విశ్వం చాలని కవి సమ్రాట్ విశ్వ నాద

 

                                                 విశ్వం చాలని కవి  సమ్రాట్  విశ్వ నాద 
                   విజయ వాడ లో శ్రీ విశ్వ నాద సత్యనారాయణ గారి సాహిత్య సమాలోచనం ఘంటసాల సంగీతా కళా శాల లో నిన్నటి నుంచి మూడు రోజులు జరుగుతున్న సందర్భం గా చంద్రునికో నూలు పోగు గా ఆయన విశిష్ట రచన కల్పవృక్షం నుండి కొన్ని పద్యాలు మీ కోసం .నాక్కు తెలిసింత వరకు భారతీయ్ సాహిత్యం లో ప్రకృతిని ఒక యజ్ఞం గా భావించి రాసిన కవి విశ్వ నాద ఒక్కడే .ఇది వేదం లోని భావం .దాన్ని తన రచనలో వీలున్నప్పుడల్లా యజ్నభావాన్ని గుర్తు చేస్తూనే ఉంటాడు .అందుకే అందరికంటే ఊహల్లో ,ఆలోచనల్లో ఆయన అందనంత ఎత్తున ఉంటాడు .వన శోభలో ఆ యన దర్శించిన యజ్న విభూతి చూడండి .బాల కాండం లోని పద్యమిది 
                 ”ఎర్రనౌ నేత్రంములిష్టి వేలానల-ధూమ సంతానంబు తూరినట్లు —ఆకులు తినుట దీక్షా కాల భోజన -నియమ తీవ్రత చేత నెగడి నట్లు 
                  చిగురాకు ముక్కున జిమ్ముతి జుహుపుచే -బాత్రాదికంములు పట్టి నట్లు –పంచమ స్వరము స్తోభాలు చక్కగా జాచి –సామ గానంములు సదివి నట్లు 
                 రేకలీకల నలుపు ధరించినట్టి ,-నియమ వస్త్ర మాలిన్యంబు నెరయు నట్లు –సప్త తంతు మహాకార్య సమయమందు –గర్త వోలిక కోకిల గాను పించే .
                     రెండో పద్యం 
             ప్రతి రసాల కుంజంబు బచ్చి పిందెల తోడ -నెల మసలిన కాంత వలె దోచే –ప్రతి నిష్వన ద్బంభరము యజ్న దక్షిణ -కై ఎగు బ్రాహ్మను నట్లు తోచే 
             ప్రతి మల్లె పూవు సవా ప్రేష్ఠ హవిరార్ధ -సుగ్రుహీత లాజల చొప్పు దోచే -ప్రతి చిన్న పూదోట పాలిత దోహద ధూప -మూల యజ్న వాటిక వలెను తోచే 
             మాధవుడు సవా ప్రీతుదంమాట కలిమి -నెల్ల రీతుల సాగింప నేమో యనగా –దాను దద్ధిత రూప మాధవుడు వచ్చే -దీప్త మఖ యోగ్య నిర్వర్షి దిష్ట మొర్తి .
                             మూడవ పద్యం సుందరకాండ లో హనుమ దర్శించిన సీతా సాధ్వి స్వరూపం .సీతా రాములు ఎక్కడ వున్నా అభిన్నులే అనే గొప్ప భావాన్ని పోదిగిన్ పద్యం .ఈ వూహ కూడా ఏ కవికీ రాక పోవటం విశ్వ నాద ప్రజ్న కు పట్టాబ్భి షేకమే .
            ”ఆక్ర్రుతి రామ చంద్రు విరహాక్రుతి ,కన్బొమ తీరు స్వామి చాపాక్రుతి -కన్నులన్ ప్రభు క్రుపాక్రుతి ,కైశిక మందు( శిరోజాలు)రామ దేహాక్రుతి 
             సర్వ దేహమున యందున ,రాఘవ వంశ మౌళి ధర్మాక్రుతి -కూరుచున్న విధమంతయు స్వామి ప్రజ్ఞా మూర్తియై .”
                      అంతటి మహాను భావుని గురించి స్వర్గీయ కేతవరపు రామ కోటి శాస్త్రి గారి కైమోడ్పు –ఇందులో భావం –విశ్వ నాద సాహిత్య స్నానమే ముక్తి కంటే ముందు తాను కోరుకుంటాను అని చెప్పటమే .మోక్షం కన్నా విశ్వ నాద రచనలే శ్రేష్టం అనే గొప్ప భావన శాస్త్రి గారిది . 
                 ”పోరపాటై జనియిన్చితిన్ ప్రభూ -సరే పోనీ -మరీ జన్మకున్ 
                  పరమోపజ్న నిధాన ,దివ్య దిషనా భ్రాజిష్ణువౌ ,విశ్వ నా 
                  ద ,రసోదంచిత ,సాహితీ విమల తీర్ది ,స్నాన పూతాత్మా గా 
                   కరునిమ్పం దగు  ,ముక్తిమాట  అటుపై కాశ్మీర నేత్రచ్చవీ .
                                      11 .11 .11 శుభాకాంక్షలతో —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ .
Posted in కవితలు | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు —1

   ఊసుల్లో ఉయ్యూరు —1
                                                       అమ్మ బోణీ -నాన్న కాణీ
                 మనవి -నాచిన్న తనం   లోను ,ఆ తర్వాత నాకు గుర్తున్న విషయాలను ”ఊసుల్లో ఉయ్యూరు ”శీర్షికన రాస్తున్నాను .ఇవన్నీ యదార్ధ సంఘటనలే .ఎక్కడైనా కధనం కోసం కొంచెం మిర్చి ,మసాలాదట్టించ వలసి రావచ్చు .అంతమాత్రం తో అతిశయోక్తులు కావు .ఇవన్నీ ,ఆనాటి అనుబంధాలకు ,ఆత్మీయతలకు ,అభిరుచులకు ,ఆనవాళ్ళు .ఇందులో మా కుటుంబానికి సంబంధించినవీ ,మా కుటుంబం తో ఉయ్యూరు గ్రామ ప్ప్రజలకు ,వారితో మాకు వున్న సంబంధ విషయాలు వుంటాయి .ఇవన్నీ చూసిన నాకు అనిపించిన భావాలు ,అందులోంచి నేను తీలుసుకొన్న జీవిత సత్యాలు ,అవి నా జీవితానికి ఉపయోగ పడిన రీతులు కూడా ఉండ వచ్చు .ఇదంతా ఒక మధ్య తరగతి కుటుంబ జీవితమే .అర్ధాలు ,అపార్ధాలు నొప్పించ టాలు ,నొప్పిమ్పబదతాలు ,సంతోషాలు ,ఒకటేమిటీ ఎన్నో emotions  కలగలిపి వుంటాయి .ఈ వయసు (72 ) ,లో అవి గుర్తుండటం కొంత కష్టమే కాని ప్రయత్నం చేస్తాను .ఇవి ఒక వరుస క్రమం లో జరిగిన సంఘటనలు కానక్కర లేదు .జ్న్కాపకమ్  వచ్చినవి రాయటమే పనిగా  పెట్టు కోని రాస్తున్నవి .ముందు రాసి పెట్టుకున్నవి అసలే కాదు .కంప్యుటర్ ముందు కూచుని అప్పటికప్పుడు రాస్తున్నవి . ,ఇందులో జన జీవితం ప్రతిబిమ్బిస్తుందనే భావమే నన్ను ఈ సాహసానికి పురికొల్పింది .హాస్యం vandi  వడ్డించ టానికో ,వ్యంగ్య వైభవం ప్రదర్శించ టానికో కాదు .అసలు విషయాన్ని కొంతైనా అందం గా చెప్పాలనే తాపత్రయం .ఈ కార్తీక పౌర్ణమి మహా పర్వ దినాన నా ఊసులు మీతో పంచుకోవటం కోసం ప్రారంభిస్తున్నాను .అవును అసలుహెడ్డింగ్ ఒకటి పెట్టి ఈ  శాఖా చంక్రమణం ఏమిటి ?అని విసుగోచ్చిందా -సరే బోణీ లోకి కాణీ లోకి ప్రవేశిస్తున్నాను .
                 మా చిన్నప్పుడు మా ఉయ్యూరు లో కూర గాయలు పెద్దగా అమ్మ కానికి వచ్చేవి కావు .దాదాపు ప్రతి ఇంట్లో పెరడు వుండేది .అందులో సొర బీర ,కాకర ,చిక్కుడు ,తోటకూర గోంగూర వగైరాలు పండించే వాళ్ళు . .ఎక్కువ గా కాస్తే ఇరుగింటి వాళ్లకు పొరుగింటి వాళ్లకు ఇస్తుండే వారు .అమ్మటం తెలీదు .ఒక రకం ఇచ్చి పుచ్చు కోవటం లాంటిది .అయితే కొయ్య తోట కూర చాలా రుచిగా వుండేది .కొంచెం ఎరుపు దౌలితో మహారుచికరం గా వుండేది .దాని నెవరు ఇళ్ళల్లో పండించటం నాకు తెలియదు .మావూరికి రెండు కిలో మీటర్ల దూరం లో చిన వోగిరాల ,కూరలకు తమల పాకు తోటలకు ,అరటి కంద పెండలం కు ప్రసిద్ధి .అక్కడి నుంచి కోటయ్య అనే ఎర్రటి ఆయన కావడిలో కొయ్య తోట కూర తెచ్చి అమ్మే వాడు .నవ నవ లాడుతూ వుండేది .అప్పుడు డబ్బులకంటే వడ్లు ,బియ్యం ఇచ్చి కొనుక్కోవటం ఎక్కువ గా వుండేది .కోటయ్య కు బొర్ర బాగా వుండేది బుర్ర కాదు బాబు బొర్రా .చొక్కా వేసుకొనే వాడు కాదు .దానితో బొర్రా బాగా కని పించేది నీరుకావి పంచ కట్టే వాడు .తోటకూర రంగు అదీ ఒకటి గా నే ఉండేవి .ఆయనా ఎరుపే కదా .ఒగిరాల నుంచి రావటం రావటం ఇంక ఎవరి ఇంటికీ వెళ్ళ కుండా మా ఇంటికే వచ్చే వాడు .అప్పటికే వాకిళ్ళలో మా పాలేళ్ళు పెడ కల్లాపి జల్లి ముగ్గులు వేసే వారు .వాకిళ్ళు లక్ష్మి కళతో కల కల లాడేవి .ఆ పెడ వాసన ఒక రకం గా గమ్మత్తు గా వుండేది .ఆవు పెడ మరీ ఆరోగ్యకరం .వాకిలి నిండా ముగ్గులే .ఆపసోపాలు పడుతూ ,కిర్రు చెప్పుల మోతతో వాకిట్లో కావిడి దించే వాడు కోటయ్య .”అమ్మ గారు .అమ్మ గారు ”అని పిలిచే వాడు మా అమ్మగారిని .ఆవిడ ఏ పనిలో వున్నా విడిచి వాకిట్లోకి రావాల్సిందే .మా దొడ్డి చాలా పెద్దది .ఆవిడ అక్కడ వుంటే వినిపించేది కాదు .మేమేవరమైన విని పిలుచుకోచ్చే వాళ్ళం .. ,
                 అమ్మ బేరం చేసేది .కోటయ్య కొంత తగ్గే వాడు .తప్పని సారిగా అమ్మ కొనాలి డబ్బు ఇవ్వాలి .ఆ తర్వాతే ఊళ్లోకి వెళ్ళటం .అంటే మొట్ట మొదటగా అమ్మ కొంటె అతనికి అమ్మకం బాగా జరుగుతుందని నమ్మకం .దీన్నే బోణీ చేయటం అంటారు .అమ్మ కావాల్సింది కొని డబ్బులో వడ్లో మాతో ఎంత ఇవ్వాలో చెప్పేది .అది డబ్బు అయితే నాన్నను అడిగి ధాన్యం అయితే కొట్లోంచి తీసి ఇచ్చే వాళ్ళం .రోజూ అతను ఇలా వస్తూనే వుండే వాడు .మరి రోజూ కొనం కదా.అయినా తప్పదు .కొనక పోయినా కావడి మీద మా అమ్మ చెయ్యి వేస్తె చాలు అని చెప్పి కావడిని తాకించి ఇంకో ఇంటికి వెళ్ళే వాడు కోటయ్య .గల గలా నవ్వే వాడు ఇప్పటికీ అతని నవ్వు నాకు జ్ఞాపకమే ..ఆ తర్వాత కూడా మా నాన్న గారు చని పోయిన తర్వాత కూడా మా అమ్మ విధవ రాలు అనే సంకోచం లేకుండా వచ్చి బోణీ చేయించుకోవటం అతని నమ్మకానికి ,విశాల భావానికి గుర్తు .కొయ్య తోటకూర అంటే కోటయ్య అప్పుడే కాదు ఎప్పుడు గుర్తొస్తాడు నాకు .అదో అనుబంధం
                         ఆ రోజుల్లో వేసవి వస్తే కూర గాయాలు దొరికేవి కావు .అందుకనిముందు  గానే బుడం దోస కాయ ఒరుగులు ,నక్క దోస కాయ ఒరుగులు తయారు చేసుకొని దాచుకోవటం చేసే వాళ్ళు .జగ్గయ్య పేట నుంచి దోస కాయలు లారీల్లో వచ్చేవి .సెంటర్ లో లారీ దింపి కుప్ప పోసే వారు .కావాల్సిన వాళ్ళు కొనుక్కొని దాచుకొనే వారు .దాదాపు ఆ దోస కాయలు రెండు నెలల వరకు నిలవ ఉండేవి .అప్పుడు మందుల వాడకం లేదు కదా.కందా ,పెండలాలను మణుగులకు మణుగులు కోని మంచాల కింద ,బోషానాల పైన దాచుకొనే వాళ్ళం .పరశు రామయ్య అనే అతను ,పంచె ,చొక్కా ,తలపాగా చుట్టూ కోని చిన ఒగిరాలనుంచి ఈ రెండిటినీ తెచ్చి అమ్మే వాడు .ఆయన కూడా మా ఇంట్లో కొన్న తర్వాతే మిగతా ఇళ్ళకు వెళ్ళే వాడు .చాలా నిదానస్తుడు .నవ్వుతు మాట్లాడే వాడు .పెద్దగా బేరం వుండేది కాదు .కోటయ్య ,పరశురామయ్య ఇద్దరు కమ్మ వారే .అయినా భేషజాలు ఆనాడు లేవు .వాళ్ళు అమ్ముతున్నారని ,మనం కొంటున్నామని వుండేది కాదు .అదో ఆత్మీయ పరామర్శ.అని పించేది .మా అమ్మ తరం అయింతర్వాత ,నా తరం లో కూడా అలాగే మా ఇంటికి బోణీ బేరానికి వచ్చే వారు .ఇక్కడ మనుషులుమాత్రమే కాదు ,ఆ ఇంటి మీదా అంత నమ్మకం అన్న మాట .ప్రతివేసవి లోను ఎన్నో మణుగులు కందా పెండలం కోని దాచే వాళ్ళం .వేసవి లో అవే దిక్కు .కంద ఉడికించి నిమ్మ కాయ తో కూర వండితే బహురుచి గా వుండేది .కంద వేపుడు రాత్రిళ్ళు చేసే వారు .పెండలం వేపుడు అదుర్సే .పెండలాన్ని ఉడికించి కర్వేపాకు వగైరాలు వేసి కూర చేస్తే అద్భుతం .మా అమ్మ కూరలు వండటం లో మహా నేర్పరి .అమ్మ వంట తింటే ఇంకో వంట నచ్చేది కాదు .ఈ నాటి బంగాళా దుమ్పకు ఆనాడు అవి సాటి .ఇలా అమ్మ చేతి బోణీ కాయకూరల అమ్మకం దార్లకు లాభసాటి అనే గొప్ప నమ్మకం కల్గించింది
                       మా నాన్న గారు వెద ,శాస్త్రాలు క్షుణ్ణం గా అధ్యనం చేసిన మహా పండితులు .పిలక జుట్టు ,నుదుట విభూతి రేఖలు పంచ లాల్చీ ఖండువా తో అపర పరమేశ్వరులు గా వుండే వారు .తెలుగు విద్వాన్ చేశారు .ఈ జిల్లాలోనే గొప్ప తెలుగు పండితులని చెప్పుకొనే వారు .నాన్న గారి పేరు మృత్యుంజయ శాస్త్రి .అమ్మ పేరు భవానమ్మ  .పార్వతీ పరమేశ్వరుల పేర్లు .అచ్చం గా అలాగే వుండే వారు .అమ్మ దబ్బపండు ఛాయా.నాన్న బంగారు వర్ణం .అన్యోన్య దాంపత్యం .ఆ రోజుల్లో వెద పండితు లుసంవత్చారానికి  ఒకసారి ఉయ్యూరు వచ్చి బ్రాహ్మణుల ఇళ్ళ కు  వార్షికం గా సంభావన తీసుకొనే వారు .బెజవాడ లో వేద సభలు జరిగేవి .అవి అయిన తర్వాత వచ్చే వారు . .వాళ్ల భోజనం మా ఇంటి ప్రక్కనే వున్న మా మేన మామ గుండు గంగయ్య గారింట్లో .మడి తో మా అత్తయ్య మహాలక్ష్మమ్మ గారు వంటచేసిపెట్టేది  .అక్కడ ఎక్కువైతే మా ఇంటికీ భోజనానికి వచ్చే వారు కొందరు .అప్పటికి ఇంకా మా ఇంట్లోను మడి వంటలే ..మా మయ్య గారి వాకిట్లో కొందరు ,మా వసారా లో కొందరు రాత్రిళ్ళు పడుకొనే వారు .ఉదయమే లేచి సంధ్యా వందనం ,జపతపాలు పూర్తి చేసుకొని సంభావన కోసం బయల్దేరే వాళ్ళు .వాళ్ళు ముందుగా మా ఇంటికి వచ్చి ఆశీర్వచన పనస చదివే వారు .నాన్న గారికి వారి విద్వత్తు ఏమిటో తెలుసు .వారి స్థాయిని బట్టి తాంబూలం లో డబ్బు పెట్టి నమస్కరించి ఇచ్చే వారు .ఆ తర్వాతే ఊళ్ళోకి వెళ్ళే వారు .భోజనం మామయ్య గారింట్లో బోణీ మాయింట్లో నాన్న గారి చేతితో .ఆయన ఒక కాణీ ఇచ్చినా చాలు మాకు ఊళ్ళో మంచి ఆదరణ లభిస్తుంది అనే వారు .నాన్న గారికి వారి తాహతు తెలుసు కనుక ,దాన్ని బట్టే ఇస్తారు కనుక ఎవరు అసంతృప్తి పడే వారుకాదు . ‘అలాగీ కూచి పూడి  నుంచి కూడా భాగవతులు వచ్చే వారు .వారూ అంతే .భోజనాలు మామయ్య గారింట్లో బోణీ మా ఇంట్లో  .వారు దశావ తార కీర్తనలు పాడిఆశీర్వదించే వారు .కొందరు గొంతెత్తి అద్భతం గా పాడి ఆడే వారు కూడా .చేతిలో తాళాలు ఉండేవి  .వారి సామర్ధ్యము నాన్న కు తెలుసు  కనుక వారి నేర్పును బట్టి తాంబూలం ఇచ్చే వారు .ఇదంతా ,చిన్నప్పటి నుంచి నేను బాగా గమనిస్తుందే వాడిని
                       1961 లో నాన్న గారి మరణం తర్వాత అమ్మ ఈ విషయాలు చూసేది .ఆమెకు వారి తాహతు తెలుసు కనుక తగినట్లుగా ఇచ్చేది .ఆ తర్వాత నాతొ కూడా అలానే చేయించేది .ఆవిడ చెప్పినట్లే చేసే వాడిని నాకు వారి విషయం ఆవ గాహన కాక ముందు ..ఒక వేల ఎప్పుడైనా ఎక్కువ తక్కువలు ఇస్తే నాకు క్లాస్ పీకేది అమ్మ .మనుషులను అంచనా వేయటం  లో నాన్న ,అమ్మలు దిట్టలు .అలాగీ చాలా కాలమ్ జరిగి పోయింది .ఇప్పుడు సుమారు పది ఏళ్ళ నుంచి ,వెద పండితులు రావటం లేదు .కూచిపూడి భాగవతులు రావటం లేదు .రాక పోవటం వెలితి గానే వుంది .కారణం వారి వేద ,కళా ఆశీర్వచనాలు లభ్యం కాక పోవటమే .ఇదీ బోణీ కాణీ కధ .
                                                           మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 6 Comments

ముదిమిలోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —3

 ముదిమిలోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —3
                                                                డిగ్రీ చదువు 
                   గుంటూరు ఏ.సి .కాలేజి లో రావు గారు బి.ఏ. లో చేరారు .అప్పుడే బాపిరాజు గారు కూడా మీజాన్ వదిలిగుంటూరు   చేరుకున్నారు .మళ్ళీ గురుశిష్య సంబంధం గట్టి పడింది .అప్పుడే విజయంవాడ లో ఆకాశవాణి కేంద్రం మొదలైంది .బాపిరాజు దానికి సలహాదారు అయారు .గుంటూరు లో ”కళా పీఠం ”ఏర్పరచి ,చిత్రలేఖనం లో బాపిరాజు శిక్షణ ఇచ్చే వారు .యువకులైన వెంకటేశ్వర రావు వంటి వారి సాయం తో గొప్ప చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు .ఆ సమయం లో బి.ఎస్ .కృష్ణ ”కాంగ్రెస్ ”పత్రిక నడిపే వారు .”ఆంధ్రా రిపబ్లిక్ ”పత్రిక కూడా వస్తుండేది .రాజ్యం సిన్హా మద్రాస్ నుంచి ”మాతృభూమి ”మాస పత్రికను నడిపే వారు .ఆమె ముదునూరు కాంగ్రెస్ నాయకులు అన్నే  అంజయ్య గారి అన్న కుమార్తె .శాంతినికేతన్ విద్యార్ధిని .ఆమె భర్త విజయకుమార్ సిన్హా ” The Times of India ” లో ఎడిటింగ్ సెక్షన్ లో పని చేసే వారు .ఆయన విప్లవ వీరుడు ,అకలంక దేశభక్తుడు అయిన షహీద్ భగత్ సింగ్ అనుచరుడు .భగత్ సింగ్ ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసిన తరువాత సిన్హా గారిని మైనర్ అయినందు వల్ల  అండమాన్ దీవులకు పంపిందిప్రభుత్వం  .ఆయన అక్కడ జైలర్లకు ఒక విద్యాలయం ఏర్పాటు చేసి ,దేశ స్వాతంత్ర్యం అవసరాన్ని జాతీయ , పోరాటచరిత్ర  మున్నగు విషయాలను ప్రభావం చేస్తూ ప్రసంగించే వారు .తన అండమాన్ జీవితాన్ని గురించి ”,The Andamaan’s –The Indian Bastille ”. అనే గ్రంధం రాశారు .ఫ్రెంచ్ విప్లవం లో bastille జైలు కు వున్న ప్రాముఖ్యత అందరికి తెలిసిందే .సిన్హా జీవితం రావు గారిపై మంచి ప్రభావాన్ని చూపింది .  .
                    ఎకనామిక్స్ అసోసియేషన్ కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి విజయవాడ బాచ్ కు ,గుంటూరు బాచ్ కు పోటీ తీవ్రం గా వుంది .యెన్.టి .రామా రావు విజయవా డబాచ్   తరఫున వైస్ ప్రెసిడెంట్ గా పోటి చేశాడు .రావు గారిని తన పానెల్ ఎన్నికయేట్లు సహాయం చేయమని అడిగారు .గుంటూరు మిత్రులు అడ్డుకున్నారు .ఇద్దరికీ రాజీ మార్గంగా అందరితో మాట్లాడి రామా రావు ను వైస్ ప్రెసిడెంట్ గా ,కార్యవర్గం గుంటూరు వారికి ఇచ్చేట్లు రావు గారు ఒప్పందం కుదిర్చి ఘర్షణ నివారించారు .అందరు హాపీ .కాలేజి గ్రంధాలయాన్ని సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంచుకొన్నారు .పబ్లిక్ ఫైనాన్స్ డెమోక్రసీ చదివి ,దేశాన్ని ఆర్ధికం గా అభివృద్ధి చేసే విషయాలు తెలుసుకున్నారు .నెలకోసారి ”చర్చా సమావేశాలు ”జరిపే వారు .చర్చ రోజున రావు గారు ఖద్దర్ పైజమా ,చొక్కా ధరించే వారు .వారు అది ధరిస్తే ఆనాడు చర్చ ఉన్నట్లే లెక్క .రామా రావు ,జగ్గయ్య ,వల్లభ జోశ్యుల శివ రాం కాలేజీ లో నాటకాలు దర్శకత్వం చేస్తూ ఆడే వారు .రావు గారు కాలేజి మాగజైనును ఎడిటర్ గా వుండి నడి పెవారు .డిగ్రీ పూర్తి అవగానే ఉద్యోగాల వేట లో పడ్డారు .దేనిలోనూ ఎక్కువ కాలమ్ పని చేయ లేదు .
                                                ఉద్యోగ పర్వం 
                   గుంటూరు జిల్లా అమరావతి లో 1950 లో సోషల్ టీచర్ గా చేరారు అందరికంటే చిన్న ఆయనే.1950 ఆగస్ట్ 10 న తండ్రి గారు ముదునూరు లో ”జీవ ప్రాయశ్చిత్తం ”చేసుకొని స్వచ్చంద మరణం పొందారు .ఇక్కడ దీని గురించి వివరిస్తాను .మరణం ఆసన్నం అయింది తెలియగానే వెద పండితుల్ని పిలిపించి ”జీవ ప్రాయస్చ్ట్టం ”చేసు కోవటం విజ్ఞులకు అలవాటు గా వుండేది .దాదాపు ఆరు గంటలు వేదోచ్చారనతో జరుగు తుంది .అలా చేస్తే తెలిసి చేసినవి,తెలియక చేసినవి పాపాలన్నీ నశిస్తాయని నమ్మకం .అంతే కాదు ఆ కార్య క్రమం అయి పోగానే యజమాని అనాయాసం గా మరణిస్తాడు .వీరి తండ్రి గారు కూడా ఆ రకం గాప్రాయశ్చిత్తం   చేసుకొని తీర్ధం తీసుకున్న వెంటనే మరణించారు .అదీ ”జీవ ప్రాయశ్చిత్తం ”మహాత్మ్యం .రావు గారి అన్న గారు శేషగిరి రావు కుటుంబ బాధ్యత స్వీకరించారు .”శాంతి నిలయం ”అనే ప్రైవేటు స్కూల్ నడపటం ప్రారంభించారు .
                   అమరావతి హై స్కూల్ లో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రావు గారికి సహ ఉపాధ్యాడు .ఆయన హిందీ పండిట్ .పాతశాలకు వచ్చే పత్రికలను విద్యార్ధులు చదివే ఏర్పాటు రావు గారు చేశారు .వీరి ప్రోత్చాహం చూసి చుట్టూ పరకాల గ్రామాల విద్యార్ధులు ఇక్కడికి వచ్చి ,పాథశాల గ్రంధాలయాన్ని ఉపయోగించుకొనే వారు .రావు గార్తో [పరిసర గ్రామాలలో గ్రంధాలయాలను రావు గారితో స్థాపింప జేశే వారు .శిష్యులతో కలిసి గ్రంధాలయం   ఉద్యమాన్ని హరికధలు ,బుర్ర కధల ద్వారా వ్యాపింప జేశారు .విద్యార్ధుల విజ్ఞానాభి వృద్ధి కి ”విజ్ఞాన యాత్ర ”లకు తీసుకొని వెళ్ళేవారు .ఇటువంటివి ఆకాలాల్లో   ఏ స్కూల్ లోను జరిగేవి కావు .రావు గారి ముందు చూపు వల్లనే ఇక్కడ సాధ్యమైంది .”అమర జ్యోతి ”అనే పాథశాల పత్రిక ను కరుణశ్రీ తో కలిపి నిర్వహించారు . కరుణశ్రీ కి   మసూచి సోకితే ,నిర్భయం గా ఆయనకు సేవ చేసి నయం ఆయె దాకా కని పెట్టి వున్న మంచి మిత్రుడు రావు గారు .A friend in need is a friend indeed ”అన్నది అక్షరాల పాటించి చూపిన నిజమైన స్నేహితుడు రావు గారు .
                     1951 లో కృష్ణా జిల్లా కాటూరు హై స్కూల్ లో సోషల్ టీచర్ గా చేరారు .ఆ ఊరిని   మాస్కో అఫ్ ఆంధ్ర అంటారు .దగ్గరలోనే వున్న స్వగ్రామం   ముదునూరు లో అన్నయ్య తో కలిసి ”వయోజన విద్యా కార్య క్రమాలు ”ప్రారంభించారు .దగ్గరలోనే వున్న బొల్లపాడు లో వయోజన విద్యా తరగతులు ఏర్పాటు చేశారు .ఇక్కడే గ్రంధాలయాన్ని స్థాపించారు .కాటూరు లో ప్రఖ్యాత కవి కాటూరి వెంకటేశ్వర రావు గారి అభ్యర్ధన పై వారింట్లోనేలోనే కాపురం వున్నారు .ఆవూరు లో వున్న’ సూరి స్కూల్ ‘లో సాయంత్ర వేళల్లో పిల్లల కార్య క్రమాలు మొదలు పెట్టారు .రాత్రి తరగతులు నిర్వహించారు .రాత్రి తొమ్మిది గంటలకు మహాకవి గురజాడ రచించిన ”దేశమును ప్రేమించుమన్నా ”అనే ప్రబోధ గీతం తో కార్య క్రమాలు ప్రారంభమై రాత్రి పదకొండు గంటలకు ”జన గణ మన ”తో పూర్తి అయేవి .పశువులకు వచ్చే అంటు వ్యాధులను గురించి slides వేసి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియ జేసే వారు .వయోజనులకోసం ”బుర్ర కధ దళం ”,”నాటక శాఖ ”ఏర్పాటు చేశారు .వీరి సాంఘిక కలాపాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభించింది చర్చా గోష్టులు జరిపే వారు .మోడల్ పార్లమెంట్ నిర్వహించే వారు .అందు లో సాంఘిక సమశ్యలపై ప్రత్యక్ష అనుభవం కల్గించే వారు రావు గారు .ఇవన్నీ  వారి బుద్ధి లో జన్మించిన అభ్యుదయ భావ పరంపరలే .అంత దూర దృష్టి వారిది .మళ్ళీ ఉదయం స్కూలు ,పాఠాలు యధాప్రకారమే .దానికీ ,దీనికీ వైరుధ్యం లేకుండా ,రెండిటిని సమర్ధ వంతం గా నిర్వహించటం కార్య శూరు లైన రావు గారికే సాధ్యం అని పించేవి .ఆ రోజుల్లో కరుణ శ్రీ నిర్వహించే ”శుభాషిని ‘పత్రిక లో మహిళా కార్య క్రమాలు చూసే వారు .”;;గొప్పవారి భార్యలు ”శీర్షికలో ప్రముఖులైన వారి సతీమణులు చేసిన ,చేస్తున్న ప్రజా సేవను గురించి రాసే వారు .radio లో రావు గారు ప్రముఖ రష్యా  కమ్యునిస్ట్ నేత లెనిన్ పై ప్రసంగించారు .
                      1952 -53 -లో గుంటూరు బి ,యిడి ,లో చేరారు .అప్పుడే హై స్కూల్ విద్యార్ధుల కోసం ”హై స్కూల్ గ్రామర్ రాశారు .1953 లో ముదునూరు హై   స్కూల్ లో బి.యిడి . టీచర్ గా చేరారు ”శాంతి నిలయం ”పాథ శాల” మధుకరి” వ్రాత పత్రిక రావు గారి ఆద్వర్యం లో వచ్చింది .”శేఖర్ విద్యాలయం ”,శేఖర్ గ్రంధాలయం ”ఏర్పాటు చేశారు .పత్రికా రచనలో శిక్షణ నిచ్చారు .slides తయారు చేయటం నేర్పించారు .1953 నుంచి ముదునూరు లో పిల్లల కోసం ”బాల రాజ్యం ”,యువకులకు”సాంస్కృతిక కార్య క్రమ శాఖ” ఏర్పరచారు .మహిళ ల కోసం ”మహిళా శాఖ” నిర్వహించారు .చేతి పనుల శాఖ కూడా దిగ్విజం గా చేబట్టారు .ఇంటిముందున్న విశాలమైన హాల్ లో పిల్లలకు ,పెద్దవారికి విడి విడి గా గ్రంధాలయాలు ఏర్పాటు చేశారు .ఆదివారాల్లో జేబురుమాలలు ,దిండు గలీబులు మహిళల చేత తయారు చేయించే వారు .వీటిని హైమవతి గారు పర్య వేక్షించే వారు .’ఈ విధం గా విభిన్న మైన కార్యక్రమాలు ప్రజలందరి కోసం చేబట్టిన గొప్ప ఆలోచనా పరుడు రావు గారు .ఒక రకం గా ముదునూరు గ్రామం వారికి ఎంతో రుణ పడి వుంది .దాని అభివృద్ధి లో ప్రతి అంగుళం లోను ఆయనకు భాగస్వామ్యం వుంది.ఆయన సేవలు నిరుపమానం .లెక్కకు మిక్కిలివి .వీటికి తోడు కుట్టు పని వయోలిన్ లో శిక్షణ ఇప్పించారు 
                                                 సశేషం 
                                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -11 -11 .
సెప్టెంబర్ 27 న జరిగిన సన్మానం
http://wp.me/p1jQnd-rh
Posted in మహానుభావులు, రచనలు | Leave a comment

ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –2

        ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –2
                                                                   విద్యార్ధి దశ
మేము చేసిన సన్మానం
                శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు గారు తమ జీవిత చరిత్ర ను ”మహాత్ముల బాట లో ”అన్న పేర రాశారు .  .ఇక్కడే కనపడు తుంది ఆయన ఆదర్శం ఏమిటో ,వినయ భంగిమ ఏమిటో .ఈ పుస్తకం ఆధారం గానే నా రచన సాగుతుంది .విద్యార్ధిగా ,యువకునిగా ,ఉపాధ్యాయునిగా ,అధ్యాపకునిగా ,విశ్రాంత జీవిగా ,ఆయన జీవించిన ,జీవిస్తున్న ,విధానం ,ఆ యా దశల్లో చేసిన సాహిత్య సేవ ,నడిపిన పత్రికలు ,సమాజ సేవ అన్నీ వివరంగా విన్న విస్తాను .                                             కృష్ణా జిల్లా ముదునూరు లో జన్మించిన వెంకటేశ్వర రావు గారు ,చిన్న  తనం లోనే ,వాళ్ల స్వగ్రామం లో మహాత్మా గాంధి జీ ని చూచే మహద్భాగ్యం పొందారు .ఆయన ప్రభావం బాగా పని చేసింది .అప్పటినుంచే అస్పృశ్యతను ఏవగించుకున్నారు .హరిజనోద్ధరణ చేయాలని సంకల్పించారు .ప్రైవేటు స్కూల్ లోనే ప్రాధమిక విద్య పూర్తి చేసి,బందరు లో శ్రీ రామా హై స్కూల్ లో చేరారు .ఆనాటి ఉపాధ్యాయులంతా క్రమ శిక్షణకు మారు పేరు గా వుండే వారు .స్కూల్ లోనే విద్యార్ధులకు పాఠాలన్నీ వచ్చే టట్లు బోధించే వారు .ఇంటి వద్ద విద్యార్ధికి ఇంకా ఏమి పని వుండేది కాదు .ఆ విధానం రావు గారిని బాగా  ఆకర్షించింది .మునిమాణిక్యం నరసింహా రావు హిస్టరీ మేష్టారు .1937 లో శ్రీమతి సరోజినీ నాయుడు బందరు విచ్చేశారు .ఆమె ఉపన్యాసం విని ఉప్పొంగి పోయి గొప్ప ప్రేరణ పొందారు .ఆమె వాగ్దోరని ,ప్రసన్న హృదయం నచ్చింది .
                  రావు గారి తల్లి గారు చేసే రామ నామం ఆయనకు చాలా ఇష్టం .తండ్రి  గారు ఆదిత్య హృదయం నేర్పారు .మొదటిది ముక్తికి ,రెండోది ఆరోగ్యానికి అవసర మైనవి .చిన్నప్పటి నుంచి జేబు లో పాకెట్ నోట్ బుక్ వుండేది .గమనించిన ముఖ్య విషయాలు అందులోవెంటనే   రాసు కొనే వారు అది వారికి ఎన్నో రచనలు చేయటానికి దోహదం చేసింది ..మునిపల్లె రామా రావు గారి ద్వారా కమ్యునిస్ట్ పార్టి కి దగ్గరయారు .పార్టి వీరికి కొన్ని కార్య క్రమాలు అప్పగించింది .పోలీసులు వెంట బడితే కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకొనే వారు .మినర్వా టాకీస్ లో ఒక సారి కర పత్రాలను పంచి ,అందకుండా పారి పోయారు ..poleesula     పోలీsula   interogation  ఇన్  లో ఆకుకు అందాకా ,పోకకు పొందక సమాధానాలు చెప్పి ,హెడ్ మాస్టర్ గారి అభిమానం తో బయట పడ్డారు .క్రమం గా పార్టీ కార్య క్రమాలకు దూరమై ,చాడువుమ్మీద శ్రద్ధ పెట్టి ,సాంస్కృతిక కార్య క్రమాలకే పరిమితమయారు .
                ప్రముఖ నాస్తిక ప్రచారకులు గోపరాజు రామ చంద్ర రావు (గోరా)గారు ముదునూరు లో ”వయోజన పాథ   శాల” స్థాపించారు .ఆయనే ప్రిన్సిపాల్ .అయ్యదేవర కాలేశ్వర రావు పంతులు ,త్రిపురనేని రామస్వామి చౌదరి ,దుర్గాబాయి దేశముఖ్ ,టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన హేమా హేమీలంత వచ్చి అక్కడజాతీయ ,అంతర్జాతీయ ,సాంఘిక విషయాలపై ప్రసంగిస్తూ అభిరుచి కలిగించే వారు .మేజిక్ లాంటేర్న్ తో slide  లు  వేస్తూమాగంటి బాపినీడు  పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించే వారు .ఇవన్నీ రావు గారు దగ్గరుండి క్షుణ్ణం గా గమనించేవారు .మనసు లో ఏవేవో ఊహలు మేదిలేవి మెట్రిక్ పరీక్షలకు శిక్షణ కూడా ఇచ్చే వారు .అయితే వీటి మీద కంటే నాస్తిక ప్రచారానికి గోరా ఎక్కువ ప్రాముఖ్యత నివ్వటం తో క్రమంగా ఆకర్షణ తగ్గి పోయింది .ఆవు మాంసం పంది   మాంసం లతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసే వారు గోరా .ఇవి జనానికి రోత పుట్టించాయి .ప్రజలు నాస్తిక కేంద్రం అంటే మండి  పడే వారు .అ వూరి రైతు పెద్ద ,కాంగ్రెస్ నాయకుడు సశ్రీ అనే అంజయ్య గారు కూడా అసహ్యించుకొనే స్థితిని తెచ్చుకోనారు గోరా .ఇక” గో–రా ”అని పించికోకుండా నెమ్మదిగా ఆ వూరు వదిలేశారు .
రావు గారు ఆ కేంద్రం లో వున్న లైబ్రరీ పుస్తకాలు చదివి విజ్ఞానం పొందారు .గోరాతో సరదాగా మాట్లాడే వారు .”దారి తప్పిన ప్రయాణీకుడు గోరా ”అంటారు రావు గారు గోరాను .ఎప్పుడు ఏదో ఒక జబ్బుతో బాధ పడే వారు .అందుకని చాల సున్నితం గా కన పడే వారు .దీని వల్ల ఉపాధ్యాయులు ఆయన్ను” జపాన్ toy ”అని  పిలిచే  వారు ఆనాటిహెడ్మాస్టర్   పోక్కునూరి వెంకట రత్నం ,ఇంగ్లీష్ మేస్టారు చంద్ర శేఖర రావు లు ఆయనపై గాఢ ముద్ర వేశారు .వారి బోధన ప్రభావమే రావు గారిని ”హై స్కూల్ గ్రామర్ ”రాయటానికి కారణం అయింది . ” .
                                           రచనా జీవిత ప్రారంభం
                బందరు నోబుల్ హై స్కూల్ లో రా గారు ఎస్ .ఎస్ .ఎల్ .సి .లో చేరారు .ఇంగ్లీష్ లో చిన్న వ్యాసాలు రాసి ”అర్బుదం ”మేస్టారి తో దిద్దిన్చుకొనే వారు .1941 లోవిశ్వ కవి  రవీంద్ర నాద్ టాగూర్ మరణించారు .వారిపై ఇంగ్లీష్ లో మంచి వ్యాసం రాశారు .తరువాత రాసిన ”The teacher I like ,the teacher I wish to be ”వ్యాసం కాలేజి మాగజైన్ ”The noble comrade ”ప్రచురిత మైంది .ఈ వ్యాసం రాయటం లో రావు గారికి ఉపాధ్యాయ వ్రుత్తి పట్ల వున్న గౌరవం ,సంఘం లో ఉపాధ్యాయుని పాత్ర అర్ధమవుతాయి .
                                                       కళాశాల జీవితం
                   1943 లో గుంటూరు హిందూ కాలేజి లో రావు గారు ఇంటర్ లో చేరిఅర్త్స్ సబ్జెక్ట్ తీసుకొన్నారు .పిల్లలమర్రివెంకట హనుమంత రావు గారు తెలుగులెక్చరర్  .వారి ప్రభావం బాగాపడింది  .ఆనాడు గుంటూరు ను” కల్చరల్ కాపిటల్ ఆఫ్ ఆంద్ర ”అనే వారు .ఆ కాలమ్ లో ”నవ్య    సాహిత్య పరిషత్ ”మంచి ఊపులో వుండేది.వాళ్ళు ”ప్రతిభ ”అనే మాస పత్రిక నడిపేవాళ్ళు ..ఆంద్ర దేశం లోని సుప్రసిద్ధ రచయితలకు అది వేదిక . .దాని ప్రబావం రావు గారి మీద వుంది .ఏదో సాహితీ సేవ చేయాలనే ఆలోచనలు సుళ్ళు తిరిగాయి .”సరస సారస్వత సమితి ”అనే సంస్థ రావు గారికి కలిగింది .”’శోభ ”అనే వార పత్రికా కూడా వారి ఊహల్లో వుంది,కార్యరూపం  దాల్చింది ఆయనే ఎడిటర్ .గోళ్ళ మూడి   రాధాకృష్ణ మూర్తి అనే చిత్రకారుడు ,హాష్య రచయిత ,సినీ నటుడు కొంగర జగ్గయ్య కళాదర్శకుడు వి.సూరన్న సుభద్రా దేవి సహకారం తో ;;శోభ ”శోభాయమానం గా వెలువడేది .జగ్గయ్య చక్కని దస్తూరి తో తీర్చి దిద్దే వాడు .కుందుర్తి ,కరుణశ్రీ ,మాచిరాజు దేవీ ప్రసాద్ ,బొడ్డు పల్లి పురుషోత్తం లాంటి ఉద్దండులు శోభకు రచనలు పంపే వారు .ఆంద్రవిశ్వ విద్యాలయ registraar    శ్రీ కూర్మా వేణుగోపాల స్వామి నాయుడు నుంచి మంచి సహకారం అందేది .సర్వశ్రీ కొండావెంకట  ప్పయ్య ,ఉన్నవ లక్ష్మి    నారాయణ ,మల్లం పల్లి సోమ శేఖర శర్మ ,అడివి బాపిరాజు ,సలహా సంఘ సభ్యులు .సంఘం తరఫున ఉచిత చిత్ర కళా శిక్షణ తరగతులు శ్రీ రాజా సింహ ఆధ్వర్యం లో జరిగేవి .ధర్మ వరం రామ కృష్ణ మాచార్యులు ,గురజాడ అప్పా రావు గార్ల వర్దంతులు జరిపే వారు .ప్రముఖులను ఆహ్వానించి ఉపన్యాసాలను ఏర్పాటు చేసే వారు .నాటికలు వేయించే వారు .ఫోటోగ్రఫి నేర్పేవారు .విహార  యాత్రలకు వెళ్ళే వారు .ఇవన్నీ రావు గారి ఆలోచనలే మంచి కార్యక్రమాలకు రూప కల్పన అమలు , .అందరు వారి మాటకు విలువ నిచ్చే వారు .
                   1945  లో జరిగిన గురజాడ వర్ధంతి సభలో రావు గారు మొదటి ఉపన్యాసం చేశారు .అది ఆంద్ర ప్రభలో ప్రచురితమైంది .ఇలా రెండేళ్ళు వివిధ సాహిత్య ,సాంస్కృతిక కార్య క్రమాలు దిగ్విజం గా నిర్వహించి సమాజానికి కొత్తఆలోచనలను   పరిచయం చేశారు విద్యార్ధి దశ లోనే ఇంకా ఇంటర్ విద్యార్హి గా ఉండ గానే .1944 -45 -ల మధ్య ”జ్ఞాన ”అనే మాస పత్రిక నిర్వహించటానికి అనుమతి పొందినా ఆర్ధిక కారణాల వల్ల నిర్వహించ లేక వదిలేశారు .ఆ పత్రిక పేరు లోనే వారి జిజ్ఞాస ,అందించాల్సిన భావ ఔన్నత్యాలు మనకు అర్దమవుతున్నాయి అది కార్యరూపం  దాల్చక పోవటం మన దురదృష్టం .
                         1945 -బాపిరాజు ముదునూరు వారిని తాను సంపాదకుడు గా వుంటూ హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్న ”మీజాన్ ”పత్రికకు సబ్ ఎడిటర్ ని చేశారు .ఒకరకం గా ఆయన పెన్మన్ ఈయన .కోణంగి ,నరుడు నవలలను అలవోకగా బాపిరాజు గారు చెబుతుంటే రావు గారు రాసే వారు .అవి పత్రిక లో ధారా వాహికం గా వచ్చేవి .బాపిరాజు గారింట్లోనే వీరి మకాం .ఆయనకు పెళ్లీడు ఆడ పిల్ల లున్నారు .అందుకని ఈయన్ని ”బాపిరాజు గారి అల్లుడు ”అని సరదాగా అనే వాళ్ళు .ఈయనకు అసలలాంటి అభిప్రాయమే లేదు .ఆయన్ను తండ్రి లాగా చూశారు .ఆయింట్లో ఒకడు అంతే .బాపి బావ తో గడపటం ఒక గ్రందాగ్రందాలయం లో గడిపిన అనుభూతి అంటారు రావు గారు .రాజు గారిది చాలా విశాల దృక్పధం .బహుభాషా పండితుడు ,నిగర్వి ,సహృదయుడు ,.”ప్రాచీనులలో నవీనుడు -నవీనులలు ప్రాచీనుడు బాపి రాజు గారు ”అంటారు ముదునూరు వారు .శ్రీ శ్రీనివాస చక్ర వర్తి ,తిరుమల రామ చంద్ర ,రాంభొట్ల కృష్ణ మూర్తి వీరి తో పాటు మీజాన్ కు సబ్ ఎడిటర్లు .అంతా హేమ హేమీలే .వారి సాహచర్యం బంగారానికి తావి అబ్బినట్లు అయింది రావు గారికి ‘1946  లో వెంకటేశ్వర రావు గారి వివాహం పెదముత్తేవికి  చెందిన శాంత గారితో జరిగింది .ఆ వివాహ వేడుకలలో పెదముత్తేవి ఆశ్రమ యతీంద్రులు ,ముముక్షు పీథ అధిపతి  శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు ”బుర్ర కధ ”చెప్పటం గొప్ప హై లైట్ .
                                              సశేషం
                                                                        మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -11 -11 .
సెప్టెంబర్ 27 న జరిగిన సన్మానం
Posted in రచనలు | 3 Comments

ముదిమి లోను యౌవనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –1

    ముదిమి లోను యౌవనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు  –1
             ఆయన 88 ఏళ్ళ  వృద్ధుడు .వృద్ధాప్యం రెండో బాల్యం అన్నారు కదా .అందుకని బాలుడే .అయితే ,ఆయన నిత్య జీవితం క్రియా , శీలత్వం ,సామాజిక సేవ ,నిరంతర పథనం ,రోజుకు  కనీసం పన్నెండు గంటల రచనా వ్యాసంగం ,ఈ వృద్ధాప్యం లో ,గమనిస్తే ,ఆయన నిత్య యౌవనుడు గా కని పిస్తారు .ముఖం పై ముడుతలు వచ్చినా ,కళ్ళు తెల్లబడు తున్నా,అందులో విజ్ఞాన జ్యోతి ప్రకాశించటం ,ప్రసరించటం చూస్తాం .ఒక రాజకీయ నాయకుడో ,సంఘ సంస్కర్తో ,సామాజిక కార్య కార్తో ,ఉత్తమ ఉపాధ్యాయుడో ,నిర్వహించ వలసిన కార్య క్రమాలను అన్నిటినీ ,తానొక్కడే ,కొద్ది మంది సహాయం తో,నిర్వహించిన  ,అనుక్షణ కార్య కర్త ,.ఆ నిర్వహణ లో అలుపు లేదు ,విశ్రాంతి లేదు .అకుంతిత దీక్ష ,సమాజ సేవా తపన ఉత్తమ బోధ నందిన్చాలన్న ఆరాటం ,తన చుట్టూ వున్న సమాజం తన తో పాటు అన్ని రంగాల్లో అగ్రగామి గాఉండాలన్న   ఆకాంక్ష ,సంపూర్ణ వికాసం తో ,జీవితాలు వెలగా లన్న దృఢ సంకల్పం ఆయన్ను ,ఎన్ని అవాంతరాలు వచ్చినా తట్టుకొని నిలబడేట్లు చేసింది ..సమాజం లో అన్ని వర్గాలు ,కులాలు ,ఆబాల వృద్ధులు తన వాళ్ళే అనే విశాల దృక్పధం ,ఆయన్ను అందరి కంటే అగ్రేసరుడిని చేసింది .ఆయన సాధించిన విజయాలు ఇన్నో ,అన్నో కావు .ఎక్కడ ఏ పరిస్థితులలో సమాజానికి తాను అవసరమైతే అక్కడ ఆయన ప్రత్యక్షం .నీతికి ,నిర్భీతికి,పేరుగా నిలిచి ,వ్యక్తిత్వం తో ,జీవితాన్ని పండించుకొని ,”బహుజన హితాయ -బహుజన సుఖాయ ”గా జీవితం గడుపుతూ ,అందరిని ప్రేమ ,ఆప్యాయత ,మమతాను రాగాల తో ,తన వాళ్ళను చేసు కోని ,తన వాక్కే వేద వాక్కు గా అందరు భావించే స్ఫూర్తిని కలుగ జేసి సకల కళా రహశ్యాలను అవగాహన చేసుకొని,ఇతరులకు తెలియ జెప్పి ,పెద్దన్నగా ,గుర్తింప బడి ,తాను చేసిన దేదో ,మహత్కార్యం అనీ ,సమాజ సేవ అనీ భావించక ,అదొక మానవ ధర్మంగా ,కనీస విధిగా భావించి ,తన మార్గాన తాను నడుస్తూ ,ప్రేరణ పొందిన వారిని తనతో కలుపు కొంటు ,ద్వేషం ,అసూయ ,అహంకారం కోపతాపాలకు ,అతీతం గా ,అజాత శత్రుత్వం తో ,వ్యవహరిస్తూ ,తాను నమ్మిన ”రాముని ”బంటు గా వ్యవహరిస్తూ ,కుటుంబానికీ ,గ్రామానికీ ,పరిసర ప్రదేశాలవారికీ ,తలలో నాలుక గా నడుస్తూ ,పెద్దరికాన్ని నిల బెట్టు కుంటు ,ఆదర్శం లో ,ఏమాత్రం అటు ఇటు లేక నవ్య ,సవ్య పదగామి గా వుంటూ ,బాల సాహిత్యసేవ లో ధన్యులై ,యువకులకు  ఉత్చాహ పాత్రులై ,తోటి ఉపాధ్యాయులకు ఆదర్శ మూర్తి యై ,విశ్రాంత ఉపాధ్యాయులైనా ,అవిశ్రాంత కృషి చేస్తున్న వారు ,కర్మ యోగి ,క్రియా శీలి ,”బాల సాహిత్య చక్ర వర్తి ,మాన్యులు శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు .
                 శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు గారిది ఓకే ప్రత్యెక స్కూల్ అఫ్  థాట్ .ఆయన ఒక విశ్వ విద్యాలయం .knowledge pool  జ్ఞాన ఖని .విశుద్ధ మనస్కులు .నిరామయ జీవి .నిర పేక్ష కార్య శూరుడు .ఆయనజీవితాన్ని   అర్ధం చేసు కోవ టానికి ,ఆయన వివిధ దశల్లో చేబట్టిన కార్య క్రమాలనుపరామర్శించాతానికి ,  ,ఆదర్శ శిఖరా రోహనం చేయ టానికీ ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాల్సిందే .ఆయన రచనా శైలి ,నిరాడంబరం .,మెత్తని పూల మీద నడుస్తున్నట్లుంటుంది . .ఏది చెప్పినా సుతి మెత్త గా ,సూటిగా మనసుకు తాకేట్లు చెప్పటం ఆయన ప్రత్యేకత .పదాడంబరం వుండదు .ఎక్కువ తక్కువలుండవు .అతిశయోక్తులకు దూరం .యదార్ధ వాది-కాని లోక విరోధి మాత్రం కాక పోవటమాయన ప్రత్యేకత .అదే ఆయన విశిష్ట వ్యక్తిత్వం .ఆయన కార్య క్రమాలను ,,జీవితం తో అనుసంధానం చేస్తూ ,వివిధ దశల లో వింగడించి తెలుసు కొందాం
                                           సశేషం
                                                           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 —11 -11 .
సెప్టెంబర్ 27 న జరిగిన సన్మానం
http://wp.me/p1jQnd-rh
Posted in మహానుభావులు, రచనలు | Leave a comment

రవి కవి రవీంద్ర నాద్ టాగూర్

            రవి కవి
                        రవీంద్ర నాద్ టాగూర్ నూట ఎభైవ జయంతి సంవత్చరం ఇది .విశ్వ కవి గా సుప్రసిద్ధుడైన రవి కవి గురించి మళ్ళీ ఒక సారి జ్ఞాపకం చేసు కొందాం .రవీంద్రుడు 1861  మే నెల ఆరవ తేదిన జన్మించాడు ,తండ్రి మహర్షి దేవేంద్ర నాద టాగూర్ .తాత గారు ద్వారకా నాద్ టాగూర్.రవీంద్రుడు కవి ,కారుణ్య మూర్హి ,తాత్వికుడు ,ధార్మికుడు ,చిత్రకళా మర్మజ్ఞుడు ,నటుడు ,నాటక రచయిత ,కధకుడు ,నవలా కారుడు ,సంగీతజ్ఞుడు,నాట్య శాస్త్ర వేత్త  .అంటే సకల కళా సమగ్ర స్వరూపం .విశ్వ మోహనుడు .పూర్ణ పురుషుడు అంటారు అందుకే .ఆయన చదువు అంతా ఇంటి వద్దే సాగింది .ప్రకృతి ఒడిలో విద్య నేర్చాడు .అందుకే ప్రకృతి అంటే విపరీత మైన మమకారం .పదిహేనవ ఏట ;”;కవిగాద ”,అడవి పూలు” అనే కవితలు రాశాడు .1878 లో బారిస్టర్ చదువు కోసం లండన్ వెళ్ళాడు .౧౮౮౧ లో ;;ప్రభాత గీతికలు ”,సంధ్యా గీతికలు ‘రాశాడు .ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ,దాన్ని నాశనం చేయ టానికి ప్రయత్నిస్తే అది మన మీద ప్రతీకారం తీర్చుకుంటుంది  అనే సందేశం తో ”మానసిని ”రాశాడు .చిత్ర ,తోటమాలి ,వెన్నెల గొప్ప రచనలు .జలియన్ వాలా baagh హత్య సందర్భం గా తనకు ప్రభుత్వం ఇచ్చిన సర్ బిరుదును తిరిగి ఇచ్చేసిన దేశాభిమాని .బ్రిటన్ ,ఫ్రాన్సు మొదలైన దేశాలు పర్య టించి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటిన విశ్వ మానవుడు .1940 లో   ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం డాక్టర్ అఫ్ లెటర్స్ బిరుదు  నిచ్చి సత్కరించింది .గోరా నౌకా భంగం నవలలు మంచి పేరుతెచ్చాయి  .నౌకాభంగం నవలనే ”తెలుగు లో ”చరణ దాసి ”సినిమా గా తీశారు .రామ రావు ,నాగేశ్వర రావు ,అంజలి ,సావిత్రి అందులో నటించారు .
                    రవీంద్రుడు రాసిన ”కాబూలి వాలా ”.పదిక్ చక్రవర్తి  ”మొదలైన నవలలు మంచి ఆదరణ పొందాయి .పాఠ్యాంశాలు గా కూడా వచ్చాయి .రవీంద్రుడు అంటే మనకు గుర్తుకు వచ్చేది గీతాంజలి పద్య కావ్యం .బెంగాలి భాషలో రాశాడు .తరువాత ఆయనే దాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేశాడు .దీనికే 1913 లో సాహిత్యం లో నోబెల్ బహుమతి లభించింది .ప్రపంచం అంతామొదటి  ప్రపంచ యుద్ధ సన్నద్ధం లో వున్నప్పుడు మనిషికి ,మాన వత్వానికి విలువ తగ్గి పోతున్న సమయం లో మనిషి అల్పత్వాన్ని తెలియజేస్తూ ,పరమాత్మ ఔన్నత్యాన్ని ,మనిషి లోని విశ్వాసాన్ని ,ప్రకృతి శోభను ,కళారాదనను ప్రతిబింబించే గీతాంజలి కవితలు శాంతికి ,విశ్వ మానవ సోదరాత్వానికి ,హింసా ,దౌర్జన్యా రాహిత్యానికి ప్రతీకలు గా వుండటం చేత మానవీయ విలువలకు పట్టంకడుతూ నోబెల్ పురస్కారాన్ని అందించారు .
               19 వ ఏటనే ”వాల్మీకి ప్రతిభ ”నాటకం రాశాడు .విసర్జన ,రాజు రాణి ,చిత్రాంగద ,కర్ణ-కుంతి శరదు త్చవ ,ప్రాయశ్చిత్త  , ,పోస్టాఫీస్ ,అనే మనోరంజకమైన నాట కాలు రాశాడు .ముక్త ధార నాటకం లో బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ప్రతినిధి గ రాజు పాత్రను సృష్టించాడు .ఆయనకు చాలా ఇష్టమైన నాటకం ”నటీర్ పూజ ”రవీంద్రుని ”చండాలిక ”నాటకం బుద్ధ భగవానుని కాలమ్ లోని  నిమ్న జాతి స్త్రీ కధ ను అతి రమణీయం గా చిత్రించి ,ఆమెకు భగవాన్ అనుగ్రహంకలిగిన విధానాన్ని అత్యుత్తమం గా చిత్రించాడు .దీనినే ప్రఖ్యాత కూచి  పూడి నాట్యా చార్యులు శ్రీ వెంపటి చిన సత్యం గారు సంగీత నాటకం గా మలచి అద్భుత విజయం సాధించారు .శ్రీమతి శోభా నాయుడు చండాలిక వేషం లో నభూతో గా నటించి మెప్పించారు .సత్యం గారికి ఇది ఎన లేని కీర్తి తెచ్చింది .ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు .
                     రవీంద్రుడు మానసిక శాస్త్రం బాగా తెలిసిన మహా మానవుడు .స్త్ర్రేలకు కావలసిన విద్య బోధించటానికి శాంతి నికేతన్ నిర్మించాడు .అది విశ్వ భారతి గా రూపుదిద్దు   కొంది తరువాత విశ్వ విద్యాలయం అయింది .రవీంద్రుని మరో సృష్టి ”శ్రీ కేతన్ .”ఇందులో నూతన వ్యవసాయ పద్ధతులను ,గ్రామాల పునర్నిర్మానాన్ని నేర్పించాడు .ఆయనది సంస్కృతీ వికాస దృష్టి .దానికి అవిరళ కృషి చేశాడు .అంతర్జాతీయ సౌభ్రాతృత్వం ఆయన ఆశయం .కనుకనే ఆయన్ను మహాపురుషుడని ,యుగ పురుషుడని అంటారు .వంగ కవి సార్వభౌముడు అయినా ,ఆయన భావాలన్నీ విశ్వ వ్యాప్తమైనందున విశ్వ కవి అయాడు .రవీంద్ర సంగీతాన్ని సృష్టించాడు .ఇందులో భారతీయ ,పాశ్చాత్య సంగీతాలను ఫ్యూజన్ చేశాడు పాట ,ఫణితి దేశీయ మైనవి .ఆడుతూ పాడే విధానం .ఇందులో ”ఏక్ ల చల్ ఏక్ ల చల్ ఏక్ లచలోరె ”  అనే పాట అందరికి ప్రేరణ.ముఖ్యం గా ఇందిరా గాంధికి . .అలాగే ఆయన గీతం ”Where the mind is without fear and the head is held high ”అనేది ఒక మహత్తర సందేశమే .పాత్యాంశం గా బోధిస్తూనే వున్నారు .ఇది విశ్వ వ్యాప్త ఆదరణ పొందింది .
                   విల్ డ్యురాంట్ అనే తత్వ వేత్త ”భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వ టానికి రవీంద్రుడు ఒక్కడు చాలు ”అన్నాడంటే ఆయన భారతీయులందరి ప్రతినిధి అని అర్ధమై పోతుంది .అంతటి ఉత్కృష్ట మానవుడు రవీంద్రుడు .రవీంద్ర ,టాగూర్ ,గీతాంజలి పేర్లు తెలిగింట పిల్లలకు పెట్టు కోవటం అలవాటు బాగా వుంది .ఆయన్ను మనం స్వంతం చేసు కున్నాం .
                      విశ్వ భారతి లో ”యత్ర విశ్వం భవతి ఏక నీడం ”అనే సూక్తి రాయించాడు రవి కవి .అంటే అర్ధం ;;ఎక్కడ విశ్వం అంతా ఒకే గూటిలో వుంటుందో ”అని .అంతటి విశ్వ జనీన భావం ఆయనది ఆనాడే ప్రపంచం అంతా ఒక కుగ్రామం (global villege )అవుతుందని ఊహించాడు దార్శనికుడైన రవీంద్రుడు .ఆయన వేషమే రుషి వేషం.అ గడ్డం ,కాంతులు వెదజల్లే ఆ కళ్ళు ,చూస్తె ఒక అలౌకిక వ్యక్తి మనకు కన్పిస్తాడు .ప్రేరణ గా నిలుస్తాడు .రవీంద్రుడు సౌందర్య మూర్తి .రూపం లో ,పలుకు లో ,పాట లో అంతా సౌందర్యమే .ఆయన జీవితమే సౌందర్య మయం రస విహారం అన్నారు ముట్నూరి కృష్ణా రావు గారు .శాంత రసమైన  గాంభీర్యం ,బంగారు కాంతివెదజల్లే వర్చస్సు ,మధుర మంజల రూప సంపదా ,ఓజస్సుప్రదర్శించే ఠీవి ,రమ్య లోకాలను చూపే చిరునవ్వు హృదయానికి పండుగ చేస్తాయి .ఆధునిక మహర్షి చంద్రుడు రవీంద్రుడు .
                         మన జాతీయ గీత రచయిత రవీన్ద్రుడే నని గుర్తు చేయక్కరలేదనుకుంటా .అంతే కాదు బంకిం చంద్ర చటర్జీ రచించిన  ”వందే మాతరం ప్రార్ధనా గీతానికి స్వర రచన చేసింది రవీన్ద్రుడే అని మర్చి పోయి వుంటారు చాలా మంది .ఒక సారి ప్రముఖ బెంగాలి నవలా రచయిత శరత్ బాబును కొందరు పాథకులు ”మీ రచనలు మాకు బాగా .తేలిగ్గా అర్ధమవుతాయి .రవీంద్రుని రచనలు అర్ధం కావటం కష్టం గా వుంది ”అన్నారట ”’.దానికి వెంటనే శరత్ ”నేను మీకోసం రాస్తాను .రవీంద్రుడు మా కోసం రాస్తారు ”అని రవీంద్రుని స్థాయినిగొప్పగా   ఆవిష్కరించాడు .ఒక సారి ఆంద్ర దేశ ప్రముఖ  వైణిక విద్వాంశులు ,పిఠాపురం సంస్థాన సంగీతవిద్వాంసులు   తుమురాడ సంగమేశ్వర శాస్త్రి గారి వీణా వాడనాన్ని గంటల తరబడి వింటూ అలాగే తన్మయులు. అయారట . .శాస్రి గారిని శాంతి నికేతన్ కు తీసుకొని వెళ్లి అందరికి ”శాస్త్రి గారు నా గురువు గారు ”అని ఆనందం గా పరిచయం చేసిన వినయ సంపన్నుడు .శాంతి నికేతన్ లో మన ఆంద్ర ప్రముఖులు రాయప్రోలు సుబ్బా రావు ,బెజవాడ గోపాలరెడ్డి ,సంజీవ దేవ్ లు విద్య నేర్చి న వారే .గాంధీ మహాత్ముడు రవీంద్రుని తన గురువు గా చెప్పుకొన్నారు .రావీన్ద్రుడే గాంధి గారికి ”మహాత్మా ”బిరుదును ఇచ్చారు .”రేఖల్లో నృత్యాని ,రంగుల్లో సంగీతాన్ని ,దర్శించ టం ద్వారా విశ్వ చిత్ర కళా రంగం లో ఆరని జ్వాలా తోరణాన్ని వెలిగించాడు . .రవీంద్రుని చిత్రకళా సాధన -విశ్వ సౌందర్య సాధనే .”అని కీర్తించారు  ప్రముఖ చిత్రకారులు ,రచయిత ,తాత్వికులు ,భావుకులు అయిన స్వర్గీయ  సంజీవ దేవ్ .”విశ్వ కవి ”అనే పేరు ప్రపపంచం మొత్తం మీద ఒక్క రవీన్ద్రునికే వుంది ”అని తేల్చి చెప్పారు ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం .స్వాతంత్ర్య సమర సాధనలో ఎందరో నాయకులకుస్ఫూర్తినీ   ప్రేరణనుఅందించిన   దేశభక్తుడు  రవీంద్రుడు .
                 రవీంద్రునిగీతాంజలి కి   తెలుగు లోనే యాభై కి పైగా అనువాదాలు వచ్చాయి .మరి ఇతరభాషల్లో ఎన్ని వచ్చాయో .అది నిత్య నూతనం గా అని పిస్తుంది ,చదివిన కొద్దీ మళ్ళీ చద వాలి అని పించే  మహోత్కృష్ట రచన .మనిషిని మహోన్నతుని చేసే తపన .ఈపరిధి   దాటి ఇంకో plane లోకి   తీసుకు  వెళ్ళే అమోల్య రచన .అందుకే ”రవీంద్రుని ఆరాధనా దైవం నిఖిల రసామృత మూర్తి అయిన ”విశ్వ మానవుడు ”అన్నారు ముట్నూరి వారు .ఆయన మనిషి కోసం పడే తపన తెలిపే కవితచూడండి .
                ”Into the mouths of these -dumb ,pale ,and meek —We have to infuse the language of the soul
                 Into the hearts of these weary ,worn ,and forlorn —we have to minstrel the hope of humanity ”
                     చివరగా మన కవుల నీరాజనం తో ముగిస్తాను .నారాయణ రెడ్డి గారు రవి కవిని ప్రసంషిస్తూ —
              ”ఒ కవితా రసాలపుం స్కోకిలమా -వ్యాకులమౌ మా జాతికి ,నీ గీతిక -మధుమాస మహోదయమ్ము
               ఎల్లలు దాటి జనించిన షెల్లీ వందురే  కాని –ఆలశ్యముగా పుట్టిన అపర కాళిదాసువు నీవు
               నీవు ప్రభుని చరణమ్ముల నివేదించు గీతాంజలి –నిత్యమూ బీటేట్టిన గుండెల పండించు రసాంజలి ”అన్నారు
                             ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన కవి స్వర్గీయ దాశరధి రవీంద్రుని   ప్రస్తుతిస్తూ
                                          ”ఈ లోకమ్మొక  నాకమౌనటుల నీవే చేయగా  జాలెదు ఈ
                                            హాలాహాల మయ ప్రపంచము ,సుధా వ్యాప్తమ్ము  గావింతువు ఈ
                                             వ్యాలా భీల వనమ్ము ,నందన  వన ప్రాయమ్ము గావించి క్రోం
                                             బూలన్ నిండిన పారిజాతములతో పొంగింతువో సత్కవీ !
                                                                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | 1 Comment

నిమ్బార్కర్ ఆచార్యులు —2 నిమ్బార్కర్ వేదాంత దర్శనం

 

                                                 నిమ్బార్కర్ ఆచార్యులు —2
                                                      నిమ్బార్కర్ వేదాంత దర్శనం 
            నిమ్బార్కర్ దర్శనం లో మూడు తత్వాలు వున్నాయి .అవి చిత్ ,అచిత్ ఈశ్వరుడు .వీటినే భోక్త ,భోగ్యం ,శ్వేతాశ్వ తరం అంటారు .ఆయన దృష్టి లో శ్రీ కృష్ణుడే పర తత్త్వం .ఆయన సర్వ నియంత .ఆయన కంటే అధికులు లేరు .నిమిత్తము ,ఉపాదాన కారణం కృష్ణుడే .పరబ్రహ్మానికి పర (transcendent ),అంతర్యామి (Immanent )అనే రెండు రూపాలున్నాయి .పర రూపం లో పరబ్రహ్మ ప్రపంచం నుండి వేరుగాను ,అంతర్యామి రూపం లో అభిన్నం గాను ఉంటాడు .ప్రపంచం పరమేశ్వరుని శక్తి నుంచి ఏర్పడింది .పర,అంతర్యామిత్వాల సమతుల (balance )స్థితి ఏ ప్రపంచానికి కారణం .ఈ రెండు సమాన ప్రాధాన్యత కలవే .పరబ్రహ్మ ప్రపంచరూపం  లో వున్నా ,,ఆయన ప్రపంచానికి అతీతుడు .ప్రపంచం లేకుండా బ్రహ్మ లేడు .
                  జీవాత్మ —నిమ్బార్కర్ భావన లో జీవుడు జ్ఞాన స్వరూపుడు .అతడు శరీరము ,ఇంద్రియాలు ,ప్రాణము ,మనస్సు ,బుద్ధి వీటికి భిన్నుడు .జీవాత్మ జ్ఞానానికి ఆశ్రయం కూడా .అంటే జ్ఞానమే ధర్మం గా వున్న వాడు .జీవాత్మకు ఆది అంతం లేవు .పరబ్రహ్మ అంశమే జీవాత్మ .అందుకే పరబ్రహ్మ కన్న ,భిన్నుడు ,అభిన్నుడు కూడా .అనేక జీవాత్మలు వున్నా ,అన్నీ పరబ్రహ్మ అంశాలే .జీవాత్మకు ఎనిమిది గుణాలున్నా ,అవిద్య వల్ల తెలుసు కో లేక సంసారి అవుతాడు .జీవాత్మ అణువు లాంటి వాడు .అంటే అతి అల్పమైన వాడు .కాని తాను చేసే ధర్మం అనే జ్ఞానం వల్ల సుఖం ,దుఖం అనుభ విస్తాడు .
                జగత్తు —దీనినే అచిత్ అంటారు .ఇది మూడు విధాలు .ప్రాకృతం ,అంటే కేవల సత్వం ,రెండు అప్రాక్రుతం అంటే ప్రకృతి చేత ఎర్పదనిది .మూడ వది కాలము .ఇది ప్రకృతి ,పరబ్రహ్మ ల చేత ప్రేరితం అయి ప్రపంచానికి ఉపాదాన కారణం అవుతోంది .ప్రపంచం అంటే పరబ్రహ్మ చేసే కృత్యం .అది నిత్యం ,సత్వ ,రాజా ,తమో గుణాత్మికం .
       ప్రపంచోత్పత్తి —-పరమాత్మ ,ఆకాశం ,వాయువు ,అగ్ని ,జలం ,పృథ్వి అన్నీ పరబ్రహ్మం నుండే ఏర్పడ్డాయి .
           బ్రహ్మం ,చిత్ ,అచిత్ —వీటి మధ్య వున్నది భేదా భేదం అంటాడు నిమ్బార్కరుడు .బ్రహ్మ నియంత ,చిత్తు భోక్త ,అచిత్ భాగ్యం .బ్రహ్మము అంశి జీవుడు అంశము .ఈ రెండు వేరు కావు .బ్రహ్మాన్ని ఉపాశించాలి .దాన్ని అందు కోవాలి .జీవుడు జ్ఞాత ,ఉపాసకుడు ,ప్రాప్త అంటే పొందే వాడు .వీరిద్దరి మధ్య భేదం తప్పదు జీవాత్మ అవిద్యావిషయం కాని ,అవిద్యా పదం కాని కానేరదు .అయితే బ్రహ్మం మాత్రం పాప రహితం ,సత్య కామం ,సర్వ వ్యాపి .బ్రహ్మం నిత్యం ఎదురు లేనివాడు అతడు పురుషోత్తముడు .
                    బ్రహ్మము కారణం .జగత్తు కార్యం అంటాడు నిమ్బార్కర పండితుడు .బ్రహ్మ చైతన్య స్వ రూపం .అస్తూలం ,అనణువు .,నిత్య శుద్ధం .బ్రహ్మము నియంత అయితే జగత్తు నియమిమ్పబడేది .జీవాత్మ ,జగత్తుబ్రహ్మ అంశాలే . బ్రహ్మ కన్న భిన్నాలు గా కని పించినా ,అభిన్నాలే , .కార్యము ,కారణం ,అంశములు ,అంశి కేవలంభిన్నాలు   కావు ,అభిన్నాలు  కావు .వాటి మధ్య వున్నది భేదా భేద సంబంధము .సూర్యుడికి ,ఆయన కాంతికి మధ్య వున్న సంబంధం లాంటిదే బ్రహ్మానికి ,జీవునికి ,జగత్తుకు వుంది .భేదం ,అభేదం కూడా సమాన సత్యాలే .స్వాభావికాలే ..
             మోక్షం —నిమ్బార్కర్ భావనలో మోక్షం అంటే జీవాత్మ స్వభావం లోను ,గుణాలలోను  పరబ్రహ్మము తో సామ్యన్న్ని పొందటమే .ఆ పరబ్రహ్మ బ్భావం పొంద టానికి పరబ్రహ్మ అనుగ్రహము ,ప్రసాదమే శరణ్యం.మోక్ష సాధనకు కర్మ ,జ్ఞానం ,ఉపాసన ,భక్తి ,ప్రపత్తి ,గురూప పత్తిఅనే ఆరు సాధనాలను చెప్పాడు నిమ్బార్కరాచార్యుడు . 
          కర్మ –కర్మ మోక్షానికి ప్రత్యక్ష సాధనం కాదు .జ్ఞానానికి మార్గం .విధ్యుక్త కర్మ అందరు తప్పని సరిగా చేయాలి 
          జ్ఞానం లేక విద్య —విద్య వల్లనే పరబ్రహ్మను పొంద గలం .విద్య స్వతంత్ర సాధనం .
          ఉపాసన లేక ధ్యానం –ముముక్షువు కళంక రహిత మైన ఆత్మను ఉపాశించాలి .పరమాత్మ భావన పొందిన ఆత్మను ఉపాశించటం ఉత్తమం 
            భక్తి –భక్తి ,ఉపాసన ఒకటి కావు .సాధకునికి ఈశ్వరుని యందు ప్రేమయే భక్తి .భక్తి ,,ధ్యానం,పరస్పర సంబంధం కలవి .భక్తి మోక్షానికి గొప్ప సాధనం .పరమేశ్వర ప్రసాదం వల్లనే ఇది పొంద బడుతుంది .
            ప్రపత్తి –ఇదంతా విశిష్టా ద్వైత విధానం లాగానే వుంటుంది .
            గురూప పత్తి —ప్రపత్తి రెండు రకాలు .ఒకటి ఈశ్వరుని గురించి రెండు ఆచార్యుడైన గురువు ను గురించి .జీవాక్త్మకు ,పరమాత్మకు మధ్య వర్తి గురువు .జీవాత్మ గురు అనుగ్రహం వల్లే పరమాత్మను పొంద గలడు .తన మనసు ,ధనము ,ఆత్మ ను గురువు అధీనం లో ఉంచాలి .పరమేశ్వరుని గురించి ప్రపత్తి వుంటే మోక్షం వస్తుందో రాదో చెప్ప లేము .కాని గురువు ప్రసన్నతను పొందితే అలాంటి సందేహం వుండదు .
                                              సమాప్తం                                             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –07 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

నిమ్బార్కర్ ఆచార్యుడు

     నిమ్బార్కర్ ఆచార్యుడు 
                       వేద వ్యాసుడు రచించిన ”బ్రహ్మ సూత్రాలు ”కు వ్యాఖ్యానం రాసిన మహా పండితుడు నిమ్బార్కరాచార్యుడు .ఆయన తెలుగు వారు అవటం తెలుగు వారి అదృష్టం .ఆయన జీవిత కాలమ్ పై చాలా వివాదాలున్నాయి .కానీ విశేష పరిశోధన లు జరిగిన తర్వాత ఆయన కాలమ్ కొంత వరకు స్పష్టమైంది .కొందరి భావన లో ఆయన శంకరాచార్యులకు పూర్వుడని ,కొందరి ఆలోచన లో మాధవా చార్యులకు ముందు వాడు అని అంటారు .కాని ఇవేవి నిజం కాదు అని అభిప్రాయ పడ్డారు .భగవద్రామానుజా చార్యులకు సమ కాలీనులు అన్నది కొంత వరకు నిజం గా కన్పిస్తోంది .క్రీ శ .పదమూడో శతాబ్ది వాడు అని స్థూలం గా భావించ వచ్చు వీరి గురించి తెలిసిన విషయాలు చాలా తక్కువ గానే వున్నాయి .అందులో ఆంధ్రులు మన వాడే ఆయన అని మర్చి పోయారు కూడా అందుకే ఆయన జీవిత విశేషాలు మీ ముందు ఉంచుతున్నాను .కనీసం ఒక సారి అయినా అలాంటి మహా మహుల్ని స్మరిస్తే మన జీవితం ధన్య మవుతుంది .మన తెలుగు వాడు ఇంత గొప్ప వాడా అని ఆశ్చర్యం వేస్తుంది .అందులో కార్తీక పూర్ణిమ నాడు నిమ్బార్కర్ జన్మించటం వల్ల మూడు రోజుల్లో కార్తీక పున్నమి వస్తోంది కనుక ఈ వ్యాసం రాయాలనే సంకల్పం కలిగింది ..ఇప్పుడుమహా మహితాత్మమైన నిమ్బార్కరు పండితుల    జీవిత విశేషాలను గురించి తెలుసు కుందాం 
                                                     జీవిత విశేషాలు 
                      నిమ్బార్కర్ అనే పేరు ఆయనకు చాలా కాలమ్ తరు వాత మాత్రమే వచ్చింది .ఆయన శ్రీ మహా విష్ణువు  ”సుదర్శన  చక్రం ”అవతారమే  అని ”భవిష్య పురాణం ”లో వుంది .కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆయన జన్మించి నట్లు తెలుస్తోంది .క్రీ;శ.3096  లో జన్మించినట్లు గా భావిస్తున్నారు .తల్లి పేరు భారతి .తండ్రి అరుణ .తెలగాణ్య శాఖ కు చెందిన బ్రాహ్మణుడు .గోదా వారి నది (దేవ నది )ఒడ్డున వైడూర్య పట్టణం లో ఆయన జన్మించారు .తల్లి దండ్రులు పెట్టిన పేరు ”నియమానంద ”.పదహారవ ఏటనే వెద ,శాస్త్రాలలో అద్వితీయుడైనాడు .ఉత్తర ప్రదేశ్ లోని మధుర కు వెళ్లి గోవర్ధనా చార్య దర్శనం చేశారు .ద్వైత వేదాంతాన్ని నేర్చారు గురువు వద్ద ..చదువు అంతా నిమ్మ చెట్టు క్రింద నేర్వటం ఆయనకు ఇష్టం గా వుండేది .ఈయనశ్రద్ధ ,  ,ఆసక్తులను గమనించిన నారద మహర్షి ”ద్వైతాద్వైత వేదాంతం ”బోధించాడు .అంటే ద్వంద్వం లో ఏకత్వ భావన అని అర్ధం .నియమానందుడు నారదుణ్ణి తనను శిష్యునిగా స్వీకరించ మని కోరాడు .వైష్ణవ సంప్రదాయం లో ,శ్రీ సర్వేశ్వర దేవుల అనుగ్రహం తో శిష్యునిగా స్వీకరించాడు .నారదుడు ”హరిప్రియ ”అనే పేరు పెట్టాడు .మహా మంత్రమైన ”గోపాల మంత్రం ”ఉపదేశించాడు .ఇది ”గోపాల పిని ఉపనిషత్ ”లో వుంది .నియమా నంద గోపాల మంత్రాన్ని తీవ్రం గా జపించాడు .అప్పుడు ఆయనకు ”గోపాల దేవుడు ”రాదా కృష్ణ ”రూపం లో దర్శనం ఇచ్చాడు .తానే శ్రీకృష్ణుడి నని  తెలియ    జేశాడు .నియమానండుడే ”సుదర్శన చక్రం ”అనే ఎరుక కల్గించాడు .రాధాకృష్ణ వేదాంతాన్ని ప్రచారం చేయమని ఆదేశించాడు .
                          గోవర్ధన అని పిలువ బడే ;;నింబ గ్రామం ”లో ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు నియమానందుడు .ఒక రోజున బ్రహ్మ దేవుడు చీకటి పడుతుండ గా ,శిష్యుని వేషం లో ఈయన దగ్గరకు వచ్చాడు .ఇద్దరు వేదాంత చర్చ చాలా సేపు చేశారు .బ్రహ్మ ,నియమానందుని చేతి లో ఓడి పోయాడు .చీకటి బాగా పడింది .ఏదైనా ఉపాహారం స్వీకరించమని శిష్యుడైన బ్రహ్మను కోరాడు .చీకటి పడిన తర్వాత ఏదీ స్వీకరించ రాదు అన్నాడు మాయా బ్రహ్మ .ఉపాహారం తీసుకోక పొతే ఆతిధ్యం ఇచ్చే వారికి ఫలితం దక్కదని తెలియ జేసి ,అర్కుడు అంటే సూర్యుడిని నిమ్మ చెట్ల మధ్య స్తంభిప బడేట్లు చేశాడు నియమానందుడు .చీకటి పడటం ఆగి పోయింది .అప్పుడు ఈయన ఇచ్చిన ఆతిధ్యం బ్రహ్మ స్వీకరించాడు .ఆతిధ్య ఫలితం నియమనండునికి దక్కింది .నియముని భక్తి శ్రద్దలకు వివేకానికీ ,మహిమకు విజ్ఞత కు బ్రహ్మానంద పడ్డాడు బ్రహ్మ .నిజ రూపం ప్రదర్శించాడు నలువ .నింబ వృక్షాల మధ్య సూర్య గమనాన్ని ఆపివేయటం వల్ల నియమానందునికి బ్రహ్మ ”నిమ్బార్కర ”అనే బిరుదు ప్రసాదించాడు .అప్పటి నుంచి నిమ్బార్కర అనే పేరు స్థిరమైంది .
ఆయన ప్రవచించిన ద్వైతాద్వైత వేదాంతం లో మోక్షానికి అయిదు సోపానాలు చెప్పాడు .అవి కర్మ ,విద్య ,ఉపాసన ప్రపత్తి ,,గురూప పత్తి .ఆయన రచించిన ‘బ్రహ్మ సూత్రా భాష్యానికి ‘వేదాంత పారిజాత సౌరభం ”అని పేరు .తన సిద్ధాంతాన్ని ”దశ శ్లోకి ”అనే పది శ్లోకాలలో నిక్షిప్తం చేశాడు నిమ్బార్కరా చార్యుడు”సావి శేష ,నిర్విశేష శ్రీ కృష్ణ రాజా స్తవం ”అనే పేర ఒక స్తోత్ర గ్రంధాన్ని నిమ్బార్కర్ రచించారు . .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

ప్రపంచ తెలుగు —తొలి అడుగు

      ప్రపంచ తెలుగు —తొలి అడుగు
                  కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో తెలుగు భాషకు ,సంస్కృతికి చేస్తున్న సేవలు అత్యంత విలువైనవి .ఈ సంస్థకు నాలుగు స్తంభాలు ఒకరు ఆలోచనా పరులు ,భాషా ప్రేమికులు ,సంస్కృతి అంటే విపరీతమైన అభిమానం మాటల్లో కాక చేతల్లో వున్న వారు ,తండ్రి మండలివెంకట   కృష్ణా రావు గారి వారసత్వాన్ని అంది పుచ్చుకున్న యువనేత  కృష్ణ జిల్లా రచయితల సంఘానికి గౌరవ అధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ .రెండవ వారు కేంద్రం లోను ,రాష్ట్రం లోను రాచకీయ పలుకు బడి ,చాణక్యం ,తెలిసి ,హిందీ అకాడమీకి అధ్యక్షులైన వారు ,కార్య నిర్వాహక అధ్యక్షులు ,తెలుగు భాష ,సంస్కృతి లపై ప్రేమ ,అభిమానంఅణువణువునా వున్న వారు   ,పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు .మిగిలిన యిద్దరు ,జంట కవులు గా ,జీవికా జీవులు గా ,కృష్ణార్జునులుగా ,అలసట లేని నిరంతర సాహితీ శ్రమ జీవులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘానికి అధ్యక్ష ,కార్య దర్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు ,డాక్టర్ జి .వి.పూర్ణ చంద్ గార్లు .వీరిద్దరిని అందరుగుత్తికొండ  పూర్ణచంద్ అని అని ముద్దు గా పిలుస్తారు .అంటే అంత అవినాభావ సంబంధం వున్న వారు .అలాగే పై ఇద్దరినీ మండలి లక్ష్మి ప్రసాద్ అనీ పిలవటం వుంది .వారిద్దరూ అలానే కలిసి పని చేస్తారు .భాషా సాహిత్యాల మీద ,సంస్కృతి మీద ,వ్యవాహార భాష మీద ,తెలుగు అమలు అవుతున్న తీరు మీద ,ప్రాచీనత మీద ఎన్నో సదస్సులు అత్యద్భుతం గా నిర్వహించి స్ఫూర్తి కలిగించారు .జాతీయ తెలుగు రచయితల సభలను విజయ వాడ లో నిర్వహించి రచయితలనందర్నీ ఒకే వేదిక పైకి తెచ్చి ఒక గొప్ప అడుగు వేశారుముందుకు .అ తర్వాత మొదటి ప్రపంచ తెలుగు రచయితల సభలను విజయ వాడ లోనే నాలు గేళ్ళ క్రితం నిర్వ హించి తెలుగుకు ప్రాచీన భాష హోదా కావాలన్న కాంక్షను ప్రపంచానికి అంతటికి తెలియ జేశారు .దాని ఫలితం గా 2008  నవంబర్ ఒకటి అంటే ఆంద్ర ప్రదేశ్ అవతారన  దినోత్చావం నాడు కేంద్ర ప్రభుత్వం తెలుగు కన్నడాలకు ప్రాచీన హోదా ఇచ్చింది .2010 లో ప్రపంచ తెలుగు రచయితల రెండవ సభలు మళ్ళీ విజయ వాడ లో జరిపారు .దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు హాజరై తెలుగు భాషను బ్రతికించుకోవాలనే ఆలోచన నుంచి తెలుగు చిరంజీవి అనే నమ్మ కాన్ని కల్గించారు ..అంతే కాదు తెలుగు విశ్వ వ్యాప్తమై న భాష గా చేయాలి అని నిర్ణ యానికి వచ్చారు .అంతే కాదు ,నానాటికి విస్తరిస్తున్న శాస్త్ర ,సాంకేతిక వ్విజ్ఞానాన్ని అనుసంధానం చేసి ,యువకులు తెలుగును చక్క గా వినియోగించు కొనే టట్లు చేయాలని ,ఇంటర్నెట్  లో,సెల్ ఫోన్ లలో  తెలుగు వాడే స్థితికి తేవాలని ,తెలుగు చదివే వారికి ప్రోత్చాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు .దీనితో ప్రభుత్వం కది లింది .ఇది గో ఇప్పుడే ప్రపంచ భాష కోసం తొలి అడుగు పడింది అన్న మాట .
                   దీనిని సాకారం చేయ టానికి ఈ సంవత్చరం సెప్టెంబర్ లో అమెరికా లో సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ,శ్రీ కూచి భొట్ల ఆనంద్ ,గిఫ్ట్ సంస్థ ,మండలి బుద్ధ ప్రసాద్ ,యార్ల గడ్డలు ,మంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు ఇంటర్నెట్ పై ప్రపంచ సదస్సు జరిపారు .అక్కడ చేసిన నిర్ణయాలు చాలా ఆశను కలిగించాయి .అంటే మొదటి ప్రపంచ సభలు తెలుగుకు ప్రాచీన హోదాను సంపాదిస్తే ,రెండవ సభలు శాస్త్ర సాంకేతికాలను తెలుగుకు అనుసంధానం చేసి విశ్వ వ్యాప్త మైంది తెలుగు .తెలుగు నశించిపోతుంది -మాట్లాడే వారు లేక పోవటం వల్ల అన్న అనుమానం పోయింది ,తెలుగు చిరంజీవి అనే భావం కలిగింది .తెలుగు ఒక జీవ భాష గా వర్ధిల్లు తుంది అని నమ్మకం కలిగించింది .ఈ విషయం లోమనం అందరి కంటే ముందున్నాం అని పిస్తోంది .
                     అనేక సంకేతాల లిపులను యూని కోడ్ ద్వారా సాధిస్తే ఏ కంప్యుటర్ లో నైన అది ఓపెన్ అయి  ఉపయోగ పడుతుంది .దీని వల్ల వివిధ సాంకేతిక సంస్థలు తమ ఉప కారణాలలో తెలుగును ఉపయోగించే వీలు కలుగు తుంది .దీంతో internationailation ,localisation ఒకే సారి జరుగు తాయి .ప్రపంచ భాష గా  తెలుగు భాష ను తీర్చి దిద్ద టానికి ఇది తొలి అడుగు .దీని వల్ల ప్రపంచ వ్యాప్తం గా వున్న 18 కోట్ల తెలుగువారిని తెలుగు భూమి తో అను సంధానం చేయటం జరు గుతుంది .  మనకు కావలసిన సాఫ్ట్ వేర్ తయారీకి ,వాటిని ప్రపంచ వ్యాప్తం గా అన్వయించా టానికి ,అందరి కన్నా ముందుంది నాయ కత్వం చేబట్టా టానికి యూని కోడ్ లో సభ్యత్వం అవసరం .అప్పుడిది భాషా పరిశ్రమ గా అభి వృద్ధి చెందుతుంది .జీవిత సభ్యత్వం పొందితే ఎన్నో ఉపయోగాలు వున్నాయి .దీనికి మన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం   మంత్రి శ్రీ  సి పొన్నాల లక్ష్మయ్య  గారి నాయ కత్వం లో ముందుకు వచ్చి ఆ సభ్యత్వాన్ని అంటే సంవత్చ రానికి 15000  డాలర్ల సభ్యత్వం కట్టి జీవిత సభ్యత్వం మన రాష్ట్రం పొందింది .ప్రతి సంవత్చరం డబ్బు కట్టి renue చేసు కోవాలి .ఇది ఆంద్ర ప్రదేశ్ చరిత్ర లో మైలు రాయి . యా తర్వాత ఒక్కొక్క యూని కోడ్ కు ఆరు లక్షల రూపాయలు కట్టి ఆరు తెలుగు ఫాంట్ లను కొను గోలు చేసి అందరికి వాటిని అందు బాటులోకి తెచ్చే యోచనలో వుంది .ఎనిమిది లక్ష ల తో ఒక సెల్ఫ్ చెకర్ ను ,పది లక్ష లతో ఒక ఎడిటర్ ,అయిదు లక్షలతో ఒక కీ బోర్డ్ ,ఆరు లక్ష లతో తెలుగు దాక్యుమేన్తషణ్ ,ఉపకరణాలు రూపొందించటానికి నిర్ణయించారు .తెలుగు భాష కోసం ఒకే సారి దాదాపు ఒక కోటి రూపాయలను  ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేయటం చారిత్రాత్మక మైంది .అరవై ఏళ్ళ రాష్ట్ర చరిత్రలో ఒకే సారి ఇంత డబ్బు ప్రభుత్వం ఖర్చు చేయటం ఇదే మొదటి సారి ..దీనికి మంత్రి పొన్నాల అభినంద నీయులు .బుద్ధ ప్రసాద్ చొరవ ,ఆనంద్ గారి కార్య దీక్ష ,సాంకేతిక నిపును లైన శ్రీ గారపాటి ఉమా మహేస్వ ర రావు ,పెరి భాస్కర రావు గారల సాంకేతిక ఆలోచన మెప్పు పొందాయి .
                        దీనితో మనకు ఒరిగిందేమిటి ?అని అనుమానం రా వచ్చు .ఇప్పుడు మనం తమిళుల కంటే ఒక అడుగు ముందున్నాం కారణం -వాళ్ళు u యునికోడ్   లో సభ్యత్వం పొంద లేదు .వాళ్ళే కాదు మరే భారతీయ భాషా సభ్యత్వం తీసుకో లేదు .అందుకే మనం ముందున్నాం .చదువు వచ్చినవారి  కంప్యూటర్ల లోకి తెలుగు వచ్చి చేరి  పోతుంది .అనుక్షణం పలకరిస్తుంది .  .తెలుగు వస్తేనే వుద్యోగం అనే స్థితికి అందరు వస్తారు .దీనితో ఉద్యోగావ కాశాలు పెరుగు తాయి .ఇప్పటి దాకా ”నాకు తెలుగు చదవటం రాదు ,”అని గొప్పలు చెప్పు కొనే వారి ఆటలు కట్టుతాయి .తెలుగు ఉద్యోవకాశం ఇస్తుంది అనే నమ్మకం కలుగు తుంది .బేర సారాలకు ,ఈ సేవా కార్య క్రమాకు తెలుగు తప్పని సరి అవుతుంది .సెల్ ఫోన్ లో మెసేజెస్ అన్నీ తెలుగు లోనే వచ్చి గ్రామీనులకు చాలా ఉపయోగ కరం గా వుంటుంది .
                  ఏ భాష అయినా అన్నం పెడుతుంది అని తెలిస్తే ,తప్పక ప్రజలు నేరు స్తారు .నేర్వాల్సిన అవసరం కలుగు తుంది .ఇప్పుడున్న కార్పోరేట్ కల్చర్
ఆటకేక్కుతుంది .తెలుగు మీడియం అంటే ఆరాధ్యం అవుతుంది .తెలుగుకు పట్టం కట్టే రోజూ రానే వచ్చింది .ఈ దిశ గా ప్రభుత్వం పై కదలటానికి కావలసిన ఒత్తిడి చేయాలి మనం ..ఇంత మార్పు కేవలం మూడు నెలల్లో జరిగిందంటే నమ్మ శక్యం కానంత నిజం .తెలుగు వాడు నిజం గా గర్వ పడే రోజూ .గూగుల్ ,యాహూ ,మైక్రోసాఫ్ట్ సంస్థలు తెలుగు భాషకు ప్రాధాన్యత నిచ్చే చర్యలను త్వరలో చేబట్ట బోతున్నారు .మూడేళ్ళ క్రితం తమిళం కంటే వెనక బడిన తెలుగు నేడు మూడు అడుగుల ముందు వుంది అని గర్వం గా చెప్ప గలుగు తున్నాం .తమిళులు ప్రతి ఏడు అంతర్జాతీయ ఇంటర్నెట్ సదస్సులను పదేళ్ళుగా  జరుపు కొంటున్నారు .మనము ఇక నుంచి చెయ్యాలి .
                    తెలుగు ప్రాచీన భాష హోదా సాధించిన మూడేళ్ళకు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం దానికి సంవత్చ రానికి 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది .ఆ డబ్బు తో తెలుగు భాష ప్రాచీన భాష అని రుజువు చేసే పరిశోధనలు చేబట్టాలి .భాషా కేంద్రాన్ని కేంద్రం మైసూర్ లో ఏర్పాటు చేయాలని భావించి ప్రకటించింది .కాని ఆంద్ర ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు .హైదరాబాద్ లో నే ఏర్పాటు చేయాలని మన ముఖ్య మంత్రి కూడాకేంద్రం పై   వత్తిడి తెస్తున్నారు .త్వరలోనే అధ్యన సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు అవుతుందని నమ్మకం గా వున్నాం .
                 సరియైన తెలుగు అనువాద పద్ధతులు త్వర లోనే ఏర్పాటు కావాలి కంప్యూటర్ ద్వారా సాధించే” వర్క్యుఅల్  ”విశ్వ విద్యాలయం రావాలి .వివిధ సంస్థలు సేకరించిన సమాచారాన్ని అందరు స్వేచ్చ గా ఉపయోగించు కొనే ఆవ కాశం కలగాలి .
                   ప్రాచీన హోదా నుంచి తెలుగు ప్రపంచ భాష కు ఒక గొప్ప చారిత్రాత్మకమైన ముందడుగు వేసిన శుభ సమయం ఇది .దీనికి కారణ మైన కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ,వారికి సహకరించిన విశ్వ వ్యాప్త సాంకేతిక నిపుణు లకు ,రాష్ట్రప్రభుత్వానికీ ,  ,అభినందనలు .యువతకు చేరువై తెలుగు ఒక గొప్ప వెలుగు వెలుగుతూ ,విశ్వ భాష గా ఎదగాలనీ ,చిరంజీవి గా నిలవాలనీ ఆశిద్దాం .కొద్ది కాలమ్ లో తెలుగు ”i-pad ”లు మన చిన్న నాడు పట్టు కున్న ”పలకలు ”లాగా ప్రతివాళ్ళ చేతిలోకి చేరతాయి .అంతేనా –”తెలుగులో చదువు -ఉద్యోగం పట్టు ”అనే స్లోగన్ గన్ లాగా పేలే రోజూ వస్తుంది .అంతే కాదు రాజకీయ పక్షాలు ఎన్నిక వాగ్దానం గా” రూపాయికి కిలో బియ్యం ”కి బదులు ‘రూపాయికి కంప్యుటర్ ”అనే వాగ్దానం తో ఆకర్షించే రోజూ ఎంతో దూరం లో లేదు ..విజ్ఞానం ,వివేకం కలిస్తే మనమే అందరికంటే నంబర్ వన్ .అందుకే ఆరుద్ర ”విజ్ఞానం వికసించిన మూడో కన్ను –వివేకం మీకున్న ఒకే ఒక దన్ను .”అన్నాడు .                                                                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —05 —11 -11 .
Posted in రచనలు | Leave a comment

మారుతున్న విలువలు – ఆంధ్ర జనజీవితం

MaruthunnaviluvaluOm_0003Om_0004

Posted in రచనలు | Leave a comment

ప్రపంచ తెలుగు సభలు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 
Posted in సభలు సమావేశాలు | Leave a comment

మాన వీయ మూర్తి సేనేకా వేదాంతి —-4 మరణం తో సమరం

  మాన వీయ మూర్తి సేనేకా వేదాంతి —-4
                                                          మరణం తో సమరం    
               నీరో సృజనాత్మక కళ లో ప్రతిభా వంతుడు .కవి ,చిత్ర కారుడు ,శిల్పి  కూడా .ఏది  చేసినా చాలా ఉన్నతం గా ఉండేవి .ఏది నిర్మించినా అంతే స్థాయి వుండేది .అతను రాసిన ”ఫెయిర్ పారిస్ ”కవిత ప్రశంస నీయం అంటారు .రోం చరిత్ర మీద మహా కావ్యం రాశాడు .వయసు పెరిగిన కొద్దీ సెనేట్ ను చులకన చేయటం ప్రారంభించాడు .సేనేకా పదవీ విరమణ చేసిన తర్వాత ,రాజకీయాలపై శ్రద్ధానూ ,తగ్గించు కొన్నాడు .క్రీ.శ.67 లో మిలిటరీ కమాండర్ల శిబిరం లో తిరుగు బాటు జరిగింది .పిచ్చ కోపం వచ్చి ,సేనేటర్లను ,గవర్నర్లను హత్య చేయించాడు .రోం నగ రాన్ని తగుల బెట్టించాడు .అడవి జంతువుల్ని వదిలేయించాడు జనం మీదకు .ఆ తర్వాత పశ్చాత్తాప పడ్డాడు .ఆయుధాలు దరించ కుండా సైన్యాధి కారి దగ్గరకు వెళ్లి ఏడ్చేశాదట   . .మృతులకోసం ఆడాడు .పాడాడు .తనకు ఒక గవర్నర్ పదవి ఇస్తే చాలు అని ప్రాధేయ పడ్డాడట . తాను లేకుంటే రోం కు చాలా నష్టం అన్నాట్ట .తన లాంటి కళా కారుడు మళ్ళీ దొరకడు అని సుత్తి కొట్టాడట .అతన్ని పట్టు కుందామని ప్రయత్నిస్తే దొరక్కుండా తప్పించుకొని ”ఇప్పటికే చాలా ఆలస్యమై పోయింది ”అను కుంటు కత్తి తో పొడుచుకుని చచ్చాడునీరో .పొగరు ,గర్వం అంతా జీరో అయి పోయాయి .చరిత్రలో క్షుద్రుడు గా మిగిలి పోయాడు పాపం .రోమన్ సమాజాన్ని సర్వ నాశనం చేసిన పాపం అంతా నేరో దే .అత్యుత్తమ మైన విలువలన్నిటినీ రూపు మాపాడు .నీచం గా ప్రవర్తించి ,స్వంత తల్లి నే హత్య చేసిన పరమ కిరాతకుడు అని పించుకున్నాడు .చివరికి అధికారాన్ని పోగొట్టుకొని నీరో హీరో జీరో అయాడు .అతని పాలన రోమన్ సామ్రాజ్యానికి ఒక పీడ కల అని పించాడు .చరిత్ర హీనుడు అని పించుకున్నాడు .ఇదీ సేనేకా వేదాంతి శిష్యుడైన నీరో దుస్థితి .
                    ఇప్పుడు గురువు సేనేకా మరణ ఉదంతాన్ని చూద్దాం .సేనేకా కు ఉబ్బస వ్యాధి వుంది .చావుకు భయ పడ రాదనీ ఆయన భావన .”చని పోయిన వాడి స్థితి పుట్టబోయే బిడ్డ స్థితి వంటిదే ”అంటాడాయన .చావు కూడా ఒక దశ మాత్రమే నని అభిప్రాయ పడ్డాడు .శాశ్వతత్వం ఒక కల మాత్రమే న్నాడు ..అప్పటికే వయసు 70 ..”ఆన్ గుడ్ డీడ్స్ ” పుస్తకం రాస్తూ ”ఒక క్రూర నియంతను చంపటం ,అతనికి ,ప్రజలకు మేలే చేస్తుంది-చాలా అరుదైన సందర్భాలలో .నీరో చావూ అలాంటిదే .”అన్నాడు శిష్యుడైన నీరో గురించి .క్రీ.శ.62  వరకు ఇద్దరు జిగినీ దోస్తులే .తరువాత బద్ధ విరోదులైనారు .తల్లిని ,సోదరున్ని చంపిన నీరో కు గురువు సేనేక అడ్డం వచ్చాడని పించింది .ఇది తెలుసుకున్న సేనేకా తన చావు తన ఇష్టం ప్రకారం జరిగే ఏర్పాట్లు చేసు కున్నాడు .భర్త తో పాటు తానూ చస్తానంది భార్య.”నీ జీవితాన్ని సహనం తో ఎలా సాగించాలో నేను నీకు నేర్పాను .కాని నువ్వు గౌరవాత్మకం గా ,నాతొ సహగమనం చేసి ,ఆదర్శం గా వుండాలను కోవటం మంచిదే .ఇద్దరం ఇదే ధృఢ సంకల్పం తో ,ధైర్యం గా మరణిద్దాం ”అని చెప్పాడు భార్య పాలీనా కు సేనేక.
                       ఇద్దరు ఒక గది లో కి చేరారు తమ ఇంటిలో .ఒకే ఒక కత్తి వేటు తో ఇద్దరూ ,రక్త నాళాలను తెగ కొట్టు కున్నారు .సేనేకా తన మోకాళ్ళు ,కాళ్ళ నాళాలు తెగ కోసుకున్నాడు .బలహీనుడు ,తగినంత ఆహారం లేక కృశించిన వాడు అయినందున రక్తం చాలా నెమ్మది గా కారు తోంది .తన బాధ చూసి భార్య తట్టు కో లేక పోతోందని తెలిసి ఆమెను పక్క గది లోకి వెళ్ళ మన్నాడు .ఇంకా మాట్లాడే శక్తి వుండటం తో తన సందేశాన్ని చెబుతూ ,శిష్యుడి తో రాయించాడు .అది సేనేకా మరణం తర్వాత ప్రచు రించ బడింది . .నీరో కు సేనేకా మీదే కోపం గురు పత్ని పాలీనా మీద కోపం లేదు . .ఇక్కడి విషయాలు వేగుల వాళ్ల ద్వారా తెలుసు కొని సైనికులను పంపించి పాలీనా ను కాపాడాడు .దోషులను శిక్షించటానికి తన దగ్గర దాచుకున్న విషాన్ని  .కొంత  ఇప్పుడు అతను తాగాడు .మిగిలిన విషాన్ని డాక్టర్ ద్వారా పారేయించాడు-ఇంకెవరికి ఉపయోగ పడ కుండా .అప్పటికే సేనేకా శరీర భాగాలు మొద్దు బారి పోయాయి .
అతన్ని పాపం విషం కూడా ఏమీ చేయ లేక పోయింది .వేన్నీళ్ళ తొట్టెలో స్నానం చేశాడు .కొంత నీటిని”జూపిటర్ లిబెరేటార్ ” దేవతకు అర్ఘ్యం గా సమర్పించాడు .తర్వాత శిష్యులు ,ఆవిరి స్నానం చేయించారు .అందులో ఊపిరి ఆడకుండా ఉండేట్లు చేయించుకొని ఊపిరి తీసుకొని  చని పోయాడు వేదాంతి సేనేకా .ఏ విధ మైన రాచ మర్యాదలు లేకుండా సేనేకా అంత్య క్రియలు జరిగాయి .
                          ఒకసారి సింహావలోకనం చేద్దాం .సేనేకా కు ఇష్టమైన దర్శనం స్టాయిసిజం .అది ఒక వైఖరిఅని ,అది చాలా ముఖ్య మైనదని అతని భావం .మనతోనే ఏదైనా ప్రారంభించాలి అని అతని సిద్ధాంతం .మనకు వచ్చే భావాలతో మనం జీవిత నాణ్యత ను పెంచుకోవాలి .ఆ తర్వాత ఇతరులకు ఏదైనా బోధించాలి .సేనేకా అసలు స్పైన్ దేశస్థుడు .తర్వాత రోం చేరాడు .అనర్గల వాగ్ధాటి వున్న వాడు .శాస్త్ర ,సాహిత్య ,అలంకార ,వేత్త .గొప్ప రాజా నీతిజ్ఞుడు .వేదాంతి.నాటక రచయిత .దీనికి మించి గొప్ప కవి .సేనేకా యేసు క్రీస్తు సమకాలికుడు .రాజుల ,అధికారుల ,రాజా బంధువుల అవినీతిని వ్యతిరేకించి ,పతన మవు తున్న గ్రామీణ వ్యవస్థను కాపాడ టానికి యోధుడు గా పోరాడి నూత్న దృక్పధం లో ,జీవించిన మానవీయ మూర్తి ,స్టాయిసిజం వేదాంతి సేనేకా .
                                            సంపూర్ణం 
                                                                    మీ –గబ్బిట .దుర్గా ప్రసాద్ —04 -11 .11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad 
Rtd. head Master
Sivalayam Street 
Vuyyuru 

Krishan District 
Andhra Pradesh 
India 
 phone : 08676-232797
           958676-232797
Cell :     9989066375 

(248) 786-8594

 
 
 
 
Posted in రచనలు | Leave a comment

కార్టూన్ రంగం లో సంచలనం

Charles M Schulz

 

Posted in రచనలు | Leave a comment

మానవీయ మూర్తి సేనేకా వేదాంతి —-3

మానవీయ మూర్తి సేనేకా వేదాంతి —-3
                                                            rome is burning
                        కవిత్వం రాయటానికి నీరో ఉత్చాహం చూపించే వాడు .దీని వల్ల గ్రీక్ ,లాటిన కవులకు మంచి ప్రోత్చాహం కలిగింది .తల్లి అగ్రి పీనా మరణం తర్వాత ”నీరోనిమాయే ”కొత్త ఆవిష్కారం గా మారింది .  క్రీ..శ.64  జూన్ 18 న  రోం లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది .ఆరు రోజులు పాటు సాగింది .రోం లోని 14 ప్రాంతాలలో మూడు పూర్తిగా మాడి బుగ్గి అయ్యాయి .క్రీ .పూ.388 లో గాళ్స్ దాడిలో నష్ట పోయి నంతగా మళ్ళీ రోం అంత నష్టాన్ని పొందింది .దీన్నే చరిత్ర కారులు
Universal cATOSTROPHY ”అంటే ప్రపంచ వినాశనం అన్నారు .కాని నీరో చక్ర వార్తే తగుల బెట్టాడని క్రిస్తియన్లు నమ్మారు .దీనికి మూఢ నమ్మకం తోడైంది .జుడాక్ లో ప్రారంభమై ,మళ్ళీ రోం దాకా అగ్ని వ్యాపించింది .క్రిస్తియన్లను అందర్నీ అరెస్ట్ చేయించాడు నీరో .హింసించాడు ,చంపించాడు .చస్తుంటే విక్రుతానందాన్ని పొందాడు .అందుకే ”రోం తగలడుతుంటే నీరో ఫిడేల్ వాయించాడు ”అనటానికి కారణమైంది .శవాలను కుక్కల పాలు చేశాడు .చీకటి పడ గానే శిలువ వేయించే వాడు .శవాల మంటలే రాత్రికి రోం లో దీపాలు .శవ దీపాలన్న మాట .రధాన్ని నడుపు కుంటూ జనం లోకి వచ్చాడు .రాక్షసానందాన్ని అనుభవిన్చాతానికి  .యేసు క్రీస్తు పడ్డ బాధలన్ని నీరో హయాం లో క్రిస్తియన్లు అనుభ వించారు .ఒకే ఒక్క నర రూప  రాక్షసుడి వల్ల ,దౌష్ట్యం వల్ల వీళ్ళంతా సమిధల్లా మాడి పోయారు .అప్పుడే
రోమన్ సామ్రాజ్యాన్ని ”క్రీస్తు వ్యతి రేక రాజ్యం ”గా ప్రకటించాడు .దీనితో క్రిస్తియన్లు అంతా ఏకమై నీరో పై పోరాటం చేశారు .
                           ఇవన్నీ చూస్తూ సేనేక ఒక విషయం తెలిపాడు .”నువ్వు భయ పడే వాడిని నువ్వు ప్రేమించ లేవు .దేవతలు భయ కార కత్వం కలి గించరు .సేనేకా ద్రుష్టి లో చెడ్డ వారికీ మంచే చేయాలి .భార తీయ భావనలో చెప్పినట్లు సూర్యుడు అందరి మీద పక్ష పాతం లేకుండా కాంతిని ప్రసరింప జేస్తాడు అన్నట్లే పాపాత్ముల పైనా ప్రేమను చూపించాలి ..సముద్రం సముద్రపు దొంగలకు కూడా చోటు కల్పిస్తోంది .,.ఇచ్చి ,నష్టం పొందిన దాని కంటే పోగొట్టుకొని ఇవ్వటం చాలా ఉత్తమం, ఉదాత్త మైన  విషయం అంటాడు సేనేకా .భూమి కంటే అనేక రెట్లు పెద్దదైన సూర్య గోళం భూమి నుంచి పోషకత్వం పొందు తుంది .సూర్యుడు ప్రాణ శక్తిని ,పోశాకత్వాన్ని భూమికి తిరిగి ఇచ్చేస్తాడు .గుడ్డు  పిల్ల గా ఎదగ టానికి కావలసిన పోషణ  అంతాలోపలి నుంచే జరుగు తుంది .అలానేప్రపంచం అంతా ఉద్భావన్చిన కాలం నుంచే అభి వృద్ధి బీజం వుంది . మంచిని కనుక్కోవటం చాలా కష్టం .దానికి ఒక నాయకుడు ,ఒక మార్గ దర్శి కావాలి .చెడును గురువు అవసరం లేకుండా నే నేర్చు కో వచ్చు .నైలు నది వరదల గురించి ,భూకంపాలను గురించి ,చాలా శాస్త్రీయం గానే సేనేక చెప్పినట్లు జర్మన్ పండితుడు ,మేధావి” గోథె ”  రాశాడు .తోక చుక్కలు ,మెరుపుల గురించీ వివరించాడు సేనేక.గ్రహాలూ లాగానే కామేట్స్ స్థిర మార్గం లో చలిస్తాయి అన్నాడు .  .
                 కొద్ది కాలం లోనే కామేట్స్ గురించి పూర్తి సమాచారాన్ని చెప్ప గల వారు భవిష్యత్ లో వస్తారు అన్నాడు .నీరో కాలం లోనే 211  వ ఒలింపిక్స్ ,క్రీ.శ.65 నుండి 67 కు వాయిదా పడ్డాయి .చరిత్ర లో ఇలా జరగటం అదే మొదటి సారి .సంగీత ,నాటకాలలో ను పోటి పెట్టారు .ఈ రెండింటి లోను నీరో నే మొదటి బహుమతి పొందటం విశేషం .క్రీ.శ.67  నవంబర్ 28  న గ్రీకులకు స్వాతంత్ర్యం ప్రకటించాడు నీరో .
                                                                 సశేషం
                                                                                          మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ .—03 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు | Leave a comment

మానవీయ మూర్తి సేనేకా వేదాంతి —–2

            మానవీయ మూర్తి సేనేకా వేదాంతి —–2
                                                                 స్టాయిసిజం
                  స్టాయిసిజం అంటే ఏమిటో తెలిసింది .ఇప్పుడు అది వ్యాపించినవిధం  చూద్దాం .గ్రీకు దర్శన చరిత్ర లో చివరి యుగం లోనిదే ”స్టాయిసిజం ”నైతికం ,దార్శనికం ఇందులో ముఖ్య భాగాలు .క్రీ.పూ.300  లో ఎతేన్సు లో ”జీనో ”అనే వేదాంతి దీన్ని ప్రారంభించాడు ”.స్టోవా ”అంటే చిత్రాలు వేసే చోటు .యా చోటులో ప్రారంభించారు కనుక ”స్టాయిసిజం ”అనే పేరు వచ్చింది .సినిక్ దార్శనికుడైన క్రేటాస్ శిష్యుడే జీనో .అందులోని సిద్ధాంతాల ఆధారం గానే దీన్ని అభివృద్ధి చేశాడు .హిరక్లైటాస్ అనే వేదాంతి మన విశ్వాన్ని విశ్వాగ్ని అనీ ,అంటే లాగోస్ అనీ ,–కాలమ్ అనీ సిద్ధాంతం చేశాడు .క్రిసిప్పాస్ అనే ఆయన దీన్ని అందరికి అందుబాటు లోకి తెచ్చాడు .క్రీ.పూ.189 -109  లో పేనేటియాస్ ఈ సిద్ధాంతాన్ని రోమన్ సామ్రాజ్యం లో ప్రవేశ పెట్టాడు .దీన్నే ”మిడ్ -స్టోవా ”అన్నారు .రోమన్ ఉన్నత కుటుంబాలలో ,ఈ సిద్ధాంతం బాగా వ్యాపించి రెండు శతాబ్దాలు జీవించింది .క్రీ శ.ఒకటవ శతాబ్దం లో సేనేకా ,ఎపిక్తేతాస్  ,ఒరీలియాస్ లు బాగా వ్యవస్థీకరించారు .మూడవ శతాబ్దం లో ఈ భావాలన్నే క్రైస్తవ మతం లోకి చేరి పోయాయి .రోమన్ ధర్మ శాస్త్రం పై స్టాయిసిజం ప్రభావం ఎక్కువ గా వుంది .ఇందులో తర్కం ,భౌతిక,నీతి శాస్త్రాలు
                     తర్క శాస్త్రం —-దీనిలో గుణాలు ,సంబంధాలు మనసు చేత సంకల్ప మైనవి కావు .ప్రకృతి సహజాలు .సత్య దర్శనానికి అనుమాన ప్రమాణం మార్గమే .అరిస్టాటిల్ న్యాయ ప్రయోగ సిద్ధాంతాలు దీనికి మూలం
             భౌతిక శాస్త్రం —-ఇందులో విశ్వానికి కారణం అగ్ని అంటారు .అదే ఈశ్వరుడు .సత్తా లో రెండు సత్వాలు వున్నాయి .ఒకటి సచేతన మైనది  –ఇదే కార్య కారకం .రెండు స్వయం చాలకం . –ఇతర వస్తువుల్ని రూప కల్పన చేస్తుంది .అలాగే వీరి దృష్టిలో జడం కూడా మార్పు పొందుతుంది .-ఆలోచనల తో విడదీయ వచ్చు .నియత వాదాన్ని( Determinism )సమర్ధించారు .ప్రతి విషయం కూడా ఇది వరకే నిర్ణ యిమ్పబడి వుంటుంది .మన మహా భారతం లో కూడా కురుక్షేత్ర యుద్ధం ముందే పైలోకాలలో జరిగింది.ఇక్కడ మళ్లే జరుగు తోంది అని వ్యాసుడు చెప్పాడు .విధిని అంగీకరించాలి .దీనికీ స్వేచ్చ వుంది .
                 నీతి శాస్త్రం —-సృష్టి ణియమం అంటే లోగోస్ దాని క్రమ హేతువును తెలుసు కోవటం మానవ కర్తవ్యం .హేతు బుద్ధి తో ఉన్నత జీవితాన్నిగడపాలి  .సుఖం ధర్మానికి భిన్న మైనది .సుఖం ఒక రాగమే .స్తాయిక్ అంటే ఆ సిద్ధాంత అవలంబకుడు రాగాలను లోబరచు కోవాలి .రాగాల వల్ల బాహ్య పరిస్థితులకు లోబడ తారు .ఆరోగ్యం ,జీవితం ,మర్యాద ,ధనం ,హోదా ,అధికారం స్నేహం ,విజయం స్వతస్సిద్ధాలే .అవి శ్రేయస్కరాలు శ కావు .వీటి ఆచరణ మన లక్ష్యం కాదు .స్వేచ్చ ,ఆనంద సాధన మన శక్తికి మించినవి .వాటి పై దృష్టి మార్చుకో వచ్చు .వాటి విలువ మన ”శీలం ”పై ప్రభావం చూపు తుంది .ధర్మమే అన్నిటిలోనూ ఉత్తమ మైనది .అదే ఆనందాన్ని ఇస్తుంది .విచక్షణ తో జీవించాలి .వైరాగ్యం ,రాగ సంబంధ విమోచానాలే వీళ్ళ నైతిక లక్ష్యం .వీళ్ళు ఆత్మ హత్యను సమర్ధించారు .
                                       నీరో –హీరో —జీరో
                రోమన్ సామ్రాజ్యం లో చక్ర వర్తి నీరో కు ,వేదాంతి సేనేకా కు చాల ప్రాముఖ్యం వుంది .నీరో ను హీరో ను చేసింది ఈయనే చివరికి శిష్యుడి చేతి లో జీరో అయి పోయాడు పాపం.వాళ్ళిద్దరి హవా సరదాగా నేసాగింది  మొదట .తర్వాత ఆది పత్య పోరు మొదలైంది .రాజా కీయం లో ఎవరు పాచికలు చురుకు గాఆడితే   వాళ్ళే గెలుస్తారు .మన దేశం లో కూడా నెహ్రు కుటుంబం లో ఇందిరా గాంధికి ,విజయ లక్ష్మి పండిట్ కు రాజకీయ  పోటీ వస్తే పావులు చక చకా కదిపి మేనత్తకు చెక్ పెట్టింది ఇందిరా అన్న సంగతి మనకూ తెలిసిందే .”మీ ఓటమికి కారణం ఏమిటి “?అని పండిట్ ను అడిగితే”’ నా కంటే నా మేన కోడలు వేగం గా పావులు కదపటమే ”అంది పాపం విజయ లక్ష్మి చేజార్చుకున్న విజయం పై ..అలాగే సేనేకా ,నీరోలు .
                    రోమన్ సామ్రాజ్యం లో ఒక వెలుగు వెలిగిన వేదాంతి గా సేనేకా ను చెప్తారు .క్రీ.పూ.ఏడవ శతాబ్దం లోనే ”వర్క్స్ అండ్ డేస్ ”అనే ”హిసాయిడ్” కవిత రాశాడు .ప్రపంచ విప్లవ చరిత్ర లో ఇదే మొదటి విప్లవ కవిత .రైతులు పొలం పనులు ,ఇంటి పనులు ఎలా చక్క దిద్దు కోవాలో ఇందులో వివ రించాడు .ఏది చెప్పినా సహజ పధ్ధతి లో చెప్పటం సేనేకా ప్రత్యేకత .సి -ఫారింగ్ (sea  faring) అంటే  సముద్ర   వ్యాపారం  గురించి  ఇందులో వివరం   గా చెప్పాడు .సమాజం లో నీతి ,న్యాయం వుంటే మనుష్యులు సముద్రం జోలికి వెళ్ళ నక్కర లేదని అప్పుడు భూమి సస్యశ్యామలమై ,అధిక పంటలను అందిస్తుందని చెప్పాడు .రోమన్ సామెత ఒకటి వుంది ”ఎవరి అదృష్టానికి వారే కర్తలు –ధైర్యే సాహసే లక్ష్మి ”.రోమన్ యోధులు అదృష్టానికి పరికరాలు .కాలమ్ లో ప్రతిదీ పుట్టి ,కాలమ్ లోనే కలిసి పోవటం సహజం .ఇది ఒక జీవన వృత్తం (లైఫ్ సైకిల్ ).బయటి దాని వల్ల నాశనం కాక పొతే ,లోపలి పరిస్థితుల వల్ల నైనా నశిస్తుంది .ఇదే విధం గా రోం ఉత్థానం ,పథనం చెందింది .డబ్బు కాంక్ష మొదలై ,దాన్ని అధికార కాంక్ష ఆవహిస్తుంది .ఈ రెండే చెడుకు ఆధారాలు అవుతాయి .జూలియస్ సీజర్ 365  రోజుల సంవత్చర కాలెండర్ ను ప్రవేశ పెట్టాడు .రోం ఏర్పడిన 365  సంవత్చ రాలకు” gauls ”రోం ను జయించి క్రీ.పూ.388 లో స్వాధీనం చేసు కున్నాడు .క్రీ .పూ. 23 న రోం లో మళ్ళీ సంక్షోభం ఏర్పడింది .సీజర్ మరణం తో 44 బి సి.లో మళ్ళీ అంతర్యుద్ధం చేల రేగింది .
                     రోమన్ రాజు క్లాడియస్ ,అగ్రిపీనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .ఆమె కొడుకు లూసియాస్ దోమితాస్ ను దత్తత చేసు కొన్నాడు .అతనికి ”నీరో క్లాడియస్ ద్రూసాస్ జేర్మేనికాస్ సీజర్ ”గా పేరు మార్చాడు .ఇతడే మన హీరో ”నీరో ”.అతనికి తన కూతురు ఆక్టేవియ తోనిశ్చి తార్ధం   జరి పించాడు .క్లాడియస్ తర్వాత నీరో ను వారసునిగా తెచ్చే ప్రయత్నం లో తల్లి అగ్రి పీన వుంది .అడ్డం వచ్చిన వాళ్ళను నిర్దాక్షిణ్యం గా తొలగించే ఏర్పాట్లు చేస్తోంది కూడా .నీరో కు మాత్రం ప్రజలకు దగ్గర అవాలన్న కోరిక బలీయం గా వుంది .అతను రాచ మర్యాదలు దాటు తాడేమో నని తల్లి ఆరాట పడేది .కొడుకును గుప్పిట్లో పెట్టుకుంది .నీరో ను ఇతరుల కంటే మహా బల వంతునిగా ,సృజన కారుని గా చేయాలనే కోర్కె సేనేకా కు వుండేది .గురు భక్తీ ప్రదర్శించి నీరో సేనేకా మనసు గెలిచాడు .కళా ,శాస్త్ర విషయాలను నీరో కు బోధించాడు గురువు సేనేక.తల్లికి ఇష్టం లేని తర్క శాష్ట్రాన్ని మాత్రం నేర్చుకో లేదు .నీరో కళ కళ కోసం కాకుండా జీవితం కోసం నేర్చాడు .అవసరం వస్తే ,సందర్భాన్ని బట్టి తన వాగ్దాటిని ప్రదర్శించే వాడు .అతని ప్రసంగాలను సేనేకా నే రాసి పెట్టె వాడు .సేనేకా సూచించిన విధం గా ఆసియా మైనర్ లో వున్న ”ఇలీయం ”కు ట్రాయ్ లో లాగా పన్నులు లేకుండా స్వతంత్రాన్ని ఇప్పించాడు నీరో చక్ర వర్తి చేత గురువు సేనేక ..
                    నీరో కలిగువా కుమార్తెను వివాహం చేసుకొని ,అగస్తస్ సీజర్ లాగ సంపూర్ణ అధికారాలు పొందాడు .క్రీ.శ.లో తండ్రి క్లాడియస్ మరణించాడు .శవ యాత్ర లో నీరో గొప్ప ప్రసంగం చేసి ప్రజల మనసు దోచాడు .ఈ ప్రసంగాన్నీ సేనేకా ఏ రాశాడు .క్లాడియస్ పరిపాలనా విశేషాలను ,అతను శాస్త్రీయం గా సాధించిన పురోగమనాన్ని ,వివరించాడు ప్రసంగం లో .అంతఃపురం లో రాజా కుట్రలు సాగుతున్నాయి .నీరో తన మాట వినటం లేదని తల్లి అతన్ని గద్దె  దించటానికి సేనేకా సాయం కోరింది .ఆ స్థితి లో ఆమెకు వ్యతి రేకులు బలం గానే వున్నారు .వాళ్ళను అడ్డు తొలగించ్కునీ ఏర్పాట్లు ముమ్మరం గా చేస్తోంది .నీరో హీరో ను చక్ర వర్తిని చేసేసింది కదా ముందే తన కున్న అధికారం ,ముందు చూపుతో .
                     క్రమంగా పరిస్థితులు మారి పోయాయి .తల్లికి కొడుకు దూరం అవుతున్నాడు .దీన్ని జీర్నిచుకో లేక పోతోంది తల్లి .తన స్వతంత్ర భావాలను ప్రకటించటం ప్రారంభించాడు .దేశం లో మొత్త మొదటి సారిగా ఆటలను ప్రోత్చ హించాడు .తన రధం తానే తోలు కుంటు ,ప్రజల మధ్యకు వచ్చే వాడు .దియేటర్లలో నాటకాలు ఆడే వాడు .కవిత్వమూ చెప్పే వాడు .సర్కస్ ప్రదర్శన ఏర్పాటు చేసి ,ప్రజలంతా వచ్చి చూసే వీలు కల్పించాడు .పై అంతస్తు లోని ప్రజలు కూడా వచ్చి పాల్గొనే టట్లు చేశాడు .గ్రీక్ ,లాటిన్ డ్రామాలను ఆడించాడు .గుర్రపు స్వారీ పోటీలు నిర్వహించాడు .ఆటలు ,క్రీడలు కు ప్రాధాన్యత నిచ్చాడు .ప్రతి అయిదు ఏళ్ళ కోసారి పోటీలు జరిపించే వాడు .ఈ పోటీల వల్ల సంఘం లో నైతిక పథనం ఏర్పడిందని తాక్తికాస్ అనే చరిత్ర కారుడు ఆనాడు .జిమ్నేసియం కూడా ఏర్పరచాడు .దిగంబర పోటీలూ నిర్వహించాడు .సెనెటర్లకు ,నోబుల్స్ కు కూడా అవకాశం కల్పించాడు .ఈ పద్ధతు లన్నీ గ్రీకుల నుండి సంకర మించినవే .నీరోయిక్ పోటీలు అని పిలువ బడే ఈ పోటీలలో గ్లాడియేటర్ పోటీలు అంటే మల్ల యుద్ధాలు లేవు .ప్రశాంత మైన ఆటలకే ప్రాధాన్యత హెచ్చు .హాని చేసే పోటీలు లేవు .పై అంతస్తు జనాన్ని అవమాన పరచటానికే వీటిని నీరో ఏర్పాటు  చేశాడనే విమర్శ వుంది .ఇవన్నీ ప్రభుత్వం ఖర్చుతో ఏర్పాటు చేసినవే .క్రీ;శ.65  వరకు నీరో వీటిలో ప్రత్యక్షం గా పాల్గొన్నాడు .ఈ రకం గా సాంస్కృతిక కార్య క్రమాలలో గొప్పమార్పులు  తెచ్చిన హీరో  నీరో చక్ర వర్తి .ఏది చేసినా సేనేకా తో సంప్ర దిస్తూనే వుండే వాడు .
                                     సశేషం
                                                           మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —03 -11 -11 .
Posted in రచనలు | 1 Comment

చివరికి మిగిలేది ఎన్ని భాషలలో వచ్చినా నటన పరంగా చివరికి మిగిలేది సావిత్రే

ఎన్ని చివరికి మిగిలేది ఎన్ని భాషలలో వచ్చినా నటన పరంగా చివరికి మిగిలేది సావిత్రే ——-దుర్గా ప్రసాద్

Posted in సేకరణలు | Leave a comment

మాన వీయ మూర్తి సేనేకా వేదాంతి ——-1

మాన వీయ మూర్తి సేనేకా వేదాంతి ——-1

                                                                        జీవిత విశేషాలు
సేనేకా వేదాంతి క్రీ.పూ.నాలుగు నుంచి క్రీ.శ.65 వరకు జీవించాడు .రోమన్ వేదాంతి గా ,మహా వక్త గా ,విషాదాంత జీవి గా ,రోంసామ్రాజ్యం లో అత్యంత మేధావి గా పేరు పొందాడు .54ad  నుంచి 62ad  మధ్య కాలమ్ లో రోమన్ సామ్రాజ్యానికి పరోక్ష పరిపాలకుని గా వెలిగాడు .అప్పుడు నీరో రాజు ఇంకా బాలుడే .సేనేకా ధనిక కుటుంబం లో జన్మించాడు .తండ్రి ఏవియస్ -ఉపాధ్యాయుడు .తల్లి హేన్వియ -బాగా చదువుకున్న స్త్రీ .ఆమె పెద్దన్నయ్యే గెలీలియో శాస్త్ర వేత్త .సేనేకా అంటి రోం కు తీసుకుని వెళ్లి మంచి శిక్షణ నిప్పించింది .sexti  స్కూల్ లో వేదాంతం చదివాడు .ఆ స్కూల్ లోనే స్టాయిసం పుట్టింది . దీనినే” నియో పైథాగరిజం” అంటారు .ఆరోగ్యం పాడైతే ఈజిప్ట్ చేరాడు ..
            క్రీ.షా.31 లో మళ్ళీ రోం లో కాలు పెట్టాడు . రాజకీయాలు ,న్యాయ శాస్త్రం లో నిష్ణాతుడు అయాడు .రోం చక్ర వర్తి ”కాలిగులా ”చేస్తున్న తప్పులన్నీ బయట పెట్టె వాడు .చక్ర వర్తి కి చావు దగ్గరకు వస్తూండటం తో   ఏమీ చేయ లేక పోయాడు .క్రీ.శ.41 లో  రాకుమారి ”జూలియ విలియ”తో వ్యభిచారించాడనే ఆరోపణతో ,దేశ బహిష్కారానికి గురైనాడు .ప్రకృతి శాస్త్రం ,వేదాన్తాలను బాగా కాచి వడపోసి గొప్ప వాడైనాడు” consolations  ”  అనే మూడు ఉద్గ్రంధాలు (tritain )  రాశాడు .చక్ర వర్తి భార్య ”అగ్రిపీనా ”అభ్యర్ధన పై మళ్ళీ రోం కు చేరాడు .క్రీ/శ.50 లో praetor  అయాడు .”పామ్పియా పాలినా ”ను వివాహం చేసు కున్నాడు .నెమ్మదిగా బాలనీరో   కు గురువు అయాడు .క్రీ.శ.54 లో  క్లాడియన్ హత్య తో సేనేకా ,అతని స్నేహితుడు బర్స్  ఇద్దరు అధికార ప్రాభవం సంపాదించారు .వీరిద్దరి స్నేహితులు అంతా కలిసి ఒక శైనిక సమూహాన్ని తయారు చేసి ,జర్మన్లను ,పార్దియన్లను అదుపు లోకి తెచ్చి సామ్రాజ్యాన్ని కాపాడారు .
                       చక్ర వర్తి నీరో మొదటి ఉపన్యాసాన్ని సేనేకా నే తయారు చేశాడు .అందు లో రోమన్ సెనేట్ కు స్వేచ్చ ను ప్రకటించాడు .నీరో పై తల్లి అగ్రి పీనా ఆధిపత్యం ఎక్కు వై పోయింది .రోమన్ సామ్రాజ్య స్థితి గతులు ,సేనేకా ,బార్స్ లకు బాగా ఆకళింపు అయాయి .బానిసల మీద మాన వత్వం తో ప్రవర్తించే శాసనాలు ప్రవేశ పెట్టించారు .ఆర్ధిక ,న్యాయ విషయాలలో ప్రజలకు అను కూలంగా సంస్కరణలు తెచ్చాడు సేనేకా …సేనేకా ప్రతినిధి అయిన ”కార్బులో ”పార్దియన్లను ఓడించి ,రాజ్యానికి స్థిరత్వం కల్పించాడు .అప్పటి దాకా వున్న అంతర్యుద్ధంపూర్తిగా అణగి పోయింది .క్రీ.శ.59 లో నీరో తన తల్లి ని హత్య చేశాడు .దీన్ని సేనేకా బాహాటం గానే ఖండించాడు .బార్స్ మరణించాడు .అది సేనేకా ను కలచి వేసింది .పదవీ విరమణ చేశాడు .ఆ  తర్వాత అత్యున్నత స్థాయి వేదాంత గ్రంధాలు రాశాడు .సేనేక శత్రువులు ,అతనిపై ,”పిసో ”అనే వాడితో కలిసి కుట్రకు తోడ్పద్దాడని రాజా ద్రోహ నేరం మోపి ,ఆత్మ హత్య చేసుకోమని హుకుం జారీ చేయించారు నీరో తో .అలాగే కత్తితో కాలు కోసుకొని రక్త స్రావం తో మరణించాడు సేనేకా వేదాంతి .ఆ వివ రాలు తరువాత తెలుసు కుందాం .
                                            రచనలు
                   సేనేకా రాసిన ”క్లాడియాన్ జీవిత చరిత్ర ”గొప్ప గ్రంధం గా పేరు పొందింది .అలాగే కొడుకు చని పోయిన తల్లిని ఓదార్చే consolations  ఉత్తమ రచన గ గుర్తింపు పొందింది .స్టాయిజం సిద్ధాంత కర్తల జీవితాలు ,రచనల పై సాధికారం గా Devitis ,Devita ,Beata  అనే అత్యుత్తమ గ్రంధ రచన చేశాడు సేనేకా .విషాదాంత రచనలు (trajedies )పది రాశాడు .staayk వేదాంతం సేనేకా ను నిత్య స్మరనీయున్ని చేసింది .
                                                    స్టాయిసిజం( Stoicism )
                అసలు స్టాయిసిజం అంటే ఏమిటో ముందు తెలుసు కుందాం .ఇదొక వేదాంత విధానం .గ్రీకో -రోమన్ నాటిది .ఇందులో విధ్యుక్త ధ్రర్మం( డ్యూటీ)కి ప్రాధాన్యత ఎక్కువ .హేతువు (Reason )తో విశ్వాన్ని అర్ధం చేసు కోవాలి .విధి బలీయం .ప్రపంచం లో జరిగే వాటిని ప్రశాంత చిత్తం తో అనుభవించాలి .స్తాయిజం సిద్ధాంతాన్ని క్రీ.పూ.300 లో ”జీనో అఫ్ సిటియం ”ప్రతి పాదించి ,ఉద్యమం గా నడిపాడు .అది 200 ad  వరకు బ్రతికింది .మనిషికి ఆరోగ్యం ,సంపద మాత్రమే అవసరం కాదు .పరంపరగా వస్తున్న నైతిక సిద్ధాంతాలపై విరుచుకు పడ్డ సిద్ధాంతంఇది .సుఖము ,శాంతి మనిషికి చాలా ముఖ్యం .ధర్మం లేక సన్మార్గం (Virtue ).
అధర్మం లేక దుర్మార్గం (Vice )అనేవే మంచి ,చెడు .సన్మార్గం  లాభదాయకం .దుర్మార్గం అపాయ కరం .మిగిలిన వన్నీ వీటి తర్వాతే .ఆనందం ,దుఖం అనేవి పుట్టుక ,పెంపకం మీద ఆధార పడి వుండవు .ధర్మంగా వుంటే అంతా మంచే జరుగు తుంది .జాతి ,స్థితి (హోదా ),లింగ భేదాలకు అతీతం గా వుండే సిద్ధాంతం ఇది .Ethical Docrine was the core of Stoicism ‘అంటారు .అంటే నీతి సిద్ధాంతమే ఇందులో అతి ముఖ్య మైన భాగం .ఇది పాశ్చాత్య నాగరకత పై గొప్ప ప్రభావం కల్గించింది .,సేనేకా ,ఎపిక్తకస్ ,మార్క్ ఆరిలాస్ అనే ముగ్గురు ఈ సిద్ధాంతాన్ని ,బాగా వ్యాప్తి చేశారు .సిసిరో కాలానికి స్టాయిసిజం బాగా తగ్గి పోయింది .క్రమంగా స్టాయిసిజం లోప్లాటో నిజం   కలిసి పోయింది ..
                                     సశేషం
                                                               మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —03 -11 -11 .
Posted in రచనలు | Leave a comment

బౌద్ధం లో వచ్చిన పరిణామాలు —-3 గుహ్య సమాజ తంత్రం

       బౌద్ధం లో వచ్చిన పరిణామాలు —-3
                                                                         గుహ్య సమాజ తంత్రం
                      ”  శరీరాన్ని కష్ట పెట్టటం వల్ల ,ఇంద్రియాలను నిగ్రహించుకోవటం వల్ల మోక్షం రాదు ,.ఇలాంటి కష్టతర మార్గాల వల్ల పరి పూర్ణత రాదు .కోరికలన్నీ పూర్తిగా అనుభవిస్తేనే మోక్షం ”అని గుహ్య సమాజ తంత్రం చెబుతుంది .బుద్ధుడు జీవ హింస ,మద్య ,మ్మాంసాలు విసర్జించమని కోరితే ,ఈ తంత్రం మాంసమే కాదు ,నరమాంసము భక్షణ చేయమన్నది .ఇష్టమైన స్త్రీ తో భోగించమన్నది .నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించ మన్నది .”నువ్వు యోగివి .సమాజం అసంపూర్నులతో నిండి వుంది .అసంపూర్నుల కోసమైన సామాజిక నియమాలు యోగులకు చెల్లవు ”అని తీర్పునిచ్చింది . .యదేచ్చా విహారానికి తెర లేపింది మంత్రాలు ,ముద్రలు ,మండలాలు వ్యాప్తిప్లోకి వచ్చాయి .జనాకర్షణ పెరిగింది .ఆ కాలమ్ లోనే ఉత్కళ దేశం లో” ఇంద్ర భూపతి ”అనే ఆయన ”మహా సుఖ వాదం ”తో ”వజ్ర యానం ”
అనే శాఖ ను ఏర్పరచాడు .ప్రాంచిక భోగాలన్నీ అనుభ వించ మన్నాడు .బోధి సత్వుని పురుషునిగా ,నైరాత్మ లేక శూన్యాన్ని స్త్రీ గా చెప్పాడు .స్త్రీ ని ఆలింగనం చేస్తేపురుషునికి ఎంతటి సుఖానందం కలుగు తుందో ,శూన్యాన్ని ఆలింగనం చేస్తే అంతటి సుఖానందాలు కలుగు తాయి .ఇంతకీ శూన్యం అంటే ఏమిటి ?అన్న దానికి సమాధానం చూద్దాం .నిర్వాణత్వం పొందిన మనస్సునుబోధి చిత్తం  అంటారు .ఆ స్థితి లో ఆ చిత్తం ఊర్ధ్వ లోకాలకు ఎగురు తుంది ..ఈ లోకాలలో బోధి సత్వుని రూపం వుంటుంది .అరూప లోకం లో రూపం నశించి పోతుంది .ఇదే చివరి లోకం .ఇక్కడ ”నమితా బుద్ధుడు ”దివ్య తేజస్సు తో ఉంటాడు .దాని పైన సుమేరు శిఖరం వుంటుంది .ఇక్కడికి చేరిన బోధి సత్వుడు శూన్యం లోకి ప్రవేశించి ,దానిలో లీనమైపోతాడు .ఇంకో చోట మహా సుఖ వాదమే ,తదాగత జ్ఞానం గా చెప్పాడు .
                      ఇంద్ర భూతి రాసిన ”జ్ఞాన సిద్ధి ”గ్రంధం లో జ్ఞానం వల్లే నిర్యాణం వస్తుందని చెప్పాడు .అన్ని విధాల్లో వజ్ర యానమే చాలా మేలైనదని అన్నాడు .ముద్రలు ,పాండిత్యాల వల్ల మోక్షం రాదు అన్నాడు  .వజ్ర యానం టిబెట్ దేశం లో ”రహష్య మంత్రం ”పేరుతొ ప్రచార మైంది .గురు పద్మ నందుడు టిబెట్ లో దీన్ని ప్రచారం చేశాడు .భారత్ నుంచి ఇతను టిబెట్ కు చేరి ”లామా ”పీఠం స్థాపించాడు .గురు పద్మ నందుడే మొదటి ”లామా.”.ఈయన శాంతి రక్షితుని బావ మరిది .
                                                                 సహజ యానం
                          క్క్రీ.శ.729  ప్రాంతం లో ఉద్యాన దేశ రాని ”లక్ష్మీ కర దేవి ””సహజ యానం ”ప్రవచించింది .వజ్ర యానానికి ఇది ఉప శాఖ .దీని ప్రకారం ఎవరూకష్ట పడక్కర లేదు .మోక్షం కోసం వేమ్పర్లాదక్కర లేదు .దేనికీ నిషేధమే లేదు .సత్యం తెలిస్తే ,యెట్లా తిరిగినా ఫరవాలేదు .సహజ యానం నుంచి ,కాల చక్ర యానం ,ముమ్నుగా యానం ,వచ్చాయి .
                                                           ప్రజ్నో పాయ నిశ్చయ సిద్ధి
                      ఇంద్ర భూతి రాసిన జ్ఞాన స్సిద్ధికి సారభూత మైనదే  అనంగ వజ్రుడు  క్రీ.శ.౧౦వ శతాబ్దం లో రాసిన ”ప్రజ్నో పాయ నిశ్చయగ్రంధం ” జైన మతం లోని ”నాద సంప్రదాయం ”కు అనుకూల మైన తత్ర శాఖ ఇది . .  .ప్రజ్న తో ఉపాయం కలిస్తే మోక్ష మార్గం తెలుస్తుంది .అద్వయత్వ సంయోగం లేనిదే మోక్షం రాదు .ప్రజ్ఞా పారమితత్వం లేక పోయినా మోక్షం రాదు .ఇది స్త్రీలు అందరిలో వుంది .కనుక వావి  వరుసలు లేకుండా స్త్రీలను అనుభవించాలి .భోగం తో యోగం యోగం తో మోక్షం వస్తుందట .అయితే మనస్సును చలిమ్పనియ్యకుండా ధ్యాన బుద్ధితో ఇదంతా చేయాలట .మనసు చాలిస్తే మోక్షం హుళక్కి .ఇలా తంత్ర సంప్రదాయం బౌద్ధం లో బాగా వెళ్ళు తన్నుకు పోయి వ్యాపించింది .దీనితో స్వైర విహారం పెరిగి పోయింది .క్రమ శిక్షణ మ్రుగ్యమయింది .శీలం గోడమీద మేకు కు తగిలించే శారు .వావి లేదు వరుస లేదు .అంతా సమానమే .శారీరక సుఖమే పరమ భాగ్యం అయి పోయింది .ఎంతో నియమ నిష్టలతో వర్ధిల్లిన బౌద్ధం ,బుద్ధి జాడ్య జనితోన్మాదం తో అధః పాతాళానికి పతనమైంది .భార్త్రు హరి పద్యం ”ఆకాశంబున నుండి శంభుని శిరంబు ——-పవనందోలోకమ్ము చేరె అనగా కూలం కష –పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్” గుర్తుకు వస్తుంది .దివ్య ఆపగ (నది )లాగా వుండే బౌద్ధం పాతాళానికి చేరింది .
ఇంకేముంది ?హిందూ మతస్తులకు గొప్ప అవకాశం చేతికి చిక్కింది .బౌద్ధం లోని చెడును భూతద్దం లో చూపించారు .మూడవ శతాబ్దం లో చొరబ్బడిన తంత్రం ఏడవ శతాబ్దం దాకా వ్యాప్తి చెందింది .44 సిద్ధులు ,పాటలు ఉపదేశాలతో ప్రచారం బాగా చేశారు .వజ్ర యానం టిబెట్ తో పాటు నేఆలు కు చేరింది .తాన్త్రికాలు టిబెట్ భాష లోకి అనువాదం చెందాయి .కొన్ని అనువాదాలు చైనా త్రిపితకాలలోను చేరాయి .వామాచారాలన్నీ ,భారత దేశం లోని ఆధ్యాత్మికతను ,విదేశీయుల అభిరుచుల్ని మేల వించి నవి గా విశ్లేషకులు భావించారు .ఇంత మహా ప్రయాణం సాగించి ,పరి వార్తన చెందింది బౌద్ధం .ఏ మార్గ మైనా సామాన్యుని దృష్టి లో పెట్టుకుని ఏర్పడిందే .
                           ఈ విషయాలన్నీ స్పృశిస్తూ ముక్త్యాల రాజా వాసిరెడ్డి రామ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ ఒక కమ్మని పద్యం చెప్పారు
                     ”కరుణ లూనెడు నహింసే స్థిరమగుత –నవని నదే శాంతి యదె దాంతి యదియె  నీతి —
                        స్వరము మొదలైనవో పునర్జన్మ కే ,ఇక –రూపు లేని నిర్వాణమే ప్రాపు మనకు ”
          అంతు బుద్ధ భగ వానుని సూక్తులు గుర్తుచేశారు .ఆ శ్రీ చరణాలే అప్పుడు ,ఇప్పుడు ,ఎప్పుడూ ,అనుసరనీయాలు అంతు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి మహోదయులు సెలవిచ్చిన పద్యం తో నమస్కరిస్తూ సెలవ్
                                ”ప్రియ యువతిం బ్రభుత్వమును వీడి ,యరణ్యము జేరె దత్వ ,ని
                                 శ్చయ మునకై మహా తపము సల్పి ,క్రుతార్ధత గాంచె నెల్లడాన్
                                  దయాయు ,నహింస యుం ,బరమ ధర్మములన్ నెల కొల్ప ,నమ్మహో
                                   దయుడగు బుద్ధ దేవుని పదంబుల కేను నమస్కరించెదన్ ..
                                                 అయి పోయింది
                                                                                                                                    ఆధారం —-1956  బుద్ధ జయంతి పత్రిక
                                                                                                                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —02 -11 -11 .
Posted in సేకరణలు | Leave a comment

బౌద్ధం లో వచ్చిన పరిణామాలు –2 బౌద్ధ సంప్రదాయం

 

                                          బౌద్ధం లో వచ్చిన పరిణామాలు –2
                                                   బౌద్ధ సంప్రదాయం
                ప్రతి  జీవి బోధిసత్వుడు అవాలంటే జ్ఞానాన్ని మనసులో నిలుపు కోవాలి ప్రకనమ్ పోయే దాకా శ్రమ చేస్తూ ఆ” బోధి ”ని అంటే జ్ఞానాన్ని పొందుతానని శపథం చేయాలి .ప్రాణుల కోసం సర్వస్వం త్యాగం చేసి ,జనుల బాధలను తీర్చి ,వాళ్ళను నిర్వానుల్ని చేయాలి.ఇలాంటి బోధి సత్వుడు గృహస్తుడు గా నైనా ఉండ వచ్చు లేక భిక్ధువు గా జీవించ వచ్చు .
              ” బుద్ధులు ”అంటే సర్వ ధర్మ విరక్తులు ,అనంత శక్తి ,ఆయుస్సు వున్న వారు .నిద్ర ,స్వప్నం లేని వారు .ఎప్పుడూ సమాధి లో వుండే వారు .కొన్ని సమయాల్లో కొన్ని లోకాల్లో కని పించేవారు .
              ”బోధి సత్వులు ”పూర్తి జ్ఞానం తోనే మాత్రు గర్భం లో ప్రవేశిస్తారు .దీన జనోద్దరణ కోసం హీన జీవులు గా పుడతారు .కఠిన శ్రమ తో ,గురువుల వద్ద విద్య నేరుస్తారు .ప్రకృతికి విరుద్ధం గా చుండే అద్భుతాలను చేస్తారు .
            ”అర్హతులు ”అంటే బుద్ధులకు ఉన్నంత జ్ఞానం లేని వారు .అజ్ఞాన బంధాల నుంచి విముక్తి కాని వారు .అర్హత్వం నున్చిన్క్రింది దశలకు జారి పోయే ప్రమాదం వున్న వారు .ఈ విధం గా ,సాంఘిక సిద్దాంతా లలో మార్పు రావటం వల్ల మహా యాన బౌద్ధం ఏర్పడి నట్లు భావిస్తారు .
                                     బౌద్ధ మత శాఖలు
               మహా సాంఘిక సిద్ధాంతాలు మూడు దశలు  గా వుంటాయి .01 -పుట్టుట ,గిట్టుట లను దాటి పోయిన దశ ను తిరిగి రాని దశ అంటారు .02 -నిర్వాణం   దాటటానికి పూర్వం   జన్మించే దశ  .03-జననం    ,మరణం అనే ప్రవాహం లో కొట్టుకు పోయే దశ .ఈ పరిస్థితుల్లో బౌద్ధం లో రెండు శాఖలు ఏర్పడ్డాయి .అవి హీన యానం ,మహాయానం .పాళీ పితకాలలో వీటి ప్రస్తావన వుంది .హీన యానానికి శ్రావక యానం ,ప్రత్యెక బుద్ధ యానం అనే పేర్లు వున్నాయి .మహాయానానికి బుద్ధయానం అనీ ,తదాగత యానం ,బోధిసత్వ యానం అనీ పేర్లు .ఈ పేర్లు ఎందుకు ఏర్పడ్డాయో మహా యాన గ్రంధాలలో చెప్పబడింది .
            ”  హీన యానం ”అంటే –సామాన్య బుద్ధి వున్న వారు ధర్మాన్ని ,మతాన్ని శ్రద్ధగా విని ,తెలుసు కోని ఆచరించి ,బుద్ధుడు చూపిన మార్గం లో పరిపూర్ణత సాధించటం .ఇది శ్రావకులకు ఏర్పడిన ప్రత్యెక మార్గం .
            ”మహా యానం ”అంటే ఉత్తములు ఇంకెవరి సహాయం లేకుండానే ,తమ ముక్తిని తామే సాధించి ,ఇతరులకు దారి చూపిస్తూ ,సహాయం చేసే విధానం .                                   హీన యానం పరిపూర్నులైన అర్హతులను తయారు చేస్తే ,మహాయానం సిద్ధార్ధుడు పొందిన అత్యున్నత మైన బోధి సత్వాన్ని పొంద టానికి మార్గం చూపించింది .ఇంకాస్త వివరం గా చెప్పాలంటే ,ఇతరులు కూడా మోక్షం పొందనిదే తాము ముక్తిని కోరు కోని వారు  మహాయానులు .తమ స్వీయ ముక్తి కోసమే పాటు పడే వారు కనుక హీనులు అయారు .మొదటి దాని కంటే ఇది తక్కువ స్థాయి .అది లోకోద్ధారణ .ఇది స్వీయోద్ధారణ అన్న మాట . ,                                          సత్యాన్ని అనుభవించటానికి రెండు ఆవరణలు వుంటాయి .మొదటిది దుఃఖ (క్లేశ )ఆవరణ .రెండవది జ్ఞేయ ఆవరణ .నైతిక నియమాలను అనుసరించటం వల్ల నడ వాది మార్చుకొని క్లేశావరనాన్ని పోగొట్టు కో వచ్చు .క్లేశం తొలగితే” వ్యుద్గల శూన్యత ”,వ్యక్తిత్వ శూన్యత మాత్రమే తెలుస్తాయి .జ్నేయావరనాన్ని కూడా తొలగించుకుంటే ,పై ఎందితి తో పాటు ,ధర్మ శూన్యత అంటే ప్రపంచ విషయాలు మిధ్య అన్న భావం కూడా తెలుస్తుంది .ఈ రెండు ఆవ రాణాలు ఎవరు ,సాధన ద్వారా తొలగించు కొంటారో ,వారికి సత్య సందర్శన యోగం లబ్భిస్తుంది .మహాయానాన్ని బాగా వ్యాప్తి చెందించిన వాడు ఆచార్య నాగార్జునుడు .అ తర్వాత ,ఆర్యదేవుడు ,మైత్రేయ నాభుడు ,అసంగుడు వంటి పండితులు ,తార్కికులు దీని ఆదరించారు .దీనితో ఈ రకమైన బౌద్ధానికి తత్వ దృష్టి ఏర్పడింది .మహాయానానికి ”ప్రజ్ఞాపారమిత ”గ్రంధం ప్రమాణ మైనది .వీరంతా బుద్దున్ని దేవుణ్ణి చేశారు .వీరి ద్రుద్తి లో బుద్ధుడు పిపీపిలికాది సర్వ ప్రానుల్లోను ,ప్రచ్చన్నం గా వుంది ,జ్ఞానం కలిగిస్తూ ,దాన్నిని పెంచుతూ ఉంటాడని ”కారండ వ్యూహం ”అనే గ్రంధం తెలియ జేస్తోంది .బుద్ధ భగ వానుడు తన లక్ష్యం నిర్వాణం అని మాత్రమే చెప్పాడు .అయితే దాన్ని ఖచ్చితం గా నిర్వచిన్చలేదని  ,ఈ ఆలోచనలు బయలు దేరినట్లు కని పిస్తుంది .నిర్వచించమని బుద్ధున్నే అడిగితే మౌనమే ఆయన సమాధానం .మహాయాన ప్రచారకుడు నాఆర్జునుడు మాత్రం ఉన్నదీ ,లేనిదీ ఈ రెంటి నుంచి ,ఆ రెండు కాని వాటి నుంచి ,ఏది విడిచి పెట్ట బడు తుందో  ,దాని రూపం అని ,అదే ”శూన్యం ”అనీ నిర్వ చించాడు .(ఆస్థి నాస్తి తదుప యాను భయ వినిర్ముక్త స్వరూపం ).అశ్వ ఘోషుడు మాత్రం ”దీపం ఆరి పోయే స్థితి వంటిదే నిర్వాణం ”అని చక్కగా చెప్పాడు .
                       అశోక చక్ర వర్తి –హీన ,మహాయాన మార్గాలకు మధ్య మార్గాన్ని ఆచరించాడు .వైరాగ్యాన్ని అశోకుడు ఒప్పు కో లేదు .దానితో బుద్ధుల ఆలోచనలలో కొంత మార్పు వచ్చింది .సన్యాస స్వీకారానికి వ్యతి రేకం గ అశోకుని కాలమ్ లో ఒక ఉద్యమమే బయల్దేరింది .దీని ఫలితం గా ,బౌద్ధం ప్రజా జీవితానికి దగ్గరైంది .పల్లె ,పట్ణనాలకు వ్యాపించింది .కఠిన నియమా లన్నీ ,స్వార్ధ త్యాగంతో ,జయించటం ప్రారంభ మైంది .దీనితో ,ప్రజల్లో విశ్వాసం ,భక్తి పెరిగాయి .చైత్యం నిర్మించాలనో ,బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేయాలనో ,కోరిక జన సామాన్యం లో పెరిగింది .ఆ ప్రతిమను భక్తి తోపూజించి ,ధన్యత చెందాలన్న తీవ్ర వాంచ ప్రబలింది .క్క్కడ మతాలలోను ,చైత్యాల్లోను భిక్షువులు సాధన చేస్తుండగా ,ఇక్కడ సామాన్యులు బుద్ధుని ఆరాధిస్తూ ధన్యత చెందు తున్నారు .నిత్య ప్రార్ధన ,పూజాదులతో ,ప్రజలు ప్రజలు బుద్ధుని ,తమ ముందు వున్నట్లు గా భావించారు .అప్పటి దాకాఆయన శాక్య ముని .ఇప్పటి నుంచి బుద్ధుడు సర్వ సమర్ధుడైన దేవాది దేవుడైనాడు .బుద్ధ జీవిత కధలను శిపాలుగా ,మలచి ,స్ఫూర్తి పొందారు .తెల్లటి నాప రాయి మీద ఉబ్బెత్తు ఆ బుద్ధుని శిపాలు చెక్కారు .అందు లో ఎన్నో భావాలను ఆవిష్కరించారు .వాటిని చూసి జనం తన్మయులయారు .శిల్పులు ,చిత్రకారులు ,తమ కళలను  బుద్ధ జీవిత కధలలో నిక్షిప్తం చేసి ధన్యత చెందారు .ఈ శిల్పులు ఆంద్ర దేశం లోను బహుళ వ్యాప్తమైన శిపాలు చెక్కారు .ఇదంతా క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ది లో జరిగి పోయిన విషయాలు .జనం లో బాగా వ్యాప్త మైంది కనుక మహాయానాన్ని ”జన బౌద్ధం ‘అన్నారు .అంత మాత్రం చేత హీన యానం కనుమరుగు కాలేదు .హీన యాన సూత్రాలు జన బౌద్ధం లో చేరి పోయాయి .భక్తీ ,శ్రద్ధ ,పూజలు అదనం అయాయి అంతే . దీనితో మహాయానం కొత్తరూపు దాల్చింది .ఖచ్చ్తం గా చెప్పా లంటే బాహ్య రూపం మహాయానం ,జీం మాత్రం హీనయానం గా వునదే జన బౌద్ధమయింది .దీనికే ఆదరణ బాగా పెరిగింది జన సామాన్యం లో .ఏ యానమైనా ,నైతికత కు వదిలి పెట్ట లేదు  ”శేలాన్ని జీవం గా ,కరుణ ఉగ్గుతో బెట్టిన విద్య గా”  భావించాయి
కాలమ్ ఎన్నో మార్పులు తేవటం సహజం .అభి రుచులు మారుతాయి .కఠోర నియమాలు కొందరికి ఇబ్బంది కలిగించాయి .బోధిసత్వ సాధన దుర్లభామని పించింది .దీనికి ఉపాయం వెదికారు .ప్రజలను ఆకర్షించాతమే బౌద్ధం ధ్యేయం అని పించింది .’అసంగు ”మొదలైన బౌద్ధ పండితులకు. .క్రీ శ.నాల్గవ శతాబ్దం లోనే .తంత్ర సంప్రదాయాలు వచ్చేశాయి .దీనికి మూలం .దీనికి మూలం ”వజ్ర భూతి ”అంటారు .”శాంతిదేవుడు ”మాత్రం మొదట ఈ ప్రస్తావన ను గ్రంధాలలో చేశాడు .అసంగుడు మహాయానానికి భాష్యం గా తంత్ర సిద్ధాంతాన్ని చొప్పించాడు .దీనితో మహాయానం లో అనేక మార్గాలు ఎర్పడాయి .అసంగునికి ఆధారం ఒకటి ,రెండు శతాబ్దాలకు చెందిన మంజుశ్రీ రాసిన ”మూల కల్పం ”అంటారు .తంత్రాలు పైకి కనిపించేవి .గూదార్ధం తో వున్నవి అని రెండు రకాలు .కనిపించని అర్ధం కలదే యదార్ధం అంటారు .ఇది ”సంధ్య ”భాష లో వుంటుంది .అంటే జ్ఞానంతో ఆలోచిస్తే జ్ఞానం ,అజ్న్నానం తో ఆలోచిస్తే అవినీతి అందులో కని పిస్తాయి  .
                                        సశేషం
                                          మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —02 -11 -11 .
Posted in రచనలు | Leave a comment

విరమణ కాదు విద్రోహమే

02_11_2011_004

Posted in సేకరణలు | Leave a comment

బౌద్ధం లో వచ్చిన పరిణామాలు —-1

       బౌద్ధం లో వచ్చిన పరిణామాలు —-1
                        ఏ  మతమైనా ,సమాజం లో వచ్చిన మార్పులకు ,వత్తిళ్ళకు ,ఇతర మతాల ప్రభావాలకు , ,అవసరాలకు మార్పు పొందుతూనే వుంటుంది .ఈ మార్పులు ఆ మతానికి కొన్ని సార్లు లాభదాయకం గా ,కొన్ని సార్లు కష్టం  కలిగించేవిగా వుంటాయి .లాభం వుంటే మతం పుంజుకుంటుంది .నష్టం కలిగితే కుంగి పోతుంది ఒక్కో సారి స్వార్ధ శక్తుల ప్రభావం వల్లచీలికలు ,పేలికలు అయి అసలు స్వరూపమే మారి పోతుంది  .దీనికి ఏ మతము అతీతం కాదు .బౌద్ధం కూడ ఎంతో ఆదర్శ ప్రాయంగా వచ్చింది కాలక్రమం లో అనేక మార్పులు పొందింది .చివరికి గుర్తు పట్టటానికి వీలు లేని రూపం గా మారింది .ఆ పరిణామాలను పరా మర్శించ టమే  ఈ వ్యాసం ధ్యేయం .
                                                 ఆదర్శ బౌద్ధం
                       ప్రాణులను చంపరాదని ,అన్ని జీవాలపై జాలి చూపించటం ముఖ్యమని బోధిసత్వుడైన బుద్ధుడు బోధించాడు .ధనం కోసం వంచన వద్దన్నాడు ,.పరస్పర ప్రేమ ఇచ్చి పుచ్చుకోవటం తో వృద్ధి చెందుతుంది .కూట సాక్ష్యం,నిందా ,అసత్యాలను దగ్గరకు చేర నీయ రాదు .సత్వ సంశుద్ధికి సత్యమే సరైన భాష .మోహ పరవశత్వం లో పరభార్యలను చేరితే శీలమే కాదు ,ధర్మ త్చ్యుతి కలిగి సమాజ వినాశన హేతువు అవుతుందని బుద్ధ భగ వానుని వాణి .బుద్ధుని విధానం వైరాగ్యం కాదు .ఆయన యోగ విధానానికి ఆధారం కరుణ .లోకం పట్ల జాలి కరుణ ,అనుకంప ఆయన్ను ఒక మహా శక్తి సంపన్నుని గా చేశాయి .అందుకే సంసారాన్ని త్యజించి ,జ్ఞాన సాధనకుఅడవులు   పట్టాడు .విశ్వ వ్యాపితమైన జాలితోనే బంధువు లందర్నీ వదులు కున్నాడు .మనశ్శాంతి కోసం తపస్సు చేశాడు .చివరకు నిర్వాణం పొందాడు .ఆ నిర్వాణం ఒట్టి కాంతి మాత్రమే కాదు .అది కరుణ రస సాక్షాత్కారం .మనిషి మనుగడ అర్ధవంతం కావ టానికి గౌతముడు ”పంచ శీల ”ను బోధించాడు .దాన్ని సమష్టి పరం చేయ గలిగితే లోక కళ్యాణమే .అసుర స్వభావం అయిన విరోధాన్ని పూర్తిగా వద లాలి .మానవ స్వభావ మైన స్నేహాన్ని సాధించాలి .భగవద్గీతలో భగవానుడు కృష్ణుడు చెప్పిందీ ఇదే కదా .సర్వభూతాల మీద ఎవరికి వైరం ఉండడో ,వారే తనను t పొందుతారు అని చెప్పాడు అదే గీతా సారం .కృష్ణుని సర్వ భూత ప్రేమ ,గౌతముని అహింస అన్ని కాలాలకు శ్రేయో దాయకమే .సంక్షుభిత స్థితి లో సమాజం వునప్పుడు   వీటికి ప్రత్యెక అవసరం వుంటుంది .
                                             ” అర్హతునికి ”అర్హతలు
               బౌద్ధ మతం లో సాధకులు” అర్హతులు ”అవుతారు .అన్నిటి లోను వున్న ”అతి ”ని విసర్జించి ,మధ్యమ మార్గం గా నడిస్తే నే అర్హతుడవు తాడు .దీనికి బుద్ధుడే ఆదర్శం .బుద్ధుడు జితేంద్రియుడు,గొప్ప ఆధ్యాత్మిక అనుభవం వున్న వాడు .ఆయనకు మంచి శరీర సౌష్టవం వుంది .అధిక క్రియా,శక్తి సంపన్నత కూడా వుంది .మంచి భోజనం చేసే వాడు .మంచి దుస్తులూ ధరించే వాడు .మధ్యమ మార్గం లో నడ వాలంటే ”అష్టాంగ సాధన ”చేయాలి .మానవుల్ని బంధించే దశ బంధాల నుంచి విముక్తి చెందాలి .అంటే వాటిని చేదించు కోవాలి .”నేను ”అన్న భ్రాంతి అందులో మొదటిది .సందేహం రెండోది .బాహ్యం గా చేసే మంచికర్మలె ప్రయోజనం అనే భావం ,విషయ వాంచ ,దుస్చింత ,ఐహిక సుఖం పై మమకారం ,ఈ శరీరం వదిలి స్వర్గసుఖాలు అనుభవించాలన్న ఆరాటం ,స్వాతిశయం ,దురహంకారం ,అవిద్యఅనే వాటినన్నిటినీ వదులు కోవాలి .అప్పుడే మార్గం తేలిక అవుతుంది .అష్టాంగ విధానాలతో సాధన చేశ్తే గమ్యం చేర గలరు .అవి సమ్యక్ దృక్పధం ,సమ్యక్ ఆశయం ,సమ్యక్ భాషణం ,సమ్యక్ప్రవర్తన    ,సమ్యక్ జీవనం ,సమ్యక్ కృషి ,సమ్యక్ భావం ,సమ్యక్ అను భూతి ఇవే అష్టాంగాలు .ఇంతకు ముందు చెప్పిన పది బంధనాలలో మొదటి మూడింటినీ వదిలేస్తే ,అతని లో గొప్ప శక్తి ఏర్పడి ,”అర్హతుడు ”ఆవ టానికి దారి సుగమం అవుతుంది .సత్వ గుణం తో ,తామసిక ,రాజ సిక  ,గుణాలను జయించి ముందుకు అడుగు వేయాలి .అప్పుడు ఏర్పడే ప్రత్యెక వ్యక్తిత్వాన్ని ప్రశాంతత లో లీనం చేసి,నిర్వాణం పొందటమే ఈ సాధన పరమార్ధం .
               ఆధునిక భారత దేశం లో అహింసా మార్గం లో ,సత్య భాషణం లో జీవితాన్ని పునీతం చేసుకున్న జాతి పిత మహాత్మా గాంధి గారు బుద్ధుని జీవితాన్ని బాగా అధ్యయనం చేశారు .”బుద్ధుడు నాస్తికుడు కాదని నేను చెప్పటానికి సాహశిస్తున్నాను .తోటి వారి కోసం హృదయం గాయ పడక పోతే ,హృదయం లోంచి రక్తం ధారాళంగా ప్రవహించక పోతే ,అతనిని బుద్ధ భగ వానుడు తన వాడి గా గుర్తించడు .గర్వం లేని ప్రజలు నమ్రత తో ,దేవుని చేరు తారు .ఇదే బౌద్ధ మతం ముఖ్య ధర్మం అని నా అభిప్రాయం”ఆన్నారు గాంధిజీ .శ్రీ అరవింద మహర్షి కూడా ”కర్మ బంధనం నుంచి,వ్యక్తిత్వం నుంచి దుఖం నుంచి ,విముక్తి చెందటమే బుద్ధుని లక్ష్యం .అప్పుడే నిత్యమూ ,సత్యము అయిన స్థితి పొంది బంధ విమోచనం కలుగు తుంది ”అన్నారు .వ్యక్తిత్వాన్ని దాటి ,అంతరంగం లో ప్రశాంత స్థితిని అనుభ విస్తు ,శాశ్వతమైన సత్యం ,ధర్మం ,ప్రేమ లకు సంబంధించిన కర్మల్ని బాహ్యం గా చేయటమే  బుద్ధుని సందేశం అని శ్రీ అరవిందుల భావం .దీనినే కవి ,సిని రచయిత ,నాటక రచయిత పింగళి నాగేంద్ర రావు ”కామాగ్ని జరిగేటి కామ దహనమురా –ఆనంద భోగమే అపరామ్రుతమురా —భువన భువనాలకు బుద్ధ గతి ఇదిరా ”అని చక్క గా వివరించారు .కక్షలు ,కార్పణ్యాలు అనంత మైన బాధకే దారి తీస్తాయి అందుకని మైత్రీ దీపమే రక్ష .అందుకే దీన్ని ఆవిష్కరిస్తూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు బుద్ధుని హృదయ రాణి ”యశోధరా ”హృదయాన్ని గొప్పగా ఆవిష్కరించారు  కమ్మని పద్యంలో .
                ”లోకాలు వెలిగించురాకాసుదాకరు –నింటిలో బంధింప జేయుటేట్లు !
                 జగతికిఅత్యుజ్వల   ప్రగతి జూపెడి ధ్రువ –జ్యోతి ని దాచుకో చూచు తేటలు !
                 విశ్వ జనీనమౌ నైశ్వర్యమును మేడ –గోడలలో నిల్పు కొనుట యెట్లు !
                 సర్వం కషంబైన  జ్ఞాన వారాసిని –పైట కొంగున మాటు పరుచుటేట్లు !
                 భ్హువన బంధుని మణిమయ భవన మందు –పవలు రాత్రులు నిర్బంధ పరచుటేట్లు !
                 ప్రేమ మయు నిన్ను నా బాహు సీమల –పట్టు కోని చుట్టు కొని నిల బెట్టు టెట్లు !”
                                      అని ఆ కరుణా మయుని విశ్వవ్యాప్తిత్వాన్ని ,ఆ ప్రేమ మూర్తి అనంతత్వాన్నిచక్కగా  అర్ధం చేసుకోంది యశోధర .తన పేరు సార్ధకం చేసు కోని తన యశస్సు ధరామండలం అంతా వ్యాపింప జేసి ధన్యురాలైంది .
                                              సశేషం
                                   మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —-02 -11 -౧౧.

Posted in రచనలు | Leave a comment

అన్నిటి కంటే ఆవల —–2

 అన్నిటి కంటే ఆవల —–2
                         హాప్కిన్ అనే శాస్త్రజ్ఞుడు హైపెర్ డైమెన్షనల్ వస్తువులు తయారు చేశాడు .హెచ్.జి .వేల్స్ కాలము ,స్పేస్ రెండు ఒకే ఎంటిటి (సత్వం ) యొక్క భాగమే అని  అభిప్రాయ పడ్డాడు .కాలమ్ లో ప్రయాణం (స్పేస్ ట్రావెల్)సాధ్యమే నన్నాడు .ఆయన కాలాన్ని నాలుగో డైమెన్షన్ గా గుర్తించాడు .
                         1905 లో ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ చాలా ఆశ్చర్య కర మైన విషయాలు కని పెట్టాడు .ఆయన జీవితం లో ఈ సంవత్చరానికి చాలా ప్రాముఖ్యత వుంది .కదిలే  వస్తువుల్లోని ఎలెక్ట్రో డైనమిక్స్ ,సాపేక్ష సిద్ధాంతం ,వస్తువులలోని జడత్వం ,అందు లోని శక్తి పై ఆధార పడి ఉంటుందా ?అనే విషయాలపై విష్ట్రుతం గా పరిశోధనా వ్యాసాలు రాశాడు .దీని తోనే E=mc2 అనే సూత్రాన్ని ప్రతి పాదించాడు .మాలిక్యూల్స్  సైజ్ ను లెక్క కట్టటం ,బ్రౌనియన్ మోషన్ గాపిలువ బడే  మాలిక్యులర్ మోషన్ ,ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ అయిన అటామిక్ బిహేవియర్ ల పై విస్తృతం గా రాశాడు .దీనికే 1921 లో నోబెల్ బహుమతి వచ్చింది.సాపేక్ష సిద్ధాంతానికి రా లేదు .
           హిల్బర్ట్ మిన్ కోవస్కి అనే శాస్త్ర వేత్త ఫోర్త్ డైమెన్షన్ పై చాలా ప్రయోగాలు చేశాడు .ఫోర్త్ డైమెన్షన్ ఆలోచన సరైనదే అన్నాడు .మూడు డైమెన్షన్ ల భావం ఒక మిధ్య అన్నాడు .అయితే ఆ తర్వాత త్రీ డైమెన్షన్ భాష లోనే ప్రపంచాన్ని అర్ధం చేసుకో గలం అని అన్నాడు .పాయిన్కేర్ అనే శాస్త్రజ్ఞుడు టైం ,స్పేస్ విడి సత్తాలు అన్నాడు .మిన్కోస్కి మాత్రం టైం ,స్పేస్ అనేవి ఒకే వస్తువు యొక్క వేర్వేరు అవస్థలు అని ముగించాడు .ఇతని అభిప్రాయం లో సాపేక్షత అంటే స్పేస్ -టైం మాని ఫోల్డ్ .దీనికే కంటిన్యుం అని పేరు పెట్టారు .అంటే అన్ని కాలాల్లో ను ఆవిష్కరిమ్పబడే వస్తువులు .ఇది వరకు జరిగినవి ,తర్వాత జరుగ బోయేవి అన్నీ శాశ్వతత్వం లోనివే . ఐన్స్టీన్ గొప్ప మేధావే కాని బద్ధకిస్టు అన్నాడు గురువు మిన్కోవిస్కి .అయితే గురువు చెప్పే పాఠాలు శిష్యుడైన ఐన్స్టీన్ కు బోరుగా ఉండేవి .అందుకని వినే వాడు కాదు .గురువు గారి సిద్ధాంతం నచ్చేది కాదు .ఫోర్త్ డైమెన్షన్ ఆలోచన గందర గోళానికి దారి తీస్తుందనే వాడు ఐన్స్టీన్ .అదంతా ,మిడి మిడి జ్ఞానం అని తేలిగ్గా కొట్టి పారేశాడు .1910  ,వచ్చేసరికి శిష్యుడి అభిప్రాయమే సరైనది అని తన అభిప్రాయం తప్పేనని గురువు ప్రకటించాడు .ప్రపంచ సంఘటనలు4D కంటిన్యుం  ను ఎర్పరుస్తాయన్నాడు .స్పేస్ కోసం క్యూబిజం ,టైం కోసం ఫ్యూచరిజం చిత్ర రచన లో తోడ్పడి నట్లే కని పిస్తుంది .క్యూబిజం ,ఫ్యూచరిజం వంటి అనేక శైలులు ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి జవాబులే .
                     స్టీన్ వీన్ బెర్గ్ ,అనే ఆయన texaas (అమెరికా )నుంచి వచ్చి డైమెన్షన్ల ఉత్చాహం తో మరింత కంగారు పెట్టాడు పార్టికల్  తీరిస్ట్ అయిన హోవార్డ్ జార్జ్” మూడు కంటే ఎక్కువ గా భావించే దైమేన్షన్లు ఒక బంతిలో చుట్టుకు పోయాయి .అవి మనపై ప్రభావం చూపని శూక్ష్మాతి శూక్ష్మ మైనవి ”అని తేల్చాడు .దీనిపై టోల్కీన్ రాసిన కవిత కు పేరడీ కవిత వచ్చింది .”ఒకే సిద్ధాంతం వాళ్ళందర్నీ పాలిస్తోంది .వాళ్ళు కనుక్కోవటానికి ఒకటే సిద్ధాంతం .ఒకే సిద్ధాంతం వాళ్ళందర్నీ kvaantaiz  చేస్తోంది .చీకట్లో వాళ్ళను బంధిస్తోంది అదీ బ్రౌన్ ప్రదేశం లో –నీడలు నర్తించే చోట ”.
   .               అధిక దైమేన్శాన్లు వున్నాయి అనే సిద్ధాంతం ఒక విప్లవాత్మక భావమే .ఒక వేళ ఆ దైమేన్షన్లు నిజం గా వుంటే ,ఇప్పుడు కని పిస్తున్న విశ్వం ఒక చిన్న తునక మాత్రమే .మిగిలింది అంతా అజ్ఞాత ,ప్రచ్చన్న దేశమే ”అన్నాడు భౌతిక శాస్త్ర వేత్త జోసెఫ్ లైకేన్ .
               పోతన గారు భాగవతం లో ”లోకంబులు .లోకేశులు —–అనే పద్యం లో పెంజీకటికి ఆవల ”అని ఏదో పరమాద్భుత మైనది వుంది అని చెప్పిన సంగతి గుర్తుంది కదా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —-01 -11 -11 –
Posted in రచనలు | Leave a comment

అన్నిటి కంటే ఆవల —1

అన్నిటి కంటే ఆవల   —1
                           అయిదు పరిమాణాల (dimention )విశ్వం ఒక ఊహ .1927 లో ”కలూజ ”అనే శాస్త్రజ్ఞుడు ప్రకృతి లోని అన్నిటిని ఏకీ కృతం చేసి నట్లు కనుగొన్నట్లు నమ్మాడు .1924  లో ఆస్కార్ క్లీన్ అదే భావాన్ని ,సిద్దాన్తీక రించాడు .అందువల్ల అధిక పరిమాణాల (higher dimentional )శక్తుల ఏకీకరణ సిద్ధాంతాన్ని ”కలూజ -క్లెన్ ” సిద్ధాంతం అన్నారు .చివరికి అందరు కలిసి అయిదవ పరిమాణం అక్కర లేదని తేల్చారు .
                    పొడవు ,వెడల్పు ,ఎత్తు అనేవి అనాదిగా వస్తున్న మూడు పరిమాణాలు .”కాలమ్ ”కూడా నాల్గవ పరిమాణం లోకి చాలా కాలమ్ కిందటే వచ్చింది .దీన్ని హెచ్ .జి .వేల్స్ కూడా తన ”టైం మెషిన్ ”గ్రంధం లో పేర్కొన్నాడు .ఈ విషయాలపై ,ఇమ్మానుఎల్ కాంట్ మొత్త మొదటి సారిగా దృష్టి సారించాడు .ఆయన 1747 లో thoughts on the true estimation of living force  అనే  గ్రంధం  లో   ప్రపంచం ను  మూడు పరిమాణాల ఆధారం గా ఎలా అర్ధం చేసుకో వచ్చో తెలియ జేశాడు .వస్తువులు ఒక దానిపై ఒకటి గురుత్వాకర్షణ వల్ల పని చేస్తాయి అని చెప్పాడు .  అవి పరస్పరం వున్న దూరాల వర్గాల విలోమాను పాఠం లో మారుతాయి అని కూడా తెలిపాడు (vary ).ఈ సూత్రం ప్రకారం అంతరిక్షం (స్పేస్ )మూడు పరి మాణాలకు బద్ధమై వుంటుంది .
                  అయితే వీటికి విరుద్ధం గా వున్న సూత్రాలు ఇతరమైన పరిమాణాలు వున్న వేరే అంత రిక్షా ప్రదేశాలు వుండే అవకాశాలు వున్నాయని చెప్పాడు మేధావి కాంట్.దేవుడు దేనినైనా సృష్టించ గలడు ,కనుక అలాంటి ప్రపంచాలు ఉండటానికి అవకాశం వుంది అన్నాడు .అవి మన ప్రపంచానికి సంబంధం లేకుండా ,విడి పోయి ఉండ వచ్చు .వాటిని కలిపే ఏ అవకాశమూ లేకుండా పోయి ఉండవచ్చు .నని అభిప్రాయ పడ్డాడు .భగవంతుడు విశ్వాన్ని త్రీ దిమెన్తిఒనల్ సత్వం గానే సృష్టించాడు తప్ప ,ఎన్నో దిమెన్తిఒన్ ల ప్రపంచం గా సృష్టించి గందర గోల పరిచిఉ ఉండదని నమ్మాడు కాంట్.
                    1777 లో జర్మించిన Carl Freidrich Gauss కు  మూడు  ఏళ్ళ  కే  అద్భుత  గణిత  మేదావిత్వం  కన్పించింది  .(power of computation ).ఒక సారి అతని తండ్రి ఉద్యోగస్తుల జీతాల పట్టిక ను కూడుతూ వుంటే (total )”సరిగ్గా ఇంత వుండాలి చూడండి ”అన్నాట్ట .తండ్రి కూడి అంతే వచ్చినందుకు ఆశ్చర్య పడ్డాడట.సరిగ్గా మాటలే రాని వయసు లో ,అతని కి గణితం స్వంత మై పోవటం అబ్బుర పరిచే విషయం .ఆయన కళల్లో భగవద్దట్ట మేధావి తనం కన్పించేది .స్కూల్ కు వెళ్లి నపుడు అతని లెక్కల మేష్టారు ఇతని ప్రతిభను చూసి అమితాస్చర్య పడ్డాడట .మనసు లో ఒకటి నుంచి ,వంద వరకు వున్న అంకెలని కూడి ఎంతో చెప్పాడట .లెక్కల పుస్తకం మొదలు పెట్టక ముందే దాని లో ఏముందో అవపోసన పట్టాదట .12 ఏళ్ళకే యూక్లిడ్ జామెట్రీ కి సవరణలు (alternatives )ప్రతి పాదిన్చాదట (వికల్పాలు )అతని అంకుల్ కి వున్న విమర్శనా జ్ఞానం ఇతని పై బాగా పనిచేసిందట .14  ఏళ్ళ వయసు లో గణిత శాస్త్రజ్ఞుడు ”జోహాన్ బార్తీస్ ”గాస్ కున్న మేధావి తనాన్ని చూసి అబ్బుర పది గణిత మేదావులైన Nichelm Ferdinand ,Duke of Brunswick లకు పరిచయం చేశాడు .గాస్ కున్న నమ్రతను గుర్తించి ,చదువుకు సాయం చేశాడు .Gotten gin University  లో 18  ఏళ్ళ వయసు లో చేరాడు .అక్కడ Wolfang Bolzai తో పరిచయం కలిగింది .గాస్ తల్లి ఆయన దగ్గరకు వెళ్లి ఒక సారి తన కొడుకు చదువు ఎలా సాగుతోంది అని అడిగింది .దానికి ఆయన The only greatest mathematician in Europe ”అని ఆనందం గా మెచ్చుతూ చెప్పాడట .అంటే ఐరోపా ఖండం లో వున్న ఏకైక గణిత శాస్త్రజ్ఞుడు,మేధావి  గాస్ అని అర్ధం .1806 లో డాక్టరేట్ అయాడు .నెపోలియన్ కు ఎదురు నిల్చి ,దేశం కోసం పోరాడాడు .తర్వాత gottengin  లో ప్రొఫెసర్ అయాడు గాస్.non Euclidian Geometry పై పరిశోదాహన చేశాడు .దీని పై bolzai  కొడుకు జానోస్ ,nicholas lobacheshky
 కూడా పరిశోధన చేశారు .1854 లో హైపెర్ స్పేస్  ఆవిషకరణ జరిగింది .
                       హెన్రి స్లాదేస్ అనే శాస్త్రజ్ఞుడు పొడవు ,వెడల్పు ,ఎత్తు లను దాటి వేరే dimention లో వస్తువులు కదలటం జరుగుతుందని భావించాడు .జోల్నార్ శాస్త్ర వేత్త higher dimention లు వున్నాయని చెప్పాడు .రహస్య జ్ఞాన వేత్తలు (occultists ) నాలుగో dimention ఉందన్నాడు .థియోసాఫికల్ సొసైటీ స్థాపకు రాలు madam  blavaatski  1875  లో higher dimentions విషయం పై వున్న మార్మిక విషయాలను తెలియ జేశారు .వీళ్ళందరికీ కాబాలిస్తిక్ గ్రంధాలు ,వెద ,ఉపనిషత్తులు ,గ్రీకు కు చెందిన సర్వోత్క్రుష్ట రచనలు ఆధారం .మేడం గారి విధానం లో వస్తువులు ఒక దాని లోనుంచి ఇంకొక దాని లోకి ప్రవేశిస్తాయి .ఈ విషయాన్నే slade కూడా  చెప్పాడు .దీనితో ఇరువైపులా ప్రధాన ధర్మాలలో మార్పులు సంభ విస్తాయి .ఆమె రాసిన The secret Doctrine లో ఫోర్త్ డైమెన్షన్ అయిన స్పెసియాల్   డైమెన్షన్ ను ఖండించింది .పదార్ధం పై ఆరో ధర్మాన్ని గురించివివ రించింది .డైమేన్స్హళ్ అనేది ఒక స్థాయి లోని ఆలోచన ,ఒక పరిణామం లో ని వి  భాగం,పదార్ధం లోని ఒక గుణం .లేద బీటర్ శాస్త్ర వేత్త astral plane  గురించి చెప్పాడు .1882 లో The society of physical research ” అనేది ఏర్పడింది .వీరంతా ,para normal experiences (బుద్ధి ఉన్మాదం )పొందిన వాళ్ళే .జోల్నార్ చెప్పిన దాన్ని సమర్ధించారు .ఈ ముఠాను oscaar wild   ఎద్దేవా చేస్తూ ”ది కాంటర్ విల్లె ఘోస్ట్ ”అన్నాడు ”.అంటే దయ్యం ఒక గది లోంచి నాల్గవ పరిమాణం ద్వారా పారి పోయినట్టుంది ”.అని లైట్ తీసుకున్నాడు .
                                              తరువాయి భాగం మరోసారి
                                                                                           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

శ్రీ సదశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం ——9

శ్రీ సదశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం ——9
బ్రహ్మా నందం
శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో ఇప్పటి వరకు ”రామ రసం ”,”కృష్ణా మృతం ”ఆత్మ బోధ ”శీర్షికల లో వున్న కీర్తన లను గురించి తెలుసు కున్నాం .ఇప్పుడు ”బ్రహ్మా నందం ”లోకి చేరి అందులోని కీర్తన వైభవాలను అర్ధం చేసు కుందాం.
పల్లవి —–             —నహిరే నహి శంకా చిత్ –నహిరే నహి శంకా ||
చరణాలు ———-01 –అజమక్షర మద్వైత మనంతం –ధ్యాయంతి బ్రహ్మ వరం శాంతం ||
02 —ఏ త్యజ్ఞాతి బహుకర పరితాపం –ఏ భజన్తి సత్చిత్చుఖ రూపం ||
03 —పరమ హంస గురు భనితం గీతం —ఏ పథంతి నిగమార్ధ సమేతం ||
భావం ——–”ఎవరు అనేక లౌకిక దుఖాలను వాది లేస్తారో ,సచ్చిదానంద రూపానీ సేవిద్తారో ,పరమ హంస గురువు లైన వారిచే స్తోత్రం చేయబడిన గీతాలను ,వేదార్దాల సాయం తో అధ్యయనం చేస్తారో ,వారంతా ,ఆది అంతం లేని ఏకమైన ,పరమ శాంత స్వరూపమైన బ్రహ్మాన్నే ధ్యానిస్తారు ,ఇందులో అనుమానం లేదు ,శంక కూడా లేదు ”
విశేషాలు —–స్థూల సూక్ష్మ శరీరాలను సాధన ద్వారా స్వాదీనక్మ్ చేసు కోవాలి .వాటి దుఖాలను వదిలి నప్పుడు ,వాటి లోని సత ,చిత్ ,సుఖం స్పష్టమవుతై .ఆ సుఖం పరమాత్మ స్వ రూపమే కాని వేరే కాదు .పరితాపాలు అనేవి శరీరం నుంచి ,మనసు నుంచి ,బయటికి తొంగి చూసి పొందేవి .ఇవి స్వతహాగా జీవుడికి వుండవు .మనసు వాటిని వదిలేస్తే ,మనసు అనేదే వుండదు .మనసుకు ఆధార మైన పరమ శాంతమైన బ్రహ్మమే దర్శనం అవుతుంది .మోక్షానికి కారణమైన ప్రతిదీ గురు కృప వల్లనే సాధ్యం .ఆ గురువు పరమ గురువు అయి వుండాలి .పరమ హంస లా వుండాలి .అప్పుడే తరుణోపాయం లభిస్తుంది .తాను పరమ హంస కనుక అందరు ,పరమ హంస స్థితి ని పొందాలని ప్రతి కీర్తన లోను ఎరుక గా తెలిపారు పరమ హంస అయిన సదాశివ బ్రహ్మేంద్ర యతీశ్వరులు .
రెండవ కీర్తన ——–
o2 —–పల్లవి —–ఖేలతి పిండాందే భగవాన్ –ఖేలతి పిండా న్డే ||
చరణాలు —01 —-హంసః సోహం హంస సోహం –హంస సోహం సోహమితి –పరమాత్మాహం పరిపూర్నోహం —బ్రహ్మివాహం బ్రహ్మేతి ||
02 –త్వక్చాక్షు శృతి జిహ్వ ఘ్రానే –పంచ విధ ప్రానోప స్థానే –శబ్ద స్పర్శ రసాదిక మాత్రే —సాత్విక రాజస తామస మిశ్రే ||
03 –బుద్ధి మనస్చిట్టా హన్కారే –భూజస తేజో గగన సమీరే –పరమ హంస రూపేన విహార్తా –బ్రహ్మ విష్ణు రుద్రాది క కర్తా ||
భావం ——–”శరీరం లోనే భగవంతుడు ఆడుతున్నాడు .హంసను నేనే .నేనే హంసను .పరమాత్మను .పరిపూర్ణ బ్రహ్మం నేనే .పంచేంద్రియ గోళాలలో ,పంచ ప్రాణ స్థానాలలో ,శబ్ద ,స్పర్శ తన్మాత్రలలో ,త్రిగుణాల కలయిక లో ,శరీరం లో క్రీడా ఖేలనం చేస్తున్నారు పరమాత్మ.నాలుగు అంతః కరనలలో ,పంచ భూతాలలో ,పరమ హంస లా విహరిస్తూ ,త్రిమూర్తుల సృష్టి కర్త గా శరీరం లో ఆడి ,పాడి ,రమిస్తున్నాడు ”
విశేషం —ప్రపంచం అనేది దేశ ,కాలాలో కదుల్తుంది .ఇది పరమాత్మ పరిపాలన వల్లనే సాధ్యం .ప్రపంచాన్ని చూసే పరికరాలు అన్నీ ఆయన స్వరూపాలే .వేరు కాదు .సృష్టి ,స్థితి ,లయలుజీవుని అనుభవాలే .వాటిని అనుభవానికి తెచ్చేదీ పరమాత్మ ఏ .
మూడవ కీర్తన లోకి చేరు కుందాం
03 —పల్లవి —-ఆనంద పూర్ణ బోదోహం—సతత మానంద పూర్ణ బోదోహం ||
చరణాలు —-01 —ప్రత్యగద్వైత సారోహం –సకల శ్రుత్యంత తలత్ర విదితోహం,అమ్రుతోహం ||
మత్యనంతర భావితోహం –విదిత నిత్య నిష్కల రూప నిర్గుణ పదోహం ||
02 —సాక్షి చిన్మాత్ర గాత్రోహం -పరమ మోక్ష సామ్రాజ్యాదిపోహం
పక్ష పాతాతి దూరోహం -అనవధిక సుఖ సాగరోహం ||
03 —స్వప్రకాశైక సారోహం –సదహమప్రపంచాత్మ భావోహం అభయోహం
చిదహమప్రమెయాఅఖ్య మూర్తి రేవాహం |\
భావం ——ఈ కీర్తన కూడా ఆత్మాను భూతి పొందిన ఒక సిద్ధ పురుషుని ఆనంద మయ ,చిన్మయ ,చిద్రూప అద్భుత వర్ణన .ప్రాపంచిక కొలతలకు పరిమానాలకు అందని ఉన్నతోన్నత ,ఉత్తమోత్తమ స్థితి అది .వేదం చదవక్కర లేదు .ఉపనిషత్తులు అధ్యనం చెయ్యక్కర లేదు ,శాస్త్రాల సారం పిండ నక్కర లేదు .ఈ కీర్తన చదివినా ,విన్నా ,అర్ధం చేసు కున్నా అంతా బ్రహ్మ జ్ఞానమే .హాయిగా సంగీతం తో మేళవించి ,అన్నీ రంగరించి అందించిన రస గుళిక .
నాక్ల్గవ కీర్తన లోకి చేరుకుందాం
04 —పల్లవి —-ఆనంద పూర్ణ బోదోహం –సచ్చిదానంద పూర్ణ బోదోహం ||
చరణాలు —-01 –సర్వాత్మ చరోహం –పరి నిర్వాన నిర్గుణ నిఖిలాత్మ కోహం —
గీర్వాణ వర్యానతోహం –కామ గర్వ నిర్వాపణ ధీరతోహం ||
02 –సత్య స్వరూప పరోహం –వర శ్రుత్యంత బోధిత సుఖ సాగరోహం
ప్రత్యగాభిన్న పరోహం –శుద్ధ మంతు రహిత మాయా తీతోహం |\
03 –అవబోధ రస సాగరోహం –వ్యోమ పవనాది పంచాభూతాతి దూరోహం
కవి వర సంసేవ్యోహం -ఘోర భవ సింధు తారక పరమసూక్ష్మొహం ||
04 –బాధిత గుణ కలనోహం –బుద్ధ శోదిత సమరస పరమాత్మాహం
సాధన జాతాతీతోహం –నిరుపాధిక నిస్శీమ భూమానందోహం ||
05 –నిరవయవోహం అజోహం –నిరుపమ మహిమని నిహిత మహితోహం
నిరవధి సత్త్వఘనోహం –ధీర పరమ శివేంద్ర శ్రీ గురు బోధి తోహం ||
భావం —–నేను ఎవర్ని ?అన్న దానికి సమాధానమే ఈ కీర్తన .”సచ్చిదానంద పూర్ణ చైతన్యాన్ని నేను .అందరి లోని ఆత్మ మూర్తిని నేను .మోక్ష స్వరూపుడైన నిర్గునున్ని .దేవతలు నన్ను అర్చిస్తారు .కామ గర్వాప హారిని .సత్య సుఖ స్వరూపుడిని .శాస్త్రాల చేత బోధింప బడిన వాడిని .భేదాలు లేని ప్రత్యక రూప మాయా తీతున్ని .జ్ఞానంద స్వరూపున్ని .పంచ భూతాలకు అతీతున్ని .రుషి గణ పూజితున్ని .ఘోర భవ సముద్రాన్ని దాటించే పరమాత్మను .గుణ క్రీడా లో ప్రబోధం చేత శుద్ధీ చేయబడిన సమ రస పరమాత్మను .సాధనాతీత మైన ,ఉపాధి పరిధికి అతీత మైన పరమానందాన్ని నేను .అవయవ రహితున్ని .పుట్టుక లేని వాడిని .నిరుపమ మహిమ లో నిలిచి న గొప్పదనాన్ని నేనే .నిరవధిక శుద్ధ సత్యాన్ని .శ్రీ గురు పరమ శివేంద్ర స్వామి చేత బోధితున్ని అయిన వాడిని నేనే ”
వేదాలలోనిరుక్కులు చదువుతున్న    అనుభూతి లభిస్తుంది ఈ కీర్తనలో అంతా బ్రహ్మ మయమే .నేనే బ్రహ్మని”అహమాత్మా పరబ్రహ్మ ”సోహం ”బ్రహ్మ ఇవాహం ”అనే మహా వాక్య రహస్యాలన్నీ గుది గుచ్చి ,హాయిగా పాడుకుంటూ మనసారా అనుభవిస్తూ,ఆనంద పారవశ్యం కలిగించే రచన బ్రహ్మేన్ద్రులది .మాటల లో వర్ణించటం కష్టం .అనుభవించాలి తరించాలి ఆత్మాను భూతి పొందిన మహాత్ముని అనుభవమే ఈ కీర్తన .ఈ అనుభూతికి కారణమయిన శ్రీ గురువు పరమశివేంద్ర స్వామిని రెండో సారి స్మరించి సంప్రదాయాన్ని అవిచ్చిన్నం గా కాపాడారు శిష్యులైన సదా శివ  బ్రహ్మేన్ద్రులు
ఇప్పటికి ”బ్రహ్మానందం ”పూర్తిగా అనుభవిన్చాము .
బ్రహ్మేన్డ్రుల కీర్తనల లో ఇరవై నాల్గవది ,చివరిది అయిన ది ”గంగా నది పైకీర్తన  .ఆ పవిత్ర నదీమ తల్లి పావన తోయాన్ని తాగి మొక్షానందాన్ని పొందుదాం
24 —పల్లవి —–జయ తుంగ తరంగే గంగే –జయ తుంగ తరంగే ||
చరణాలు —01 –కమల భవాండ కరండ పవిత్రే —బహు విధ బంధచ్చేద లవిత్రే ||
02 –దూరీకృత జన పాప సమూహే –పూరిత కచ్చ స గుచ్చ గ్రాహే ||
03 –పరమ హంస గురు భణిత చరిత్రే –బ్రహ్మ విష్ణు శంకర నుతి పాత్రే ||
భావం ——-”ఉత్తుంగ తరంగ విరాజిత గంగా మాతా !నీకు జయం .బ్రహ్మాండాన్ని పవిత్రం చేస్తూ ,అనేక బంధనాలను విచ్చేదం చేస్తూ ,వుండే నీకు జయమగు గాక .ప్రజల పాపాలను ప్రక్షాళన చేస్తూ ,తాబెళ్ళను (కచ్ఛప ),మొసళ్ళను (గుచ్చ )నిండుగా కలిగిన వో నదీమ తల్లీ నీకు జయం .పరమ హంస పరివ్రాజక గురు పరంపర చేత కీర్తింప బడిన గంగా మాయీ నీకు జయం .త్రిమూర్తుల స్తుతికి పాత్రమైన పవిత్ర గంగా దేవీ !నీకు సర్వదా జయము ”
విశేషం —-భారతీయ సాహిత్యం లో గంగానదికి ప్రత్యెక స్థానం వుంది .ఆ నదీమ తల్లి త్రిపద గామి అంటే స్వర్గ మర్త్య ,పాతాళాలలో ప్రవహిస్తుంది .భూలోకాన్ని పవిత్రం చేయ టానికి దివి నుండి భువికి దిగిన భాగీరధి ఆమె .ఆమె పవిత్ర తీరాలలో నాగరకత విస్తరించింది .భూములను సస్య శ్యామలం చేసి ,బంగారు పంటలు పండించే అమృత జలాలను అందించే నదీ మాత .గంగా స్నానం పవిత్రం .మోక్ష ప్రదం .అంతటి శుద్ధ జలం ప్రపంచం లో లేనే లేదు .ఎన్నో పరీక్షలకు తట్టు కుంది .ఆమె తో సంబంధం లేకుండా రామాయణ ,భరత ,భాగవత కధ లేదు .ఆ పవిత్ర జలం స్వచ్చం ,పవిత్రం ,నిర్మలం .గంగా మాయి లేక పోతే భారతీయ లౌకిక ,ఆధ్యాత్మిక జీవనమే లేదని అందరి భావన .ఆ గంగా మాతను స్తుతిస్తూ అందుకే సదాశివ బ్రహ్మేన్ద్రులు జయ గానాన్ని వినిపించారు .ఆ జయం ఆమెకే కాదు లోకాలన్నిటికీ .ఇదీ ఉదాత్త భారతీయభావన .జయ మంగళం నిత్య శుభ మంగళం .
”   శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం ”అనే ఈ నవరత్నాల వ్యాసపరంపరకు  ప్రేరణ ,పూర్తి ఆధారం ”స్వామిని శారదా ప్రియానంద ”గారు రచించిన గ్రంధం ”సంగీత వేదాంతం ”.ఆ స్వామినికి మనసులో సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ నా కృతజ్ఞతలను తెలుపు కుంటున్నాను .ఇందులోని విషయ వివరణ అంతా శారదా ప్రియానంద స్వామినిదే నని సవినయం గామనవి చేస్తున్నాను .   నన్ను .ఎంతో ప్రభావితం చేసిన రచన ఇది .దీని ని మీకూ అందించాలనే తపన తో ఈ ప్రయత్నం చేశాను .                        సంపూర్ణం
నమస్తే
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —30 -10 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Leave a comment

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం —8 ఆత్మ బోధ

              శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం —8
                                                                       ఆత్మ బోధ
                          శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతామృతాం లో ఆత్మ బోధ లో నాల్గవ కీర్తన గురించి తెలుసు కుందాం
           04 —-పల్లవి —-సర్వం బ్రహ్మమయం   రే రే –సర్వం బ్రహ్మ మయం  ||
                                     చరణాలు —01 –    కిం వచనీయం ,కిమవచనీయం –కిం రచనీయం ,కిమరచనీయం ||
                                                     02 —కిం పథ నీయం కిమ పథనీయం , –కిం భజనీయం ,కిమభజ నీయం ||
                                                      03 —కిం బోద్ధవ్యం ,కిమబోద్ధవ్యం —కిం భోక్తవ్యం ,కిమభోక్తవ్యం   ||
                                                      04 —సర్వత్ర సదా హంస ధ్యానం –కర్తవ్యం–భో ముక్తి నిదానం ||
                   భావం ——” వోరీ  !సర్వము బ్రహ్మమే .ఇందు లో చెప్ప తగినది ,చెప్ప తగనిది ఏమీ లేదు .వ్రాయ తగినది ,వ్రాయ తగనిది లేదు .చదవ తగినది ,చదవ కూడనిది లేదు .సేవింప తగిన్దీ ,సేవింప రానిదీ అంటూ ఏమీ లేదు .నేర్వ వలసిందీ ,నేర్వ రానిదీ లేదు .తిన తగింది ,తిన రానిది అనే భేదమే లేదు .సర్వ వేళల ,సర్వావస్థలలో ,”హంస ”ధ్యానం చేయటమే మన కర్తవ్యం .అదే మోక్షానికి సరైన దారి ”
                     విశేషం —భో అంటే అయ్యా అని అర్ధం .ఈ ప్రపంచం అంతా పరమాత్మ స్వరూపమే అయినపుడు దేనిని స్వీకరించాలి ,దేన్నీ వదిలేయాలి అన్న సమస్యే లేదు .”సర్వం ఖిల్విదం బ్రహ్మ ”
               ఆయిద వ కీర్తనకు దారి తీద్దాం
                o5 –పల్లవి —–బ్రహ్మై వాహం –  కిలసద్గురు కృపయా   —బ్ర్సహ్మైవాహం ||
                                       చరణాలు —-01 —బ్రహ్మై వాహం కిల ,గురు కృపయా–చిన్మయ బోధానంద ఘనం తత్ –శ్రుత్యంతైక నిరూపిత మతులం –సత్య సుఖామ్బుది సమరస మనఘం ||
                                                       02 —కర్మాకర్మ వికర్మ విదూరం –నిర్మల సంవి దఖండ మపారం –నిరవధి సత్తాస్పద పద మజరం –నిరుపమ మహిమనినిహిత మనీహం ||
                                                       03 –ఆశా పాశ వినాశన చతురం –కోశ పంచకాతీత మనంతం –కారణ కారణ మేక మనేకం —-కాలకాల కలి దోష విహీనం ||
                                                       04 –అప్రమేయ పద మఖిలాధారం –నిష్ప్రపంచ నిజ నిష్క్రియ రూపం —స్వప్రకాశ శివ మద్వయ మభయం –నిష్ప్రతర్క్య మన పాయ మకాయం |\
              భావం ——-”సద్గురు కటాక్షం వల్ల నేను సాక్షాత్తు బ్రహ్మమే .గురు కృప చేత చిన్మయ ,జ్ఞానానంద ఘన స్వరూప బ్రహ్మమే నేను .ఉపనిషత్ నిరూపించిండీ ఎకమే అయినదీ ,సాటి లేనిదీ,పాప రహితమైనదీ ,సర్వ వ్యాపక మైనదీ ,సత్య,సుఖసముద్రం అయిన బ్రహ్మను నేనే .సత్కర్మకు ,ఆకర్మకు ,దుష్కర్మలకు దొరమైన ,అఖండ ,అపార ,నిర్మల ,శుద్ధమైన ,బ్రహ్మము నేనే .హద్దులు లేని సత్తా కు ఆధారం నేనే .జరాదూరమై ,నిరూప మానమై ,మహిమాన్వితమై ,కామనా రహిత బ్రహ్మను నేనే .ఆశాపాశాలను చేదించే శక్తి కలిగి ,పంచ కోశాలకు అతీత మైన ,అనంతమైన బ్రహ్మము నేనే ,.కారణాలన్నీ టికి మొదటి కారణమై ,ప్రపంచం లోని అనేకం అంతా తానే అయి ,నల్లని మృత్యు రూప కలి దోష రహిత బ్రహ్మం నేనే .కొలవటాని వీలు లేని పరమై ,సర్వాదారమై ,ప్రపంచం లో క్రియా రహిత పదం అయిన బ్రహ్మం నేనే .స్వయం ప్రకాశమై ,మంగళ ప్రదమై ,అద్వయం ,అభయం అయి ,తర్కానికి అతీత మై ,అపాయం లేని ,శరీర రహిత మైన బ్రహ్మం నేనే కదా .సద్గురు కృప వల్ల నేనే బ్రహ్మం కదా ”.
                        విశేషం —వేదాలలో ఉపనిషత్ లలోని సారం అంతా ఇందులో ఇమిడ్చారు బ్రహ్మేన్ద్రులు .అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ ,విజ్ఞాన మయ ,ఆనందమయ ,అనేవి పంచ కోశాలు .అవి ఒకదాని కంటే ఒకటి వ్యాపన శక్త్హి కలవి .ఆనందమయ కోశానికి అవతల వున్న అనంత వస్తువే బ్రహ్మం .ప్రపంచం లోని ప్రతి వస్తువుకి ,ప్రాణికి ,ఒక కారణం వుంటుంది .కారణానికి వెనుక ఇంకో కారణం వుంటుంది .ఇలా అనంత కారణాలు .ఇన్ని కారణాలకు అసలు కారణం పరమాత్మ .ఆయన ఒక్కడే కారణం .ప్రపంచ వ్యాపిత అంతర్గత పరమాత్మను చూడ గలిగితే ,ఇంద్రియాలు మూగ పోయి ,ఇంద్రియాలకు కనిపించే ప్రపంచం మాయమవుతుంది
             ఆరవ కీర్తన గురించి చర్చిద్దాం
06 —పల్లవి —–పూర్ణ బోదోహం,సదానంద–పూర్ణ బోదోహం ||
               అను పల్లవి —-వర్నాశ్రమాచ్చార కర్మాతి దూరోహం –స్వర్నవదఖిల వికార గతోహం ||
                చరణాలు —01 —ప్రత్యగాత్మాహం ప్రవితత సత్య మనోహం –శ్రుత్యంత శత కోటి ప్రకటిత బ్రహ్మ హం —నిత్యో హమ మభాయోహమద్వితీయోహం ||
   02 –సాక్షీ మాత్రోహం,ప్రగలిత పక్ష పాతోహం —మోక్ష స్వరూపోహమొంకార గంయోహం —సూక్ష్మోహ మనఘోహ మద్భుతాత్మాహాం ||
    03 –స్వప్రకాశోహం విభురహం,నిష్ప్రపంచోహం —అప్రమేయోహమచాలోహమకాలోహం —నిష్ప్రతర్క్యాఖండైక రసోహం .||
     04 –అజ నిర్మమొహం ,బుధ జన భజనీయోహం –అజ రోహామమరోహమమ్రుత స్వరూపోహం —నిజ పూర్ణ మహిమని నిహిత మహితోహం ||      05 –నిరవయవోహం ,నిరుపమ నిష్కలన్కోహం —పరమశివేంద్ర శ్రీ గురు సోమ సముదిత —-నిరవధి నిర్వాణ సుఖ సాగరోహం ||
                     భావం —–ఆత్మానుభావం పొందిన అనుభవ స్థాయి నుంచి ఉద్భవించిన మధు మధుర గీతం,సంగీతముపనిశద్ ఉపదేశం ఈ కీర్తన
                                ”నేను పూర్ణ జ్ఞాన ఆనంద స్వరూపుడిని .వర్ణాశ్రమ ,ఆచార ,కర్మ ధర్మాలకు అతీతుడిని .బాంగారం లాగా అనేక మార్పులు పొందే వాణ్ని .అందరిలో వున్న ఆత్మను ,నామ రూప జగత్తు లో వ్యాపించిన సత్య స్వరూపున్ని .ఉపనిషత్ చెప్పిన పరబ్రహ్మను .నిత్య ,అభయ,అద్వితీయ ,బ్రహ్మను .అన్నిటికి సాక్షీ భూతుడను .పక్ష పాత రహితున్ని .ఓంకారంవల్ల   చేరదగిన వాడిని .సూక్ష్మమై ,పాప రహితమైన అద్భుత ఆత్మను .నేను స్వయం ప్రకాశ కుడిని .అన్ని రూపాలు నేనే .ప్రపంచాతీతుడిని నేను .కొలతలకు అందని వాడిని .సర్వ వ్యాపకుడిని .విభజన ,కదలిక లేని వాడిని .తర్కానికి అతీత మైన ఏక రసాన్ని.జన్మ ,మమకారం లేకుండా ,బుధ జన ఆరాధకుడిని .జనన ,మరణాలు లేని అమృత స్వరూపుడిని .నా మహిమ లోనే నిలిచి వుండే మహా మహితాత్ముడిని .అవయవాలు లేని ,అనుపమాన మైన ,నిష్కలంకున్ని నేను .శ్రీ పరమ శివేంద్ర గురు దేవుల నే ,చంద్రుని ద్వారా ఉదయించిన సుఖ సాగ రాన్ని నేను .”
            విశేషం —-ఇది ఆత్మను దర్శించే సందర్భం .అంటే ఆత్మ ఆవిష్కారం .ఈ సమయం లోనూ ,తన గురు పాదులు శ్రీ పరమ శివెంద్రులను సస్మరించారు . సదాశివ బ్రహ్మేన్ద్రులు .గురు కటాక్షం సంపూర్ణం గా పొందిన వారు కనుక ,గురు స్మరణే ముక్తి దాయకం గా భావించారు .రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు .గురువు చంద్రుడు అయితే గురువు నుండి ఆత్మ జ్ఞానం పొందిన శిష్యుడు చంద్రుని వెన్నెలకు ఉప్పొంగే అనంత సాగరం నిగూధం కూడా .కొందరు బాహ్య విషయాల వల్ల మహిమలు పొందు తారు ..వీరు సామాన్యులు తన మహిమతో తానే నిలిచే ఆత్మ స్వరూపుడుమహాత్ముడు .
                            ఇక్కడితో ఆత్మ బోధ పూర్తి అయింది .తర్వాత ”బ్రహ్మానందం ”అనుభ విద్దాం .
                                                              సశేషం
                                                                             మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —30 -10 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

Posted in రచనలు | Leave a comment

శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతా మృతం —–7 ఆత్మ బోధ

శ్రీ సదాశివబ్రహ్మేంద్ర   కీర్తనలలో అద్వైతా మృతం —–7
                                                                     ఆత్మ బోధ
      ఇంత వరకు శ్రీ సదాశివ బ్రమ్హేంద్ర కీర్తనల లో రామ రసాయనం ,క్రిష్ణామ్రుతం చవి చూశాం .ఇప్పుడు అద్వైత బోధ ను తెలుసు కుందాం .ఇందులో మొదటికీర్తన ”  ‘చింతా నాస్తి కిలా ”.ను గురించి తెలుసు కుందాం.
   01 —   పల్లవి —చింతా నాస్తి కిలా తేషాం —చింతా నాస్తి కిలా ||
                       చరణాలు —-01 -శమ దమ కరుణా సంపూర్ణానాం —సాదు సమాగమ సంకీర్తానాం ||
                                        02 —కాలత్రయ జిత కందర్పానాం —ఖండిత సర్వేంద్రియ  దర్పానాం ||
                                         03 —పరమహంస గురు పద చిత్తానాం –బ్రహ్మానందామ్రుత  మత్తానాం ||
                  భావం —–ఇది ఆత్మ బోధ లో మొదటి కీర్తన .మానసిక పరిణతి కి మార్గోప దేశం చేశారు బ్రహ్మేన్ద్రులు .”మనో నిగ్రహం ,ఇంద్రియ నిగ్రహం వుండి ,కరుణా పూర్ణులై ,నిరంతరం సత్పురుష సాంగత్యం లో వుండే వారికి ,కామాన్ని ,ఇంద్రియ దర్పాన్ని అన్ని కాలాల్లోను జయించిన వారికి ,పరమ హంసలైన గురు పాదాల మీద ధ్యాస వున్న వారికి ,బ్రహ్మానందం అనే అమృతాన్ని గ్రోలి మత్తెక్కిన వారికి చింత అనేది లేదు -లేదు -లేదు ”
                       విశేషం —–లోక విషయాల నుంచే చింతలు వస్తాయి .వీటిని చూసేవి ఇంద్రియాలు .,ప్రేమించేది మనసు .వీటి వల్ల స్వార్ధం ,ద్వేషం కలుగు తాయి ..ప్రేమ తగ్గి పోతుంది .జితేన్ద్రియులకు,కామాన్ని జయించిన వారికి ప్రాపంచిక , వాంచలు వుండవు . వాటి పై అర్రులు చాచే వారిపై జాలి కలుగు తుందే కాని ,కోపం రాదు .మనసు చంచల మైంది .ఎప్పుడూ స్థిరం గా వుండదు .స్థిర చిత్తం కావాలంటే సజ్జన సాంగత్యం నిరంతరం కావాలి .మహాత్ముడైన గురువు ను చేరి ,ఆత్మార్పణ చేసు కుంటే ,గురువు అనుగ్రహం తో ,చెడు భావనలు దగ్గరకు చేరావు .బ్రహ్మ పదార్ధాన్ని అందుకొని ,ఆ ఆనందం లో నిలిచి పోయిన వారికి మనస్సు అంతరిస్తుంది .మనస్సు నాశనం అయితే ,చింతలు అసలు ఉండనే వుండవు ..శాస్వతానందానికి ఇదే మార్గం అని సదాశివులు బోధించారు .
                       ఇప్పుడు రెండో కీర్తన లోకి వెళ్దాం
                    02 —పల్లవి —-స్థిరతా నహి నహి రే ,మానస —స్థిరతా నహి నహి రే ||
                                    చరణాలు —-01 -తాపత్రయ సాగర మగ్నానాం —దర్పాహన్కార విలగ్నానాం ||
                                                    02 –విషయ పాశ వేష్టిత చిత్తానాం –విపరీత జ్ఞాన విమత్తానాం  ||
                                                     03 –పరమ హంస యోగ విరుద్దానాం —బహు చంచలతర సుఖ సిద్ధానాం ||
                       భావం ——ఈ కీర్తన లో మనసుకు స్థిరత్వం అనేది లేదు అని  రూధిగా తెలియ జేశారు .ఎవరికి లేదు ?అని విచారించారు .”మనసా !తాపత్ర్యాలలో మునిగిన వారికి ,అహంకార దర్పాన్ని పట్టుకొని వ్రేలాడే వారికి ,విషయ వాంచలు అనే తాళ్ళతో బద్ధులైన మనసు కల వారికి ,చంచల మైన సుఖాల కోసం అర్రులు చాచే వారికి ఎన్నడు మనశ్శాంతి లభించదు ”అని నిర్ద్వందంగా చెప్పారు .
                     విశేషం —-తాపత్రయాలు మూడు .ఆది దైవిక ,ఆది భౌతిక ,ఆధ్యాత్మిక బాధలు .ఇతరుల పట్ల ప్రదర్శించేది దర్పం .తనలో వుండేది అహంకారం .ప్రపంచమే నిజం,దేవుడు అబద్ధమనుకునే జ్ఞానమే విపరీత జ్ఞానం .దర్పము ,అహంకారము పరమాత్మకుదూరం   చేస్తాయి .విషయ వ్యామోహం కూడా పరమాత్మను చేర నివ్వదు .స్థిరత అంటే శాశ్వత మైన దానిలో స్థానం .చలించే విషయాలపై వచ్చే జ్ఞానం కూడా చంచలమైనదే .దాని వల్ల శాంతి ,స్థైర్యం లభించవు .కనుక స్థిరమై ,శాశ్వతమై ,అఖండమై ,అక్షరమైన పరబ్రహ్మం లోనే స్థిరత్వం ,శాంతి లభిస్తాయని సందేశం .
                       మూడవ కీర్తన లోకి ప్రవేశిద్దాం
                 03 –పల్లవి —-తత్త్వజ్జీవత్వం బ్రహ్మణి–తత్త్వజ్జీవత్వం  ||
                                 చరణాలు -01 –యద్వాత్తోయే చంద్ర ద్విత్వం —-యద్వాన్ముకురే ప్రతి బిమ్బత్వ ||
                                               02 -స్థానౌ యద్వత్ నర రూపత్వం —భాను కరే యద్వత్ తోయత్వం ||
                                               03 —శుక్తౌ  యద్వత్ రజతమయత్వం  —రాజ్జౌ యద్వత్ ఫణి దేహత్వం ||
—                                             04 –  పరమ హంస గురునాద్వైత విద్యా —భనితా ధిక్క్రుత మాయా విద్యా |\
                       భావం —–ఈకీర్తన లో  ఉపనిషత్ రహశ్యం అంతా ,గాన రూపం లో వెన్న లా అందించారు .మాయ ఎలా భ్రమింప జేస్తుందో ,దాన్ని ఎలా తొలగించుకోవాలో ,బహు చక్కగా వివరించారు బ్రహ్మేన్ద్రులు .”నీటి లో రెండవ చంద్రునిలా ,అద్దం లోని ప్రతి బింబం లా ,మ్రోడు వారిన చెట్టు లో మానవ రూపం గా ,ఎడారిలో ఎండ మావి లా ,ముత్యపు చిప్ప లో మెరిసే వెండి లా,త్రాడు లో కనబడే పాము లా,బ్రహ్మం లో జీవత్వం అనేది భ్రమ వల్ల కని పిస్తోంది .పరమహంస వరేన్యులైన గురు అనుగ్రహం వల్ల ,అద్వైత విద్య తో అజ్ఞానం అనే మాయ తొలగి ,జ్ఞాన  ప్రకాశం లభిస్తుంది .
                                  విశేషం —-దీనికి కొంత వివరణ ఇవ్వాలి .నీటి లో చంద్ర బింబం ,మరుభూమి లో ఎండ మావి ,ముత్యపు చిప్ప లో వెండి కనిపించటం లోక సహజం .కొద్దిగా విచారించి చూస్తే ,అసలు రూపం బయట పడుతుంది .అదంతా భ్రమ అని తెలిసి పోతుంది .తర్వాత కూడా అవి కనబడు తున్నా ,భ్రాంతి మాత్రం తొలగి పోతుంది చెట్టు లో అందరు మనిషి ని చూడ లేరు .అజ్ఞానం పొరలు తొలగితే భ్రాంతి దూరమవు తుంది .రెండు రకాల భ్రాంతులు .భ్రాంతికి కారణం అజ్ఞానమే .ప్రపంచము ,అందు లోని అనుభవాలు రెండు రకాల భ్రాంతులు అసలు సమష్టి వాసనలే మూల అజ్ఞానం అంటారు విజ్ఞులు .వాటి వల్లే మనకు కని పించే ప్రపంచం ఏర్పడింది .అందరికీ చెందిన ఈ ప్రపంచం లో ఎవరి స్వంత వాసనల తో వారు వెలుగు తూంటారు .అందుకే వ్యక్తి గతమైన దుఖాలు ,కష్టాలు ,అనుభూతులు కలుగు తాయి .గురు ముఖతా అద్వైత విద్య పొందితే భ్రమ నాశనం అవుతుంది .సమష్టిప్రపంచం  జనానికి కనిపిస్తున్నా ,వ్యక్తిగత భ్రాంతి నశించటం వల్ల ,ఆ మహాత్ముడు ప్రపంచాన్ని ఒక ఖేలగా అంటే ఆటగా భావిస్తాడు .ఇదే ఇందులో వున్న పరమార్ధం
                                          సశేషం
                                       మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —29 -10 -11 .

 

Posted in రచనలు | Leave a comment

అవసర రచనలతో అందరి వాడైన” అవసరాల .రామ కృష్ణ రావు ”

  అవసర రచనలతో అందరి వాడైన” అవసరాల .రామ కృష్ణ రావు ”
                  విశాఖ లో ఇంకో సాహితీ శిఖరం కూలి పోయింది .హాస్య ద్వయం గా విశాఖను ఏలిన జంట రచయితల్లో భ.రా.గో .మరణించిన తరువాత ఇప్పుడు అవసరాల రామ కృష్ణా రావు గారి మరణం ఆంద్ర దేశానికి తీవ్ర శోకమే మిగిల్చింది లెక్కలు అంటే భయమున్న రోజుల్లో ,ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అనుకొనే కాలం లో ,అన్కగనితం అంటే వెర్రి కుంకలు మాత్రమే నేర్చేది అన్న అభి ప్రాయం ఉన్న సమయం లో   ,జామెట్రి అంటే ”జా మెన్త్రి ” అని తప్పుగా పలికే కాలం లో లెక్కలు అంటే భయం లేకుండా చేసి ,అది అందరు నేర్వ దగిన్దేనని ధైర్యం చెప్పి ,హాయిగా గణితాన్ని ఏలా నేర్చుకోవచ్చో నని తెలియ జెప్పి ”METHAME TRIKS ” గా దాన్ని దివి నుండి భువికి దింపి అందుబాటు లోకి తెచ్చారు రావు గారు .ఇంగ్లీష్ చదువు చదువు తున్నా ,అది గ్రీక అండ్ లాటిన్ గా భావించే వారికి ఆ భయాన్ని పోగొట్టి ,అభయం ఇచ్చి ”AANGREJI MADE EASY ”అని వెన్ను తట్టి అందులో ప్రవేశం కల్గించారు రామ కృష్ణా రావు గారు .ఈ రెండు  ఆ నాటి   జనాలకు అవసరమైన వె .అందుకే అవసరానికి తగిన రచనలు చేశారు అవసరాల వారు అన్నాను .ప్రాస కోసంకాదని  మనవి .అట్లాగే ,మునిమాణిక్యం ,భమిడి పాటి తర్వాత తెలుగు హాశ్యం తగ్గింది ,పలచబడింది ,ఎబ్బెట్టు గా వుంది అనుకున్నప్పుడు భమిడి పాటి రామ గోపాలం ,అవసరాల రామ కృష్ణా రావు గార్లు సున్నితమైన హాశ్యాన్ని వ్యంగ్యం తో రంగరించి అంగ రంగ వైభవం కలిగించారు .విభిన్న మార్గాలలో దాన్ని పండించారు ..విశాఖలో రావి శాస్త్రి ,భ.రా గో .,,అవసరాల హాష్య త్రయం గా నిలిచారు .ఆ త్రాయం క్రమం గా ద్వాయమై ,ఒంటరి ఆయీ  అదీ నిన్న నిష్క్ర మించింది .ఏంచేద్దాం .మన దురదృష్టం .
                   ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఆంగ్లం లో డాక్ట రేట్ సాధించారు రామ కృష్ణా రావు గారు .ఒరిస్సా లో ని ”బలన్గీర్ ”ప్రభుత్వ కళా శాలలో ముప్ఫై ఏళ్ళు ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేసి రీడర్ గా రిటైర్ అయారు .విశాఖ లో స్థిర పడ్డారు .వీరు 1931 డిసెంబర్ 21  న మద్రాస్ లో జన్మించారు .తండ్రి జగన్నాధ రావు ,తల్లి తిరుపతమ్మ గార్లు .వీరిది తూర్పు గోదావరి జిల్లా తుని .17 వ ఏటనే 1947 లో    పొట్టి పిచ్చుక ”అనే కధ తో వీరి సాహితీ జీవితం ప్రారంభ మైంది .అది చందమామ మాస పత్రిక లో ప్రచ్రితమైంది .600 లకు పైగా కధలు రాశారు  ”పేక ముక్కలు ‘అనే పేరుతో మొదటి యాభై రెండు కదల  సంపుటి   తెచ్చారు ..మొత్తమ్మీద ఎనిమిది కదా సంపుటులను వెలువరించారు .”సంపెంగలు -సన్న జాజులు ,సహజీవన భాగ స్వామ్యం ,రామ చిలుక ,అదుగో మామయ్యా –ఆ  వెనుక మేం  ,జై కు బహు వచనం జైలు మొదలైన ఎనిమిది నవలలు రాశారు .వివిధ పత్రికల లో చాలా కాలం శీర్షికలు నిర్వ హించారు .ఆయన హాస్య వ్యంగ్య రచనా నిర్మాణానికి ”కేటు -డూప్లికేటు ”గొప్ప ఉదాహరణ.అవసరాల .ఆవ  అనగానే ఆ పేరు జ్ఞాపకం వస్తుంది ముందు .అదొక చక్కని COINAGE WORD  .ఆయన  గణిత విశారద అనేపుస్తకం రాశారు .అందుకే లెక్కల్ని అంత సులభం గా అందరి ముందుకు లాక్కొచ్చారు .
                  1985 లో అవసరాల వారికి ఆంద్ర విశ్వ విద్యాలయం డాక్టరేట్ నిచ్చి సత్కరించింది .1994 లో తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ హాస్య రచయిత గా గుర్తించి సన్మానించింది 1996 లో జ్యేష్ట లిటరరీ అవార్డును పొందారు .2000 సంవత్చారం లో కేంద్ర సాహిత్యఅకాడెమి పురస్కారాన్ని అందుకున్నారు .అదే సంవత్చారం లో చండీఘర్ ఆంద్ర సారస్వత సంఘం విశేషం గా సన్మానించి గౌరవించింది 2004 లో అమెరిక లోని తెలుగు సంఘం ఆయన్ను ఆహ్వానించి ఘనం గా సత్కరించింది .విజయనగర తెలుగు భాషా పురస్కారాన్ని అందించి విజయ నగర వాసులు ధన్యులయారు .ఇలా వారికి అన్ని రకాల అవార్డులు  రివార్డులు ,లభించాయి . ఇది ఆంధ్రులందరికీ గర్వ కారణం .ఒక సాహితీ శిఖరం గావున్నారు .తన అభిప్రాయాలను నిర్మోహ మాతం గా పత్రికా ముఖం గా వెలువరిస్తూనే వున్నారు .  .
                 మధ్య తరగతి మంద హాసాన్ని పుణికి పుచ్చుకున్న రచయిత అవసరాల వారు .వారి జీవితా లలోని చీకటి ,వెలుగులనుహాయిగా   ,కవ్విస్తూ ,నవ్విస్తూ ,వ్యంగ్యవైభవం  జోడిస్తూ రచనలు చేశారు .ఆయన కధ చెప్పే తీరు పరమ రమణీయం గా వుంటుంది అందుకే ఆయనను””కదా కదన భీష్ముడు ”అన్నారు .ఆయన తన మనోభావాలను చక్కగా తెలియ జేశారు ”దుఖాన్ని బిగ బట్టి -సుఖాన్ని బయట పెడితే జీవితం బాలన్స్ అవుతుంది .హాస్యం ఆర్త హృదయానికి దివ్యౌషధం .అనుభవాలు ఆనందాన్నిస్తాయి .అదే బ్రహ్మానంద సదృశ రసానందం .ఏమి రాశాము అన్నది ముఖ్యం కాదు .ఎలా రాశాము అన్నది ముఖ్యం ” అదేఆదర్శం   గా ఆయన రచనలు చేశారు .అందుకే అవి అంత పాపులర్ అయాయి ..
              రామ కృష్ణా రావు గారు అభ్యుదయ వాది .తాను నాస్తికుడిని అనేచెప్పే   వారు .మానవీయ మూర్తి అవసరాల వారు .తాము మరణించిన తర్వాతతమ పార్ధివ దేహాన్ని    వైద్య కళా శాలకు అప్పగించాలని 2005 లోప్రచ్రించిన  తమ కదా సంపుటి ”ఆస్థి పంజరం ”  లో కోరిన పుణ్య పురుషులు ఆయన .పరోప కారార్ధం ఇదం శరీరం అని జీవితం అంతమైన తరువాతకూడా రుజువు చేసిన సమాజ హితైషి .  ”నేను -నేనే ”అని చెప్పుకునే అవసరాల రామ కృష్ణా రావు గారు నిజం గానే ఆ మాటను నిలుపు కున్నారు .81 యొక్క ఏళ్ళు నిండు గా జీవించారు .
                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ల లో అద్వైతా మృతం ——6 క్రిష్ణామృతం

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ల లో అద్వైతా మృతం ——6
                                                                        క్రిష్ణామృతం
                 బ్రహ్మేన్ద్రులు శ్రీ కృష్ణుని ఉద్దేశించి రాసిన కీర్తన లలో ఆరవ దాన్ని గరించి ముచ్చటించు కుందాం
            06 —-పల్లవి —-క్రీడతి వన మాలీ ,గొష్టే –క్రీడతి వనమాలీ ||
                         చరణాలు —01 —ప్రహ్లాద పరాశర పరిపాలీ –పవనాత్మజ జామ్బవదను కూలీ ||
                                        02 -పద్మా కుఛ – పరిరంభన శాలీ —పాటు తరశాసిత   మాలి సుమాలీ |
                                        03 –పరమ      హంస వర కుసుమ సుమాలీ — ప్రణవ పయోరుహ గర్భక  పాలీ
                  భావం    ——తోట మాలి అయిన శ్రీ కృష్ణుడు గోశాలలో ఆడుతున్నాడు .ప్రహ్లాద ,పరాశారులను పాలించే వాడు ,ఆంజనేయ ,జాంబ వంతులకు అణు కూలుడు ,శ్రీ లక్క్ష్మి వక్ష స్థలం లో విహరించే వాడు ,మహా బల వంతు లైన మాలి ,సుమాలీ అనే రాక్షసులను సంహరించిన వాడు ,పరమ హంసల చేత కూర్చినఅందమైన పూల హారం కాంత సీమ లో వున్న వాడు ,ఓంకారం అనే తామర పుష్పానికి విత్త నాన్ని కాపాడే వాడు , అయిన్క వన మాలి గోవుల కొష్టం (శాల )లో ఆనందం గా క్రీడిస్తున్నాడు ఆయన్ను భజించి తరించమని చెబుతున్నారు .,
                      విశేషం —–వనమాలీ అనేది చక్కటి పదం .వనం అంటే కోరిక అనే అర్ధం వుంది కొష్టం అంటే గోవుల శాల .గోవు అంటే ఇంద్రియాలు అనే అర్ధం వుంది .కోరికల మాల ధరించి ,ఇంద్రియ విషయాలతో పరిగెత్తే జీవుడు కూడా దేవుడే .ఆ రూపం లో వున్న భగ వంతుడే పరిగెత్తు తున్నాడని భావం .ప్రహ్లాద ,పరాశారులు అనటం లోను లోతు వుంది .ప్ర్కహ్లాదుదు మహాభక్తుడు .పరాశరుడు జ్ఞాని .సాకార ,నిరాకారా లతో ఇద్దరినీ పాలించేది ఒకే భ్క్యగా వంతుడు అని నిగూఢ రహశ్యం .పద్మ అనేది సంపద కు చిహ్నం .ప్రాపంచిక ,పార మార్ధిక సంపద అంతా లక్ష్మీదేవియే ..ఈ సంపదను అంతా కాపాడేది భగ వంతుడే .
                  రావణాసురుని తల్లికి తండ్రి సుమాలీ .వాడి తమ్ముడు మాలి .మాల్య వంతుడు అనే ఇంకో తమ్ముడు వున్నాడు .ఈ ముగ్గురు లంకలో ఉంటూ ,స్వర్గం మీదికి దండెత్తితే శ్రీ మహా విష్ణువు వాళ్ళతో యుద్ధం చేశాడు .వాళ్ళు తట్టు కో లేక పారి పోయారు .లంకలో  తల దాచుకున్నారు .మాల్య వంతుడు చచ్చాడు యుద్ధం లో .మిగిలిన ఇద్దరూ పాతాళం లోకి పారి పోయి దాక్కున్నారు .ఇంత కధను వాళ్ళిద్దరి పేర్లు చెప్పటం తో బయట పెట్టారు సదా శివులు .ఇదివరకటి కీర్తన లో ”ప్రణవ పయోధర ”అని రాస్తే ,ఈ కీర్తన లో ”ప్రణవ పయోరుహ ”అన్నారు .ప్రణవం తామర పువ్వు లాంటిది .ప్రపంచ రూపం గా వికశిస్తుంది .మళ్ళీ బీజ రూపం లోకి మూసుకు పోతుంది .బీజ (విత్తనం )రూపం లో ప్రపంచం అవ్యక్త మైన పుదు ,దాన్ని రక్షించి వుండేదీ పరమేశ్వరుడే .అందుకే ”ప్రణవ పయోరుహ గర్భక ,పాలీ ”అన్నారు .శివేంద్ర యోగి .గర్భక అంటే విత్తనాన్ని ,పాలి అంటే రక్షించే వాడు అని అర్ధం ”.కపాలి ”అని కలిపి చదవ కూడదు .గర్భక ,పాలి అని చద వాలి  విత్తనం . లో సర్వ వృక్షం దాగి వున్నట్లు చిన్న మాట లో విశ్వ మంత భావాన్ని ఇమిడ్చిన మహా కవి శేఖరులు ,పరమ హంస శ్రీ బ్రహ్మేన్ద్రులు .ఇవి ఏదో బుద్ధి తో రాసినది కాదు .ఒక తన్మయా వస్థ లో ,సమాధి స్థితి లో రాసిన మహత్తర కీర్తనలు ఇవన్నీ .అందుకే అంత మధురం ,అంతటి లోతు .
                ఏడవకీర్తన లోకి చేరు కుందాం .
            07 —-పల్లవి ——మానస సంచరరే ,బ్రహ్మని –మానస సంచరరే ||
           అను పల్లవి —     –  –మద శిఖి పించ అలంకృత చికురే —మహనీయ కపోల విజిత ముకురే ||
                             చరణం — శ్రీ రమణీ కుఛ దుర్గా విహారే –సేవక జన మందిర మందారే ||
                                          పరమ హంస ముఖ చంద్ర చకోరే —పరి పూరిత మురళీ రవ దారే ||
                భావం —-ఇదీ మానస బోదె .చాలా బాగా ప్రాచుర్యం చెందిన కీర్తన .”శంకరాభరణం సినిమా లో ఈ కీర్తనను దర్శకుడు విశ్వ నాద్ అద్భతం గా ,రసాత్మకం గా ,అత్యంత ఆర్ద్రం గా చిత్రీకరించి షాహ బాష్ అని పించారు .ఆ సన్ని వేశం చూసి ఆనంద బాష్పాలు రాల్చని వారు లేరు
                         వో మనసా !పరబ్రహ్మం లో సదా సంచరించు .లక్ష్మీ కుఛ విహారి శ్రీమన్నారాయణుని లో సంచరించు .సేవించే భక్త జనులకు మందారం ఆయన .నెమలి పించం తో వున్న ముంగురులు వున్న వాడు ,.ఆయన నున్నని చెక్కిలి అద్దాలకంటే దీతైనది .పరమ హంస ముఖ చంద్ర కాంతిని ఆస్వాదించే చకోరం శ్రీ కృష్ణ పరమాత్మ .మురళి ని పూరించి నాద రసాన్ని ప్రవహింప జేస్తాడు .అలాంటి శ్రీ కృష్ణ పరబ్రహ్మం లో సదా సంచరించు అని మనసుకుని కోరారు
                        విశేషం —-భక్తులకు ఇల్లు భగవానుని లోగిళ్ళు .చంద్రుని కోసం చకోరాలు తపిస్తాయి .చంద్ర కాంతిని ఆస్వాదించి సంతృప్తి చెందు తాయి .అలాగే జ్ఞానుల జ్ఞానం లో పరమాత్మ సంతృప్తి చెందుతాడు .శ్రీ కృష్ణుని దివ్య రూపం కళ్ళ ముందు సక్షాత్కారించేట్లు చేసిన రచన .విన్తునా ,ఆ మూర్తిని ఊహించుకున్నా మనసు ఆనంద పులకాన్కితం అవుతుంది .పరబ్రహ్మ సామీప్యం లో వున్న అనుభూతి లభిస్తుంది .అదీ ఈ కీర్తన వైశిష్ట్యం
                    క్రిష్ణామృతం లో ఎనిమిదవది ,చివరిది అయిన కీర్తన లో కి ప్రవేశిద్దాం రండి
                   08 —–పల్లవి —-భజరే యమునాతీరా విహారం ||భజ మన యదుకుల నంద కిశోరం ||
                             చరణాలు —01 –పరమానందం పరబ్రహ్మ రూపం –పావన గాత్రం –పుణ్య చరిత్రం ||
                                             02 —నంద కుమారం నవనీత చోరం —నారద వందిత నారాయణం |\
            భావం —-యమునా తీర విహారీ రసమయ మూర్తీ ,శ్రీ కృష్ణ మూర్తిని భజించమని మానస బోధ ఈ కీర్తన .”పరమానంద స్వరూపుడు ,పరబ్రహ్మ స్వరూపుడు ,శ్రీ కృష్ణ పరమాత్మ .పవిత్ర శరీరుడు .నంద కిశోరుడు పుణ్య చరితుడు .నవనీత చోరుడు,నారదుని చే అను క్షణం కీర్తింప బడే వాడు ,నారాయణుడు .భక్తి తో భజించి తరించు .
              విశేషం —–శ్రీ కృష్ణుడు యమునా తీరం లో సామాన్యులకు కని పించడు .శరీర మనో ,బుద్ధుల్ని అణచు కున్నప్పుడే అంటే సంయమనం చేసిన తర్వాతే భగ వంతుని దర్శనం లభిస్తుందనివూహ  చేశారు బ్రహ్మేన్ద్రులు ..ఈ విధం గా శ్రీ కృష్ణ గుణ గానాన్ని ,మురళీ రవామ్రుతాన్ని ,శ్రీ కృష్ణ పరబ్రహ్మ దివ్య దర్శనాన్ని ,కర్ణామృతం గా శ్రీ కృష్ణుని లీలల్ని ప్రదర్శించి కీర్తనల్ తో రసానందాన్ని కలిగించిన మహా పరమ హంస సదాశివ బ్రహ్మేంద్ర యోగి వరేన్యులు .
                                  ఇంతటి తో కర్ణామృతం సమాప్తం .తరువాత ”ఆత్మ బోధ”ను గురించి తెలుసు కుందాం
                                                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లలోఅద్వైతా మృతం —5 కృష్ణా మృతం

    శ్రీ  సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లలోఅద్వైతా   మృతం —5
                                                                    కృష్ణా మృతం
 –                      బ్రహ్మేన్డ్రుల కృశా మృతం లో ని మూడవ కీర్తన
      3—పల్లవి —  బ్రూహి ముకున్దేతి రసనే –పాహి ముకున్దేతి ||
          చరణాలు —-01 -కేశవా మాధవ గోవిన్దేతి —క్రిష్ణానంత సదా నందేతి ||
                           02 -రాదా రమణ హరే రామేతి –రాజీ వాక్ష ఘన శ్యామేతి ||
                          03 –గరుడ గమన నందక హస్తేతి –ఖండిత దశ కంధర మస్తేతి ||
                          04 –అక్రూర ప్రియ చక్ర ధరేతి –హంస నిరంజన కంస హరేతి ||
                                       భావం —-  వో నాలుకా! (రసనే ) ముకుందా అని పలుకు .ముకుందా రక్షించు (బ్రూహి )అని కోరు .కేశవా మాధవా ,గోవిందా ,కృష్ణా ,అనంతా,సదానందా ,రాదా రమణా ,హరే రామా ,రాజీ వాక్షా ,ఘన శ్యామా ,గరుడ గమనా ,నందక హస్తా ,రావణ సంహారా ,అక్రూర వరదా ,చక్ర ధారీ ,హంసా ,నిరంజనా ,కంసారీ అని నోరారా పలుకు .అని నాలుకకు ఉపదేశం చేశారు సదాశివులు
            విశేషం —-గోవింద నామాలన్నీ ఏర్చి కూర్చిన కీర్తన ఇది .ప్రతి నామ వెనుక ఒక కధ వుందని మనకు తెలుసు .నామ మాహాత్మ్యాన్ని ఇందులో చూపారు పరమ హంస .పరవశించి పలికితే పరమ పదమే లభిస్తుందని తెలియ జేశారు .నాలుక ఏ నామాన్ని పలికితే ,మనసు ఆరూపాన్ని   తలుచు కుంటుంది .నామానికీ ,రూపానికి వున్న సంబంధం ,అనుబంధం ఇది .మనసు దేనిని తలిస్తే దాని పై ప్రేమకూడా కలగటం సహజం .ప్రపంచం మీద ప్రేమ తగ్గించుకుని ,భగ వంతుని పై ప్రేమ పెంచుకోవ టానికి ఏకైక మార్గం కృష్ణ నామ స్మరణ అన్న సూక్ష్మాన్ని ఈ కీర్తన ద్వారాతెలియ   జెప్పారు బ్రహ్మేంద్ర స్వామి .
               నాల్గవ కీర్తన లోకి ప్రవేశిద్దాం
                4—పల్లవి  —–భజరే గోపాలం మానస –భజరే గోపాలం ||
                   చరణాలు —01 –భజ గోపాలం భజిత కుచేలం –త్రిజగన్మూలం దితి సుత కాలమ్ |\
                                  02 –ఆగమ సారం యోగ విచారం –భోగ శరీరం భువనాధారం |\
                                  03 –కదన కథోరం కలుష విదూరం –మదన కుమారం మధు సంహారం |
                                  04 –నత మందారం నంద కిశోరం –హత చాణూరం హంస విహారం ||
                                       భావం —-గోపాల కృష్ణుని భజించమని మనసుకు చేసే బోధ ఇది .”స్నేహితుడైన కుచేలుని చే సేవింప బడిన వానినీ ,మూడు లోకా లకుమూల మైన   వాడినీ ,దితి కుమారులైన రాక్షసులను సంహరించిన వాడినీ ,భాజించవే మనసా !.వేద సారం అయిన వాడినీ ,యోగం ద్వారానే విచారించి తెలుసుకో వలసిన వాడినీ ,కేవలం భోగం కోసమే అవతారం ఎత్తిన వాడినీ భువనాలకు ఆధారం అయిన వాడినీ ,అయిన శ్రీ కృష్ణుని భజించు .శరణు అన వాడికి మందారం ,నందబాలం .చానూరాన్తకుడు ,హంస లాగా విహరించే గోపాల కృష్ణుని భజించి తరించు .
                        విశేషం —-కుచేలుడు శ్రీ కృష్ణుని చిన్న నాటి  స్నేహితుడు .అతడు శ్రీకృష్ణున్ని శ్రీ కృష్ణుని భక్తునిగా ,స్నేహితునిగా భగవంతుని గా సేవించాడు .కృష్ణుడు కుచేలుడిని బాహ్యం గా ,అతిధి సత్కారాలు చేసి పూజించాడు .భగవంతునికి భక్తునికి భేదం లేదని తెలియ జేసే సందర్భం ఇది .శ్రీ క్రిష్ణునిది భోగ శరీరం .అంటే ఈ ప్రపంచం లో సంచ రించా టానికి  శరీరం ..ఆయనే కల్పించ్కున శరీరం .”మదన కుమారం ‘అంటే మన్మధుని వంటి కుమారుడు అనీ ,మన్మధుని కుమారునిగా పొందిన వాడు అనీ శ్రీ కృష్ణ పరం గా రెండు అర్ధాలు వున్నాయి .”హంస ”అనే పదం చాలా విశేష మైనది .విచక్షణా జ్ఞానం తో వ్యవహరించే బుద్ధిని హంస అంటారు .ఈ హంస పై విహరించే వాడే భగ వంతుడు .అందుకే హంస విహారి అయాడు ..పదాలు అన్నీ నాదానుగునం గా నర్తనాను గుణం గా వుండి మనసు ను పరవశింప జేస్తాయి .rhytham మనలను విశేషం గా ఆకర్దిస్తుంది .క్షణం యెడ బాటు కని పించదు .ప్రవాహం లా పదాలు ప్రవహిస్తుంటాయి . శ్రవణ శుభగత్వం అంటే ఇదే .
                       ”భజరే యదు నాదం ”అనే అయిదవ కీర్తన లో కి ప్రవేశిద్దాం
                 5— పల్లవి —భజరే యదునాధం మానస —భజరే యదు నాదం ||
                                చరణాలు —01 -గోప వధూ పరి రంభన లోలం –గోపా కిశోరక మద్భుత లీలం ||
                                                02 –కపతాన్గీక్రుత మానుష వేషం —కపట నాట్య కృత కుత్చిత వేషం |||\
                                                 03 –  పరమ హంస హ్రుత్తత్వ స్వరూపం –ప్రణవ పయోధర ప్రణవ స్వ రూపం -||
                భావం ——యదు వంశ కిశోరాన్ని (శిశువు )భజించ మని మనసుకు బోధిస్తునాడు .”యదుకుల నాధుడు ,గోపికలను ,ఆలింగనం చేసుకోవటం లో ఆసక్తుడైన వాడు ,బాల క్రిషుడు ,అద్భుత లీలలను ప్రదర్శించిన వాడు ,లీలా మానుష విగ్రహుడు ,నాట కాల లో పాత్ర లాగ క్షుద్ర పాత్రలూ ధరించిన వాడు ,పరమ హంస హృదయాలలో ఆత్మ స్వరోపం గా వున్న వాడు ఓంకార స్వరూపుడు ,అయిన బాల కృష్ణ భగవానుడిని స్మరించు ”
                       విశేషం —-గోప వధూ అనటం లో త్రిగుణాలతో వున్న జీవు లందరూ స్త్రీ మూర్తులే అన భావం వుంది .స,ర ,త అనే మూడు అక్షరాలూ ఈ కారం తో కలిస్తే స్త్రీ అవుతుంది .అంటే కదిలే మూడుగుణా అని అర్ధం .ఈ జీవుల్లో భగవద్ భక్తులైన వాళ్ళు గోప వధువులు( స్త్రీలు ).వారినే భగ వంతుడు ప్రేమతో ఆలింగనం చేసు కుంటాడు .”కపతాన్గీక్రుత వేషం ”అంటే ప్రారబ్ధం వల్ల కాకుండా లీల కోసం శరీరాన్ని ధరించిన వాడు అని అర్ధం .”కపట నాట్య కృత కుత్చిత వేషం ”వేశాడు కృష్ణుడు .అంటే గొల్ల పిల్ల వాడుగా ,అల్లరి కన్నయ్య గా ,సామాన్య వేషం ధరించాడు .ఇది భగవంతుని కపట నాటకమే ”.ప్రణవ పయోధర ”శబ్దం లోను లోతైన భావం వుంది .ఓంకారం నిరాకారం గా వుండే పరమాత్మ మాత్రమే కాదు ,మనకు కని పించే ప్రపంచం కూడా ఆయనే ..నిశ్చల మైన పరమాత్మ ఆధారం గా చలించే ఈ ప్రపంచం మేఘం వంటిది .అందుకే మేఘాన్ని ప్రణవ పయోధరం అన్నారు బ్రహ్మేన్ద్రులు .పరమాత్మ ప్రణవ స్వరూపం .ఇంకో రహస్యం వుంది యోగ శాస్త్రం లో ”లయ ”అనే యోగం లో ,లోపల వినపడే పది రకాల నాదాలలో చివరిది మేఘ నాదం .అదే ప్రణవం అని పిలువ బడే ఓంకారం .,ఇన్ని యోగ ,శాస్త్ర ,వేద ,ఉపనిషద్ రహస్యాలన్నీనిక్షిప్తం   చేసి రమ్య నాద భరితం గా చేసినకీర్తన  ఇది .ఆ నాద బ్రహ్మ కు కై మోడ్చి అంజలి ఘటిద్దాం ..
                                                               సశేషం
                                                                                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —28 -10 -11 .

 

Posted in రచనలు | 1 Comment

సాఫ్ట్ కార్నెర్ నియంతలు

సాఫ్ట్ కార్నెర్ నియంతలు
                     ఈ మధ్యనే జనం చేతిలో ,అమెరికా వాళ్ల సాయం తో హత్య చేయ బడ్డ లిబియా అధ్యక్షుడు గడాఫీ కల్నల్ మాత్రమే కాదు ,ప్రజల యోగ క్షేమాలను పట్టించుకున్న వాడూ అని తెలుస్తోంది .అతను ఎంత సంపాదించుకుని దాచుకుని ,పిల్లా లిద్దరికీ పంచి ,దోచ్కోన్నాడని అందరు చెప్పుకుంటున్నారు .అయితే ఆ దేశం లోని ప్రజలపై అతడు చూపిన శ్రద్ధా ,వాళ్ల సంఖేమానికి తీసుకున్న జాగ్రత్తలు చూస్తుంటే నియంతల్లో ను మంచి వాళ్ళు అంటే సాఫ్ట్ కార్నెర్ వున్న వాళ్ళు వున్నట్లు తెలుస్తోంది ”కన్యాశుల్కం లో చెప్పినట్లు ”బ్రాహ్మల్లోను ,మంచి వాళ్ళుంటారు ”అన్నది రుజువు అవుతోంది .ఇంతకీ ఈ సుత్తి అంతా ఎందుకు అసలు విషయానికి రాకుండా అంటారా .వచ్చే ముందు ఒక చిన్న మాట .మన పంచ కట్టు పెద్దాయనా పావలాలు జనం మీదికి విసిరి కోట్లు ఎరుకున్నాడని ప్రతి పక్షాల ఆరోపణ -అయితేనేం ,జలయజ్ఞం ,రాజీవ్ ఇందిరా సంతర్పణలు బాగానే చేశాడు కదా అని ఆ యన వత్తాసు దార్ల ఎదురు సమాధానం .
                      గద్దాఫీ పాలన లో లిబియా దేశం అక్షరాశ్యతా శాతం 83 శాతం  ట. అదీ యువకుల్లో అయితే 100 శాతం ట .ఆశ్చర్యం గా లేదా .మరి ఎక్కడైనా అలా ఉందా ?లేదనే దాప్పు చెప్ప వచ్చు .రెండోది లిబియా లో విద్యార్ధులు ఎంత వరకు చదువు కున్నా ,ఎన్నేళ్ళు చదువు కున్నా ప్రభుత్వామీ ఆ ఖర్చు అంతా భరిస్తుంది ట .చదువు పూర్తి క్యినా తర్వాత మన దేశస్తులు లాగానో ఇతర దేశస్తులు లాగానో ,దేశం విడిచి పొట్ట చేత పట్టుకుని ఇతర దేశాలకు ఒకారు గాక ఒక్కరు కూఫా వెళ్లారట.వారందరికీ అక్కడే ఉద్యోగాలు దొరుకు తాయట .ఇతర దేశాల్లో ఉద్యోగం చేసే లిబియా వాళ్ళు ఒక్కరు కూడా లేరంటే నమ్మ శక్యం గా లేదా ?ఇది ముమ్మాటికీ నిజం ..జబ్బుచేసి ఆస్పత్రికి వెళ్లి తే చేరిన్దగ్గర్నుంచి నయం అయి ఇంటికి తిరిగి వచ్చే దాకా ఖర్చు అంతా ప్రభుత్వమే భారిస్తుందట .ఒక వేలా లిబియా నయం కాని జబ్బు వుంటే ఏ దేశం వెళ్లి నయం చేసుకున్నా కూడా ప్రభుత్వమే మొత్తం ఖర్చు భారిస్తుందట .ఇక్కడ కుటుంబానికి నెలకు 2500  డాలర్లు ఇచ్చి కుటుంబ పోషణకు సాయ పడుతుందట .
                  లిబియన్ ప్రజలకు కరెంట్ బిల్లంటే ఏమిటో తెలీదట .అంటే కరెంట్ బిల్ కట్టే పని ప్రజలకు లేదు .అంతా ఉచిత విద్యుత్తే .తేవరైనా పెళ్లి చేసుకుని ,ఇల్లు కట్టు కోవాలను కుంటే ప్రభుత్వం వాళ్లకు 50000  డాలర్లు గిఫ్ట్ గా ఇస్తుందట .స్వంత కార్ కొనుక్కో వాలనుకుంటే సగం ఖర్చు ప్రభుత్వమే భారిస్తుందట .పెట్రోల్ 15  సెంట్లకే గాల్లోన్ లభిస్తుందట ..యువకులు వ్యవ సాయం చెయ్యాలను కుంటే భూమి ని ఉచితం గా ఇవ్వటమే కాదు ,వ్యవ సాయానికి కావాల్సిన విత్తాలు ,ఎరువులు ,యంత్రాలు అన్నీ ఉచితం గా అందిస్తుందట ప్రభుత్వం .అవసరం వచ్చి ఋణం తీసు కోవాలంటే నిముషాల మీద బాంకులు రుణాన్ని మంజూరు చేస్తాయట .వడ్డీ  అసలు ఉండనే వుండదట .లిబియా పెట్టు బదులు అమెరికా లో 100 బిలియన్లు ,ఇతర దేశాల్లో 50 బిలియన్ డాలర్లుట .ఇవన్నే చేయటానికి ,ఇంత ప్రజా సంక్షేమం ఆలోచించటానికి నియంత గడాఫీ కి ఎంత సాఫ్ట్ కార్నెర్ హృదయం వుందో ?అతను దాచుకున్న డబ్బు 200  బిలియన్ డాలర్లని అంచనా .అతని దగ్గర చచ్చే సమయానికి వున్న బంగారం 140 టన్ను లట . .కిలోలుకాదండోయ్ బాబు అక్షరాలా టన్నులు టన్నులు .కిలోలు మయితే ఇండియా లో మన వాళ్ళు చాలా మంది ఆ జాబితాలో చేరుతారు .ఇంత సంపాదించినా ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్ప లేదు .ఇంత ప్రజా సేవ చేసినా ,విదిలించింది చిటికెడు ,నొక్కేసింది గుప్పెడు అనుకున్నారు ప్రజలు .అందుకే అంత విప్లవం వచ్చింది .దీనికి వత్తాసు బయటి నుంచి లభించింది .అక్కడ అస్తిరత్వం ఏర్పడాలి .ఆయిల్ అంతా తమ చేతి కిందకు రావాలి .నెమ్మది గా ఉక్కు పాదం మోపాలి .అని” డేగ ”వ్యూహం . .ఇదేదో గడాఫీ ని నేను వెనకేసు కొచ్చి రాసిన మాటలు కావు .పేపర్ ,చానెళ్ళ వాళ్ళు చెప్పినవే
                      1162  లో పుట్టిన మంగోలియా దేశ నాయకుడు ”చెంఘిజ్ ఖాన్ ”ప్రపంచాన్ని గద గద లాడించి విశాల మంగోలియన్ సామ్రాజ్యాన్ని ఏర్పర చదువు .ఎదిరించే మొన గాదె లేకపోయాడు ఆ నాడు .అతని క్రూరత్వానికి రాజులు ,చక్ర వర్తులు పారిపోయి ఎక్కడో తల దాచు కున్నారు .ఇంత గోపా విజయం సాధించిన ఖాన్ గారికి అక్షరం ముక్క కూడా రాదు అంటే ముక్కున వేలు వేసుకో వాల్సిందే .చదువు కో లేక పోయినందుకు బాధ పది తన పిల్ల లకు చదువు బానే చెప్పించాదట .అతని మతం ”షామా ఇజం ”.వీళ్ళు ఆకాశాన్ని ఆరాదిస్తారట.అయితే చెంఘిజ్ ఏ మతాన్ని ద్వేషించ లేదట .
అన్ని మతాల వారు అతన్ని తమ మతం లో చేరమని ప్రార్దిన్చారట .దేని లోను చేరా లేదు .ఎంతో సంపదను దోచుకున్నా ,దేశానికి రాజా మందిరం కట్టు కోలేదట .తాను ఏ తెగ నుంచి వచ్చాడో ,ఆ తెగకు చెందిన గుడారం లో నే వుండే వాడట .పట్టణాలు ,నగరాలు అంటే ఇష్టం లేదు అతనికి .సామాన్యులు తినే తిండే తినే వాడు .విలాసాలకు ,ఆడంబరాలకు దూరం .అతని సామ్రాజ్యం లో దొంగ తనం మహా నేరం .అక్రమ సంబంధం వుంటే ఉరితీతే .నెలకు మూడు సార్లే మద్యం తాగే వాడు .అతడి సామ్రాజ్యం నల్ల సముద్రం నుండి పసఫిక్ సముద్రం వరకు విస్తరించిన ఘనుడు చెంఘిజ్ ఖాన్.అందర్నీ అణచి వేసినా పరమత సహనం అతని లోని సాఫ్ట్ కార్నెర్ .
                                             మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ —28 -10 -11 .

 

Posted in రచనలు | Leave a comment

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ల లోఅద్వైతా మృతం —4 క్రిష్ణామృతం

    శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ల లోఅద్వైతా మృతం  —4
                                                                              క్రిష్ణామృతం
శ్రీ సదాశివ బ్రహ్మేన్డ్రుల కీర్తన లలో రామ రసాయన పానం ఇంతవరకు చేశాం .ఇక ఇప్పుడు క్రిష్ణామ్రుతాన్ని అందుకుందాం .
                 ఇందులో మొదటిది ”స్మర వారం వారం ”పూర్తిగా వివరిస్తాను
 01 -పల్లవి —–స్మర  వారం వారం మానస —స్మర నంద కుమారం ||
       చరణాలు —01 -ఘోష కుటీర   పయోఘ్రుత చోరం –గోకుల బృందావన సంచారం ||
                       02 -వేణు రవామ్రుత పాన కథోరం –విశ్వ స్థితి లయ హేతు విహారం ||
                       03 –పరమ హంస హృత్ పంజర కీరం —పటు తర ధేనుక బక సంహారం||
            భావం —ఓమనసా !నందకుమారుడైన శ్రీ కృష్ణుని నిరంతరం స్మరించు .గోళ్ళ వాళ్ల ఇళ్ళల్లో పాలు ,పెరుగు ,వెన్న ,నెయ్యి దొంగిలిస్తూ ,బృందావనం లో సంచరిస్తూ ,వేణు గాన లోలుడై ప్రపంచం యొక్క సృష్టి ,స్థితి ,లయాలకు కారకుడై ,పరమ హంస లైన యోగుల హృదయం అనే పంజరం లో చిలుక గా వున్న వాడు,ధేనుక ,బకాసురాది రాక్షసులను వధించిన వాడు ,అయిన ఆ నందకుమారుడిని ఆనందం గా పదే పదే స్మరించు .అని సదాశివులు      ఉపదేశం చేస్తున్నారు .
            విశేషం —-ప్రపంచం అంటే అనేకం .పరమాత్మ ఒక్కడే .కనుక అనేకాన్ని వదిలి ఏకమైన పరమాత్మను ధ్యానించాలి .అప్పుడే సుఖం ,శాంతి లభిస్తాయి .భగవత్  ధ్యానానికి ,ఆయన లీలా స్మరణకు మంచి మార్గం ఇదే .నంద శిశువు (కిశోరం )చేసిన చిలిపి పనులు అమాయకులకు ఆనంద ప్రసాదం .అవే మహా యోగులకు అద్భుత భావ దర్శనాలు .”ఘోష కుటీర పయోఘ్రుత చోరం –గోకుల బృందావన సంచారం ”ఇందులో వేదాంత పరమైన అర్ధాన్ని విచారిద్దాం .గోవులు అంటే ఇంద్రియాలు అనే అర్ధం వుంది .వాటి వల్ల కలిగే విషయ జ్ఞానమే పాలు .పాలను చిలికితే వచ్చే వెన్న -లోకానుభవం .వెన్న కరిగితే వచ్చే నెయ్యి –సూక్ష్మవిచక్షణా జ్ఞానం . తనను అనుక్షణం స్మరించే గోపికల విషయ జ్ఞానాన్ని ,విచక్షణా జ్ఞాఆన్ని స్వీకరించి ,శ్రీ కృష్ణుడు వారికి ఆత్మానందం కలిగిస్తాడు ..
               ”వేణు రవామ్రుత పాన కథోరం –విశ్వ స్థితి లయ హేతు విహారం ”లోని పరమార్ధమేమిటో తెలుసు కోవాలి .వెదురు ముక్కను ఎండ బెట్టి ,లోపల అంతా కాళీ చేసి ,ఏడు రంధ్రాలు చేస్తే ,వేణువు తయారవు తుంది .దాన్ని పెదవుల తో గాలి పూరించి పలికిస్తే ,మధుర సంగీతం వచ్చి హృదయానికి ఆహ్లాదం కలిగిస్తుంది .ఇది మనుషులకూ వర్తిస్తుంది .మనిషి లోని లౌకిక వ్యక్తిత్వాలను భగ్నం చేసుకొని ,దర్పం ,అహంకారం లను తొలిచి ,డొల్ల గా( ఖాళీ )చేస్తే అయిదు జ్ఞానేంద్రియాలు ,మనసు ,బుద్ధి అనే ఎదింటినీ ఖాళీ కన్నాలుగా అర్పణ చేస్తే ,ఆంటి మహాత్ములను భగ వంతుడు తన మధుర సంగీతం ,సందేశం విని పించాతానికి తగిన పరికరం గా గ్రహిస్తాడు .ఇంతటి గహన విషయాన్ని మధు మధుర పదాల మురళీ రవం గా మార్చి మనకు ,ఆ మోహన మురళీ కృష్ణుని దివ్య దర్శనం చేయించారు బ్రహ్మేన్ద్రులు .కృష్ణ అంటే సర్వం కరోతి ఇతి కృష్ణః .అని వుంది .అంటే అన్నీ చేయించేవాడు అని అర్ధం .కృష్ణ అంటే ఆకర్షించే వాడు అనీ అర్ధం ..సర్వజీవ్లులను ఆకర్షించే వాడు ,అందరితో పని చేయించే వాడు ,ఆ శ్రీ కృష్ణ పర బ్రహ్మమే .అందుకే వారం వారం అంటే ప్రతి క్షణం ,నిరంతరం ఆ గోపాల కృష్ణుని నే స్మరించాలి అని బోధ ఇందులో వుంది
                           ఇప్పుడు రెండవ కీర్తన లోకి వెళ్దాం
2——-పల్లవి  — గాయతి వన మాలీ మధురం –గాయతి వన మాలీ ||
         చరణాలు —1–పుష్ప సుగంధ సుమలయ సమీరే —ముని జన సేవిత యమునా తీరే ||
                         2—కూజిత శుక పిక ముఖ ఖగ కుంజే —కుటిలాలక బహు నీరద పుంజే ||
                         3—తులసీ దామ విభూషణ హారీ –జలజ భవస్తుత సద్గుణ శౌరీ ||
                         4– పరమ హంస హ్రుదయోత్చావ కారీ –పరి పూరిత మురళీ రవ దారీ ||
          భావం —-వన మాలీ అంటే పుష్ప హారాలు  ధరించిన శ్రీ కృష్ణుడు మధుర గానం చేస్తున్నాడు .పూల గంధాలతో వస్తున్నచల్లని గాలితో ,ముని జన సమూహం తో ,యమునా తీరం లో సేవింప బడుతు ,చిలుకలు ,గోరు వంకలు మొదలైన పక్షుల కిల కిలారవాలు విని పిస్తుంటే ,వంకీలు తిరిగిన ముంగురులు లాగా వ్రేలాడేనల్లని   మేఘాలతో ,వనమాలీ ,యదువంశ విభుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ ,మధుర మనోహరంగా వేణు గానం చేస్తూ ,ఉల్లానికి ఉల్లాసం కలిగిస్తున్నాడు .
    విశేషం ——యమునా తీరం లో వేణు గానామృతం చేసే ఆ శ్రీ కృష్ణుని దివ్య దర్శాన్ని చిత్రం లో వ్హూపించి నట్లు మన ముందు నిల బెట్టారు బ్రహ్మేన్ద్రులు .”జలజ భవ స్తుత సద్గుణ షోరి ‘ఆయన .అంటే బ్రహ్మ చేత స్తుతింప బడే శ్రీ కృష్ణుడు అని అర్ధం .”యమునా ”అనే మాటలో కూడా విశేషార్ధం వుంది .యం అంటే నిగ్రహం .మునులు అందరు ఆత్మ నిగరం కలవాళ్ళు .అందుకే వారు యమునా తీరం లో విహరించటానికి ఇష్ట పడతారు .”జలజ భవ స్తుత ”లో ఒక చిన్న కధ దాగి వుంది .పూర్వం ఒక సారి బ్రహ్మ దేవుడికి బాల కృష్ణుని మీద ,యాదవుల మీద కోపం వచ్చింది .ఆయన బారి నుంచి వీళ్ళందర్నీ రక్షించటానికి బ్రహ్మకు కనపడ కుండా ఒక ఏడాది పాటు ఒక గుహలో గోవులను ,గోపాలురను దాచి రక్షించాడు బాల కృష్ణుడు .చివరికి బ్రహ్మ దేవుడే తప్పు తెలుసుకొని వచ్చి శ్రీ కృష్ణుని పాదాల పై పడి క్షమించమని వేడుతూ సంస్తుతించాడు ఆ బ్రహ్మ ఈ శ్రీ కృష్ణ పర బ్రహ్మాన్ని .ఈ సంఘటనను అంతాఒకే   పదం లో ఫ్లాష్-బాక్  గా మన ముందుంచారు సదా శివేన్ద్రులు .శ్రీ కృష్ణుడు ఎవరో కాదు ”పరమ హంస హ్రుదయోత్చవ విహారి ”.కృష్ణ అనే పేరు వింటేనే పరవశం వస్తుంది .అవ్యక్త మాధుర్యం ఆవహిస్తుంది .అలౌకిక సౌందర్య దర్శనం లభిస్తుంది .అలాంటి పరమ విభూతిని మనకు అందించారు సదాశివులు
                                                             సశేషం
                                                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -10 -11
Posted in రచనలు | 1 Comment

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లలో అద్వైతా మృతం —3

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లలో అద్వైతా మృతం  —3
                                                                           రామ రసాయనం
                     సదాశివ బ్రహ్మేన్డ్రుల కీర్తనలలో రామ రసాయనం లో మొదటి కీర్తన గురించి తెలుసు కున్నాం.ఇప్పుడు రెండో కీర్తన వివరిస్తాను
02 -పల్లవి –ప్రతి వారం వారం మానస -భజరే రఘు వీరం
      చరణం —కాలామ్బోధర కాంత శరీరం —-కౌశిక శుక శౌనక పరి వారం-||
                  కౌశల్యా దశరధ సుకుమారం –కలి కల్మష భయ గహన కుథారిం ||
                  పరమ హంస హ్రుత్పద్మ విహారం -ప్రతి హత దశముఖ బల విస్తారం ||
                  భావం ——నీల మేఘం వంటి శరీరపు రంగు కలవాడు ,శుకుడు శౌనకుడు,కౌశికుడు  (విశ్వా మిత్రుడు )అనే పరివారం కలవాడు ,కౌసల్యా దశరదుల  గారాబు పట్టి ,కలి చేత కల్మషం (మురికి )అయిన భయం అనే అరణ్యాన్ని చేదించే (నరికే )గొడ్డలి అయిన వాడు ,సదా పరమ హంసల హృదయ పద్మ విహారుడు ,రావణ ,బల దర్పాన్ని నాశనం చేసిన వాడు ,అయిన ఆ  రాఘవుడిని
భజించు అని మనసుకు సలహా ఇస్తున్నారు బ్రహ్మేన్ద్రులు .
                      వారం వారం అంటే వారానికో సారి అని కాదు అర్ధం .ప్రతిక్షణం అంటే యెడ తెరిపి లేకుండా .”పరమహంస హ్రుత్పద్మ విహారం-ప్రతి హత దశముఖ బల విస్తారం ‘అనటం లో ఆనందానుభూతి  ఉంది . ,అధర్మం చేసిన వాడు పదిముఖాలున్న వాడైనా ,ఎంత మొనగాడైనా ధర్మం చేతి లో చని పోవాల్సిందే అని సూచన వుంది .రాముడు పరబ్రహ్మ స్వరూపుడే మాయామానుష విగ్రహ రూపం గా అవతరించాడు .యోగుల హృదయాలలో ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటాడు .వాళ్ళు కూడా ఆయన దర్శనం తో పులకిస్తూనే వుంటారు .దశేన్ద్రియాలను అదుపు లో ఉంచుకున్న వాడు శ్రీ రామ చంద్రుడు .ఇంద్రియ వ్యామోహం తో చెలరేగిన వాడు రావణాసురుడు .అలాంటి ఇంద్రియ గర్వాన్ని బ్రహ్మాస్త్రం తో నాశనం చేసిన వాడు రాముడు .ఇంద్రియాలు అదుపు లో వుంటే మోక్షం అదుపు తప్పితే వినాశం .అనే గొప్ప సత్యాన్ని అనుకూల మైన పదాలను ఉపయోగించి భావ గర్భితం గా రాశారు సదాశివులు .ఎక్కడా ఒక్క అనవసర పదం వుండదు .ప్రతి మాట లో జరిగిన కధను గుర్తు చేసే వైనం వారిది .
                     ఇప్పుడు రామ రసాయనం లో మూడవ కీర్తన
03 —         పల్లవి –చేతః శ్రీ రామం చిన్తయ జీమూత శ్యామం “”
              చరణాలు —-01 -అంగీకృత తుంబురు సంగీతం — హనుమద్ గవయ గవాక్ష సమేతం ||
                               02 -నవరత్న స్థాపిత కోటీరం —-నవ తులసీ దళ కల్పిత హారం .
                               03 -పరమ హంస హృద్గోపుర దీపం —చరణ దళిత ముని తరుణీ శాపం ||
                 భావం —-మేఘశ్యామల దేహం కలవాడు ,తుమ్బురునిసంగీతానందాన్ని పొందిన వాడు ,హనుమ ,గవయ గావాక్షులతో నిత్యం సంచరించే వాడు ,నవరత్నాలు పొదిగిన జటాజూటం (కోటీరం )వున్న వాడు ,తులసి మాలలచే శోభించే వాడు ,పరమ హంసల హృదయ దీపం అయిన వాడు ,పాద స్పర్శ చేత అహల్యకు శాప విమోచనం చేసిన వాడు అయిన శ్రీ రాముని ధ్యానించమని మనసుకు బోధ చేస్తున్నారు బ్రహ్మేన్ద్రులు .”నవ రత్న స్థాపిత కోటీరం ,–నవ తులసీదల కల్పిత హారం ,”–”పరమ హంస హృద్గోపుర దీపం –చరన దళిత ముని తరుణీ శాపం ‘పదాలను అర్ధవంతం గా అవుచిత్యం గా ,పొదుపుగా వాడి బంధం సడలకుండా నిండుదనం చేకూర్చే నేర్పు ప్రతి పాదం లో ప్రస్ఫుటం గా కన్పిస్తుంది .హనుమ ఎంతటి భక్తుడైనా ,daggari వాడైనా ,నారద ,తుంబురుల సంగీతా జ్ఞాన పరీక్షలో తుమ్బురుని సంగీతమే గొప్పదని నిష్కర్ష గా చెప్పాడు శ్రీ రాముడు .సామర్ధ్యమే ముఖ్యం కాని స్వామి భక్తి మాత్రమే కాదని చెప్పే సంఘటన ఇది .అయినా హనుమతో సదా విహరిస్తూనే ఉంటాడు రాముడు .ఆయనా శ్రీ రాముని అనుసరించే ఉంటాడు .ధర్మమేరిగిన మహానుభావులు వారిద్దరూ అని మరో సారి గుర్తు చేస్తున్నారు సదాషేన్ద్రులు .
                    రామ రసం లో నాల్గవ కీర్తన సౌభాగ్యాన్ని దర్శిద్దాం
04 —-పల్లవి –పిబరే రామ – రసం,రసనే –పిబరే రామ రసం ||
          చరణాలు —౦౧-దూరీకృత పాతక సంసర్గం —పూరిత నానావిధ ఫల వర్గం ||
                         02 -జనన మరణ భయ శోక విదూరం–సకల శాస్త్ర నిగమాగమ సారం ||
                          03 -పరిపాలిత సరసిజ గర్భాండం —పరమ పవిత్రీకృత పాషండం ||
                          04 -వ్శుద్ధ పరమ హంస ఆశ్రమ గీతం -శుక శౌనక కౌశిక ముఖ పీతం |\
          భావం —-రుచిని గ్రహించే నాలుక కు రామ రసాయన పానం రుచిని ఎరుక పరుస్తున్నారు బ్రహ్మేన్ద్రులు .”పాపాల పొత్తును నాశనం చేసేది ,కర్మ ఫలాలను దూరం చేసేది ,జనన ,మరణ భయం పోగొట్టేది ,శాస్త్ర నిగమ ,ఆగమాల సరం అయినది ,బ్రహ్మాండాన్ని రక్షించి కాపాడేది ,పరమ నాస్తికులను కూడా పవిత్రం చేసేది పరమహంసలైన యోగుల ఆశ్రమాలలో అణు నిత్యం గానం చేయ బడేది ,శుక శౌనక ,కౌశిక మహర్షులచేత పానం చేయ బడే మధుర రసమే రామ నామం .నాలుకా  ! నువ్వు కూడా ఆస్వాదించి తరించు .’
                    విశేషాలు —ముఖ అంటే శుకుడు అని అర్ధం .వ్యాసుని కుమారుడే శుకుడు .పరమ వైరాగ్యం తో భాసించే వాడు .పుట్టుక  ,చావు వల్ల భయం ,శోకం కలుగు తాయి .పార్వతీ దేవి గురు స్థానం లోవుంది   బోధించినవి” నిగమాలు” .మహేశ్వరుడు గురువు గా బోధించినవి ఆగమాలు (శాస్త్రాలు).ఈ రెండింటినీ వేదాలు అనటం లోక రీతి .సరసిజ గర్భాండం అంటే హిరణ్య గర్భుడు -అంటే బ్రహ్మాన్డమే .పరమ పవిత్రీకృత పాషండం అన్నారు వాల్మీకి మహర్షిని .అంటే ఆటవికుడు గా వుండి  దేవునిపై ధ్యాసే లేకుండా  అనేక పాప కార్యాలు చేస్తున్నా ,ఉపదేశం పొందినా రామా అనటానికి బదులు తిరగేసి ”మారా ”అన్నఅజ్ఞాని ,వివేకం లేని వాడు .అలాంటి వాడిని ఉద్ధరించి మహర్షి వాల్మీకి గా మార్చిన దయాళువు శ్రీ రాముడు .అతని ఆంతర్యాన్ని గ్రహించి అనుగ్రహించాడు కాని ,అతని శబ్దోచ్చారణ చూసి కాదు అని భావం .జన్మతోనే తండ్రిని మించిన జ్ఞానం తో అవధూత అయిన వాడు శుక మహర్షి .కర్మ ద్వారా జ్ఞానం పొందిన వాడు శౌనకుడు .క్షత్రియత్వాన్ని వదిలి తీవ్ర తపస్సు తో బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మర్షి ఐన వాడు కౌశికుడైన విశ్వా మిత్రుడు .వీరంతా తర తమ భేదాలు లేకుండా రామ పరబ్రహ్మ నామామ్రుతాని కడుపారా గ్రోలారు .రామ రసాయనాన్ని ఆస్వాదించి ధన్యులయారు .మనమూ ,ఆ రామ రసాయనాన్ని జిహ్వాగ్రం తో రుచి చూస్తే ,పునరా వ్రుత్తి రహిత బ్రహ్మ పదమే లభిస్తుంది
                 రామ రసాయనం లో అయిదవాదీ  చివరిదీ అయిన కీర్తన  గురించి తెలుసు కుందాం
   05 –  పల్లవి —ఖేలతి మమ హృదయే రామ –ఖేలతి మమ హృదయే |
 చరణాలు —-01 –మోహ మహార్నవ తారక కారీ —రాగ ద్వేష ముఖాసుర మారీ |||\
                          02 -శాంతి విదేహ సుతా సహ చారీ  –దహరాయోధ్యా నగర విహారీ |||\
                          03 -పరమ హంస సామ్రోజ్యోద్ధారీ –సత్య జ్ఞానా నంద శరీరీ ||
                 భావం —సదాశివ బ్రహ్మేన్ద్రులు తన హృదయం లో ఆనంద తానడవం చేసే శ్రీ రామ పరబ్రహ్మాన్ని తనివి తీరా కీర్తిస్తున్నారు .”మొహం అనే సముద్రాన్ని దాటి రాగ ద్వేషాలు అనే రాక్షసులనుసంహరిం చే రాముడు –నా హృదయం లో హాయిగా ,చిదానందం గా ,ఆడుతున్నాడు .దేహభావం నశించటం వల్ల పుట్టిన పరమ శాంతి అనే సహచరిణి తో ,లోపల వుండే (దహర )అయోధ్యా నగరం లో శ్రీ రాముడు వున్నాడు .పరమ హంసలైన యోగుల ఆత్మ సామ్రాజ్య ఉద్ధరణ కోసం శ్రీ రాముడు సచ్చిదానంద రోపం లో ,నా హృదయం లో ఆడుతూ (ఖేలతి )వున్నాడు .
              విశేషాలు —-ఇదే ఆధ్యాత్మ రామాయణ అనుభూతి .ఆత్మా రాముణ్ణి తన హృదయం లో దర్శించుకునే పరమ ఉత్కృష్ట స్థితి .శ్ర్ర్ మద్రామాయణ  .కధ ఆధ్యాత్మిక మైన సాధన లో అనుభూతికి వస్తుంది .అని బ్రహ్మేన్ద్రులు తెలియ బరుస్తున్నారు .రాముడు రాముడు మాత్రమే కాదు రామ పరబ్రహ్మమనే భావన .మొదటి కీర్తన లో మనసుకు శ్రీ రామ తత్వాన్ని బోధించారు .మనసులో రామ ముద్ర వేశారు .ఆ ముద్ర స్థిరం గా నిలిచి పోవాలంటే అణు క్షణం రామ నామ స్మరణ చేయాల్సిందే నని రెండవ కీర్తన లో చెపారు .మనసు లో సదా శ్రీరాముని ధ్యానించి ,కాయన తత్వాన్ని ఆకళింపు చేసుకొని ,ఆరాధించమని మూడో దానిలో బోధించారు .నాల్గవ కీర్హన లో రామ రసాయనం కలి కల్మష నాశనం అని ,నిగమాగమ సారం అని ,అంతకు మించి ఇంకేమీ లేదని యోగుల హ్రుత్పద్మ నివాసి గా వుండి ,ఆనందాన్ని పంచె వాడు రాముడే నని తెలిపారు .అయిదవ కీర్తన లో –ఇవన్నీ ఆచరిస్తే -శ్రీ రాముడు మన హృదయం లోనే నిలిచి వుండి ,ఆనంద ఖేలనం చేసి తరింప జేస్తాడు .దేహభావం   నశించి ,పరమ ఉత్కృష్ట కాంతి భాసించి ,దహరా కాశం లో ఆత్మా రాముడు గా వెలుగు లీనుతూ ఆత్మను ఉద్ధరించి ,సచ్చిదానంద స్వరూపుడై ,ఆనందాన్ని అందిస్తూ ,తాను పొందుతూ రమిస్తూ ,, ,మోక్షాన్ని కల్గిస్తాడని సోపాన (మెట్లు) ప్రక్రియ గా తెలియ జేశారు సదా శివ బ్రహ్మేన్ద్రులు .అర్ధం కాక పోయినా ,ఆ శబ్ద మాధుర్యం ,నడక ,కూర్పు ,ధ్వని  ,రవళి ,దైహిక ,మానసిక ఆరోగ్యాన్ని ,ఆనందాన్ని అందాన్ని ఇచ్చి శ్రేయో దాయకం అవుతుంది .లలిత మైన పదాలు ,చెవులకు ఇంపైన మాటల ధ్వని ,మనోహర మైన శైలి భావ గాంభీర్యం ,తరచి చూస్తె లోతైన భావం సదాశివుల కీర్తన లలో నిండి వున్నాయి.వింటే చాలు పరమానందం ,పరమాద్భుతం .
                    ఇప్పటి దాకా రామ రసాయనం గ్రోలాం.ఇక క్రిష్ణామ్రుతం ను సేవిద్దాంవచ్చే భాగం నుండి .
                                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —17 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

శ్రీ సదాశివబ్రహ్మేన్డ్రుల కీర్హనలలోఅద్వాతా మృతం —2 ”రామరసం ”

శ్రీ సదాశివబ్రహ్మేన్డ్రుల   కీర్హనలలోఅద్వాతా మృతం —2
                                                                           ”రామరసం ”
                    శ్రీరాముని పై రాసిన మొదటి కీర్తన భజరే రఘువీరం .ఆ కీర్తనను పూర్తిగా అందిస్తాను
              పల్లవి —భజరే రఘువీరం ,మానస –భజరే రఘు ధీరం
              అనుపల్లవి –అం బుద డింభ విడంబన గాత్రం —అం బుద  వాహన నందన దాత్రం
              చరణం –01 -కుశిక సుతార్పిత కార్ముక వేదం –వశి హృదయాంబుజ భాస్కర పాదం
                               కుండల మండల మండిత కర్ణం –కుండల మంచక మద్భుత వర్ణం
               చరణం –02 -దండిత సుంద సుతాదిక వీరం –మండిత మనుకుల మాశ్రయ శౌరిం
                                పరమహంస మఖిలాగమ వేద్యం —పరమ వేద మకుటీ ప్రతి పాద్యం .
 భావం —-మన మనసును ఉద్దేశించి బ్రహ్మేన్ద్రులు ఉపదేశం చేస్తున్నారు .బహు ధీరుడైన రఘు వీరుణ్ణి భాజించమని మనసు బోధ చేస్తున్నారు .నీల మేఘ శకలం (ముక్క )కాంతిని వాదించే శరీర వర్ణం కలవాడు ,భక్తుడైన హనుమ కోర్కెలు తీర్చే వాడు ,విశ్వామిత్ర గురు అనుగ్రహం తో విలు విద్యను పొంది ,భక్తుల హృదయ పద్మాలకు వికాసాన్నిచ్చే సూర్య కిరణం అయిన వాడు ,చెవులకు వుండే కుండలాల శోభ చేత కనువిందు చేసే కర్ణాలు (చెవులు )వున్న వాడు ,ఆది శేషుని పాన్పుగా చేసుకుని నిద్రించే వాడు ,మారీచాది రాక్షసులను సంహరించిన వాడు ,మను వంశానికే వన్నె తెచ్చిన వాడు ,పరమహంస అయిన వాదూ ,వేదాల ద్వారా మాత్రమే తెలుసుకో తగిన వాడు ,వేదం ప్రతిపాదించిన వాటిలో మకుటాయమాన (peak )మైన వాడు ,అయిన శ్రీ రఘు రాముని భాజించమని హితవు చెప్పాడు
                    నిరా కారం అయిన బ్రహ్మ బుద్ధి శూక్ష్మం వల్ల,వేదం లో ప్రతి పాదించిన దాన్ని తెలుసుకోవటం వల్లనే తెలియ బడ తాడు .ఆకారం వున్న వాడు గా ఆకారం లేని వాడుగా రెండు రకాలుగా శ్రీరామ పరబ్రహ్మం కని పిస్తాడు .ఆయనను సేవించటం ఉత్తమం .”కుండల మండల మండిత కర్ణం –కుండల మంచక మద్భుత వర్ణం ”అనటం లో కుండల మంచక అంటే చుట్లు చుట్లు కోని వున ఆదిశేషుని పడక గా వున్న వాడు అని అంటే అనంత పద్మనాభుడు అని భావం .పదాల పరుగు మనసును శ్రీ రాముని మనోహర రూపం దగ్గరకు చేరుస్తుంది శబ్దాలన్నీ చెవులకు నాద శోభను కలిగిస్తాయి .పద నర్తనం ప్రత్యక్షం గా చూడ గలం .పదం ఎంత సాభిప్రాయం గా ప్రయోగించాడో ,అందులోని భావం కూడా అంత లోతుగా వుండటం బ్రహ్మేన్డ్రుల ప్రత్యేకత ..హాయిగా వినచ్చుఅర్ధం   తెలియక పోయినా ఆ శబ్దాలు మనసు లో నర్తిస్తాయి .చెవులకు ఇంపు కలిగించే పద శౌరభం లయ తో కూడిన నడక  సదాశివుల రచనా వైభవం .మనసు తో రాస్తారు కనుక మహా మహిమాన్వితం గా వుంది కీర్తన . .
                                          సశేషం
                                                        మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —26 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

కాసేపైనా నవ్వు కోండి ——దీపావళి స్పెషల్

      కాసేపైనా నవ్వు కోండి  ——దీపావళి స్పెషల్
 
  •  ఓకె పుస్తకం రెండు కోన్నా వెందుకు ?—ఈ పుస్తకం కొంటె సగం మార్కులు వచ్చినట్లే అని రాసి వుంది పూర్తి  . మార్కులు రావాలని రెండు కోన్నా
  • విస్కీ తో పాటు స్ట్రా క్కూడా తీసుకు రా —-స్ట్రాఎందుకు   సార్ —మందు ముట్టుకోనని మా ఆవిడకు ఒట్టేసి చెప్పా అందుకు
  • ఏమండీ కాస్త మా ఆయన్ను పిలుస్తారా ?—నంబెర్ ప్లీజ్ —-నీ బొంద –నాకేమైనా పది మంది మోగుల్లున్నారను కున్నారా ?
  • మీరు చూస్తె చిన్న లాయర్లా వున్నారు .నా కేసు ని వాదించ గలరా ?—–కంగారు పడ కండి మీ కేసు పూర్తి అయేసరికి పెద్ద లాయరునవుతాను .
  • సిస్టర్ ఒక బాటిల్ రక్తం ఇవ్వండి —ఏ గ్రూపు రక్తం ?–ఏ గ్రూపుది అయినా పరవా లేదు .నా గర్ల్ ఫ్రెండ్ కు లవ్ లెటర్ రాయ టానికి
  • పెళ్ళికి ముందు డబ్బు నీళ్ళ లాగా ఖర్చు పెడతానని బడాయిలు పోయారు .ఇప్పుడు మరీ ఏదడిగినా వెనకా ముందు చూస్తున్నా రేమిటి ?—అవును నీళ్ళను కూడా చాలా పొడుపు గా వాడుతాను నేను
  • ఒక బకరా గాడికి దారిలో వెయ్యి రూపాయిల నోట్ కనిపించింది .దాని మీద ”హాపీ న్యూ య్వర్ ”అని రాసి వుంది .వీడు నోట్ ని జేబులో పెట్టు కోని ,పర్స్ లోంచి తన  దగ్గరున్న ఇంకో వెయ్యి రూపాయిల నోట్ తీసి దాని మీద ”same  to you  ”  అని రాసి దారిలో వదిలేసి వెళ్ళాడు వెంగళప్ప
  • మహేష్ బాబు సినిమా పది సార్లు చూస్తాను —-నేను ఒక్క సారి చూస్తేనే నాకు అర్ధమై పోతుంది
  • బైకు  కాస్త    నెమ్మది గా   నడ  పండి   కళ్ళు  తిరుగు  తున్నాయి  —- పిరికి దాని లా మాట్లాడకు నేను మూసుకున్నట్లు కళ్ళు గట్టి గా మూసుకో
  •  2012  లో ప్రళయంవస్తుందట   ప్రపంచం మునిగి పోతుందట —-నమ్మకు .నేను వాషింగ్ మెషిన్ మొన్ననే కొన్నాను దాని మీద 2014 వరకు    గారంటీ అని వుంది
  • అర్ధ రాత్రి ఎంత ఆలస్యం గా ఇంటికి వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు వేడి నీళ్ళు కాచి రెడీ గా ఉంచుతుంది —ఎంత అదృష్ట వంతుడివి రా ?—-చలికాలం కదా చన్నీటితో గిన్నెలు తోమటం కష్టమని నాకోసం వేన్నీళ్ళుకాస్తుందిరా   తోమ టానికి
  • మీ తాత గారు కనిపించగానే అందరు ”విరోధి,విరోధి ”అని పిలుస్తా రెందుకు ?—ఆయన విరోధి సంవత్చరం లో పుట్టినందుకు —–ఇంకా నయం” రాక్షసనామ సంవత్చరం లో పుట్టలేదాయన
  •  పెళ్ళికి ముందు మీ ఇంట్లో కుక్క ఉండాలిగా? అవును వుండేది మా ఆవిడ దానికి మొరిగే అవకాశం ఇవ్వట్లేదు అందుకని పారిపోయింది –
  • డాక్టర్ గారూ మళ్ళీ నన్ను ఎప్పుడురమ్మంటారు ? ?–ఆర్ధికం గా బాగా కోలుకున్న తర్వాత
  • మమ్మీ డాడీలతో చాలా ఇబ్బంది గా వుందిరా __ఏమైంది ?—రాత్రి చదువు కొంటుంటే నిద్రపొమ్మని తిడ తారు .పొద్దుట పడుకుంటే లేపి చదువు కోమని వాయిస్తారు
  • మిడత ,ఉడత ,పిడత ,మడత ,చిడత ఇవేమీ టైటిల్స్ అయ్యా ?—-అవన్నీ ప్రముఖ హీరో ల పుత్రరత్నాలు             నటించ బోయే సినిమాలు  .”.చిరుత ”హిట్అయింతర్వాత   రిజిస్ట్రేషన్కోసం వచ్చిన పేర్లు అవి  .

  కాసేపైనా నవ్వు కోటానికి మీ కోసం సేకరించిన నవ్వుల పువ్వులు ఇవి .అనుభవించి ఆనందించండి దీపావళి రోజున  .
గబ్బిట దుర్గా ప్రసాద్                                                                                                              దీపావళి శుభా కాంక్షలతో —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -10 -11 .

Posted in రచనలు | 5 Comments

దీపావళి టపాసులు

  దీపావళి టపాసులు 
                      మనవళ్ళ కోసం చిచ్చుబుడ్లు   కూరుతున్నాను .మతాబాలు, అవ్వయిలు కట్టటం అయిపొయింది . saample గా కాల్చి చూశాను .బానే కాలాయి .ఇంతలో మా బామ్మర్ది బ్రహ్మం ఆదరాబాదరా రొ ప్పుకుంటూ వచ్చాడు .ఎక్కడి నుంచి రాక ? .ఏమిటా రొప్పుల మోత ?అన్నాను .చొక్కాతో చెమట తుడుచు కొంటు ”నీకేం బావ!! తాపీగా చిచ్చుబుడ్లు కూరుకుంటూ కూర్చున్నావు. అక్కడ  కొంపలంటు కుంటుంటే “”అన్నాడు .”అసలు విషయం చెప్పకుండా ఈ సుత్తేమిటి రా బాబూ ?”అన్నా..”.అదికాదుబావా -నిన్న ఒక చానెల్ లో నారదుడు రాజకీయ నాయకుల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఎవరెవరు దీపావళి నాడు ఏమి కాలుస్తారు ?అని అడిగాడు .ఒక్కొక్కరు భలే తమాషా గా జవాబులు చెప్పారు .నువ్వు చూడ లేదా ?”అన్నాడు .”ఎన్నని చూడను ?దేన్ని చూడను  ?  బోరు కొడుతున్నాయి .నాకా ఓపిక లేదు ”అంటూ ఇంతకీ వాళ్ల సమాధానాలు ఏమి చెప్పారో చెప్పనే లేదు  ”అన్నాను .” ” సరే వినుబావా .ముందుగా కిరణ్ కుమార్ ను అడిగితే –”నేను రచ్చబండ లలో వచ్చిన ఆర్జీలను తీర్చలేక పోతున్నాను .చూసే టైంకూడా   లేదు . అందుకని దీపావళి నాడు వాటినన్నీ కాల్చేసి పండగ చేసుకుంటాను ”అన్నాడు .చంద్రబాబు ను అడిగితే ”విజయమ్మ నా మీద మూడు వేల పేజీల అభియోగాలు మోపింది .హాయిగా వాటిని కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తాను ”అన్నాడు .చిరంజీవిని అడిగితే ”ప్రజా రాజ్యం మాని ఫెస్టోలు,  బానర్లు ,రసీదు పుస్తకాలు ఇక పనికి రావు కనుక వాటిని కాల్చుకొని ఆనందం అనుభవిస్తాను ”అన్నాడు .కే.సి.ఆర్ ను అడిగితే ”ఏముంది అన్నా ! పనికి రాని శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ వున్నది కదా, దాన్ని బొందపెట్టి కాల్చి నుసి చేసి పండగ జేసుకునేది ”అన్నాడట .,
                   ”  ఇంతకీ మనం పండగ యెట్లా చేసుకుందాం బావా ?”అని అడిగాడు బామ్మర్ది బ్రహ్మం ”ఒరే –ఇంకా కాల్చటానికి ఏముందిరా .నలభై రోజులనుంచి పరువు కాల్చారు .ప్రతిష్ట మంటగలిపారు ,నీతి కి నిప్పు పెట్టారు .నిజాయితీని నిలువునా దహనం చేశారు .కుంభకోణాలతో దేశ గౌరవాన్నే తగలేశారు .గనుల్లో అవినీతి ఘనులు దేశ సంపదనే మసి చేసారు .సెజ్ ల పేర రైతుల వెన్నెముకలనే నుసి చేశారు .ఆందోళన పేరుతో ,సమ్మె ల పేరుతో జన జీవితాన్ని ప్రాణాలను కాల్చి బుగ్గి చేశారు .పంటకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా ,చాలినంత కరెంట్ ఇవ్వకుండా రైతుల్ని క్రాప్ హాలిడే లోకి నెట్టి ,పంటలను మసి చేస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్న ప్రభుత్వానికి ,సంజాయిషీ చెప్పుకోలేని కేంద్రానికీ ,తెలంగాణా వస్తుందని ,ఇచ్చేస్తునామని ,వాళ్ళతో ,అబ్బే అదేమీ లేదు అని వీళ్ళతో గోడమీది పిల్లి వాటం గా ఏళ్ళకు ఏళ్ళు గడుపుతూ ప్రాణాల్ని బుగ్గి చేస్తున్నారు .అవును ఇంకా ఏమి మిగిలింది ?కాల్చు కోవటానికి ? సిగ్గు, శరం తప్ప ” ఆన్నాను .మా వాడికి బుర్ర తిరిగింది ‘.”బావా!!  బుద్ధి గడ్డి తిని నీ దగ్గర కొచ్చినందుకు చె౦పలేసుకొంటున్నాను . ఏదో సరదాగా నవ్వించి పండగ పూటా కాలక్షేపం చేద్దామని వస్తే ,నీ అక్కస్సంతా తీర్చుకున్నావు ””ఇక చాలు బాబూ .”అంటూ అసలు ఏం కాల్చుకు౦దామంటే సమాధానం చెప్పలేదు ”అన్నాడు .”మనం ఇప్పటికే ఒళ్లంతా కాల్చుకున్నాం రాష్ట్రం పేరుతో ”ఇంకేమీ కాల్చుకో నక్కర లేదు ”అన్నాను .బావా topik మారుద్దాం ఆనాడు వాడు .సరే అన్నా.  బజారులో కొత్త టపాసులు ఏమి ఉన్నాయిరా ”అని అడిగాను .బావా చెబితే నమ్మవు కాని చాలా వారైటీ లు వచ్చాయి ”అన్నాడు ”పేర్లు చెప్పి ఏడు ”అంటే మొదలు పెట్టాడు ”హర్షద్ ఔట్లు !!   రాజా  బా౦బులు !!  కని అవ్వాయిలు ,గాలి తూటాలు ,జగ్గు fighterlu ,ఎడ్డి కడ్డీలు ,అమర్ నోట్ల అవుట్లు ,గడాఫీ బంగారు బిస్కట్లు ,మరాండీ మతాబాలు ,లాడెన్ లౌడ్ బ్రేకర్స్ ”అన్నాడు .”హాయిగా అవి కోనికాల్చు కొక   పొద్దున్నే ఈ కూరుడేమిటి బావా .నీ చాదస్తం తో అందర్నీ బాదిస్తున్నావ్ ”అని సలహా పారేశాడు .”ఒరే .-కొనటానికి వెళ్ళా .కాని అవ్వాయి రేట్లు ఆకాశాన్ని చూస్తున్నాయి మతాబాలు తబలా దెబ్బల్ల ఉన్నాయి .చిచ్చు బుడ్ల రేట్లు చెలరేగుతున్నాయి ..నేలటపాకాయలు నేలలోనే వున్నాయి బయటికి రావటం లేదు చాలా కాలంగా .జిల్లీలు జెల్లీ చేపల రేట్లను తలపిస్తున్నాయి .పాము  బిళ్ళల రేట్లు అందకుండా పారి పోతున్నాయి .కాకర పువ్వొత్తులు కోర కోరా చూస్తున్నాయి .రోలు రోకలి మందు లేనేలేదు .దివిటీలు లేవు .భూచక్రాల రేట్లు కళ్ళు తిరిగే లా వున్నాయి .విష్ణు చక్రాలు తల తిరిగే రేట్లలో  వున్నాయి ”అ౦దుకే  కొన కుండా తిరిగి వచ్చి ఈ పనిలో పడ్డా .”అన్నాను” బ్రహ్మం !అవేవో హస్బండ్ వాలాలు ట ఏమిటిరా అవి !! “?అని అడిగాను .వాడు మతాబా నవ్వు నవ్వి ”అవి థౌసంద్ వాలా బావా హస్బండ్ వాలా కాదు ”అన్నాడు .”ఇదివరకు టెలిఫోన్ లని వచ్చేవి ఇప్పుడు లేవా ?”అడిగాను .”ఇంకేం ఫోన్ లు బావా అంతా సెల్ లేగా -కొన్ని సెల్లులు పేలుతున్నాయిగా ఇంకా  బా౦బు లె౦దుకు “‘అన్నాడు .”ఏరా !! తెలంగాణా   ,ఆంధ్రా ,విశాలాంధ్ర ,సమైక్యాంధ్ర ,సీమాంధ్ర,రాయల  తెలంగాణా   బాంబులు రాలేదా “‘?అని అడిగితే వాడు ‘అవి రోజూ పెలుస్తూనే ఉన్నారుగా బావా!! పేపర్ వాళ్ళు, చాన్నేల్ వాళ్ళు, రాజకీయులు అన్నాడు .ఒరే నీకూ జోకుల డోకులు  బానే వస్తున్నాయిరా ”అన్నాను .నవ్వాడు వాడు .”సరే బావా వెళ్ళొస్త.ఇంటి దగ్గర మీ చెల్లెలు ఎదురు చూస్తు౦టుంది.ఆలస్యమైతే మాటల బాంబులు పేలుస్తుంది ”అంటూ జారుకున్నాడు .
                        దీపావళి శుభా కాంక్షలతో —మీ –దుర్గా   ప్రసాద్  —25 -10 -11 .

Posted in సమయం - సందర్భం | 2 Comments

తెలిసిన పాటలు – తెలియని మాటలు

03.రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ అర్థ విశేషాలు ((25-10-2011 తేదీన  మరికొంత విషయం కలుపబడింది.)

 

తిరుమల గర్భగుడి లోని శ్రీ రాముడు ఫట్నం సుబ్రమణ్య అయ్యర్

(చాయా చిత్రాలు:గూగుల్ సౌజన్యం)

 

తమిళనాడు తంజావూరు జిల్లాలో తిరువాయూర్ లో జన్మించిన   ఫట్నం  సుబ్రమణ్య అయ్యర్ (1845 – జూలై 31, 1902)  చక్కటి  స్వరకర్త. త్యాగరాజ ప్రభావితులు. వారి ప్రసిద్ధ కృతి “రఘువంశ సుధాంబుధి”. ఈ కీర్తన అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకొందాం.

 

పల్లవి:

 

1.రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ

 

రామ రామ రాజేశ్వర

 

అనుపల్లవి:

 

2.అఘ మేఘ మారుత శ్రీకర

 

అసురేంద్ర మృగేంద్ర వర జగన్నాథ

 

చరణం1:

 

3.జమదగ్నిజ గర్వ ఖండన జయ రుద్రాది విస్మిత భండన

 

కమలాప్తాన్వయ మండన అగణిత అ ద్భు త శౌర్య శ్రీ వేంకటేశ్వర

 

చరణం2:

 

4.భృగునందనా కవిభంజనా బృందారక బృందహితా

 

నిగమాంతవ సుబుధావనా నీరజాక్ష శ్రీ వేంకటేశ్వర

 

 

 

భావం

 

1.శ్రీరామా! రఘువంశము అనే అమృతసాగరమును వృద్ధి పొందించు చంద్రుడా! రాజులకు అధిపతీ   !

 

2. పాపమనే మేఘాలను తరిమికొట్టే  పెనుగాలివంటి వాడా! శుభాన్ని ఇచ్చేవాడా! , రాక్షస శ్రేష్ఠులకు సింహములాంటి వాడా! శ్రేష్ఠుడా ! జగత్ప్రభూ!

 

3.జమదగ్నికి జన్మించిన పరశురాముని గర్వము పోగొట్టిన  వాడా! శివుడు మొదలైన వారికి  యుద్ధంలో  ఆశ్చర్యం కలిగించి విస్మయము కలిగించిన వాడా ! కమలాలకు ఇష్టుడైన సూర్యుని వంశంలో జన్మించి, ఆ వంశానికి అలంకారమైన వాడా ! లెక్కపెట్టడానికి వీలులేని అద్భుతమైన పరాక్రమము కలిగిన వాడా! , శ్రీ వేంకటేశా!

 

4. భార్గవరామా! , శుక్రునిజయించిన  వాడా!,  దేవతల బృందానికి రక్షకుడా!  వేదాంతమునుచదువుకొనే  గొప్ప గొప్ప పండితులనురక్షించే వాడా, కమలముల వంటి కన్నులు కలవాడా!  శ్రీ వేంకటేశా!

 

అంతరార్థం

 

రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ

 

ఇక్ష్వాకు వంశంలో రఘువు అనే  మహారాజు జన్మించి అత్యద్భుతమైన దాన పరాక్రమ విశేషాలు ప్రదర్శించాడు కనుక అతని పేరు మీదుగ ఇక్ష్వాకు వంశానికి రఘువంశమనే పేరు వచ్చింది.

 

పౌర్ణమినాడు చంద్రుని చూస్తే సముద్రం పొంగుతుంది. దీనిని వర్ణించటం మన కవులకు చాలా ఇష్టం.

 

రఘు మహారాజు పుట్టినప్పుడు , దిలీప మహారాజు   మొట్ట మొదటిసారి చూసాడు. చంద్రోదయ కాలంలో సముద్రం అనందం పొంది ఒడ్డులని ఒరుసుకొన్నట్లు , పుత్రున్ని చూసిన ఆనందం దిలీప మహారాజులో ఇమడలేక బయటికి వచ్చిందని కాళిదాసు మనోహర వర్ణన. (రఘు వంశం-03-17 శ్లో)

 

శ్రీరాఘవం ధశరధాత్మజమప్రమేయం

 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

 

ఆజానుభాహుం అరవిందదళాయతాక్షం

 

రామం నిశాచర వినాశకరం.. నమామి…

 

అనే శ్లోకం మనందరికీ తెలిసిందే. ఇందులో రఘుకులాన్వయ రత్నదీపం  అనే సమాసానికి రాముడు రఘుకులమనే  సముద్రానికి చంద్రుడిలాంటి వాడని పెద్దలు అర్థం చెబుతారు.  ప్రాచీన కవులందరికీ   ఇష్టమైన ఈ “సముద్ర చంద్ర” సమాసానికి “సుధ” అనే విశేషణం అదనంగా చేర్చి పట్నం వారు ఈ కీర్తనలో రాముని సంబోధించారు.

 

అఘ మేఘ మారుత శ్రీకర

 

పాపానికి ఇంకోపేరు అఘం.   కర్తని  పొందేది, దుఃఖాన్ని   విడువనిది అఘం.  ఈ అఘం మేఘంలాంటిదట. “మేహతీతి మేఘః”  తడుపుతుంది కాబట్టి మబ్బుని మేఘమన్నారు.

 

పుణ్యపు వెలుగుకి అడ్డువచ్చి , బతుకును చీకటి చేసేది మేఘం. ఈ  మేఘం- గాలివల్ల  తొలిగితే మళ్ళీపుణ్యాల వెలుతురు. రామచంద్రమూర్తి మన పాపాల మేఘాలను  తొలగించే శీతల స్పర్శ ..

 

అసురేంద్ర మృగేంద్ర వర జగన్నాథ

 

అసురులంటే రాక్షసులని సామాన్యార్థం.అసురులనే పేరు వాళ్ళకి మూడు కారణాల వల్ల వచ్చింది.

 

1.సుర(అమృతము ) లేనివారు కాబట్టి అసురులు.

 

2.దేవతలు (సురులు)కానివారు కనుక అసురులు.

 

3.అసువులంటే ప్రాణాలు. వీటిని గ్రహించేవారు కనుక అసురులు.

 

ఇటువంటి రాక్షసులలో మహా భయంకరులైన వారి పాలిటి సింహంగా రాముడిని పట్నం వారి వర్ణించారు.

 

అసురేంద్రుడంటే హిరణ్య కశిపునిగా , మృగేంద్ర అంటే నరసింహావతారంగా కూడా స్వీకరించవచ్చు.

 

“వర” శబ్దాన్ని కవులు శ్రేష్ఠమైన అనే అర్థంలో తరచుగా వాడుతుంటారు. ఉదాహరణకి త్యాగరాజ స్వామి వారు   “మానస వనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారు’ (ఎందరో మహానుభావులు) ప్రయోగించారు. చిన్న త్యాగరాజుగా ప్రసిద్ధి పొందిన పట్నం వారు కూడా “‘శ్రేష్ఠుడైన జగన్నాథుడా'” అనే అర్థంలో రాముడిని “వరజగన్నాథా ”   శబ్దంతో  సంబోధించారు.

 

జమదగ్నిజ గర్వ ఖండన

 

ఋచీకుడు అనేవాని  కుమారుడు జమదగ్ని. ఆ

 

ఆ జమదగ్ని కొడుకు  పరశురాముడు. (జమదగ్నిజ) .ఆయన  భార్య పేరు  రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.

 

పరశురాముడు  .కూడా తక్కువ వాడు కాదు. దశావతారాలలో ఒకడు.

 

ఇరువదియొక్క మాఱు ధరణీశులనెల్ల వధించి తత్కళే

 

బర రుధిర ప్రవాహమున బైతృక తర్పణమొప్పజేసి భూ

 

సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై

 

ధరణినొసంగితీవు కద దాశరధీ కరుణా పయోనిధీ.(రామదాసు)

 

 

 

క్షత్రియ రుధిర మయే జగదపగతపాపమ్

 

స్నపయసి పయసి శమిత భవ తాపమ్

 

కేశవ! ధృత భృగుపతి రూప!

 

జయ జగదీశ ! హరే! (జయదేవుడు)

 

ఇలా మహాకవుల చేత స్తుతి పొందిన వాడు పరశురాముడు.

 

“పరాన్ శృణాతీతి పరశుః” శత్రువులను హింసించునది అనే అర్థంలో గండ గొడ్డలిని పరశువు అన్నారు. దానిని ధరించిన వాడు పరశురాముడు.

 

పరశురామునిది ఆవేశావతారం. ఒక పనికోసం జీవునిలో భగవంతుని తేజస్సు ఆవేశిస్తే దానిని ఆవేశావతారం అంటారు. ఇటువంటి ఆవేశావతారాలు పూజించదగినవి కావని పద్మ పురాణంలో ఉంది. (నోపాస్యహి భవేత్తస్మాత్ భక్త్యావేశాత్మహాత్మనః )పూర్ణావతారం,(రాముడు)  ఆవేశావతారం(పరశురాముడు)  రెండు కలుసుకొన్నప్పుడు  పూర్ణావతారంలో  ఆవేశావతారం కలుస్తుంది. పరశురాముని విషయంలో ఇదే జరిగింది.  దీనినే గర్వ భంగం  జరిగినట్లుగా పట్నం వారు పేర్కొన్నారు.

 

పరశురాముడు రామునితో అన్న మాటలు:

 

“ఓ రామా! నీకు శక్తి ఉంటే  శత్రు  పురాలను జయించే బాణాన్ని ఈ వైష్ణ వ ధనుస్సుకు సంధించు. అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధం చేయటానికి నిన్ను అనుమతిస్తాను. (వాల్మీకి రామాయణం- 75వ సర్గ 28-29 శ్లోకాలు) శక్తి ఉంటే ( యది శక్నోషి ) అనే మాట గర్వంతో కూడుకొన్నది. ఆధునిక కాలంలో కూడా “నీకు దమ్ముంటే రా రా! చూసుకొందాం ! “అనే మాటలు వింటుంటాం కదా! ఇటువంటి గర్వోక్తులనే పరశురాముడు పలికాడు. “నాతో యుద్ధం చేయాలంటే ఒక అర్హత కావాలి.ఈ వైష్ణవ ధనుస్సు సంధిస్తే నాతో యుద్ధం చేసే అర్హత నీకు కల్పిస్తాను” అనే  మాటలు  కూడా ఇంకా గర్వంతో కూడుకొన్నవి. శ్రీ రాముడు ఆ వైష్ణవ    ధనుస్సును ఎక్కు పెట్టగానే  భార్గవ రాముడు తేజస్సు  కోల్పోయాడు. (76వ సర్గ-11వశ్లోకం) ఇదే గర్వ భంగం .

 

(25-10-2011 సశేషం )

 

నాకు నచ్చినది – మీకోసం

 

http://tadepallipatanjali.hpage.in/

 

 

Posted in సేకరణలు | Leave a comment

గురజాడ 150 జయంతి – వార్తా పత్రికలలో …

IMG

Posted in వార్తా పత్రికలో, సభలు సమావేశాలు | Leave a comment

ఆవరణం- డా. దేవరాజు మహారాజు


Aavaranam

Posted in రచనలు | Leave a comment

నవ దీపావళి

           నవ దీపావళి  
                         నరకు లేక్కడో లేరు బాబూ
                         నీ నా మధ్యనే నక్కి వున్నారు
                         స్వార్ధం పెంచి ,దౌష్ట్యం నించి
                         విర్రవీగే వారంతా ఎవరనుకున్నావ్
                        బందులు చేయించే వాళ్ళు ,
                        స్కూళ్ళు మూయిన్చేవాళ్ళు
                        పసిపిల్లల్ని హత్యచేసే వాళ్ళు
                       ఆసిడ్ దాడితో జీవితాలతో
                        చెలగాటం ఆడే వాళ్ళు
                        అందరు నరకాసురులే
                        వీళ్ళను సంస్కారం అనే
                        మందుతో కూరి
                        కాల్చండి చిచ్చుబుడ్లు
                        కోపం గంధకం తో ,మార్పు
                       అనే రజను తో మతాబా కూరి
                      వెలిగించండి వెలుగు దివ్వెలు
                      చిటపట మనసులు కొరకొర చూపుల
                     సిసిన్ద్రీలతో కవ్వించే వారిని
                     క్షమాగుణంవెన్న ముద్దలు   వెలిగించి
                     శాంతి కలిగించండి ,ఆనందం పంచండి
                    మనశ్శాంతి లేకుండా చేసే మానవ హంతకుల గుండెల్లో
                    ఔట్లు బాంబులు పెలేట్లు
                    మాటల తూటాలు పెల్చండి
                    .కాకరపువ్వత్తుల్లాంటి
                    కారుణ్య పు చిరు వేలుగులివ్వండి .
                   దుర్మార్గాన్ని ,హింసను
                   అవ్వాయిచువ్వాయిలు చేసి అంటించి
                  ఆకాశం లోకి వదలండి .
                  కాలి మసై పోతాయి
                గుండె నిండు గా మంచి అనే
                మతాబా వెలిగించండి
                ఆ కాంతుల్లో జగతిని
                వెలుగు వెల్లువతోనింపండి
                 ఈ దీపావళి  నాడు శోకావలిని పోగొట్టి
                జ్ఞాన జ్నోత్నావళి గా మార్చండి .
                                                                               దీపావళి శుభా కాంక్షలతో
                                                                            మీ— గబ్బిట దుర్గా ప్రసాద్ —25 -10 -11 .
Posted in కవితలు | Leave a comment

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతామృతం —1

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతామృతం —1
                                                                     జీవితం
                         ”భజరే రఘువీరం –మానస భజరే రఘువీరామ్ ”–”సర్వం బ్రహ్మమయం రేరే ”—బ్రూహి ముకున్దేతి ”—క్రీడతి వనమాలీ ”—”పిబరే రామ రసం ”–”మానస సంచరరే ”మొదలైన భక్తీ కీర్తనలతో భక్తీ,జ్ఞాన ,వైరాగ్యాలు అనే త్రివేణీ సంగమాన్ని సృష్టించిన భక్త మహాకవి శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్రులు ..ఆ కీర్తనలను తన స్వరమాధుర్యం తో అమృతమయం చేసి గానంతో సకల జనులను భక్తి లహరి లో ముంచి తేల్చిన ప్రముఖ వాగ్గేయకారులు పద్మవిభూషణ్ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ .బంగారానికి తావి అద్దారు .వింటుంటే మానసం ఎక్కడికో సంచారానికి వెళ్తుంది .ఎక్కడి కేమిటి ఆ పరబ్రహ్మ సందర్శనకే .బ్రహ్మ పదానికి చేరువ చేస్తుంది .అట్టి మహనీయ కేర్తనలో ఆధ్యాత్మిక భావం అంతరంగాన్ని ప్రక్షాళనం చేసి రసోవై సహ అనిపిస్తూ  అద్వైతామృత వర్షాన్ని కురిపించి తనియిమ్పజేసి ,తరింప జేస్తుంది .ఆ మహామహుని దివ్య జీవిత తరంగినిని దర్శించి ధన్యులమవుదాం.
                       బ్రహ్మేన్డ్రుల అసలు పేరు శివ రాముడు .ఆంధ్రుల ముద్దు బిడ్డ మన సదాశివుడు .తండ్రి మోక్ష సుందర అవధాని .తల్లి పార్వతమ్మ .18 వ శతాబ్దం లో తమిళనాడు లో కాఎరి తీరం లో కుంభకోణం దగ్గర చిన్న గ్రామం లో జన్మించారు .చిన్నతనం నుంచే వైరాగ్యం అలవడింది పిల్లాడు .ఎమైపోతాదేమో నని భయం తో పెళ్లి చేశారు .భార్య పుష్పవతి అయిందని కబురు వచ్చింది తల్లి పిండివంటలు చేస్తోంది .ఇంటికి వచ్చిన బ్రహ్మేన్ద్రుని ఆత్రం చూసి కాసేపు ఆగమనీ ,అత్తవారింటికి వాటిని తీసుకు వెళ్లాలనీ చెప్పింది .అప్పటికప్పుడు ఆయన మనో కవాటం తెరుచుకుంది .విషయవాసనలు వుంటే పడిగాపులు తప్పవు అని జ్ఞానోదయమయింది .ఏదో తెలుసుకోవాలనే కాంక్ష మిన్ను ముట్టింది .పరమశివేంద్ర గురు దర్శనం చేసి ,అనుగ్రహం పొందాడు ఆయన ”సదాశివ బ్రహ్మెంద్రుడు ”అనే పేరు పెట్టి ,శాస్త్ర బోధ చేశాడు .తర్కం అంతు చూశాడు .అందరిని వాదానికి పిలిచి గెలిచి,ఓడినవారిని హేళన చేశాడు .అతని అతి ప్రవర్తనను ,వాచాలత్వాన్ని గ్రహించిన గురువు ”సదాశివా !నీ నోరు ఎప్పుడు మూత పడుతుంది ?అని తీవ్రం గా అన్నాడు .వెంటనే శిష్యుడు ”ఇదిగో ఇప్పుడే ”అనినమస్కారం చేసి బయటకు వెళ్లి పోయాడు .ఇలావైరాగ్యమూ  ,మౌనము ఆయనకు క్షణాలమీద కలగటం ఆశ్చర్యం .మౌన ముద్రాలన్క్రుతుదయాడు . .మనస్సును పరబ్రహ్మం పై లగ్నం చేసి ,పర్సమహంస లా ఉన్మత్తునిలా సంచరించ సాగాడు .గురువుకు విషయం తెలిసి తన కంటే తన శిష్యుడు ధన్యుడయాడని భావించి పరవశించాడు .
                  పుదుక్కొట సంస్థానాదీశుడు సదాశివులను దర్శించి మహిమను గుర్తించి ఉపదేశం కోరాడు .ఇసుక మీద మంత్రం రాసి మౌన ఉపదేశం చేశాడు .ఆ పవిత్ర అక్షరాలున్న ఇసుకను ,మట్టితో సహా తవ్వించి తన పూజా మందిరం లో భద్రపరచుకున్నాడు రాజు .బ్రహ్మేన్డ్రుల ఆత్మ జ్యోతి ప్రకాశిస్తున్న కొద్దీ ఆయన చేష్టలన్నీ మహిమాన్వితమవుతున్నాయి .ఒక రైతు ధాన్యం నూర్చి రాసిగా పోసిన చోట అసంగతం గా బ్రహ్మేన్ద్రులు వెళ్లి కూర్చుని ధ్యానం లో మగ్నమయారు .రైతు రాత్రి కాపలాకు వచ్చి ఆయన్ను దొంగగా బావించి కొట్టబోతే చెయ్యి అలాగే స్తంభించి పోయిందట .తెల్లవారి సమాధిలోంచి లేచి రైతువంక చూస్తూ,వెళ్ళిపోగానే రైతు చెయ్యి మళ్ళీ స్వాధీనం లోకి వచ్చిందట .ఇంకోసారి ఒక పెళ్ళికూతుర్ని పాము కరిస్తే సదాశివుల అనుగ్రహం తో ఆమె లేచి కూర్చుందట .మరోసారి తన్మయత్వం లో పాడుకుంటూ వెళ్తుంటే ,ఒక డేరా లో నిద్రిస్తున్న నవాబుకు నిద్రాభంగమయి ,పిచ్చి కోపంతో బ్రహ్మేన్డ్రుల చేతిని కత్తి తో   నరికేశాడట .రక్తం ప్రవాహం గా కార్తోంది .నగ్నం గా నడిచి పోతున్న ఆయనకు బాహ్య స్పృహ లేదు .తప్పు తెలుసుకున్న నవాబు పాదాలపై పది క్షమించమని ప్రార్దిన్చాదట .”దేనికి క్షమాపణ ?అన్నారట యతీంద్రులు. ”మీరెవరో ఎలీక మీ చేయి నరికాను స్వామీ ”అని ఏడ్చాడట నవాబు .”నా చేయినా ”అంటూ చేతి వంక చూసుకున్నాడట .చెయ్యి కనిపించలేదు .క్రింద .పడి వుంది .దాన్ని తీసుకొని యద్గాస్తానం లోపెట్టుకోగానే  పెటు  అతుక్కు పోయిందట .మళ్ళీ పాడుకుంటూ ,తనకేమీ తెలియని స్థితిలో వెళ్లిపోయారట బ్రహ్మేన్ద్రులు .
కొడుమూడు అనేఉపనది   ఒడ్డున సమాధి స్థితి లో వుండగా ,అకస్మాత్తుగా వరద వచ్చి అంతా ముంచేసింది .అందరు హెచ్చరిస్త్యన్నా ,సదాశివులకు ఏమీ పట్ట లేదు .శరేరం వరదలో కొట్టుకు పోయి ఇసుక లో కూరుకు పోయింది .నాలుగు నెలల తర్వాత రైతులు ఇసుక మేట ను తవ్వు తుంటే శరీరం బయట పడింది .జనమంతా ఆశ్చర్య పోయారు .ఆయన సమాధి నుంచి లేచి ,మాట్లాడ కుండా వెళ్లి పోయారు .బ్రహ్మేన్ద్రులు చిన్న పిల్లల తో చాలా సరదాగా గడిపే వారట .ఒకసారి పిల్లలంతా ఆయన చుట్టూ చేరి తిరువాలూర్ లో జరిగే సంబరాలు చూపించమని కోరారట .వాళ్ళందర్నీ తన దగ్గర కూర్చో పెట్టుకుని ,తాకుతూ ,కళ్ళు మూసుకో మాన్నాడట /.కళ్ళు తెరిచేసరికి అందరు తిరువళ్లూర్ లో ఉన్నారట .ఉత్చవాలు చూపించి ప్రసాదాలు ,తినుబండారాలు కొనిచ్చి మళ్ళీ కళ్ళు మూసుకో మన్నారట .కళ్ళు తెరిచే సరికి వాళ్ల వూరు ”కరూర్ ”లో ఉన్నారట .ఆయన ఆ గ్రామం లోనే స్థిర పడ్డారు .పిల్ల లంతా పెద్దవాళ్ళకు చెప్పి ,తాము తెచ్చినవాన్నే చూపిస్తే అందరు ఆశ్చర్య పోయారట .
                 జ్యేష్ట శుద్ధ దశమి నాడు తాను దేహ త్యాగం చేస్తానని ,కరూర్ లోనే తనను సమాధి చేయమని ,కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు శివలింగాన్ని తెస్తాదనీ ,దాన్ని తన సమాధిపై ప్రతిష్టించమని భక్తులకు ముందే చెప్పి బ్రహ్మైక్యం చెందిన పరమ హంస సదాశివ బ్రహ్మేన్ద్రులు .పుదుక్కొట సంస్తానాదీశులే ఇప్పటికీ సమాధి సంరక్షణ చేస్తూ వుంటారు .
                        సదాశివెంద్రులు చాలా గ్రంధాలు రాశారు .బ్రహ్మసూత్రాలకు   అద్భత వ్యాఖ్యానం రాశారు .”ఆత్మ విద్యావిలాసం ”,’శివ మానషిక పూజ ‘వారి ప్రఖ్యాత రచనలు .వీటన్నిటికంటే బాగా ప్రచారం లో వున్నవి వారి కీర్తనలు .అవి ఇరవై నాలుగు మాత్రమే .వాటి లోని భాషా మాధుర్యం ,శైలి ,భావం ,గాంభీర్యం ,భక్తి,ఆధ్యాత్మిక సంపద ముగ్ధుల్ని చేస్తాయి .అద్వైతామృత వర్షం కురిపించారు ..ఆత్మ బోధ చేశారు .అర్ధ గాంభీర్యం తో పాటు సంగీతా మాధుర్యం తొణికిసలాడే కీర్తనలు అవి .”అద్వైతం త్రిషు లోకేషు–నా ద్వైతం గురునా సహా ”అన్నది శ్రీ సదాశివుల బ్రాహ్మీ భావం .అలాంటి పరమ గురువు ప్రణామం చేస్తూ ,ఆఅద్వైత భావ   లహరి లో తరిద్దాం ..ఆరస గుళిక లను  ఆస్వాదిద్దాం .
                      ఇందులోఅయిదు  శ్రీరాముని పరంగా ,ఎనిమిది  కీర్తనలు శ్రీ కృష్ణునిపై ,మనసును ఉద్దేశించి ఆత్మబోదగా అయిదు గురువు పరమశివెంద్రులను కీర్తిస్తూ ఒకటి ,గంగానది పరంగా ఒకటి మిగిలిన నాలుగు బ్రహ్మానందానుభవం గా రాశారు .ఇవి సోపాన క్రమం లో వుండి మోక్ష సాధనకు మెట్లుగా కనిపిస్తాయి .గురు సాన్నిధ్యం లోనే చిత్త వికారాలు తొలగి మనసు పరిపూర్నమవుతుందని  చెప్పారు .చివరి కీర్తన గంగామతల్లి పై రాసిన సంగతి చెప్పాను .భారతీయ ఆధ్యాత్మిక భావనకు ,అనుభవాలకు తర తరాల సాక్షీభూతం గా నిలిచింది పవిత్ర భాగీరధి .బ్రహానందం,అమ్రుతానందం.ప్రణవమే సర్వార్ధ సాధకంఅన్నార బ్రహ్మేన్ద్రులు .అమేయమైన అనుబూతి కలిగించే ఆ కీర్తనా వైభవాన్ని ”రామ రసాయనం ”గా .”క్రిష్ణామ్రుతం ‘గా ,”ఆత్మానందం ”గా ,”బ్రహ్మానుభూతి ”గా వింగడించి తెలుసు కోని ,ఆ అమ్రుతానందాన్ని అందుకొందాం .మానషిక పున్డరీకాన్ని శత పత్ర వికసనం చేసు కుందాం .దివ్యానందాన్ని అనుభవిద్దాం .శ్రీ సదా శివ బ్రహ్మేంద్ర పరమహంస పవిత్ర కీర్తనామ్రుతాన్ని తనివి తీర గ్రోలి మోక్షాన్ని పొందుదాం .
                                             సశేషం
                                                                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —25 -10 -1
Posted in రచనలు | Leave a comment

తెలుగు బాషా కేంద్రం మైసూర్ లోనా ?

Telugu peetamu 1

Posted in సేకరణలు | Leave a comment

” ప్రపంచ తెలుగు – తొలిఅడుగు ” సభ

Prapancha Telugu

Posted in సభలు సమావేశాలు | 2 Comments

మంచి నియంత గడాఫీ

Gaddafi

Posted in సేకరణలు | Leave a comment

గురజాడ కన్యాశుల్కం —–7

                      గురజాడ కన్యాశుల్కం —–7
                                                      ఆని ముత్యాలు అనిపిస్తూ జనం నోట నిత్యం వినిపించే అనిపించే often quoted lines
                  కన్యాశుల్కం నాటకం ఆంద్ర జనజీవితం లో కలిసి పోయింది .అందులోని మాటలు అన్నీ జనం నోట ఏదో సందర్భం గా  పలకబడేవే .అవి అంటూ సందర్భాన్ని పుష్టి పరిచేవే .అందులో నవ్వు పుట్టిన్చేసేవీ ,.  ,పరిహాసం చేసేవీ ,అశాదభూతిత్వాన్ని చాటేవీ ,తప్పించుకోవటానికి అతుక్కు పోయేవీ ,నమ్మకం కలిగించేట్లు చేసేవీ ,అవి అన్నీ ఇన్నా నా ఎన్నో .అన్నిటిని వినాల్సిందే సారి చదవాల్సిందే .ఆ మాటల వైభోగం చూడండి
          బిచానా ఎత్తేయటం —అట్నుంచి నరుక్కు రమ్మన్నాడు –ఏమివాయ్ మై డియర్ shakespere  —  నాతో మాట్లాడటమే వో ఎడ్యుకేషన్ –మనవాల్లోట్టి వెధవాయిలోయ్ — బొట్లేరు ఇంగ్లీష్ –పిల్లా అగ్గిపుల్లా –ఈ శషభిషలు పనికి రావు —తాంబోలం ఇచ్చాను ఇహ తన్నుకు చావండి –కాపర్సేమయినా ఉన్నాయా —చెట్లకు చేవ నలుపు ,మనిషికి చేవ తెలుపు (జుట్టు తెల్లబడటం )–నమ్మినచోట చేస్తే మోసం ,నమ్మని చోట చేస్తే లోక్యవూ –నకార ప్రయోగం చేయకు (నువ్వు అని పిలవటం )–  two birds at one shot –సత్రాభోజనం ,మఠా నిద్రా —అన్యాయం పాప నాశనం –మాటలు నేర్చిన శునకాన్ని వేటకు పంపితే వుసుకో మంటే  వుసుకో  మందట.–పిత్రార్జితం అంతా కరారావుడు చుట్టేశాను (అవగోట్టేశాను )–అన్చారాష –వస్తున్నారాష —దాని తస్సా దియ్యా –చక్రం అడ్డం వేయడం –అచ్చాణీ –కందిగుండాచమే ,ఇంగువాచమే –తొమ్మిదో అష్టం ఘనం పారాయణ చేస్తాడు (బూతులు మాట్లాడుతాడు )—వల్లకాట్లో రామ నాదాయ (అనామకుడు )—లాంతరేశావు (పేకాటలో చేతులేతేయటం )–సకేశా ,అకేశా /(జుట్టున్నదా ,విధవా?)–మ్ముక్కస్య ముక్కర్ధః( భావం తెలీకుండా –ఏమాటకు ఆమాట అర్ధం చెప్పటం )—పిండం పిల్లులకు పెట్టా —నీ ఇంట కోడి కాల్చా —nepolian of anti nautch —
kick the bucket –whats in name ?పేరులోన నేమి పెన్నిధి యున్నది ?—దామిట్ !కధ అడ్డం గా తిరిగింది –జాతకం బనాయించటం (దొంగ జాతకాలు రాయించటం )–శాంతం భోషాణం –గోతాలు కోయటం –గురో –సిగదరగా –మూడో కాలమ్ లో వున్నారు (పూటుగా తాగారు ).
                                                           జీవిత సత్యాలు
01 -”ఇన్నాళ్ళకు జన్జేప్పోగు వినియోగం లోకి వచ్చింది ”–ఆపదలో శపథం చేయటానికి జందెం వుపయోగపడినని అర్ధం
02 -ఏదో రకం గా అగ్నిహోత్రావధానుల ను ఒప్పించటానికి గిరీశం చేసిన ప్రయోగం బెడిసి కొడితే చేసేది లేక ఆయన చెప్పినట్లే చేయటానికి సిద్ధ పడ్డాడు .అప్పుడు శిష్యుడు వెంకటేశం ”ఆయన దారి లోకే మీరు వచారా ?అని అడుగుతే గిరీశం సమాధానం ”కుంచం నిలువుగా కొలవటానికి వీలు లేనపుడు తిరగేసినా కొలిస్తే నాల్గు గింజలు మిగుల్తాయ్.
03 -జాతకం బనాయించటం మోసం అంది మధురవాణి పంతులుతో .”లౌక్యం ”అణు అంటాడు .”రెంటికీ భేదం ఏమిటి ”?అని అడిగితే ”నమ్మిన చోట చేస్తే మోసం -నమ్మని చోట చేస్తే లౌక్యం ”అని తేడా తెలియజేశాడు .
04 -మీనాక్షి ప్రవర్హన మంచిది కాడుఅని పంతులు చెబితే ఆమె ”మీరు కన్తబడ్డ తరువాత ఏ ఆడ దాని ప్రవర్తన తినగా వుంటుంది “”/?అని దెబ్బతీసింది .
05 -విద్యవంటి వస్తువు లేదు నిజమే ఒక్కటి తప్ప అదేమిటి అంటే విత్తం అంటుంది డబ్బురాని విద్య దారిద్ర్య హేతువు అని జీవిత సత్యం తెలుపుతుంది .

06 –కరటకశాస్త్రి ”గిరీశం చెదిపోయాడు ”అంటాడు .దానికి మధురవాణి ”నా దగ్గరకి వచ్చినందుకు మీ భార్య మీ ఇంట్లోంచి తరమవలసింది -తనకు రోట్టా ఒహడికి ముక్కానా ”అని తిప్పికొట్టింది
-07 –కరటక శాస్త్రి శిష్యుడి అందానికి ముచ్చట పడింది మధురం ”ఈ పిల్ల దగ్గర నా బొట్లు దివిటీ ముందర దీపాలు ”అంది దానికి శాస్తి ”ఆడది మెచ్చిందే అందం ,మగాడి కన్ను మసక ”అంటాడు

08 -తనులేని కోర్టులు ,వ్యవహారాలూ లేవని చెబుతూ రామప్ప ”రామప్పంతులు పప్పులేని పులగం వుండదు ‘అంటాడు g
09 -గాడిద అందట పాటకి నేను –అందానికి మా అప్పా అని అంటుంది మధురం .
10 –మధురం పంతుల్తో ”గాడ్ది గాడిదలు తింటాయి .మనుష్యులు తినరు ”అంటే పంతులు గాడిదే అని ఎత్తి పొడుపు
11 -రామప్ప ”పంచాంగాని కేల –ఈ వెధవ పాలే తూల్లో సిద్ధాంతి ఆడింది ఆట పాడింది పాట ”అంటే ఎప్పుడు కావాంటే అప్పుడు అడ్డగోలుగా ముహూర్తాలు పెడతాడు అని .
12 -లుబ్దావదాన్లు రెండో పెళ్లి పిల్లను చేసుకోన్నాదేమోనని అనుమానం ప్రాయశ్చిత్తం చేయించుకుందామని అనుకుంటూ ”శంకరాచార్లు పాద కట్నం (పాద పూజకు డబ్బు )పెట్టమంటాడు .బ్రాహ్మలు ఇల్లు తినేస్తారు ”అంటే పూజలు ,పునస్కారాలు ,ప్రాయశ్చిత్తాల పేరుతో డబ్బు దోచేస్తారని అర్ధం .ఆనాడే కాదు ఈ నాడూ అదే స్థితి
13 -మీనాక్షి ”ఇద్దర్నీ ఒకే సీసాలో పెడ్తే దేయ్యప్పిల్లల్ని పెడతారేమో “?చమత్కారం
14 –మునసబు బైరాగితో ”గురో !బంగారం చేస్తారు కదా .అదేట్టి హరిద్దోరం (హరిద్వారం )లో మతం కట్టించక మా లాతోల్లని డబ్బెందుకు అడుగు తారు.ద్కానికి బైరాగి ”మేము చేసే స్వర్గం మేమే వాడుక చేస్తే తల పగిలి పోతుంది ”లౌక్యపు సమాధానం
15 -బైరాగి ”బ్రాహ్మల్లో కూడా మహాత్ములుంటారు ‘ఆనాటి బ్రాహ్మణీకం దిగజారుడు స్థితి .”కనుక్కోగాలిగిన జనానికి గంగానది అంతా సారాయి కదా ”ఇదే స్సారోపనిషత్
16 –నీతికి పోలీసొంని ,ఘనానికి సాతానోన్నీ అడగమన్నారు .”అంటే ఇద్దరు అబదాలే చెబుతారని అర్ధం
17 -హవల్దార్ ‘చపన్నదేశాలు చూశాను భాయ్ .పరిపరి విధాలు ఆచారాలు,వ్యవహారాలూ వున్నాయి కానీ నీతి ఒకటే ”కన్యాశుల్కం లో హవల్దార్ ఒక్కడే డబ్బుకు కక్కుర్తి పడని వాడు .
18 –మీనాక్షి ”పవిత్రం అంటే మీది నాదీ –రామప్ప ”అదేమ అలా అంటున్నావు /–మీనా”నేను వెధవ ముందనీ మీరు సరసులున్నూ ,మనకంటే మరీ పవిత్రం అయిన వారేవరుంటారు ?తాను ,పంతులు కాలు జారిన వాళ్ళమే నని నిర్మొహమాటం గా చెప్పింది ”బ్రాహ్మలం పవిత్రమైన వాళ్ళం కదా “”/అన్న రామప్పకు చెప్పిన సమాధానమే అది .
19 -అగ్నిహోత్రావధాన్లు ”చేసేవి మాఘ స్నానాలు ,దూరేవి దొమ్మరి గుదిశేలు .జటాంత స్వాధ్యాయిని నన్నుముంద లింటికి (మధురవాణి ) తీసుకుని వేల్తావషయ్యా ”
20 –పంతులు ”మరి ఎకొంపలు తిరక్క పోతే కేసులు గెలవటం ఎలా ?అది సంసారి వంటిది .”అంటే ఎన్ని ఎద్దే ,మోద్దె పనులు చేయాలో చెప్పే మాట
21 -హెడ్ ”అబద్ధం లేకుండా సాక్ష్యం కావాలంటే ఈ భూప్రపంచం మీద ఎక్కడా దొరకదు
22 -నాయుడు ”ఆ తాగుబోతు మీకెలా దొరికాడు ?”అగ్ని ”రామప్పంతులు తాగుచాడా ?”నాయుడు ”మరి –మీ కంటే ,కడియం తాగేశాడు కదా ?;”అగ్ని ”అప్పు పత్రం రాయనని మా తండ్రి చచ్చిపోఎతప్పుడు నా చేత ప్రమాణం చేయించాడు .
23 -దుకాణదారు ”డబ్బు యగేయ్యతపు యోగం న దగ్గర పారాడు రహస్యవేటి ?ఆ విద్యకు అంతా గురువులే ”–అంటే అందరు డబ్బు ఎగేసే వాళ్ళే నని .
24 -కలెక్టర్ అగ్నిహోత్రం తో ”ఆంగీరస అనావు జాతకం లో భావ వుంది బ్రాహ్మణ్యం పరువంతా తీస్తివి .బ్రాహ్మల్లో వున్న కంగాళీ మాలకూడూ మరెక్కడా లేదు .నీ దుర్మార్గం వల్ల నీ కుమార్తెకు ఈ అవస్థ వచ్చింది మళ్ళీ abduction కేసు కూడానా ?ఈ పొట్ట కరిగించేస్తాను ” —-సంపూర్ణం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -10 -11
Posted in రచనలు | Leave a comment

గురజాడ కన్యాశుల్కం ——6

                               గురజాడ కన్యాశుల్కం ——6
                        ఇంత గొప్ప నాటకం ”కన్యాశుల్కం ”రాసినా గురజాడ ను” కవి కాదు ”అన్నారు కొందరు కుహనా వాదులు .ఇప్పుడు కూడా డా ఈ మధ్యే మళ్ళీ దుమారం లేపుతున్నారట ఒకవార్తా పత్రికలో .ఎవరేమి మొరిగినా ఏనుగుకు ఏమి అవుతుంది ?ముత్యాలసరాలను ఈసడించారు .కన్యాశుల్కాన్ని నాటకమే కాదు పొమ్మన్నారు .అదొక ప్రహసనం అని తేల్చారు .ఆ భాషేమిటి ?అని దేప్పారు .ఆ పాత్ర్లేమిటి >?అని నిలదీశారు .అయినా ప్రజల అభిమానం చిన్తాకైనా తగ్గలేదు సరికదా ,దినదిన ప్రవర్ధమానం అయింది .దానితో తోక జాదించిన వారంతా తోక ముడుచుకు పారి పోయారు .అన్నిటికి ఎదురు నిల్చి నూట ఇరవైయేళ్ళు బతికింది .ఇంకా బతుకు తుంది .నిత్యనూతన నాటకం గా పేరు తెచ్చుకుంది .వన్నె ,వాసి తగ్గ లేదు .ఇప్పటికీ చదువుతూనే వున్నారు .ప్రదర్శిస్తూనే వున్నారు .ఈ నాటకం పై వచ్చినంత విమర్శ ,జరిగిన పరిశోధనా ఏ సాహిత్య మ్ప్రక్రియ మీదా రాలేదు .మొదట దూకుడు గా మాట్లాడిన వారే ,క్రమంగా దగ్గరయారు .అభిప్రాయాలు మార్చుకున్నారు .అదీ సాహిత్య సృష్టి అంటే .అంత గొప్ప సృజన అప్పారావు గారిది .ఆయన మనకు ఒక ”సుబ్రహ్మణ్య భారతి ”వంటి వాడు ,తెలుగుల ”టాగూర్ ”.తన అడుగు జాడలను ఇప్పటికీ భద్రం గా నిల్పుకున్న నూత్న పదగామి .కాని మనప్రభుత్వాలు గుడ్డివి ,మూగావి ,చేవిటివి .వారు దీని గురించి వినరు ,కానరు మూర్కొనారు .ఇంకా చైనా చూపే .సముచిత గౌరవం లేదు .చాసో అన్నట్లు ”గురజాడ ఆంధ్రుడు ,భారతీయుడు,ప్రపంచ పౌరుడు ”అందుకే” మనవాళ్ళు వుట్టివెధవాయిలోయ్” అన్నాడు గురజాడ .అది ఈనాడూ రుజువు చేస్తున్నే వున్నారు మన” చెవలాయిలు ”భమిడి పాటి వారి భాషలో .శ్రీ కేతవరపు రామకోటి శాస్త్రి 1931 లో ”కన్యాశుల్కం నాటకమే కాదు .గురజాడ సరిగ్గా నిర్వహించ లేదు .”అన్నాడు .ఆ తర్వాత గిరీశం లాగా opinyans chenge చేసుకున్నాడు .1992  ఆగస్ట్ 13  తన కొత్త అభిప్రాయాలతో ఒక పుస్తకం రాసి ప్రచురించాలని సంకల్పించారు .అయితే 1991  అక్టోబర్ 28  న రోడ్ ప్రమాదం లో మరణిచారు .ఆయన కుమార్తె ,డాక్టర్ కాత్యాయినీ విద్మహే ఆ పుస్తకాన్ని ప్రచురించారు .గిరీశం నెపోలియన్ లా ఆన్తినాచ్ ఉద్యమానికి ప్రతినిధి అని కితాబు ఇచ్చారు .ఆ పుస్తకం అందరు చదువ తగిన పుస్తకం .లోతైన పరిశీలన .లోగడ తాను ఎక్కడెక్కడ భ్రమ ,ప్రమాదాలకు లోనైన్డీ తెలుపుతూ ,దాన్ని చక్కగా సంతృప్తికరంగా సరిదిద్దుకున్నారు .వసంతసేన కన్న మధురవాణి గొప్పదని మెచ్చారు .కారణం మహిళాభ్యుదయానికి ఆమె చేయూత నీయతమే నంటారు .ఆమె అప్పారావు గారి ”సృజన ప్రతిభ ”గా అభివర్ణించారు వేశ్యల్ని బహిష్కరించాలి అని వీరేశలింగం గారు అంటే వారిని సంస్కరించాలి అని గురజాడ అన్నారు .ఇష్టా నిష్టాలతో ప్రమేయం లేకుండా విధవా వివాహాలు చేయాలని వీరేశలింగం అంటే వాళ్ల చైతన్య స్థాయిని పెంచాలని అప్పా రావు భావించారు .”బ్రాహ్మణులలో కూడా మహాత్ములుంటారు ”అనే దానిని వివరిస్తూ ”ఆ నాటి సమాజం నిండా  వున్నదిబ్రాహ్మనేతరులు  సమాజాన్ని నడిపిస్తున్నది బ్రాహ్మణులు .నైతికం గా పతనమైన బ్రాహ్మణులు నడిపిస్తున్న సమాజాన్ని సంస్కరించటం అంటే బ్రాహ్మల నైతిక పతనాన్ని సంఘం ముందు ప్రదర్శించటమే ”అంటారు .ఈ పనిని అప్పా రావు గారు గొప్పగా ,ప్రతిభావంతంగా చూపారు .అందుకే అది నాటికీ నేటికీ అపూర్వ సృష్టి అయింది .ఆదర్శం అయింది ,ఆదరమూ అయింది .
                   ప్రఖ్యాత విమర్శకులు కే.వి.రమణా రెడ్డి ”నిర్దిష్టమైన ఒకానొక జీవిత పార్శ్వాన్ని సాకల్యం గా ,గాదం గా చిత్రించడం వలెనే ఈ నాటకానికి సర్వకాలీనత సిద్ధించింది ”అని మహత్తరమైన ఆవిష్కరణ చేశారు .అవును కన్యాశుల్కం స్థానే ”కన్యే శుల్కం ”అనే భావం రావాలని ,ఆశించారు గురజాడ .ఆడురాచారం నేడు ”వరకట్నం ”గా మారింది .అయినా స్త్రీ బాధ తప్ప లేదు .”వరుడే కట్నం ‘అనే భావన బలపడి ఆ వైపు యువత నడిస్తే మహిళాభ్యుదయం జరగటానికి ఆస్కారం అవుతుంది .ఆ మహాకవి ఆత్మ శాంతిస్తుంది ”     ‘.
       దేవుదేచాతో దాగే నంటూ –కొండ కోణాల వెతుకు లాడే వేలా ?–కన్ను తెరచిన కనబడదో ?—మనిషిమాత్రుని యందు లేడో ?? అంటాడు గురజాడ ఇంతకంటే మానవుని ఉత్కృష్ట స్థితిని గురించి ఏ వామ పార్టీ చెప్పింది ?అలాగీ ఆయన రాసిన ”దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా -దేశమంటే మట్టికాదోయ్ -దేశమంటే మనుషులోయ్ ”–అన్న ప్రబోధ గీతం నిజం గా ”విశ్వ గీతమే ”దీనికి సాటి ఇంకేదీ లేదు .జనతాజనార్దానుడిని చూడమని హెచ్చరించాడు .మనిషికోసం ,మానవత్వం కోసం ,ప్రపంచ పౌరసత్వం కోసం తపన పడ్డా ఆ మహా మనీషి కి ఆంద్ర దేశం ఎంతో రుణ పది వుంది .ఆ ఋణం తీరిస్తే తీరేది కాదు .ఆచరించి ఋణం తీర్చుకోవాలి
                      ”నరుల నోళ్లను నలిగి వుండిన –నానేమైన పదాల లోపల –ఆడుచుండును ప్రకృతి యంతా యని —అందరికి తెలిపితివి గదరా “‘అని ప్రస్తుతించారు స్వాతంత్రోజ్యమ కవి గరిమెళ్ళ సత్యనారాయణ .నవయుగ వైతాలుడైన గురజాడ స్ఫూర్తి మనలో నిత్యం జాగ్రుతమవాలి .
                 గురజాడ పూర్వీకులు కృష్ణా జిల్లా వుయ్యురుకు దగ్గరలో వున్న గురజాడ గ్రామం లో వుండే వారట .ఆయన పూర్వీకుడైన పట్టాభిరామయ్య 200  ఏళ్ళ క్రితమే వేరొక శాఖకు చెందిన స్త్రీని వివాహం ఆడారట .అప్పారావు గారు తన తల్లికి ఏడవనేలలో జన్మించారట .అందుకే ల్పాయుష్కులయారట.ఆయాసం కూడా దాని ఫలితం గా వచ్చిందట .గురజాడ నుండి ఆకుటుంబం మచిలీపట్నానికి ,ఆ తర్వాత విజయనగారానికీ వలస పోయారట .అప్పారావు గారు ”రీస్ అండ్ రయ్యత్ ”అనే పత్రిక లో ఎబ్గ్లిష్ లో వ్యాసాలు రాసే వాడు .ఆ పత్రికా సంపాదకుడు శంభు చంద్ర ముఖర్జీ సలహాతో తెలుగులో రచన ప్రారంభించాడు .గురజాడ లో ఒక స్రష్ట ,ద్రష్ట వునాడు .కన్యాశుల్కం ”మహోత్కృష్ట గ్రంధం ””(క్లాసిక్ ),మాత్రమే కాదు ”ఆధునిక ఇతిహాసం  (ఎపిక్ ).అది ఒక అక్షర తూణీరం .తరగని పంట .In between lines ”చాలా వుంది అన్నాడు పత్రికా సంపాదకుడు కవి ,రచయిత నవలా కారుడు ,విమర్శకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ .”ఆంద్ర దేశానికి మహోదయం తెచ్చిన వేగు చుక్క గురజాడ ”అన్నారు ప్రసిద్ధ హాస్యరచయిత హాస్యబ్రహ్మ భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు ..”మానవుడు మహ్హకవి అయినపుడు అతీంద్రియ జ్ఞానం తో పని చేస్తాడు .అప్పుడతని వాక్కు ఆదిమధ్యాంత రహితం అవుతుంది ”అంటాడు శ్రీ శ్రీ కన్యాశుల్కాన్ని గురించి .Though art is my maaster ,I have a duty to society ”అని బాధ్యత గుర్తెరిగి అలానే ప్రయాణించిన మార్గ దర్శి గురజాడ .”లోన్గాదీయలేని అలెక్షాన్దెర్ గుర్రం -కన్యాశుల్కం ”అంటాడు ప్రఖ్యాత నటుడు ,ప్రయోక్త ,కన్యాశుల్కం లో గిరీశం పాత్రధారి శ్రీ జే.వి .రమణమూర్తి . .
                  ”Gurajada was a genius.He produced a very great drama that caught the imaaginations of English educated youth of his times and it came to stay .He heralded a new era in telugu literature .The era of colloquilism ”అని కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ కూడా మనసారా మెచ్చిన మహాకవి గురజాడ .
                       దీని తర్వాత కన్యాశుల్కం లోని జనం నోట నానిన” oft quoted lines ” మీ ముందుంచుతాను .అందుకని ఇప్పటికి ఇంకా సశేషమే
                                         మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ -24 -10 -1
Posted in రచనలు | Leave a comment