద కూర్చొనే తినే వారు .వూళ్ళో వారు అందరు వచ్చి భోజనాలు చేసిన తర్వాత ఇంటి యజమానులు భోజనం చేసే వారు .రాని వారి కోసం రెండు మూడు సార్లు కబురు పంపటం రివాజు .
                   ఇలా దాదాపు ప్రతి గృహస్తు మర్యాద గా ఆహ్వానించి గౌరవించటం వుండేది .ఖాళీ లేదని ఎవరికీ చెప్పే వారు కాదు .పంక్తి నిండి పొతే విడిగా వారు కాసేపు కూర్చోవ టానికి ఏర్పాటు చేసే వారు .అలా చేయ వలసి వచ్చి నందుకు బాధ పడే వారు .అందరు రావాలనే కోరికే వుండేది .రాక పొతే పోయార్లె అని వుండేది కాదు .కోదండ రామయ్య గారి మాట వదిలి భోజనాలలో మునిగి పోయాం .ఇప్పుడు ఆ విషయం లోకే వస్తున్నాను .ఈ సంఘటన నేను చూసింది కాదు .మా మామయ్య ,నాన్న ,వెంకట్రామయ్య గ్సారు చెపితే విన్నది .అంటే నాకు ఇంకా గ్రాహకం రాక ముందు జరిగిందన్న మాట 
                       మా ఉయ్యూరు లో ఊర వారి బజారు చివర అంటే ఉత్త రాన రాయ ప్రోలు కోదండ రామయ్య గారి ఇల్లు వుండేది .బాగా ఎత్తరుగుల ఇల్లు .బాగా స్థితి మంతుడు ఆయన .పచ్చ గా ,దబ్బ పండు రంగులో చాలా అందం గా .లేత తమల పాకు ల వుండే వారు .ఒడ్డు ,పొడుగు భారీ మనిషి గ్లాస్కో పంచె ,లాల్చి తో చాలా అందం గా వుండే వారు .ఆయన కొడుకు సాంబమూర్తి .వాళ్ళ అమ్మాయి ఒకావిడ మా రెండో అక్కయ్య క్లాసు మాటే .రెండో అమ్మాయి సౌదామిని నాకు క్లాస్ మాటే .వాలందఱు అందం గా నే వుండే వారు .పొలం ,పుత్రా నాగా నటరా బాగా ఉన్న వారు .అయితే ఆయన ఎవరితోనూ కలిసే వాడు కాదు .ఆయన మా నాన్న గారికి స్నేహితుడు .మా మేన మామ గుండు గంగయ్య గారికి సహాధ్యాయి .వీళ్ళిద్దరూ ”ఏరా అంటే ఎరా ”అను కొనే వాళ్ళు .ఆయన చెల్లెలే దస్తావేజులు రాసే కొలచల వెంకట రామయ్య గారి భార్య ..అయితే వారిద్దరి కుటుంబాలకు నాకు తెలిసి నంత వరకు రాక పోకలు లేవు .వెంకట్రామయ్య గారు మా నాన్న స్నేహితుడు ఒరే అను కొనే వారు .మాకుటుమ్బానికి చాలా  సన్నిహితులు .అంటే కాదు కోదండ రామయ్య గారి భార్య తమ్ముడు మా అన్నయ్య గారి అమ్మాయి భర్త అంటే వేలూరి రామ కృష్ణ (చిరి వాడ )కు మేన మామ .అంటే వాళ్ళమ తమ్ముడు .వీళ్ళ పెళ్లి అయింతర్వాత ఆ బంధుత్వం తెలిసింది .
                   ఒక సారి కోదండ రామయ్య గారింట్లో ఏదో షుహ కార్యం జరిగిందట .వూరి లోని బ్రాహ్మణ్యాన్ని అందర్నీ భోజ నాలకు పిలి చారట .ఆయన తీరు అందరికి తెలిసిందే .ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యం గారు ఆ పక్కనే వుండే వాడు .ఆయన తోనే మాటలు ఉండేవి కాదని చెప్పు కొనే వారు . మా నాన్న ,మా మామయ్య ఇంకా కొందరు కోదండ రామయ్య గారింటికి భోజ నాలకు వెళ్ళారు .అప్పటికే జనం బాగా వచ్చారట ..వాలది డాబా ఇల్లు .అన్ని వస్తూ లతో ,తూగు తుయ్యాల తో ,వాలు కుర్చ్క్=హీతో మహా NEAT గా వుండేది .సరే వీళ్ళు అక్కడికి వెల్ల గానే తలుపులు వేసి వున్నాయట .తలపులు వేయటం అప్పుడు అల వాటే కారణం భోజ నాలు చేస్తుంటే ఎవ్వరు చూడ రాదనే ఒక అభిప్రాయం .తలుపు తట్టారట .కోదండ రామయ్య గారు తలుపు తీసి ”నో వేకన్సి-సారి ”  అని తలుపు మూసే”NO VACANCY ” బోర్డు చూపించాడట . .వీళ్ళకు కోపం వచ్చింది .మొహం మీదే తలుపు వేయటం అవమానం అని పించిందట .అంటే తిరుగు టపా లో తిరిగి ఇంటికి వచ్చారట .వంట చేయించుకొని అప్పుడు భోజనం చేశారట ..విషయం తెలుసు కొన్న కోదండ రామయ్య గారు తర్వాత ఎవరినో పంపించారట భోజ నాలకురమ్మని  .వీళ్ళు మళ్ళీ వాళ్ళింటి గడప అప్పటి నుంచి తొక్క లేదట .ఎప్పుడు మా ఇంట్లోను ,మామయ్య గారింట్లోను భోజ నాలు సందర్భం లో ఈ సంఘటన గుర్తు చేసు కొని పడీ పడీ నవ్వు కొనే వారు ”ఎరా మీ ఇంట్లో కూడా నో వేకన్సి బోర్డు పెట్టావా ”అని నవ్వు కొనే వారు .ఇదీ నో వేకన్సి కదా .ఇప్పటికి నా పేజికి కూడా ”నో వేకన్సి– .సారి ”.
                                              మీ దుర్గా ప్రసాద్ –24 -11 -11 .

ఊసుల్లో ఉయ్యూరు –5 పాపం- వెంపటి శర్మ గారి శ్రమకు ఏం మిగిలింది ?-
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

స్వామిశివానందుల ఉపనిషత్ సార సంగ్రహం —3

స్వామిశివానందుల  ఉపనిషత్ సార సంగ్రహం —3

                                                        తత్వ మసి

—                       జీవుడే సత్ ,చిత్ ఆనంద బ్రహ్మ .అయితె ఆ బ్రహ్మను ఓంకారం తో అర్ధం చేసు కోవాలి ”.తత్ -త్వం -అసి” అంటే ”నీవే- అది ”అనగా నీవే ఆ పర బ్రహ్మం .జీవాత్మకు ,పర మాత్మ కు భేదం లేదు .పాలలో వెన్న ఎలా దాగి వుందో ,అలాగే ప్రతి జీవి లోను ఆత్మ దాగి వుంది .ఎవరు ధ్యానం చేస్తారో ,సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారో ,వారికే ఆ ఆత్మ దర్శనం లభిస్తుంది .ఇది శాస్త్ర పథనం వల్ల లభించేది కాదు .ప్రశాంతత ,ధర్మ చింతన ,సత్ ప్రవర్తన ,ఇంద్రియ నిగ్రహం తో నే దాన్ని సాధించాలి .అయితే ఈ ఏకాగ్రతను భగ్నం చేయ టానికి కొన్ని శక్తులు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే వుంటాయి .అవే ”లయ ,విక్షేప ,క్షయ,రాసాద్వాదనలు ”లయ అంటే నిద్ర .దీన్ని పోగొట్టు కోవటానికి ప్రాణా యామం చేయాలి .బయట వస్తు వులపై ఆకర్షణే విక్షేపం .అను రాగం వల్ల కలిగేది క్షయం .ఈ రెండు తొలగితే రసాస్వాదన కల్గుతుంది .అయితె ,ఆస్వాదన నిర్వి కల్ప సమాధి రుచిని చూడ టానికి మాత్రమె ఉపయోగిస్తే ,సాధకుడు ఒక మెట్టు పైకి ఎక్కి నట్టే .

                  మనసు    లోని మాలిన్యాలను నశింప జేసు కో వాలి .కోరిక ,భయాలను నశింప జేస్తే ,తప్ప మనసు పవిత్రం కాదు .మోక్షం అంటే స్వతంత్ర మైన పరి పూర్ణతే ..దీనికి శత్రువు కోరిక కలిగి ఉండ టమే .అంతటా వ్యాపించి వుండే వాయువు ఎలా మార్పు చెంద కుండా వుంటుందో ,అలాగే ,ఆది ,అంతం లేని గుణ రహిత మైన పర మాత్మ ,ఏ శరీరం లో వున్నా ,వికారం పొంద టానికి కాని ,మార్పు చెందటం కాని జరుగదని అర్జునినికి   భగవద్ గీత లో కృష్ణ పర మాత్మ తెలియ జేశాడు .ఆత్మను తెలుసు కొని ,స్వయం ప్రకాశ మైన అఆత్మ లో , ‘ అంటే పరమాత్మ లో ఇక్యం చేసు కోవాలి .అప్పుడు మిగిలిన ప్రపంచం అంతా ,మన లోని ప్రశాంత భావమే  వికశిస్తుంది .ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి చూసేది ,చూడ బడేది తన లోనే లీనం అవుతుంది .అంటే త్రిపుటి మాయమవుతుంది .అప్పుడే బ్రహ్మ లో ఇక్యం అవుతాడు .అంటే తన ఆత్మ ను ప్రతి  వాని లోను ,చూడ గలిగిన ఒక ఉత్కృష్ట స్థితితి ని ,అంటే నిర్వి కల్ప సమాధి స్థితిని పొందిన రుషి మాత్రమె ఆ దర్శనం పొంద గలదు .అతడే జీవన్ముక్తుడు .అతడు మృత్యువుకు భయ పడడు .తురీయావ స్థ లో ,అతడు వున్నట్లు భావిస్తాడు .అతనికి భూత ,భవిష్యత్ ,వర్త మానాల జ్ఞానం తెలుస్తుంది .కోరిక ,బాధ వుండదు .అన్నిటా సమ దృష్టి వుంటుంది .నిందా స్తుతులకు చలించాడు .
                                           ఈశ్వర తత్త్వం
              ”ఏకమేవ అద్వితీయం బ్రాహ్మామృతం -అఖండ చిదానందా కారం -నిర పేక్షం పరి పూర్ణం ”అంటుంది ఉపనిషత్తు .అంటే ఈశ్వరుడు ఒక్కడే .వేరెవరు లేరు .ఆయన ద్వంద్వాలకు అతీతుడు .జ్ఞానానంద మూర్తి ,ఆత్మా  రాముడు ,సంపూర్ణుడు .పరమాత్మ అంతటా విస్తా రించి వున్నాడు .సర్వ భూతాలలో వున్నాడు .చూడ బడే వస్తువు వెనుక పర మాత్మ వున్నాడు .శాశ్వతుడై ,రూప రహితుడై ,త్రికాల సాక్షీ భూతుడై న  ప్రత్య గాత్మ ను ఘోర తపస్సు వల్లనే కను గొనాలి ..
                  ”పరి వర్ద  మానాత్ సంకల్ప దేశ ప్రపంచో  జాయతే –సంకల్ప క్షయే ప్రపంచ క్షయః సర్వ సంకల్పా భావ ఏవ మోక్షః ”
         సంకల్పం వల్లే లోకం వుంది .సంకల్పం లేక పొతే లోకం అదృశ్య మౌతుంది .సంకల్పాన్ని వదిలించు కోవటమే మోక్షం .సంకల్పం నిప్పు .,కోర్కె అనే సమిధ తో ,రగుల్కొంటుంది .కోరిక అనే సమిధ ను వారిస్తే ,నిప్పు రాచదు .
              ”యన్ని రస్త ద్వైత మనాద్యంత మక్షరం -జగతో స్వాధిష్టానం ,నిష్కల్మషం ,జన్మ మృత్యు వివర్జితసం –విభాగ రహితం ,తదేవ బ్రహ్మత్వమసి –సౌమ్య !అవధారయ !తదే తద ద్వైతా మృతం అను ధ్యాయన్ -అస్మిన్నే వక్షనే సాక్షాత్కారం మవ్యాప్ససి ”
  అంటే ఏది ద్వంద్వ రహితమై ,శాశ్వతమై ,సత్యమై ,విశ్వానికి ఆట పట్టై ,అంగ రహిత మై ,ఏక రూపం లో జనన ,మరణ ,రహితం గా ,వుంటుందో ,అదే పరమాత్మ . ఆయన్ను ధ్యానించాలి .అంటే అందరిని సమ దృష్టి తో చూడాలి .అప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం .నేనే దేహం అనే భావం ను వివేకం అనే ఖడ్గం తో చేదించాలి .అప్పుడే నేనే సచ్చిదానండుడనే భావం కల్గుతుంది .మనసు కు వస్తువు పై కాని ,మనుష్యుల పై గాని ,స్థలం పై గాని ,ఆసక్తి ,ఏర్పడుతుందో ,అప్పుడే బంధం ఏర్పడు తుంది .వీటికి అంట కుండా ,ఉండటమే ముక్తి .”నేతి-నేతి ” ”అంటే ”కాదు -కాదు ”.అనే సిద్ధాంతం తో ,పంచ కోశాలను వదలి నప్పుడే పరి పూర్ణ మైన శాశ్వత పరమాత్మ మాత్రమే మనస్సు లో మిగులు తాడు ..
                                      సశేషం
                                                    మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | 2 Comments

ట్రినిడాడ్ లో ఒక తెలుగుఅమ్మ – ఆంధ్ర జ్యోతి లో

Posted in వార్తా పత్రికలో | Leave a comment

చరిత్ర భాస్కర కోట వెంకటచలం గారి రచనలు

Posted in సేకరణలు | Leave a comment

పైడిపాల సిని గేయ ఆవిష్కరణ

Posted in సభలు సమావేశాలు | Leave a comment

కార్తీక మాస శోభ

కార్తీక మాస శోభ

                     కార్తీక మాస శోభ 

                   కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు వున్నాక్ నేలను కార్తీక మాసం అంటారు .కృత్తిక అగ్ని నక్షత్రం .శివుడు అగ్ని ని మూడో కన్ను గా కలిగి ఉన్నాడని మనకు తెలుసు .అందుకని శివాలయం లో శివ లింగానికి ఎదురు గా నందీశ్వ రున్ని ఎర్పాత్రు చేస్తారు .నంది నాసిక పుతలనుంచి వచ్చే చల్లదనం శివుని వేడిని తగ్గిస్తుందని అభి ప్రాయం .అందుకే లింగానికి ,నదికి మధ్య గా ఎవ్వరు నిలబదరు ,మధ్య లోంచి వెళ్లారు .రేపటి తో కార్తీక మాసం పూర్తి అవుతుంది రేపు అమావాశ్య .అమా వాశ్య  తెల్ల వారు ఝామున ”పోలి”ని స్వర్గానికి పంపు తారు .దీనికి ఒక కధ వుంది .ఒక చాకలి ముసలి ఆవిడకు అయిదుగురు కోడళ్ళు ఉన్నారట .ఆమె ఆశ్వ యుజ బహుళ అమావాశ్య  నుంచి కార్తీక బహుళ అమావాశ్య వరకు తెల్ల వారు ఝామునే లేచి ,ఏటి లో చన్నీటి స్నానం చేసి దీపం పెట్టు కొనేది .ఇలా ఒక నెల గడి చిన తర్వాత కార్తీక అమావాశ్య  నాడు చిన్న కోడలు ”పోలి”ని  ఇంటికి కాపలా పెట్టి మిగిలిన కోడళ్ళను తీసుకొని నది ఒడ్డుకు వెళ్ళింది .చిన్న కోడలు పెరుగు చిలికి వెన్న తీసి ,కవ్వానికి అంటిన వెన్న తీసి ,పత్తి చెట్టు కింద రాలిన పత్తి తో వత్తి చేసి ,ప్రమిదలో పెట్టి ,శుభ్రం గా నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించింది .అత్త గారు వచ్చి తిట్టు తుందనే భయం తో ఆ దీపం కనపడ కుండా దానిపై చాకలి బాన బోర్లించింది .దేవతలు ఆమె భక్తికి సంతోషించి ,దివ్య విమానాన్ని తెచ్చి ,ఆమెను బొందె తో కైలాసానికి తీసుకు వెళ్ళారు .వూళ్ళో వున్న వారంతా ”,చాకలి పోలి స్వర్గానికి వెడుతోంది ”అను కుంటు వింత గా చూశారు .విమానం బాగా క్రిందు గా పోతూ వుండటం తో ఆమె కాళ్ళు పట్టు కోని వూరి జనం కూడా ఆమెతో స్వర్గానికి   వెళ్తున్నారు .విష్ణు దూతలు ”ఈ పోలి అధిక భక్తీ తో జ్యోతిని వెలి గించింది .కనుక స్వర్గానికి తీసుకొని వెళ్తున్నాం .మీకు ఆ అదృష్టం లేదు ”అని వాళ్ళను కిందకు తోసే శారు .పోలి శరీరం తో స్వర్గానికి వెళ్ళిన పుణ్యాత్ము రాలు .అందుకే ఆమె ను తలచు కుంటు కార్తీక అమావాశ్య తెల్ల వారుజ్హామున నది ఒడ్డున దీపాలు వెలిగించి ఆమె ను గుర్తు చేసు కొంటు ,ఆమె కధను చెప్పు కొంటు ,నీటి లో దీపాలు వదిలి పెడ తారు స్త్రీలు అంతా .స్త్రీలు అందరు ఈ కధ చెప్పు కోని అక్షంతలు నెత్తినా వేసుకొని ఇంటికి తిరిగి వస్తారు .అరటి దొప్ప లలో ఆవు నీతి దీపాలు వెలిగించి నీటి లో వదులు తారు .అదీ పోలి స్వర్గానికి పోవటం అంటే .ఇందు లో రెండు ముఖ్య విషయాలున్నాయి .ఒకటి భక్తికి కులం అడ్డు రాదు .అందుకే అందరు అన్ని కులాల స్త్రీలు ”పోలి తల్లి ”ని గుర్తుంచు కోని దీపాలు పెట్టి సాగ నమ్పటం .రెండోది కార్తీక దీపానికి అంత ప్రాముఖ్యత వుంది అని తెలియ జేయటం .నిశ్చల భక్తీ తో చేసింది ఏదైనా పర మేశ్వరుడు మెచ్సుతాడు .

—                    ఇప్పుడు కార్తీక మాస ప్రాముఖ్యాన్ని తెలుసు కుందాం .కార్తీకం శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన నెల .ఆశ్వయుజ కార్తీక మాసాలు శరదృతువు .వర్షాలు వెనక్కి తగ్గి నదుల నీరు తేట బడు తుంది .సర్ద్రుతూ వు పౌర్ణమి వెలుగు అద్భుతం గా వుంటుంది .మనసు పర వశం చెందు తుంది .ప్రకృతి అంతా ప్రశాంతం గా వుంటుంది .అందుకని మన మనసులను కూడా ప్రశాంతం గా ఉంచు కో వాలని సూచన కూడా .ఆశ్వయుజం లో శక్తి ఆరాధన చేస్తాస్ము .అదే దసరా .నవ రాత్రులు భక్తీ శ్రద్ధ లో తో నిర్వ హిస్తాం .చెడు పై మంచి పొందిన విజయమే విజయ దశమి .దుష్ట సంహారం జరిగి శిష్టులను కాపాడిన లలితా త్రిపుర సుందరీ దేవిని ఘనం గా ఆలయాలలోను ,ఇళ్ళల్లోను అర్చించి తరిస్తాము .కొత్త అల్లుళ్ళను పండుగకు ఆహ్వానించి గౌర విస్తాం.తారు వాత దీపావళి అదీ దుర్మార్గాన్ని అంతం చేసే పండగే .సరదా గా దీపాలు పెట్టి ,టపాకాయలు కాల్చి దుష్ట సంహారం జరిగిందని ఆనంద పాడు తాం .దీని తర్వాత కార్తీక మాసం ప్రా రంభమవుతుంది .

                     కార్తీం లో దీపానికి స్నానానికి ప్రత్యేకత వుంది .తెల్ల వారు జామునే లేచి చన్నీళ్ళు స్నానం తలారా చేసి తులసి చెట్టు దగ్గరో ,ఉసిరి చెట్టు కిందో దీపా రాదన చేస్తారు .ఇంటిలో దేవ తార్చన వున్న వారు అభిషేకం చేసు కొంటారు .శివాలయానికి వెళ్లి శివుని దర్శించి తరిస్తారు .సాయంత్రం వేళ ”ఆకాశ దీపాలు ”వెలిగించి ధ్వజ స్తంభా లకు కర్రతో కట్టి పైకి చేరు స్తారు .ఆ దీపాలకు ముందే పూజ చేసి పైకి ఎత్తు తారు .ఆడ వాళ్ళంతా ఆ దీపోత్చ వాణికి హాజరై భక్తీ శ్రద్ధలతో నమస్కరిస్తారు .ఇది నెల రోజూ జరిగే కార్య క్రమం .ఇది వరకు శివాలయం లోనే చేసే వారు .ఇప్పుడు అన్ని ఆలాయా ల లోను ఆకాశ దీపాలు పెడుతున్నారు .ఇదొక వేడుక గా నిర్వ హిస్తున్నారు .
           కార్తీక మాసం ప్రారంభ మైన రెండా వ రోజూ అంటే శుక్ల విదియ ”భగినీ  హస్త భోజనం ”అంటే అన్నా చెల్లెళ్ళ పండుగ .అక్క ఇంటికి తమ్ముడు వచ్చి భోజనం చేయాలి .అక్కకు బహుమతి ఇవ్వాలి .లేక పొతే అన్న చేల్లెలింటికి వెళ్లి భోజనం చేసి బహుమతి ఇవ్వాలి .అన్న ,కాని తమ్ముడు కాని అక్క ,లేకచెల్లెలు ఇంటికి వెళ్ళాలి .అక్క ,చెల్లెలు అన్న ,లేక తమ్ముడు ఇంటికి కాదు అని తెలుసుకోండి .
                కార్తీక శుక్ల చవితి ”నాగుల చవితి ”అందరు పుట్టలో పాలు పోస్తారు .చలిమిడి ,వడ పప్పు నై వేద్యం పెడ తారు .పుట్ట మన్ను ను భక్తీ తో తీసు కోని చెవులకు కొద్దిగా రాసు కొంటారు .మోపి దేవి లోని వల్లీ ,దేవ సేనా సమేత శుబ్రహ్మనఎశ్వర స్వామిని దర్శించి ,పూజించి తరిస్తారు .
             శుక్ల దశమి నాడు ”యాజ్న్య వల్క్య జయంతి ”శుక్ల ఏకాదశి మహా పర్వ దినం .ఉప వాసాలు వుంటారు .రాత్రి దాకా వుంది శివుడిని దర్శించి అ.చంద్ర దర్శనం అయింతర్వాత భోజనం చేస్తారు .కొందరు ఆ రోజల్లా ఉపవాసం చేసి మర్నాడు ద్వాదశి నాడు బంధు మిత్రులను పిలుచు కోని అన్నీ రకాల పదార్ధాలు వండుకొని సంతోషం గా భోజనం చేస్తారు .
             శుక్ల ద్వాదశి ని ”చిలుకు ద్వాదశి లేక క్షీరాబ్ధి ద్వాదశి ”అంటారు . .సాయంకాలం ఉసిరి చెట్టు కింద ,తులసి చెట్టు వద్ద పూజ లు చేస్తారు .కార్తీక దామోదర స్వామిని అర్చించి బ్రాహ్మణులకు వాయినాలు ఇస్తారు .దీనికి ఒక కధ వుంది ఒక బ్రాహ్మణుడికి శివుని వరం తో ఒక కుమార్తె కల్గింది.పేరు నారాయణమ్మ .ఆమెను ఎవరు పెళ్లి చేసు కో లేదు .తండ్రి ఆమెను ఒక రాతి కి పెళ్లి చేశాడు .అది ముక్క లై పోయింది .ఒక పుణ్యాత్మురాలు చిలక ముగ్గు నోము నోచగా నారాయణమ్మ ఆమెను దాని ఫలితాన్ని తనకు ఇమ్మని వేడు కొంది .ఆమె ఇచ్చింది .అప్పుడు ఆమెకు పుణ్య స్త్రర్త్వం వచ్చింది .అప్పటి నుంచి పునిస్త్రర్లు అందరు ఆ నోము నోస్తున్నారు . ,
               కార్తీక పౌర్ణమి చాలా విశేష మైనది .పుణ్య నదీ ,సముద్ర స్నానాలు చేస్తారు .ఉప వాసం వుంటారు రాత్ర కి సత్య నారాయణ వర తం చేసు కొంటారు .శివాలయాలన్నీ ఈ రోజూ కిట కిట లాది పోతాయి భక్త జన సందోహం తో .”హర హర మహా దేవ శంభో ”అని దిక్కులు పిక్క టిల్లెట్లు గా భక్తీ తో నోరారా అంటే ఒళ్ళు పులకిస్తుంది .జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు .అంటే దేవాలయం అంతా దీపాలతో అలంకరిస్తారు .శివ లింగం బొమ్మ వేసి దాని పై ప్రమిద దీపాలుంచి చక్క గా అలంకరిస్తారు .దీప శోభతో ఎంతో ఆనందం మనసుకు కలుగు తుంది .ఆవు నేటి దీపాలు కనుక వాటా వరనాన్ని కాలుష్యం నుంచి కాపాడు తాయి .కొద్దిగా చలి ప్రారంభ మాయే రోజులు .కనుక వెచ్చ దనం హాయిగా వుంటుంది ..
            బహుళ చతుర్దశి ”మాస శివ రాత్రి ”దీనినీ అభిషేకాలతో జరుపు తారు .ఇలాఎన్నో రోజులు ఈ మాసం లో శివునికి ప్రీతి కార మైన రోజూ లున్నాయి .ఆది వారాల్లో సామూహికం గా వన భోజ నాలు ఏర్పాటు చేసు కోని ఆనందిస్తారు .అనుదిన శివారాధన ముక్తికి హేతువు ..
          శివుడిని లింగ రూపం లోనే అర్చించాలి కృష్ణార్జునులు పూర్వ జన్మ లో శివలింగాని అర్చించారు .అశ్వత్థామ పూర్వ జన్మ లో శివుడి బొమ్మను పూజించాడు .అందుకే భారత యుద్ధం లో అశ్వత్థామ ,కృష్ణార్జును లపై వేసిన నారాయనాష్ట్రం వాళ్ళను ఏమీ చేయ లేక పోయింది .ఈ విషయం స్వయం గా వ్యాసుల వారే అశ్వథామ కు అతను అడిగితే చెప్పారు .
             శివ లింగానికి అభిషేకం చేస్తారు .మహాన్యాసం తో పద కొండు సార్లు నమక చమకాలతో .ఇక్కడ ఒక విషయం తెలుసు కో వాలి .రుద్రుడు కాని వాడేవాడు రుద్రున్ని అర్చించ టానికి వీలు లేదు .మరి మనం ఆవ లేము కదా .అందుకని శివుని అన్ని శరీర భాగాలు మన శరీరం లోకి ఆవాహన చేసు కొంటాము .న్యాసం  అంటే వుంచటం .అలా న్యాసం చేసు కొంటె మనం రుద్ర రూపాన్ని పొందుతాం.అప్పుడు మనం రుద్రుని అర్చించ టానికి అర్హులం అవుతాం .ఇదీ ఇందు లోని పరమార్ధం శివ లింగం లో ”ప్రజ్ఞానం లో బ్రహ్మ ,పాదం లో విష్ణువు ,హస్తం లో హరుడు ,బాహువుల్లో ఇంద్రుడు ,జతరం లో అగ్ని ,హృదయం లో శివుడు ,కంఠం లో వన వాసుడు ,నాలుక లో సరస్వతి ,నాసికలో వాయు ,కళ్ళల్లో చంద్రుడు సూర్యుడు ,చెవుల్లో అశ్వినీ దేవతలు లలాటం లో రుద్రుడు ,మూర్ధా భాగం లో ఆదిత్యుడు ,శిరసు లో మహాదేవుడు ,శిఖా లో వాసు దేవుడు ,పృష్టం లో పినాకిని ,ముందు శూలి ప్రక్కల శివుడు ,శంకరుడు ,అన్నిటా వాయువు దానికి బయట అగ్నీ జ్వాలా సర్వ అంగాలలో సర్వ దేవతలు యధా స్థానం లో వుంది నన్ను ,రక్షించాలి ”అని శివుని ఆవాహన చేసు కుంటాం .
                 ”  దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్సనాతననః ”దేహం అనే దేవాలయం జీవుడే సనాతనుడైన పర మేశ్వరుడు .శివునికి వ్యోమ కేశుడు అని పేరు .అంటే ఆకాశమే జుట్టు గా కల వాడు .జాతీ అంటే అని రహశ్యాలు తెలిసిన వాడు .శివుడు జటా జూటి .
                    ఈ కార్తీకం లోపంచారామాలోఅలో వున్న శివున్ని దర్శించి తరిస్తారు .వీలున్న వారు ద్వాదశ జ్యోతిర్లింగా దర్శం చేస్తారు .రుద్రాక్ష మాల ధరిస్తారు .శివ పంచాక్షరీ జపం చేస్తారు .శివ స్తోత్రాలను భక్తీ తో పతిస్తారు .శ్రీ శంకర భగవత్పాదులు రాసిన ”శివా నంద లహరి ”గానం చేస్తూ ,అర్ధ వివరణం తెలుసు కొంటు జనం సాఫల్యం చేసు కొంటారు .ఈ మాసం అంతా ఇలా గీ మీరందరూ గడి పీ ఉంటా రాణి భావిస్తున్నాను .కార్తీకం తర్వాత వచ్చేది ”మార్గ శిర మాసం”అది విష్ణువు కు మహా ప్రీతి కర మైంది .ఇందులోనే ధనుర్మాసం వస్తుంది .
     ”నమశివాభ్యాం పర మ్మౌషదాభ్యాం -పంచాక్షరీ పంజర రంజి తాభ్యాం 
      ప్రపంచ సృష్టి స్థితి సంహ్రుతాభ్యాం –నమో నమః శంకర పార్వ తీభ్యాం .
                                     కార్తీక పుణ్యం అందరికి లభించాలని కోరుకుంటూ —-మీ .గబ్బిట దుర్గా ప్రసాద్ —24 -11 -11 .
 
 
-మీ .గబ్బిట దుర్గా ప్రసాద్ —24 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.comGabbita Durga Prasad
Posted in రచనలు | Leave a comment

సర్వం పూజ్యం శ్రీ రామ రాజ్యం

 సర్వం పూజ్యం శ్రీ రామ రాజ్యం 

                   శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి నమస్తే .కులాసా అని తలుస్తాను . .మీరు శ్రీ రామ రాజ్యం చూసి నాకు మీ భావాలు మెయిల్ చేశారు నాలుగు రోజుల క్రితం .నన్ను కూడా చూసి నా అభిప్రాయం రాయమని ,దాని కోసం ఎదురు చుస్తున్టాననీ మీరు రాశారు .ఎందుకో చూడాలి అంటే భయం వేసింది .అందుకనే కొంత ఆలశ్యం చేశాను .వార్తలు చూస్తుంటే రెండో వారం ఉయ్యూరు లో ఆడదేమోనని పించింది .ఇవాళ ఉదయం పద కొండున్నర ఆటకు నేను ,మా శ్రీమతి ,మా కోడలు సాయిమహల్ లో చూశాము .హాల్ కెపాసిటీ సుమారు రెండొందల యాభై వుంటుంది .నేల,బెంచీలలో  కలిపి ఆరుగురు వున్నారు .బాల్కనీ కి వెళ్లాం మేము .అక్కడ కెపాసిటీ సుమారు యాభై వుంటుంది దాదాపు అన్ని సీట్స్ నిండాయి .వీరందరూ పౌరాణికం మీద ప్రేమతో వచ్చి వుంటారు .కొందరు బాపు రమణల మీద నమ్మకం తో వచ్చివుంటారు .ఈ category లో మా ఫామిలీ వుందని మీకు తెలుసు .నాకు మొదటి నుంచి ఆశ లేదు .అయినా దింపుడు కళ్లం ఆశతోనే వెళ్లాం .సుమారు సంవత్సరం క్రితం మీరు బాపు గారు రామరాజ్యం తీస్తున్నట్లు చెప్పారని నాకు రాశారు .అప్పుడే నేను అయ్యో పాపం అని రాసి నట్లు గుర్తు ,ఎందుకో పాపం ఆ జంట చేసినవేవీ up to the mark  గా లేక పోవటం తో నాకు ఈ మధ్య విడుదలైన సినిమాలు ఏవీ చూసే సాహసం చెయ్య లేక పోయాను .ఇది బాపు రమణ ల ఇష్ట దైవం అయిన శ్రీ రాముని సినిమా కదా ఎంతో కొంత సరుకు ఉంటుందని ధైర్యం చేసి వెళ్లాం .

              ఒక్క మాట లో చెప్పా లంటే అది బాపు తీసిన ,రమణ రాసిన సినిమా కాదు ,కాదు ,కాదు .అని అనిపించింది .బాపు అంటే ఎంత వూహ వుంటుంది ,రమణ మాట అంటే ఎంత లోతు భావం వుంటుందీ !ఇవి రెండూ ముందు పూజ్యం .తర్వాతరమణ  మాటల్లో between the lines కు ఎంతో ప్రాముఖ్యం వుంటుంది .బాపు ఒక సీన్ తీస్తే అది అంత అందంగా ఎలా ఉంటుందా అనే ఆశ్చర్యం తో మునిగి పోతాం.ఒడలు మరుస్తాం .ఆ అందానికి దాసోహం అంటాం .dialogue  కంటే భావానికి ప్రాధాన్య మిచ్చే ట్లు నటింప జేసే మహోన్నత దర్శకుడు   బాపు .రమణ మాట రాస్తే అందు లో ఎన్నో అర్ధాలు వెతికి మనసు ఉప్పొంగి పోతుంది .ఇవేవీ మచ్చుకు కూడా కని పించవు .ఇక బాపు సినిమా అంటే అద్భుత మైన చిత్రాల దర్శనం అప్రతిభుల్ని చేస్తుంది .అవి చూస్తే చాలు ఇంకేమీ లేక పోయినా పర్వాలేదని అందరి అభిప్రాయం .ఇదీ పూజ్యమే .ఇక్కడ రెండు మూడు సెట్టింగులు చూడటానికి చాలా gorgeous కని పిస్తాయి .అవి చూస్తే మనం రామ రాజ్యం లో ఉన్నామని అని పించవు -రోమన్ సామ్రాజం  లో వున్నట్లని పిస్తుంది .nativity లో లోపం వుందని పించింది ఇనేత్రానందము పూజ్యం .పోని జగదానందం ఉందా అంటే ,నలుగురు మనుషులు కూడా  కనిపించరు .రామ రాజ్యం లో ప్రజల ఆనంద సామ్రాజ్యం కని పించదు .సాధారణం గా వాచ్యానికంటే భావానికి ప్రాధాన్య మిచ్చి తీసే ఈ జంట ,ఇందులో వాచ్చ్యానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి భావానికి ,మన ఆలోచనకు ,మనకు రాముని మీద ,రామ రాజ్యం మీద ఏర్పడాల్సిన అభిప్రాయానికి అసలు వీలు లేకుండా చేశారు .అందరి పాత్రలకు అతి గా సంభాషణలు వున్నాయి ఇవి రమణ సంభాషణలు కావు  పరుచూరి వారి దీర్ఘ ,అతి దీర్ఘ సంభాషణలు అనిపిస్తాయి .ఇక్కడా మనసుకు హృదయానికి పట్టింది పూజ్యమే .  . సంగీతా విషయానికి వస్తే చెవి తుప్పు వదిలించే మనోహర ,శ్రావ్య సంగీతం అందిస్తారు బాపు .ఎంతో లలితంగా ,ఆర్ద్రం గా ,కన్ను చేమర్చేట్లున్తాయి రాగాలు ,స్వరాలు ,బాణీలు .ఇక్కడ అంతా విరుద్ధం .ఒక్క ”జగదా నంద కారకా ”అన్నది మాత్రమే అదీ ,అంత వరకు మాత్రమే కాస్త మనల్ని హం చేయిస్తుంది .మిగతా పాటల్లో ఒక్కటి కూడా మనల్ని పట్టించు కోదు .ఇది బాపు విధానానికి మరీ విరుద్ధం .పాపం ఇళయ రాజా ఎంత కమ్మని సంగీతం ఇచ్చి మనల్ని మరో లోకం లో విహరింప జేశాడో మనకు తెలుసు .ఇక్కడ మరీ failure .దీనికి కారణం ఏమిటో నాకు అంతు బట్ట లేదు .స్వేచ్చ ఇవ్వ లేదా ?గీతాన్ని సంగీతం ,back గ్రౌండ్ మ్యూజిక్ ముంచేసింది .హాల్లో నుంచి బయటకు వస్తుంటే ఏ ఒక్కపాటా   మన వెంట రాదు అదేం పాపమో శాపమో .ఇదీ బాపు శైలికి బద్ధ విరుద్ధం .అక్కడ వినటానికి చూట్టానికి కాస్త బాగున్నా ,అవి మనల్ని పట్టు కోని వదలక పొతే కదా మళ్ళీ ఏవ రైనా రెండో సారి చూసేది .?కర్ణ భేరి పగిలి పోయే సౌండ్ భయ పెడు తుంది .మానసిక ఆహ్లాదం ఉల్లాసం కలిగించక పోవటం స్వర కర్త లోపమే .ఇదీ బాపు మార్కు కాదు .

               ఫోటోగ్రఫి సంగతి చూద్దాం .అన్ని పాత్రలను భూతద్దం లో చూపించినట్లు కని పించారు .ఎవరు స్వభావ సిద్ధంగా లేరు .ట్రిక్ అసలేమీ లేదని చెప్ప లేను కని లవ కుశులకు మూడు  అస్త్రాలు వాల్మీకి ఇచ్చే సందర్భం లో చాల బాగా వుంది .ఆ ఊహకు బాపును ,తీసిన ఛాయా గ్రాహకుడు గ్రాఫికుడు , అభినందనీయులే .పాపం వాల్మీకి నాగేశ్వ ర రావు కు ఒకటే పంచె ఉత్త రీయం తో లాక్కోచ్చారు   .ఆయన ఆహార్యం గురించి ఎవరు పట్టించుకున్న ట్లు లేదు .
                     ఈ సినిమా లో అన్నీఅతి గా  ఉండటమే పెద్ద దెబ్బ కొట్టింది .పకడ్బందీ అయిన స్క్రీన్ ప్లే లేక పోవటం పెద్దలోపం . .అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యత నిచ్చి ,అవసర మైన దాన్ని తగ్గించటం తో ఉత్కంటత లేక పోయింది .బాపు ,విశ్వ నాద్ సినిమా లు అంటే గుండె తడి కన్పిస్తుంది .ఆది పూర్తి గా ఎండి పోయిన్దిక్కడ .సన్ని వేశంచూస్తే  కళ్ళు చెమర్చే ట్లు తీయటం ఇద్దరికీ స్వంత మైన విద్య .అదేమీ వీసం కూడా కని పించలేదు .ఇదంతా కోపం తోనో ,అసూయా తోనో ,అక్కస్సు తోనో ,రాయటం లేదు .బాపు సినిమా కనుక ఇది రాస్తున్నా .ఇంకెవరు తీసినా రాయాల్సిన పని లేదు .బాధ ,సాను భూతి లే నన్ను ఇది రాయించాయి గోపాల కృష్ణ గారు .రెండు నెలల క్రితం మోజు పడి బెజ వాడ లో సి .ది .కోని తెచ్చు కొన్నాను .ఒక సారి వెంటనే పెట్టి విన్నాను .సగం పాటలు కూడా విన లేక పోయాను .మళ్ళీ పెడితే ఒట్టు .ఆ ఉత్సాహం కలి గించక పోవటం అందరి లోపం .పాటలు హృదయానికి పట్ట లేదు .తాత్కాలికం గా అక్కడ వింటే పరవాలేదు అని పించాయి అంతే .అసలే నిర్మాత చాలా డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీశాడని ,నెత్తి మీద జుట్టు కూడా ఊడి పోయి విగ్గు పెట్టు కొన్నాడని ఒక సారి మీరు నాకు మెయిల్ ఇచ్చారు .ఏ సినిమా కు అయినా మాస్స్ ప్రేక్షకులే ప్రాణం .నేను ముందే చెప్పి నట్లు మాస్ లో అయిదారుగురు కంటే లేక పోవటం,అందు లో బాల కృష్ణ వుండికూడా  కొ౦త  నన్ను అమిత ఆశ్చర్యం పాలు చేసింది .నిర్మాత గారికి పాపం ఎంత భారమో .ఎలా తేరు కుంటారో .క్లాస్స్ వారు కొద్ది మంది వున్నా రెండో సారి చూసే ధైర్యం ఎవరికి వుండదు ..అందుకే ఇది బాపు ,రమణ ల సినిమా కాదు .పౌరాణికం వచ్చి చాలా ఏళ్ళు అయిందని సంబర పడి వెళ్ళే వారికి తీవ్ర నిరాశ మిగిల్చింది .అన్న మయ్య ,రామ దాసు పాటల్లో నే జనాన్ని రాబట్టాయి .తర్వాత దర్శ కత్వ ప్రతిభ ,నటీ నటుల నటన .అవి వాటికి ప్లస్ పాయింట్లు .అవన్నీ దీనికి పూర్తి గా మైనస్ పాయింట్లు ఆవ టం బాధ గా వుంది .మళ్ళీ పౌరాణికం తీయాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి .
                      నటన లోకి వస్తున్నా .ఎక్కువ మార్కులు కొట్టే సింది నయన తార .ఆమె సీతా మాత గా అని పించక పోయినా ఉన్నంత వరకు న్యాయం చేసింది .ఒక్కో సారి చార్మి లా ,ఇంకోసారి స్మితా పాటిల్ లా అని పించింది .అయితె glomour  ను తగ్గ కుండా చూసు కొంది .బాపు గారి సీతా అని పించలేక పోయింది .అందుకు బాపు కూడా బాద్యుడే .తరువాత మార్కులు ఆమెకు డబ్బింగ్ చెప్పిన సునీత కు దక్కు తాయి .అయితే ఇది వరకే చెప్పి నట్లు సీతా దేవికి సంభాషణల కంటే భావ వ్యక్తీకరణకు ఆవకాశం ఇవ్వక పోవటం వెలితి .అదే ఆనాడు అంజలి దేవికి చాలా ప్లస్ పాయింట్ అయింది .హృదయం విప్పి చెప్పు కొనే స్థితి ,మాటల్లో కాకుండా చూపుల్లో ముఖం లో కల్పించే బాపు చాలా విరుద్ధం గా ఇక్కడ తీయటం నచ్చ లేదు .తారు వాత లవకుశులు .చిన్న గా ,ముచ్చట గా మంచి చతురంగా నటించారు .మరీ చివరి సన్ని వేషాలలో పాటలో .లవ కుశ పాట అంతే గుండెలు కరిగాయి ఆనాడు .ఇప్పుడు గుండెలు చెడి రాయి .అంత విరుద్ధం .ఇక్కడ లోపం ట్యూన్ లదే . వారి పాటలు మనల్ని మళ్ళీ మళ్ళీ వినాలి అని పించక పోవటం ఎవరి తప్పో .
               శ్రీ రాముడు గా బాలయ్య ముసలయ్య లాగా వున్నాడు .ఆయన్ని మరీ భూతద్దం లో చూపించారు .రాముడు కని పించలేదు నాకు పున్దరీకుడే దర్శన మిచ్చాడు .డైలాగులు వల్లించాడు కాని హృదయం లోంచి పలికించ లేక పోయాడు తొందర లో అవి మరీ దోకుడు అయాయి .ఇక్కడా బాపు మార్కు లేదు .రామునితో బాపు తక్కువ చెప్పించి ఎక్కువ మనకు అందించే వాడు .ఇక్కడా విరుద్ధమే .ఆకట్టు కో లేక పోయాడు పాపం .కింద పడి దొర్లటం తో సరి పుచ్చు కున్నాడు .ఆభరణాలు .శాలువా మొదటి నుంచి చివరి దాకా అవే మైంతైన్ చేశారు .మరీ శోకం లో గంభీరత పూర్తి గా లోపించింది .ఆయన ఏడిస్తే మన కళ్ళు చెమ్మ గిలాలి .అలా చేయించలేక పోయాడు .విగ్రహం భారీ గానే వుంది .కాని పాటకు తగిన నటన రాబట్ట లేక పోయారు ..
               వాల్మీకి గా నట సామ్రాట్ ముసలి తనం లోను చక్క గా నటించారు .ఆయన ఆహార్యం పై భాగం పూర్వపు లవ కుశ లోని నాగయ్య గారిని ,కింది భాగం నాగేశ్వ రావు ని చూపించి నట్లుంది .పాపం కళ్ళల్లో కాంతి లోపించింది .ఆ గడ్డం దురద గా ఉందేమో .నాగయ్య గారి సాత్వికత ,గంభీరత ,శాంత చిత్తం కని పించ లేదు .నాగయ్య గార్ని చూస్తేనే కళ్ళు మూత పడి నమస్కరించ బుద్ధి అయేది .అది ఇక్కడ లోపించింది .బానే తంటాలు పడ్డాడు ఆయన .పిట్ట కధలు బానే చెప్పాడు .
                   వశిష్టుడి గా బాలయ్య కూడా పాత్రో చితం గా నటించాడు .కష్ట పడి సంభాషణలు చేఒప్పాడు .జనకునిగా మురళీ మోహన్ చూడ ముచ్చట గా వున్నాడు .రాజర్షి అన్నట్లు గా వున్నాడు .మాటలు బానే పలి కాదు .ఋష్య సృన్గుని గా నరేష్ అనుకుంటా కూడా మట్టం గా వున్నాడు .సంభాషణలు ఎవరితోనే చెప్పించి నట్లు కన పడింది .శాంత గా శివ పార్వతి శాంతం గా చేసింది .కౌసల్య పాత్ర లో కే.ఆర్.విజయ అసలు రాణించలేదు .ఆమె సంభాషణలు అసందర్భం ,అతి దీర్ఘం ,అనవసరం .కన్నాంబ కు సరి లేరెవ్వరు ?సుమిత్ర, కైక లు ఏమి  మాట్లాడారో, ఏం చేశారో మనకు తెలీదు .లాంగ్ షాట్స్ లో వాళ్ళను లాగేశారు .
                 లక్ష్మణుడు గా శ్రీ కాంత్ బాగున్నాడు .పాత్రకు న్యాయం చేశాడు సంభాషణలు బానే చెప్పాడు .సమీర్ భరతుడు ఉన్నాడని పించాడు .రమణ గారు సీతమ్మకు చేదోడు వాదోడు గా ఆన్జనేయున్ని వాల్మీకి ఆశ్రమం లో కి కోయ పిల్లాడు గా చేర్పించారు .ఆ పాత్ర చిన్నపిల్ల లకు నచ్చేదే .ఆంజ నేయుడు మూతి కొంచెం పెద్ద ది గా వుంటే నిండుదనం వచ్చేది అని పించింది .
             బాపు మార్క్ అని పించేవి రెండు మూడు సన్ని వేశాలున్నాయి .అందు లో ఒకటి -రావణుని భార్య మండోదరి రామ దర్శనం కోసం వచ్చి నప్పుడు ఆమె నీడ కూడా తన మీద పడ కుండా రాముడు జాగ్రత్త పడటం ,ఆయన ఏక పత్నీ వ్రతాన్ని ఆమె శ్లాఘించటం ,అయోధ్య వాసులు స్వర్ణ సీతా నిర్మాణానికి తాము సీత పై నీలాప  నిందలు వేసినందుకు నష్టపోయి ,దాన్ని భర్తీ చేసు కోవటానికి తమ దగ్గరున్న బంగారాన్ని అంతనూ రాముడికి సమర్పించటం బాగుంది 
                       సెట్స్ అన్నీ అట్ట ప్లాస్టిక్ తో కని పించాయి .అందులోను భవనాలు dome ఆకారం లో వుంది అవి అయోధ్య లోవి కాకుండా ఇటాలి లోని రొమే శిల్పాయం గా వుంది .పాశ్చాత్య వాసన తో .మిచెల్ ఆన్జేలో నో ,ఎవరో వేసినట్లు కన్పించాయి .వనాలు ,తపోవనలు అంతా ప్లాస్టిక్ మయమే .ఎబ్బెట్టు గా వున్నాయి .అసలు రుషి వాటిక లా అనిపించక పోవటం బాదే . .రాముడే కాదు ,కౌసల్య తల సోఫా కేసి కొట్టు కోవటం వింత .ఆఖరి సీన్ లో రాముడు మళ్ళీ నెల మీద పడి పాకుతాడు సీత కోసం .ఏ సన్ని వేషము హృదయాన్ని కదిల్చ లేక పోవటం పెద్ద లోపం .వాళ్ళు ఏడుస్తున్నా ,మనకేమీ పట్ట నట్లున్డటం ఆశ్చర్యం .involve  అయ్యేట్లు ఉ౦డదు  .కృత్రిమత ఇబ్బంది కల్గిస్తుంది .రాముడి పాలన ప్రజా సేవకే అనే మాట చెప్పించాడు కాని దర్శకుడు ,అలాంటి ఏ ఒక్క సన్ని వేషాన్ని మనసుకు పట్టే ట్టు చూపించ లేక పోవటము .
                    బాపు ,రమణలు ఏ కధ సినిమా  తీసినా రామాయణ భావం under కరెంట్లా వుంటుంది .కాని ఈ సినిమా లో రామాయణమే మాయమైంది .లోకాభి రామాయణం అయింది .వాల్మీకి మహర్షి కుదురు గా అయిదు నిముషాలు ఎక్కడా కూర్చోడు .తపస్సు ,కమండలం ,దండం వుండవు .ముసలాయన కదా బరువవు తాఎమో .వాల్మీకి ఒక సన్యాసి గా వున్నట్లు అని పిస్తాడు .మహర్షి భావన కలగదు .నాగయ్య గార్ని మరవ లేకేమో . . టెక్నికల్ రిచ్ నెస్ వుంది ,గ్రాఫిక్ వుంది కాని  ఫీలింగ్ రాక పోవటమేబాధ .ఝాన్సి ,బ్రహ్మానందం లు కూడా ఎందుకో రాణి౦చ లేక పోయారు .. .. 
                          రమణీయ రసమయ కావ్యం ,దృశ్య కావ్యం అవాల్సిన సినిమా నీరస అదృశ్య మ్ గా మనసుకు ,బుద్ధికి పట్టని ఒక రంగుల సినిమా లా  వుంది .హాల్ నుంచి బయటికి వచ్చిన తరువాత ఒక్క క్షణం కూడా మళ్ళీ ఆ సినిమా గురించి ఆలో చించే అవకాశం లేకుండా చేసిన ఆ సినిమా మహాత్ములందరూ అభి వంద నీయులే ,అభినంద నీయులే ఆలో చిస్తే మళ్ళీ చూడాలని పిస్తుంది కదా .ఆ బాధ నుంచి తప్పించి నందుకు అందరికి మప్పిదాలు (నమస్కారాలు ).ఎందరో మహాను భావులు అందరు కలిస్తే ఎంత బాగా తీయ లేరో రుజువు చేసింది .శాంతం పాపం .బాపురే  -రమణీయం-శ్రీ రామ రాజ్యం గా ఉంటుందని వెళ్ళిన నాకు అంతా రివర్స్ గా కని పించింది గోపాల కృష్ణ గారూ..మీరుఅన్నట్లు   పద్యాలకు అలవాటైన ఆంద్ర జనం పౌరాణికాలలో అవి లేని వెలితిని భరించ లేరేమో .నిర్మాత గారికి సాను భూతి తెలియ జేస్తున్నాను .ముమ్మాటికీ ఇది బాపు రమణ ల సినిమా అని అనుకో లేక పోతున్నానని మరో మారు తెలియ జేస్తూ ——మీ .దుర్గా ప్రసాద్  –23 -11 -11 .
 

.

 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in సమయం - సందర్భం | 16 Comments

స్వామి శివానందుల ఉపనిషత్ సుధ –2

స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ –2

                                                                  యోగం

—                 పరమాత్మను దర్శించా లంటే యోగ సాధన చేయాలి .ఏ స్థితి లో సంకల్ప ,వికల్పాలు ,ఆలోచన ,సంశయం లేకుండా వుంటుందో అదే యోగం .జీవాత్మ ,పరమాత్మలకు సమ భావాన్ని కల్పించేదే యోగం .మనసు లోని ఆలోచనా తరంగాలను అదుపు లో పెట్టేది రాజా యోగం .యోగం లో అష్టాంగాలు వున్నాయి .అవి యమ ,నియమ ,ఆసన ,ప్రత్యాహార ,ధారణ ,ధ్యాన ,సమాధులు .కర్మ ,ఉపాసనా ,జ్ఞానాలను ”యోగ త్రయం ”అంటారు .ప్రాణ వాయువున్ని బంధించా తానని ”హాథ యోగం ”అంటారు .హథం అంటే సూర్యుడు ,చంద్రుడు కలిసి పోవటం .కోరింది సాధించాతాన్ని కూడా హథం అంటారు .ఇదే రాజ యోగానికి దారి చూపిస్తుంది .ప్రాణా యామం వల్ల రక్తం ,నాడులు ,శుభ్ర పడ తాయి .చిత్త ఏకాగ్రత కలుగు తుంది .”యోగం ”అంటే కలయిక .అంటే జీవాత్మ ,పరమాత్మ ల సంయోగం .యోగ సాధన వల్ల ప్రత్యగాత్మ పరమాత్మ లో కలిసి పోతుంది

                  యోగ సాధనకు  గురువు అవసరం .అప్పుడే సుక్ష్మ విషయాలు తెలుస్తాయి .మన మనసు ప్రతి విషయాన్ని సంకల్పిస్తుంది .సంకల్పం కూడా ఒక పదార్దమే .దానికీ శక్తి వుంది .ప్రముఖ శాస్త్ర వేత్త అయిన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం పదార్ధం శక్తి గా ,శక్తి పదార్ధం గా మార్చ వచ్చు .ఈ శక్తినే ఒకరి నుండి మరి ఒకరికి ప్రసరింప జేయ వచ్చు .ప్రపంచాన్ని శాసించ వచ్చు .అందుకే ఋషులు సంకల్పం మాత్రం చేత నే అన్నీ  సాధించారు ఇయితే మనసుకు ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది .?అద్దం యెట్లా సూర్యుడి నుండి కాంతి పొందు తుందో ,అలాగే మనస్సు కూడా ,పరమాత్మ నుంచే తేజస్సు ను పొందు తుంది .పాలు యెట్లా పెరుగు గా మారు తుందో  అలాగే , మనసుకూడా వస్తు రూపం లోకి మారుతుంది .అప్పుడే వస్తువు ను గుర్తిస్తుంది .కన్ను ,వస్తువు వున్నా ,మనసు లేక పొతే వస్తువు కన్పించదు .అందుకే పెద్దలు ఈ ప్రపంచాన్ని ”మనోమాత్ర జగత్ ”అన్నారు .మన మనస్సు గ్రహించక పొతే ప్రపంచం మనకు కని పించదు .అంటేబాహ్య   ,అభ్యంతర జగత్తు అంతా ఒక్కటే… భేదం లేదు .దీన్ని తపస్సు లేక ధ్యానం ద్వారా తెలుసు కోవాలి .యోగ సాధన వల్ల తన లోని క్షమా ,ప్రేమ ,దయ ,ఆదరణ ,సత్యం ,ఉదారత్వం ,బ్రహ్మ చర్యం వృద్ధి చేసు కోని ,సాత్విక గుణాన్ని పెంపొందించు కోవాలి .రాజస ,తామస గుణాలను విసర్జిన్చుకుంటాడు .అప్పుడే జ్ఞాన నేత్రం ఏర్పడుతుంది .పరమాత్మ దర్శనం లభిస్తుంది .అదే యోగ సాధన లోని ఆంతర్యం ..
                          సశేషం
                                                   గబ్బిట దుర్గా ప్రసాద్ -22 -11 -11
Posted in రచనలు | Leave a comment

విజయవాడ లో కవి సమ్మేళనం విశేషాలు

నా కుడి పక్క ఆమె శ్రీమతి మందరపు హైమా వతి-ప్రఖ్యాత రచయిత్రి -ఆమె ప్రక్కన చాల పాక ప్రకాష్ ”రమ్య భారతి ”సంపాదకులు .నా ఎడమ ప్రక్క శ్రీ అరసవల్లి కృష్ణ- కవి ,కవి సమ్మేళనాన్ని నిర్వహించిన వారు .

Posted in సభలు సమావేశాలు | Leave a comment

,శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దీప అలంకరణ

This slideshow requires JavaScript.

ఇందులో డాక్టర్ యాజీ వున్నాడు .అనుకోకుండా ఉయ్యూరు వచ్చి ,శ్రీ సువర్చలాంజ నేయ
స్వామి ఆలయానికి వచ్చాడు .అప్పుడే ఈ దీప అలంకరణ జరుగు తోంది .వుంది చూసి
ఆనందించి వెళ్ళాడు తేది 20 -11 .-11 .నాడు ఒక భక్తు రాలు చేసిన అలంకరణ ఇది
.బొమ్మ వేయటం అలంకరణా ఆమెదే .

 

Posted in సమయం - సందర్భం | Leave a comment

Bhagvath Geetha Vuyyuru Sahithimandali 261 111120

 

Bhagvath Geetha Vuyyuru Sahithimandali 261 111120

Bhagvath Geetha Vuyyuru Sahithimandali 261 111120

 

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఇవాళ ఆంధ్ర జ్యోతి లో

Posted in సేకరణలు | Leave a comment

స్వామి శివానందుల ఉపనిషత్ సుధ —1

స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ —1

                  ”  ఓం !యో బ్రహ్మాణం విద దాతి పూరం –యో వై వేదాంస్చ ప్రహినోహి తస్మై

—                  తం హ దేవ మాత్మ బుద్ధి ప్రకాశం -ముముక్షుర్వై శరణం ప్ర పద్యే .”

                           ఎవరు బ్రహ్మాండాన్నిమొదట సృష్టించారో  ఎవరి చేత వేదము గొప్ప గా స్తుతించి పాడుతుందో ,అతనిని నేను శరణుకోరు తున్నాను . .బ్రహ్మ జ్ఞానము ల యందు నాకు భక్తీ విశ్వాసాల వల్ల నా బుద్ధి వికశించు గాక .జ్ఞానులు అంతర్ముఖులై యోగాభ్యాసం తో ప్రకృతి రహశ్యాల నే గాక ,ప్రత్య గాత్మ అయిన పరమేశ్వరుని కను గొని ,అద్వైత స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు .అంటే తమకు ,పరమాత్మకు భేదం లేదని రుజువు చేస్తున్నారు .సామాన్య మానవ నేత్రం తో చూడ జాలనిపర మాత్మను ,జ్ఞానం అనే కంటి తో చూస్తున్నారు .విశ్వ రహశ్యాలను తెల్సుకున్నారు .అలాంటి జ్ఞాన చక్షువును పొందటం సులభం కాదు .దానికి ఏకాగ్రత ,చిత్త శుద్ధి ,నైతిక ఆధ్యాత్మిక జ్ఞానం ఆవ సరం .ఇవన్నీ యోగీశ్వరుల వద్ద వుండే లక్షణాలు .అయితే స్థిరత్వాన్ని పొంది ,స్థిత ప్రజ్ఞాత్వాన్ని సాధించటం ఎలాగో ,భగవద్గీత లో శ్రీ కృష్ణ పర మాత్మ బోధించాడు .మనకు భగవద్గీతే ప్రమాణం .గీత ఉపనిషత్తుల సంపూర్ణ సారమే .ఉపనిషత్తు లకే వేదాంగాలు అని పేరు .అంటే అవయవాలు .వెద సారాంశాన్ని తెలిపేవే ఉపనిషత్తులు .ఉప అంటే సమీపానికి నిషత్ అంటే చేర్చేవి .అంటే భగవంతుని సమీపానికి అవి చేరుస్తాయి .వేద వ్యాస మహర్షి వేద విభజన చేసి ,మామూలు వారికి వేద విధానం ఇంకా దగ్గర చేయాలనే తపనతో ,ఆ జ్ఞానాన్ని అంతా ,ఉపనిషత్తు లలో నిక్షిప్తం చేశారు భగవాన్ వేద వ్యాసులు .ఉపనిషద్ వాణి  మానవ కర్త్రుత్వాన్ని బోధించింది .ఈ ఉపనిషత్తులే ”,The Himalayas of the soul ,have been the source of the living waters that sustain our heritege ”అన్నాడు పండిట్ నెహ్రు .దీని అర్ధం –ఉపనిషత్తులు పార మార్ధిక హిమాలయాలు .మన సంస్కృతిని పోషించే పావనోదా కాలు .అంతే కాదు ”In times of blind ignorence and degradetion ,the Upanishads have come to our rescue ”అనీ అన్నాడు భగవంతునిపై విశ్వాసం ,పార మార్ధిక మైన జీవన అనుష్టానం తో భార తీయ సంస్కృతీ నిర్మించ బడింది .దేశ పరి పుష్టికి అవే ఆధారాలు .అవి కోల్పోతే భారత దేశమే లేదు ”If India forgets them ,she will be no longer remainIndia ”అని స్పష్టం చేశాడు నెహ్రు .అంత మహత్తు కల్గినవి ఉపనిషత్తులు .ఋగ్వేదానికి 20 ,యజుర్వేదానికి 109 ,అధర్వ వేదానికి 50 ,సామ వేదానికి 1000 ఉపనిషత్తులు లు వుంటాయి అంటే మొత్తం 1179  వున్నాయి .అందులో 108 ఉపనిషత్తులే ముఖ్య మైనవి .అందు లోను దశోప నిశాత్తులు చాలా ప్రాముఖ్య మైనవి .అవే ”ఈశ .కేన ,కథ ,ప్రశ్న ,ముండక ,మాండుక్య ,తైత్తిరీయ ,ఐతరేయ ,ఛాందోగ్య బృహదారణ్యక ఉపనిషత్తులు .ఇందులో ముక్తి కోరే వారికి ”మాండుక్య ఉపనిషత్ పథనం  ఒక్కటే .
చాలు నని శ్రీ రాముడు హనుమంతునికి ఉపదేశిస్తాడు .ఈ ఉపనిషత్తు ల నుండే అర్ధ శాస్త్రం ,జ్యోతిష ,భూగోళ శాస్త్రాలన్నీ ఏర్పడ్డాయి .అంతే కాదు 18 పురాణాలు ఏర్పడ్డాయి .కర్మ యోగ ,రాజా యోగ మాంత్రిక ,తాంత్రిక యోగాలన్నీ ,అనేక మంది మహర్షులచే రచింప బడ్డాయి .సనాతన మతం అంటే ధర్మం అంటేనే వేదోపనిషత్తులే .మనకు ప్రవక్త ఈశ్వరుడే .వేరెవరు కాదు .ఈశ్వ రాంశ సంభుతూ లైన  లైన మహర్షులే వీటిని మనకు దర్శింప జేశారు .ఇంతటి ప్రసిద్ధి చెందిన ఉపనిషత్తు ల లోని ,జీవాత్మ ,పర మాత్మ లకు గల అన్యోన్య సంబంధాన్ని -జీవాత్మ -పర మాత్మ ను చేరా టానికి చేయ వలసిన విధానాని జీవాత్మ ,పర మాత్మ ల ఏకత్వాన్ని వివ రించటమే ఈ వ్యాస పరంపర ముఖ్యోద్దేశం .
                                    సశేషం                                    మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -21 -11 .11 .
Posted in రచనలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –9

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –9

                           కరటకశాస్త్రి   ”అల్ప స్వభావం ”పై ఆమెకింకా భయం గా వుంది .వెళ్ళే వాడ్నే పిలిచి ”మీ శిష్యుడిని ఇక నాటకాలాడించి ,ముండలిళ్లకు తిప్పి చెడ గొట్ట కండి ”అంది మధుర వాణి ..అందులో తనకు పాపం వుందని ,ఇదే ఆఖరి మజిలీ అవ్వాలనీ .”నీది గురోపదేశం మధుర వాణీ.”అంటాడు శాస్త్రి .బ్రాహ్మల్నందర్నీచదివింది ఆమె . ”బ్రాహ్మల్లో ఉపదేశం లావూ ,ఆచరణ తక్కువా -ఖరారేనా ?”అంది .బిక్కచచ్చి పోయాడు శాస్త్రి .హితవు పోయింది ,వ్రతము చెడింది .ఫలితం మాత్రం పరమేశ్వరునికి ఎరుక .తిట్లు ,చివాట్లకు లంకిన్చుకుందని అర్ధ మైంది .కరటకం లాంటి వాళ్ళు దేనికైనా వెనక్కి తీయరు .వాగ్దానాలనేం అమలు చేస్తారు ?గోతులు తవ్వటం అలవాటైన వారికి డబ్బుకోసం కన్యల్నిఅమ్మే  వారికిసుఖం కోసం వేశ్యల్ని మరిగే వారికి లంచం ఇచ్చి వేశ్యల చేత యెంత పని అయినా చేయించే వారికి ఎన్నటికి బుద్ధిరాదనీ ఆమె నమ్మకం .అలాంటి వాళ్ళు ”చిత్ర గుప్తుడికి కూడా లంచం ఇవ్వ గలరు .మీరు నన్ను అతడి దగ్గరికి పంపించేసి ,చేసిన పాపాలు అన్నీ తుడుపు పెట్టిన్చాటానికి వీలుండదు కాబోలు .”అంది .అదిరి పోయాడు శాస్త్రి .అమ్మో ఇక వుంటే ధనుతేగిరి పోతుంది-శీఘ్రం పలాయనం ”అను కోని పని వుందని చెప్పి పరుగు లంకిన్చుకొనే ప్రయత్నం చేస్తాడు .ఆమెకు నవ్వు ఆగలేదు .శిష్యుడి నుంచి కంటే తీసుకొనే ముందు ”ఆకాశవాణి లా చిలకపాట పాడి నీ మామ గారికి బుద్ధి చెప్పు ”అంది .అంతే కాదు ,తన మూలంగా ,ఒక ముసలి బ్రాహ్మడుకి ముప్పు వస్తుంటే ఎవరికీ కనపడ కుండా ఇంత కాల౦  దాక్కున్నందుకు చీవాట్లు పెట్టింది శాస్త్రి ని .చచ్చి పోయినంత పని అయింది .తన నిజ స్వరూపాన్ని ఎంత గొప్పగా ,చేదుగా ,బాధగా ,జుగుప్స గా ,చీత్కారం గా, అమోఘం గా ఆవిష్కరించిందో అర్ధం చేసుకొన్నాడు .తన విశ్వ రూపాన్ని తనకే వెగటు పుట్టేట్లు చూపించింది మధుర వాణి . 

              ”చెప్పిన పని చెయ్యక పో జైలు సిద్ధం ”అని బెదిరించింది .అయిపొయింది శాస్త్రి పని .పరాభవం పరాకాష్టకు చేరింది .”ఎన్నాళ్ళు బతికినా ఏమి సామ్రాజ్యంము -కొన్నాళ్లకో రామ చిలుకా –మూణ్నాళ్ళ ముచ్చటకు మురిసి తుళ్ళేవు -ముందు గతి కానవే చిలుకా ”అని సందేశం ఇచ్చే పాట శిష్యుడు పాడు తుండ గా ఇక తట్టు కోలేక   పారిపోతాడు కరటక శాస్త్రి .వెళ్తూ ”తల వాయ కొట్టింది -వెంట్రుకలు లావైనాయి -మనసుకొంచం  మళ్ళించు కొందాం ”అను కుంటు నిష్క్ర మిస్తాడు .అవును అతని లోను పరివర్తన వచ్చింది .వేశ్య తో చెప్పించుకొనే హీన స్థితికి దిగ జారాడు .ఇక ఈ మార్గం వదలాలి బాగు పడాలి అనే భావం కలిగింది .ఆ పాత్రకు ఇక్కడ పరమార్ధం లభించింది .
              కరటక శాస్త్రి చదువు కున్న వాడు .మంచి చేయాలనే తత్త్వం వున్న వాడే .అయితె ఆనాటి సమాజం ప్రభావం మీద పడింది .వేశ్యల్ని మరిగాడు .నాటాకాలు ఆడాడు .లోకజ్ఞానం వున్నా కుటిలత్వం పోలేదు .అది ఎంత పనికైనా సిద్ధం చేయించింది .చివరి దాకా నిజం ఒప్పుకొనే సద్భావన కలగ లేదు .మాయోపాయం తోనే కార్యం సాధించాలను కొనే వాడు .ఈ నాటకం లో పరివర్తన రాని వారు ఇద్దరే .శాస్త్రి ,రామప్ప పంతులు .అన్ని ముఖ్య మైన పాత్రల్నీ సౌజన్యా రావు దగ్గరకు చేర్చి న అప్పా రావు గారు ఈ జాకాల్స్ ను మాత్రం అక్కడకు పంప లేదు .అక్కడా వాతావరణాన్ని కలుషితం చేస్తారని అను కొన్నారేమో ?అందరు కొంత కాక పొతే కొంత అంత రాత్మల్ని శోధించుకొని మార్గం మళ్ళించు కొన్న వారే .అందుకే వారికి ”సౌజన్య భాగ్యం ”లభించింది .గీతా ప్రవచనం లబ్ధ మైంది .కరటక ,దమన కులైన శాస్త్రికి ,పంతులికి అది నిషిద్ధ మైంది .True repentence  వాళ్ళలో రాక పోవటమే కారణం .సమాజం లో అందరు మారినా ,మారని వారు ప్రతినిధులు గా ఉంటూనే వుంటారు .
                             ”  కన్యాశుల్కం లో కరటక శాస్త్రి” అనే ఈ నవాంగాలు ఇంతటి తో సమాప్తం 
              దీనిని చదివిన వారు స్పందిస్తే సంతోషిస్తాను .
                                                మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -11 -11 .
Posted in రచనలు | 2 Comments

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —8

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —8 

                                                       కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —8

                  మధురవాణి తల్లిని జ్ఞాపకం చేసుకొంటూ ,ఆమె చెప్పిన మాటలు శాస్త్రికి చెబుతోంది ”నా తల్లి ధర్మవా అని నా చెవిలో గూడు కట్టుకొని చెప్ప బట్టి కాని ,లేకుంటే మీ లాంటి విద్వాంసుల ఇచ్చ కాలకి మై మరచి ఈ పాటికి వూళ్ళో సానుల వలె చెడి ఉండనా ?అంటుంది .తాను ఎంత ఎత్తు లో వుందో గుర్తించమని హెచ్చరిక .ఎంత నీచపు ఆలోచన లో కరటకం ఉన్నాడో ఆలోచించుకోమని  ఆవేదన .తనను మళ్ళీ ఏదైనా పావుగా వాడు కొంటాడేమోనని అనుమానం కూడా ..ఆమె చెప్పినవి అక్షర సత్యాలు .కుహనా ఆదర్శాల పాలిటి చెంప దెబ్బలు .సంఘం చేసిన కులటల్లో తన స్థానం ఎలా పెంచుకొని ,దిగ జారక ,వ్రుత్తి రీత్యా అందులో వున్నా  ఎంత ఎదిగానో చూడమని అతనికే కాదు మనందరికీ కళ్ళు తేరి పించింది .కాదు తెరిపించాడు గురజాడ .
               చావు దెబ్బ తిన్నా ఇంకా ఆశ చావ లేదు గుంటూరు శాస్త్రికి .పొగడ్తల ధూపం వేస్తూనే ,తన మనసు లోని మాటను బయట పెట్ట టానికి ఎత్తులు ఎత్తుతున్నాడు .”మధుర వాణి అనే వేశ్య శిఖామణి ఈ కళింగ రాజ్యం లో ఉండక పొతే ,భగవంతుడి సృష్టికి యెంత, యెంత లోపం వచ్చి ఉండును ?”అంటాడు .ఈ పొగడ్తలకు లొంగే స్థితి దాటి పోయింది .తనను సౌజన్యా రావు గారి దగ్గరకు తీసుకొని వెళ్ళమని కోరింది .అతను బాధ తో అంటాడు ”ఆయన కోపిష్టి కాదు .అందుకే భయం .చెడ్డ వారి వల్ల చెప్పు దెబ్బలు తినవచ్చు కాని ,మంచి వారి వాళ్ళ మాట కాయటం కష్టం .”అదీ అతని రీడింగ్ .సౌజన్యం దగ్గరకు కరటకుడు  వెళ్ళ లేని పరిస్థితి .”డిప్టీ కలెక్టరు కుక్కనాయుడు చేత రాయ బారాలు నడుపు తునాదని చెబుతుంది . ఎగిరి గంతేస్తాడు శాస్త్రి .కాగల కార్యం గంధర్వులు తీర్చి నట్లుంది .ఈమె వాని పట్టిందా తన కొంగు బంగారమే .
                ”వెళ్ళు ,వెళ్ళు -ఇంకా ఆలశ్యం చేస్తావేం ?నీ అదృష్టం ,నా అదృష్టం యేమనిచెప్పను” ? అని పొంగి పోతాడు .పొమ్మని బలవంత పెడతాడు .దాని వాళ్ళ కలిగే లాభాల బేరీజు వేస్తాడు .తన నిజాన్ని ,సిగ్గు మాలిన తనాన్ని మళ్ళీ బయట పడేసుకొంటాడు .ఆమె లోని ఔన్నత్యాన్ని ఇంకా అర్ధం చేసు కో లేని మూర్ఖత్వమే అది .’అయన ఒక్కడే మమల్ని కాపాడ గల వాడు ”అని ముక్తా యిస్తాడు .దివి నుండి భువికి దిగి రాను దిగి రాను అన్నట్లు ఆమె వీటి నన్నిటినీ అదిగా మించింది .ఈ రొంపిలో పద్మం లా వుంది ,రోమ్పిని ,కంపును పునీతం చేయాలనే కలలో వుంది .అది నిజం చేసుకోవాలనే ఆలోచనా ,ఆత్మ స్థైర్యం ,ధైర్యం వుంది .ఇంకెవరు తన్ను కిందికి లాగ లేరు వెయ్యి మంది డిప్టీ లైనా ,కర్కటు లైనా ..ఆ బంధాలన్నీ విచ్చేడా లైనాయి .ఒక దివ్య కాంతి ఆమెలో ఆవరించింది .దివ్య జ్యోతి కానీ పించింది .ఆ జ్యోతిని కరటక శాస్త్రి దర్శించ లేడు ..చూడ లేడు చూసినా తట్టు కో లేడు .
              ”ఇటు పై ఊర కుక్కలకు ,సీమ కుక్కలకు దూరంగా ఉండ  దలిచాను .”అద్భత మైన మాటలు .కొరడాలు .రక్త మాంసాల్ని పీల్చి, పిప్పి చేసి ,సమాజ బాహ్యులను చేసే వీరంతా ,అంట కంటే గొప్ప పదాలకు అర్హులు కాదు .అందుకే కరటకుడు ఒక జాతి కుక్క సందేహం లెదు .ఆ మొహం లో పడ్డ వాడే .మళ్ళీ  అదే ఆలోచన లో ఉన్న వాడే .అందుకే అంత గట్టి గా తన నిర్ణ యాన్ని చెప్పింది .శాస్త్రి కి ఇంకా ఆమె అర్ధం కాలేదు .”ఆయన చేతికి ఎముక లెదు .హెడ్ కాని స్టేబుల్ కు తీసి పోడా ?” అని సూటి పోటి మాటలతో రెచ్చ గొట్టాలని చూశాడు .ఇంకా దింపుడు కళ్ళం ఆశలో వున్నాడు .విని  తట్టు కోవటం కష్టం  .నిజం నిష్టురం గానే వుంటుంది .”హెడ్డు ను నౌకరు లాగా తిప్పుకోన్నాను .ఆ నాల్గురోజులు సర్కారు కొలువు మాని ,నా కొలువు చేశాడు .అతడి సాయం లేక పొతే మీరు ఆ వూరి పోలి మేర దాటే వారా ?లోకం అంతా ఏమి స్వప్రయోజన పరులు ?”అని బాధ పడింది .శాస్త్రిని ఇంత బాగా కాపాడినందుకు అతనిచ్చిన కితాబుకు రోత వేసింది .అర్ధం చేసుకోనందుకు బాధ ,ఈ సమాజం లో నిస్వార్ధ పరుల యెడ తూష్ణీ భావం .వ్యక్తమైంది .అదీ పాత్ర చిత్రణ అంటే .అదే అప్ప రావు గారి అంతః పరిశీలన .
            శాస్త్రికి తల వాచీ ,తిరిగి పోయింది .చెంపలు వేసుకోన్నంత పని చేశాడు .”అపరాధ శతం ”చెప్పు కొన్నాడు .క్షమించామంనంత పని చేశాడు .డిప్టీ కలెక్టర్ను చూడను అనటం అతనిమనసు   చివుక్కు మందట .ఈ విషయం సౌజన్యా రావు గారు ఏమంటారో అంది .”పీక కత్తరిస్తారు ”అంటాడు శాస్త్రి. అదేదో చూస్తాను అంది ఆమె .”బ్రహ్మ హత్యా పాతకం కట్టు కుంటావా “?అని తెగ బాధ పడతాడు .ఎక్కడ ఈమె సౌజన్యా రావు తో చెప్పి ,నిజం బైట పడుతుందోననే ఆందోళన శాస్త్రి లో తగ్గలేదు .”ఆహా ఏమి బ్రాహ్మలు ? పోలి శెట్టి చెప్పి నట్లు ఎంత చెడ్డా బ్రాహ్మలు కదా ”అని కంటే ఇస్తూ ,”తిలోదకాలేనా ?”‘అంటుంది .పువ్వుల్లో పెట్టి తిరిగి ఇస్తానంటాడుశాస్త్రి కృతజ్ఞత తో .”నీ లాంటి మనిషి లేదు .కించిత్ తిక్క లేకుంటే నా “”అని ఉబ్బెస్తాడు .”ఆ తిక్కే మిమ్మల్ని కాపాడింది ‘అదే నా భూషణం,అన్నంత ధీమాతో .అదే విశ్వనాధ  ”దిశానా హన్కారం ”లోకానికి లొంగని అంతః సౌందర్యం .ఆ శక్తి దేనికీ లొంగదు .బ్రాహ్మణీకం లో తప్ప పుట్టావు అని శాస్త్రికి  వెక్కి రింపు . .
                 కరక టానికి ఆశ ఇంకా చావలేదు డొంక తిరుగుడు మాన  లేదు .నిజం ఒప్పుకుంటే కొంప మునుగుతుందనే తప్ప ,ఒప్పుకొని నిటారుగా నిలబడ లేని వాడు .కరటక బుద్ధి శల్య గతం కదా .ప్రాదేయకం గా ,చివరి అస్త్రం గా ”ఆ డిప్టీ కలెక్తర్ని ఒక సారి చూసి ఈ బీద ప్రాణినికాపాడితే  ? అని సన్నాయి నొక్కులు నొక్కాడు .ఆమెకు అసహ్యం వేసింది .ఇక అతడు అక్కడ వుంటే ఆమె తట్టుకోలేదు .ఉద్ధరిస్తారని అనుకుంటే దిగజార్చాలని ప్రయత్నిస్తునాడు .తక్షణం వెళ్లి పొమ్మంది శాస్త్రి ని .
                                 సశేషం 
                 
 గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –5 పాపం- వెంపటి శర్మ గారి శ్రమకు ఏం మిగిలింది ?-

ఊసుల్లో ఉయ్యూరు –5

                                                       పాపం- వెంపటి శర్మ గారి శ్రమకు ఏం మిగిలింది ?-

—                     ఒక్కొక్క ఇంటికి ఒక భోగం వుంటుంది .ఒక్కో సారి ఇళ్ళను దురదృష్టం వెన్నంటి వుంటుంది .ఆ ఇంటి లోని వారిని పాపం ఆ భగ వంతుడు కూడా కాపాడ లేడేమో నని పిస్తుంది .యెంత సుఖం ,భోగం ఆ ఇంట్లో చేరి నప్పుడు వారు అనుభ విన్చారో ,చివరికి అంతటి దీన ,హీన స్థితి పొంది అందు లోంచి నిష్క్ర మించాల్సి వస్తుంది .అది వాస్తు దోషమో ,వారి జాతక ఫలమో ,చేతులారా చేసు కోవటమో తేల్చి చెప్ప లెం.అలాంటి ఒక కుటుంబీకుడు స్వర్గీయ వెంపటి శివ రామ కృష్ణ శర్మ గారు .ఎలెమెంటరీ  స్కూల్ ఉపాధ్యాయుడు ..చాలా వైభోగం గా ఆ ఇంటిలో చేరారు .చాలా మార్పులు చేశారు .చివరికి అన్నీ అమ్ముకొని ఇక్కడి నుంచి వెళ్ళారు .ఆ ఇల్లే వెంపటి వారిల్లు .అంతకు ముందు అంటే మా చిన్నతనం లో రాయప్రోలు వారిల్లు .రాయప్రోలు సీతమ్మ ,కావమ్మ అనే అక్క చెల్లెళ్ళ ఇల్లు గా నాకు గుర్తు .వాళ్ళు చిరి వాడ ఆగ్రహారానికి చెందిన వారు .ఇది తండ్రి ఆస్తి అను కుంటాను .మేము చూసి నప్పటినుంచీ అంటే 1945  నుంచి వారిని వైధవ్యం లోనే చూశాం .పిల్లా ,జెల్లా వున్నట్లు జ్ఞాపకం లేదు .ఒకావిడ ఎర్రగా పిల్లి కళ్ళ తో వుండేది .ఇంకో ఆవిడ చామన ఛాయా గా వుండేది .ఇద్దరు కవలలా అన్నట్లుండే వారు . .మా అమ్మ వాళ్ళను సీతక్కాయ్ ,కాక్కాయ్ అని పిలి చేది .మా ఇంట్లో అందరం ఆ పేరు తోనే పిలిచే వాళ్ళం .గల గలా మాట్లాడే వారు .ఎప్పుడు ఇక్కడ వుండే వాళ్ళు కాదేమో అద్దెకు ఇచ్చే వారు .ఆ ఇల్లు మా ఇంటికి దక్షిణాన మూడో ఇల్లు .అక్కడే మాకు చిన్న తనం లో చదువు చెప్పిన గురువు గారు కోట సూర్య నారాయణ గారు అద్దె కుండే వారు .ఆ తర్వాత యనమండ్ర కుటుంబయ్య గారి కుటుంబం ,రుక్మిణమ్మ వాళ్ల కుటుంబం అంటే గోసుకొండ శాస్త్రి గారి కుటుంబం వుండేది .ఆ తర్వాత ఆ యిల్లును అమ్మేస్తే చివుకుల వెంకట రమణ సిద్ధాంతి గారు కొన్నారని జ్ఞాపకం .వీరు గుంటూరు జిల్లా వేమూరు వాస్తవ్యులు .మా నాన్న గారు మా మేన మామ ,వార నాసి సదా శివ రావు గారు ,చోడ వరపు చంద్ర శేఖర రావు గారు ,వేదార్ధం నేర్చుకోవటానికి వారిని ఉయ్యూరు తీసుకొని వచ్చారు .మొదట మా ప్రక్క ఇల్లు బ్రహ్మాజోష్యుల వారింట్లో అద్దె కు ఉంచారు .తరువాత సిద్ధాంతి గారు రాయ ప్రోలు సీతక్కాయ్ ,కాక్కాయ్ ఇల్లు కొనుక్కొన్నారు .ఆయనా అందులో లాభ పడిందేమి లేదు .ఆర్ధిక బాధలు ,కుటుంబ బాధలతో అల్లుడు వెంపటి శర్మ గారికి అమ్మారు .శర్మ గారు కూడా దాన్ని నిలబెట్టు కో లేక పోయారు .ఆయనా అమ్మేశారు ప్రసాద రావు గారు అనే retired బాంక్ ఉద్యోగి కొన్నారు .ఆయన తాకట్టు వ్యాపారం చేసి నష్ట పోయి ఆ ఇంటిని అమ్మేసుకున్నారు .ఉయ్యూరు హై స్కూల్ లో లెక్కల మాస్టారు గా పని చేసిన వల్లూరు పాలెం వాస్తవుడు చిగురు పాటి ఉమా మహేశ్వర రావు కొన్నాడు .కొంత కాలానికి ఆయన ఏ.జి.కే.నగర్ లో ఇల్లు కట్టుకొని ఆరేళ్ళ క్రితం అకస్మాత్తు గా మరణించారు .ఇల్లు ఇంకా వారి అబ్బాయి ప్రసాద్ స్వాధీనం లో నే వుంది కాని శిధిలా వస్త లో వుంది .ఇదీ వెంపటి శర్మ గారి ఇంటికి నేపధ్యం నడిచిన , చరిత్ర .శర్మ గారితో మొదలు పెట్టి చాలా దూరం వచ్చేశాం .మరి ఇవి జ్ఞాపకాల దొంతరలు కదా .అలా దొర్లు కొస్తాయి .

                          శర్మ గారు పొడవుగా వుండే వారు పంచె ,చొక్కా వేసే వారు .కీచు గొంతు .స్కూల్ కు వెళ్ళే టప్పుడే పంచ .మిగతా కాలమ్ అంతా లున్గీయే .చొక్కా సాధారణం గా వుండేది కాదు ఆయనకు ఒక సైకిల్ వుండేది .ఉయ్యూరు ,చుట్టూ పక్కల elementari స్చూల్స్ లోపని చేశారు .ఎప్పుడు బిజీ ఏ..అప్పుడు బ్లాక్ డెవలప్ మెంట్ వారి అధీనం లోస్చూల్స్   ఉండేవి .ఉద్యోగం నుంచి వచ్చిన క్షణం లో భోజనం చేసి బ్లాక్ ఆఫీసు కు వెళ్ళే వారు .ఆయనకు ఆఫీసు పని బాగా వచ్చు .అందరి పని ఒక్కడే చేసే వారు .అక్కడ ఆఫీసులో గుమాస్తాల చాకిరి ఈయన తో నే చేయించే వారు .ఇంక్రి మెంట్ల saanction ,శలవుల మంజూరు ,నెల నెల అన్ని స్చూల్ల్ల జీతాల బిల్లులు ఒకటేమిటి సమస్తం ఆయనే చేసే వారు .ఆయనకు అంత సరదా .అక్కడ అందరికి కాఫీలు ,టిఫిన్లు ,సిగరెట్లు ఖార్చులన్నీ శర్మ గారివే .ఆఫీసు వాళ్ళు పైసా కూడా చెపే వారు కాదు .ఇవి ఎప్పుడు ఆయన చెప్పుకొనే వారు కాదు .మిగిలిన మేస్టార్లు ఆయన మీద సానుభూతి తో మా కు చెప్పే ఆరు .అసలు అప్పుడు జీతాలెంత ?చాలా తక్కువ .అందులో elementari వారికి మరీ తక్కువా.కుటుంబమా పెద్దది ముగ్గురు మగ పిల్లలు ఇద్దరాడ పిల్లలు .భార్య కు అనా రోగ్యం .ఇవన్నీ ఆయన జీతం లోనే గడ వాలి .సాధ్యమయ్యే పనా ?కాదు .కాని ఆ బ్రాహ్మడు అభిమానం కల వాడు .ఇవన్నీ తట్టు కోటానికి అప్పు లు చెయ్యాల్సివచ్చేది   .అవి క్రమంగా పెరిగి చుట్టేశాయి .ఆ ఊబి లోంచి బయట పడటం కష్ట మైంది .ఆయన్ను చూసి నవ్విన వాళ్ళే కాని సహాయం చేసిన వారు లేరు .అయినా ఆ యన అడవా చాకిరి మాన లేదు .అ ఖర్చు మాన లేదు .ఆఫీసు ఆయనతో చాకిరీ చేయిన్చుకోనేదే కాని ,ఆయనకు సరైన గౌరవం కూడా ఇచ్చి న దాఖలా లేదు .నేను అప్పుడప్పుడు అంటుండే వాణ్ని ”శర్మ గారు !ఎందుకొచ్చిన ఈ కంచి గరుడ సేవ ?మీకు వాళ్ళిచ్చే విలువ లఏమీ లేదు .మీ శరమంతా సాటి వారి కోసంధార పోస్తున్నారు  .దానికి తగిన గుర్తింపు లేదు .మీకు కావలసిన చోట పోస్టింగ్ ఇవ్వరు .మిమ్మల్ని పీల్చి పిప్పి చెయ్యటమే కాని వారి వల్ల మీకు ఒరిగేది ఏదీ లేదు /.దానితో పాటు చేతి చమురు బాగా వాది లించుకున్తున్నారు ”అనే వాణ్ని .నవ్వే వారే కాని సమాధానం చెప్పే వారు కాదు .పని అనేది ఆయనకు పాపం ఒక వ్యసన మై పోయింది .అందులోంచి బయట పడ లేక పోయారు .ఆరోగ్యం క్షీణించింది .మందులు వాడుకోవ టానికి కూడా ఇబ్బంది పడే వారు ,
                   మా నాన్న గారంటే చాలా గౌరవం .తరచూ మా ఇంటికి వచ్చి మాట్లాడుతుందే వారు .కాఫీ బాగా తాగే వారు .ఆయన మామ గారు నిత్యాగ్ని హోత్రులు ,త్రికాల సంధ్యా వందనం చేసే వారు .విభూతి పెట్టినప్పుడు చూస్తే పరమ శివుడి లాగా వుండే వారు దబ్బ పండు ఛాయా .కుది మట్టం గా ఒడ్డు ,పొడుగు గా వున్దేవారాయన ”.వేదార్ధ ప్రవీణ ”అని వారికి బిరుదు .భగవద్గీత ,మీద ఉపనిషత్ ల మీద పుస్తకాలు రాశారు .వారు ఇక్కడి నుంచి మళ్ళీ వేమూరు వెళ్ళిన తర్వాత అన్ని విధాలా వారికి కలిసి వచ్చింది .పేరు ప్రఖ్యాతులు ,గౌరవాలు ,సన్మానాలు బాగా లభించాయి .ఆ తర్వాత ఎప్పుడో వారి అబ్బాయి కలిశాడు .వారి కుటుంబ విషయాలన్నీ చెప్పాడు .అప్పటికే సిద్ధాంతి గారు పరమ పాడించారు .ఆయన పంచాంగ గణనము చేసే వారు ..ఇక శర్మ గారికి అవేమీ అలవడ లేదు .ఆయన అల్లుడు ఈయన అని చెప్పటం వింత గా వుండేది .శర్మ గారిపెద్దబ్బాయి భాస్కర సోమయాజులు ,రెండో ఆతను రాదా కృష్ణ మూడో అతను మోహన్ అని జ్ఞాపకం .అమ్మాయి సన్న గా అందంగా వుండేది .పెద్దబ్బాయి ధనుర్మాసం లో వాళ్ల ఇంట్లోనే కాక మా ఇంట్లో,ప్రక్క బెల్ల కొండ వారి వాకిళ్ళలో ముగ్గులు వేసే వాడు .ఆడ వాళ్ల కంటే బాగా వేసే వాడు అని చెప్పుకొనే వాళ్ళం .అతను అప్పుడు కొంచెం ఆడంగి లేకి గా అనిపించే వాడు కులుకుతూ నడ వాటం  ,మాట్లాడటం వల్ల నేమో ..తరువాత మిలిటరీ లో చేరి మంచి ఉద్యోగం చేశాడు .రెండో అతను బాంక్ ఉద్యోగి మూడు కూడా ఉద్యోగే ..ఎప్పుడైనా హైదరా బాద్ లో పెళ్ళిళ్ళలో కలుస్తారు. శర్మ గారు ఆడ పిల్లల పెళ్లి చేశారు .
                    కాలమ్ చాలా మార్పు తెచ్చింది .శర్మ గారి బిజీ జీవితం కుటుంబానికి ఇబ్బంది కరం అయింది .భార్య అనారోగ్యం వల్ల ఆర్ధికం గా చితికి పోయారు .అప్పులేక్కువయ్యాయి .ఎంతో ఆనందం గా ఆ యింట్లో ప్రవేశించిన శర్మ గారు ,అప్పుల బాధ నున్చీ తప్పించు కోవ టానికి ఇల్లు అమ్మ క తప్పలేదు .రిటైర్ అయారు కూడా .అప్పుడు పెన్షన్ కూడా నామ మాత్రమే .అదేమీ చాల్ల్తుంది అంతటి సంసారానికి? .గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇల్లు అమ్మేశారు .అప్పు లన్నీ అణ పైసలతో బాకీ దారులకు తీర్చేసి చేతులు దులుపు కున్నారు .ఇక్కడి నుంచి కుటుంబాన్ని మచిలీ పట్నానికి తరలించారు .అక్కడికి చేరిన కొన్నేళ్ల కే భార్య మరణించారు .అ తర్వాత కుటుంబం హైదరా బాద్ చేరింది .పిల్లలు చదువుకొని మన్చీ అభి వృద్ధి లోకి వచ్చారు .గౌరవ ప్రద మైన జీవితాలు గడుపు తున్నారు .స్వంత ఇల్లు ఏర్పాటు చేసు కొన్నారు .నా స్నేహితుడు స్వర్గీయ పెద్ది భొట్ల ఆది నారాయణ కుమార్తె వివాహం లో ,కొడుకు వివాహం లో స్వర్గీయ వెంపటి శర్మ గారి పిల్లలు దాదాపు పదేళ్ళ క్రితం కలిశారు .మళ్ళీ పాత రోజులన్నీ గుర్తుకు చేసు కున్నాం .వాళ్ళందరికీ మేమంటే మంచి అభిమానం ,గౌరవం .చాలా ఆప్యాయం గా పలకరిస్తారు .ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి ఇటు వైపు వస్తే వీలు చేసుకొని తప్పకుండా మా ఇంటికి వచ్చి చూసి వెళ్ళే సంస్కారం వాళ్ళది .”ఊసుల్లో ఉయ్యూరు ”ఎవరి ద్వారానో విని చదివి నిన్నా మొన్న వాళ్ళు ఉయ్యూరు కు ఫోన్ చేసి అన్నీ జ్ఞాపకం చేసు కొన్నారు .అందుకే వారి నాన్న గారు వెంపటి శర్మ గారి పై రాయాలని పించి రాశాను .వాళ్లకు ఆనందం .నాకు కూడా ఒక సేవాపరాయనున్ని ,నిస్వార్ధ పరుణ్ణి గురించి రాసే అవకాశం కల్గిందని సంతోషం .
                     ఇప్పుడు ఉపాధ్యాయుల సేవ అని చెప్పి చేసే వారు వున్నారు .వాళ్ళు అంతా రేట్ల ప్రకారం డబ్బు వసూలు చేస్తారు .ఇంక్రిమెంట్ కు ఇంత ,ఫిక్సేషన్ కు ఇంత ,పెన్షన్ పేపర్లు పూర్తి చేస్తే ఇంత ,వాటిని saanction చేయించు కొస్తే ఇంత అని వేలకు  వేలు సంపాదించే వార్ని మా కళ్ళతో చూస్తున్నాం ,.వీటిని కాదని తన కు చేత నయినంత సహాయం చేస్తూ ,ప్రతిఫలా పేక్ష లేకుండా ఉపాధ్యాయ  లోకానికితనువు మనసు ధనము తో  సేవ చేశారు వెంపటి శర్మ గారు .అందుకీ ,ఆయన అనుభ వించ లేక పోయినా ,వారి సేవా ఫలితంగా  పిల్లలు అభి వృద్ధి చెంది సుఖం గా వున్నారు .ఇది మాత్రమే వారి ఆత్మకు శాంతి నిచ్చేది .అదే ఆ కుటుంబానికి శ్రీ రామ రక్ష అయింది .శర్మ గారి శ్రమ ఆయనకుజీవిత కాలమ్ లో ఉపయోగించ కున్నా ,గుర్తింపు రాకున్నా   ఆ తర్వాత పిల్లల శ్రేయస్సుకు ఆశీస్సు గా   ఉపయోగ పడింది .
 
 
 
 
 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –7

కన్యా  శుల్కం లో కరటక శాస్త్రి –7

                     మధుర వాణి కి ఒక సందేహం వచ్చింది .లుబ్దున్ని కాపాడ టానికి కారణం ఏమిటి ?”చాపలు ఈద టానికి ,పిట్టలు ఎగారటానికి ఏం కారణమో అదే కారణం[అంటూ శాస్త్రి పరోప కారం సౌజన్యా రావు గారి సహజ గుణం అంటాడు .గడుసు కదా మధురం ”మీరెందుకు ఆ కొంచెం ఈదటంఎగరటం   నేర్చుకో కూడదు?”అన్నది మధురం .అర్ధం కాలేదు శాస్త్రికి .నిజం చెప్పి లోకోప కారం చెయ్య రాదా అని ఉపదేశం .”Do as I say but do not do as I do ”అనే తత్త్వం కొంత ఆస్థి గతం గా వుందిశాస్త్రి కి .”నిజం చెప్తేజెయిల్లో   పెట్టిస్తారు -కనుక కార్యం సానుకూలం కోసం ఈ ఎత్తు ఎత్తాను ”అని నిజం ఒప్పుకుంటాడు .సరే నంటుంది ఆమె .”ఒక వేళ మీరు మఠం లో ప్రవేశిస్తే కంటే ఖరీదు యెట్లా  ?”మళ్ళీ సందేహం .కనుక శిష్యుడు తాకట్టు అయాడు .ఏదో రకం గా గండం గడవటమే శాస్త్రికి కావాల్సింది .పాల ముంచినా ,నీట ముంచినా మధుర వాణే ?”నీవే  తప్ప ఇతః పరంబెరుగా ”ననే దీన స్థితి .శిష్యుణ్ణి మధుర వాణికి తాకట్టు పెట్టాడు .అయినా గుంటూరు శాస్త్రి తెలివి గలవాడే .కాలమ్ గడిస్తే ,మధుర వాణి యేలు బడి లో శిష్యుడు పెరిగి తనకు పంగనామం పెట్టచ్చు .ఆషాఢ భూతి అవచ్చు .అందుకే హెడ్డు వచ్చే లోపల కంటే తెమ్మని ,లోపలి పంపించి ,శిష్యుడి తో అంటున్నాడు .ఎంత జాగ్రత్త వుందో ?ముందు చూపు వుందో .నమ్మినా ,చక్రం అద్దం వేస్తున్నా ,తన పెడ బుద్ధి మాత్రం ఎముకలతో పుర్రెతో పుట్టింది కదా .అందుకని  ”అది చెప్పిందల్లా చెయ్యక .కొంచెం పై ఒచ్చేది కానీ .మరీ నడుస్తూ వుండు .ఏవైనా వుంటే నా చెవిని పడేస్తుండు ”.అని గురుపదేశం ,హితోప దేశము చేస్తాడు .చెవిలో చెవి పెట్టి పోరాడు .అదే కరటక బుద్ధి ..శిష్యుడు గట్టి పిండం .”ఎవరి దగ్గర వున్నప్పుడు వారు చెప్పినట్లల్లా చెయ్యడమే నా నిర్ణయం ”అని చెప్పు దెబ్బ లాగా కొడ్తూ ”మళ్ళీ అడ వేషం వేసి పెళ్లి చేశారో ?అని అర్దోక్తి గా ,ఆపుతాడు .గురువు ఎంత కైనా తెగిస్తాడని .కాచి వడ పోశాడు కదా .ఎంత గొప్ప పరిశీలన చిన్న క్యారెక్టర్ లో .”ప్రమాదో ధీమతామపి .ఎంత వాడికైనా ,ఒకప్పుడు కాలు జారుతున్దిరా ”అని తప్పు ఒప్పుకొంటాడు గురువు .దాదాపు లెంపలేసుకోన్నంత పని .శిష్యుడి దగ్గర గురువుకు ఆ శిక్ష చాలు .
                మధుర వాణికి అనుమానం వస్తుంది .”తన దగ్గర వున్నది తాకట్టు మనిషి .కట్టు తెంచుకో డని  నమ్మకం ఏదీ .ఆమె నైజం బాగా తెలిసిన వాడిగా నేర్పుతో ”నీ వల్లో పడ్డ ప్రాణి తప్పించుకు పారి పోవటం ఎలాగా ?వానికి వున్న పటుత్వం నీ గొలుసుకు ఉందీ ?”అంటాడు .ఎంత పోలికో చూడండి .వేశ్యాకర్శనే కాదు ,ఆమె ముగ్ధ మనోహరత్వం ,మాట తీరు ,నేరజాణత్వం ,లౌక్యం ,అభినయం ,ఆదరణ ,ఆత్మ స్థైర్యం ముందు ”ఇనుపకచ్చ డాలు  కట్టిన  ముని మ్రుచ్చు లైనా గోచీలు విప్పాల్సిందే.ఇంక తన శిష్యుడెంత?పాల బుగ్గల పసి వాడు .ఆ మొహం లో ,లోభం లో ఆకర్షణ లో పడి ,వాడిన్కేక్కడికో జారుకోడని చెప్పినట్లు ,అయస్కాంతం కంటే బల మైన ఆకర్షణ ఆమె యవ్వనం ,శృంగారం దేవతా స్త్రీల కంటే శాశ్వతం అంటాడు .ఆమె ”వలలో ముత్యపు చిప్పలు పడితే లాభం కాని నత్త గుల్లలు పడితే ఏం లాభం ?అంటుంది-శిష్యుడి తాహతును గుర్తు చేస్తూ .”ఆర్జిన్చిన్దంతా ,మీ పాలు చేస్తున్నా .కొద్ది కాలమ్ వుండే యవ్వనాన్ని జీవనాధారం గా చేసుకొన్నా ,మా కులానికి వలపు అంతా బంగారం మీదే .అదీ మీకు అర్పిస్తున్నాను .”అంటుంది .దెబ్బ తిన్నాడు శాస్త్రి .
               ఆమె శృంగారఅ  శాశ్వతత్వాన్ని మెచ్చుతాడు .ఆమెకు జీవితం మీద విరక్తి కల్గింది .ఈ రొచ్చు లోంచి బయట పడాలని వుంది .సౌజన్యా రావు సౌజన్యం తో జీవితం లోని పర మార్ధాన్ని గుర్తించి ,తరించాలనే నిశ్చయానికి వచ్చింది .ఇప్పుడు శాస్త్రి పెట్టె ప్రలోభాలకు లొంగే స్థితి లో లేదు .ఒక ఉత్కృష్ట స్థితిని పొందే దశ లో వుంది .శాస్త్రి కంటే ఆమె ఎంతో ఎత్తుకు ఏది గింది .కరటకం ఆమె ముందు మరీ కుంచించుకు పోయాడు .ఆమె అతన్ని మాటల మంటలతో కాల్చింది .మీ వల్లే మేం పాడయ్యాం .మీరు చేసిన వేశ్యలం మేం.మీ కోసం రొచ్చులో బతుకు తున్నాం .పైకి రాలేక ఎంతో మంది కుళ్ళి పోతున్నారు .అని క్లాస్ పీకింది .ఆమెకు .శాస్త్రికి జరుగ బోయే సంభాషణలు రసవత్తరం గా వుంటాయి .అవి . ప్రత్యేకం గా ఈ సారి తెలియ జేస్తాను .
                                           సశేషం
                                                         మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20 -11 -11 .
Posted in రచనలు | Leave a comment

వందేళ్ళ విశాఖ కు సాక్షి

Posted in మహానుభావులు, సేకరణలు | 1 Comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —6

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —6

విశాఖ పట్నం లో మధుర వాణి ఇల్లు .శిష్యుడు కంటే ఎత్తు కొచ్చినందుకీ తిప్పలుఅంటాడు శాస్త్రి .అది తన తప్పూ ఎలా అయిందని ప్రశ్నిస్తాడు సదానంద శిష్యుడు ,.”నువ్వు ఇచ్చావని అది ఒప్పుకుందా ?తే” ధగిడీ కే ”కంటే తెస్తావా ,చస్తావా ?అని రామప్ప పీక పిండేట్టు౦ది .దానికి వాడు ”కూనీ కేసని ”ఎత్తు ఎత్తాడు .ముసలాడికి శిక్ష అయిందంటే బ్రహ్మహత్య నా మెడకు చుట్టు కుంటుంది .నువ్వు ఆ కంటే వాళ్ళింట్లోనే వదిలేస్తే ఈ చిక్కు లేక పోవును ”అని శాస్త్రి బాధ పడుతాడు .ఇక్కడ అతనిలోని నిజాయితీ ,మనుషులను చదవ గల నేర్పు మనకు కన్పిస్తాయి .లుబ్దునికి శిక్ష పడుతుందేమో నని బాధా వుంది అతని లో .
శిష్యుడు గురువుని మిచాడు ”పన్యండు వందలు మీరు పట్రాగా లేంది ,నాకు పెళ్లి లో పెట్టిన కంటే నేను తెచ్చుకుంటే తప్పు పడ్తున్నారు .ఆ కంటైనా దక్కిందా ? చూస్తూనే మధురవాణి లాక్కుంది . ”అని తన బాధ బయట పెడ్తూ ,గురువును ఏకేశాడు .కరకటానికి విదూషకుడి వేషం వేయటం అలవాటే అయితే తన హాశ్యం అంతా ఈ కూనీ కేసులో అణగి పోయింది ”నేను తీసుకున్న రూపాయలు లుబ్ధావదాన్లకు ఎప్పటి కైనా పంపించ టానికే తలచాను .అపహరిద్దామని ఆశ లేదు .”అని తన నిజాయితీని ఆవిష్క రించు కొన్నాడు .అంతే కాదు ఈ కేసు లోంచి లుబ్దున్ని తప్పించా టానికి మధుర వాణి దగ్గర కంటే ఎరువు తీసుకొని ,ఆ డబ్బులు ,ఆ కంటే లుబ్దుడికి ఇచ్చి ఈ ఊబి నుంచి అతన్ని బయట పడేయాలనే తన సత్ సంకల్పాన్ని తెల్పాడు కూడా .”నాకు ఈ బ్రహ్మ హత్య తప్పి పోతుంది ”అని నిట్టూరుస్తాడు .
అయితే విషయం సౌజన్యా రావు కు చెప్పి తప్పించు కోవచ్చు .కాని దానికో చిక్కు వచ్చింది .”ఆయన తో వున్న మాట చెప్పేస్తే ఆయన కోర్టులో నిజం చెప్పేస్తాడు .ఆ పైన లుబ్ధావ దాన్ల వురి మన పీకకు తగులు కుంటుంది ”అంటాడు ”.మన ”అంటే శిష్యుడు కూడా అని ధ్వనించేట్లు అన్నాడు ..”మన అంటా రేమిటి ?”’అంటాడు సందేహించి ,గురువు గారి గురించి ఢక్కా ముక్క్కీలు తిన్న శిష్యుడు .”మాట పొరపాటు ”అని సర్దేస్తాడు గురువు .మధుర వాణి కంటే అరువిస్తే ”ఆంజనేయ స్వామికివో పది శేర్లు నెయ్యి దీపారాధన చేస్తాను ”అని ఒట్టు పెట్టు కొంటాడు .శిష్యుడి లోని సామాజిక స్పృహను అప్పా రావు గారు వెలికి తీస్తూ ”కడుపు లోకి వెళ్ళాల్సిన నెయ్యి కాచేయ్యటం నాకేమీ ఇష్టం లేదు -అమృత గుండీ మొక్కు కొండి ”అని ఉపదేశం చేశాడు .చస్తుంటే సంధి మంత్రం లా వుంది గురువుకి .ఆ మాత్రం హాశ్యానికే కోపం వచ్చింది ”హాశ్యం చాలించు .బెడిసి కొడుతుంది ”అని తాను జీవితం లో నేర్చిన పాఠం చెప్పాడు .తాను ఆడిన హాష్య నాటకం ఎలా బెడిసి కొట్టిందో తెలుసు కొన్నాడు .బైట పడే ఉపాయం కోసం బుర్ర బద్దలు కొట్టు కుంటున్నాడు .అందుకే అలా అన్నాడు పాపం కరటకం ..ఇదీ పాత్రల ద్వారా అప్పా రావు గారు చెప్పిన భావం ,భ్హాష్యం ,జీవిత విశ్లేషణ.
మధుర వాణి శిష్యుణ్ణి ముద్దు పెట్టు కొంటుంది .”నా అల్లుణ్ణి చెడ గొట్టకు ”అని వాపోతాడు శాస్త్రి .అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు ..ఆమె ”జైలు నుంచి వచ్చిన్తర్వాతా ?లేక పెళ్లి చేసుకొని మరీ మఠా ప్రవేశామా ?”అంటుంది నవ్వుతు .అర్ధం కాక శిష్యుడు ”జైలేమిటి ?”అంటాడు ..క్షణం ఆలశ్యం కాకుండా శాస్త్రి ”ఆ !హాశ్యానికి అన్దిలే ”అని సర్దేసాడు .”కొంపా ముంచారో ”అని గగ్గోలు పడ తాడు శిష్యుడు .”హాశ్యం చాలించమని ”శాస్త్రి అన్నాడు .గురువు చేసి నట్లే చేశాను .నా తప్పేమీ లేదంటాడు .”మీ ఇద్దరి కోసం హెడ్డు గాలిస్తున్నాడు దొరకం గానే మఠం ప్రవేశమే ”అంటుంది మధురం .
”ఇదేనా మీరు నాకు చేసే పెళ్లి ?”అంటాడు మునిగి పోయానేమో ననే సందేహం తో శిష్య పర మాణువు .”నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు ”అని అభయం ఇస్తాడు గురువు .నమ్మకం లేని శిష్యుడు మధుర వాణి తో ”మా గురూ గారు ఎవోచ్చినా సర్దుకో గల్రు .నన్ను రక్షించు ”.అని ప్రాధేయ పడ్డాడు ..”గురువుని వదిలి నా శిష్యరికం చేస్తావా ?”అని అడి గింది అభిప్రాయం లాగ టానికి .”ఇదిగో ఈ నిమిషం నుంచే -మీ నేస్తం ఈ వేళ తో సరి .మరి ఆడ వేశం ఈ జన్మ కు వేయను ”
అని జెల్ల కొట్టేస్తాడు గురువు కు ..”శిష్యరికం అంటే ఏం చెయ్యాలో తెల్సునా “‘అంది ఉడికిస్తూ .”నీళ్ళు తోడతా ,బట్టలుతుకుతా ,చిడప్పోక్కులు నొక్కుతా ”
అని తాను రోజూ గురువింట్లో చేసే అరవా చాకిరీ అంతా బయట పెట్టేస్తాడు .”ఇదేనా నీ గురువు దగ్గిర చేసిన శిష్యరికం “”అని ఎద్దేవా చేస్తుంది .కాళ్ళు పట్టటం తో సహా సకల ఉపచారాలు చేయించుకొని చదువు అక్షరముక్క కూడా చెప్పని కరటక శాస్త్రి నిజ స్వరూపం బయట పెట్టాడు శిష్యుడు .ఇదీ మొండి గురువు ,బండ శిష్యుల తమాషా .కళ్ళకు కట్టించాడు గురజాడ .నాలుగు ముక్కలు చెప్పి జ్ఞాన జ్యోతిని వేల్గించాల్సిన అవసరాన్ని ఉపదేశం గా దీనిలో చెప్పాడు గురజాడ .యెంత అమాయకం గా వున్నా ,శిష్యులు గురువుని చక్కగా అంచనా వెయ గలరు అని కూడా నిరూపించారు .వాళ్ళ అమాయకత్వాన్ని కాష్ చేసుకో వద్దనే హెచ్చరిక చేశారు .
సరే ముద్దు లోంచి చాలా దూరం జరిగామా ?”ముద్దు పెట్టు కొమన్నప్పుడల్లా పెట్టు కుంటే చాలు ” అని అంటుంది శిష్యుడితో మధురం .తన శిష్యుడు తనకు దక్క కుండా పోతాడేమో నని ,చేతికొచ్చిన అల్లుడు జారి పోతాడేమో నని కంగారు పట్టు కుంది గురువుకి .అలాంటిపని కైతే తాను సిద్ధం గా వున్నానని లౌక్యం గా చెప్పాడు ”ఆ శిష్యరిక మేదో వాడి తరఫునా ,నా తరఫునా కూడా నేనే చేస్తాను .చక్రం అడ్డం వెయ్యి ”అని బతి మాలుతాడు . మళ్ళీ తనకో ఛాన్స్ ఇవ్వమని లోపలి భావం కూడా .తన కంటే అరువు ఇవ్వ మంటాడు .ఇదే ఈ కేసులో బయట పడ టానికి మార్గం అని ప్రాధేయ పడ్డాడు .
”బ్రాహ్మలు ఎంత కయినా తగుదురు .”అంటుంది అతన్ని బాగా స్టడీ చేసిన ఆమె .సౌజన్యా రావు గారి ద్వారా పొంద వచ్చని చెబ్తాడు .ఆమెకు సౌజన్యా రావు గురించీ పూర్తిగా విడమర్చి వివరిస్తాడు .అంత కంటే మంచి వాడు లోకం లో లేడనీ అయితె ఆయన ఆన్టినాచ్ అని సాని వాళ్ళనుచూడరనీ అంటాడు .గిరీశానికి ,సౌజన్యా రావు గారికి తేడా ఏమిటని అడుగు తుంది ఇక్కడ కరటక శాస్త్రి లో అప్పా రావు గారు పరకాయ ప్రవేశం చేస్తారు ఇద్దరికీ వున్న వ్యత్యాసాన్ని ,మనకు ,మధుర వానికీ చూపిస్తాడు .ఎక్కడో వున్న సౌజన్యా రావు పై మనకందరికీ సౌజన్యం కల్గిస్తారు ..మాటలు అన్నది శాస్త్రి అయినా అందులో గురజాడ హృదయం వుంది
కరటక శాస్త్రి ”కుక్కకి ,గంగి గోవుకి ఎంత వారో (తేడా )అంత వార .ఆయన మనసా వాచా ,కర్మణా anti nautch .వేశ్య అనే పదం ఆయన వద్ద వినిపించ కూడదు .ఆయన లాంటి ”అచ్చాణీలు ” అరుదు .మిగిలిన వారంతా యధా శక్తి ఆంటి నాచ్ లే .ఫోజు ,ప్ఫోజు అంతా .మాటల్లో మహా వీరులే .అందులో గిరీశం అగ్ర గణ్యుడు .కొందరు బంట్లు పగలు అంటి నాచ్ ,రాత్రి ప్రో నాచ్.కొందరు వూళ్ళో అంటి నాచ్ ,పరాయి వూళ్ళో ప్రో నాచ్ ..కొందరు శరీర దార్ధ్యం ఉన్నంత కాలమ్ ప్రో నాచ్ శరీరం చెడ్డ తర్వాత అంటి నాచ్.కొందరు అదృష్ట వంతులు చచ్చిన తర్వాత కూడా ప్రో నాచే .అనగా యజ్ఞం చేసి పర లోకం లో భోగాలకు టికెట్టు కొనుక్కుంటారు .నా లాంటి అల్ప ప్రజ్న కల వాళ్ళు లభ్యం కా నప్పుడల్లా అంటి నాచే .
ఇదీ కరటక శాస్త్రి విశాల మైన ఆలోచనలకు ,అనుభవానికి study of characters కు దర్పణం .నాటకం వేసే వాడు కనుక పాత్రలను పరిశీలించే నేర్పు అలవడింది .ఇంగ్లీష్ భాషా ,భావం తెలిశాయి .మనస్సుల్ని estimate చేసే నేర్పు లభించింది .తానేమిటో .లోకమేమిటో ,మంచి చెడు ఎలా పక్కనే ఉంటాయో అవగతమయింది .అప్పా రావు గారి లోకజ్నత స్పష్టం గా కని పిస్తుంది .కరటక శాస్త్రి పాత్రకు నిర్దుష్టం గా ప్రాణ ప్రతిష్ట చేశారు .మంచిని ఎన్నుకొనే గుణం కల్పించారిక్కడ .జీవితాన్ని చదివించారు ,అనుభవ సారం అందించారు
సశేషం —
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19 -11 -11 .

Posted in రచనలు | Leave a comment

అమ్మోయ్ ఆధార్

andhra jyothy 2nd page article

Posted in సేకరణలు | Leave a comment

ఒక ‘కీర్తి ‘ శేషురాలు

ఒక ‘కీర్తి ‘ శేషురాలు

ఒక ‘కీర్తి ‘ శేషురాలు 
గొల్లపూడి మారుతీరావు
gmrsivani@gmail.com

మంచి పని ఎప్పుడూ ఒద్దికగా జరుగుతుంది. దౌర్భాగ్యపు పని బాహాటంగా ఒళ్ళు విరుచుకుంటుంది. ఒక 70 సంవత్సరాలలో మానవాళి మరిచిపోలేని దౌర్భాగ్యపు పని రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల మారణ హోమం. మూలపురుషుడు హిట్లర్.
ఆ మారణ హోమం నుంచి తనదైన ప్రయత్నంలో కొందరు యూదుల్ని రక్షించిన జర్మన్ షిండ్లర్ కథని ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ చిత్రంగా తీసి అజరామరం చేశాడు. అలాంటి మరొక అద్భుతమైన వ్యక్తి కథ ఇది. మానవాళి కృతజ్ఞతతో పులకించి చిరస్మరణీయం చేసుకోవలసిన కథ.
ఆమె పేరు ఇరీనా శాండ్లర్. పోలెండ్ దేశస్తురాలు. రెండవ ప్రపంచ యుద్దకాలంలో జర్మనీ పోలెండుని ఆక్రమించాక పోలెండులో యూదుల మారణహోమానికి తలపెట్టింది. అందుకు వార్సాలో ఒక శిబిరాన్ని ఏర్పరిచింది. దాన్ని ఘెట్టో అంటారు. ఇరీనా సాంఘిక సేవా సంస్థలలో పనిచేసేది. పాలక వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేసే జెగోటా అనే రహస్య (అండర్ గ్రౌండ్) సంస్థలో ఇరీనా సభ్యురాలు. ఈ వార్సా ఘెట్టోలో కుళాయిలు, మురుగు కాలువల మరమ్మత్తు చేసే పనికి కుదురుకుంది. అప్పటికి ఇరీనా వయస్సు 23 సంవత్సరాలు.
రోజూ చేతిలో పనిముట్లు ఉన్న పెట్టె, వీపు మీద పెద గోనె గోతాంతో పనిలోకి వచ్చేది. కేవలం నౌఖరీ చెయ్యడం ఆమె లక్ష్యం కాదు. ఆ శిబిరాల్లో ఉన్న యూదుల పసిబిడ్డల్ని తన పనిముట్ల పెట్టిలో అడుగున దాచిపెట్టి బయటకు రహస్యంగా చేరవేసేది. కాస్త శరీరం పెద్దదిగా ఉన్న పిల్లల్ని వీపు మీద గోతంలోకి ఎత్తుకునేది. ఆమెతో ఓ కుక్క కూడా వచ్చేది. ఈ పిల్లలు ఏడిచి శబ్దం చేస్తే నాజీ సైనికుల చెవినిపడకుండా వాళ్ళని చూసినప్పుడల్లా మొరగడం కుక్కకి అలవాటు చేసింది. కుక్క అరుపులకు అలవాటు పడిపోయిన సైనికులు ఆమెను పట్టించుకునేవారు కాదు. అనుమానం వస్తే నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపే నరరూపరాక్షసుల మధ్య నుంచి అలా రెండు వేల అయిదువందల మంది పిల్లల్ని బయటికి చేర్చింది.
బయటికి తెచ్చాక వారి తల్లిదండ్రుల వివరాలు, అడ్రసులు – అన్నీ స్పష్టంగా రాసి – ఆ విలువైన జాబితాలను ఓ గాజు కుప్పెలో ఉంచి – ఇంటి వెనుక పెరట్లో ఓ చెట్టు కింద పాతిపెట్టింది. ఈ పిల్లలకి కొత్త పేర్లూ, కొత్త అడ్రసులూ సృష్టించి కొన్ని కుటుంబాలలో, బాల రక్షణ కేంద్రాలలో వారిని చేర్చింది. ఇదొక అపూర్వమైన విప్లవం. తల్లిదండ్రులని కాపాడడం సాధ్యంకాకపోయినా వారి సంతానాన్ని కాపాడే మానవీయ విప్లవం.
యుద్దం ముగిశాక – అడ్రసుల్లో వివరాల ప్రకారం ఆయా పసివారిని వారి వారి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలని ఆమె పధకం. కానీ యుద్ధం ముగిసేనాటికి చాలా మంది తల్లిదండ్రులు ఈ నాజీ శిబిరాలలో విషవాయు ప్రయోగాలలో మరణించారు. తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్న ఏ కొద్దిమందో ఆచూకీ లేనంతగా మాయమయారు.
1943లో పిల్లల్ని చేరవేస్తూ ఇరీనా నాజీ సైనికులకు దొరికిపోయింది. అప్పుడామెకు 23 సంవత్సరాలు. (ఫోటో చూడండి). ఇలాంటి సాహసాలు తలపెట్టనక్కరలేని వయస్సది. కానీ మనస్సులో మానవతా చైతన్యం వెల్లివిరిసిన అమృతమూర్తి ఇరీనా. నాజీలకు పట్టుబడ్డాక నిర్దాక్షిణ్యంగా ఆమెని చావగొట్టారు. కాళ్ళూ చేతులూ విరగ్గొట్టారు. నానా చిత్రహింసలూ పెట్టారు. చివరికి మరణ శిక్షను విధించారు. ఆమెని కాల్చి చంపడానికి తీసుకువెళుతుండగా ఆమె పనిచేసే జెగోటా సంస్థ మనుషులు – నాజీ సైనికులకు లంచాలిచ్చి ఆమెని కాల్చి చంపకుండా తప్పించారు. కానీ బయటి ప్రపంచానికి ఇరీనా చచ్చిపోయినట్టే ప్రకటన వచ్చింది.
యుద్ధం తరువాత పోలెండుని సోవియట్ యూనియన్ ఆక్రమించుకుంది. రహస్యంగా పనిచేసిన ఈ కార్యకర్తలందరిని ఆ ప్రభుత్వం రాసిరంపాన పెట్టింది. అప్పటికి ఇరీనాకి పెళ్ళయి – రెండోసారి గర్భస్రావమయింది. క్రమంగా రాజకీయ వాతావరణం మారింది. కమ్యూనిస్టు పాలన నుంచి పోలెండు విముక్తమయింది. కొత్త పోలెండు ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించింది. ఇజ్రేల్ ప్రభుత్వం యూదులకు చేసిన సేవలకుగాను ఆమెకు తమ దేశపు అత్యున్నత పురస్కారాన్నిచ్చింది. పోలెండు ప్రభుత్వం ఆమె స్వయంగా వెళ్ళి ఆదుకునేందుకు అనుమతినిచ్చింది.
2003లో రెండవ పోప్ పాల్ యుద్దకాలంలో ఆమె కృషిని అభినందిస్తూ ఉత్తరం రాశారు. అదే సంవత్సరం పోలెండు తమ దేశపు అత్యున్నత పురస్కారంతో ఇరీనాను సత్కరించింది. 2007లో పోలెండు సెనేట్ ఆమెను గౌరవించుకుంది. అప్పటికి ఆమె వయసు 97. లేచివెళ్ళలేని పరిస్థితి. ఆమె రక్షించిన బిడ్డలలో ఒకరయిన ఎలిజబెత్ ఫికోస్కా అనే ఆమె ఇరీనా తరపున వెళ్ళి ఆ గౌరవాన్ని అందుకుంది.
2009లో ఐక్యరాజ్యసమితి తరపున ప్రముఖ హాలీవుడ్ నటి – ఆడ్రీ హెప్ బర్న్ ( ”రోమన్ హాలీడే’ హీరోయిన్) పేరిట ఏర్పరిచిన మానవతా పురస్కారాన్ని ఆమెకి అందజేశారు. 2007 లో కాన్సాస్ లో ఒక ఉపాధ్యాయుడు నోబెల్ శాంతి బహుమతికి ఆమె పేరుని ప్రతిపాదించారు. బహుమతిని ప్రకటించాక – అంగీకరించని నామినేషన్లని గత 50 సంవత్సరాలుగా బయట పెటకపోవడం ఆచారం. కానీ ఇరినా శాండ్లర్ పేరు బయటికి వచ్చింది. శాంతి బహుమతికి ఆమె కంటే ఎవరికి అర్హత ఉంటుంది? మానవత్వాన్ని అంతకంటే ఎవరు ఉన్నత స్థాయిలో నిలపగలరు? ఒక మదర్ థెరిస్సా, ఒక దలైలామా, ఒక మహాత్మాగాంధీ (ఆయన పేరుని నోబెల్ శాంతి బహుమతికి సూచించలేదు!), ఒక ఇరీనా శాండ్లర్.
కాదు బాబూ! కాదు. అర్హతలు చాలామందికి ఉన్నాయి. నోబెల్ స్థాయి రాజకీయాలూ ఉన్నాయి. పర్యావరణ కాలుష్యానికి కృషిచేసిన అమెరికా ఉపాధ్యక్షులు ఆల్ గోరేకి ఆ సంవత్సరం శాంతి బహుమతిని ఇచ్చారు.
అది 2007. ఈ విషయాన్ని తెలిసిన ఇరీనా నవ్వుకుని ఉంటుంది. 68 సంవత్సరాల ముందు వీపు మీద మోసిన మానవాళి ఔన్నత్యానికి ఇలాంటి విలువల్ని ఆశించి ఉండదు. విరిగిన కాళ్ళూ, చేతులూ, దాదాపు చావుదాకా వెళ్ళిన ప్రయాణం, తన కళ్ళముందే పెరిగి పెద్దదయిన ఎలిజబెత్ ఫికోస్కా, ఇంకా 2499 మంది పిల్లలు ఆమెకి సజీవ నోబెల్ బహుమతులు. ఈ బహుమతి కేవలం ఒక సంస్థ గుర్తింపు. ఆ కృషి మానవత్వం ఆమెకిచ్చిన కితాబు. ప్రశంస.
తన 98 వ ఏట – ఆ మధ్యనే ఇరీనాశాండ్లర్ అనే దేవతామూర్తి కన్నుమూసింది.
దేవుడిని చాలామంది నమ్మరు. 23 ఏళ్ళ ఓ అందమయిన అమ్మాయి – 2500 పసి జీవితాలకు ప్రాణం పోసిన మాతృమూర్తిలో దైవత్వాన్ని – 98 సంవత్సరాలు ఆ జీవితాన్ని జీవనయోగ్యం చేసిన వైభవాన్ని అందరూ నమ్మక తప్పదు. ఇది వాస్తవం. 98 వ ఏట ఆ దేవత ముఖంలో చిరునవ్వు ఆ జీవన సాఫల్యానికి అద్దం పడుతుంది.

***

సెఫ్టెంబర్ 26, 2011

************               ************           *************          *************

Posted in మహానుభావులు, సేకరణలు | 1 Comment

సాహితీ మనడలి ఉయ్యూరు 261 వ సమావేశం

Sahithimandali 261 111120_0001

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సరి కొత్త వేదిక నిర్మిద్దాం 44 వ గ్రంధాలయ వారోత్చ వాల సందర్భం గా ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో ఈ రోజూఅంటే 18 వ తేది న జరిగిన”కవి సమ్మేళనం ”లో నేను రాసి చదివిన కవిత ఇది .

సరి కొత్త వేదిక నిర్మిద్దాం

44 వ గ్రంధాలయ వారోత్చ వాల సందర్భం గా ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో ఈ రోజూఅంటే   18 వ తేది న జరిగిన”కవి సమ్మేళనం ”లో నేను రాసి చదివిన కవిత ఇది  .
                ”గ్రంధాలయం మన పుస్తక దేవాలయం
                ఆధునిక మార్పులతో వర్దిష్ణ మవుతున్న సాంకేతిక నిలయం
                ప్రపంచ సాహిత్యాన్నంతా ఒక్క చోట చేర్చిన ప్రదర్శన శాల
                మానవ మేధను పదును పెట్టె సాధనం ఈ ఆలయం
                సార్ధక  జీవితాన్నందించే సరి కొత్త ప్రయోగం
                విజ్ఞానం లో వెనుకబడ టాన్ని -వెనక్కి నెట్టే ప్రయత్నం
                అందరి సర్వతోముఖాభి వృద్ధికి,సమగ్రత కు
                 సవ్య మార్గాన్ని చూపే నవ్య మార్గ దర్శి
                 అది  మానసిక పరిణతి కి సోపానం
                 చదివిన వాడికి చదివి నంత -లబ్ది పొందే వాడికి పొందినంత
                  ఎవరి కృషికి తగ్గ ఫలితాల నిచ్చే విద్యా తుల మానం
                  గ్రంధాలయ సందర్శనం ఒక హాబీ గా మాత్రమే ఉండ రాదు
                  గ్రంధ పథనం -అను నిత్య  అలవాటు గా మారాలి
                  అది పని వేళలకే పరిమిత మైనదని ,

        అధికారాల చట్రం లో ఇమడాలని

                   అనుకోవటం అవి వేకమే
                   ఇక్కడ సాహితీ సుగంధం -అనవరతం పరిమ ళించాలి
                    ఇక్కడ శాస్ర చర్చల ముచ్చట్లు చప్పట్లతో మార్మోగాలి
                     నిశ్శబ్దానికీ ,ప్రశాంతత కు భంగం యేర్పడ రాదు
                     ఇక్కడ సంగీత గంగా ఝరి మనల్ని పవిత్రం చేయాలి
                     ఇక్కడ నాటక ,నాటిక ప్రదర్శన నాణ్యమై రాణించాలి
                     ఆటల ,పాటలతో చిన్నారులకు -బృందావన మవాలి
                     ఇక్కడ మహా మహుల పవిత్ర జీవిత మహః స్ఫూర్తి కల్గించాలి
                      కవి సమ్మేళనాల తో, చిత్రకళా ప్రదర్శన తో, కళా జాతరలతో
                      సకల కళా నిలయం గా నిండుగా వెలగాలి
                      సమాజాభి వృద్ధి కేంద్రం గా ,ఆధునికతకు అద్దం గా వర్ధిల్లాలి
                       చదివిన పుస్తకాలపై అభిప్రాయ సమీక్షా నిలయమవాలి
                       అభి వృద్ధిసంఘానికి   సముచిత స్తానమవాలి
                       చదువరుల సంఘానికి గౌరవమేర్పర చాలి
                       ఏడాదికోసారి చేసే తూ తూ మంత్రపు వారోత్చ వాలు కాదు
                       అను నిత్య వారోత్చవ ,పక్షోత్చవ మాసోత్చవ,వార్శికోత్చవాలు
                       అత్యంత వైభ వో పేతం గా,అందరి సహకారం తో  జరగాలి
                       గ్రంధాలయం చీకట్లను తొలగించే వెలుగవ్వాలి
                       అజ్ఞానాన్ని దూరం చేసే విజ్ఞాన శిఖరం కావాలి
                       ఇరుకు ఆలోచన నుంచి ,విశాల దృక్పధాన్ని ఏర్పర చాలి
                       అప్పుడే అది గ్రంధాలయం అవుతుంది
                       లేకుంటే” దుర్గ న్ధాలయం ” అవుతుంది
                        మీరు ,మేము ,మనమందరం కలిస్తే
                        ఉజ్వల భవిష్యత్తు కు సరి కొత్త వేదిక అవుతుంది
                        ఆ దిశ గా అడుగులు వేద్దాం -సాధించి చూపిద్దాం .
                                        మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –18 -11 -11 .
Posted in కవితలు | 1 Comment

మా ఉ(య్యురు) సిరి వనం లో కార్తిక ‘సత్యనారయణ వ్రతం’

This slideshow requires JavaScript.

మా ఉ(య్యురు) సిరి  వనం లో  కార్తిక ‘సత్యనారయణ వ్రతం’

Posted in సమయం - సందర్భం | 1 Comment

భారత చరిత్ర భాస్కరులు

భారత చరిత్ర భాస్కరులు

ఆడియో -౧

ఆడియో – ౨

                     ఎవరెవరో  అడ్డ దిడ్డంగా రాసిన మన చరిత్రను

              మన వెద ,శాస్త్ర జ్యోతిష,పురాణేతి హాసాల నాధారం గా సరి దిద్ది, తిరగ రాసి

                     ”ఇదీ బారత చరిత్ర -ఇదే భారత చరిత్ర ”అని సగర్వంగా
                      ఎదురొడ్డి నిలిచి ప్రపంచానికి చాటిన పండిత విమర్శకులు
                       ”బ్రహ్మాండ సృష్టి రహశ్య విజ్ఞానాన్ని ”త్రవ్వి తీసిన విజ్ఞాన ఖని
                        ”మానవ సృష్టి విజ్ఞానాన్ని ”ఎరుకకు తెచ్చిన మేధావి ‘
                         ”ఆంధ్రుల సర్వతోముఖ విజ్ఞానాన్ని ”వెలికి తీసిన విజ్ఞాన మూర్తి
                          ”అన్య గ్రహ లోకాదుల్లో స్థూల దేహాలున్నాయని ”గుర్తించిన సూక్ష్మ గ్రాహి
                          ” భూగోళ స్థిత జంబూద్వీపాన్ని-నవ వర్ష విభాగాలుగా
                          సచిత్రం గా ”ఆవిష్కరించిన”  పరిశోధన ఘనా పాథీ
                          శ్రీ రామ సేతువును ,లంకా స్థల నిర్దేశాన్ని నిరూపించిన నిజ నిర్ధారక వేత్త
                         ” అలేగ్జాందర్ కు సమ కాలికుడు గుప్త చంద్ర గుప్తుడే
                          ”మౌర్య చంద్ర గుప్తుడు కాదని తేల్చి చెప్పిన వివేకి
                        ”  శ్రీ శంకర భగవత్పాదుల కాలాన్ని క్రీ.పూ.509 ” అని
                            సొప పత్తికం గా నిరూపించిన చారిత్రాకాన్వేషి
                           అందరం నెత్తి కేత్తుకొనే ”మాక్స్  ములర్ పండితుని ”
                           మూల సిద్ధాంతాన్నే తిప్పి కొట్టిన వెద శాస్త్ర ప్రజ్ఞా మూర్తి
                           ”వేదం అపౌరుషేయం ;;అని మళ్ళీ నిరూపించిన ఆధునిక శాస్త్ర విజ్ఞాని
                           ” చారిత్రిక శకాలను” (era )స శాస్త్రీయం గా
                            అక్షర బద్ధం చేసిన మహా మహో పాద్యాయుడు
                           ” కలి రాజ వంశాన్ని” కల్మష రహితం గా రాసిన కాల వేది
                             భారత యుద్ధ కాలాన్ని, కలి ప్రవేశ కాలాన్ని
                            శాస్తోక్తం  గా చెప్పిన చారిత్రకాగ్రేసరుడు
                           ”  తిలక్ చెప్పిన ఆర్యుల ధ్రువ ఖండ నివాసాన్ని ”
                              ఖండన మండనం చేసి ,నిజాన్ని నిర్భయం గా చెప్పిన శేముషీ దురంధరుడు
                            ”ఆంద్ర ,ఆంగ్ల ,గీర్వాణా లలో అద్వితీయ ప్రతిభా సంపన్నులు
                             తన అభిప్రాయాలను నిర్మోహ మాటం గా ప్రకటించి
                            ఆ నాటి దేశ ,విదేశీ చరిత్ర కారుల ,పండితుల ,పరిశోద కారుల తో
                            చర్చించి నిగ్గు తెల్చుకొన్న” అసలు సిసలు చరిత్ర కారులు ”
                            ఆయనే మన” విజయ వాటికా” పుర వాస్తవ్యులు
                             ”భారత చరిత్ర భాస్కరులు ”-
                             ”-శ్రీ కోట వెంకటాచలం -మాన్యులు ”
                             ” శ్రీ మదభి నవ విరూపాక్ష జగద్గురు పీథాదిపతులు ”
                             ” శ్రీ శ్రీ శ్రీ అద్వయా నంద శంకర భారతీ స్వాములు ”
                              విజయ వాడ తో సహా ,భారత దేశ జనులు
                              అందరకు” నిత్య ప్రాతస్మర నీయులు ”
                              ఆ సార్ధక నామాన్ని” చిరంజీవి” చేయాలి మనం అందరం ‘
                                                      గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -11 -11 .
           .
   44 వ జాతీయ గ్రంధాలయ వారోత్చావాల సందర్భం గా విజయ వాడ చిత్త రంజన్ గ్రంధాలయం లో ”రమ్య భారతి ”ఆధ్వర్యం లో ”మన విజయ వాడ ”అనే అంశం పై జరిగిన కవి సమ్మె లనం లో నేను చదివిన కవిత ఇది .
       శ్రీ కోట వెంకటా చలం గారు సుమారు 1925 నుంచి 1995  వరకు విజయ వాడ లో వున్నారు .వారు ఒంటి చేతితో సాగించిన చారిత్రిక పరిశోధన ,ఆంద్ర ఆంగ్ల భాషల్లో వెలువరించిన పుస్త కాలు అమూల్య మైనవి .వారు సార్ధక జీవితాన్ని గడిపి తురీయా ఆశ్రమం లో సన్యశించి   శ్రీమదభినవ విరుపాక్ష జగద్గురు పీతాది పతులై  ”అద్వాయానంద శంకర భారతీ  స్వాములు” గా చరితార్దులై నారు ..వారి కుమారులు ,తండ్రి అంతటి పరిశోధకులు ,ఆయుర్వేద వైద్య శిఖా మణి శ్రీ కోట నిత్యానంద శాస్త్రి గారి తో నాకు మంచి పరిచయం వుంది .నిత్యానంద శాస్త్రి గారిని( 84 ) రెండేళ్ళ క్రితం ”సరసభారతి ”కి ఆహ్వానించి ,వారి తండ్రి గారిని ఆ సభలో సంస్మరించుకొని వారికి ఆత్మీయ సత్కారం చేశాం .ఇప్పటికీవారితో   ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే వున్నాను .వెంకటా చలం గారిపై భారదేశ చారిత్రిక పరిశోధన శాఖ వారు ఈ సంవత్చరంమే నెలలో  హైదరా బాద్ లో ఒక గొప్ప సభ చేసి ,వారిపై ఒక” ప్రత్యెక సంచిక ”ను వెలువరించి ,వారి కుమారులు నిత్యానంద శాస్త్రి గారిని ఘనం గా సన్మానించారు
              నేనుపైన రాసిన కవితను నిన్న విజయ వాడ లో  చదివితే ఒక్కరికి కూడా వెంకటా చలం గారు తెలియదు అని చెప్పారు .వారిని ,ఆ కార్య క్రమం లో గుర్తు చేసినందుకు నన్ను అందరు అభినందించారు .నాకూ,ఆనందం గా వుంది
                                     గబ్బిట దుర్గా ప్రసాద్ —18 -11 -11 .
Posted in కవితలు | 3 Comments

సంగీత యోగి – హిందు రివ్యూ

The Hindu Fridayreview 110805

Posted in మహానుభావులు, సేకరణలు | Leave a comment

పేరడీ

Posted in సేకరణలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –5

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –5

 

                                     కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –5 

                 కరటక శాస్త్రి తక్కువ వాడు కాదు .తాను వచ్చిన  కార్యాన్ని దీనితో సంధించి బాణం గురి తప్పకుండా కొట్టాడు .తన డబ్బు అవసరం ఎంత వుందో తెలపటానికి ”అంత అదృష్టవా అండీ .అల్లాంటి పిల్లే నాకుంటే ,మూడు ,నాలుగు వేలకు అమ్ముకుని ,రుణాలు ,పాణాలు ,లేకుండా ,కాలక్షేపం చేసి ఉండును ”అని మళ్ళీ తన దీన గాధ చెవిని వేస్తాడు .కరిగిన పంతులు తన సహాయ లోపం ఉండదని హామీ ఇవ్వ గానే ”అయితే కార్యవయిందే ”అని ,పంతులు చేతిలో పడితే తిమ్మిని బ్రహ్మిని చేస్తాడని ,లౌక్య ప్రభువు చాక చక్యం తెలుసు కనుక కార్యం సానుకూలం అవుతుందని ఘట్టిగా నమ్ముతాడు .”డబ్బుకు లోకం దాసోహం ”అయినందుకు సంతోషిస్తాడు .
               మళ్ళీ కరటక శాస్త్రి నాల్గవ అంకం లో మధుర వాణి ఇంట్లో బేరం  ఫైసలు చేసుకొనేందుకు కన్పిస్తాడు .అప్పటికే మధుర వాణి పంతులు నెత్తి మీద నీళ్ళ చెంబు కుమ్మరిస్తుంది .తలంతా తడిసి వుంది .మంచి హాశ్యం ,చమత్కారం వున్న   వాడు కదా కరట కుడు.”గంగా జలం శిరస్సున పోసుకున్నారా ఏమిటి పంతులు గారు” ?అంటాడు .సుబ్బి పెళ్ళికి ముందే శిష్యుడికి లుబ్ధావధాన్లతో పెళ్లి అయిపోవాలి .దీని కోసం సిద్ధాంతి జాతకం ,ముహూర్తం సిద్ధం చేశాడు .ఆ రోజుల్లో అయిదు రోజుల పెళ్లి .అలా చెయ్యక పొతే అది పెళ్లి అనిపించు కోదు .పైగా పరువు తక్కువ కూడా .”ఏక రాత్రి వివాహం చాలు ”అంటాడు శాస్త్రి . ”దివ్య స్థలాల్లోనే ఆ రోజుల్లో ఏక రాత్రి వివాహాలు జరిగేవి ఈ విషయం అల్లుడు లుబ్ధుడు బయట పెట్టాడు .మామ తక్కువ వాడా /ఏదో మతలబు చేసి ”ఎకరాత్రానికి ఒప్పించాలి ”లేక పొతే ”ఆబోరు ”దక్కదు .చాలా మంది ఎకరాత్రాలే చేస్తున్నారని చెప్తూ ”మీ వూళ్ళో కోదండరామస్వామి స్వయం వ్యక్తవూ ,హనుమత్ ప్రతిష్టా అయినపుడు దివ్య స్థలం కాదని ఎవడనగలడు ? అని దబాయిస్తాడు .స్థల మహాత్య్మం అంట గట్టేశాడు .ఇంక దీనికి తిరుగేముంది ?”అయినా ఇక్కడ ఇంతవరకు అలా ఎవరు చేయ లేదండీ ”?అని సందేహిస్తాడు .ఇక శాస్త్రి దబాయింపు సెక్షన్ లోకి వస్తాడు  .”దివ్య స్థలం అయింతర్వాత ఎవడేమంటే మనకేం పోయింది ?”అంటాడు .ఎందుకైనా మంచిది పంతులు తో చేబ్దామంటాడు లుబ్ధుడు . ..పంతుల్తో చెబ్తే కొంప మునుగు తుంది .మధుర వాణి వేసిన ఎత్తు పారదు .అభాసు పాలవుతుంది .అంతా అంతర్నాటకం .ఒకళ్ళకి తెలీకుండా ఒకళ్ళ ఎత్తు .జిత్తు .పంతులు పై కొంత అసహ్యం కలగటానికి పాచిక వేస్తాడు శాస్త్రి .మిత్ర భేదం ప్రయోగిస్తాడు .అఘటన ఘటనా సమర్ధుడు కరటకం ..
                          ”ఈ పెళ్లి లో నాలుగు డబ్బులు సంపాదించా లనుకొనే పంతులు ,పోలి శెట్టి ఏక రాత్రి వివాహానికి అంగీకరిస్తారా ?పుస్తె కట్టిందాకా ఆ మాట వాళ్ళతో చెప్పకండి ”అంటాడు .”అయిదు రోజుల పెళ్లి అయితే  నీ కొంప గుండమే” ”.’కొంప కొల్లేరు  చేస్తారనట్లుగా చెప్పాడు .చెప్పక పొతే ”ఏం జట్టీ తెస్తాడో ”అని లుబ్దుడికి లోపల భయం .ఇక గట్టిగా బాదక పొతే కధ అడ్డం తిరుగు తుంది ..”అతగాడు మీకు యజ మానా ?జట్టీ ,గిట్టీ పెడితే ‘పెణ తూడ  గొడతాను”’ అని భరోసా ఇస్తాడు .”పావంటి దానికి విరుగుడు వుంది .పంతులు కుండదా ?”అని ఒక సామెత చెప్పి ఒప్పిస్తాడు .ఇక్కడ కధ మంచి రస పట్టు లో జరిగింది .ఎవరు ఎవరికి వెన్ను పోటు పోడుస్తున్నారో మనకు అర్ధ మై పోతుంది .డబ్బు తో సాధించ లేదని ఏదీ లేదని నిర్ధారణ అయింది .
             పెళ్లి అయి పోయింది .అంపకాల శీను లో కరటక శాస్త్రి ”అపర కన్వుడి” లాగ విలపిస్తాడు .లుబ్ధుని కూతురు మీనాక్షి  చేతి లో శిష్యుణ్ణి  పెట్టి ,”కడుపు కదా అమ్మా !అంచేత పదే పదే చెప్తున్నాను .”అని భోరున ఏడుస్తాడు .”విషాదం ”మంచి పాకాన పడింది .సిద్ధాంతి వచ్చే లోపలే శాస్త్రి ఉడాయించేస్తాడు .కొంప మునుగు తుందనే భయం .మళ్ళీ చాలా కాలానికి కాని కనపడ్డు .    .  
              పోలీసులు గుంటూరు శాస్త్రి కోసం వెతుకు తుంటారు .తన తెలివీ ,పంతులు తెలివే ,మధుర వాణి అతి గొప్ప చాక చక్యం కలిసి ”మగాడి ”తో మగాడి పెళ్లి జరగటం తమాషా పెళ్లి అని పించింది .లుబ్దుడికి ఇంక పెళ్లి మీద విరక్తి కల్గెట్లు చేస్తాడు శాస్త్రి .”సుబ్బి పెళ్లి ”తప్పి పోవటానికి యెంత కష్ట పడ వలసి వచ్చిందో పాపం కరటక శాస్త్రికి  .నిందలు మోశాడు .వేషాలు వేశాడు .కేసులో ఇరుక్కున్నాడు .ఇదంతా ఒక మంచి పనికే .అతి బాల్య వివాహాలు ఆప టానికి ,కన్యా శుల్కాన్ని నిరోధించటం ,ముసలాడికి మళ్ళీ పెళ్లి ఆశ లేకుండా చేయటం .ఇవన్నీ ఈ అంతర్నాటకం లో కరటక శాస్త్రి సాధించిన విజయాలు .వెయ్యి అబద్ధాల తో ఒక Homo sexual ”మారేజీ చాలా ఈజీ గా చేయించిన ఘటికుడు .గుంటూరు శాస్త్రి .
           కరటక శాస్త్రి పూర్తి నిజస్వరూపం  ,ఇంకా అతని లో  నిగూఢ౦  గా వున్న భావాలు ,సామాజిక స్పృహ మనకు ఆరవ అంకం లో విశాఖ పట్నం లో మధుర వాణి ఇంటి దగ్గర తెలుస్తాయి .
                                      సశేషం                           మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -11  -11
                 గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –4

                కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –4               గుంటూరు శాస్త్రి మధుర వాణికి తన గోడు వెళ్ళ బోసుకుంటాడు .ఈ పిల్లని లుబ్దావధాన్లకు ఇచ్చి పెళ్లి చేసి ,తన మేనగోడలి బతుకు కాపాడ మంటాడు. అందుకే ”పంతులు లేని సమయం చూసుకొని” వచ్చానని చెబుతాడు .ఒక వేళ ఈ నాటకం బయట పడితే ,ఎమౌతున్దోనని ఆమె అనుమానిస్తుంది .భరోసాయిస్తూ ,శాస్త్రి ”మధ్యనకు నాకు వచ్చిన ఫరవా ఏమిటి ?ఈ కత్తెర మీసం ,కత్తెర గడ్డం కదిగేసుకోని నా తోవన నేను పోతాను .ఈ కొక నీ దగ్గరే పారేసి మా శిష్యుడూ ,వెడతాడు .”అని ధైర్యం చెప్పాడు .రామప్ప పంతులుతో మాట్లాడి దీన్ని ఖాయ పర్చమంటాడు .ఇంకా ఎవరెవరి కాళ్ళు పట్టుకోవాలన్నా పట్టుకుంటా నంటాడు .మీనాక్షిని ,సిద్దాన్తినీ బుట్ట లో వేయటానికి సిద్ధమౌతాడు ఆమె సలహా ప్రకారం .ఇదంతా చేస్తే ”నీ మాట వేరే చెప్పాలా ?నిన్ను సంతోష పెట్టడం నా విధి ”అని తిలా పాపం తలా పిడికెడు గా ఇస్తానంటాడు .ఆమె బాధ పడుతుంది .శాస్త్రి ఇంతేనా తనను అర్ధం చేసుకోండీ ?అణు కుంటుంది ”మీ తోడ బుట్టువుకు ప్రమాదం వస్తే డబ్బుకు ఆశిస్తానా ?యటుంచి యటోచ్చినా   కాపాడుతాను .”అని భరోసా ఇస్తుంది .శాస్త్రి మనసు కుదుట పడుతుంది
               రామప్ప పంతుల్ని కూడా మచ్చిక చేసుకొనే అవకాశం వచ్చింది .పంతులు లోపలకు వస్తాడు .డబ్బు కావాల్సి వస్తే ”ఒపాతిక” సర్డుతాడు గుర్రబ్బండీ వాడి కిరాయిగా .మాటల్లో మంచి నాణ్య౦  వుంది .”ఈ పిల్లకు పెళ్లి చెయ్యాలి మీరు ”అన్నాడు ..రామప్ప నియోగి దర్జా వొలక పోస్టు ”నేను వైదీకిని కాను .నాకు మంత్రాలు రావు ”అంటాడు .దానికి శాస్త్రి ఇచ్చిన సమాధానం మహా గడుసు గా వుంటుంది .”ఈ రోజుల్లో వైదిక మంత్రాల మహిమ పోయింది .మంత్రమంటే నియోగ ప్రభువులాడే మంత్రం ”అని పొగడ్త ధూపం వేస్తాడు,మాటల మంత్రం ప్రయోగిస్తాడు .ఇంకేం మిడతం భొట్లు చిక్కాడు .వలలో పడ్డాడు .పంతులు ఆడ వేష౦  లో వున్న శాస్త్రి శిష్యుడు  ‘మహేశాన్ని ” తేరి పార చూసి ”ఈ పిల్లను నేను పెళ్లి చేసుకు౦ దునా ?అంటాడు మధుర వాణి తో .ఆమె మూతి తిప్పుతూ అక్కడినుంచి వెళ్లి పోయింది .ఇప్పుడే కాష్ చేసుకో వాలను కుంటాడు కరటకం .కాచుక్కూచున్న నక్క వినయం తో ”వైదీక పాల్లం మాకు శ్రుంగారాలేలా అనుభవ మౌతాయండీ ? మా ఇల్లాళ్ళకు కోపం వస్తే చీపురు కట్టలు ఎగుర్తాయి .సరసమన్నది పుస్తకాల్లో చదవటమే గాని మాకు అనుభవ వేద్యం కాదండీ ”అన్నాడు .మధురానికి ,పంతులుకు జరిగిన సరసాన్ని చూశాడు.  ”సొగసు కత్తెలకు అలక కూడా అదో శృంగారం సుమండీ” అని ఆమె కోపాన్ని పంతులు సమర్ధిస్తే ”శృంగారం నియోగ ప్రభువులదే ”అని తనకు తెలుసునని ఉబ్బెస్తాడు .తనకూ ,ఆ స్వార్ష్యం వున్నా ,బయట పడ కుండా ,తనకేమీ తెలీదన్నట్లు నటించాడు .నంగ నాచి అంటే ఇలాంటి వాడే .
               మధురాన్ని పంతులు వుంచుకున్నాడని తెలిసిన లౌక్యం గా ”ఆమె మీ భార్య కాదండీ !సంసారి కన్నా మర్యాదగా వుంది ఈ వేశ్య అని అతని అదృష్టాన్ని పొగుడుతాడు .అతడు ఐసు అయి పోయి కరిగి పోయాడు .”ఎంపికలో వుంది ”అని తన గొప్ప చెప్పుకొన్నాడు ఇంతకు ముందు ”ఎందరో అయినారు ”అని తెలిసినా డాంబికం గా.తాను వచ్చిన విషయ౦  వివరించాడు శాస్త్రిచాలా గడుసుగా .”పని చేయ్యాలన్నా ,ఇంత కథకా లన్నా నియ్యోగులకే చెల్లు అని తీర్మానిస్తాడు .”ఇయ్యా ,ఇప్పించ గల అయ్యలకే కాని మీసము అన్యులకేలా ,రొయ్యకు లేవా తెగ బారెడు మీసము ”అని వైదీకుల అసమర్ధతను తెలుపుతాడు .తాను చిక్కుల్లో వున్నానని దావా ఒకటి సిద్ధం గా ఉందనీ ,డబ్బు అవసరం అనీ ఈ పిల్లను అమి దావా వేయాలనీ ,బేరం కుదర్చ మని ప్రాధేయ పడుతాడు .తనకు1600  రూపాయలు అవసరమనీ   అవసరం అనీ ఆపైన ఎంత వచ్చినా  తీసుకో మని ఆశ చూపిస్తాడు .,  ,
          పంతులు దగ్గర ఈ శషభిషలు పని చేయ లేదు .నూర్రూపాయల ఫీజు ఇస్తే ,సంబంధం చెడ గొట్టి ,ఇది లుబ్దుడికి ఖాయం చేస్తానంటాడు .దారిలో పడ్డాడు గురుడు అని తెలుసు కోని ,పదో వంతు సొమ్ముతో సంతృప్తి పడమంటాడు .సగానికి సగం అంటాడాయన .శాస్త్రి యుక్తి యుక్తం గా ”రక్త,మాంసం అమ్ముకొంతున్నప్పుడు ,ఆ కాని కూడు అయినా సంతుష్టి గా దొరకటం న్యాయం కదండీ .ఈ పాపపు సోమ్ముకే తమరు ఆశిన్చాలా ?అని సన్నాయి నొక్కులు నొక్కుతాడు .ఏమైనా ” ఖాళి చేస్తాడేమో  ”నని .పంతులు తక్కువ వాడా ?”పాపపు సొమ్ము మా దగ్గర కొస్తే పవిత్రం అయి పోతుంది ”అంటాడు .చివరికి సరే నంటాడు .మధుర వాణి లాంటి వజ్రాన్ని సంపా దించు కొన్నందుకు అభినందిస్తాడు శాస్త్రి పంతుల్ని .”ఆడదాన్ని ఆట్టే రోకా యించ కూడదని ”సలహా పారేస్తాడు .”నాజూకైన స్త్రీని మల్లె పూలాగా వాడుకోవాలని ”ఇంకో చిట్కా   చెప్పాడు .”నాజూకులు మీ కెట్లా తెలుసు ?అని ఆవలించాకుండానే శాస్త్రి పేగులు లేక్కేశాడు పంతులు .ఆనుమానము వస్తుంది ”వీడు ”మధురానికి ”ఎర ”వేస్తున్నాడేమోనని కంగారు పడతాడు .  ”మహా కవుల నాటకాల్లో అట్లాగే జరిగినట్టు రాశారండీ ”అని తప్పించుకున్నాడు .అయినా పంతులుకు అనుమానం చావలేదు .శాస్త్రి ఇందాక చెప్పిందొకటి ,ఇప్పుడు చెప్పిందొకటి .”మీరు తండ్రి లాంటి వారు కదా కాస్త బుద్ధి చెప్పండి ”అంటాడు తండ్రి అనే మాట తో ఆట కడుతుందని భావించి ..
                                      సశేషం

                                      సశేషం

                                                     గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -11 -11 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –4 కనుమరుగైన వ్రుత్తి కళలు

ఊసుల్లో ఉయ్యూరు –4

                                         కనుమరుగైన వ్రుత్తి  కళలు

—                   ఉయ్యూరు లో చేనేత ,కంచడం ,కమ్మరం ,చెప్పులు కుట్టటం ,కుమ్మరం ,వెదురు ,బుట్టలల్లటం ,ఈతాకు చాపలు ,ఈత బుట్టలు అల్లటం తేనే తీగలను పెంచటం ,పశువాలను పెంచటం ,కోళ్ళను ,మేకల ను ,గొర్రె లను పెంచటం ,పందుల పెంపకం మొదలైన వృత్తులు ఉండేవి .నాన్యం గా చేసినవన్నీ కలలే .అట్లాగే చేపలు పట్టటం బాగా ఉండేవి

ఇవాళ దాదాపు అవన్నీ మా కళ్ళ ముందే కను మరుగై పోయాయి .ముఖ్యం గా ఇత్తడి బిందెలు ,రాగి బిందెలు ,కంచు సామాన్లు చేయటం మహా జోరుగా జరిగేవి ..నాలుగైదు కుటుంబాలు వాటి పై ఆధార పడి ఉండేవి .ఇవి ఉయ్యూరు సెంటర్ దాటి ఎకామ్బరేస్వర టాకీస్ వైపు వెళుతుంటే రోడ్డుకు ఇరు వైపులాఉండేవి .కుటుంబ పని గా కొన సాఎవి .కుటుంబం లోని వారంతా స హక రిస్తుండే వారు .టింగ్ టింగ్ మని ఆ పాత్రలు తయారు చేస్తుంటే తమాషా గా శబ్దం వచ్చేది ఆ శబ్దం చాలా విన ముచ్చటగా వుండేది .పెద్ద పెద్ద బిందెలు తయారు చేయటానికి రేకులు తయారు చేసిగుంటలు పడేట్లు  సాగ కొట్టుతూ వాటింతో షాపులు తయారు చేసే వారు .భలే సరదా గా ఉండేవి .ఇత్తడి బకెట్లు ,ఇత్తడి కాగులు ఇత్తడి గ్లాసులు ,రాగి చెంబులు ,పల్లాలు బాయిలర్లు వ్హాలా నాన్యం గా చేసే వారు .వీత్కి అతుకు లూడినా ,కారుతున్నా తీసుకొని వెళ్లి బాగు చేయించే వాళ్ళం .చాలా బాగా రేపైర్ చేసే వారు ,.అట్లాగే సత్తు వస్తువులు చేసే వారు .పాల గిన్నెలు ,మజ్జిగ తప్పాలాలు గరిటెలు తయారు చేసే వారు ఇత్తడి కుందులు బాగుండేవి .కంచు తో కుందులు ,మర చెంబులు ,పూజా పాత్రలు ,విగ్ర హారాలు కూడా చేసే వారు .

మేము ఎనిమిదో క్లాస్ చదివే టప్పుడు మాకు సోషల్ మేష్టారు స్వర్గీయ లంకా బసవా చారి గారు .విద్యార్దులన్దర్నీ అక్కడికి తీసు కోని వెళ్లి ఆ పని చేయటం ప్రత్యక్షం గా చూపించారు .నాకు ఇప్పటికీ గుర్తు .ప్రతివాళ్ల జేబులో     ఒక నోట్ బుక్ ఉండాల్సిందే .దానిలో చూసిన ,విన్న ,చాదివినా విశేషాలు రాయటం ఆయనే మాకు నేర్పారు .అప్పటి నుంచి నేను దానిని అనుసరిస్తూనే వున్నాను .ఈ పనిని ”కంచరం ”పని అనే వారు .ఆ ఫీల్డ్ ట్రిప్ అయింతర్వాత స్కూల్ కు వచ్చిన తరువాత మేము చూసిన విషయాలనుమాతో  చెప్పించే వారు బసవా చారి మేష్టారు .స్టాంప్ collection హాబీ నేర్పారు . నిన్న పొద్దున్న  ఈ పని చేసే వారేవరున్నారో అని వెళ్లి చూస్తే ఒకే ఒక కుటుంబం మాత్రమే కని పించింది .వాళ్ళు కూడాతాము  వస్తువులం చేయటం లేదని ,సామాన్లు కోని తెచ్చి అమ్ముతున్నామని చెప్పారు .అంతే ఏమి గిడు తుంది ?అన్నీ యాంత్రికం అయిన రోజుల్లో .సరే నని బాధ పడి ఆ సామాన్లును షాప్ ను ఫోటో తీశాను .ఇది కధ కంచికి చేరిన కంచరం కధ .  ,

                      రెండోది చేనేత వ్రుత్తి .ఎక్కడ పడితే అక్కడ నేత మగ్గాలు ఉయ్యూరు లోను ,చుట్టూ పక్కల గ్రామాల్లో ను విపరీతం గా వుండే వారు .రోడ్లమీద  ఆ దారాలను పొడుగ్గా వుండే టట్లు తాడుకు బిగించిన  చట్రం లో నేస్తు కనిపించే వారు ఆ పడుగు ,పేక నేత చూడ టానికి సరదా గా వుండేది ఇంటి లోపల మగ్గాలున్దేవి .ఇదీ కుటుంబం అందరు కలిసి చేసే వారు .మంచి నేత చీరలు ,పంచలు ,లుంగీలు ,తువ్వాళ్ళు జేబు రుమాళ్ళు నేసె వారు .మార్కండేయ వస్త్రాలయం అనే చేనేత షాప్ వుండేది సెంటర్ లో వారి కింద చాలా కుటుంబాలు బట్టలు నేసి అందించే వారు .వారు స్వయం గా సాలీలే అవటం తో మంచి అజ మాయిషీ వుండేది . నాణ్య  మైన వస్రాలు అక్కడే లభించేవి .ఉయ్యూరు కాలేజి దగ్గర అప్పుడు అంతా ఖాళీ ప్రదేశమే .ఆ చుట్టూ చాలా కుటుంబాలు నేత వ్రుత్తి లో వుండే వారు .నందం వారు ,కొడాలి వారు ఈ వ్రుత్తి లో నేర్పరులు .నందం వారి అబ్బాయినాకు   క్లాస్ మేట్ .అట్లాగే కరణం గారి బజారు ,హై స్కూల్ దగ్గర నేత గాళ్ళు అద్భుతంగా నేత నేసె వారు .చిన్నపిల్లలకు అది బాగా వారసత్వం గా వచ్చేది .గండిగుంట ,ఆకునూరు మొదలైన ఊళ్ళల్లో ను మంచి నేత నేసె వారుండే వారు ఇవాళఉయ్యూరు   తో సహా ఈ గ్రామాలలో ఒక్కటంటే ఒకటికూడా   నేత కుటుంబం లేదు .ప్రభ్త్వం ఉదాసీనత ,నేసిన బట్టకు డబ్బు తగినంత రాక పోవత్సం ,ప్రభుత్వ సబ్సిడీ తగ్గటం ,మర మగ్గాలు అన్నీ వారి పాలిటి శాపాలయాయి .నేత బతుకులు బుగ్గి అయాయి .ఎందరో నేత కార్మికులు అప్పుల బాధ భరించ లేక ఆత్మ హత్యలు చేసు కొన్నారు .చేసు కొంటునే వున్నారు .నేత కార్మిక జీవిత వ్యధలపై   కవులు మంచి కవితలు రాస్తూనే వున్నారు .కన్నీళ్ళతో వారి జీవితాలను పరిచయం చేస్తూ ,వారి కద  గండ్లను వెలుగు లోకి తెస్తూనే వున్నారు
అనంత పురం లో తెలుగు అధ్యాపకులు శ్రీ ”రాధేయ ”గొప్ప కవి .చేనేత వ్రుత్తి పని వారల దయామయ గాధను ఒక కవితా సంకలనం గా తెచ్చారు .చాల స్పందన కల్గించే కవితలు అందు లో ఆయన రాశారు .ఆయన ”ఉమ్మడి శెట్టి అవార్డ్ ”అని ఒక అవార్డ్ ను ఏర్పాటు చేసి ప్రతి సంవత్చరం ఉత్తమ కవితా సంకల నానికి అయిదు వేల రూపాయల నగదు బహుమతి నిస్తున్నారు .ఈ అవార్డ్కు  చాలా నిర్దుష్టం గా ఎంపిక చేస్తారు .అందుకని అది చాలా విశిష్ట మైన బహుమతి గా భావిస్తుంది సాహితీ లోకం ..దాదాపు ఈ వ్రుత్తి కల కూడా అంతరించటం శోచనీయమే .కాల మహిమ .
         ఉయ్యూరు లో కమ్మరి పని వాళ్ళు బాగానే వుండే వారు .పలుగు ,పార,కత్తులు కొడవళ్ళు , ,గొడ్డళ్ళు చేసే వారు కక్కులు పెట్టటం ,పిడులు వేయటం వుండేది పెద్ద చక్రం తిప్పుతూ మంట కొలిమి వెలిగించి ఇనుమును కాల్చి దాగలి మీద కాలిన వస్తువునుంచి ,సుత్తి తో బలం గా కొడుతూ సాగ దీసి కావలసిన ఆకారం తెచ్చే వారు .ఇది నాకు చాలా కష్టమైన పని గా కన్పించేది .రెక్కలు ముక్క లవాల్సిందే .బ్రహ్మం అనే ఆయన పని బాగా చేసే వాడు .వెంకటేశ్వర టాకీస్ దగ్గర ,రోడ్డు మీద కాటూరు రోడ్ లో ఈ వ్రుత్తి ఆపని బాగా చేసే వారు .కొడవల్లకు ,చెరుకు కత్తులకు కాటూరు బాగా ప్రసిద్ధి ,ఆరు నెలలకు ముందే ఆర్డర్ ఇస్తేనే అక్కడ వస్తువులు దొరికేవి .నాణ్యానికి  ,మన్నికకు వాటికి పేరు .ఆకునూరు లో కూడా చేసినవి బాగుంటాయి .  ఒగిరాలలో కూడా చేసే వారు .ఇప్పుడ ఈ వృత్తీ బాగా తగ్గి పోయింది వూరికి ఒకరున్నారేమో నని పిస్తుంది .పాపం వారి శ్రమకు తగిన ప్రతి ఫలం రాదు .ఆడ వాళ్ళు కూడా ఇందులో చాలా శ్రమ చేయాలి .ఊక ,బొగ్గులు ప్రియం అవటం కూడా వారికి ఇబ్బందే పారలకు కర్రలు, పలుగు ను సాగ దీసి పదును తేవటం చాలా కష్టం తో నేర్పుతో చేయాలి .అల్లాగే గోద్దల్లకు పదును ,కర్ర తొడగటం చూస్తుంటే భలే గా వుంటుంది .ఇవాళ ఉయ్యూరు మొత్తం మీద హై స్కూల్ దగ్గర ఒకే ఒక కుటుంబం వుంది .అతని పేరు అబ్రహాం పూర్వపు పేరు రాదా కృష్ణ .
                 నాణ్యమైన ఎడ్ల బండ్లు తయారు చేయటానికి ఉయ్యూరు ప్రసిద్ధి .సాయిబులు బాగా చేస్తారు .ఇప్పుడున్న కాకాని పార్క్ దగర పూర్వం బండ్లు తయారు చేసే వారు .అవి చేసే విధానం చూడాల్సిందే .బండి చక్రాలు తయారు చేయటం ,వాటికి చుట్టూ కర్ర లమర్చటం(ఆకులు)  ,ఆ shape తీసుకు రావటం కాడి తయారు చట్రం చేయటం నగిషీ చెక్కటం గొప్ప పని కళకు స్థానం .ఇదంతా ముస్లిములిద్దరు సిబ్బందిని పెట్టు కోని చేసే వారు .అందులో సత్తార్ సాహెబ్ గారు చాలకాలం ఆ పని చేసి తరువాత వడ్రంగం లోకి దిగారు .మా ఇంట్లో మంచాలు మడత మంచాలు చేశారు .పందిరి పట్టు మంచాలు మడత మంచాలు చేసే వడ్రంగులు బానే వుండే వారు వారిని ”బ్రహ్మం గారు ”అని పిలిచే వాళ్ళం .కుర్చీలు ,బల్లలు ఉయ్యాలలు   , బాగా చేసే వారు” హాఫ్ సుందరయ్య”  గా(half sundarayya ) పిలువబడే నరసింహారావు అనే కమ్యునిస్ట్ నాయకుడి కొడుకు నా దగ్గర  tution చదివి జీతం బదులు కుర్చీ ,టేబులు  ,నవారు మంచం చేసి ఇచ్చాడు . నలభై ఏళ్ళు దాటినా ఇంకా బాగున్నాయి .కోటేశ్వరమ్మ  బ్రహ్మం ,ఆయన కొడుకు కోటేశ్వర రావు ఆనాటి నుంచీఈ  పనిలో బాగానే రాణించారు .ఇప్పుడు వెంకటేశ్వర రావు ,షఫీ ,సత్య నారాయణ మొదలైన వాళ్ళు బిజీ పని వారు .వడ్రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లు తోంది .తలుపుల మీద  పని కూడా వుండేది .పెంకు టిల్లు నిర్మించటం ఆ నాడు వీళ్ళ పనే .ఇప్పుడవి కనుమరుగు .దీనితో పాటు పెంకు నేయటం ఒక వ్రుత్తి గా వుండేది .భిక్షాలు ,సూర్య నారాయణ్ ,ఒకరిద్దరు సాహేబులు మంచి పెంకు నేత నేసె వారు .అందులో భిక్షాలు బ్రాహ్మణ ,కోమట్ల ఇళ్ళలో ఎక్కువ పని చేసే వాడు .తాపీ పనీ అతనికి వచ్చు .సీతారామయ్య ఆనాటి తాపీ మేస్త్రి .సాహేబులు మంచి తాపీ పని వారు.పెంకు  నేత పని దాదాపు లేనట్లే .చాల కొద్ది మంది అంటే ఒకరిద్దరే వున్నారు .పెంకునేత చాలా నైపుణ్యం తో కూడిన పని .
              కిర్రు చెప్పులకు ఉయ్యూరు ప్రసిద్ధి .ఆ రోజుల్లో అందరు అవే వాడే వారు .వాటి ఆకారం భలే గా వుండేది .ముందుకు తోసుకోచ్చే ఆకారం .నల్లగా నిగ నిగ లాడుతూ ఉండేవి .నడుస్తుంటే ”కిర్రు కిర్రు ”శబ్దం వచ్చేవి అందుకని ఆ పేరు .ఇప్పుడు శబ్దం లేని చెప్పులే .చెప్పులు కుట్టే వారుమాదిగా     వారు బాగా కుట్టే వారు .ప్రస్తుతం చెప్పులు కుట్టీ వారు లేరు ఒక్క అతను సాముఎలు మాత్రమే వున్నాడు .అతను సినిమా స్టార్లకు మాత్రమే కిర్రు చెప్పులుఇరవై ఏళ్ళు కుట్టాడు . .నాలుగేళ్ల క్రితం అతన్ని గురించి ఆంద్ర జ్యోతి ఆది వారం అనుబంధం లో స్పెషల్ గా రాశారు .
                   ఇదివరకు చాలా ఇళ్ళల్లో తేనే పరిశ్రమ వృత్తిగా హాబీగా వుండేది .చుట్టూ ప్రక్కల గ్రామాల్లో కూడా ఇప్పుడు బాగా తగ్గి పోయింది ,   మా  డ్రాయింగ్ మేష్టారు తాడినాడ శేష గిరి రావు గారు తేనె టీగలును     పెంచి    నాణ్య మైన తేనే తీసే వారు .ఆయన మంచి హోమియో వైద్యులు కూడా సబ్సిడీ కి తేనే పెట్టెలు ఇచ్చే వారు .పెంపకం దార్ల సంహ్ఘాలున్దేవి .మంచి పరిశ్రమ గా వర్ధిల్లింది ఒకప్పుడు .బంగారం పని బాగా చేసే కుటుంబాలు చాలా ఉండేవి .ఒక బజారు బజారు  వాళ్ళదే ;కంసాలి బజార్”అంటారు .చేవురి వారు మంచి పని వారు సుదర్శనమనే నా క్లాస్ మేట్ కూడా బాగా చేసే వాడు ,ఇంకో సుదర్శనం హరికధాదాసు గారు చేవురి కనక రత్నం గారు బంగారం పని చేసే వారు .మాచిన్న తనం  లో సుబ్రహ్మణ్యం గారు అనే ఆయనవృద్దు  మాకు బంగారు వస్తువులు చేసే వారు .తూకం ,పని అంతా చాలా నమ్మకం .గురివింద గింజలతోత్రాసుతో     తూస్తుంటే భలేగా  వుండేది .అన్న సమయానికి చేసి ఇచ్చే వారు .అంత నమ్మకస్తులు మళ్ళీ మాకు కని పించలేదు .కళ్ళ జోడు లోపలి నుంచి కిందకుచూసే వారు .ఇప్పటికీ గుర్తు .వెండి పని కూడా వాళ్ళు చేసే వారు .ఇప్పుడంతా బెజవాడ లో చేయించ టమే . అందరు .చేయించి తెచ్చి ఇవ్వటమే .
     పాడి పశువుల పెంపకం భారం అయింది ద్సాన్నీ వదిలేశారు .మేకలు ల;గొర్రెలు బాతులు ,కోళ్ళు పెంచటం లేదు .కోళ్ళ పరిశ్రమ   ఒక వెలుగు వెలిగి ఇప్పుడు మృగ్యం అయాయి .ఏనాది వాళ్ళు ఈతాకు చాపలు ఈత బుట్టలు అల్లే వారు .మా ఆంజ నేయ స్వామి దేవాలయం చుట్టూ వాళ్ల గుడిసేలే  ఉండేవి .అదీ లేదు .వాళ్ళే పందుల్ని పెంచే వారు .పందులు ఉయ్యూరు ”చామల ”లో తెగ ఉండేవి .బురద లో పొర్లుతూఎప్పుడు మొరుగుతూ ఉండేవి .ఒక పెద్ద కర్ర ,తాడుతో పందుల్ని పట్టు కొనే వారు .అవి దొరికితే విపరీతం గా మొరిగేవి భీభాత్చం ఆ దృశ్యం .
                  అడితీ ల దగ్గర ,ఏకాంబరేశ్వర టాకీస్ ,శివాలయం ఎదురు గా  మేదర వాళ్ళు వున్నారు .బుట్టలు ,విసన కర్రలు ,గంపలు ,తట్టలు తడికెలు బాగా అల్లే వారు ఇప్పుడు తడికెల వాడకమే లేదు .ఎక్కడైనా పల్లె టూల్లల్లో  వున్నాయేమో .అయినా వారి వ్రుత్తి మాత్రం క్షేమంగా నీవుంది .అ కుటుంబాలన్నీ వున్నాయి .వారికి గిరాకీ కూడా బాగానే వుంది
                  కుమ్మరి పని శివాలయం ఎదురు గాను  ,కాపుల వీధి లోను కుమ్మరి కుటుంబాలు వున్నాయి .  .కుండలు ,మూకుళ్ళు ప్రమిదేలు విగ్రహాలు మంచినీళ్ళబానలు    చట్టలు ,డబ్బుదాచే  కిడ్డీ బాంక్ లు బాగా చేస్తారు చేసే వారు .సంక్రాంతి బొమ్మల కొలువు కు వారి బొమ్మలే కొనే వారు .వినాయక చవితికి ఆ కుటుంబాలే మట్టి వినాయకులను తాయారు చేస్తారు .రంగువి కూడా సరసమైన ధరలకే అమ్ముతారు .అ’వీరమ్మ తల్లి తిరినాలకు గండ దీపాలు పట్టుకొని అందరు వెంట వెళ్తారు .వీరందరి చేతుల్లో ప్రమిదా దీపం వుండటం ప్రత్యేకత .బాతుల పెంపకం ఇది వరకుండేది .ఇప్పుడు చెరువులే లేవు కనుక అదీ అదృశ్యం .ఈ విధం గా ఉయ్యూరు లో వ్రుత్తి కళలు మంచిఉత్చ స్థితి లో  లో వుంది నేడు కనుమరుగై పోయే స్థితి లో వున్నాయి
                                           మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -11 -11 .

This slideshow requires JavaScript.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 4 Comments

ఆహ్వానం – 44 వ గ్రంధాలయ వారోత్సవాలు – “మన విజయవాడ” కవి సమ్మేళనం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి -3

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి -3

                 కరటక శాస్త్రి   ఒక శిష్యుడిని పాఠాలు చెప్పటానికి తన ఇంట్లోనే వుంచుకున్నాడు .వీలైతే కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనా వుంది .అయితె తాను చెప్పే చదువు వానా కాలమ్ చదువే .”నాతొ వేషం కట్టించి ,పెద్ద చాన్తాల్లాటి హిందూ స్థానీ ముక్కలు ,సంస్కృతం ముక్కలు ,అర్ధం తెలీకుండా భట్టీయం వేయించ టానికి  మీకు ఓపిక వుంది కాని ,నాల్రోజులకో శ్లోకంచేప్పటానికి శ్రద్ధ లేదు కదా ?అంటాడు శిష్యుడు గురువు తో .స్వగతం లో యేమని అనుకున్తున్నాడో చెప్ప మంటే ”పట్నం వదిలి ఆర్నెల్ల కోమారు అగ్రహారాలంట వచ్చినపుడు మాత్రమే ”పుస్తకం తియ్యి ”అని మాట వరుసకు అనే ఘటం గురువు గారు ”కొత్త శ్లోకం చదవ మంటే ”అస్త్యుత్తరశ్యా”చదువు తాడు ”.ఇది పాత శ్లోకమే కదా “‘అంటాడు .”మొదలు ,కొసా ఒకలాగే    కనపడుతున్నాయి .”అంటూ గురువు శిక్షణ పై అసంతృప్తి ప్రకటిస్తాడు .అందుకే శిష్యుడికి గిరీశం దగ్గర నాలుగు ఇంగ్లీషు ముక్కలు  నేర్చుకుంటే బాగుండు ననే స్థితి కి తెచ్చింది ..

—               చదువుకునేది పొట్ట పోషించుకోవ టానికే  -ఈ రోజుల్లో సంస్కృతం యెవడికి కావాలి అని తనే అంటాడు శిష్యుడితో .ఇంగ్లీషు చదువు తనే చెప్పిస్తానని ఆశ పెడతాడు .”పది ”రోజులు ఆడ వేషం వేస్తె ఇంగ్లీష్ నేర్పిస్తానని  శరతూ  పెడతాడు .తగిన వ్యూహం పన్ని ,ఆ వివరాలన్నీ శిష్యుడికి చక్కగా అవగతం చేస్తాడు .”అదెంత పని ?”అంటాడు శిష్యుడు .-అంటే నాటకాల్లో వాడితో బాగానే వేశం కట్టే నేర్పు కల్గించాడు అన్న  మాట .అది ఇప్పుడు అక్కరకు వచ్చింది .శిష్యుణ్ణి ఇలా వాడుకొని ,లుబ్ధావ దాన్లకు వీడి తో ముందే పెళ్లి చేసి వేశం విప్పి పారి పోయి రావటం -ఇదీ ఎత్తు .దీన్ని చక్కగా నిర్వర్తిస్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ”ఇల్లరికం ”వుంచుకున్తానని ఆశ కూడా పెట్టాడు .పుస్తకం మీద ప్రమాణం చేస్తానంటాడు శాస్త్రి .”సంస్కృతం పుస్తకం మీద నమ్మకం పోయింది ఇంకో పుస్తకం మీద ప్రమాణం చెయ్య” మంటాడు శిష్యుడు .”తప్పితే ,భూమి తోడ్రా ”అంటాడు గురువు .గురువు స్వభావం తెలిసిన శిష్యుడు నమ్మలేడు ,నమ్మకుండా ఉండను లేడు .”మీరు ఎగేస్తే భూవేమ్చేస్తుంది ?-మీ మాటే చాలు ”అంటాడు .ఇదీ గురువు పై శిష్యుడికి వున్న నమ్మకం

            తన వ్యూహం పార టానికి ”మధుర వాణి ”,”రామప్ప పంతుల ”సహాయం కావాలి .అందుకే శిష్యుడికి ఆడ వేశం వేసి రామచంద్ర పురం చేరతాడు .మధుర వాణి ఇంటి తలుపు తడతాడు .మాంచి మాట కారి శాస్త్రి .ఎదుటి వారికి ముందే బంధం వెయ గల నేర్పున్న వాడు .”బంధువులా ”/అని ఆమె అడిగితె ”ఆపదకడ్డం బడ్డ వారే బంధువులు -మీరు మాకు బంధువులు కాగలరు ”అని చమత్కారం తో అంటాడు .బంధుత్వం కలుపు తాడు మాటలతోనే .మధుర వాణికంఠాన్ని  పోల్చుకొన్నాడు .ఆమెతో కొంత” గ్రంధం ”సాగించిన వాడే పూర్వం .వేషాన్ని చూసి విస్తు పోతుంది .”ఉదర  నిమిత్తం బహుకృత వేషం -ఇది దేవుడిచ్చిన వేషం ”అంటే పూర్వం అతను” గుంటూరు శాస్త్రి” గా పరిచయం వున్న వాడే ఇప్పుడీ వేషం ఏమిటని విస్తు పోయింది .కొత్త గా వుంది .
       ” నాటక     ‘ మెల్లా  చెడి పగటి వేషాల్లో దిగిందా ?పెట్టి పుట్టారుగా ?ఏల  ఈ అవస్థ “”అంటుంది .”ఇన్నాళ్ళకు దయ కలిగిందా” ?అని కవ్విమ్పుగాను అంది .శాస్త్రి నిజం చెప్పాడు .డిప్టీ కలెక్టర్ కొడుకు ఆమెను ఉంచుకున్న దగ్గర్నించీ తాను ఆమె ఇంటికి వచ్చాడని తెలిస్తే ”పీక ఉత్తరిస్తాడేమో ””అనే భయం చేత రాలేదని సంజాయిషీ ఇచ్చుకున్నాడు .ఆయనకు ఎప్పుడు బదిలీ అవుతుందా ,మధుర వాణి ని ఎప్పుడు చూస్తానా అని దేవుణ్ణి ప్రార్దిస్తున్నాదట  .దేవుడి మీద నెట్టాడు కనుక నమ్ముతుంది అనే   భావం .ఆమె మాటల్లో ”గిరీశం ”తనను ఉంచుకున్నాడని చెబుతుంది .”వాడికి పెంద్రాలే ఉద్వాసన చెప్పాలి ”అంటాడు మధుర వాణి నెమ్మదిగా ,నషాళానికి అన్తెట్లు వాయిస్తుంది ”నా దగ్గర కొచ్చినందుకు మీ భార్య గారు ,ముందు మిమ్మల్నిమెడ బెట్టు కోని   ఇంట్లోంచి తరవ్వలసింది .తనకి రోట్టా ?ఒహడికి ముక్కానా “”?అని అతని నైత్యాన్ని కడి  గేస్తుంది  .గిరీశం సంగతి సరే నీ బుద్ధి బుగ్గిలం కాలేదా అనిఎద్దేవా   .”నా ఇంటికి వచ్చిన వాడల్లా చెడిన వాడేనా “?అనే ధ్వని .ఇంటి దగ్గర తన బతుకేమీ గొప్ప గా లేదని ,తన భార్య ఆ మర్యాదను మాటల్లో చేస్తూనే వుందని క్రియ లోకి ఇంకా దిగ లేదని చెబ్తాడు .అంటే అతని బతుకు ఇంటి దగ్గర” బస్తాండే” అయిందని చెప్పకనే చెప్పాడు .అంతే కదా ?చెడ తిరిగే నైష్టిక బ్రాహ్మలకు అంత కంటే గౌరవం భార్యలు ఎందుకు ,ఎలా ఇస్తారు ?ఎక్కడి వేషం అక్కడ .ఏ ఎండాకా గొడుగు పట్టటం కరటక శాస్త్రి అంటే గుంటూరు శాస్త్రికి వెన్నతో బెట్టిన విద్యే .
                                  సశేషం
                                                         మీ గబ్బిట  దుర్గా ప్రసాద్ –15 -11 -11 .
Posted in రచనలు | Leave a comment

కన్యాశుల్కం లో కరటక శాస్త్రి —2

          కన్యాశుల్కం లో కరటక శాస్త్రి —2
               కరటక శాస్త్రి పాత్ర ప్రవేశం పై వివరించాను .ఆమె పుట్టింటి సొమ్మును కూడా ”అగ్ని ”లో వ్రేల్చేసి ,చెయ్యి దులుపు కుంటున్నాడు బావ నిజాన్ని ,నైత్యాన్ని ,తూర్పార బట్ట గల గలిగిన ధైర్యం ఉన్న వాడు కరటకం .అతన్ని ఏమీ అనలేక పోయాడు ”అగ్ని ”.కారణం తన నిజరూపాన్ని అతడు కాచి వడ పోశాడని తెలియబట్టే .ఇంతలో గురు శిష్య ప్రవేశం జరిగింది .”మాన్”అన్నందుకు అగ్ని హోత్రం పేలి పోతే ,”ఇంగిలీషు మాటలంటే -పుచ్చ కాయల దొంగ అంటే బుజాలు తడువు న్నట్లు నీ మీద పెట్టు కుంటావెం ?అని బావ ను మళ్ళీ దెబ్బ కొట్టాడు .మానులా పెరిగావు కాని బుద్ధి ఏదీ ,మర్యాద ఎదీఅని ఎద్దేవా చేసి నట్లుంది శాస్త్రిమాటలు .గిరీశం భాషలో అతడొక విదూషకుడు .చప్పన్న భాషలు తెలిసిన మనిషి .సంస్కృతం మంచి నీళ్ళ ప్రవాహం లా మాట్లాడే వాడు. .
                  వెంకటేశం చదువుకు డబ్బు ఖర్చు బాగా అవుతుందని ,బావ బాధ పడుతుంటే ”బుచ్చమ్మ ను అమ్మిన పదిహేను వందల రూపాయలు ఎంచేశావ్ ?”అని నిల దీస్తాడు శాస్త్రి .ఆ డబ్బుతో వెంకటేశం కు చదువు చెప్పించ కూడదా అని సూచన చేస్తూ ,ఆడ పిల్లను అమ్మటం పాపం అని కూడా అభిప్రాయ పడ్డట్లుంది .అతనికి పిల్లల్ని అమ్మటం ఇష్టం లేని విషయమే .”మంచం మీంచి దించెయ్య టానకి సిద్ధం గా ఉన్న వాడికి కట్ట బెడ్తే చావడా వాడు ?ఇదేనా నీ చదువు ,సంస్కారం ?”అని ఎదిరిస్తాడు .ఈ మాట తో ఈయనే నులక అగ్ని  హోత్రావధానులు  అని రూధి చేసుకొని గిరీశం ”జటలో ”అంతటి వాడు లేదని ,కొమ్మ ఎక్కిస్తాడు .అగ్ని చల్లారి శాంత పడి ,దర్వాజా అయి తన ప్రధమ కోపానికి క్షమాపణ చెబుతాడు .ఈ ఇద్దరి భాగోతం అర్ధమయింది కరకటానికి .ఇన్నాళ్ళ కు మా అగ్ని హోత్రుడికి తగిన వాడు దొరికాడు ”అని తనలో అనుకొంటాడు .అగ్నిని నీరు కార్చే పొగడ్తల జల్లు ఉన్న వాడు గిరీశం అని తెలుసు కొన్నాడు .బావ పని పట్టీ టందుకు ఒకడు దొరికి నందుకు సంతోషం వేసింది .తను చేయ లేని పని గిరీశం చేస్తున్నాడని ఆనందము  కొంత వుంది అతని లో .
               వెంకటేశం చదువు ఎలా సాగుతోందో ననితెలుసు  కోవా టానికి ఉబలాట పడుతాడు  .వాళ్లిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడ మంటే ”ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ”అని పాడుకుంటూ ,ఇంగ్లీష్ వొలక బోస్తు పెద్ద బిల్డప్ ఇస్తారు .తెలుగు పద్యం చదవ మంటాడు మామ .”పొగ చుట్టకు సతి మోవికి ;;అని ఎత్తుకుంటాడు ముద్దుల మేనల్లుడు .ఇక అర్ధమై పోయింది వీడి వానా కాలం చదువు .గురువు తన లాగానే చదువు చెప్పే ఘటం కాదు .వీడికి ఒచ్చిన్దేమీ లేదనే నిర్ణయానికి వచ్చే శాడు .పరీక్ష గా ”మనః ప్రభవానలం ”అంటే అర్ధమేమిటి ?అని అడిగాడు అల్లుణ్ణి .ఇంతలో తన పరువు పోతోందని గిరీశం అడ్డ పడి అలాంటి కఠిన పద్యాలకు అర్ధాలు పసి పిల్లలకు ఎలా తెలుస్తాయని దబాయిస్తాడు .ఈ పద్య స్వారశ్యం శాస్త్రికి తెలుసు ,అది కఠిన మైనదీ కాదని తెలుసు .గురువు శిష్యుణ్ణి మోసం చేస్తున్నాడని తెలిసి పోయింది .మరి ,తనకు ఒక శిష్యుడున్నాడుగా .
”తర్ఫీదు మా చక్క గా వుంది .వీణ్ణి పెందరాలే తోవ పెట్టక పొతే మోసం వస్తుంది ”అని అనుకుంటాడు .గిరీశాన్ని ఆ కొద్ది సేపట్లోనే అంచనావేసిన  నేర్పు శాస్త్రిది .”ఆషాఢ భూతి ”తత్త్వం అర్ధమై పోయింది .కొంప ముంచుతాడు అనిపించింది .
             ఇంతలో వెంకటేశం పెళ్లి విషయం వచ్చింది .”డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తా నంటాడు  బావ.లుబ్ధావ దాన్లు కు కూతురు సుబ్బిని అమ్మి ,ఆ డబ్బుతో వెంకడి పెళ్లి చేస్తానని పధకం చెబ్తాడు .ఇప్పటికే ఒకతే నెత్తి మీద గుడ్దేసుకొని గుండె మీద కుంపటి లా వుంది .మళ్ళీ ఈ లంపటం ఏమిటో అని ఆలోచించి ”బావా !ఈ సంబంధం చేస్తే నీ కొమ్పకగ్గేట్టేస్తాను”అంటాడు పాపం అక్క మీద జాలి ,మేన కోడలి జీవితంబుగ్గి అవుతుందనే ఆరాటం తో బావ మీద ఉన్న కసితో . ఈ సంబంధం చేసుకొంటేనుయ్యో , గొయ్యో చూసుకుంటానని అక్క ప్రతిజ్న చేసింది . ” బావ .వట్టి మూర్ఖపు గాడిద కొడుకు .చెబితే వినే ఘటం కాదు” .మరి అక్కయ్య కు ఎలా భరోసా ఇవ్వాలో తెలీని వింత స్థితిలో పడ్డాడు .ఏమీ పాలు పోవటం లేదు .ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది .అక్కకి చెప్పాడు .తన ప్రయత్నం తానూ చేయటానికి సిద్ధమయినాడు .ఇలా ఎదుటి వారిని చదివే నేర్పు ,అవసరానికి తగిన ఓర్పు ,దెబ్బ కొట్ట టానికి తగ్గ పటిమ ఉన్న వాడు కరటక శాస్త్రి .అక్క సంసారానికి అవసర సమయం లో ఆదుకున్న తమ్ముడు శాస్త్రి
                                   సశేషం
                                                               మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ –14-11 -11 ..
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

సరదా సరదా సాహిత్యం సాక్షి లో ఇవ్వాళ

Posted in సేకరణలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –1

 

                                            కన్యా శుల్కం లో కరటక శాస్త్రి  –1
                  మహా  కవి గురజాడ అప్పా రావు గారు రాసిన కన్యా శుల్క నాటకం 27 -06 -1892 లోవిజయ నగరం   లో మొట్ట మొదటి సారిగా ప్రదర్శించారు ..ఆ ప్రదర్శనకు వందేళ్ళ పండుగ 1992 లో దేశమంతా భారీగా జరిగింది .అంతకు ముందు  ఆ నాటకాన్ని నేను రెండు మూడు సార్లుచదివాను  .కాని అప్పుడు ఇంకొంచం శ్రద్ధ తో చదివాను .పాత్రల మీద దృష్టి పెట్టి చదివాను .ముందుగా అందరి దృష్టి గిరీశం మీద ,మధుర వాణిమీద  పడుతుంది .వారిద్దరి పాత్రలమీడా లోతైన చర్చలు ,విస్తృత మైన రచనలు జరిగాయి .అల్లాగే మిగిలిన పాత్రలను స్థాలీ పులాక న్యాయం గా పరామర్శించారు .నేను చదివినంత  వరకు అందులో దాక్కున్న ”కరటక శాస్త్రి ”గురించి అంత తీవ్రంగా రాసినదేదీ కనిపించలేదు .మళ్ళీ చదువుతూ ,ఆ పాత్ర మీద దృష్టి పెట్టి చదివా .చదివిన కొద్దీ అతని పాత్ర చాలా లోతైనదని ,నాటక నిర్వహణ లో బాగా సాయపడిన పాత్ర అని ,లోతైన మనిషి అనీ ,కొంత లోకజ్ఞానం   వున్నా ,స్వార్ధం అతన్ని బాగా కిందికి లాగేసిందనీ ,తన పని నేర వేర్చుకోవ టానికి ఎంత కైనా దిగాజారుతాడనీ అని పించింది .అతను నాటకం లో ప్రవేశించిన దగ్గర్నుంచి ,నిష్కర మించే దాకా అతని తీరు తెన్నుల గురించి 1992 సెప్టెంబర్ లో  సుదీర్ఘ రచన చేశా .దేనికీ పంపలేదు .నా దగ్గరే వుంది .అప్పా రావు గారి నూట యాభై వ జయంతి సందర్భం గా దాన్ని మీ అందరి కోసం అందిస్తున్నాను .ఇది పరిశోధన అనే పెద్ద పేరు పెట్టె సాహసం చేయలేను .కాని ,నా అవగాహన ,నా పరిశీలన గా మాత్రం వినమ్రం గా చెప్పు కొంటాను .ఇదీ కరటక శాస్రి కినేపధ్యం
                మనుష్యుల స్వభావాలక్ను బాగా అంచనా వెయ గల దిట్ట గురజాడ .అందుకే తన కన్యాశుల్క నాటకం లో ప్రతి పాత్రా నిండుగా ,జీవం తో తోనికిస లాడు తుంది .పాత్రల స్వరూప ,స్వభావాలను బట్టి ఆయన పేర్లు పెట్టారు .PILGRIMS ప్రోగ్రేస్స్లో పేర్లు అలానే వుంటాయి .అప్పా రావు గారు కుడా అందుకే అర్ధ వంత మైన పేర్లు సార్ధకం గా పెట్టారు .అవి క్లిక్ అయాయి .ఆపాత్రలకు యా పేర్లు LABELS  లాగా వుంటాయి .చిత్రణ ,మనః ప్రవ్రుత్తి ,నడత ,నడక ,అంతా ,ఆ పేరును బట్టే అర్ధమై పోతుంది .అలాంటి వారిలో నులక అగ్ని హోత్రావధానులు ,బావ మరిది కరటక శాస్త్రి .పంచ తత్రం లో కరటక దమనకులు కలిసి ఒక్కరైఅట్లున్తుంది .సింహం వద్ద స్నేహం చేసి ,తంపులు పెట్టి ,పొట్ట పోసుకొనే నైజం గలనక్కలు అవి .కరటక శాస్త్రి సింహం వంటి అగ్ని హోత్రావదావదానులకు స్వయానా బావ మరిది .కొంత లోక ధర్మం తెలిసిన వాడు .జిత్తుల మారి తెలివి తేటలతో తాను అనుకొన్నది సాధించ గల వాడు .ఎత్తుకు పై ఎట్టు వెయ తానికీ ,ఏ ఎండ కు ఆగోడుగు పట్ట టానికి  సర్వ సమర్ధుడు . .అవతలి వారిని ఉబ్బేసి పనులు జరిపించుకొనే నేర్పున్న వాడు .తన చెల్లెలు బాధ ,మేన కోడలు అన్యాయంగా విధవ రాలు కావటం ,రెండో మేన కోడల్ని బావ అమ్మకానికి పెట్టటం బావ గారి అగ్గిమీద గుగ్గిలం తత్త్వం ,ఎరిగి కీలెరిగి వాత పెట్ట టానికి తన శిష్యుడి సహాయం తో ప్రయత్నం చేయ టానికి సిద్ధ మైన బావ మరది కరటక శాస్త్రి .అక్క గారి కాపురం పచ్చ గా వుండాలని తపనతో సాహసం చేసిన తమ్ముడు .దేశ వ్యవహారాలూ ,దేశం లో వస్తున్నా మార్పులు ఎప్పటికప్పుడు ఒంటబత్తించు కొన్న    వాడు .అందు వల్ల పని సులువు తెలిసిన వాడు .ఆవలిస్తే పేగులే కాదు సర్వము లెక్క పెట్ట గలిగే గణికుడు ..
                 కరటక శాస్త్రి పరిచయం మనకు కృష్ణ రాయ పురాగ్రహారం లో నులక అగ్ని హోత్రావదానుల ఇంటిలో జరుగుతుంది .గిరీశం అక్కడికి ”బిచానా ”వేయటానికి వస్తాడు .తన పేరా ఉన్న భూమి అమ్మి కొడుకు వెంకటేశానికి చదువు చెప్పించమని అతని అక్క వెంకమ్మ భర్త అవధాన్లతో అంటుంది .బావ గారి డబ్బు కాపీనం అర్ధం చేసు కొన్న కరటక శాస్త్రి ”నీ భూవెందుకు అమ్మా లామా .-మన సొమ్ము చాడ తిని కొవ్వున్నాడు .అతడే పెట్టుకుంటాడు ”అని బావను కడగటం తో పరిచయ మవుతాడు .
Posted in రచనలు | 2 Comments

ముదిమి లోను యవ్వనో త్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –6 నూజి వీడు సంచలనం

         ముదిమి లోను యవ్వనో త్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –6
                                                                     నూజి వీడు సంచలనం
                       1967 లో అద్దాడ నుంచి నూజివీడు బదిలీ అయారు  రావు గారు .షరా మామూలే .77 ఏళ్ళ స్కూల్ చరిత్రలో లేని ”బాల ప్రతిభ ‘అనే స్కూల్ magazine  తయారు చేయించి ప్రచురించారు .నూజివీడు రాజా ఏం .ఆర్ .అప్పా రావు వీరి సేవా కార్య క్రమాలకు అండ గా నిలిచారు .”బాల సాహిత్య acaademi ”స్థాపించి చిన్నారి గూఢ చారి ,మహా కవులు ప్రచురించారు ”.విద్యానగర్ ”కాలనీ ఏర్పాటు చేశారు .అక్కడ ”శాంతి నిలయం ”నిర్మించి విద్యా ,సాహిత్య ,సాంఘిక ,సాంస్కృతిక సేవ సేయటం మొదలు పెట్టారు .ఊపు ఏమీ తగ్గ లేదు .చేసే చెయ్యి ,తిరిగే కాలు ఊరుకో లేవు కదా ..అయినా ఏమీ మార లేదు .కొత్తగా ఏర్పడిన జూనియర్ కాలేజి లోలెక్చరర్ గా promotion పొందారు . .జిల్లా lecturerla సంఘం ,రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయటానికి గొప్ప కృషి చేశారు .రేపల్లె కు బదిలీ అయితె satya sayi స్కూల్ అందరి సహకారం తో నెల కోల్పారు ..Multi faceted personality ”గా గుర్తింపు పొందారు .పుస్తకాలు సేకరించి బుక్ బాంక్ ,బుక్ స్టోరే ఏర్పరచి పేద విద్యార్ధులు పాఠ్య పుస్తకాలు కొనుక్కో కుండా చదివే వీలు కల్గించారు .లైబ్రరి ని ఏర్పాటు చేశారు  నేత్ర శిబిరం నిర్వ హించారు .  రావు గారి పైప్రత్యెక  సావెనీర్ తయారు చేయించి శ్రీ రామా రూరల్ కాలేజి లో ఆవిష్కరింప జేశారు వి.వి.రాఘవయ్య గారు .అప్పుడే ”బాల బంధు ”బిరుదును రేడియో అన్నయ్య గారి సమక్షం లో అంద జేశారు .ఒక ఉపాధ్యాయుడి పై ప్రత్యెక సంచిక రావటం చారిత్రాత్మక మైన విషయం .ఆ అదృష్టం రావు గారికే దక్కింది .అభిమానానికి ,సేవకు దర్పణం గా నిలిచింది ..బాపట్లలో పని చేసినప్పుడు యువకులకు నిర్మాణ కార్య క్రమాలు చేబట్టారు .
                                                    విశ్రాంత జీవిత సేవలు
                 నూజి వీడు లో స్థిరపడ్డారు రిటైర్ అయిన తర్వాత .విద్యానగర్ కాలనీకి రోడ్డ్లు వేయించారు .కల్చరల్ అసోసియేషన్ స్థాపించి అన్ని రంగాల్లో సేవలు చేశారు .దాని అధ్యక్షులయారు .పౌర సౌకర్యాభి వృద్ధి సంఘం ,పోస్టాఫీసు వారి వల్లే ఏర్పడ్డాయి .కొత్తగా పెట్టిన జూనియర్ కాలేజి లో ఇచ్చికం గా ఇంగ్లీష్ బోధించారు .పిల్లల పార్కు ,గ్రంధాలయం నిర్మాణం చేశారు .శ్రీ రామ కృష్ణ సేవా సమితి స్థాపించి ఆధ్యాత్మిక సేవలో ను ధన్యులయారు .శ్రీ సత్యసాయి   కూచి పూడి నాట్య కేంద్రం ,జానపద నాట్య కేంద్రం ఏర్పరచి ఎంతో మందికి నాట్యం లో అభిరుచి కలిగించారు ,మైలవరం ,విస్సన్న పేట లలో బ్రాంచీలు ఏర్పాటు చేశారు .వీరికి ఏలూరు కు చెందిన సినీ నాట్యా చార్యులు శ్రీ కే.వి.సత్య నారాయణ గారు మంచి సహకారం చేశారు .1989 లో గాంధి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వావిలాల గోపాల క్రిష్నయ్య గారిచే ఆవిష్కరణ జారి పించారు .నేతాజీ 96 వ జయంతిని అతి ఘనం గా జరిపారు .
                   ఇన్ని పనులు ఇంత కాలమ్ చేసిన రావు గారి జీవితం నల్లేరు మీద బండి గా సాగింది అనుకో వాటం పొర బాటే .వారి భార్య గారికి పెండ్లి అయిన దగ్గర్నుంచి అనా రోగ్యమే .వంట కూడా చేసే వారు కాదావిడ .పెండ్లి అయిన పదేళ్లకు కాని పిల్లలు పుట్ట లేదు .నెమ్మది నెమ్మది గా ఆమె జన జీవితం లోకి వచ్చారు ..వీరి అక్క గారి సాయం కొండంత అండ ,దీనిని ఆదిగ మించి రావు గారు  బహుముఖ సేవలు అందించారని మరువ రాదు .మొక్క వోని ధైర్యం ఆ ”రాముని ”మీద పూర్తి విశ్వాసం ,మానవ ప్రయత్నం ఆయన్ను అందరి కంటే ముందు నిల బెట్టాయి .భార్య మరణం ,కుమారుని మరణం తో కొంత కలత చెందినా ,అవి మరిచిపోవటానికి ఇంకా సాహిత్య కృషి చేస్తూనే వున్నారు .పిల్లలు హైదరాబాద్ లో వుండటం వల్ల అక్కడికి చేరారు
                     వి.జి.ఎస్.వారికి ఆంగ్ల -తెలుగు నిఘంటువు ను ఒక్క చేతి మీదుగా తయారు చేసి ఇచ్చారు .ఇటీవలే అది ప్రచురింప బడి అందరి ప్రశంసలు పొందింది .ఏ నిఘంటు కారుడు ఆలోచించని రీతి గా ,ఆలోచించి కొత్త ప్రయోగాలు చేశారు .విస్తృత ప్రయోజనం కల్గించారు .సార్ధకం చేశారు .ఇంకా ఏవేవో రాస్తూనే వున్నారు .రోజుకు కనీసం పన్నెండు ఘంటల రచన నిరంతరం సాగిస్తూనే వున్నారు ఈ 88 ఏళ్ళపండు ముసలి .ఆయన తనకు వార్ధక్యం వచ్చిందని భావించటం లేదు .ఇంకా ఏదో చేయాలనీ ,ఇంకా సమాజానికి ఉపయోగ పడాలనే తాపత్రయం వారిది . నిత్యం ఉదయం నడక వారి జీవితం తో పెన వేసుకు పోయిన దిన చర్య.
                    మహోన్నత గురువు ,యువనేత ,విశిష్ట జాతీయ వాది ,అభ్యుదయ కాళాభి మాని ,ముద్దుల మామయ్య ,గాంధేయ వాది అని అందరి చేత ఆత్మీయం గా పిలువబడే రావు గారు ధన్య జీవి .సప్త గిరి చానెల్ లో ఇటీవలే కొన్ని ఎపిసోడ్లకు ర చనలు చేశారు .వారి ‘తాతయ్య లేఖలు ”అనే పుస్తకం పిల్లల చేతి కరదీపికే కాదు ”పిల్లల విజ్ఞాన సర్వస్వం ”అని గుర్తింప బడింది .ఎన్నో సంస్థలు వారిని ఘనం గా సత్కరించాయి ఈ మధ్యే పద్మ భూషణ్ ,నారాయణ రెడ్డి గారి చేతుల మీద గా హైదరా బాద్ లో సన్మానం అందుకొని ఆయన తో ”బాల సాహిత్య చక్ర వర్తి ”అనే సార్ధక బిరుదునుపొందారు   .వారి సేవలకు ఏలూరు లో .పద్మశ్రీ తుర్ల పాటి కుటుంబ రావు గారి ఆధ్వర్యం లో కనకాభిషేకం జరిపి గండ పెండేరం తొడిగారు -వదాన్యులు ,అభిమానులు ..నాకు తెలిసినంత వరకు ఏ ఉపాధ్యాయునికి కాని అధ్యాపకునికి గాని ఇంతటి ఘన సన్మానం జర గ లేదు .ఆంద్ర దేశం గర్వం గా చెప్పు కో వలసిన జీవితం రావు గారిది .”మహాత్ముల బాట లో” నడుస్తూ ,మహాత్ములై ,మనల్నీ మహాత్ములయే రీతిగా ప్రేరణ, స్ఫూర్తి కల్గిస్తున్నఆదర్శ శాంత రచనా తపస్వి  శ్రీ ముదునూరు వెంకటేశ్వ రావు గారు శాతాధికం గా ,ఆయురారోగ్య అయిశ్వర్యాలతో వర్ధిల్లుతూ ,సాహితీ సమార్చనం చేస్తూ వుండాలని ఆకాంక్షిస్తూ —సెలవు
                                   సమాప్తం
                                                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13 -11 -11 .
Posted in మహానుభావులు, రచనలు | Leave a comment

ముదిమి లోను యవ్వనో త్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —–5 హయ్యర్ సెకండరి ఉద్యోగం

          ముదిమి లోను యవ్వనో త్చాహి  శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —–5
                                                     హయ్యర్ సెకండరి ఉద్యోగం
                  అది హయ్యర్ సెకండరిఅంటే  యుగం పన్నెండో తరగతిని high స్చూల్స్ లో ప్రవేశ పెట్టారు .దీని బోధనకు పోస్ట్ గ్రాద్యుఎట్లే అర్హులు .రావు గారు ఏం.ఏ.పస అయారు కనుక దానికి అర్హులు .అద్దాడ స్కూల్ కు promotion పై బదిలీ అయారు .మైలవరం రాజా గారి ఆధ్వర్యం లో గొప్ప సన్మాన సభ ఏర్పాటైంది .రావు గారితో అక్కడ ఒక ఇంగ్లీష్ కాన్వెంట్ ను ఏర్పాటు చేయాలనే సూచన వచ్చింది .వదాన్యుల సహకారం తో ఆగస్ట్ పదిహేనున ప్రారంభించారు రావు గారు .అయితె కొద్ది కాలానికే నిర్వహణ లోపం వల్ల మూత పడింది .పశువుల హాస్పిటల్ అందులో వచ్చింది .రావు గారు చాలా బాధ పడ్డారు . .
                  గుంటూరు లో వీరి అన్న గారు ”శాంతి నిలాయం ”బ్రాన్చిని స్థాపించి విద్యాలయం గా తీర్చి దిద్దారు .మధ్య తరగతి వారి విద్యావసరకలను తీర్చింది .ఇక్కడే పూర్వం బాపిరాజు గారి కళా పీఠం వుండేది .1962 లో చిత్రకారుల అభిరుచులకు అనుగుణం గా ”మళ్ళీ ”మాపిరాజు కళా పీఠం ”స్థాపించారు సోదరులు .ఉన్నత స్థాయిలో కార్య క్రమాలు జరిగేవి .న్యాయవాది నడింపల్లి రామయ్య అధ్యక్షులు .గొప్ప చిత్రకారులు పుప్పాల రాజా నరసింహం కార్య దర్శి ,లక్కరాజు సూర్య నారాయణ ప్రధాన కార్య దర్శి ,బిత్రా శ్రీనివాస రావు కళా ఊపనాసకులు .శ్రీ మారేమండ శ్రీని వాస రావు ,పోరాస్మల్ జైన ,వారణాసి రామ మూర్తి (రేణు)ఈ కళా పీఠం లో పరిమళించిన కళా పుష్పాలు .౧౯౬౩ లో చిత్ర కళా ప్రదర్శన నిర్వ హించారు .శ్రీ నడింపల్లి నరసింహారావు ,”చుక్కాని ”సంపాదకులు ,బందరు వాసి కే.ఆర్.కే..మోహన్ .శ్రీ వత్చవ  వంటి పెద్దలు వచ్చి చూసి అభినందించారు .ముదునూరు సోదరులు ”సంస్కృతీ ”అనే ప్రత్యెక సంచిక ను వెలువ రించారు .
                                                    అద్దాడ లో సేవలు
              రావు గారుఅడ్డాడ   లోచేరారు .  .”బాలానందం ”పత్రిక ప్రారంభించారు .దీనిలో సైన్సు విషయాలను శ్రీ వసంత రావు వెంకట రావు ,రాసే వారు .సోమంచి రామం ,కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి ,నార్ల చిరంజీవి ,శ్రీ వత్చవ  ,తంగెళ్ల పాండురంగ శర్మ ,శ్రీమతి హేమలతా లవణం,ఆచంట జానకి రాం ,కవిరావు ,మారేమండ ,శంకర రామా రావు వంటి ప్రముఖుల రచనలతో పత్రిక శోభించేది .గీతా సుబ్బారావు సాంబు ,సత్యమూర్తి నిర్వహణ సహకారం అందించారు .ఆర్ధికం గా  ఆదుకున్న దాతలు వున్నారు .పత్రిక పంపితే హాయిగా చదివే వారే కాని చందా పంపే వారు లేరు అది ఏనుగును పోషించే చందంగా తయారయిన్దన్నారు రావు జీ .అందులో ”అన్నయ్య ”శేర్శికను రావు గారు చూసే వారు .అందులో గొప్ప వారి జీవితాలను ఆకర్షణీయం గా రాసే వారు .”కవుల గాధలు ”,బాలల నవల ”,పెజీలున్దేవి .చిన్నారిగూద చారి  కధలు బాగా ఆకర్షించేవి .ఈ రచనలన్నీ కలిపి ”బాల సాహిత్య అకాడెమి ”ప్రచురణ గా తెచ్చారు .”బాల కవిత ”,బాల వేదిక ”,”కార్డు కధలు ”,గేయాలు ,ఆరోగ్య సౌందర్యం ,సామెతలు ,మాటా మంచి ,ఒకటేమిటి ?అల్ ఇన్ వన్ గా వుండేది లెక్కల పజ్ల్స్ తో మేతమే ట్రిక్స్ రాశారు .ముఖ చిత్రం గా ఆనేలలో జన్మించిన మహామహుల చిత్రాలు వేసే వారు .వెనుక పేజి లో ;;వివేక వాణి ”,గాంధీ అమర వాణి ,రాధాకృష్ణ వాణి ,రమణ వాణి ,పరమహంస వాణి ,నెహ్రు వాణి ప్రచురించి స్ఫూర్తి కలిగించే వారు .పిల్లల సర్వతోముఖాభి వృద్ధికి బాలా నందంద్వారా  అద్భుత సేవ చేశారు .బాలా నందం అంటే ”వైజ్ఞానిక మాస పత్రిక ”అనే గుర్తింపు పొందటం విశేషం .ఇదంతా రావు గారి డ్రీం ప్రాజెక్ట్ గా ప్రొజెక్ట్ అయింది .
                      addada అనే పేరులో మూడుడలు వుండటం అక్కడ  దీడిక్కులు ఎక్కువ .పరీక్షల్లో మార్కులకు గిరాకీ వున్న రోజులవి .మార్కుల కోసం tutions  చదివే వారు పిల్లలు తమ దగ్గర చదివే వారికి ఎక్కువ మార్కులు ,మిగిలిన వారికి తక్కువ వేసే వారు .దీనితో ముఠా తగాదాలు .అధికారుల రాక .రిపోర్టులు .భీభాత్చం గా వుండేది వాతా వరణం .క్రమ శిక్షణ లేదు .అప్పుడు రావు గారు స్కూల్ లోనే tution చెప్పే విధానం  అందరిని ఒప్పించి అమలు చేశారు .గొడవలు తగ్గాయి .దీనినే insti tutionalised tution అంటారు .దేన్నీ మిగిలిన పాతశాలలు ఆదర్శం గా తీసుకొని అమలు పరిచాయి .విద్యార్ధులు రెండు సార్లు సమ్మె చేసే ప్రయత్నం చేస్తే నచ్చ చెప్పి నివారించారు .కరెంట్ సౌకర్యం స్కూల్ లో లేకపోతె ,పిల్లల్ని వరి  కోత కు తీసుకొని వెళ్లి ఆ డబ్బుతో కరెంట్ కల్పించారు .జిల్లా విద్యా శాఖాధి కారి గారు మెచ్చి వీరిని ”krishna jillaa secondary schools cultural asociation ”ఏర్పర చటానికి constitution  రాయించారు .ఆయనే ప్రెసిడెంట్ గా జిల్లా పరిషద్ అధ్యక్షులు శ్రీ పిన్నమ నేని కోటేశ్వ ర రావు గౌరవాధ్యక్షులు గా ,రావు గారు convenor గా కమిటీ ఏర్పడింది .ప్రతి సంవత్చరం జరిగే గ్రిగ్గ్ స్పోర్ట్స్ జరిగే పాథ శాలలో మూడు భాషలలోను దేబాటే ,వ్యాస రచన ,చేతి పనులు ,చిత్ర రచన ,ఏక పాత్రాభినయం పోటీలు నిర్వహించే వారు .బహుమతు లిచ్చే వారు .అడ్డాడ పాథ శాల పత్రిక ”తెలుగు బాల ”అచ్చు పత్రికను విద్యార్ధుల ,ఉపాధ్యాయుల రచనలతో తెచ్చారు .
                                                నా స్వంత విషయం
                 నేను అడ్డాడ హై స్కూల్ లో 1991 నుంచి 1998 వరకు ఏడేళ్ళు ప్రదానో పాద్యాయుని గా పనిచేశాను .అక్కడే రిటైర్ అయాను .అప్పటికి రావు గారి గురించి నాకేమీ తెలీదు .వినటమేతప్ప  .ఆయన చేసిన బాలల కార్య క్రమాలను గురించి విన్తుందే వాడిని .అంత కంటే తెలీదు .నేను చేరే టప్పటికి స్కూల్ లో కరెంట్ లేదు .సర్వీసు వైర్ లేక  పోవటం వల్ల .ఎవరు పట్టించుకోలేదు .నేను ఆగస్ట్ 14  న చేరాను . మర్నాడు జండా వందనం చేయాలంటే జండా చిరిగి పోయిందన్నారు .అప్పటికప్పుడు అక్కడ అంజి రెడ్డి అనే నా పూర్వపు మిత్రుడు ,అప్పుడు గుమాస్తా గా వున్న అన్జిరేడ్డికి చెప్పి మర్నాదుకు సిద్ధం చేయించాను .ఆగస్ట్ పదిహేను అయిందని పించాము .కరెంట్ సమష్య యెట్లా తీర్చాలి అనుకొంటుంటే ,బాల కృష్ణ అనే ల్యాబ్ అసిస్టంట్ ముందుకు వచ్చారు .తన స్వంత ఖర్చుతో కరెంట్ వైర్ కోని సర్వీసు వచ్చేట్లు చేశారు ,నాకు అది శుభ సూచకం గా కనిపించింది .స్తాఫ్ఫ్ అసోసియేషన్ ఏర్పాటు చేయించాను .పామర్రు లో నాతొ పని చేసినవీరభద్ర రావు అనే  సెకండరి ఉపాధ్యాయుడిని అందరి అంగీ కారం తో సెక్రటరీ ని చేశాము .ఆయన అప్పటి నుంచి ,నేను రిటైర్ ఆయె దాకా గొప్ప సహకారం అందించారు .అక్కడి నా ప్రతివిజయం లోను ఆయన పాత్ర వుంది .క్రమం గా కార్య క్రమాలను ఒక్కొక్కటే చే బట్టాను .కొత్త ఆలోచనలతో ముందుకు సాగాను .అందరిది .సహకారం బాగా లభించింది .స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ అడుసు మిల్లి రామ బ్రహ్మం గారు తన వంతు సహకారం ఇచ్చారు .అక్కడ విద్యార్ధులంతా బి.సి.ఎస్.సి విద్యార్ధులే .ఉత్తీర్ణతా శాతం తక్కువ .అందుకని స్పెషల్ క్లాసులు తీసుకొనే వాళ్ళం .ఇంటర్వల్ లో నేను ఇంగ్లీష్ గ్రామర్ ,లెక్కలు చెప్పే వాడిని .సాయంత్రం స్కూల్ అయింతర్వాత ఒక గంట చది వించే వాళ్ళం .నెమ్మది గా పిల్లల్లో హుషారు పెరిగి చదవటం ప్రారంభించారు .క్రమంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది .
                    సైన్సు ప్రదర్శన పుస్తక  , ప్రదర్శన ఏర్పాటు చేయించాను .చుట్టు పక్కల స్కూల్ వాళ్ళను కూడా ఆహ్వానించి చూసే ఏర్పాటు చేశాం .అప్పటికి వార్షి కొత్చావాలు అక్కడ లేవు .డబ్బు లేదు .అందరి సహకారం తో వరికోతలు ,మినప తీతలు చేసి డబ్బు సంపాదించివార్షి కొత్చావాన్ని  ప్రతియేడు ఘనం గా జరిపాము .నాటికలు ,పాటలు డాన్సులు అన్ని ఉండేవి .పిల్లలలతో ”భారతావతరణం ”అనే పద్య నాటికను వేయించాను ,నోరు తిరగని విద్యార్ధులతో శ్రమ తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వేయించాను .పద్యం చదవటం అందులో రాగ యుక్తం గా పాడటం నేర్పాను.వాళ్ళందరూ బి.సి .,ఎస్,సి విద్యార్ధులే .అవన్నే టేప్ రికార్డర్ లో రికార్డు చేయించాను .ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చిన విషయం ..ఆడ పిల్లలు ఆటలు ఆడే వారు కాదు విద్యార్ధులకు ఆటల్లో చదువుల్లో మంచి బహుమతులు ఇచ్చే వాళ్ళం .వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ల కోసమే ఖర్చు చేసే వాళ్ళం . .జగన్మోహన రావు ,ది.నాగేశ్వర రావు అనే డ్రిల్ మాస్టర్లను ఉత్చాహ పరిచి ఆడ పిల్లల ఆటలు జరిగే చోటికి ఆడ పిల్లలనుఅపంపించి వాళ్లకు ప్రేరణ కలిగించి క్రమంగా ఆటలలో పాల్గోనేట్లు చేశాం .కబాడీ ,త్రో బాల్ అదే టట్లు చేశాం .సబ్ జానే లో వరుస గా ఫస్ట్ వచ్చారు .అలాగే మగ పిల్లలు  వాలి బాల .బాడ్మింటన్ లో ఎప్పుడు ఫస్ట్ .ఉపాధ్యాయ్లం వాలీ బాల్ .బాద్ మింటన రోజూ ఆడే వాళ్ళం .పోటీలలో గెల్పు అడ్డాడ ఉపాధ్యాయులదే అన్నట్లు వుండేది .సెంట్రల్ జోను లోను ఇదా హవా . గుడివాడ యెన్.టి.ఆర్ స్టేడియం లో పోటీలు జరిగేవి .నేను లెఫ్ట్ ఫ్రంట్ ఆడే వాణ్ని .నా సర్వీస్ అంటే కనీసం నాలుగు అయిదు పాయిన్ట్లినా రావాల్సిందే .అలాగే వాలి బాల్ సర్వీసు లో కూడా సర్వీసు కు నాలుగు కంటే ఎక్కువ వచ్చేవి .నేను సర్వీసు చేస్తుంటే జనం విపరీతం గా చప్పట్లు కొట్టే వారు .అంత గొప్ప ప్రోత్చాహం లభించేది ”.ముసిలాడు బాగా అడుతున్నాడ్రా” అని కామెంట్లు .ఇంకా రెచ్చి పోయేవాడిని .ఆట బాగాఆడే  వీరభద్ర రావు ,నాగేశ్వర రావు లను బాగా ప్రోత్చాహించే వాడిని .తప్పు చేస్తే అరిచే వాడిని కూడా .నెక్స్ట్ టైం బెటర్ లాక్ అంటుండే వాడిని .janam నాకు ఇచ్చే ప్రోత్చాహం ఒక సచిన్ కో ,కపిల్దేవ్ కో ఇచ్చినత గొప్ప గా వుండేది .అది మరువ లేని విషయం    .నా జీవితం లో .అద్దాడ టీం వస్తోందంటే హడలు అన్నట్లుండేది .
                      అంగలూరు లో వున్న దయట్ కాలేజీ నుంచి lecturerlnu పిలిపించి ఉపన్యాసాలు ఇప్పించే వాడిని .ఉయ్యూరు వాడు ఫణి రాజా మోహన అనే గణిత ఉపాధ్యాయునితో విద్యార్ధులే ప్రుచ్చకులుగా ”గణిత అష్టావధానం ”చేయించా.అతను నా   శిష్యుడే .దయట్ ప్రిన్సిపాల్ చాగంటి వెంకటేశ్వర రావు గారు వచ్చి మా కార్య క్రమాలకు మురిసి పోయారు .సెప్టెంబర్ అయిదు ఉపాధ్యాయ దినోత్చావం అనే గురు పూజోత్చ వాణ్ని విద్యార్ధులతో ఘనం గా జరిపించే వాడిని విద్యార్ధులు స్వయం గా ముందుకు వచ్చి డబ్బులు వసూలు  చేసుకొని ఉపాధ్యాయులన్దరినీ ఆరోజు సన్మానించే వారు .నేను ప్రతి సంవత్చరం ఆ రోజున ఒక టీచర్ ను ఎన్నిక చేసి స్టాఫ్ తరఫున సన్మానం చేసే వాడిని .అక్కడ పని చేసి  రిటైర్ అయిన టీచర్స్ ను కూడా ఆహ్వానించిసన్మానించే వాళ్ళం . చుట్టూ పక్కల ఏ స్కూల్ లోను ఇలా జరిగేవి కావు .అందుకని గొప్ప ఫీల్ ఆయె వారు .ఇదంతా అందరి సహకారం తో జరిపిన పంలె .విద్యార్ధులను ఆంద్ర బాంక్ కు  ,పోస్ట్ ఆఫీస్ కు పంపి లావా దేవీలు జరిగే తీరు నేర్చుకోనేట్లు చేశాను .ఇది కొత్త ప్రయోగం . .ఇన్స్పెక్టర్లు వచ్చి అద్దాడ ప్రగతిని చూసి మెచ్చే వారు .అద్ద్కాదను చూసి నేర్చుకోండి అని మిగిలిన స్చూల్స్ లో చెప్పే వారట .ఆడ పిల్లలకు సుబ్జోనే ఆతల పోటీలు రెండు రోజులు గ్రామస్తుల ,పరిసర గ్రామస్తుల సహకారం తో అత్యంత వైభవం గా జరిపాము .మంచి భోజనం ,వసతి గొప్ప బహుమతులు .అందరికి ఆశ్చర్యం కలిగింది .అడ్డాడ హై స్కూల్ కు నాకు మంచి పేరు రావటం నా అదృష్టం .టీచర్స్ రిటైర్ అయితే ఘనం గా సన్మానించే వాళ్ళం .ఊళ్ళో వాళ్ళను ప్రోత్చ హించి విద్యార్ధులకు అనేక బహుమతులు ఇచ్చే ఏర్పాటు చేశాను .సైన్సు పరికరాలు ,ఆట వస్తువులు ,క్రాఫ్ట్ కు కావలసిన సామాను కొనే వాడిని .అక్కడి డ్రాయింగ్ మేష్టారు అప్పా రావు మంచి ఆర్టిస్ట్ ,స్కూల్ మగజైన్ ఆయన సహకారంతో వ్రాత ప్రతి గా తెచ్చే వాళ్ళం .దేనికీ డబ్బు లేదు అనే మాట వుండేది కాదు .పిల్లల డబ్బే పిల్లల సౌకర్యాలకు ఉపయోగించాము .మంచి నీరుకు బావి మాత్రమే వుండేది మోటర్ ఎప్పుడో చెడి పోయింది .దాన్ని బాగు చేయించి రక్షిత మంచ్ నీతి సరఫరా ఏర్పాటు చేశాను .స్కూల్ చరిత్ర ను రాయించాను .పని చేసిన ప్రదానో పాద్యాయుల పేర్లున్న బోర్డు రాయించాను .స్కూల్ ఫస్ట్ విద్యార్ధుల పేర్లు రాయిన్చాము .దాతల పేర్లు పర్మనెంటబోర్డు మీద రాయించాను .మొక్కల పెంపకం వుండేది కొబ్బరి చెట్లకు పోషణ బాగాచేయించి ఫలా సాయం తీశాం .పాట పెట్టి ఆ డబ్బు జమ చేసే వాళ్ళం .ఒక రూరల్ స్కూల్ లో ఇదంతా అసాధ్యమే కాని సుసాధ్యమయింది పిల్లల ,పెద్దల ,గ్రామస్తుల ,సిబ్బంది సహాయ సహకారం తో .ఇదో దివ్యానుభూతి నాకు .చాలా సంతృప్తిగా 1998 జూన్ 30 న రిటైర్ అవటం నా అదృష్టం .ఇందుకు నాకు సహకరించిన వారందరికీ నా కృతజ్ఞతలు .
                     ఇదంతా ఎందుకు అంటే నా బావ మరిది టి  .వి.ఎస్,.బి.శాస్త్రి నూజివీడు లో వెంకటేశ్వర రావుగారి శిష్యుడు .  తన జీవిత చరిత్రలో ఆయన అడ్డాడ లో పని చేసిన విషయం వుందని చెప్పాడు .అతను ముసునూరు బాంక్ లో పని చేసే వాడు .అప్పుడు నేను మా స్టాఫ్ తో సంప్ర దించి ,16 ఏళ్ళ క్రితం
రావు గారిని ఒక స్వాతంత్ర దినోత్చావం నాడు ఆహ్వానించి ,విద్యార్ధులకు సందేశం ఇప్పించి ,ఘనం గా సన్మానం చేశాము.మా బావ మరిది కూడా వచ్చాడు .అతని paintings ప్రదర్శన ఏర్పాటు చేశాం కూడ .రావు  గారు చాలా సంతోషించారు .ఎప్పుడో పని చేసిన తనను గుర్తుంచుకొని ఆహ్వానించి సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు .మళ్ళీ ఈ సంవత్చరం సెప్టెంబర్ 28 న ఉయ్యూరు లో” సరస భారతి ”29 వ సమావేశానికి ముఖ్య అతిధి గా ఆహ్వానించి శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వార్ల దేవాలయం లో ”మహిత మందిరం ”లోఘనం గా  ”బాల సాహిత్య చక్ర వర్తి ”బిరుదాంకితులు శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు గారిని  సత్కరించాము .ఆ కార్య క్రమానికి అనుకోని అతిధులు గా కృష్ణా జిల్లా రచయితల అధ్యక్షా ,కార్య దర్సులు శ్రీ గుత్తికొండ సుబ్బా రావు గారు ,దా.జి.వి పూర్ణ చంద్ గార్ల సమక్షం లో  లో ఈ సన్మానం జరగటం విశేషం .ఇది నా జీవితం లో మరుపు రాని సంఘటన .రావు గారు చాలా సంతోషం వెలి బుచ్చారు మా బావ మరది శాస్త్రి కూడా వచ్చాడు .రావు గారు రెండు గంటలు పై గా మా ఇంట్లో వుండటం గొప్ప అనుభూతిని మిగిల్చింది .వారు రాసిన వారి పుస్తకాలు నాకు అండ జేశారు .
                                                    మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -11 -11 .
Posted in మహానుభావులు, రచనలు | Leave a comment

Gurajada 96 years oldman

This slideshow requires JavaScript.

This slideshow requires JavaScript.

Posted in మహానుభావులు | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు —3 పశు వైద్యో కోటయ్యో నారాయనో హరిహ్

      ఊసుల్లో ఉయ్యూరు —3
                                             పశు వైద్యో కోటయ్యో నారాయనో హరిహ్
                మా ఉయ్యూరు లో పూర్వంపశువుల  పశ్వుల ఆస్పత్రి మాసువర్చ లాంజనేయ స్వామి   దేవాలయానికి దగ్గర సూరి వారి బజారు లో వేదాంతం రామాచార్ల గారి ఇంటి వద్ద వుడేది .అద్దె కే .ఒక చిన్న పెంకుటిల్లు .అందులో డాక్టర్ గారి ఆఫీసు ,బీరువాలలో మందులు ,కత్తులు కతార్లు మొదలైన శస్త్ర పరికరాలు ఉండేవి .బయట ఒక తాటాకుల పాక .డాక్టర్ గారుపశువుల యజమానుల్ని  ఈ పాక లో వుండి ,ఒక రిజిస్టర్ లో వివ రాలు అడిగి రాసుకొనే వారు .పాపం ఆయనకు ఒక చిన్న కొయ్యకుర్చీ ,చిన్న  , కొయ్య  బల్ల .చేతులు కడుక్కోవటానికి స్టాండ్ బేసిన్ .లైఫ్ buoy సబ్బు ,చిన్న తువాలు .రెడీ గా చేతికి గ్లోవేలు ,కాళ్ళకు పొడవైన మోకాళ్ళ దాకా వచ్చే బూట్లు .ఒక కామ్పౌందర్ సహాయకారి .ఇద్దరు అటెండర్లు  .అక్కడికి వెడితే భలే తమాషా మందుల వాసన వచ్చేది .నా చిన్నప్పటి నుంచి ఆ ఆస్పత్రితో సంబంధం వుండేది .మాకు గేదెలు ,ఆవులు ఉండేవి పాలేరు వుండే వాడు .దాదాపు వూళ్ళో చాలా మందికి ఆనాడు పశువులు ఉండేవి .వ్యవసాయం వున్న వారికి ఎడ్లు ,బండీ పెద్ద పాలేరు వుంటారు … .
                         ఆ కాలమ్ లో పశువులకు జబ్బులు బాగా నే వచ్చేవి .గాళ్ళు అనే వ్యాధి కాళ్ళకు వచ్చేది .దీన్నే గాలి కుంటు వ్యాధి అంటారు .పాపం అవి విపరీతం గా బాధ పడేవి .ఈగలు    ఆ పుళ్ళ మీద ముసి రెవి .ఆజబ్బు సోకితే తిండి తినేవి కావు .వాటి బాధ వర్ణనా తీతం .కొన్ని పశువులు లేవ గలిగే స్థితి లో ఉండేవి కావు .లేస్తే ఆస్పత్రికి పాలేళ్ళు తోలుకు వెళ్లి మందు వేయించే వారు .ఆస్పత్రి లో అన్నిరకాల   పశువులకు వైద్యం వుండేది .గొప్ప తనం ఏమిటీ అంటే  దమ్మిడీ కూడా డాక్టర్లు కాని ,సహాయకులు కాని ఏ జబ్బుకు డబ్బు తీసుకోక పోవటం .అన్ని మందులు ఆస్పత్రి లోనే ఉండేవి .అన్నీ ఉచితమే .అవసరమై ఇంటి దగ్గర వేయాల్సి వస్తే వాళ్ళే ఇచ్చే వాళ్ళు .దానికీ డబ్బు లేదు .
                       పాలేల్లతో పాటు చిన్నప్పుడు ,ఆ తర్వాత ఉద్యోగం చేసే టప్పుడు నేను హాస్పత్రికి వెళ్ళే వాడిని .అక్కడ గొడ్లను నుంచో పెట్టి మందు నోటిలోకి పోయటానికి రెండు అడ్డ కర్రలు భూమిలో సపోర్ట్ తోనూ ,ముందు ఒక బలమైన కొయ్య స్థంభం సుమారు అయిదారు అడుగుల పొడవుతో ఉండేవి .దీనికి పశువును కట్టి మొర పైకెత్తించి నోటిలో పొడవైన వెదురు గొట్టంలో మందు పోసి నాలుక అదిమి పట్టి నోటిలోకి చెయ్యి పెట్టి పోసే వారు .అవి గుట గుట తాగుతుంటే తమాషాగా వుండేది .తాగింతరవాత పొట్ట మీద చరిచే వారు .పూర్తి గా లోపలి చేరా టానికి .
                    ఎద్దులు దున్నలు వస్తే వాటికి మూపురం మీద ,కంఠం కింద ,గంగ డోలు వాచినపుడు వాటిని పట్టుకొని వైద్యం చేయటం కష్టం .అందుకని ఇసక తో పూడ్చిన గొయ్యి లాంటి వెడల్పైన దాంట్లో కాళ్ళకు బందాలు వేసి ఒక్క సారిగా పడి పడుకొనే ట్లు చేయటం భలేగా వుండేది .గంగ డోలు వాస్తే ఒక రకమైన ఆయింట్ మెంట్ రాసే వారు సహాయకులు .అది రాసింతర్వాత పసుపు రంగులో మారేది .వింతవాసన వచ్చేది .ఈ పనులన్నీ  చేయ టానికి నాకు తెలిసిన దగ్గర్నుంచి కోటయ్య,పరసు రాముడు  అనే చాకలి వాళ్ళు ఇద్దరు అటెండర్లు గా వుండే వారు .వాళ్లకు retirement వుండదేమో నని పించేది .ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి చీకటి పడే వరకు ద్యుటి ఏ.విసుగు విరామం లేదు .అందులో పెద్ద అతని పేరు కోటయ్య .నల్లగా ,పెద్దముక్కు తో ,బలం గా ,కొంచెంగండు మొహం తో   వుండే వాడు .కీచు గొంతు ,.తెల్లని పంచె ,తెల్లని చొక్కా ఉండేవి .అవి ఎంత కష్టమైనా పని చేసినా మాయటం నేను చూడ లేదు .మా ఇస్త్రీ చాకలి మాణిక్యం అనే అమ్మాయికి తమ్ముడు కోటయ్య .రెండ వ అతను పరశు రాముడు కాకి నిక్కర్ ,బనీను తో వుండే వాడు .ఇందులో కోటయ్య ఆరితేరిన మనిషి .డాక్టర్లు ఆ కాలమ్ లో తక్కువ ,సరిగా వచ్చే వారు  కాదు .కనుక హాస్పటల్  లో కోటయ్య వుంటే డాక్టర్ వున్నా .లేక పోయిన ఫరవాలేదు .అందరికి అదో ధైర్యం . అతని అనుభావసమే అతను డాక్టర్ కంటే గొప్ప వాడిని చేసింది .అందుకే నాకు అతనే పశువుల పాటి నారాయణుడు అనిపించే వాడు .ఆ ఇద్దరు అశ్వినీ దేవతల్లా అని పించే వారు .వారి సేవలు నిరూప మానం ..మాటలతో వర్నించలేనివి .కనీసం ఈ రూపం గా నైనా వాళ్ళిద్దర్నీ తలిచి ఉయ్యూరు వాసుల ఋణం తీర్చు కోవటమే నేను చేస్తున్న పని .వాళ్లకు ఏమిచ్చి ఋణం తీర్చుకో గలం  ?ఉయ్యూరు చుట్టూ పక్క గ్రామాలకు అప్పుడు ఇదే ఆస్పత్రి .ఆ తర్వాత చుట్టూ వచ్చాయి  గేదెల గేదేలాక్ అరుపులతో ,ఆవుల అమ్బారవాలతో దూడల అరుపులతో ,ఎద్దుల  రంకె లతో భలే సందడి గా వుండేది .కొల్ల కొక్కొరో కోలు,కుక్కలా నాలుకల విసుర్లు భౌ భౌ లు వింత గా ఉండేవి .
                      పశువులకు పారుడు వ్యాధి బాగా వుండేది .అవి పారుకొంటు ఆస్పత్రి అంతా చెడగొట్టేవి   .పాలేళ్ళు జాగ్రత్త గా ,శుభ్ర పరిచే వారు .గోడలకు injection   చెయ్యటం చూడ ముచ్చట గా వండేది .సహాయకులు తాడు వేసి బిగించి పశువును రాటకు కట్టిఅదిలిస్తూనే డాక్టర్   గారు కావలసిన మందును సిరంజి లో ఎక్కించి  తుంటి మీదో ,మెడ మీదో మూపురం మీదో బలం గా సూదిని లాగి పెట్టి పొడి చే వాడు .అది నిలబదిన్తర్వాట ,సిరంజి లోని మందు దానిలోకి ఎక్కించే వాడు .సరదా గా వుండేది చూడ టానికి .అవును బాధ పశువుది ఆనందం ఈ నర పశువుది కదా ..అర్రు మీద పుల్లు ఏర్పడేవి .సరైన సమయం లో మందు వేయక పొతే అది బాగా లోతు గా పెరిగేది .అలాంటి వాటికి రోజూ డ్రెస్సింగ్ చేసే వాళ్ళు కోటయ్య ,పరశు రాముడు .అయోడిన ఆయింట్ మెంట్ రాసే వారు .బొరిక పౌడర్ అద్దె వారు .tncture   లో దూది ,అద్ది పట్టు కార లాంటి సాధనం తో పుండు లోపలి పోనిచ్చి చెడు పదార్ధం అంతా బయటికి తీసేసి గాజు గుడ్డకు మందు రాసి అందులో పెట్టి డ్రెస్సింగ్ చేసే వారు.చేతులు కడుక్కోవతానికీ పుల్లు కడగా టానికీ పోతాస్సియం పెర్మాంగా నెట్ వాడే వారు . .కొన్ని ఆవులు,గేదెలు ఈనిన తర్వాత మాయ వేసేవి కాదు .ఒక రోజూ చూసి వాటిని తీసుకొచ్చే వారు .గ్లోవులు తొడుక్కొని పరసురాముడు ,కోటయ్య దాన్ని బయటికి తీసీ వారు .అప్పుడు డాక్తో చెక్ చేసి మందు రాసే వాడు .మంచి ఆబోతు ,దున్న పోతు కొంత కాలమ్ వున్నట్లు జ్ఞాపకం .ఎద కు వస్తే వాటితో దాటిన్చ్ వారు .ఏదైనా యజమాని ఇస్తే తీసుకొనే వారు .ఆ పనీ కోటయ్య సమర్ధం గా చేసే వాడు .చూడి నిలిచిందో లేదో మూడో నెల నుంచి పరీక్షకు తెచ్చే వారు .దానికీ కోటయ్యే ముందు .’కోడె దూడలకు వృషణాలు కొట్టటం కూడా చేసే వారు .పశువును ఒడుపుగా తాళ్ళు నడుం చుట్టూ వేసి బిగించి ఒక్క ఉదుటున పడుకో బెట్టె నేర్పు . కోటయ్యడే ఎంత లావు పశువైనా అతని లాఘవం ముందు బలాదూరే . .పాలు సరిగ్గా ఇవ్వటం లేదనో దూడ , పాలు తాగటం లేదనో వచ్చే వాళ్ళు .డాక్టర్ వుంటే సరే .ఏక పోతే కోటయ్యే కామ్పౌందర్ తో కేసు రాయించి మందు ఇచ్చి పంపేవాడు .లేగ  దూడలకు మట్టి తింటే పేడలో  పురుగులు పడేవి .చాలా బాధ పడేవి .మెలికలు తిరిగేవి .వాటికీ చక్కని మందు ఇచ్చే వారు .నాకు తెలిసినంత వరకు ఏ పశువు వైద్య లోపం వల్ల అక్కడ చని పోలేదు .ఇది చాలు కోటయ్య సేవకు .
                     డాక్టర్లలో నాకు కొంత వరకు తేతలి సుబ్బా రావు గారు తెలుసు .అ తర్వాత చాలా మంది వచ్చే వారు ,పోయే వారు .ఎవరు వచ్చినా ,పోయినా కోటయ్యే అసలు డాక్టర్ నా దృష్టిలో .వాళ్లకు పెద్ద గా జీతాలున్దేవి కాదను కుంటా .దేవిరింపు లేదు .దసరాకు మాత్రం అన్ని ఇళ్ళకు మామూళ్ళ కు వచ్చే వారిద్దరూ .చాల సంతోషం గా యజమానులు తోచింది ఇచ్చి సంతృప్తి పరిచే వారు .ఆరగా ఆరగా బీడీలు తాగే వారు .రాత్రి పూట పొద్దున్నించీ చేసిన పనికి ఒళ్ళు పులిసి మందు కొట్టే వారు .అయితే ఎప్పుడు వీధిన పడే వారు కాదు .తెల్లార గానే ద్యుటి కి మళ్ళీ హాజరు .ఆ హాంగోవర్ కని పించేది కాదు .పనిలో బద్ధకం ,అశ్రద్ధ లేవు .క్రమం గా ఆస్పత్రి లో డబ్బు ప్రవేశించింది .,వీళ్ళు రిటైర్ అయింతర్వాత .మందులు ఉండేవి కావు .డాక్టర్ రాసిస్తేబయట  కోని తెచ్చుకోవాలి .artficial insemination వచ్చింది .బలమైన ,పాలిచ్చే సంతాతి ,జెర్సీ ఆవులు ,వచ్చాయి .ఒక సారి ఒక కుర్ర డాక్టర్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు .నాగేంద్ర మూర్తి అని పేరు అని అజ్నాపకం .పశువుల పెంపకం లో మంచి సలహాలనిచ్చాడు .పాలిచ్చే వాటినే వుంచి మిగిలినవిఅమ్మేయమని   సలహా ఇచ్చాడు .నేను పాటించాను .సరదాగా నవ్వుతు మాట్లాడే వాడు .అప్పుడువసతులు లేవు .కానిడ్యూటి   మీద శ్రద్ధ బానే వుండేది వున్న దాంట్లోనే చక్కని వైద్య సేవలు అందించే వారు .
                           ఇప్పుడు పశువుల ఆస్పత్రి అమెరికా లో ఉంటున్న ఉయ్యూరు నివాసిఅక్కడ  retired లైబ్రరియన్ అయిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి భారీ విరాళం తో నిర్మింపబడిన ఏ.సి .గ్రంధాలయం ప్రక్కన వుంది .మంచి బిల్డింగ్ ను ,వసతులను ఉయ్యూరు కే.సి .పీ .వారు కలుగ జేశారు .బాగానే నడుస్తోంది సమర్ధులైన స్తాఫ్ఫ్ వున్నట్లు తెలిసింది .కొయ్య చట్రాలు పోయి ఇనుపవి వచ్చాయి .వీటిని ఫోటో లలో చూడ వచ్చు .
             వైద్యో నారాయనో హరిహ్ .అని సామెత .మా పశు వైద్య శాలకు కోటయ్యే మాకువైద్యుడు  ,నారాయణుడు ,హరీ అన బోయే పశువులకు ప్రాణ దాత .అందుకే అతన్ని ,అతని సహచరుడు పర్సు రాముడిని జ్ఞాపకం చేసుకున్నాను
                                      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -11 -11
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —4

       ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —4
                                                  సాంఘిక సాహిత్య సంక్షేమ కార్య పరం పర
                   1953 లో గోదావరి నదికి వరదలు వచ్చాయి .పిల్లలను ,పెద్దలను ,యువకులను చేర దీసి వరద సహాయ నిధి కోసం గ్రామాలన్నీ తిరిగి బుర్రకధలు చెప్పించారు .నాటికలు వేయించారు ,పంచ వర్ష . ప్రణాళికలు ,గ్రామ స్వరాజ్యం ,మహిళాభ్యుదయం పై ఉపన్యాసాలను తయారు చేసి ,విద్యార్ధులతో మాట్లాడించే వారు .శాంతి నిలయం సేవా సంఘం ద్వారా ,ముదునూరు లో రోడ్లను అభివృద్ధి చేశారు .”ఉచిత హిందీ శిక్షణా సౌకర్యం ”ను పువ్వుల రామ మోహన రావు వంటి హిందీ ప్రేమికుల ద్వారా కల్పించారు .రైతు బిడ్డలను విహార ,విజ్ఞాన యాత్రలకు తీసుకొని వారి జ్ఞానాభి వృద్ధికి దోహదం చేశారు .కుల మతాలకు అతీతం గా పని చేశారు .అందుకే అది ”సోషియోఎడ్యుకేషనల్ కల్త్యరల్  సెంటర్ ”గా గుర్తింపు పొందింది .ఆ కాలమ్ లో ఎన్నో సాహిత్య ,కళా సంస్థలు పుబ్బలో పుట్టి మఖ లో మాడి పోయాయి .దానికి కారణం సంకుచితత్వం,ఈర్ష్యాద్వేషాలు అని బాధ పడుతారు రావు గారు .అందుకే వాటికి అతీతసం గా ,ముదునూరు సంఘం సేవలందించింది .బాధ్యతలు అందరికి ,సామర్ధ్యాన్ని బట్టి అప్పగించే వారు .మంచి పర్య వేక్షణ వుండేది .వీటికి మించి సేవా దృక్పధం వుంది .”రాము -రాజా ”అనే ఇద్దరబ్బాయిలు పిల్లల కార్యక్రమ రూప కల్పనలో నిర్వహణ లో బాగా తోడ్పడ్డారు .
                     radio అన్నయ్య శ్రీ ఏడిద కామేశ్వర రావు ముదునూరు వచ్చి కార్యక్రమాలను పరిశీలించారు . radio వారే వచ్చి పిల్లల కార్యక్రమాలు రికార్డు చేసి ప్రసారం చేశే వారు .ఉయ్యూరు మొదలైన గ్రామాలలో ”బాల రాజ్యం ”బ్రాంచీలు ఏర్పాటి చేశారు .మేము అందరం అందు లో పాల్గొనే వాళ్ళం .అప్పుడు ఆయన్ను చూసిన గుర్తు నాకు లేదు .ముదునూరు నుంచి సుమారు 100 ”బాల రాజ్యం ”కార్యక్రమాలు నిర్వహించిన ఘనా పాటి రావు గారు . ఆరుగొలను నుంచి నండూరి సుబ్బారావు అనే హాష్య నటులు ,ముదునూరు నుంచి ఈ సోదరులు పిల్లలను radio కార్య క్రమాలకు విజయవాడ  తీసుకొని వెళ్ళే వారు .రావు గారిని ”radio కార్యక్రమ సభ్యుని ”గా చేశారు వీరు ప్రదర్శించిన ”ఉగాది అల్లుడు ”నాటిక బాగా క్లిక్ అయింది .గంగిరెద్దు ,హరిదాసు ,గొబ్బిపాట ,లతో సంక్రాంతి శోభను రేడియోలో కల్పించారు .పిల్లలు లంబాడి డాన్స్ చేసి అచ్చంగా లంబాడీలే క్యని పించే వారు .రావు గారి శిక్షణ అంత నిర్దుష్టం గా వుండేది .వీరు రచించి ప్రదర్శించిన గంట నాటిక ”కనువిప్పు ”పోటీలలో బహుమతి సాధించింది .ఉమ్మడి డబ్బు సమాజానికి ఎలా ఉపయోగించాలో తెలియ జేసే కధ ఇది .  .
                  1955 లో భూదానోద్యమ నాయకులు వినోబా భావే విజయ వాడ వచ్చార్రు .వారి సమక్షం లోవారి జీవిత కధ ను   బుర్రకధ గా మలిచి రాము బృందం తో ప్రదర్శించి భావే మెప్పు పొందారు .దాన్ని ఆయనకే అంకితమిచ్చారు .రచనకు క్రియాశీల ప్రయోజాం వుండాలని ,ఉన్నత భావావిశాకరణ జర గాలాని రావు గారి అభిప్రాయం .కరుణశ్రీ ,ఉత్పల ,ముదిగొండ ,వంటి కవులు ,ముదునూరు వచ్చి శాంతినిలయం కార్యక్రమాలు చూసి ముచ్చట పడ్డారు .;”భారత సేవా సమాజ్ ”ఇచ్చిన ఆర్ధిక సాయం తో ముదునూరు లో డొంక రోడ్డు నిర్మించారు .వీరి రేడియో కార్యక్రమాలు విని ఆనాటి బందరు పార్లమెంట్ సభ్యులు మండలి వెంకట కృష్ణా రావు అభినందన లేఖ రాశారు .గ్రామ మహిళా సంఘం ఏర్పరచి ,”మరుగుదొడ్డి ”అవసరాన్ని వివరించి అమలు పరిచారు .40 మంది మహిళల తో ”అంబర్ చరఖా కేంద్రం ”ఏర్పాటు చేసి ,బ్లాక్ డెవలప్మెంట్ వారి ఆర్ధిక సాయం తో ,శిక్షణ నిప్పించారు .దీనితో పేద కుటుంబాలకు జీవనో పాది లభించింది .కుట్టు పనులు నేర్పించారు గృహా లంకరణ .నేర్పించారు . .తాటాకు చాపలు ,ఈతాకు చాపలు విసన కర్రలు తుంగ చాపలు జేబు రుమాళ్ళు తయారు చేయించే వారు .కవర్ల తయారు చేయటం లో శిక్షణ నిప్పించారు .ఇవన్నీ మంచి ఉపాధి కల్పించాయి ..ఇవన్నీ రావు గారిమెదడు   లోని ఆలోచనలు .అవి సమర్దవంతం గా అమలయాయి .స్వంత కాళ్ళపై నిలబడే గొప్ప  అవకాశం కల్పించారు రావు గారు .ముదునూరు గ్రామ జీవనం లో ఈ కేంద్రం మైలు రాయి గా నిలిచి ,ఆడర్శవంతమైంది  ‘చేతి పనుల ప్రదర్శన ఏర్పాటుచేసి అందరి ప్రశంసలు పొందారు .
                     ఏడు ఏళ్ళు ముదునూరు లో గ్రామ ప్రజల చైతన్య కార్య క్రమం నిర్విఘ్నం గా జరిపిన ఘనత వెంకటేశ్వరావు సోదరులాడే .ఆ సమయం లోనే మద్రాస్ ,హైదరాబాద్ ,ధిల్లీ లకు విజ్ఞాన యాత్రలు నిర్వహించారు ధిల్లీ లో భారత ప్రధాని నెహ్రూను దర్శించి మాట్లాడి ,ఆ జ్ఞాపకాలను ”పండితజీ తో పది నిమిషాలు ”వ్యాసం లో నిక్షిప్తం చేశారు .ఋసీ కేష్ లో స్వామి శివానంద ను సందర్శించి ,ఆధ్యాత్మిక అనుభూతి పొందారు .ఇంత తీరిక లేని కార్య క్రమాలు నిర్వ హిస్తూనే 1961 లో బనారస్ విశ్వ విద్యాలయం నుంచి ప్రైవేటు గా చదివి ఏం .ఏ.సాధించారు .ఇదీ సార్ధక జీవితం అంటే -తాను తరిస్తూ ,ఇతరులను తరింపజేయటమే .
              1961 లో ముదునూరు లో జిల్లా స్థాయి నాటిక ,ఏక పాత్రాభినయం పోటీలను శాంతి నిలయం లో మూడు రాత్రులు ఘనంగా నిర్వహించారు .కవి కాటూరి తో ప్రారంభం చేయించారు .బాలకవి బి.వి.నరసింహారావు .పైడి పాటి వంటి కవులు ,రచయితలు పాల్గొన్నారు .న్యాయ నిర్ణేతలుగా ,ఎర్రోజు మాధవా చార్యులు ,రామచంద్ర కాశ్యప్ ,విన్న కోట రామన్న పంతులు వ్యవహరించారు .అత్యంత భారీగా ,సమర్దవంతం గా నిర్వహించటం చెప్పుకోదగిన విషయమే .పాల్గొన్న సమాజాల వారికి ,నటీ నటులకు సహాయకులకు ఉచిత వసతి ,భోజన సౌకర్యం కల్పించారు .
                1962 లో మైలవరం హై స్కూల్ కు బదిలీ అయారు .అక్కడా ఇదే విధానం అవలంబించి అందరి అభిమానం పొందారు .మైలవరం రాజా నరసింహారావు గారు మంచి ప్రోత్చాహం అందించారు .యు.యెన్.వో .పరీక్షలకు శిక్షణ ఇచ్చారు .”గోడ పత్రిక ”నిర్వహించారు .విద్యార్ధులతో పదిహేను రోజులకో సారి వార్తా సమీక్ష చేయించే  వారు .దీనితో జెనెరల్ నాలెడ్జి బాగా పెరిగేది .రేడియో పాఠాలను రికార్డు చేసి ఖాళీ పిరియడ్లలో వినిపించే వారు .”బాల భారతి ”అనే వార్షిక పత్రిక నడిపారు .విద్యార్ధులను ప్రోత్చాహించి కవితలు కధలు వ్యాసాలు రాయించారు .పాఠాశాలలో జరిగిన వివిధ కార్యక్రమాలను” సినిమా ”తీయించి వార్శికోత్చావం రోజున అందరికి ప్రదర్శించి చూపే వారు .ఆనాడు ఇది చాలా సాహసో పేత మైన చర్య.ఎక్కడా ,ఎవరు చేసిన దాఖలాలు లేవు .
కేంద్ర ప్రభుత్వ పరిశీలన బృందం మైలవరం ”బాల రాజ్యం ”పనులను పరిశీలించారు .ఆ సందర్భం గా హస్త కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు .మూడు రోజులు నాటికలు ప్రదర్శించారు .మైలవరం మొదటి నుంచి నాటక రంగానికి గొప్ప కేంద్రం .ఆ రాజు లందరూ బాగా ప్రోత్చాహించారు .నాటకం మొదట పాడే ”పరా బ్రహ్మ పరమేశ్వర ”అనే ప్రార్ధనా గీతం అక్కడే రూపు దిద్దుకుంది .ఆ ఆస్థాన కవి దాన్ని రాశారు ..ఆ తర్వాత అన్ని సమాజాలు దాన్ని అనుసరించాయి .రేడియో గాయకురాలు వింజమూరి లక్ష్మి ,రేడియో అన్నయ్య ,నటుడు కందుకూరు రామ భద్ర రావు గార్లకు ఆ వేదికపై ఘన సన్మానం చేశారు .ప్రజా సహకారం తో ”బాల రాజ్యం ”అనే ప్రత్యెక సంచికను వెలువరించి ,అందులో మైలవరం నాటకరంగ సేవ పై ప్రత్యెక వ్యాసాలు రాయిస్తూ ,పిల్లల .పెద్దల .ఉపాధ్యాయుల రచనలతో దాన్ని అతి సుందరం గా ముద్రించి రికార్డు నెలకోల్పారు రావు గారు .వూరు ఏదైనా ,వారి తీరు అదే .
                                             సశేషం
                                                                      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -11 -11 .
Posted in మహానుభావులు, రచనలు | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –2 పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని

   ఊసుల్లో ఉయ్యూరు –2
                                               పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని
                       మా నాన్న గారికి అన్న దమ్ములు ,అక్క చెల్లెళ్ళు లేరు .ఆయనఒక్కరే  మా తాత గారి సంతానం .అంటే ఏక్ నిరంజన్ .అందుకని మాకు బాబాయి ,పెదనాన్న ,అత్తయ్య లంటే ,ఆనుబంధం అంటే తెలీదు ,.మా నాయనమ్మ ను మేము మామ్మ అంటాం .మామ్మ పేరు నాగమ్మ గారు .మా ప్రక్క ఇల్లు గుండు వారి ఆడ పడుచు .ఆమె అక్కయ్య మహాలక్ష్మమ్మ గారు రేపల్లె లో వుండేది .మాకు తెలిసిన దగ్గర్నించీ ఆమె వైధవ్యం లోనే వుంది .ఆమె కుమారుడు రాయప్రోలు శివ రామ దీక్షితులు గారు .ఆయనే మాకు బాబాయి .పొట్టిగా ,ఎర్రగా ,గోచీ పోసి పంచేకట్టే వాడు .త్రికాలాల్లో సంధ్యా వందనం చేసే వారు .దేవుడి పూజ అనుష్టానం దాదాపు నాలుగైదు గంటలు పట్టేది .వాళ్ళింట్లో కాఫీ అలవాటు లేదు ,మా పిన్న లక్ష్మి కాంతం మా అమ్మను అక్కయ్యా ,అని బాబాయి మా నాన్ననూ అన్నయ్యా అని చాలా ఆప్యాయం గా సంబోధించే వారు .రాక పోకలు బాగా ఉండేవి .బాబాయి అంటే గౌరవం తో కూడిన భయం .రైల్వే స్టేషన్ దగ్గరే వాళ్లకు డాబా వుండేది మంచి స్థితి పరులు బాబాయి పొట్టిగా ,పిన్ని పొడుగ్గా వుండే వారు .మా కుటుంబం అంటే తగని ఆపేక్ష .నాకు బాబాయి దగ్గర చనువు వుండేది .బాబాయి పావు గంటకో సారి గోచి సవరించుకోవటం బాగా గుర్తు ,.నవ్వుకొనే వాళ్ళం .అతిధి అభ్యాగాతులతో వాళ్ల ఇల్లు  ఎప్పుడు సందడి గా వుండేది .అసలు బాబాయి,పిన్ని  లేని లోటు ను   ఈ  బాబాయి పిన్ని కొంత వరకు తీర్చారు
                      మా మామ్మ పెద్ద చెల్లెలు అంటే మా చిన్న మామ్మ బ్రహ్మా జోశ్యుల వారి ఆడ పడుచు .మా ఇంటికి దక్షిణాన వారిల్లు .దాన్ని మేము త్కర్వాథ కోన్నా ,ఇంకా చిన్న మామ్మ గారి ఇల్లనీ ,బ్రహ్మా జోశ్యుల వారి ఇల్లని అంటాం .ఆవిడకు మెల్ల కన్ను పన్ను . కొంచెం ముందుకు వచ్చి నట్లుండేది .పెద్దమామ్మ పొడవుగా గంభీరం గా వుంటే ,ఈవిడ పొట్టిగా వుండేది .ఆవిడ పీట మీద చివరగా కూచుని భోజనం చేస్తుంటే నవ్వు వచ్చేది .ఆవిడా వితంతువే నాకు గ్రాహకం  వచ్చిన దగ్గర్నుంచి .ఆమె కు ఒక కొడుకు .ఆయనా చిన్న తనం లోనే పెండ్లి అయి ఒక కొడుకు పుట్టాక చని పోయాడు .కనుక మాకు ఈ బాబాయి గురించి వినటమే కాని మనిషిని నేను చూడ లేదు .ఈయన  భార్యయే నందిగామ యడ వల్లి వారి ఆడ పడుచు మహాలక్ష్మి గారు .ఆ పేరు తో ఎవరు పిలిచే వారు కాదు పాపాయమ్మ అనే వారు .ఆవిడే మా పాపాయి పిన్ని .ఆవిడకు చిన్న మూతి వుండేది .అందుకని బుల్లి మూతి పిన్ని అనే వాళ్ళం .నా అనుబంధం అంతా ఆవిడతోనే .ఆమె ప్రభావం నా మీద ఎక్కువ .ఆ వివ రాలు  తర్వాత తెలియ జేస్తాను ..
                  మా మామ్మ చివరి  చెల్లెలు సౌభాగ్యమ్మ గారు .ఆవిడా మాకు తెలిసిన  దగ్గరనుంచీ వితంతువే .ఆమెను బుల్లి మామ్మ అనటం మాకు అలవాటు .ఆమె ఉయ్యూరు లో సూరి వారి  బజారు లో స్వంత ఇంట్లో వుండేది.సూరి వారి కోడలు . .ఆమె కుమారుడే శ్రీ రామ మూర్తి బాబాయి .ఆయన లీలగా గుర్తున్నాడు నాకు .ఆయన భార్య సరస్వతి ..ఈ పిన్ని కొంత గుర్తుంది .ఈ బాబాయి మా ఇంట్లో నాన్న దగ్గర చదువు కొనే వాడట .భార్యా భర్తలిద్దరూ అమ్మా ,నాన్న అంటే పరమ ఆపేక్ష గా వుండే వారని అమ్మ చెప్పేది .ఆన్నయ్యా అంటూ నాన్నను ,అక్కయ్యా అంటూ అమ్మను మహా ఆపేక్షగా పిలిచే వారు .ఈ బాబాయికి తమ్ముడు లక్ష్మణ స్వామి వెలమ కన్ని వారికి పెంపుడు వెళ్ళాడు .చిన్న తనం లోనే ముగ్గురు పిల్లలు పుట్టింతర్వాత చని పోయాడు ..ఆయన అన్నయ్య ఒకాయన వుండే వాడు పెళ్లి అయి పిల్లలు లేకుండా నే చని పోయాడు .మాకు అసలు పరిచయం లేరు పై ఇద్దరు బాబాయిలు .ఈయన భార్య సీతా రామమ్మ పిన్ని .ఈ విడతో మా కు చాలా అనుబంధం వుంది .మా మామ్మ లంత వైధవ్యం లోనే వుండటం చిన్నతనం నుంచి చూశాం .పాపాయి పిన్ని ,సేఎథ పిన్ని కూడా వైధవ్యం లోనే వుండే వారు .నెత్తి మీద ముసుగు ,తేల్లా సైను బట్టలు .దేవుడు ,పురాణం ,పూజా ,పునస్కారం దేవుడు పాటలతోనే కాలక్షేపం వాళ్లకు .భగవంతుడు వీరందరికీ ఇలా ఎలా రాశాడో అని అనిపించేది
                         పాపాయి పిన్ని అంటే నాకు తగనిఆపేక్ష. a .ఆవిడకు ,నేనంటే వల్లమాలిన మమకారం .స్కూల్ కి వెళ్లేముందు ,స్కూల్ కు వెళ్లి వచ్చిన తరువాత ఆవిడతోనే నాకు కాల క్షేపం .ఆవిడను విడిచి ఒక్క క్షణం వుండే వాణ్ని కాదు .ఆవిడా నా కోసం ఎదురు చూసేది .ఆవిడ నాపై గొప్ప ప్రభావం కల్గించింది .బుల్లి మూతి తో ముద్దు ముద్దు గా మాట్లాడేది .ఆ మాటలు చాలా మధురం గా ఉండేవి .చెవుల మీద ముసుగు తరచుగా సవరించుకోవటం ఇప్పటికీ జ్ఞాపకమే .ఆమెకు ఎన్నో కధలు వచ్చు .మనసు కు నచ్చి నట్లు చెప్పేది .ఆ కధలను నేను మా చిన్నక్కయ్య దుర్గా ,మా తమ్ముడు మోహన్ ఆసక్తి గా వినే వాళ్ళం .చాలా కమ్మగా పాటలు పాడేది .వాళ్ల ఇల్లు ఎప్పుడూ అలికి ముగ్గు వేసి చాలా పరిశుభ్రం గా వుండేది .ఇదంతా పిన్ని చేసేది .మా చిన మామ్మ పరిశుభ్రత చాలా ఎక్కువ .ఇల్లంతా చాలా అందంగా వుంచేది
పాపాయి పిన్నిని బుల్లి మూతి పిన్నీ అని ఒక వేళ అన్నా కోపం వచ్చేది కాదు .నవ్వేది . రోజూ రాత్రి పూట పిన్ని దగ్గర కధలు చెప్పించుకోవటం అలవాటు .ఎన్ని కధలు చెప్పినా చివరికి ”ఆవు పులి ”కధ చెప్పాల్సిందే .అది విన్న తరువాతే నిద్ర .ఆ కధ చిన్నతనం లో నా సహచారి అయింది .బహుశా ఆవు సత్య సంధత మనసు పై గాఢ ముద్ర పడేట్లు పిన్ని చెప్పినందుకే ఆయి వుంటుంది .ఒకసారి కాదు కనీసం రెండు మూడు సార్లైనా నిద్ర పోయే ముందు ఆ కధ చెప్పేది .భారత ,భాగవత ,రామాయణ కధలు ఎన్ని చెప్పినా ఫినిషింగ్ టచ్ ఆవు పులి కధే వుండాలి .అందుకు పాపాయి పిన్నికి నేను ఎంతో రుణ పడి వున్నాను .ఆమె ఋణం తీర్చుకో లేనిది .ఇంకా రుణ గ్రస్తుడినే అనుకుంటాను .ఆమె కు తేలు మంత్రం వచ్చు .ఎవరికి తేలు కుట్టినా పిన్ని దగ్గరకు వచ్చి మంత్రం వేయించుకొనే వాళ్ళు .తక్కున తగ్గేది .దానితో పాత గ్రామ ఫోన్  రికార్డు ముక్కను ఆరగ దీసి ఆ గంధాన్ని కుట్టిన చోట పెట్టేది .నొప్పి తగ్గి నవ్వు కుంటు వెళ్ళే వారు
               ఒక సారి మా మామయ్య గంగయ్య గారింట్లో సావిట్లో తిరుగు తుండగా సాయంత్రం పూట  నాకు ,మా మామయ్య మొదటి భార్య ప్రంటే పెద్దత్తయ్య ప్రకాశమ్మ గారికి ఒకే సారి తేలు కుట్టింది .మా పాపాయి పిన్ని కి తెలిసి పరిగెత్తుకొచ్చి నన్ను చంకన వేసుకొని ఇంటికి తీసుకొని వెళ్లి మంత్రం పెట్టి ,గంధం పూసి ఏడవ కుండా ఉండ టానికి సరదా గా కబుర్లు చెబుతూ ,నన్ను ఊర డించింది .నాకు తగ్గే దాకా ఆమె ప్రాణం విల విల లాడింది మా అత్తయ్యకు మంత్రం పెట్టి సపర్యలు చేసింది ..ఎందుకో నామీద ఆమెకు అంత ఆప్యాయత ?అసలైన పిన్ని అంటే ఏమిటో పాపాయి పిన్ని చూపించింది .నాకు ఆరాధ్య దైవం అయింది .ఆవు,పులి కధ నా నర నరాల్లో జీర్ణించుకు పోయింది .ఎన్ని వందల సార్లు విసుక్కో కుండా చెప్పిందో పిన్ని?అందుకే నేమో నిజం మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం ,మాట్లాడే వారంటే గౌరవం .నూటికి నూరు పాళ్ళు అబద్ధం చెప్పలేదని చెప్పలేను కాని దాదాపు అదొక నియమం గా నే పాటించే ప్రయత్నం చేస్తున్నాను .that is paapaayi pinni .నాకు జీవితం లో దొరికిన వరం పాపాయి పిన్ని .మా అమ్మను ”భవానక్కయ్యా”’.అని చాలా ప్రేమతో పిలిచేది .ప్రతిదానికి ఇంటికి వచ్చిం సహాయం చేసేది .
                కాని ఆవిడ జీవితం సవ్యం గా సాగ లేదు చివర్లో ఒక్క గానొక్క కొడుకు కృష్ణ మూర్తి చెడు అలవాట్లకు బానిసై హింసించాడు పాల్ఘాట్ పిల్లను పెళ్లి చేసు కోని కష్టాలు కోని తెచ్చుకున్నాడు .పాపాయి పిన్ని ఇవన్నేఎ భరించలేక ,అత్త గారు అంటే మా చిన్న మామ్మ చని పోగానే పుట్టిల్లు నంది గామ చేరి తమ్ముడి దగ్గరుండి .అప్పులు పాలైన కొడుకు ఇక్కడి ఇల్లు అమ్ముదామని ప్రయత్నం చేస్తుంటే చాలా రోజులు వారించింది .అయిన కాడికి అమ్మే ప్రయత్నాలు చేస్తూ ఎవరికో అమ్మా లని చూశాడు .పిన్ని మనసు గిల గిల లాడింది .ఆ ఇల్లు ఎవరికో అమ్మటం ఆవిడకు ఇష్టం లేదు .చివరికి ఉయ్యూరు వచ్చి మమ్మల్ని ప్రోత్చ హించింది కొనమని .అప్పటికి మా నాన్న గారు చని పోయారు .మేమంతా చదువుల్లో వున్నాం .కొనే ధైర్యం లేదు .మా మామయ్యను మధ్య వర్తి గా చేసి మాకు అమ్మక పోతే తాను ఆత్మ హత్య చేసుకొంటానని కొడుకును బెది రించింది .వాదినిమేము అన్నయ్యా అని పిలుస్తాం .చాల ప్రేమగా నే వుండే వాడు .భోజనం అదీ మా ఇంట్లోనే .కాని అప్పుల బాధా ,తాగుడు వ్యసనం వాడిని నిలవ నీయ లేదు .మామయ్య నచ్చచెప్పిన తర్వాత ఇల్లు మాకు అమ్మాడు .అప్పుడు మా పాపాయి పిన్ని మనసు శాంతించింది రాత కోత లయిన్తర్వాత నందిగామ వెళ్లి పోయింది .ఇది చాలా విషాద సంఘటన .పగ వారికి కూడా వద్దు అనిపించేది .పాపం పిన్ని ఎంత మానసిక క్షోభానుభావిన్చిందో .’ఆ తర్వాత్ ఆ డబ్బుతో కొడుకు మరీ రెచ్చి పోయాడు .భార్య వదిలేసింది .ఎక్కడో దిక్కులేని చావు చచ్చాడు .మా కుటుంబాలకు కృష్ణ మూర్తి జీవితం ఒక హెచ్చరిక గామిగిలింది . .సవ్య మార్గాన నడ వ టానికి తోడ్పడింది ..మళ్ళీ పిన్నిని చూసి నట్లు గుర్తు లేదు .రాక పోకలు లేవు .పాపం ఆవిడకు ఉయ్యూరు రావటానికి మనస్సు ఎలా ఒప్పు కొంటుంది ?
              పిన్ని చెప్పిన కధ ఏ గ్రంధం లోదో అప్పుడు నాకు తెలియదు .ఫోర్త్ ఫాం చదువుతుండగా ”సత్య వ్రతము ”అనే పేర పాత్యాంశం గా చదివాం .అనంతా మాత్యుని  భోజ రాజీయం లోని కధ .అందులో తల్లి లేని పిల్లాడు ఎంత చులకనో ఒక పద్యం లో గొప్ప గా చెప్పాడు కవి ”చులకన జలరుహ తంతువు ,చులకన ధూళి కణం ,చులకన గడ్డి పరక చులకన తల్లి లేనిసుతుడు   కుమారా ”అని ఆవు తన లేగా దూడకు హితవు చెబుతుంది .సత్యానికి వున్న గొప్ప తనాన్ని వివరిస్తుంది .అనంతా మాత్యుడు మా ఉయ్యూరు కు నాలుగు కిలో మీటర్ల దూరం లో వున్న పెనమ కూరు వాడే అవటం మాకు గర్వ కారణం .పెనమ కూరు లోనే పౌరాణిక నాటకాలలో కృష్ణ పాత్ర వేసే మహానటుడు ,గాయకుడు అబ్బూరి వర ప్రసాద రావు జన్మించాడు .మా చిన్న  తనం లో తోట్ల వల్లూరు లో
శివరాత్రి నాడు శివాలయం లో ఆయన నాటకం చూసే అదృష్టం కల్గింది .ఆయన రాగాలు ఇంకా చెవుల్లో గింగురు మంటున్నాయి .ఫోర్త్ ఫాం లో మాకు ఆ పాఠ్య భాగాన్ని గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారు అనే తెలుగు పండితులు బోధించిన జ్ఞాపకం వుంది .ఆ తర్వాత ద్వా.నా.శాస్త్రి గారితో పరిచయం అయిన తర్వాత మాకు రెండు కిలో మీటర్ల దూరం లో వున్న కనకవల్లి అగ్రహారం లో మారేపల్లి రామచంద్ర శాస్త్రి అనే కవి గారు జన్మించారని ,ఆయనపై తాను పరిశోధన చేశానని ఒక ఉత్తరం లో ఆయన రాశారు .శాస్త్రి గారిని ”కవి గారు ”అనే వారు .వారు విశాఖ పట్నం వెళ్లి తమ కార్య క్రమాలు జోరుగా కొన సాగించారు .గొప్ప సంస్కరణ వాడి .ఆయన గురించి చదివి ఒక పెద్ద కవిత రాసి ఆ తర్వాత ద్వా.నా..గారికి పంపిస్తే చదివి బాగుందని మెచ్చి ఉత్తరం రాశారు .
                  నేను ఉయ్యూరు హై స్కూల్ లో సైన్సు మేస్టార్ గా పని చేసే టప్పుడు స్కూల్ లో 16mm  ప్రొజెక్టర్ తో పిల్లల కోసం విజయ వాడ extention  ofice నుంచి ఉచితం గా రీళ్ళు తెచ్చి వేస్తుందే వాళ్ళం .అందులో పని చేసే ఒక ఆఫీసర్ నాకు బాగా పరిచయం అయారు .ఆయన ఒక సారి నన్ను ”భోజ రాజీయం ”చదివారా ?”అని అడిగారు .చదవ లేదన్నాను .వెంటనే చదవమని  చెప్పారు .కోని చదివాను .ఎంతో నచ్చింది .నన్ను దానిపై వ్యాసాలు రాయ మని కోరారాయన .ఒక సారి ”అనంతామాత్యుడు ”అనే శీర్షికతో వ్యాసం రాశా .అది ”తెలుగు విద్యార్ధి ”లో అచ్చు అయింది .దానికి కొంత రేపైర్ చేసి radio లో
మాట్లాడాను .ఇదంతా మా పాపాయి పిన్ని ఋణం తీర్చుకోవటానికి కొంత ఉపయోగ పడింది .
                   రెండేళ్ళ క్రితం ”సరసభారతి ”ఆధ్వర్యం లో జరిపిన ఒక సభలో నరసరావు పేట నుండి యడ వల్లి మనోరమ అనే తెలుగు లెక్చరర్ ను ఉపన్యాసానికి పిలిచాం .ఆవిడ అది అయింతర్వాత మా ఇంటికి వచ్చింది .మా అమ్మ నాన్న ఫోటోలు చూసింది .ఈ పరిసరాలు తానేప్పుడో చిన్నప్పుడు చూసినట్లు చెప్పింది .వరస పెట్టి తిర గేస్తే ఆవిడ మా పాపాయి పిన్ని మేన కోడలే అని తెలిసింది .ఆ నాటి ఆనందం వర్ణనా తీతం .అప్పటినుంచి తరుచుగా ఫోన్ లో మాట్లాడు కుంటున్నాం .నన్ను నాన్న గారు అనీ ,మా శ్రీమతిని అమ్మ అని పిలవటంమనోరమ  సంస్కారం .ఇలా ఎలా భగ వంతుడు మనుష్య్ల్ని కలుపు తాడో తెలీదు .అంతే కాదు వారం క్రితం మనోరమ ఫోన్ చేసి ”మీ బంధువు మాకాలేజికి ఉపన్యాసం ఇవ్వటానికి వచ్చారు .”అని చెప్పి ఆయన ఫోన్ నంబెర్ ఇస్తే మాట్లాడాను .ఆయన ఏలూరు లోని మా జ్ఞాతి గబ్బిట దక్షిణా మూర్తి గారి మనవడు ,అని కంచిలో ని వెద పాథ శాల లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనీ తెలిసింది .మా కుటుంబం అంతా అతనికి బాగా తెలుసునట /నన్ను ”పెద నాన్న గారు ”అని పలకరిస్తే పులకరించి పోయాను ..ఇదీ ఒక బంధం మనోరమ మహాత్య్మం .
 మా పాపాయి పిన్ని ని ఈ విధం గా మీ అందరికి పరిచయం చేసి నేను కొంత వరకు ధన్యుణ్ణి అయాను .
                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -11 -11 .
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 4 Comments