శ్రీ గణేష్ చతుర్ధి —గణేష్ శ్రీ కృష్ణ

శ్రీ గణేష్ చతుర్ధి —గణేష్ శ్రీ కృష్ణ
         శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారమే శ్రీ గణపతి .”గ”అంటే జ్ఞానం  . ”ణ ” అంటే నిర్వాణం .”ఈశ” అంటే స్వామి .అంటే గణేశుడు జ్ఞాన ,నిర్వానాలకు స్వామి అని ardham .”హీరంభుడు ”అని కూడా ఆయనకు పేరు .అంటే ”వో !దీన రక్షకా “‘అని భావం .”ఏకదంతుడు ”అంటే సర్వ ఉత్కృష్ట బలశాలి .ఆయన చెవులు చేటలు   .అంటే చెడును చెరిగి వేస్తాయి .మంచిని మాత్రమే నిలుపుతాయి .విఘ్నాలను తొలగించి మనల్ని పరిశుద్ధులను చేస్తాడు అందుకే శూర్ప కర్ణుడు అని పేరు .అన్ని చెడు పనులకు నాలుక మూలం .అది బైట వుంటే ఇతరుల దోషాలను ఎంచు తాము  .మనసు అనే జిహ్వాగ్రాన్ని మనవైపే తిప్పి ఉంచితే ,అంటే మన దోషాలను మనం తెలుసుకొంటే ,ముక్తి లభిస్తుంది అని పెద్దలంటారు .అందుకేగజాననుని   జిహ్వాగ్రం కంఠం వైపుకు వుంది ,మనకు మార్గ దర్శనం గా కన్పిస్తుంది .
            శ్రీ కృష్ణుడు ,గణేశుడు వేరు కాదు .అభిన్నులు .ఏక స్వభావులు .గణేశుడు పరశురాముడిని తన తుండం చేత బంధించి సర్వ బ్రహ్మాండ దర్శనం ,గోలోకం లో శ్రీ కృష్ణ పరమాత్మ దర్శనం చేయించితరింప జేశాడు   అని బ్రహ్మ వైవశ్వత పురాణం లో గణేశ ఖండం లో వుంది .నిర్గుణ ,సద్గుణ బ్రహ్మాలకు అధిపతి కనుక ”గణాధిపతి ”అన్నారు .
          ”ఓం నమస్తే గణపతయే ,త్వమేవ కేవలం కర్తాసి ,త్వమేవ కేవలం హర్తాసి ,త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి ”అని గణపతి అధర్వ శీర్ష కృతి తెలియ జేస్తోంది .
                శ్రీ కృష్ణ ,శ్రీ గణేష్ లకు సంబంధించిన ఒక కధను గురించి తెలుసు కొందాం .ధర్మధ్వజుని కుమార్తె తులసి .ఆమె శ్రీమన్నారయనుడిని వివాహం చేసుకోవాలని భావిస్తుంది .ఒక రోజూ గణపతి కనిపిస్తే ”నువ్వు శ్రీ కృష్ణుని అవతారమే కదా నన్ను పెళ్లి చేసుకో ”అని వేడుకొంది .ఆయన ”వివాహం బంధ కారణం –నాకు ఆ కోరికే లేదు ”అని స్పష్టం గా చెప్పాడు .అప్పుడు తులసికి కోపం వచ్చి ”వివాహం వద్దు అంటున్న నీకు తప్పక వివాహం అవుతుంది ”అని శపించింది .గణపతికి కూడా కోపం వచ్చి ”అనవసరం గా నన్ను శపించావు కనుక రాక్షస భార్యవై జన్మిస్తావు .తర్వాత వృక్ష రూపం పొందుతావు ”అని ప్రతిశాపం ఇచ్చాడు .ఆమెకు పశ్చాత్తాపం కలిగి గానేషుని ప్రార్ధిస్తే ,”వృక్ష రూపం పొందినా ,లోకారాధ్యురాలవు అవుతావు .శ్రీ నారాయనార్ప దివ్య కుసుమం నువ్వు .నీ దళాలతో చేసిన పూజ ప్రజలకు ముక్తిని ప్రసాదిస్తుంది ”అని శాప విమోచన కల్గించాడు .
              ఆ తర్వాత జన్మలో తులసి శంఖచూడుడు అనే రాక్షసుని భార్య అయింది .శంఖ చూదుని ఆగడాలు భరించ లేక శివుడు అతన్ని త్రిశూలం తో సంహరించాడు .తన కలాంశ తో   ఆమె తులసి వృక్ష రూపం పొంది అందరి ముక్తికీ కారకురాలు అయింది .అందుకే తులసి దళం తన పూజకు పనికి రాదనీ గణపతే చెప్పుకొన్నాడు .a వినాయక చవితి నాడు గనేశుని  పూజకు తులసి దళాలు నిషిద్ధమయాయి .శ్రీ కృష్ణ గణేశులు  అభిన్నులై లోకారాధ్యులైనారు .ఇప్పుడు శ్రీ కృష్ణ పరబ్రహ్మ తత్త్వం గురించి తెలుసు కొందాం .
             గోలోకంమండలా కారం   గా వుంటుంది .ప్రళయ సమయం లో శ్రీ కృష్ణుడు మాత్రమే శేషించి ఉంటాడు .మురళి ధరించి ,శ్రీ వత్చాన్కిట వక్షస్థలం పై కౌస్తుభం తో ప్రకాశిస్తూంటాడు .ఆయనే పరబ్రహ్మ .,పురుషోత్తముడు .ఎప్పుడూ ”కిషోర ”వయసు లోనే ఉంటాడు .గోపా వేష ధారియై ,గోపీ జనం తో పరివేష్టించి ఉంటాడు .పరిపూర్ణుడై ,సర్వ వ్యాపియై ప్రవర్తిస్తాడు .”సదారాసా మండల  విహారి ”.సర్వ సిద్ధి స్వరూపుడు .సర్వ సిద్ధి ప్రదాత .ఆదిపురుషుడు ,అవ్యక్తుడు .
            శ్రీ కృష్ణుని దక్షిణ పార్శ్వం నుంచి సత్వ రాజస్ ,తమోగుణాలు ,వాటి నుంచి మహస్సు ,అహంకారం ,పంచ భూతాలూ ,పంచ జ్ఞానాలు ఏర్పడ్డాయి .తరువాత నారాయణుడు జన్మించాడు .ఆయన భార్య లక్ష్మి దేవి .వామ పార్శ్వం నుంచి ”సదాశివుడు ”జన్మించాడు .పంచ ముఖాలు కలిగి దిశలే వస్త్రాలుగా ,సకల సిద్దేశ్వరునిగా,గురువులకే గురువు గా ఆయన ప్రవర్దిల్లాడు .ఆయన మృత్యుంజయుడు ,మృత్యు స్వరూపుడు కూడా .శ్రీ కృష్ణ నాభి కమలం నుంచి మహా తపస్వి బ్రహ్మ ప్రభావించాడు .చతుర్ముఖాలతో ,కమండల ,జపమాలతో ,ప్రకాశించాడు .దేహధారులకు జన్మ దాత .సరస్వతీ వల్లభుదయాడు .శ్రీ కృష్ణ వక్షస్థలం నుంచి ”ధర్మ దేవత ”పుట్టాడు  .సర్వజీవులపై సమభావం కలవాడు .ధర్మ దేవుని వామ భాగం నుంచి ”మూర్తి ”అనే స్త్రీ జన్మించి యముని భార్య అయింది .శ్రీ కృష్ణుని ముఖం నుంచి వీణా పుస్తక దారిని ,షోడశ వర్ష కన్య సరస్వతి” జన్మించింది .శ్రీకృష్ణుని మనసు   నుంచి ”శ్రీ మహాలక్ష్మి ‘,బుద్ధి నుంచి మూల ప్రకృతి ”ఈశ్వరి ”జన్మించారు .ఈశ్వరి ఏ సర్వ  శక్తులకు మూలం .వేయి భుజాలతో ,భయంకరం గా దుర్గతి నాశిని ”దుర్గ ”భాసించింది .శ్రీ కృష్ణుని శక్తి స్వరూపమే దుర్గ .శ్రీ కృష్ణుని జిహ్వాగ్రం నుంచి వేదమాత ”సావిత్రి ” ఉద్భవించింది .కృష్ణుని మనసున్నుంచి సమస్త ప్రాణులను మధించే మన్మధుడు ,అతని వామ భాగం నుంచి ”రతీదేవి ”జన్మించి భార్య అయింది  .
          శ్రీ కృష్ణ వీర్యం జలం లో పడి సహస్ర దైవ సంవత్చరాల తర్వాత గొప్ప  అండం గా మారి ”విరాత్పురుషుడు ”జన్మించాడు .విశ్వానికి ఆయనే ఆధారం .చేవులనుండి మధుకైటభులు జన్మించి ,బ్రహ్మను మింగేయాలని ప్రయత్నిస్తే నారాయణుడు చక్రాయుధం తో సంహరించాడు .వాళ్ల కొవ్వు నుంచి ఈ పృథ్వి ఉత్పన్నమైంది అందుకే భూమికి ”మేదిని ”అని పేరు వచ్చింది .భూమి యొక్క అధిష్టాత్రి దేవి పేరు ”వసుంధర ”.శ్రీ కృష్ణ వామ భాగం నుంచి ,”రాధ ”జన్మించింది .ఆమె కూడా సదా ”కిషోర ”వయస్క .ఆమె రోమాలనుండిగోపికలు    ,శ్రీ కృష్ణరోమాలనుంచి   ”గోపాలురు ”జన్మించారు .వీరు రాదా క్రిష్ణులకు ”పార్శ్ర్శ్వదులు  ”.వీరు రాధను ,కృష్ణుని పోలి వుంటారు .నిత్య యవ్వనులు .రాదా కృష్ణులు ప్రేమైక జీవులు .
       శ్రీ కృష్ణ గుహ్య ప్రదేశం నుంచి కుబేరుడు ,భూత ప్రేత ,పిశాచాదులు ,కుడి కంటి నుంచి ప్రమద   గణాలు ,ఎడమ కంటి నుంచి ”ఈశానుడు ”పుట్టారు .బ్రహ్మ దేవుడు శ్రీ క్రిష్ణానుగ్రహం తో విశ్వ సృష్టి చేశాడు .బ్రహ్మ నాభి నుంచి ”విశ్వకర్మ ”అష్టవసువులు ,,మనసు నుంచి సనకస ,సనందన ,సనాతన సంత్కుమారులు ,ముఖం నుంచి ”స్వయంభు మనువు ”,లలాటం నుంచి ఏకాదశ రుద్రులు ,ప్రభవించారు .అనావృస్టి చివర ”నారదుడు ”పుట్టాడు .పుట్టగానే నీరు ను లోకానికి ఇచ్చాడు కనుక నారదుడు అని పిలువ బడ్డాడు .నారం అంటే నీరు ,జ్ఞానం అని అర్ధాలు .రెండూ ,ఆయనకు వర్తిస్తాయి .బ్రహ్మ కంఠం నుంచి పుట్టిన వారే ”నరదులు ”అంటే నరులు ..ఇలా శ్రీ కృష్ణ పరబ్రహ్మ తన నుంచి అఖిల ప్రపంచాన్ని సృష్టించి ,పరిపాలించి ,తన లోనే లయం చేస్తాడు అని ”బ్రహ్మ వైవర్త పురాణం –శ్రీ కృష్ణ ఖండం ”లో చెప్పబడింది .కృష్ణ అంటే ”సర్వ చరాచర కొటులలో ఆత్మ అయిన వాడు ”అనీ ,ఆదివాచకం అనీ అర్ధం .అంటే సర్వులకు ఆయనే ఆది పురుషుడు .
                     శ్రీ కృష్ణ ,శ్రీ గణేశ జయంతులు ఒక్క రోజూ తేడాతో దాదాపు ఒకే నెలలో వచ్చినట్లే .సెప్టెంబర్ ఒకటి వినాయక చవితి కనుక .ఆ మహానుభావులను స్మరించి ,అర్చించి జన్మ సాఫల్యం చేసుకొందాం .సిద్ధి ,బుద్ధులను ప్రసాదించే వాడు గనాదీశుడైతే ”శరశ్చంద్ర   ప్రభువు ”అయిన శ్రీ కృష్ణుడు భారత భూమి పై అవతరించి ,ధర్మ సంస్థాపన చేసి ,గీతామృతాన్ని పంచి ,భక్తీ జ్ఞాన ,వైరాగ్యాలను తేటతెల్లం చేసి ,ప్రేమను కురిపించి ,అందరి హృదయాలను ఆకర్షించి ,స్మరణ మాత్రం గా ముక్తి ప్రదాత అయాడు .అందుకే స్వామి త్యాగీశానంద ,ఆ మహానుభావుడిని ,పురాణ పురుషుడిని పూర్ణావతార స్వరూపుడిని ”The first teacher in the historry of the world to discover and proclaim the grand truth of love for love’s sake and duty for duty sake ”.”అంటే ప్రేమ ప్రేమ కొరకు ,విధి కర్తవ్య నిర్వహణకు అనే సత్యాన్ని ప్రపంచ చరిత్ర లో మొదట గ్రహించి ,ప్రకటించిన ప్రధమ ఆచార్యుడు శ్రీ కృష్ణుడు ”అని చాటి చెప్పిన దేశికుడు .అందుకే ”కృష్ణం వందే జగద్గురుం ”.
           వినాయక చవితి శుభాకాంక్షలను   సాహితీ బంధువులందరికీ తెలియ జేస్తూ సెలవ్ .
            మీ గబ్బిట దుర్గా ప్రసాద్ .—31 -08 -11
Posted in సమయం - సందర్భం | Leave a comment

దివిసీమ గాంధి – మండలి రాజ గోపాల రావు

మహాత్మా గాంధి కృష్ణా జిల్లా దివి తాలుకా 1930 ప్రాంతం   లో పర్యటించినపుడు అక్కడి ప్రజలు బ్రహ్మ రధం పట్టి అరవై ఎడ్ల బండీలతో వూరేగించారుం . ఆ దృశ్యాన్ని తన తొమ్మిది ఏళ్ళ వయసు లో చూచే మహద్భాగ్యం తనకు కలిగింది అని ఉప్పొంగి పోయారు ఈ రోజూ అంటే ఆగస్ట్ ముప్ఫై వ తేదీన 91 వ సంవత్చరం లోకి ప్రవేశించిన శ్రీ మండలి రాజా గోపాల రావు గారు .వారితో నాకు పదేళ్ళ క్రితం పరిచయం అయింది .ఆ కాలమ్ లో శ్రీ సింహాద్రి వెంకటేశ్వర రావు గారు ”దివి సాహితీ మిత్రులు ”అనే సాహితీ సంస్థను స్థాపించి

ప్రతినెల ఒక సాహితీ సభ ను అవనిగడ్డ లో  నిర్వహిస్తుండే వారు

ఆడియో – ౧

. ఒకసారి ఏదో సభలో నా ప్రసంగం విని వారు నన్ను వారి సభలో ప్రసంగించమని కోరారు .ఆ సభలో మొదటి సారి శ్రోత గా విచ్చేశారు .రాజా గోపాల రావు గారు .ఆ సభలో నేను శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి కధ లను గురించి మాట్లాడిన గుర్తు .వారు చా

లా ఆనంద పడ్డారు .నన్ను అభినందించారు .ఆ తర్వాత నేను ఇంకో ఆరు సభల్లో అవనిగడ్డ    లో మాట్లాడాను . వారు దాదాపు అన్నిటికి వచ్చినన్ను  అభినందిస్తూ ఒక మాట అన్నారు ”మాస్టారు .మీరు మాట్లాడితేనే ఇక్కడి సభలకు వస్తున్నాను .మిగిలిన వాటికి నాకెందుకో వెళ్లాలని పించదు ”అని నన్ను ఆప్యాయం గా ,ఆత్మీయునిగా భావించి చెప్పారు .అప్పుడే వారి గురించి పూర్తిగా తెలుసు కొన్నాను .వారు రాసిన పుస్తకం ఒకటి నాకు ఇచ్చారు .అది చదివి నా భావం వారికి లేఖ లో రాశాను

ఆదియి -౨

.దానికి వారు సహృదయతతో తరచూ ఫోన్ లో సంభాషించే వారు ..ఈ మధ్య ఆరేడు సంవత్చారాలుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి పలకరింపులు లేవు .ఈ మధ్య నేను బెంగుళూర్ లో వున్నపుడు వారు ఇంటికి మా అబ్బాయి రమణ కు ఫోన్ చేసి నన్ను గురించి వివరాలు తెలుసుకోన్నారట .నేను ఉయ్యూరు వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు .తనకు తొంభై వెళ్లి ఈ నెల ముప్ఫై వ తేదీకి తొంభై ఒకటి వస్తుందని నన్ను చూడాలని తనకు వుందని ,కాని వయోభారం వల్ల రాలేక పోతున్నానని కాని ఎప్పుడో ఒకప్పుడు తప్పక వచ్చినన్ను  చూసి వెళ్తానని మొన్న అన్నారు 

 

ఆడియో -౩        .అప్పుడు నేను వారితో నేనే వారింటికి పులిగడ్డకు వారి జన్మ దినోత్చావం నాడు వచ్చి హాప్పీ బర్త్ డే చెప్పి వారి ఆశీస్సులు తీసుకొని వారి తో ముఖాముఖి మాట్లాడుతానని చెప్పాను .అన్న మాట ప్రకారం ఇవాళ ఉదయం పులిగడ్డ వెళ్లి వారి ఇంటిలో వారిని దర్శించాను .పదేళ్ళ క్రితం ఎలా వున్నారో ఇప్పుడు అలాగే అదే ఆరోగ్యం తో వున్నట్లు కనిపించారు .దంపతులిద్దరూ ఎంతో ఆత్మీయం గా

ఆదరించి ,స్వీటు హాట్ ,పళ్ళు  టీ ఇచ్చి తమ అతిధి మర్యాదను చూపించారు .

తన జీవితం గురించి చెప్పమని నేను అడిగాను .తాను పులిగడ్డ లోనే జన్మించానని ,తాము కాపు కులస్తులమని తమ కుటుంబానికి తాతల తరం లో మూడు వేల ఎకరాల సుక్షేత్రమైన పొలం ఉండేదని ,అయితె దివి సీమలో కాలువలు సాగు కోసం త్ర్వ్వినప్పుడు దాదాపు పొలాలన్నీ దానిలో పోయాయని ముంపుకు గురి అయి కొంత నష్టం జరిగిందని ,తండ్రుల కాలమ్ లో దాదాపు ఏమీ మిగల లేదని .తమ తరం లో అనుభవించటానికి అసలు సెంటు భూమి కూడా లేదని శిస్తు కట్టే పరిస్థితి లేదని నవ్వుతు చెప్పారు .పిత్రార్జితం అయిన స్థలం లో ఒక  రేకుల షెడ్డు వేసుకొని వారు వుంటున్నారుయెనభైఒక యేళ్ళున్న భార్య గారితో .ఆనాడు బస్తా ఓడలు రెండు రూపాయలే నని కాని శిస్తు మాత్రం ఎనిమిది నుంచి పడి రూపాయలున్దేదని శిస్తు కట్టటానికి మూడు లేక నాలుగు బస్తాలు అమ్మితే కాని కట్ట లేక పోఎవారమని ,కట్టక పొతే బ్రిటిష్ ప్రభుత్వం జప్తులు చేసేదని దాంతో కూడా పొలాలు అన్నీ హారతి కర్పూరం అ

యాయని ఆవేదన తో చెప్పారు .

.తన తొమ్మిదవ ఏట గాంధీజీ ని చూసే భాగ్యం కలిగిందని ,ఆ ప్రభావం తన మీద బాగా వుందని అప్పటినుంచి ఖద్దరు కడుతూనే వున్నానని చెప్పారు .గ్గోసి పోసి ఖద్దరు పంచ,ఖద్దరు లాల్చి ,పైన అంచు ఖద్దరు ఖండువా ఇదీ వారి వస్త్ర ధారణ .అంతా తెల్లని తెలుపే .మీసం .జుట్టు తెలుపు .వారి మాట స్వచ్చమైనది ,మనసు స్వచ్చం ,వేశం స్వచ్చం ,హృదయం స్వచ్చం .నుదుట యెర్రని కుంకుమ బొట్టు .వారిని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించ బుద్ధి కలుగుతుంది .ఆ కళ్ళల్లో కాంతి ,వెలుగు,చిరునవ్వు మనకు వారిపై గౌరవభావం ఏర్పడుతుంది .సాకా హారమే తన ఆరోగ్య రహస్యం అన్నారు .గాంధీజీ చెప్పినట్లు తనకు ”సత్యమేవ జయతే ”అనేదే మంత్రమని ,తన బలం సత్యమేనని ,సత్యానికి మించింది లేదని ,తాను ఎప్పుడు అసత్యం చెప్పలేదని ,లేని దానికోసం ఆరాటం లేదని ,ఉన్నదానితో సంతృప్తి పొందటమే తన జీవితం అ

ని చెప్పారు .

మత్రికులతిఒన్ మాత్రమే పాస్స్ అయిన గోపాల రావు గారు ఆంగ్లం లో మంచి ప్రవేశం పొందారు .చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతారు ,రాస్తారు .తుతిఒన్ చెప్పి జీవితం కొంత కాలమ్ గడిపారు .తరువాత రెవిన్యూ లో ఉద్యోగం పొందారు .అందులో రెండు ప్రోమోశాన్లు పొంది అవనిగడ్డ లోనలభై ఏళ్ళ క్రితం  రిటైర్ అయారు .క్విట్ ఇండియా ఉద్యమం లో తాను పాల్గోన్నాని తన అనుభవాన్ని తెలిపారు .అవని గడ్డ లో రెవిన్యూ కార్యాలయం ముందు ఆ నాటి ఇంగ్లీష్ రెవిన్యూ ఆఫీసర్ ఎదుట త్రివర్ణ పతాకం చేతబట్టి ”If you do not quit India ,I will crush you ”అని  బిగ్గరగా అరిచానని ,అందరు తన్ను ఆశ్చర్యం తో చూశారని ,తనను అర్రెస్ట్ చేయిస్తానని దొర ఆదేశం జారీ చేస్తుంటే,తన వాళ్ళు తన్ను బలవంతం గా ఇంటికి తీసుకొని వెళ్లారట .అయితె ఏ క్షణం

లోనైనా అర్రెస్ట్ వారంట్ జారీ చేసే ఆవ కాశం వుందని తన తండ్రి ,కుటుంబం చెప్పగా తాను అజ్ఞాతం లో కి వెళ్లానని ,అలా ఒక సంవత్చరం under ground   లో ఉన్నాననీ ,చెప్పారు . అయితె వూరు వదిలి వెళ్లలేదని పొలాల్లో వున్న ఇళ్ళలో వుంటూ స్థానాలు మారుస్తూ ఎవ్వరికీ కనపడ కుండా గడిపానని .పాలేళ్ళు తాను ఎక్కడ వున్నానో
తెలుసుకొని భోజనాన్ని రహస్యం గా తెచ్చే వారని అన్నారు .

స్వాతంత్ర్యం పొందిన తర్వాత తనకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర సమర యోధులకు ఇచ్చే పెన్షన్ మంజూరు చేశారని ,అదే తనకు ఆధారం అనీ అన్నారు .రెవిన్యూ లో పనిచేస్తూ ఆస్తి కూడ పెట్టుకోని ఆదర్శ ఉద్యోగి గోపాల రావు గారు . ధర్మమే మార్గం గా ,అహింసే పరమావధిగా ,షోచమే విధిగా ,జీవితాన్ని పండించు కొంటున్నారు .

ఎక్కడ కాంగ్రెస్ సభలు జరిగినా తాను వెల్లెవాడినని ,దాదాపు ఎక్కువ భాగం న

డిచే వెల్లెవాడినని ,సామాన్య జీవితమే తనకు ఇస్తామని చెప్పారు .అవనిగడ్డలో చిరువోలు రాదా కృష్ణ మూర్తి గారు అనే బ్రాహ్మణుడు ఖద్దరు దుకాణం నడుపుతూందే వారనీ ,వారే తనకు ఆదర్శమని ,ఆయన గురువు అనీ ,ఆయన షాప్ లొం అందరు కలిసి దేశ విషయాలు చర్చిన్చుకోనీ వారమని సభలకు ఏర్పాట్లు తామే చేశే వారమని అన్నారు .ప్రకాశం ,పట్టాభి ,కాకాని ,బ్రహ్మయ్య లతో చాలా గొప్ప పరిచయాలుండే వని ,తాను ఎప్పుడు కార్య కర్తగానే వున్నానని చెప్పారు .చంద్ర రాజేశ్వర రావు ,సనకా బుచ్చి కోటయ్య ,సుం దరయ్య లతో పరిచయం వుందని ఇక్కడ అన్ని భావాల వారు వృద్ధి చెందారని తెలిపారు .

దేశం లో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరుగు తోంది కదా మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితె అవినీతి వెళ్ళు పాతుకొని పోయిందనీ ,దాన్ని రూపు మాపటం ఎవరి వల్ల కాదని

అంతగా దేశం భ్రస్టు పట్టి పోయిందని ఆవేదన చెందారు .యే ఆదర్శం తో స్వాతంత్ర్యాన్ని పొందామో దానికి వ్యతిరేకం గా జరుగుతూన్డటం బాధాకరమని బాధ పడ్డారు .ఆదర్శం అనేది లేక పోవటం జాతికి పట్టిన పట్టిన చీడ అన్నారు .దాన్ని పొందక పొతే జాతికి భవిష్యత్తు లేదు అని గట్టిగా చెప్పారు .యువకులకు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా అని అడుగగా ,యువశక్తిని తక్కువ అంచనా వెయ రాదనీ ,దాన్ని వ్యవస్తీకరిస్తే దేశానికి బలం జీవంకలుగు తాయి   అన్నారు .అవినీతి లేని సమాజం ఏర్పడటానికి అందరు సహకరించాలన్నారు .ఆ రోజూ కోసం తానూ ఎదురు చూస్తున్నాను అని చెప్పారు .

 

 

తన భార్య తనకు ద్బందువే నని తనకు జీవిత భాగ స్వామి అవటం తాను చేసు కొన్న పుణ్యమేనని ఆనందం గా చెప్పారు .ఆమెను ”ఏమండీ !గోపాల రావు గారు ఆదర్శం ,ఆదర్శం అంటూ ఏమీ పెద్దగా సంపాదించలేదు ,మంచి ఇల్లు కట్టలేదు ,రేకుల షెడ్ లో కాపురం ఇంట్లో ఆదినికమైన వసతులు లేవు .మీకు బాధ గా లేదా ?”అని నేను అడిగితె ఆ దొడ్డ ఇల్లాలు ”నాకు వారి మీద ఏమీ కోపం లేదు .వారు యెంత సంపాదిస్తే దానితోనే జీవితాన్ని గడపటం నేర్చుకోన్నాం .పిల్లలందరికీ మంచి చదువులే చెప్పించాము .అందరు చక్కగా అభివృద్ధి చెందారు .ఇదంతా మా వారి మంచితనం వల్లనే .మాకు అతిగా కోరికలు లేక పోవటమే మా ఆఅనన్దానికి కారణం ”అని స్పష్టం గా చెప్పారు .”మీరు గోపాల రావు గారి భార్య గా గర్వ పడుతున్నారా ,సంతృప్తి తో వున్నారా ?”అని అడిగితె తాను పూర్తి సంతృప్తి తో వున్నానని ,అది లేదు ఇది లేదు అనే ఆరాటం తమ కుటుంబం లో లేదని ఇప్పటికి గోపాలరావు గారి తమ్ముడి కుటుంబం ,తమ పిల్లలు అందరు గోపాల రావు గారి కుటుంబం గానే ప్రవర్తిస్తున్నామని గోపాల రావు గారి మాటే అందరికి శిరో దార్యం గా భావించటం తమ పిల్లల గొప్పతనం అనీ అ

న్నారు .ఉమ్మడి కుటుంబ భావన తమ బలం అన్నారు .

ఆ ఆదర్శ దంపతులకు శుభాకాంక్షలు అందజేసి ముకుళిత హస్తాలతో నమస్సు లందించి ,వారి వద్ద శెలవు తీసుకొని వారికి ”మా అక్కయ్య -అనురాగ కవితా సంపుటిని ”అందజేసి ,ఇంటికి బయల్దేరాను .మా కుటుంబం కల కాలమ్ సుఖ సంతోషాలతో

వర్ధిల్లాలని ఆ వృద్ధ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా శీర్వదించి నాకు వీడ్కోలు చెప్పారు .ఈ

అనుభవం నాకు చిరస్మరణీయం గా వుంది .

 

 

Posted in సమయం - సందర్భం | 1 Comment

మా అక్కయ్య కవిత సంపుటి – ఆవిష్కరణ – వార్త పత్రికలలో

News Maa Akkaiah

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మా అక్కయ్య 28.08.2011 పుస్తకావిష్కరణ -సమీక్ష

మా అక్కయ్య అనురాగ కవితా సంపుటి ఆవిష్కరణ సభ
ఆడియో

—  ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఆదివారం సాయం సంధ్య వేల ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో సరసభారతి ఇరవైఎనిమిదవ సమావేశం లో వందమంది సాహిత్యాభిమానులు ,రచయితలు ,కవులు ,వివిధ పత్రికల అధినేతలు ,హాజరై సభకు నిండుదనం తెచ్చారు .ఆహ్వానించిన అతిధులంతా సమయానికి విచ్చేసి సహకరించారు .వేదిక మీదకు అతిధులను నేను ఆహ్వానించగా ,సరసభారతి సభ్యులు వారిని ఫలాలతో సత్కరించి వేదిక పై ఆసీనులఎట్లు చేశారు .రెండు చారిత్రిక సంఘటనల మధ్య ఈ సమావేశం జరుగుతోందని ఆహ్వానం పలుకుతూ అన్నాను ,అన్నా హజారే గారి పిలుపుతో దేశ ప్రజలంతా ఆయన కు సంపూర్ణ మద్దతు నిచ్చి నిలబడి హజారే కోరిన మార్పులను జన లోక్పాల్ లో పార్లమెంట్ ఆమోదించటం ప్రజావిజయం అనీ ,అది నిన్ననే జరిగిందని ,రేపు అంటే ఇరవైతోమ్మిదవ తేది వ్యావహారిక భాషోద్యమ సారధి గిడుగు రామ మూర్తి గారి జయంతి అని దానిని ”తెలుగుభాషా దినోత్చావం ”గా జరుపుకొంటామని .ఇంకో మూడు రోజుల్లో భారత ప్రజల తొలి పండుగ వినాయక చవితి జరుపుకొ బోతున్నామని

ఈ నేపధ్యం లో ఈ పుస్తకావిష్కరణ జరాటం ఆనందదాయకం గా వుందని అన్నాను .ఆహ్వానించిన వారంతా విచ్చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాను .విస్తృతమైన ప్రచారం చేసిన పత్రికల వారికీ ,”వార్తా విపంచి ”ద్వారా దాదాపు ప్రతిరోజూ పుస్తక ఆవిష్కరణను శ్రోతలకు తెలియజేసిన విజయవాడ ఆకాశ వాణి కేంద్రానికి దాని డైరెక్టర్ మాన్యశ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపాను .ఈ వేదికను స్వర్గీయ వేగుంట మోహన ప్రసాద్ (మో) వేదిక గా,నిర్వహిస్తున్నామని ,ఈ సభ వారికి అంకితం అనీ అన్నాను .
           ”మా అక్కయ్య ”అనురాగ కవితా సంపుటిని శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తున్నందుకు సంతోషం గా వుందని ఇది రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తున సరసభారతి అయిదవ పుస్తకమని ,సరసభారతి ప్రచురించిన అయిదు పుస్తకాలను ప్రసాద్ అమృత హస్తాలతో ఆవిశారించటం చారిత్రాత్మకమనిఅన్నాను .  పుస్తకావిష్కరణ చేసిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనకు సరసభారతి గొప్ప అదృష్టాన్ని కల్గించిందని ,అన్ని పుస్తకాలను తనతో ఆవిష్కరిమ్పజేయటం సరసభారతి విశాల హృదయానికి నిదర్శనమని ,మానవత్వపు విలువలు మరిచి పోతున్న ఈ కాలమ్ లో అనురాగాలు ఆత్మీయతలను దూరం చేసుకొంటున్న తరుణం లో ఉగాది నాడు యాభై మంది కవులతో ”మా అక్కయ్య ”శీర్హికతో కవి సమ్మేళనం నిర్వహించి ,అయిదు నెలల్లోనే పుస్తకం గా ముద్రించి ఆవిష్కరించటం అద్భుత మైన విషయం అనీ ,సరసభారతి ,దాని నిర్వాహకులు అకున్తిత దీక్ష తో చేస్తున్న సాహితీ కార్యక్రమాలకు తరచుగా తనను ఆహ్వానించటం ముదావహం గా వుందనిఅన్నారు ఈ లైబ్రరీ నిర్మాణం లో దుర్గా ప్రసాద్ కృషి ఎంతో వుందని ,దీనికి ఆర్ధిక సాయం చేసిన శ్రీ మైనేని గోపాల క్రిష్నయ్య గారి ఉదారహృదానికి ధన్యవాదాలని చెప్పారు .ఇలాంటి సభలు హాయిగా జరుపు కోవటానికి దీని పైన సభా మందిరం నిర్మించాలన్న కోరిక చాలా కాలమ్ గా దుర్గా ప్రసాద్ మాస్టారు కోరుతున్నారని ఆ కోరిక కొద్ది కాలమ్ లో తీరబోతోందని చెప్పారు .పై అంతస్తుకు నాలుగు లక్షల రూపాయలు జిల్లా గ్రంధాలయ సంస్థ మంజూరు చేసిందని ,అన్ని సౌకర్యాలతో పై అంతస్తు నిర్మించి సాహిత్య సంగీత కళా సాంస్కృతిక వేదిక గా దాన్ని తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు .డబ్బు సాంక్షన్ చేసిన జిల్లా గ్రంధాలయ చైర్మన్ శ్రీ రొంది కృష్ణ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు …సమాజ హితం తో ,విస్తృత ప్రయోజనాలకోసం కవులు రాయాలని ,సమాజ హితం ముఖ్యమని తెలుగు భాషను అందరం కలిసి రక్శీన్చు కోవాలని అన్నారు ..
            ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ యెన్ .వి ఎస్ .చలపతిరావు గారు తమ పత్రిక సాహిత్యాన్ని పోషించటానికి యువకులకు ,బాలలకు ప్రత్యెక స్శీర్శికలు నిర్వహిస్తున్నామని ,వాటికి రచనలు పంపమని కోరారు .తర్వాత శ్రీ చలపతిరావు గారికి సరసభారతి ఘనం గా ,శ్రీ రాజేంద్ర ప్రసాద్ చేతులమీదుగా దుర్గా ప్రసాద్ దంపతులు సత్కారం జరిపించారు .పత్రికా విలేఖరులు కూడా రావు గారిని చాలా ఆత్మీయం గా సన్మానించారు .పూలహారాలతో ,శాలువాలతో ముంచెత్తారు .రావు గారు కృతజ్ఞతలు తెలియ జేశారు
          నెల్లూరు లోని సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ vice చైర్మన్ ,”స్టేట్ లీడర్ ”జాతీయ పక్ష పత్రిక సంపాదకులు శ్రీ సర్వేపల్లి రామ మూర్తి గారు ఆత్మీయ అతిధి గా ప్రసంగిస్తూ ,ఇక్కడి ఈ సాహితీ వాతావరణం తనను ముగ్ధుణ్ణి చేసిందని ,ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు ,ప్రచురిస్తున పుస్తకాలు ఎందరికో ప్రేరణ కల్గిస్తాయని ,ఇంకా అభివృద్ధి లోకి సరసభారతి రావాలని యువతకు ప్రత్యెక కార్య క్రమాలనూ నిర్వహించాలని హితవు పలికారు .
            కృష్ణా జిల్లా రచయితల సంఘం ముఖ్య కార్య దర్శి డాక్టర్ శ్రీ జి .వి .పూర్ణచంద్ తమ అభిభాషణలో ఉయ్యూరు లో మాస్టారు ఆధ్వర్యం లో జరిగే ప్రతి ముఖ్యమైన కార్యక్రమాలకు తాను ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు హాజరవుతూన్తామని ,చాలా నిష్టతో ,సమయపాలనతో ,ప్రయోజనంతో సరసభారతి కార్యక్రమాలునిర్వహిస్తోందని ,అయిదు పుస్తకాలు ప్రచురించటం ఆశా మాషీ కాదని ,కృష్ణా జిల్లా రచయితల సంఘం చేసే ప్రతి కార్యక్రమానికీ మాస్టారు తప్పక హాజరవుతారని తమలో ఆయన ఒకరనీ ,తాము ప్రచురించిన పుస్తకాలన్నితిలో మాస్త్త్రి విలువైన రచనలున్నాయని ,తాము ఇటీవల నిర్వహించిన ప్రపంచ సభలు గొప్ప స్పూర్తిని కలిగించి ఆధునిక సాంకేతికత తెలుగు భాష కు ఎలా ఉపయోగ పడుతోందో ,భాషా వ్యాప్తికి దోహదపడుతోందో అందరికి తెలుసుకొనే అవకాశం కల్గిందని అన్నారు .
           మాచిలి పట్నం బోధన కళాశాల రెతిరెద్ ప్రిన్సిపాల్ ,మరియు ,మినీ కవితోద్యమ సారధి ,వందలాది సభాలోఅను నిర్వహించిన వారు ,యువకవులకు ప్రేరణ ,ఎన్నో పుస్తకాలను ప్రచురించిన రావి రంగా రావు గారు ప్రసంగిస్తూ ,తాను అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ఎప్పుడో కవితలు రాసానని కవులు యెంత రాశామని కాక యెంత బాగా రాశామో ఆలోచించి రాయాలని సంక్షిప్తత చాలా ముఖ్యమని ,కవిత హృదయానికిచేరువ కావాలని రాసి కంటే వాసి ముఖ్యం అని ,అక్కయ్య మీద కవిసంమేలనానికి తాను హాజరయానని ,పుస్తకావిష్కరణకు తనను పిలవటం తన పట్ల నిర్వాహకులకున్న సహృదయతే నని ,మానవీయ సంబంధాలు శిదిలమైతే  మనుష్యులుగా మన గలగలేమని వాటిని కాపాడుకోవాలని సూచించారు .
          సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి శ్రావ్యమైన కంఠం తో తెలుగు భాషతియ్యదనంపై మంచి పాట పాడి జన  రంజనం చేశారు .ప్రసిద్ధ కవులు రచయితలు ,సాహితీ సభా నిర్వాహకులు అయిన శ్రీ వేలూరి కౌండిన్య ,శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,శ్రీమతి వి ;శ్రీ ఉమామహేశ్వరి గార్లు సహృదయ స్పందన తెలుపుతూ వుయురుకు ఎప్పుడు పిలిచినా వస్తున్నామని ఇక్కడి వారి పిలుపు లో ఆత్మీయత ,అనురాగం ఉంటాయని అందుకే తప్పకుండా వస్తున్తామని అన్నారు .ఆంద్ర ఉపన్యాసకురాలు డాక్టర్ శ్రీ లత సరసభారతి లో తాను ఒకరుగా వుండటం గర్వ కారణం గా వుందని మంచి కార్యక్రాలను నిర్వహించటం ,అందరికి సమాన మైన ప్రాతినిధ్యాన్నీవ్వతమ్ ఇక్కడి వారి ప్రత్యేకత యారు .కోస్తా ప్రభ సంపాదకులు శ్రీ శ్రీరాం యాదవ్ ,చిన్నయ సూరి విజ్ఞాన పరిషత్ కార్యదర్శి శ్రీ టి .శోభనాద్రి గార్లు మానవీయతకు పట్టం కట్టే ఇలాంటి కార్యక్రమాలు తరుచు జరగాలని కోరారు .అతిదులందరికి జ్ఞాపికలు సరసభారతి అంద జేసింది .
      తరువాత ”మా అక్కయ్య కవితా సంపుటిపై సమీక్షను ఆంధ్రా బాంక్ ఆఫీసర్ ,మినీ కవితా సారధి శ్రీ వసుధ బసవేశ్వర రావు నిర్వహించారు .పద్యకవిత్వం పై సమీక్షను గుడివాడ ఆంద్ర బాంక్ సీనియర్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ జి.వి .బి. శర్మ చేశారు .కవుల కవిత్వం లోని లోతు పాట్లను తెలియజేశారు .గుండెకు తాకినా కవితలను ఉదాహరించారు .కైకలూర్ లోని సాహితీ మిత్రులు సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ చింతపల్లి వెంకట నారాయణ   కవిత్వాన్ని విశ్లేషించారు .మంచి కవితా హృదయం తో ఆలోచనాత్మకం గా ,గుండెలను  పిందేన్టగాకవితలున్నాయని,అందరు ఫీల్ అయి రాశారని మంచితరుణం లో మంచి పుస్తకం వచ్చిందని అందరు అభినంద నీయులే నన్నారు .
            యువకుడు ,ఉత్చాహవంతుడు ,రమ్యభారతి త్రైమాస పత్రిక సంపాదకుడు కవి ,కధారచయిత ,అనేక బహుమతుల గ్రహీత మంచి నిర్వాహక సామర్ధ్యం వున్న వారు అయిన శ్రీ చలపాక ప్రకాష్ సభాధ్యక్షత వహించారు .ఇందరు పెద్దలుండగా సభాధ్యక్షతను యువకుడైన తనను చేయటం సరసభారతి నిర్వాహకుల వినూత్న ద్రుష్టి అని ,యువతకు యెంత ప్రాధాన్యత ఇక్కడ లభిస్తోందో దీన్ని బట్టే అర్ధమవుతోందని ,తాను ఇక్కడి కార్యక్రమాలకు ఈ మధ్య తరచుగా వస్తున్నానని వీరి సభానిర్వహణ నిర్దుష్టం గావ్ ఉంటుందని మెచ్చారు .చాలా హుందాగా ,అర్ధవంతం గా ప్రకాష్ సభను నిర్వహించి అందరి ప్రశంసలు అందుకొన్నారు .బాంధవ్యాలను మరిచి పోతున్న తరుణం లో అక్కయ్యకు పెద్ద పీత వేశారని అలాగే పిన్ని ,బాబాయ్ ,తాతయ్య నానమ్మ ,అమ్మమ్మల పై కూడా  కవిసంమేలనాలు నిర్వహించి యువకులను భాగ స్వామ్యులను చేయాలని కోరారు .
           చివరగా నేను మాట్లాడాను .ఈ పుసకం ఇంత సర్వాంగ సుందరం గా తయారవటానికి కారకులు శ్రీ వసుధ ,మరియు శ్రీ వెంకట నారాయణ గారలె.వారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ఒక్క కృతజ్ఞత చెప్పటం తప్ప అన్నాను .సాధారణం గా కవి సమ్మేళనం అంటే కవులు తమ కవిత్వం చదివి వినిపించావచ్చని ఆశ తో వస్తారు .కాని ఈ రోజూ కవిసంమీలనానికి మించి కవులు ,సాహిత్యాభిమానులు ఇంతమంది విచ్చేయటం ఉయ్యూరు మీద సరసభారతి మీద వున్న గొప్ప నమ్మకం మాత్రమే నని తెలిసింది .ముఖ్యం గా మహిలామతల్లులు అంతంత దూరం నుంచి రావటం ఎంతో మహదానందం గా వుంది నాకు ఇంతమంది అక్కలు చెల్లెళ్ళు ,వదినలు పిన్నులు ,అమ్మక్కయ్యలు ,మాత్రుమూర్తులున్నారని తెలిసి మురిసి పోతున్నాను .మీ ఋణం నేను తీర్చుకోలేను .చేతులెత్తి అందరికి నమస్కరించి నా అశక్తతను సవినయం గా తెలుపుకొంటున్నాను .అని నా కృతజ్ఞతలు తెలియ జేశాను .నాకు సహకరించి ఈ కార్య క్రమం ఇంత వేడుక గా నిర్వహించటానికి తోడ్పడిన నా కుటుంబ సభ్యులకు ,నాకు చేదోడు వాదోడుగా నిలిచిన కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శిఉవలక్శ్మికి టెక్నికల్ ,సలహాదారు ,ప్రచార సారధి శ్రీ బాల గంగాధర రావు గారికి కృతజ్ఞతలు తెలియజేశాను
   చివరగా శ్రీమతి శివలక్ష్మి వందన సమర్పణ చేశారు .జనగణ మన తో సభ పూర్తి అయింది .మూడు గంటల పాటు మహదానందం గా ,క్రికిరిసిన సాహిత్యాభిమానులతోఆవిష్కరణ సభ చిరస్మరణీయం అయింది .సహకరించిన లైబ్రరీ యాజమాన్యం అభినందనీయులు .
          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -08 -11.
Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మా అక్కయ్య 28.08.2011 వుయ్యూరు లో పుస్తకావిష్కరణ

This slideshow requires JavaScript.

మా అక్కయ్య -1

మా అక్కయ్య -2

మా అక్కయ్య – 3

మా అక్కయ్య – 4

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

అవినీతి వ్యతిరేక ఉద్యమం – అవినీతిని అంత మొందించే ప్రక్రియ

అవినీతి వ్యతిరేక ఉద్యమం

          -నిన్న అంటే 25  వ తేది గురువారం ఉయ్యూరు   రోటరీ క్లబ్ వారు తమ సమావేశం లో ”అవినీతి వ్యతిరేక ఉద్యమం ”పై ముఖ్య అతిధి గా వచ్చి  ప్రసంగించమని కోరారు .నేను మాట్లాడాను .రోటరియన్లు అందరు వున్నారు .వారి ముందు మాట్లాడే అరుదైన అవకాశం లభించింది .కే.సి.పీ .జనరల్ మేనేజర్ గారిచేత నాకు  సత్కారం చేయించారు .ఆ సందర్భం గా నేను మాట్లాడిన ప్రసంగా పాఠం మీతో పాటు సాహితీ బంధువు లందరికీ .

— ”అవినీతి ని ఆంగ్లం లో corruption  అంటారు .దీనికి నిఘంటువు లో చెడగొట్టు (spoil )కుళ్ల జేయు   (rotten ) ,దుర్మార్గమైన ,భ్రష్టమైన ,నీచమైన (base ) ,అవినీతి కరమైన ,లంచం ఇచ్చే (bribe )అనే అర్ధాలున్నాయి .పోతన గారి భాగవతం లో తండ్రి హిరణ్య కశిపుడు కుమారుడు ప్రహ్లాదుడిని  విష్ణువు ఎక్కడ వున్నాడు అని అడిగితే చెప్పిన పద్యం అందరికి తెలుసు .ప్రహ్లాదుడు విష్ణువు లేని చోటు లేదు అని చెప్పాడు ఆ పద్యం లో .దాన్ని కొంచెం మార్చి చెబితే అవినీతి లేని చోటు లేదు అని నాకు అనిపించి ,

పోతన గారికి క్క్షమాపణలు చెప్పుకొంటూ —”ఇందుగలదు ,అందు లేదు అని సందేహము వలదు వక్రి ఎందెందు వెదకి జూచిన అందందే కలదు మానవాగ్రణి వింటే ,కంటే ”అని నిస్సందేహం గా చెప్పవచు .

           అవినీతిఎందుకు వస్తోంది అని ఆలోచిస్తే -ప్రభుత్వాల అసమర్ధత వల్ల అని సమాధానం .ప్రభుత్వ వ్యవస్థలలో సరైన అనుసంధానం తో కూడిన నిఘా ,పర్యవేక్షణ లేక  పోవటం వల్ల అవినీతి పెరుగు తోంది .చాలామంది medhaavula అంచనా ప్రకారం అవినీతి కూకటి వ్రేళ్ళు రాజకీయం లో వున్నాయి .అధికారం పేరిగినా కొద్దీ అవినీతి అదే దామాషా లో పెరుగు తుంది .అందుకే ఇంగ్లీష్ లో ”power corrupts ,absolute power corrupts absolutely ”అన్నారు .ఇంతకీ అవినీతిని నిర్వచించ గలమా ?విశ్లేషకులు ఇలా నిర్వచించారు ”.వ్యక్తీ తన స్వార్ధం కోసం,తన అధికారాన్ని దుర్వినియోగం చేయటమే అవినీతి ”.దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే అధికారమే అవినీతికి మూల స్థానం .లిబియాలో ,ఈజిప్ట్ లో .సూడాన్ లో మన రాష్ట్రం లో అవినీతి ఏరులై పారతానికి కారణం పుత్రప్రేమ .వారికోసం ఎంతటికైనా తెగించారు .చరిత్ర భ్రస్తులైనారు ముబారక్ ,గడాఫీ రాజశేఖర రెడ్డి అని మనకు అందరికి తెలుసు .కరుణానిధి కూతురు  కోసం మేనల్లుళ్ళ కోసం కక్కూర్తి పడి భంగపడ్డ విషయం రోజూ కధలు ,గాధలుగా వింటూనే వున్నాం .ప్రభుత్వ ధనాన్ని ,స్థలాలను ధారాదత్తం చేసి ,దోచుకొని అందలాలు ఎక్కి అన్ని సుఖాలు అందుకొన్నా వాళ్ళే వారంతా .
          పోలీసు వ్యవస్థ ,పౌర వ్యవస్థ లలో రాంకు పేరిగినా కొద్దీ అవినీతి అడ్డ గోలు గా పెరుగుతుందని విశ్లేషకుల వివరణ .దీనికి తోడు ఎన్నికలు వస్తే చాలు అవినీతి పండగే .ఎల్లలు దాటి అవినీతి అడ్డు ,ఆపు లేక అన్ని రకాల విశ్వ రూపం దాలుస్తుంది .డబ్బు ,అధికారం ,ప్రలోభం అన్నీ ఉపయోగించి ఎన్నికలలో గెలవటం సర్వ సాధారణం అయింది .వాడికే అధికారం దక్కుతోంది .అంటే అవినీతి నాయకుల్నే మనం ఎన్నుకొన్తున్నాము .మరి వాడు తాను ఖర్చు పెట్టిన దానికి వందల రెట్లు సంపాదించుకొనే వీళ్ళు అన్నీ చూసుకొంటాడు .అతి కొద్ది కాలమ్ లో అపర కుబెరుడై పోతున్నాడు .వాడి అధికారానికి దౌష్ట్యానికి ఎదురు లేదు .గట్టి రాజకీయ ,ఆర్ధిక oligarchy అంటే  కొద్దిమంది  వున్న ముఠా వల్ల అవినీతి పెరిగి పోతోంది అని పాల్ జాన్సన్ నిర్వచించాడు.అధికారులు ,నాయకులు తమ స్వంత పలుకుబడిని పెంచుకోవటానికి ,సబ్సిడీలు ,ఇతర వాణిజ్య సంస్థల నుంచి రక్షణ కోసం లాభం కోసం ఇచ్చే వన్నీ అవినీతి లో భాగమే .ఇవి రాజకీయం తో వ్రేళ్ళు గట్టి పడి ,మిగిలిన అన్ని చోట్లకు ప్రాకి ఇబ్బంది కలిగిస్తాయి .ఈ oligarchy  –రాజకీయ అవినీతి పరుల సంస్కృతిని పెంచుతుంది .న్యాయం ,చట్టం,పోలీసు వ్యవస్థ ,కోర్టులు వీటిని అన్నిటిని ప్రలోభపెట్టి ,ప్రభావితం చేస్తారు ఈ ముఠా.దీని వల్ల రావలసిన మంచి పరిణామాలు ఆలస్యమై పోతాయి ,లేక రాకుండా పోవనూ వచ్చు .
                                అవినీతిని అంత మొందించే ప్రక్రియ
                 మనకున్న న్యాయ,చట్ట సంస్థలు అన్ని కలిసి అవినీతికి వ్యతిరేకం గా పోరాడాలి ”.స్వతంత్రమైన అవినీతి నిరోధక వ్యవస్థ ”ఏర్పడాలి .ఈ వ్యవస్థ అవినీతి బడాబాబుల భారతం పట్టాలి ..ఇది స్వతంత్ర సంస్థ గా,విస్తృతమైన అధికారాలతో వుండాలి .ఇందులో రాజకీయ లొసుగులు ఉండరాదు .యెంత పెద్ద రాజకీయ నాయకుదినైనా ,ఆర్ధిక .పారిశ్రామిక వేత్తనైనా విచారించి శిక్షించే అధికారం ఈ సంస్థకు వుండాలి .దీనికి విశేషమైనాక్ విచాక్షనాదికారం వుండాలి .అత్యున్నత స్థాయి లో వున్న వ్యక్తులను విచారించటానికి రాష్ట్రపతి అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా చేయాలి .దీనికి ప్రభుత్వమే తగిన సిబ్బందిని ,బడ్జెట్ ను ఇవ్వాలి .అవినీతి పరులను జైల్లో పెట్టేంత వరకు వీరికి పూర్తి అధికారాలు లభించాలి .ఇలా చేస్తే రాజకీయ ఒత్తిడి చాలా భాగం తగ్గి పోతుంది .ఇప్పుడున్న చట్టాలు ,వాటి వినియోగం ,అవినీతి సామ్రాట్టుల జోలికి రాష్ట్రపతి కాని ప్రధాని కాని వెళ్ళే వెసులు బాటు లేదు .అందుకే స్వతంత్ర వ్యవస్థ అవసరం .వారిని chaallenge  చేసే దమ్ము కూడా వుండటం లేదు .ఇది మరీ విచారకరం .
              ఈ స్వతంత్ర వ్యవస్థ ప్రభుత్వ పబ్లిక్ రంగ సర్వీసెస్ తో ఏకీకృతమై పని చేయాలి .పబ్లిక్ సంస్థలలో అవినీతి నిర్మూలిస్తే ప్రజలకు నేరుగా ప్రయోజనం కలుగు తుంది .విశ్వాసము కూడా పెరుగుతుంది .ప్రజా ప్రయోజనాల కోసం దాతలనుంచి విరాళాలు సేకరించి,మళ్ళీ వారికి ఇంకో విధం గా లబ్ది చేకూర్చటం అవినీతి లో ఒక భాగమే .వ్యవస్థలో ,విధాన నిర్ణయాలలో సంస్క్రరణ రూపం లో ఇవన్నీ రావాలి .దీనికి రాజకీయం గా గొప్ప నిష్ఠ వుండాలి .దీని తర్వాత మనం ఆలోచించాల్సిన విషయం దేశం లో అత్యున్నత వ్యక్తిత్వం ,గట్టి రాజకీయ ధృఢ నిశ్చయం వున్న మహోన్నతులను తయారు చేయటం యెట్లా అని .మంచి పౌరవ్యవస్థ వల్ల నే ఇది సాధ్యం .ప్రస్సారమాధ్యమాలు ,సివిల్ సేర్వసులు రాజకీయం గా లోతులు తరచి సమాచారాన్ని ప్రాలకు అందించి జాగృతం చేయాలి కేవలం watch dogs గా వుంటే చాలదు .అవినీతిని అంతం చేసే అధికారులకు వ్యవస్థలకు పూర్తిమద్దతును   మీడియా ఇవ్వాలి .కుళ్ళిన రాజకీయ వ్యవస్థను ,దాని ప్రభావంతో దెబ్బతిన్న ఇతర వ్యవస్థలను చక్కదిద్దే కార్యక్రమం ప్రజాసహకారం తో చేయాలి .ఇదంతా స్వచ్చమైన పరిపాలన వల్లనే సాధ్యం అని అందరు గ్రహించాల్సిన ముఖ్య విషయం .
               పౌర సమాజానికీ ,దేశానికీ ,ప్రైవేటు సెక్టారు కు చక్కని సమతూకాన్ని అంటే balance ను సమకూర్చ గలిగింది సమర్ధవంతమైన ప్రభుత్వాలే . విధానాలు ప్రకటించటం లో వున్న శ్రద్ధప్రభుత్వాలకు  అమలు చేయటం లో లేదు .అక్కడికొచ్చే సరికి చిత్త శుద్ధి తగ్గి పోతోంది .ఇదే ఇన్ని అనర్ధాలకు కారణం .మనకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ వుంది ,స్వేచ్చాయుత మీడియా వుంది .కనుక స్వచ్చమైన ,నీతి వస్న్తులైన ,సమర్ధులైన వారిని వీటి లో నియమిస్తే ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది ,తమ బాధ్యతను నెరవేర్చే టందుకు సిద్ధ పడతారు .ఇవి మనం చేయలేక పోతే మనం ”నైతికం గా అవినీతి పరులం ”అయినట్లే అని భావించాలి .దీన్నే morally corrupt అంటారు .ఇది మనందరి బాధ్యత .ఆత్మ విశ్వాసం తో ,చేతలతో ముందడుగు వెయ్యాలి .పారదర్శకత అన్నిటా వుండాలి .లోకాయుక్త ,లోకపాల్ మనకు వున్నా ,వాటికి ప్రత్యేకమైన enforcement అధికారాలు లేవు .నామ మాత్రమే అవి    .
 ఈ విషయాలను అన్నిటిని చాలా ఏళ్ళ క్రితమే మన ఉయ్యూరు నివాసి ,అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ముప్ఫై ఏళ్ళకు పైగా సేవలందించిన ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధిక శాస్త్రవేత్త ,ప్రస్తుతం అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో లో ఉంటున్న శ్రీ ఆరిక పూడి ప్రేమ్చంద్ తన గ్రంధాలలో విపులం గా చర్చించి దిశా నిర్దేశం   చేశారు  .ప్రభుత్వాలు వాటిని అధ్యనం చేసి తీరు మార్చుకో క పోతే సంక్షోభం తప్పదు   .                        ఇప్పుడు కరెంట్ టాపిక్ ”జన లోక్ పాల్ ‘సాంఘిక సేవా లో జీవితాన్ని పండించుకొని ,నిస్వార్ధ సేవ చేస్తున్న శ్రీ అన్నా హజారే అవినీతి తీరు తెన్నులు చూసి విసుగు చెంది దానికి వ్యతిరేకం గా పోరాడుతూ జన లోక్ పాల్ బిల్లు కోసం నిరశన దీక్ష చేస్తున్నారు .ఆ నాడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇలాగే ఉద్యమించి రెండవ స్వాతంత్ర సంగ్రామం చేసి ప్రజా పాలన తెచ్చారు .మళ్లి ఇప్పుడు హజారే కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు .ప్రభుత్వం మీన మేషాలు లేక్కిస్తోంది .పది ర్రోజులైంది ఆయన ఆరోగ్యం దెబ్బతిన కుండా ,ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా స్పందించాలి ఆయన చేస్తున్న ఉద్యమమే ”India against corruption ”.(I.A.C.).వ్యక్తిత్వం  ,సచ్చీలం  ,నిజాయితీ వున్న వారినే పరిపాలకులు గా ఉంచాలన్నది ఆయన అభిప్రాయమే కాదు భారతదేశ ప్రజాభిప్రాయం కూడా .
            అవినీతి మూడు దశల్లో వుంటుంది అని ఒక విశ్లేషణ .దేవుడిని నాకు అది కావాలి ఇది కావాలి అవి ఇస్తే నీకు అది చేయిస్తా ఇది చేయిస్తా అని కోరుకోవటం తోనే మొదలి స్థాయి అవినీతి ప్రారంభం అన్నాడు ఒకాయన నిజమే .దేవుణ్ణి మనం అవినీతి లోకి లాగుతున్నాం .రెండోస్తాయి లంచం ఇవ్వటం ,పుచ్చుకోవటం .మూడో లెవెల్ లో మంత్రులస్తాయి అవినీతి ఇంతకీ అవినీతికి కారణాలు ఏమిటో తెలుసా ?మనమీద మనకు నమ్మకం లేక పోవటం ,మానవత్వపు విలువలు దూరమవటం ,త్యాగభావం లేక పోవటం ,సేవా నిరతి తగ్గటం ,స్వార్ధం పెరగటం ,అభద్రతా భావం .అభద్రతా బ్భావం తో డబ్బే ప్రధాన శక్తి అని భావించి దానికోసం అవినీతి రొంపిలో దిగటం .అత్యున్నత స్థాయిలో వున్న వాళ్ళు రోల్ మోడల్స్ గా లేక పోవటం మానకు చాలా నష్టం కలిగిస్తోంది .గాంధి నెహ్రు ,పటేల్ రాజెన్ బాబు  సర్వేపల్లి ,ప్రకాశం ,లాల్బహదూర్ శాస్త్రి వంటి మహామహుల  తర్వాత ఒక అబ్దుల్ కలామే మనకు ఆడర్శపురుషుడి గా కన్పిస్తున్నారు .మిగతా వారి గురించి మనం నేర్చుకోవాల్సిన్దేమి లేదు .అదీ దేశానికి దౌర్భాగ్యం .వున్న వారంతా రోల్డ్ గోల్డ్ వంటి వారే అవటం జాతి చేసుకొన్న దురదృష్టం .అవినీతి తగ్గ టానికి ప్రజల్లో ఆత్మ స్థైర్యం ,అవగాహన పెంచాలి .యువతకు బాధ్యతలు అప్పగించాలి .వారింకి మార్గ దర్శకత్వం చేయాలి .వారి శక్తిని తక్కువ అంచనా వెయ రాదు .ఇవాళ ప్రపంచం అంతా జరుగుతున్న అవినీతి పోరాటం ,అవినీతి ప్రభుత్వాలను గద్దె దించటం లో యువకులు నిర్వహిస్తున్న పాత్ర ప్రశంసనీయం గా,ఆదర్శవంతం గా ఉంది .
          ఉత్పత్తి సృష్టించటం లో మానవత్వపు విలువలను మంట బెట్ట రాదు .ఆధ్యాత్మికతను దానికి జోడించాలి .మనం విశ్వ పౌరులం అన్న భావన చాలా ముఖ్యం .పవిత్ర వ్యక్తిత్వాన్ని అందరు పెంచుకోవాలి .జీవితాన్ని ,తమ భాషా ,సంస్కృతులను ప్రేమించాలి .మన వారసత్వం లోని మానవతా విలువలను భద్రం గా కాపాడు కోవాలిఅప్పుడు చెడు మార్గం వైపు అడుగు పడదు .ప్రభుత్వం కూడా ”gross domestic happiness ”మీద ద్రుష్టి పెట్టాలి కాని ”gross domestic product ” మీద కాదు అని చ్చేప్పిన వారి మాట పాటించాలి .అలాగే ”prosperity has meaning when there is happiness and common welfare built into the system ”అని సమాజ శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు శిరోధార్యం గా భావించాలి .అవినీతి సామ్రాజ్యాలను కూకటి వేళ్ళతో పెకలించి ,ఆ దోచిన సంపదను జాతి పరం చేయాలి .అన్నా హజారేకు మద్దతు అంటే వూరికే గొంతు కలపటం కాదు .ఒక సమర్ధవంతమైన నీతి ,పౌరబాధ్యత ,సమాజ సేవ నిజాయితీ  వున్న మంచి వ్యక్తిని అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రధానిని చేయాలి .అపుడే హజారే కన్న కలలు నిజం అవుతాయి .ఇప్పటి బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని కావటానికి తగిన అన్ని అర్హతలు వున్న వాడు అని నాకు అనిపిస్తోంది .ఆ దిశ గా రాజకీయ పక్షాలు ,ప్రజా కలిసి అడుగు వేస్తె ఆ నాటి జనతా ప్రభుత్వం లా   మేలు చేసే మరో మంచి ప్రభుత్వం వస్తుంది .
              ప్రజాకవి కాలోజి నారాయణ రావు ఎప్పుడు ”private wrong can be drowned in a cup of wine ,but for public wrong ,it requires rivers of blood ”అన్న మాటల్ని చెబుతూ వుండే వారట .అందుకే ఆయన ప్రజాకవి అయారు .మన మాజీ రాష్ట్ర పతీ అబ్దుల్ కలాం ”’నా కంటే నాదేశం మహోన్నతమైనది అనే భావం నా దేశ నాయకులకు ,నాదేశ ప్రజానీకానికి వారి గుండెల్లో బాగా నాటుకోనేట్లు చెయ్యి ”అని ప్రతి రోజూ రాత్రి నిద్రించాటానికి ముందు భగవంతుని ప్రార్దిస్తారట .మనం కూడా అలా చేస్తే యెంత బాగుండు? భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రేమే కోర్ట్ ”Even god cannot help this country .God is silent spectator .The centre and state governments have become non functunal ”అని 2008  లో చెప్పింది అంటే యెంత దౌర్భాగ్య స్థితి లో మనం ఉన్నామో   తెలుస్తోంది .ఈ విపత్కర పరిస్థితినుంచి ,ఈ అవినీతి జాడ్యం నుంచి మన దేశం బయట పడి ఆదర్శవంతం గా నిలవాలని కోరుకొంటూ ,ఆశిస్తూ ,సెలవ్ ”
                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -08 -11.
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
Posted in సభలు సమావేశాలు | 3 Comments

శ్రీ కృష్ణ తత్త్వం —2 గోపికా భక్తి

శ్రీ కృష్ణ తత్త్వం —2

                                         గోపికా భక్తి

—    ”ధర్మ కర్తయు ,ధర్మ భర్తయు ,ధర్మ మూర్తియు నైన ,స —త్కర్ముదీషుడు ,ధర్మ శిక్షయు ,ధర్మ రక్ష యు జేయగా

       నర్మలిన్ ,ధరమీద బుట్టి ,పరంగాన జన సంగమే –ధర్మ మంచుదలంచి జేశే నుదాత్త మానస చెప్పుమా ?”అని ఆనాడే పరీక్షిత్తు అడిగాడు మనకు వచ్చే సందేహాన్ని ముందే వివరిస్తాడు మహర్షి వ్యాసుడు .,దాని వ్యాఖ్యాత మన పోతన .ఆ భక్తి వైభావమేమితో తిలకించి పులకిద్దాం .సందేహ నివృత్తి లో నివ్రుత్త పదాన్ని చేరుదాం .బ్రహ్మ ,గోపికల భక్తికి పులకించి పోయాడు .గుణ ,దేహాలను వదిలి ,బంధ నిర్ముక్తులైనందుకు పరమానంద భారితుదయాడు పరబ్రహ్మ .పోతన గారి పద్యమందారం లో దాన్ని దర్శిద్దాం
”తరుణుల్ గొందరు మూల గేహముల నుద్దండించి రారాక త–ద్విరహాగ్నిం బరితాప మొందుచు ,మనోవీదిన్ ,విభున్ ,మాధవున్ —
బరి రంభంబులు సేసి,జారుదనుచున్ ,భావిన్చియున్ ,జొక్కి ,పోం –దిరి ముక్తిన్ ,గుణ దేహముల్ విడిచి ,ప్రీతిన్ ,బంధ నిర్ముక్తలై ”.
  బ్రహ్మ కూడా ,శ్రీ కృష్ణ పాద సేవా తత్పరత తో ,తన్మయత్వం పొందాడు .సమస్తం పరమేశ్వరార్పణం లో వున్న ఆనందం -బ్రహ్మ పదం లో కూడా లేదు అని ”ఎరుక ”పొందాడు సృష్టికర్త .అంత సమ్మోహన మూర్తి ఆయన .ఆ లీల అంత అద్భుతమైనదీ ,చిత్తాకర్షణ కలదీ .
”ఎలా బ్రహ్మపదంబు ,వేదములకున్ ,వీక్షిమ్పగా రాని ని –న్నీ లోకంబున ,నీ ,వనాన్తమునం ,మందలో ,”గృష్ణ ”యం
 చాలాపాది ,సమస్త భావములు ,నీయందే సమర్పించు ,నీ –వ్రేలం దక్కని పాదరేనువులపై ,వేస్టించినం జాలదే ‘
గోపికలు శ్రీకృష్ణుని మానసిక అర్చన చేశారు .అందుకే విశిష్టమైన అర్చకులయారు .శ్రీ కృష్ణ భావాన్ని హృద్గతం చేసుకొన్నారు .జారిపోకుండా పదిల పర్చుకొన్నారు .పులకించిన మేనులతో కౌగలించు కొన్నారు .అయితే ఇదంతా ,”యోగి ”లాగా చేశారు .కనుక వారికి వేరే భావం ఏమీ లేదు .ఏ తప్పు లేదు .సర్వ సమర్పణ తో చేశారు .దానికి అంత మహిమ వుంది .దేహ భ్రాంతి వీడి ,,బ్రహ్మ భావం నిండి ,ముక్తి కాంతా పరిష్వంగ సుఖం పొందటం  చూపిస్తాడు .అదీ ఉత్కృష్ట భక్తి అంటే .
  ”ఒక్క లతాంగి  మాధవుని ,యుజ్వల రూపము జూడ్కి ,తీగలం –జిక్కగా బట్టి ,హృద్గతము జేసి ,వెలిం జనకుండ ,నేత్రముల్
   గ్రక్కున మూసి ,మేన బులకంబులు గ్రమ్మగా ,గౌగాలించియున్ –జోక్కములైన ,లోచవుల జొక్కుచు ”యోగి ”కైవడిన్ ”
  ఇంతగా అల్లుకు పోతున్నా ,వారికి తాను   ప్రత్య్పకారం ఏమీ చేయలేని వాడినని కృష్ణుని సమాధానం .దానికి కారణం గోపికలు దోషరహితం గా ,నిరంతరం గా తనను  అర్చ్చిన్చటమే .బ్రహ్మాదులు ,మునులు ,గోపికలకు నమస్కరించి జేజేలు పలికారు .ఇది భక్తికి పరాకాష్ట .అందుకే నారద మహర్షి ఎక్కడ భక్తి విషయం వచ్చినా ,”యధా వ్రజ గోపికాయాం ”అని ఉదాహరిస్తూంటాడు .
  ”పాయని గేహ శృంఖలముల బాసి ,నిరంతర మత్చరత్వముమ్ –జేయుచునున్న ,మీకు బ్రతి సేయ ,యుగంబులనైన నెర ,నన్ —
  బాయక గోల్చుమానసము ,బ్రత్యుపకారముగా దలంచి ,నా –పాయుట తప్పుగా గొనక ,భామినులార ,కృపన్ ,శమిమ్పరే ”
మనసులో ఎప్పుడు భావించటమే తాను ఇచ్చే ప్రత్యుపకారం అట .ఎంత నంగనాచిత్వామో చూశారా కన్నయ్యది ?అయినా గోపికలకు కావాల్సింది ఇంకేముంది ?
  మురళీ గానాన్ని విని ,పరవశాలై వచ్చిన gopikalanu  ఇళ్ళకు మరలి పొమ్మని కోరాడు కొంటె కృష్ణుడు .వాళ్ళు చల్లగా ,చక్కని సమాధానం చెప్పారు .పద్మ గంధాన్ని మెచ్చే తుమ్మెద ఇతర పుష్ప గంధాన్ని కోరాదని ,తమ తపస్సు ఫలితం గా తనను చేరామని ,అందర్నీ వదిలి వచ్చామని ,తమది సర్వ సమర్పనమేనని ,తమకు ఇంక ఏ ఆలోచనా లేదని ,దీనం గా ప్రాధేయ పడ్డారు .భగవద్రతి తప్ప ఇంక ఏ కోరికా వారికి లేదు .
”సిరికి నుదార చిహ్నములు సేయు ,భవత్క్చరనారవిన్దముల్ –సరసిజ నేత్ర ,మా తపము ,సంపద జేరితి ,,మేట్టకేలకున్
మరలగ లేము ,మా మగల మాటున నొల్లము ,పద్మగంధముల్ –మరగిన తేటులన్య కుసుమంబులకుం,జన నిచ్చగించునే ‘
ఆ దీనాలపాలకు కరిగి పోయాడు వెన్న తిన్న మనసున్న కన్నయ్య .అందర్నీ సంతృప్తి పరిచాడు .ఆత్మారాముడై ,రమించి ,వారి కోర్కెలకు సఫలత్వం చేకూర్చాడు .సర్వం సమర్పించి గోపికలు ”యోగి బృందార వంద్యులు ”అయారు .కాత్యాయినీ వ్రత దీక్ష లో వారి కోరికా విలక్షణం గానే కని పిస్తుంది .”వో తల్లీ !మాకు కృష్ణుడు చేతో విభుడైన నాడు చెలువల మెల్లన్ ,నేతి వసంతములాడుచు ,జాతర చేసెదము ,భక్తి చాతురి తోడన్ ”అన్నారు .కాదు అనిపించాడు భక్త పోతన .వ్యాస భాగవతం లో”శ్రీ కృష్ణుని పతిగా ”చేయమని కోరినట్లు రాశారు పోతనాచార్యుడు ఇంకొంచెం ముందుకు వెళ్లి హృదయాధి నాదునిగా చేయమని ప్రార్ధించటం ఆయన హృదయ వేదిత్వం అని రసజ్ఞులు ,విశ్లేషకులు భావించారు .
             శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షల తో —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -08 -11 .

 

Posted in సమయం - సందర్భం | Leave a comment

శ్రీ కృష్ణ తత్త్వం

    శ్రీ కృష్ణ తత్త్వం
               శ్రావణ మాస కృష్ణ పక్ష అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి .పగలు సప్తమి ,సాయంత్రం అష్టమి వుంటే ఆరోజు జరపటం అలవాటు .సోమ ,బుధ వారం వస్తే చాలా పవిత్రం అని భావిస్తారు .రేపు అంటే సోమ వారం కృష్ణాష్టమి అవటం మన అదృష్టం .ఆ రోజుల్లో అష్టమి తిది తో పాటు రోహిణీ నక్షత్రం కూడా కలిస్తే మహామహిమ గల పర్వ దినం అవుతుంది .శ్రీ వైష్ణవులకుభాద్రపద కృష్ణ పక్షం లో,అష్టమి ,నవమి తో కలిస్తే కృష్ణాష్టమి .రోహిణీ నక్షత్రం కలిస్తే కలియుగ వైకున్తమే నని పద్మ పురాణం లో వుంది .
         శ్రీ కృష్ణ తత్త్వం శ్రీమద్భాగవతం లో వ్యాసుల వారు చక్కగా ఆవిష్కరించారు .బ్రహ్మ దేవుడు ఒకప్పుడు ”సృష్టి ఎలా చేయాలి ”అనే సందిగ్ధం లో పడ్డాడు ”.తప ,తప ”అని అశరీర వాణి విన్పించింది .తపస్సు చేశాడు .పరమేశ్వర సాక్షాత్కారం పొందాడు .ఆత్మ తత్వాన్ని బోధించమని కోరాడు .శ్రీ హయగ్రీవ రూపం దాల్చి నాలుగు శ్లోకాలతో తత్వోపదేశం చేశాడు .అదే భాగవతం .దీనినే ”హయగ్రీవ బ్రహ్మ  విద్య ”అంటారు .దీని విస్తరణ ,సారాంశమే భాగవత స్వరూపం .భాగవత తత్త్వం లో వేదాంతుల మాయా సిద్ధాంతం ,సాన్ఖ్యుల ప్రకృతి సిద్ధాంతం ,శైవుల శాక్తేయం ,మీమాంసకుల కర్మ మొదలైన వన్నీ భగవంతుని దివ్య లీలలలో సమన్వయ పరచటం జరిగిందిఅని పాశ్చాత్య పండితులు  అభిప్రాయ   పడ్డారు . శ్రీమద్భాగవతం భగవంతుని వాజ్మయ అవతారం  అన్నారు శ్రీ రామ కృష్ణ పరమహంస .నారదీయం లో సకల వెద సారం వుంది అని ప్రముఖుల అభిప్రాయం .భగవత్ స్వరూప మైన ఈ ప్రపంచ సృష్టి రూపాన్ని వివరించేది ,అంటే భక్తుల ను గూర్చి వివరించేది భాగవతం అని విజ్ఞుల భావన .
           శ్రీ కృష్ణుడు బ్రహ్మం యొక ఆనంద స్వరూపం .ఆయన లీల,మధురిమ వల్ల సృష్టి అంతా జరిగింది అని శ్రీ అరవిందుల అభిప్రాయం ”.నిత్య సత్యానంత అమర లీలయే ఆయన .వేణు గానం   లో మానవుని లోని అజ్ఞాన మాయమైన క్రీదారూపాన్ని మార్చి ,దానిలో తన స్వీయ దివ్య ఆనందం యొక్క లీలా విలాసాన్ని నింపుతాడు .రాధ ,భగవంతుని విశుద్ధ ప్రేమ యొక్క మూర్తీ భావం .అదిసంపూర్ణం,సమగ్రం    .–ఆత్మ ప్రదానానికి ,సంపూర్ణ నివేదనకు సంకేతం”అంటారు శ్రీ అరవిందులు .
   ” గోపా ”అంటే  ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పాలించే వారు ”అని వారి భాషణం .వారిలో ఆధ్యాత్మిక అనుభవం వుంది .ప్రేమ ,భక్తి ,ఆత్మదానం గల అసాధారణ జీవులుగా భావిస్తారు గోపికలను .గోలోకం లో ప్రేమ ,సౌందర్యం,ఆనందం గల దివ్య ప్రపంచం ఆధ్యాత్మిక ప్రభలతో వెలుగుతుంది .గోపి ,గోప రూపాలైన ఆత్మలు ఆ ప్రభలను కాపాడుతాయి .రాధ ప్రాకృతిక ఆత్మ .కృష్ణుడు భగవదాత్మ .
         ఒకప్పుడు ఇంద్రుని భార్య శచీదేవి విష్ణు లోకానికి వెళ్లి ఆయన తోడ పై కూర్చోవాలని కోరిక తెలిపింది .”నువ్వు భూలోకానికి వెళ్ళు .నేను కృష్ణుడు గా పుట్టి నీ కోరిక తీరుస్తాను .’అని చెప్పాడు .వ్రజ భూమి లో వ్రుషభానునికి ,కళావతి కి రాధ జన్మించింది .కృష్ణునికి ఆమె మేనత్త .కృష్ణుడు గో లోకం లో వున్నప్పుడు ”రాసము నుండి,ఆతనిప్రక్కనుండి ,పరిగెత్తింది ”అంటే ”రాసంబు నుండి పుట్టి హరి ఎదుట ధావనము చేసింది ”కనుక రాధ అయింది .రాధ శరీర రోమ కూపాలనుండి గోపికలు జన్మించారు .కృష్ణుడు అంటే సర్వం చేశే వాడు ,చిత్తాన్ని ఆకర్షించే వాడు .రాదా కృష్ణులు ప్రేమైక జీవులు .కృష్ణ వర్ణం” నీలం ”.సముద్రం ,ఆకాశం అనంతమైన నీల వర్ణం కలవి .అనతత్వానికి ప్రతీకయే నీల వర్ణం .వజ్రనీలం ఆతని తేజస్సు .
        అవతారం పరిణామానికి   ప్రతీక గా శ్రీ అరవిందులు  భాష్యం చెప్పారు .జలం లో మాత్రమే సంచరించేది మత్యావతారం .ఉభాయచరం కూర్మావ తారం .భూచరం వరాహావతారం .పశు మానవ కలయికే నారశింహ అవతారం   .పొట్టి మొదటి  మానవుడే వామనావ తారం .అది భౌతికత ,లోపలి భగవత్ తత్త్వం వుండటం తో ప్రపంచాన్ని ఆక్రమిన్చేవాడు  .రాజసిక .ర్రజషిక రూపం పరశు రాముడు .సాత్విక రూపమే శ్రీ రాముడు .శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక వికాసం యొక్క చివరి రూపం ”.సూపెర్ మైండ్” అంటే శ్రీ కృష్ణుడే .బుద్ధుడు నిర్వాణం ,విమోచనం కల్పిస్తాడు .ఉత్కృష్ట రాజ్యాన్ని   భూమి పైకి తెచ్చి ,ప్రతిఘటించే వారిని సంహరించి ,లోపాల్ని సరిదిద్దే వాడే కల్కి అవతారం .ఈ విధం గా ఊర్ధ్వ క్రమం లో క్రమ పరిణామ దశలు కన్పిస్తాయి .శ్రీ క ఆనంద మయుడై  ,ఆనంద దిశ గా నడిపే వాడే శ్రీ కృష్ణుడు  .
”ఓం సచ్చిదానంద రూపాయ -క్రిష్ణాయాక్లిష్ట  కర్మనే  –నమో వేదాంత వేద్యాయ-గురవే బుద్ధి సాక్షినే  ”
                       మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -08 -11 .
Posted in సమయం - సందర్భం | Leave a comment

రెండవ ప్రపంచ తెలుగు రచయతల మహా సభల దృశ్యాలు

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సాహితీమండలి ఉయ్యూరు – 258 ఆహ్వాననం

Sahithimandali 258 110821

Posted in సభలు సమావేశాలు | Leave a comment

జాతీయ ప్రభుత్వం ఏర్పరచాలి—–“దేశం నిజం గా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది “

        జాతీయ ప్రభుత్వం ఏర్పరచాలి
                 దేశం నిజం గా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది .దిశా నిర్దేశం చేయ లేని ప్రధాని ,నిమ్మకు నీరెత్తి నట్లు మౌనమే నీ భాష వో చిన్ని మనసా అనుకుంటూ ,నీరో చక్ర వర్తి లా జేబుల్లో చేతులు పెట్టు కోని పాపం జపం చేసు కొంటు ,నీతిని చూడను మంచిని వినను  మాట్లాడను అని భీష్మించు కోని కూర్చొంటే ,అవినీతి చక్ర వర్తులు అందలం ఎక్కి సందడి చేస్తూ ,కలకలం సృస్తిస్తున్నా కిమిన్నాస్తి గా వున్న ఈ దేశం నిజం గా మునుగు తున్న పడవే .ఆ నాటి లోక నాయక జయ ప్రకాష్ నారాయణ్ ఏ స్ఫూర్తి తో దేశాన్ని మేలు కొలిపి జనతా ప్రభుత్వం ఎర్పరచాటానికి కారణమయారో అలాంటి పరిస్తి తే మన ముందుంది .పూజ్య అన్నా హజారే దేశ ప్రజల గుండె తలుపులు తట్టి జాగృతం చేస్తున్నారు .ఇక అది బధిర శంఖారావం కాకూడదు .సమయం వచ్చేశింది .జాతి జనులంతా సమైక్యం అవాలి .ఇక్కడ పార్టీ భేదాలు పక్కన పెట్టండి .అభిప్రాయ భేదాలు విడనాడండి .అన్ని పార్టీలు దాదాపు ఒకే వేదిక పైకి చేరటం ఒక శుభ సందర్భం .దీన్ని చారిత్రాత్మక సన్ని వేశం గా భావించండి .ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఆసన్న మయ్యాయి .దేశాన్ని మళ్ళీ ఆ చీకటి రోజుల్లో కి నేట్టకండి .అయితే కిం కర్తవ్యం ?
              దేశం లో ఇప్పుడు అవినీతికి ,ఆశ్రిత పక్ష పాతానికి దూరం గా ఉంటూ ,సమర్ధుడు గా పేరు పొంది  ,దార్శనికుని గా గణత కెక్కిన, వివాద రహితుడైన బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను  ప్రధాన మంత్రి ని చేయ టానికీ ,ఆయన నేతృత్వం లో ప్రజా స్వామ్య జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయ టానికి బి;జే.పీ .,వామ పక్షాలు , తెలుగు దేశం ఇతర ప్రజాస్వామ్య పార్టీలు అన్నా ది .ఏం .కే .,మొదలైన ప్రతి పఖాలన్ని ఏక తాటి పై నిలిచి ,ఆయనకు మద్దతు తెలిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవాలి .ఆలశిస్తే కాలమ్ క్షమించదు .చరిత్ర సహించదు .నితీష్ కుమార్ నాకేమీ బంధువు కాదు ,ఆత్మీయుడు కాదు ,మచ్చ లేని నాయకుడు అనే నేను ఈ సూచన చేశా .అన్నా వెనక వుండి ఆ నాటి జయ ప్రకాష్ లా నైతికబలం   ఇస్తారు .ప్రభుత్వాన్ని నడపాల్సింది ఇలాంటి సమర్దులే .
          ఇక మన రాష్ట్రం లో” జగన్మాయ ”దృష్టాంతాలు ,వృత్తాంతాలు రోజూ paper లలో మీడియా లో చూసి కంగారు పడకండి .ఇదంతా ఒక సేన్సషణ్ .ఆ తర్వాత పవిత్ర జలం చల్లి అగ్ని పునీతుడిని చేసి పార్టీ పగ్గాలు అప్ప గిస్తారు .కనుక దీనికే చంకలు గుద్దు కో నక్కర్లేదు .ఆనాడు సుఖరాం ,రాంలాల్ ,చెన్నా రెడ్డి ,భజన్ లాల్ లను అక్కున చేర్చి నట్లే మళ్ళీ అతనికి అందలం అందిస్తారు .అతని శక్తి సామర్ధ్యాలు ,సామ్రాజ్య విస్తరణ తెలిసిన వారెవ్వరూ దూరం చేసు కో లేరు .ఇదో విష సంస్కృతి .మళ్ళీ ఆ గూటికి చేరాల్సిందే .చేర్చు కోవాల్సిందే .ఇది తాత్కాలిక ఎడబాటు .దీన్ని భూతద్దం లో చూడద్దు .దీన్ని తగిన వారెవరో చూసుకొంటారు
             మనం విశాల దృక్పధం తో ఆలోచిద్దాం .అన్న కు మద్దతు అంటే ఒట్టి మాటలు కాదు .సమర్ధమైన నీతి వంతమైన ,నిజమైన పరిపాలనను అందించటమే .వో నా దేశ ప్రజలారా ,రాజకీయ పార్టీ ప్రముఖు లారా రండి ,కలవండి ఏకం కండి .సమర్దవంత మైన జాతీయ ప్రాభుత్వాన్ని ఏర్పరచి భారత మాత కన్నీరు తుడవండి ,ప్రజల బాగోగులను పట్టించుకోండి .ఇక అలసత్వం వహిస్తే ప్రజా చైతన్యం ముందు మీరు తల వంచుకొని నిల బడాల్సి వస్తుంది జాగ్రత్త . ,
                                     గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -08 -11 .
Posted in రాజకీయం | 1 Comment

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు –సమీక్క్ష —-7

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు  –సమీక్క్ష —-7
               ముగింపు సభకు ముందు జరిగిన సభలో స్టూడియో యెన్ .అధికారి శ్రీ సాంబశివ రావు–బిడ్డలు తెలుగు తల్లిని కాపాడు కొంటాం అని ఓదార్చే దయనీయ స్థితి రావటం శోచనీయం అన్నారు .ఇప్పుడుమనం ”బాధా ప్రయుక్త రాష్ట్రం ”లో వున్నాం.యాస భూషణమే నన్నారు ..ఒడిస్స లోని బరంపురం లో ఇటీవల తెలుగు మహాసభలను దిగ్విజం గా నిర్వహించిన శ్రీ పూడి పెద్ది సత్య నారాయణ -తమ రాష్ట్రం లో సమస్యల్ని తామే పరిష్కరించు కొంటున్నామని ,తెలియ జేశారు .గుంటూరు కు చెందిన శ్రీ పాపి రెడ్డి తమ అనుభవాలను వివరించారు .జర్నలిజం కళాశాల అధినేత ప్రముఖ పాత్రికేయులు శ్రీ సతీష్ చంద్ర తమ ప్రసంగం లో తెలుగు వారు తెలుగు తక్కువ వారు గా వుండటం బాధాకరం.భాష ఉత్పత్తి సంబంధాల మీద వృద్ధి చెందుతుంది .ఆలోచనా మాధ్యమం ఆంగ్లం గా వుంటే అసలైన తెలుగు రాదు .భాష ప్రజాస్వామీకరణ చెందాలి .గిడుగు రామ మూర్తి గారి తర్వాత భాషోద్యమం చేబట్టిన వారు లేక పోవటం విచారకరం .పామర జనులు వాడే పదాలను పత్రికలను స్వీకరించాలి అప్పుడే భాష పరిపుష్టం అవుతుందని  సలహానిచ్చారు .సారం నుంచి భాష రూపం లోకి వస్తుంది .ఉద్యమాలు భాషనూ శాశిస్తాయి .తెలుగు తల్లి నడకను ఆపవద్దు అని కోరారు .అన్ని వర్గాల ప్రజలు మాట్లాడే పదాలు భాషలో చేర్చాలని సూచించారు .ప్రముఖ సిని విశ్లేషకులు శ్రీ పైడి పాల మాటాడుతూ తెలుగు సినిమా భాష ,మాట ,పాట ,పేర్లు తెలుగును భ్రస్టు పట్టిస్తున్నాయని ఆవేదన చెందారు .మేలు కంటే కీడు ఎక్కువ జరుగు తోంది .పాటల్లో ,మాటల్లో ఆశ్లీలాలు చోటు చేసుకోవటం హర్షణీయం కాదు .జాగ్రత్త పడక పొతే భాష తీవ్రమైన నష్టానికి   లోను అవుతుందని హెచ్చరించారు .
                                          ముగింపు సభ
         ముగింపు సభకు శ్రీ పూర్ణచంద్ అతిధులను వేదిక మీదకు ఆహ్వానించారు .శ్రీ బుద్ధ ప్రసాద్ సభలో చేసిన తీర్మానలనుప్రవేశ పెట్టి చదివి విని పించారు .తెలుగు జాతి పునరుజ్జీవనం అట్టడుగు స్థానం నుంచి చేబట్టాలి .తెలుగు భాషా ,సంస్కృతి సభలు జరపాలి .తెలుగు లోనే అందరు మాట్లాడాలి,మాట్లాడించాలి .ప్రభుత్వం పై ప్రేరణాత్మక మైన ఒత్తిడి తేవాలి .తెలుగును కించ పరిచే వారిని తీవ్రం గా వ్యతి రేకించాలి .ప్రపంచం లోని వివిధ భాషల రచయితల కొస ”ప్రపంచ రచయితల సంఘం”ఏర్పరచాలి .వచ్చే నందన నామ సంవత్చారాన్ని ”తెలుగు భాషా సంవత్చరం ”గ ప్రకటించాలి .తెలుగును పాలనా భాష గా చేయాలి .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాదేమిని ,అధికారభాషా సంఘాన్ని పునరుద్ధరించాలి .తెలుగు లో చదివిన వారికి ప్రోత్చాహకాలు అందించాలి .తెలుగు కు మంత్రిత్వ శాఖ ప్రత్యేకం గా వుండాలి .ఈ తీర్మానాలను సభ ఏకగ్రీవం గా కరతాళ ధ్వనులతో ఆమోదించింది .ఇవన్నీ నిర్దిష్ట కాల పరిమితి లో జరగాలని అందరు కోరారు .
         అనుకోని అతిధి గా విచ్చేసిన లోక్ సత్తా అధినేత ,శాసన సభ్యులు శ్రీ జయ ప్రకాష్ నారాయణ -భాషను సజీవం గా ఉంచే ప్రయత్నం చేయాలి ,ఇరవై రెండు భాషల సమాఖ్య గా భారత దేశం ఇన్నేళ్ళుగా ఒకటిగా నిలిచి వుండటం గర్వ కారణం అన్నారు .తల్లిభాష వల్లనే బిడ్డ మేధస్సు వికశిస్తుంది .దీన్ని ప్రచారం చేసి అందర్నీ ఒప్పించాలి .భాషా  పరిణామ రావాలి .మారుతున్న అవసరాలకు తగినట్లు భాష మారాలి .కన్యాశుల్కం అజరామరం కావ టానికి కారణం సజీవ భాషా ప్రయోగమే నని గుర్తు చేశారు .
     హెచ్.ఏం.టి వి .అధినేత కే.రామచంద్ర మూర్తి –జిల్లా పత్రికలలో మాండలీకం బాగా వాడుతున్నారని ,ఇది శుభసూచకం అన్నారు .తెలుగు ,ఆంగ్లం ,అంతర్జాల భాషా  ఈ మూడూ అవసరమే నని చెప్పారు .భాషా విస్తరణకు పర్యవేక్షణ వుండాలని సూచించారు .సాక్షి పత్రిక సంపాదకులు శ్రీ కల్లూరి భాస్కరం –కొత్త పదాలకు ప్రామాణికత సాధించాలని అన్నారు .ఆంద్ర ప్రభ సంపాదకులు శ్రీ విజయ బాబు –నూతన శకానికి ఈ సభలు దోహదం చేశాయి అని మెచ్చుకొన్నారు .పద్మశ్రీ తుర్లపాటి కుటుంబ రావు -భాషను ,సంస్కృతినివిచ్చిన్నం   చేసే విధానం మంచిది కాదన్నారు .శ్రీ యలమంచిలి శివాజీ -అన్ని ప్రాంతాల రచయితలు ఒక చోట చేరిభాషను  గురించి ఆలోచించటం మంచి సంప్రదాయం”.క్రాప్ హాలిడే ”అనే పదం మన రాష్ట్రం లో సంచలనం సృస్తిన్చాతమే కాదు ,ఆంగ్ల భాషలోచేరిందని తెలిపారు   .
  ఎమెస్కో అధినేత శ్రీ విజయ కుమార్ -సార్వ జనీన రచనలు చేయమని రచయితలకు హితవు పలికారు .”తూర్పున వెలుగు రేకలున్న కాలమ్ లోపశ్చిమాన చీకటి  వుంది ”అన్న జర్మన్ రచయిత మాట మరువ రాదు అని గుర్తు చేశారు .ప్రముఖ బెంగాలి రచయిత శ్రీ ఇంద్ర నాద్ చౌదరి మాట్లాడుతూ భాష సాంఘిక అవసరం అన్నారు మాత్రు భాషే . .   అభివృద్ధి కి సోపానం   .ప్రభుత్వం కాదు ,ప్రజలే భాషను నిలబెట్ట గలరు  .భాషలో కొత్త పదాలు చేరటం తప్పదు . పాశ్చాత్య అనుకరణ   మంచిది కాదు .ఈ దేశ సంస్కృతిని నిలబెట్టుకోవాలి .జీవించటం ,తర్కించటం లో స్వేచ్చ అవసరం అని  అన్నారు .శాసన మండలి సభ్యలు శ్రీ చిగురు పాటి వర ప్రసాద్ –ఇటీవలి కాలమ్ లో భేదాలు లేని రాష్ట్ర స్థాయి సమావేశామీ సభలే అవటం ఆదర్శ వంతం గా వుంది అని హర్హాన్ని ప్రకటించారు .ఓడిస్సా రచయిత్రి పద్మశ్రీ ప్రతిభారాయ్ భాషను వాడక పొతే ప్రమాదం అని హెచ్చరించారు .
         ముగింపు సభకు ముఖ్య అతిధి గా విచ్చేసిన ఆంద్ర ప్రదేశ్ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్   శ్రీగ్రంధి  భవానీ ప్రసాద్ తమ సందేశం లో తెలుగు తనం అన్నిటా వర్దిల్లాల్ని ,భాషను తక్కువ చేసి మాట్లాడ రాదనీ ,తెలుగు చిరంజీవి అవటం తధ్యం అనీ ,సంక్షోభాలను నివారించేది భాషేనని ,ఇక్కడి ఈ స్పందన ప్రపంచాన్ని కదిలిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు .సామాన్యుని కోసం రచనలు చేయమని సూచించారు .సమస్యలను ప్రతిబింబించే రచనలు రావాలని ,తెలుగు అజరామర మైన భాష అని ఆశావహం గా తమ ప్రసంగాన్ని ముగించారు .
   మైసూర్ లోని భారతీయ భాషా కేంద్రం అధిపతి శ్రీ ప్రభాకర్ -భాషాభి వృద్ధి ఒక పధకం గా ప్రభుత్వం చే బట్టాలి  అని  కోరారు .శ్రీ గోళ్ళ నారాయణ రావు -అక్షర రధం క్షేమంగా గమ్యస్థానం చేరుతుందని,కొత్త తెలుగు పలుకుబడులతో తెలుగు పరి పుష్టం అవుతుందని ఆశించారు .శ్రీ రసమయి రామా రావు -సదస్సున్ను జయప్రదం చేసిన అందరకు కృతజ్ఞతలు తెలియ జేశారు .ఇంతమంది ప్రముఖులు వేదిక నలంకరించి సుసంపన్నం చేసి నందుకు కార్యవర్గం కృతజ్ఞతలు తెలియ జేసింది
   కార్య వర్గ సభ్యులకు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదు గా జ్ఞాపికలు ,తెలుగు పున్నమి పుస్తకాన్ని అందించి ,శాలువాలతో సత్కరించారు .వాలన్తీర్లందరికి జ్ఞాపికలు అందజేసి ,వారి సేవలను ప్రస్తుతించారు .
   మూడు రోజుల పాటు తెలుగు భాషా యజ్ఞం గా ,తెలుగింటి పెళ్లి వేడుక గా ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు దిగ్విజమయాయి .నిబద్ధత ,సమయ పాలన విస్తృతమైన ఏర్పాట్లు చేసి క్రుతక్రుత్యులయారు .సర్వశ్రీ గుత్తికొండ సుబ్బా రావు ,జి.వి .పూర్ణచంద్ ,మండలి బుద్ధప్రసాద్ ,యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లు సభలను విజయవంతం గా ఆశావహం గా నిర్వహించి నందుకు అందరి ప్రశంశలను అందుకొన్నారు .తెలుగు భాష చిరంజీవి అవుతుందని ,విశ్వ భాష గ వర్ధిల్లుతుందని ,విశ్వ వ్యాప్తం అవుతుందని ఈ సభలు పూర్తి ఆశాభావంను  అందరి లోను కల్గించాయి
          ఈ మూడు రోజులు సాయంత్రం వేళల్లో తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రం లో సాంస్కృతిక కార్య క్రమాలను నిర్వహించి కళా సరస్వతికి నీరానాలన్దించారు .శ్రీ గరిక పాటి నరసింహారావు గారి అష్టావధానం ,తెలుగు ప్రశస్తి నృత్య రూపకం ,ఆచంట బాలాజీ నాయుడు గారిమయసభ ,శ్రీ చందు భాస్కర రావు గారి హరికధా ,”తెలుగు భాష నాడు ,నేడు నృత్య రూపకం ,శ్రీ చేగొండి సత్యనారాయణ మూర్తి గారి ”ఆంద్ర  ‘   పద్య కవితా వైభవం” ,శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మ గారి ”దేశ భక్త ”ఏక పాత్రాభినయం ,పానుగంటి వారి ”స్వభాష ”ప్రహసనం ”జయహో కృష్ణ దేవ రాయ ”నృత్య రూపకం,శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ గారి ”వేమన ”పద్య నాటకం ప్రేక్షకులను మధురానుభూతిని కల్గించి చిరస్మరణీయం చేశాయి .

 

Posted in సభలు సమావేశాలు | 1 Comment

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —6

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —6
          కంప్యుటర్ లింగ్విస్ట్ కు జీవితాని అంకితం చేసి పని చేస్తున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వర రావు -భాషకు సామర్ధ్యం జోడించాలి .అని రంగాల్లో తెలుగుని వాడాలి అప్పుడే మనగలుగుతుంది మనది అవుతుంది పాలిసి మేటర్ గా తెలుగును అన్నిటా ఉపయోగించాలి .దీనికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి .ఏ లిపి లోనైనా తెల్గు చదువుకొనే ఆలోచనా చేశాం .ఇదే ”విశ్వ సంకేత మాలిక ”.తెలుగు పడ విశ్లేషిని  ఏర్పాటయింది .సంక్లిష్ట రూపం లో వున్న తెలుగును సరళ తరం చేస్తున్నాం .ఈ ఏర్పాటు ఏ భారతీయ భాషకు లేదు .”తెలుగు పడ జనకం”తయారు చేశాం .తెలుగు రాణి వాళ్ళు కూడా తెలుగు పదం సృష్టించుకో వచ్చు .”తెలుగు పదవిభాగ నిధి ”తయారు చేశాం .రెండు లక్షల పదాలు ఇందులో వున్నాయి .ఇది పడ విశ్ల్షణ చేసే విధానం .”పడ సత్వ నిరోపనం ”వచ్చింది .సంధి విచ్చేదకం ,బహుభాషా నిఘంటువు లు తెచ్చాం.తెలుగు పర్యాయ పడ కోశం చేశాం .వీటి అన్నిటి ద్వారా యంత్రానువాదం చేయటానికి మార్గం తేలికయినది .దీనిపై ఇంకా కృషి చేస్తే పరిపూర్ణత సాధించ వచ్చు .పాణినీయం ఆధారం గానే అన్నీ జరుగుతున్నాయని హర్శధ్వానాలమధ్య తెలియ జేశారు .కంప్యుటర్ శక్తి అనంతం అన్నారు .బాలవ్యాకరనానికి అది వ్యాకరణం సృస్తిన్చాము అని ఇది ఒక అపూర్వ ప్రయోగం విప్లవం అన్నారు .ఉమమహేశావర రావు గారి ఉపన్యాసం ఆసాంతం ఆ కట్టు కొంది .పులకించిన ప్రతి నిధులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో కృతజ్ఞత తెలియ జేయటం ఆ మహానుభావుని విజ్ఞానానికి ఘనమైన అభినందనం .
          ప్రసిద్ధ పండితులు కవి ,రచయితఆచార్య శలాక రఘునాధ శర్మ -తెలుగు భాష లో మనము ,అమ్మ అనే రెండు పదాలు వుండటం అదృష్టం .అమ్మ అనే మాటలో సర్వ వాజ్మయం నిక్షిప్తమై వుంది అని గొప్ప భావాన్ని అందించారు .శ్రీ కాలనాధభట్ట వ్వీర భద్ర శాస్త్రి కాగితం వాడకం తగ్గి కంప్యుటర్ వాడకం హెచ్చటం గొప్ప మార్పు అని అభిప్రాయ పడ్డారు .64 కళలు .కాం సంపాదకులు శ్రీ పాలెపు కళాసాగర్ -తాము లలిత ,చిత్రకళలు ,నాటకం పైన మంచి సంచికలు తెచ్చామని ,చెప్పారు .రమణీయ ఫాంటు సృష్టి కర్త
శ్రీ అంబరీష ఉచితంగా తమ ఫాంటును ఆదిత్య ఫాంట్.కాం ద్వారా ప్న్దవచ్చునని తెలియ జేశారు .తన మేనమామ ప్రముఖ కవి విమర్శకులు స్వర్గీయ మిరియాల రామ కృష గారి ”ఇంచక్కటి తెలుగు వదలి -ఇంకో భాష ఎందుకురా –భలే తెలుగు బంగారం లాంటి తెలుగు ”కవితను చదివి ఉత్తేజితులను చేశారు .
           సభా సమన్వయ కర్త శ్రీ కూచిభొట్ల ఆనంద్ చక్కని సమన్వయము చేసి అమ్రుతానందాన్ని పంచారు .తెలుగు భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు .తెలుగు విశ్వ వ్యాప్తమై ,అంతర్జాలం తో అందర్నీ చేరి ,ప్రపంచం లోనే మొదటి స్థానం పొందుతుందని తెలుగు భాష చిరంజీవి అని ,విశ్వ భాష గ త్వరలోనే గుర్తింపు తెచ్చుకొంటుందనీ ఆశాభావం తో అందరి కరతాళ ధ్వనులు అందుకొన్నారు .సభలో ప్రతిస్పందనను తెలియ జేయమని కోరారు ”.ఈ సదస్సు అర్ధవంతమైన ,ప్రయోజన కరమైన ,ప్రయోగాత్మకమైన ప్రామాణిక మైనసదస్సు అనీ ఈ తరం వారికీ భవిష్యత్ తరాల వారికి అత్యంత అవసరమైన సభ అనీ ఇందులోపాల్గొన్న  యువ సాంకేతిక నిపుణులు అభినందనీయులని తెలుగు చిరంజీవి అనే నమ్మకం కలిగించినందుకు అందరికి అభినందనలు”అని గబ్బిట దుర్గా ప్రసాద్ తమ ప్రతిస్పందన తెలియ జేయ గానే అందరూ ఆమోదం తెలిపారు .
Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —సమీక్ష –5

                                 ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —సమీక్ష –5
           65 వ భారత స్వాతంత్ర్య దినోతవంసందర్భం గా 15 -08 -11 సోమవారం ఉదయం ఎస్.వి .ఎస్.కళ్యాణ మండప ప్రాంగణం లో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ జాతీయ పతాకావిష్కరణ జరిపారు .ఆ తర్వాత ”మా కొద్దీ తెల్ల దొరతనం ”అని జాతీయ స్ఫూర్తిని కలిగించిన తొలి జాతీయ కవి స్వర్గీయ ”గరిమెళ్ళ సత్యనారాయణ వేదిక ”పై   స్వాతంత్ర్య దినోత్చవ సభ  వైభవం గా జరిగింది .మూడవ రోజూ ,ఆఖరి రోజూ అయిన ఈ రోజూ ”జాతీయతా భావం -రచయితల పాత్ర ”అనే అంశం పై సభ జరిగి జాతీయ స్ఫూర్తిని కలిగించింది .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించినిర్వహించారు .అధ్యక్షోపన్యాసం లో రచయితల సభలు స్వాతంత్ర్య దినోత్చావం నాడు ముగియటం చారిత్రాత్మక మైన సన్ని వేశం అన్నారు   .వందే మాతరం తో పాటు జాతీయ గీతాలను శ్రీమతి భూదేవి శ్రావ్యం  గా ఆలాపించి దేశభక్తిని కలిగించారు .కొందరు కవులు ,గాయకులూ ప్రబోధ గీతాలను పాడిఉత్తేజం   కల్గించారు .  తమ అభిభాషణం లో శ్రీ బుద్ధ ప్రసాద్ -మహామహుల త్యాగ ఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నా స్వాతంత్ర్యం అని గుర్తు చేశారు .ఆ తరం లోని కవులు గరిమెళ్ళ ,చిలకమర్తి ,గురజాడ ,రాయప్రోలు ,దామరాజు పుండరీకాక్షుడు తమ గీతాలతో జాతీయ చైతన్యం కల్గించారు .ఆంద్ర పత్రిక ,కృష్ణా పత్రిక ప్రజల్ని జాతీయ ఉద్యమం వైపు నడిపాయి .మన తాలి రాజకీయ ఖైది గాడిచర్ల హరి సర్వోత్తమ రావు అని జ్ఞాపకం చేశారు .శ్రీ అరవిందుల జన్మ దినం నాడు స్వాతంత్ర్యం రావటం ఆనంద దాయకం .భారతీయ స్వాతంత్ర్య పోరాటం లో తెలుగు వారి పాత్ర గణనీయం .జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య గారు తెలుగు వారు అవటం మనకు గర్వ కారణం .ఆ నాటి ఉద్యమ ధ్యేయం మాతృభాష లో విద్యా బోధన .ఇప్పటికీ ఆ కోరిక తీరక పోవటం దురదృష్టం .మొదటి ప్రధాని నెహ్రు సాహిత్య వ్యాప్తికి అకాడెమీలు స్థాపించి తన దార్శనికతను నిరూపించారు .ఇవాళ అవన్నీ  అంతరించాయి .వాటి పునరుద్ధరణ తక్షణ కర్తవ్యమ్ .సంస్కృతీ సంపదను పరి రక్షించు కోవాలి .సమాజాన్ని సమైక్య పరచాలి అన్న అ నాటి నాయకుల ,పాలకుల దూర దృష్టి ని  ఇప్పటి వారు అలవరచు కోవాలి .రచయితలు విశ్వ జనీన దృక్పధం తో రచనలు చేయాలని ,విశ్వ శ్రేయస్సే ధ్యేయం కావాలని ఉద్వేగం గా ఉత్తేజం గా తమ ప్రసంగాన్ని ముగించి స్వాతంత్ర్య దినోత్చవ వేడుక రోజున గొప్ప స్ఫూర్తి కల్గించారు
         ప్రముఖ హిందీ రచయిత్రి,సంఘ సేవకురాలు  శ్రీమతి ప్రతిభా రాయ్ -మనభాశాలను ,సంస్కృతినీ కాపాడుకొనే కొత్త ఉదయం నడుస్తూందని చెప్పారు .భాషలన్నిటిని గౌరవించాలి .మాతృభాషను మరువ రాదు అని ఉద్బోధించారు ..ప్రసిద్ధ బెంగాలి రచయిత శ్రీ ఇంద్ర naadh చౌదరి –స్వాతంత్ర్యం అంటే సాంఘికం గా అభి వృద్ధి  చెందటమే . సాంఘిక స్వేచ్చ ,రాజకీయ స్వేచ్చ తో jatha కలవాలి .యువతరం మన ఆశా దీపం .వారిని మరిచి పోరాడు .తెలుగు రచయితలు చాల మండి తనకు తెలుసుననీ వారంతా గొప్ప జాతెయ భావం కలిగించారని గుర్తు చేశారు .కలకత్తా కు చెందిన ప్రముఖ సంస్కృత ఆచార్యులు శ్రీమతి ఉషా చౌదరి -తనకు ఈ సభలు చూస్తుంటే తెలుగు నేర్చుకోవాలని అనిపిస్తోందని,తెలుగు గొప్ప సంస్క్రుతీవిలసనం కల్గించిన భాష.అన్నారు .భారత అంటే సూర్యుడు ,ప్రకాశం ,జ్యోతి అనే అర్ధాలున్నాయి .ఆ వెలుగులు జాతి లో నింపాలి .రచనల లో ఆ ప్రకాశం కనిపించాలి,వికాసం కలిగించాలి ,పురోగమనానికి తోడ్పడాలని కోరారు .శాసనమండలి సభ్యులు శ్రీ అయిలాపురంవెంకయ్య తెలుగుభాష వికాసానికి ఈ సభలు తప్పక తోడ్పాడుతాయి అని ఆశాభావం ప్రకటించారు .శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ –మనది మహత్తర జాతి .అమెరికా అధ్యక్షులు ఒబామా కు మన గాన్దీజియే స్ఫూర్తి అని ఆయనే ఇటీవల తెలియ జేశారని చెప్పారు .గత అయిదు వేల ప్రపంచ చరిత్ర లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అయిదుగురు ప్రముఖుల్లో ముగ్గురు భారతీయులే అవటం మనకు గర్వ కారణం .ఆ ముగ్గురు శ్రీ కృష్ణుడు ,బుద్ధుడు మహాత్మా గాంధి అని భావ స్ఫోరకం గా తమ ప్రసంగాన్ని ముగించారు .వివిధ భాషా వేత్తలు ఈ సభలో ప్రసంగించి గొప్ప జాతీయ స్ఫూర్తిని కలిగించి చరితార్ధం చేశారు ,
            ఈ సభ తర్వాత ఆరవ సదస్సు” సి.పీ.బ్రౌన్ వేదిక ”పై ”సాంకేతికం గా తెలుగు భాషాభివృద్ధి ”అనే అతి ముఖ్యమైన విషయం పై  జరిగింది .ఇందులోని చర్చనీయ అంశాలు –”కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలతో తెలుగుభాష ,ఫాంట్లు ,ఉపకరణాలు లిపి వికాసం -ఆధునిక అవసరాలు ” సభా సమన్వయాన్ని అమెరికా లోని సిలికానాంధ్ర కు చెందిన మచిలీపట్నంకు చెందిన శ్రీ కూచిభొట్ల ఆనంద్ కావటం ఆనంద దాయకం గా వుంది .మొదటగా ”రమణీయ ”అనే ఉచిత తెల్లుగు ఫాంట్ ను శ్రీ లక్ష్మి ప్రసాద్ ఆవిష్కరించారు .ఇది చాల కీలకమైన సదస్సు .అందరి దృష్టీ దీనిమీదే వుంది .
        తొలి ప్రసంగం లో సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ హర్ష వర్ధన్ తెలుగును మృత భాష గా కాకుండా ,అమృత భాష గా చేయమని సూచించారు .సమన్వయ కర్త శ్రీ   ఆనంద్ –తెలుగుకు ప్రపంచ హోదా సాధించాలి .మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాని వాడుకోవాలి .నేడు అంతర్జాలం మానవ నాగారకతను   అధికం గాప్రభావితం   చేస్తోంది .హారీ పోట్టర్ పుస్తక రచయిత్రి అంతర్జాలం తోనే అంతట్టి ప్రాముఖ్యం పొందింది .తొలి ఇంటర్నెట్ సదస్సు హైదరాబాద్ లో జరిపాం.ఇప్పుడు ”ఈ” పుస్తకాలు విరివిగా వస్తున్నాయి .సిలికాన్ వాలీ కాలిఫోర్నియా లో సెప్టెంబర్ లో ఒక అంతర్జాతీయ ఇంటర్నెట్ సదస్సు నిర్వహించ బోతున్నాం .లక్షలాది పుస్తకాలను నిక్షిప్తం చేసుకొనే పరికరం వచ్చింది ఇది చదువుకోను వచ్చు కావాలంటే చదివి వినిపించుకోనేట్లు చేసుకో వచ్చు .త్వరలో ఆరు అందమైన తెలుగుఫాంట్లు తెస్తున్నాం .అంతర్జాలాన్ని సద్వినియోగం చేసుకొని తెలుగు భాషకు అంతర్జాతీయ హోదా సాధించటమే మన ధ్యేయం  .తెలుగు కొద్ది రోజుల్లో విశ్వ భాష అవుతుంది అని చాలా నిర్దుష్టం గా విశ్వాసం గా ప్రసంగించి ఈ సభ ఆలోచనకు సార్ధకత తెచ్చారు .
          తరువాత ప్రసంగించిన శ్రీ అమరనాధ రెడ్డి తెలుగు స్పెల్లింగ్ చెక్కర్ ,ఎడిటర్ ,బ్రౌజర్ లను విడుదల చేసినట్లు తెలియ జేశారు .ఇంటర్నెట్ లో మార్పులకు యూనికోడ్ కన్సార్టియం ఏర్పాటు చేసి ,ఎక్కువ మంది తెలుగు వారు అందులో ఉండేట్లు చేస్తున్నామని చెప్పారు .కృష్ణా  విశ్వ విద్యాలయం మాజీ ఉపకులపతి శ్రీ మైనేని కేశవా దుర్గా ప్రసాద్ -ఆధునిక సాంకేతికత్వంతో తెలుగు పురోగమిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు .శ్రీ వీవెన్ దృశ్య మాధ్యమాన్ని చక్కగా ఉపయోగించుకొని ప్రసంగించారు విండోస్ విస్టా తో మన కంప్యూటర్ లో తెలుగు రాసుకో వచ్చు.mobiles
లో కూడా తెలుగు రాసే అవకాశం వచ్చింది .పుస్తకం చదివి వినిపించే ఏర్పాటు వచ్చింది ‘.ఈ ‘పత్రికలు చాలావున్నాయి .వాటిలో వ్యాసాలు రాయ వచ్చు .”బహుళ భాషా నిఘంటువు” వస్తోంది .మూడు వందలకు పైగా తెలుగు బ్లాగులు వున్నాయి .సాహిత్యం ,రచ్చబండ బ్లాగులు అందర్నీ ఆకర్షిస్తున్నాయి .”పద్య సుబోధకం ”వుంది ” .గురూజీ ”అనే సెర్చింగ్ బ్లాగ్ ద్వారా ఏవిషయాన్ని అయినా క్షణాల్లో పొందవచ్చు .ఇవన్నీ  ఉచిత సేవలే .తెలుగు లోనే కంప్యుటర్ వస్తోంది దీన్నే ”స్థానికీ కరణం ”అంటారు .అన్ని కంప్యూటర్లు అర్ధం చేసు కొనే ఫాంట్ త్వరలో రాబోతోంది .పుస్తకాలని ఈ పుస్తకాలుగా మార్చి అమ్ముకో వచ్చు .ఆన్ డిమాండ్ తో పుస్తకాలుముద్రించుకోవచ్చు  అని” కంప్యుటర్ ,అంతర్జాలం ”అనే అంశం మీద సాదికారికం గా  .వివరనాత్మకం గా సుబోధకం గా ప్రసంగించి అభినందనలు అందుకొన్నారు .
    శ్శ్రీ వెంకట రాం  -ఈ పుస్తకాలపై పూర్తి వివరణ ఇచ్చారు.డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లో 23 వేల తెలుగు పుస్తకాలు వున్నాయి .  మై డాక్యుమెంట్ లో వీటిని  దాచుకో వచ్చు .యూనివేర్సాల్.ది.ఎల్.లో 14 వేల పుస్తకాలను వాడుకో వచ్చు .పీ.ది.ఎఫ్  .లో వాటిని దాచుకో వచ్చు  .యాభై దాకా యూనిఫైడ్ కోడ్ లున్నాయి .వెబ్ మొబైల్ లో పత్రికలు చదువుకోవచ్చు . ”విద్యానిధి .ఆర్.ఆర్గ్ లో తెలుగు సిద్ధాంత గ్రందాలున్నాయి .”telugu thesis .కం లో అన్ని పరిశోధక గ్రంధాలు లభిస్తాయి .”గూ రీడర్ ”ద్వారా గూగుల్ నెట్ లోని పుస్తకాలు అనే దొరుకు తాయి .ఇతరులకు పుస్తకాలు ఇచ్చి సహాయపదేట్లు చేయ గలుగు తున్నాం .అయితే తెలుగు పుస్తకాలకు డిజిటల్ రైట్స్ మేనేజిమేన్త్స్ వచ్చేట్లు చేయాలి అని సవివరనాత్మకం గా ప్రసంగించారు .
   వీకీ పీడియా ను గురించి శ్రీ కిరణ్ మాట్లాడారు .దాన్ని చదవమనీ అందులో రాసి పరిపుష్టి కల్గించమని కోరారు .నలభై వేల పదాలతో నిఘంటువు ఉందనీ ,అందరు సహకరిస్తే దాన్ని ఇంక పెద్ద నిఘంటువు గ చేయ వచ్చునని తెలిపారు .ఇది ఒక మహా విజ్ఞాన సర్వస్వం అని వీకీ ని గురించి చెప్పారు
        ఇంతవరకు సాంకేతికం గా జరిగిన సభ విజయవాడ లోక్ సభ సభ్యులు శ్రీ లగడపాటి రాజా గోపాల్ రావటం తో సందడి తో నిండింది .ఆయన తెలుగు మీద మమకారం పెంచుకోవాలని సూచించారు .ఆదరణ పొందాలి తెలుగు అని ఆశించారు .తెలుగు ప్రాధాన్యత ను అందరు గుర్తించాలి ”భారత్తేయత బంధం –తెలుగు అనుబంధం ”అని ,;”భరత మాత పుత్రులలో ఘన పుత్రం తెలుగు ”అని కవిత్వం చదివి అలరించారు .తెలుగుభాష ప్రతి ఇంట ప్రతినోట పలికే టట్లు చేద్దాం అని ఆవేశం గా  అన్నారు .లగడపాటిని బుద్ధప్రసాద్ తెలుగుకు ప్రాచీన హోదా నిధులను విడుదల చేయించ వలసిందిగా అభ్యర్ధించగాఆయన సానుకూలం గా స్పందించారు .
   లిపి రూపశిల్పి శ్రీ శివరావు తెలుగు భాషకు ఒకే కీ బోర్డు వుండాలని ,అక్షరాని సుందరతరం చేయాలని ,ఏ అక్షరాన్ని తీసివేయ రాదనీ కోరారు మలేషియా కు చెందిన శ్రీ మునిరత్నం నాయుడు -1975 లో ”అంతర్జాతీయ తెలుగు సంస్థ” ఏర్పడిందని,దానికి కారకులు మాజీ విద్యామంత్రి స్వర్గీయ మండలి కృష్ణా రావు గారు అని గుర్తు చేశారు .చైనా జెర్మని ఫ్రాన్సు   దేశాల్లో కంప్యూటర్లు ఆయా భాషల్లోనే వున్నాయని ,మనం కూడా తెలుగు కంప్యుటర్ తయారు చేసు కోవాలని మంచి సూచన చేశారు   .

 

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష -4

     రెండవ ప్రపంచ తెలుగు రచయితల సభలు –4
          రెండవ రోజూ మధ్యాహ్నం ”గిడుగు రామ మూర్తి వేదిక ”పై నాల్గవ సదస్సు ”మాత్రుభాషల మనుగడ ,మాండలీకాల వినియోగం ,తెలుగు భాష కు ప్రాచీన హోదా అనంతర చర్యలు-తెలుగు భాషోద్యమం ”చర్చనీయాంశాలు జరిగింది .నడుస్తున్న చరిత్ర సంపాదకులు శ్రీ సామల రమేష్ అధ్యక్షా స్థానం వహించగా ద్రావిడ విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి శ్రీ గంగి శెట్టి లక్ష్మీ నారాయణ కీలక ప్రసంగం చేశారు .భాష పేరిట ఇంత గొప్ప పండుగ జరగటం చిరస్మరణీయం అన్నారు .చరిత్ర స్ఫూర్తి గతంకాదు గతి అని వివరించారు .అంటే నడిపించేది .ఒక ఉద్యమం గా ముందుకు సాగక పోతే భాషకు మనుగడ కష్టం అంటూ దిశా నిర్దేశం చేస్తూ ప్రసంగించి ఉత్తేజితుల్ని చేశారు .వారి సంభాషణ ఆద్యంతం స్ఫూర్తి దాయకం గా వుండి వక్తలకు ,ప్రతినిధులకు ,ఆనందం కల్గించింది .తర్వాత మాట్లాడిన డాక్టర్  ద్వా.నా.శాస్త్రి -భాషలో ఒత్తులు ,సున్నాలు తగ్గి పోవటం బాధగా వుంది అంటూ ,చానెళ్ళలో తెలుగు నేర్పెవారిని నియమించి భాష నేర్పించాలని సలహా ఇచ్చారు .తెలుగు లో చదివితే ఉద్యోగాలు రావు అన్నది భ్రమే నని ఇటీవలి కాలమ్ లో పోటీ పరీక్షలలో తెలుగు లో చదువుకొన్న వారే అగ్రస్తానాలు సంపాదించిన విషయం సోదాహరణం గా వివరించారు .డాక్టర్ వేలిమల సిమన్న  –ప్రామాణిక  భాష గురించి  కృషి జరగాలని ,పాండిత్య దృష్టి తో కాకుండా శాస్త్రీయ దృష్టిని కూడా జోడించి నిఘంటు నిర్మాణం జరగాలని సూచన చేశారు .జిల్లా మాండలీక పదకోశాలు విస్తృతం గానే వస్తున్నాయి .”ఆంద్ర ప్రదేశ్ మాండలిక పడ కోశం ”రావాల్సిన అవసరం ఎంతైనా వుంది అన్నారు .ఆధునిక సాహిత్యానికి వ్యాకరణాలు రావాలి .ప్రతిభ పెరుగుతూనే వుంది .తెలుగును శాస్త్రీయ దృష్టి తో బోధించాలి .మాతృభాష పట్ల మక్కువ వున్న అధికారులను నియమిస్తే భాష అభివృద్ధి చెందుతుంది అన్న విలువైన సూచన చేశారు .డాక్టర్ బూదాటి వెంకటేశ్వర రావు -తమ ప్రసంగం లో రచయితలు స్వయం వ్యక్తిత్వాన్ని సాధించుకోవాలి,ఆత్మ గౌరవం హుందా తో పని చేయాలి వైవిధ్యాలు వైరుధ్యాలు కా కూడదు .సమన్వయ దృక్పధం అవసరం అని హితబోధ చేశారు .సుప్రసిద్ధ సాహితీ వేత్త డాక్టర్ యు.ఏ.అనంత మూర్తి తమ అభి భాషణం లో -సాంకేతికత స్థిరబిందువు కాదనీ ,నిన్నటి సాంకేతికత నేటికి మారిపోతోందని ,ప్రయత్నా లోపం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం సాధించు కోవాలని ,మేధ ,అభ్యాసం ,లక్ష్యం వుంటే అన్నీ సాధించ వచ్చు నని సండర్భ శుద్ధిగా సలహా నిచ్చారు .ఏది ఎందుకోసం ,ఎవరి కోసం రాస్తున్నామో రచయితలు ఆత్మ పరిశీలనతో రాయాలని కోరారు .భాషా దురభి మానం వదిలి భాషాభిమానం తో ముందడుగు వేయమన్నారు .డాక్టర్ పాల పర్తి శ్యామలానంద ప్రసాద అవధాని ప్రాధమిక స్థాయి లోనే తెలుగు నేర్పాలి భాష నిరంతరం మారుతూనే వుంటుంది .అవసరమైన ఇతార భాషా పదాలను స్వీకరించి పరిపుష్టి కూర్చాలి .సహజమైన వాక్య నిర్మాణం చేయాలి .,దాన్ని వ్యాకరణం లో చేర్చాలి .తెలుగులో విస్తృతం గా మాట్లాడించాలి .తప్పులు దిద్దాలి .ప్రోత్చాహకాలు అందించాలి .అని మంచి సూచనలు చేశారు .శ్రీమతి సత్యవాణి -దేనికైనా భాషే మూలాధారమని ,దాని బోధనా ఆకర్షణీయం గా వుండాలని కోరారు .పత్రికా సంపాదకులు శ్రీ కొత్త పల్లి రవి బాబు మాట్లాడుతూ  ,మాండలీకం వేరు ,భాష వేరు అనుకోరాదని ,డిగ్రీ స్థాయి వరకు తెలుగు లో బోధన వుండాలని,నిరంతరం భాషను ఉపయోగించాలని ,ఆఫ్రికన్ దేశాల భాషా స్వాతంత్ర్య ఉద్యమం అందరికి స్ఫూర్తి దాయకం కావాలి అన్నారు  .ప్రసిద్ధరచయిత భాషోద్యమ నాయకులు శ్రీ కాలువ మల్లయ్య -తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవాలి ,ప్రైవేటు పాథ శాలల్లో కూడా తెలుగు నేర్పించటానికి తీవ్ర కృషి చేయాలని స్పష్ట మైన భాష విధానం కావాలని ,సూచన చేశారు .తర్వాత మాట్లాడిన డాక్టర్ గౌరి శంకర్ ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన తెలుగు వారిని అభినందిస్తూ ,పశ్చిమ బెంగాల్లో తెలుగు పుస్తకాలను ,అక్కడి బెంగాలే భాష లో నేర్పే ప్రయత్నాలు చేస్తున్నామని ,అయినా సఫలం కాలేక పోయామని ఆవేదన చెందారు .ఇక్కడి ప్రభుత్వం అన్ని రాష్ట్రాల తెలుగు వారికి ఉచితం గ పుస్త కాలు అందించమని సలహానిచ్చారు .ధిల్లీ లో తెలుగును బాగానే నేర్చుకొంటున్నారు . గుజరాత్ లోని సూరత్ లో తెలుగు అభ్యాసం వుంది .మారిషస్ లో తెలుగును ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు నేర్చుకొంతున్నారని ,డిగ్రీ లో స్పెషల్ తెలుగు చదవటం హర్షదాయకం గా వుందని అన్నారు .మలేషియా లో తెలుగు వాడకం తగ్గి పోతోందని బాధ పడ్డారు .     ,                 డాక్టర్ సంగయ్య -అన్నమయ్య ఉపయోగించిన పదాల మీద పరిశోధన జరగాలి అని చెప్పారు .విజయవాడ లోని భవానీ పురం ,ముత్యాలం పాడు పేర్లు వచ్చిన చరిత్ర వివరించారు .పాత్యామ్శాలలో తెలుగు ఉపయోగాన్ని తెలియజేయాలన్న విలువైన సలహా నిచారు .తాతయ్యలు పాటలతో పద్యాలతో కధలతో చిన్నారులను తీర్చి దిద్దాలి అని చెప్పారు .కళాశాలల్లో తెలుగుకు ప్రాధాన్యం కావాలి అన్నారు .డాక్టర్ పీ.వి.సుబ్బారావు -ప్రపంచీకరణ వ్యామోహం లో మన భాషను మరచి పోవటం సిగ్గు చేటు .1969 లో    తెల్లుగు మాధ్యమం  లో చదివితే అయిదు మార్కులు అదనం గా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు అమలు జేయక పోవటం విచారకరం ,.అధికార భాషా సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయమని డిమాండ్ చేశారు .
          శ్రీ పమ్మి పావన్ కుమార్ భాష అంటే సాంఘిక వ్యవస్థ .నిఘంటు నిర్మాణానికి ఆధునిక సాంకేతికను ఉపయోగించుకోమని సలహా చెప్పారు .శ్రీ ముత్తేవి రవీంద్ర నద -తెలుగు భాషకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వున్న విషయాన్ని విపులీకరించారు .బుద్ధుని కాలమ్ లో తెలుగు వాడుకం లో వుండటం దాని ప్రాచీనత కు నిదర్శనం అన్నారు .సభాధ్యక్షులుడాక్టర్ సామల రమేష్ బాబు తెలుగును అభివృద్ధి చేసి mundu తరాలకు అందించే బాధ్యత మన అందరిది అని గుర్తు చేశారు ఇందుకు ప్రజలు ,ప్రభుత్వం రచయితలు సమష్టి గా చేతులు కలిపి ముందడుగు వేయాలని సూచించారు .సభలో పాల్గొన్న వక్తలందరికి శ్రీ లక్ష్మి ప్రసాద్ సత్కారం చేశారు .
          సాయంత్రం కాశీనాధుని నాగేశ్వర రావు వేదికపై ”సాహిత్య పత్రికలు -రేపటి మనుగడ ”అనే విషయం పై అయిదవ సదస్సు జరిగింది .ముందుగా వివిధ ప్రముఖ రచయితలు రాసిన పడి పుస్తకాలను శ్రీ లక్ష్మి ప్రసాద్,శ్రీ బుద్ధ ప్రసాద్ లు  ఆవిష్కరించారు .
    వేదిక మీదకు వివిధ పత్రికా సంపాదకులను,చానెళ్ళ అధిపతులను  బుద్ధ ప్రసాద్ ఆహ్వానించారు .ముందుగా ఆంద్ర ప్రభ సంపాదకులు శ్రీ విజయ బాబు తెలుగు నవనీత సమానం .కమ్మని అజంత భాష .అయిన నీలి నీడలు కమ్ముతునాయి విమర్శను సహృదయం తో స్వీకరించి ముందుకు సాగాలి .మేధావులు ,మహనీయులు ఇకనుంచైనా మౌనాన్ని వదిలి తమ కాలం అనే కరవాలానికి పని చెప్పి జాతిని ఉత్తేజితం చేయాలని అభిప్రాయ పడ్డారు .
         యెన్.టి.వి .కి చెందిన శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు -మనుషుల లోని మానవత్వం మంట కలిపి ,మానసిక ఆందోళనకు గురి అవుతున్న వారికి స్థైర్యం కల్పించి ,మానసిక దౌర్బల్యాన్ని పోగొట్టాలని అమృతం లాంటి తెలుగును చిన్నారులకు నేర్పుతూ బ్భాషను దక్కించుకోవాలని ఉద్వేగం గా మాట్లాడారు .సురభి పత్రిక సమాదకులు శ్రీ రాజా శుక -తెలుగును కాపాడాల్సిన బాధ్యత తలి దండ్రుల మీదే ఎక్కువగా వుంది అనారు .నేటి విద్యల కోసం తెలుగును వదులు కోవాల్సిన అవసరం లేదని హితవు పలికారు .చినుకు మాస పత్రిక సంపాదకులు శ్రీ నండూరి రాజా గోపాల్ సాహిత్య పత్రికలను ప్రజలు ,ప్రభుత్వమాదరించాలని ,ఉత్తమ విలువలతో ప్రబోధాత్మక రచనలు చేయమని రచయితలను కోరారు .పత్రికలకు ప్రాంతీయత ఆపాదించా వద్దు అని గట్టిగా చెప్పారు .భావ వీణా సంపాదకులు శ్రీ కల్లా కృష్ణా రావు రచన లోసత్తా వుంటే అన్ని కాలాలల లోను ఆదరణ ఉందన్నారు .నది మాస పత్రిక సంపాదకులు శ్రీ జలదంకి ప్రభాకర్ తమ పత్రిక అత్యంత విలువైన పారితోషికం తో రాబంద్ అ రచనను ప్రోత్చాహిస్తున్నామని తెలియ జేశారు .నెలవంక -నెమలీక సంపాదకులు శ్రీ వి .శ్రీ రాములు నేటి సమాజం లో ఉదాత్తత తో పత్రిక సేవ చేసే మహానీయులున్నారని ,దానిని సద్వినియోగ పరచుకొని మాత్రుభాశాభివ్రుద్ధికి కృషి చ్యాలని సూచన చేశారు .
         కావ్య సమీక్ష సంపాదకులు శ్రీ మోడు రాజేశ్వర రావు -కేవలం సమీక్షల కోసమే తాము పత్రికను నడుపు తున్నామని ,సద్వినియోగం చేసుకోమని భాషను భావి తరాలకు అందించేది అమ్మ అని అందుకే మాత్రు భాష అంటే అమ్మ సేవే అన్నారు .శ్రీ ది .వి ఆర్..నరసింహారావు -ఒక రూపాన్ని పద్యం ద్వారా చెప్పగల భాష మనది అని పద్యాత్మక వివరణ నిచ్చారు .భావ తరంగిణి సంపాదకులు శ్రీ భవిష్య -సాహిత్య పత్రికల మనుగడ ప్రశ్నార్ధకం కావటం శోచనీయం ,సహృదయులు అండగా నిలవాలని భావ ప్రకటన చేశారు చివరిగా మాట్లాడిన శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మ -నేటి సమాజ దుస్థితిని కొన్ని శతాబ్దాల క్రిందటే ఊహించి శేషప్ప శతకం రాశాడని ,పద్యాన్ని చినప్పతినుంచే పిల్లలకు నేర్పితే తేలిగ్గా అలవడుతుందని చక్కని సూచన చేయటం తో సభా తన ప్రాచుర్యాన్ని నింపుకొన్నది .పాల్గొన్న ప్రముఖులు అందరికి ,శ్రీమతి నన్నపనేని రాజకుమారి శ్రీ బుద్ధ ప్రసాద్ ,లక్ష్మి ప్రసాద్ లు సముచిత సత్కారం చేసి కృతజ్ఞతలు తెలియ జేశారు .
                 ఈ నాటి చివరి సభా” కొమర్రాజు లక్ష్మణ రావు ”  వేదిక పై సాహిత్య సంస్థల ప్రతినిధుల సమావేశం  గా జరిగింది .ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ బి.హనుమా రెడ్డి -ప్రజలకు ప్రభుత్వానికి సాహిత్య సంస్థలు వారధి గా పని చేస్తున్నాయి .అన్నారు .గజల్ శ్రీనివాస్ కమ్మని గజల్లు పడి సందేశం అందించారు .కడప జిల్లా అధ్యక్షులు శ్రీ జింకా సుబ్రహ్మణ్యం ,చిత్తూర్ కు చెందిన శ్రీ టంగుటూరి మెహబూబ్ ,పశ్చిమ గోదావరి కి చెందిన శ్రీ నున్న అన్జారావు ,కృష్ణా కు చెందిన శ్రీమతి కోకా విమల కుమారి తమ జిల్లాలలో జరిగే కార్యక్రమాలను తెలియ జేశారు .యువభారతి అధినేత శ్రీ మాడభూషి అనంతా చార్యులు తమ సంస్థ చేసే సేవలను వివరిస్తూ ,తాము నిర్వహించే కార్యక్రమాలలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని వారంతా తెలుగు లోనే మాట్లాడు తారని హర్షధ్వానాల మధ్య తెలియ జేశారు .తెలుగు రధం సంపాదకులు శ్రీ కొంపెల్ల శర్మ సంస్థలో సభ్యత్వం ముఖ్యం కాదు ,సభ్యతా పూర్వక కార్యక్రమాలు ముఖ్యం సంస్థలు చేసే సత్కారాలను అర్హులైన వారికే చేయాలని కాలోచితమైన సలహానిచ్చారు .
            జనసాహితికి చెందిన శ్రీ దివి కుమార్ ఆంగ్ల భాషకు దాసోహం కావద్దని అయితే విశాల దృక్పధం కలిగి వుండాలని కోరారు .గుంటూరు జిల్లా కు చెందిన శ్రీ జానీ బాష తెలుగు వారు ఖచ్చితం గా తెలుగు లోనే సంతకం చేయాలని,మార్పు మనతోనే ప్రారంభం కావాలని సముచిత సూచన చెసిఆదర్శమ్ వైపుకు దృష్టి ని మరల్చారు .
         అనంతరం ప్రముఖ కవి రచించిన ”కవిత్వం ఒక సామాజిక  స్వప్నం”అనే కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది .
        రాత్రి  ఏడు గంటలకు స్వర్గీయ” వేగుంట మోహన ప్రసాద్ వేదిక ”పై ప్రతినిధుల కవి సమ్మేళనం డాక్టర్ శ్రీమతి  రేజీనా గారి ఆధ్వర్యం లో కమనీయం గా అర్ధ రాత్రి వరకు జరిగింది .సమాజ హితమైన రచనలు చేసి కవులంతా తమ కర్తవ్యాన్ని నెర వేర్చి సమాజాన్ని జాగృతం చేశారు .
          రెండవ రోజూ సభలు అత్యంత నిబద్ధత తో నిర్మాణాత్మక మైన సూచనలతో దిశా నిర్దేశం గా జరిగి అందరికి ఆనందాన్ని పంచాయి

 

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష -3

3
           దాదాపు వెయ్యిమంది ప్రతినిధులతో ,విశిష్ట అతిదులైన విదేశీ ప్రముఖులు ,ఆచార్య వర్యులు ,గౌరవ అతిదులైన అధికార ప్రముఖులతో,ఆత్మీయ అతిదులైన పత్రికారంగా ప్రముఖులతో ,చేయూతనిస్తున్న వదాన్యులతో ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు రంగ రంగ వైభవం గా ప్రారంభమై ,తెలుగు దేశం లో వివిధ రంగాలలో ప్రముఖులైన మహనీయుల చిత్రపటాల ఫ్లెక్షే లతో ,రంగు రంగుల బ్యానర్లతో  విజయవాడ  పట్టణం అంతా తెలుగు పండుగ వాతావరణం నెలకొని శోభాయమానం గా  వుంది .
కార్యకర్తలు ఉత్చాహం గా పని చేస్తూ ఏ అసౌకర్యము జరుగకుండా తోడ్పడుతున్నారు .జ్ఞాన పీత పురస్కార గ్రహీత కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి స్వగృహం లో వారి చిత్రపటాలు ,పుస్తకాలు ,జ్ఞాపికలుప్రదర్శించటం సముచితం గా వుంది .పురావస్తు శాఖ ఏర్పరచిన నాణాల ,వస్తువుల చిత్ర ప్రదర్శన అందరిని ఆకర్షించింది .ముందుగా కేంద్ర సాహిత్య అకాడెమి ప్రతినిధి ,ప్రముఖ కన్నడ రచయిత ఆచార్య ఎస్.ఎల్.బైరప్ప స్ఫూర్తివంతమం గా ప్రసంగిస్తూ కన్నడ ప్రభుత్వం తమ భాషకు అన్నిరకాల సహాయం చేస్తోందని ,కర్ణాటక లోని ”భాషా భారతి ”అనే సంస్థ అనువాద సాహిత్యానికి వెన్నెముకగా నిలిచి ప్రోత్చాహిస్తోందని ,అదే విధం గా ఆంద్ర దేశం లోను ప్రభుత్వం తెలుగు భాషకు సేవ చేయాలని హితవు పలికారు .ప్రెస్ అకాడెమి అధ్యక్షులు శ్రీ టి.సురేంద్ర -పత్రికావిలేకరులకు శిక్షణ నివాలని సూచించగా ,స్వర్ణాంధ్ర పాతిక సంపాదకులు శ్రీ  కే.ఎస్ .తిలక్ -తెలుగు పత్రికల యాజమాన్యాలన్ని కలిసి ఇలాంటి సభలు నిర్వహించాలని కోరారు
               రెండవ రోజూ 14 -08 -11 ఆదివారం ఉదయం సాహితీ ప్రముఖులతో ఎస్.వి.ఎస్.కళ్యాణ మండపం లో ”సాహిత్యం,సాహిత్యానువాదాలు ,-ప్రచురణ రంగం ”అనే అంశం మీద మూడవ సదస్సు” గుర్రం జాషువా వేదిక ” పై జరిగింది .శ్రీ టి.శోభనాద్రి అతిధులను వేదికపై కిఆహ్వానిన్చాగా ,ఏ.బి.యెన్.ఆంద్ర జ్యోతి బ్యూరో చీఫ్ శ్రీ ఏ.కృష్ణా రావు సమన్వయము చేశారు .ముప్ఫై మందికి పైగా సాహితీ వేత్తలు పాల్గొని మంచి సూచనలు చేశారు .శ్రీ కృష్ణా రావు –నేడు పత్రికల లో పనిచేసే వారికి సాహిత్య పరిజ్ఞానం తక్కువ గ వుందని ,నిజానికి పత్రికలే సాహిత్య వ్యాప్తి అధికం గా చేస్తున్నాయని చెప్పారు .తెలుగు అకాడెమి సంచాలకులు శ్రీ యాదగిరి  పదిహేను కోట్ల రూపాయల వ్యయం తో అకాడెమి అనేక ప్రోత్చాహక కార్యక్రమాలు నిర్వహిస్తోందని,తాము నడుపుతున్న ”తెలుగ్గు ”మాస పత్రికకు విలువైన రచనలు రాసి పంపమని కోరారు .ఇతర రాష్ట్రాల లోని తెలుగు వారికి బోధనాశిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ,తెలుగు నిఘంటువును డిజిటలైజ్ చేస్తున్నట్లు చెప్పారు .ఫెలోషిప్పులను ఏర్పరిచి ప్రోత్చాహిస్తున్నట్లు తెలిపారు .ప్రముఖ కవి డాక్టర్ శిఖామణి   -స్వతంత్రప్రతిపత్తి గల అనువాద వ్యవస్థ ఏర్పడాలని ,రచయితల సహకార సంఘాలు అవసరమని సూచించారు .ప్రముఖ రచయిత ,నటుడు శ్రీ గొల్లపూడి మారుతీ రావు తమ అభిభాషణం లో గొప్ప రచన ఆలోచన ను ప్రోది చేయాలి   ,ఆవేశాన్ని కాదుఅన్నారు  .ఇజాలు లేని నిజం చెప్పే రచనలు రాయమని రచయితలను కోరారు .ప్రముఖ విమర్శకులు శ్రీ కడియాల రాజా రామ మోహన రాయ్ –రచనలో జీవన వైవిధ్యంచూపాలి,దేశ భాషలను పరి పుష్టి చేసుకొంటూ సాహిత్యం ముందుకు వెళ్ళాలి అని సూచించిన సుబోద్ సర్కార్ మాటలు మరువరదన్నారు .యువకులు బాగానే చదువుతున్నారానీ ,బాగానే రాస్తున్నారని ఆందోళన చెందాల్సిన పని లేదని అంటూ ,మాండలీకాలు భాషకు అడ్డు కాదు అని చెప్పారు . ప్రముఖ కవి ,రచయిత శ్రీ విహారి -రచయితలకు పత్రికలు తగిన పారితోషికాలు ఇవ్వాలని తెలియ జేశారు .ఆకాశవాణి మాజీ సంచాలకులు డాక్టర్ ఆర్.అనంత పద్మనాభ రావు ”తెలుగు నేర్చుకుందాం ”అనే శీర్షికను పత్రికలు నిర్వహించాలని సూచన చేస్తూ ముఖ్యం గా చిన్న బాల శిక్ష ను తయారు చేయాల్సిన అవసరం వుందని తెలియ జేహారు .
         ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి కే.బి.లక్ష్మి -యువత కోసం ప్రత్యెక సదస్సు నిర్వహించాలి ,అనువాదకుల పానెల్ రావాలి ,చక్కని తెలుగు పదాల సృష్టి జరగాలి బాలల ,యువకుల కోసం పత్రికలు ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలి,సంప్రదాయాన్ని నిలబెట్టే రచనలు రావాలి అని చెప్పారు రవీంద్రుడు తెలుగు  సంభాషణ విని ”ఇది తెలుగా -సంగీతమా ?”అని ఆశ్చర్య పోయారని ,అంతటి కమ్మని ,మధురమైన సంగీత ప్రధానమైన భాష తెలుగు అని వివరించారు .అనతరం మాట్లాడిన డాక్టర్ రావి రంగా రావు -ఆంగ్లం లోకి అనువాదం ఆయె సాఫ్ట్ వేర్ ను యువ ఇంజినీర్లు తయారు చేయా లని సూచన చేశారు .సాహిత్యానికి మూల్యాంకన స్కేలె వుండాలని అభిప్రాయ పడ్డారు .అంతర్జాలాన్ని రచయితలు బాగా ఉపయోగించుకోవాలని అనారు .డాక్టర్ బాబీ వర్ధన్ -భాషే శ్వాస అంటూ పత్రికలు సామాన్య జనం వాడే పదాలను ఉపయోగించాలి అన్నారు .హాస్యావధాని డాక్టర్ శంకర నారాయణ చలోక్తులతో,సభారంజనం చేసి,ప్రతి నోట తెలుగు వినిపించాలనితెలుగంటే వెలుగే నని గుర్తు చేశారు .డాక్టర్ వెన్నా వల్లభ రావు ,డాక్టర్ వి.కృష్ణ కుమారి లు తెలుగు కోసం ప్రచార ఉద్యమం కావాలని కోరారు .అనంతరం మాట్లాడిన డాక్టర్ గుమ్మా సాంబ శివ రావు -సాహిత్య బోధన ఒక అంశం గా బోధించాలని ,రచయితలకు కూడా పెన్షన్ ఇవ్వాలని ,సూచించారు .డాక్టర్ రాపాక ఎకామ్బరాచార్యులు -పత్రికల లో ”కళా సాహిత్య విజ్ఞాన వేదిక ‘నిర్వహించాలన్నారు .ప్రముఖ రచయిత శ్రీ కస్తూరి మురళీ కృష్ణ -పాథక హృదయాలను తాకే రచనలు రావాలని ఆశించారు .డాక్టర్ జయ కుమారరాజు   తెలుగు భాష కోసం కృషి చేసిన ప్రాతస్మరనీయుడు సి.పీ.బ్రౌన్ పేరిట పురస్కారం ఏర్పాటు చేయాలని క్రిస్టియన్ సాహిత్యాన్ని కూడా గుర్తించి ప్రాదాన్యతనిచ్చి ,పురస్కారాలు అందించాలని కోరారు .గిరిజన సంస్కృతిని ,సాహిత్యాని పరి రక్షించామనిశ్రీ భాను నాయక సూచించారు .ప్రసిద్ధ చిత్రకారులు శ్రీ బాలి -మంచి గుండ్రని ఫాంట్ ను ముద్రణకు వాడాలని, లిపి మీద మరింత శ్రద్ధ చూపాలని విలువైన సలహా ఇచ్చారు .శ్లజాడల రాసి  రాసి  గుత్తి చంద్రశేఖర రెడ్డి ,శంకరస్వామి ,చిత్రకారుడు టి.వి ,డాక్టర్ లావణ్య ,డాక్టర్ టి .రంగస్వామి ,శ్రీమతి ఝాన్సి కే.లక్ష్మి కుమారి  ,చలన చిత్ర విశ్లేషకులు శ్రీ జి .ఎస్ రామా రావు ,శ్రీ   వేదాంతం రాజా గోపాల చక్ర వర్తి ,మున్నగు ప్రముఖులు తమ అమూల్య సూచనలు అంద జేశారు .యువకులు అధిక సంఖ్య లో పాల్గొనటం ఈ సభల ప్రత్యేకత ,మంచి పరిణామం .ఈ స్ఫూర్తి తో ”ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ”ఏర్పడితే బాగుంటుంది అని సూచించిన ప్రముఖ రచయిత, విశ్లేషకులు జాన్సన్ చోరగుడి మాట ఆలోచించదగినది .

 

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష -2

2
                భోజన విరామం తర్వాత బెంజ్ సర్కిల్ దగ్గర వున్న ఎస్.వి.ఎస్.కల్య్యాన మండపం లో ”సురవరం ప్రతాప రెడ్డి వేదిక ”పై ”-తెలుగు ప్రజల చరిత్ర ,సంస్కృతి ,భాషా ప్రాచీనతలకు సంబంధించిన పురావస్తు ఆధారాలు ,చరిత్ర పరిశోధన లో ఎదుర్కొంటున్న సమస్యలు -రేపటి సామాజిక అవసరాలు ”అంశాలపై మొదటి సదస్సు జరిగింది .శ్రీ     రాళ్ళబండి కవితా ప్రసాద్ సభా సమన్వయము చేశారు .వారు తమ ప్రసంగం లో రచయితలు ప్రాచుర్యం లో లేని అంశాలను ప్రస్తావించాలని  ,కళలకు కాణాచి అయిన రామప్ప దేవాలయం బ్లాస్టింగ్ వల్ల దెబ్బ తినే ప్రమాదం వుండటం బాధాకరం అని ,తెలుగుభాష సమగ్రచరిత్ర రావాలని ఆకాంక్షించారు .ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకొనే పద్ధతులను వివరించమని కోరారు .
          ప్రముఖ చారిత్రిక పరిశోధకులు శ్రీ వకుళాభరణం రామ కృష్ణ –ఎన్నో అకాడెమీలు చేయాల్సిన పనులు శ్రీ బుద్ధ ప్రసాద్ ,వారి సహచరులు నిర్వహించటం గొప్పగా ఉందన్నారు .చరిత్ర అంటే గతం.గతం లేకపోతే భవిష్యత్తు లేదు .చారిత్రకఘాటనల మధ్య సంబంధాన్ని ,సాంస్కృతిక మార్పులను ,పరిశీలించటం 1950 నుంచే వచ్చింది .దీనిపై ఇంకా కృషి బాగా జరగాలి .సాంఘిక సంస్కరణల లో వచ్చిన సామాజిక మార్పులను అధ్యయనం చేయాలి .పరిష్కరించాల్సిన శాసనాలు వేల సంఖ్య లో వున్నాయి .వాటిని పరిష్కరించక పొతే చరిత్ర చీకటిమయం అవుతుందని అన్నారు .శాసనాలు చదివే ప్రముఖుల సంఖ్య తగ్గిపోయింది .జరిగిన పరిశోధనల మీద సమగ్ర నివేదిక రావాలి .నేటి అస్తిత్వ ఉద్యమాల వెలుగు లోస్థానిక చరిత్రలు నిర్మించాలని ,సూక్ష్మాన్శాలు కూడా చేర్చాలని ,సూచించారు .కైఫీయత్తులు జాతి సమగ్రత కు తార్కాణాలు .అగ్రహారాల చరిత్ర ,స్థానిక ప్రభువుల చరిత్ర ,దేవాలయాల చరిత్రలు తయారు చేయమని కోరారు .కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ,కాల పరిధిని నిర్ణయించి ,అమలు జరిగేటట్లు చేయాలని అన్నారు .వకుళాభరణం ఉపన్యాసం ”నమూనా ఉపన్యాసం ”గా ,ఉపన్యాసాలకే ఆభరణం గా అనిపించి స్ఫూర్తి దాయకమయింది .
           తరువాత మాట్లాడిన పురావస్తు శాఖ డిప్యూటి డైరెక్టర్ శ్రీ బి .సుబ్రహ్మణ్యం -నాణాల కేటగిరి జరగాలని ,ప్రతాపరుద్ర ,రాణి రుద్రమాంబ ల  కాలమ్ నాటి నాణాలు లభించలేదని ,ఎందుకు అవి లభ్యం కావటం లేదో సమగ్ర పరిశోధన జరపాలని ,కోరారు .నాణాల డాక్యు మెంటేషన్ జరుగుతోంది చెప్పారు .అనేక వేల నాణాల చరిత్ర వెలుగు లోకి తేవాలని సూచించారు .పురాతత్వ శాఖ నిపుణులు డాక్టర్ వి .వి .కృష్ణ మూర్తి -తన అనుభవాలను ,కృషిని సమగ్రం గా వివరించారు .తాలపత్రాలలోని చరిత్రను ఇంకా వెలికి తీయాలి .ప్రభుత్వం అవసరమైన ధనాన్ని కేటాయించి ప్రోత్చహించాలి .ధనాభావం తో   . ఆ శాఖ ముందడుగు వేయటం కష్టం అన్నారు .పురావస్తు శాఖ సంచాలకులు శ్రీ పీ.చెన్నా రెడ్డి -పురావస్తు శాఖ చేసిన పరిశోధనలన్నీ ఒక పుస్తకం రూపం లో తెచ్చి ,ఈ వేదిక మీదనే ఆవిష్కరిమ్పజేసి అందరికి ఉచితం గా పంచామని  తెలియ జేశారు .సిబ్బంది  కొరత బాగా వుందని ,రక్షణ సిబ్బంది లేకపోవటం తో చారిత్రిక కట్టడాలు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం వుందని ,వెంటనే ప్రభుత్వం వారిని నియమించాలని కోరారు .చారిత్రిక కట్టడాలకు వంద  మీటర్ల  లోపల ఎవ్వరూ కొత్త కట్టడం చేయరాదనీ దీన్ని అతిక్రమిస్తే తీవ్ర శిక్ష ఉంటుందన్న చట్టం వుందని ,దానిని అందరు గౌరవించాలని విజ్ఞప్తి చేశారు .అందరు కలిసి సమస్తి గా కృషి చేస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు.అని భరోసా ఇచ్చారు
       అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు శ్రీ ఏ.బి .కే.ప్రసాద్ తమ సంభాషణ లో తాను అనైక్యతకే వ్యతిరేకినని ,భాషకు కాదని తెలియ జేశారు .అన్ని మాండలీకాలు అభివృద్ధి చెందాల్సిందే నన్నారు .అప్పుడే భాష సుసంపన్నం అవుతుంది అని అభిప్రాయ పడ్డారు .శాసనమండలి సభ్యురాలు శ్రేమతి నన్నపనేని రాజకుమారి -తెలుగును ప్రతి పాథ శాల  లోను బోధించే టట్లు చేయాలి అన్నారు .సీనియర్ పాత్రికేయులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు –చరిత్ర పట్ల శ్రద్ధ లేకపోవటం మంచిది కాదని ,ఆసక్తి   కలవారు ప్రభుత్వం లో ,పరిపాలన లో లేక పోవటం విచారకరమని తెలియ జేశారు .అవగాహన అత్యంత ఆవశ్యకరం అని హితవు పలికారు .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అందరిని సత్కరించారు .విలువైన సలహాలు సూచనలు వక్తలు అందించటం తో సభా ఆశించిన లక్ష్యం నెరవేరింది .
            రెండవ  సదస్సు ”రాష్ట్రేతరుల తెలుగు భాషా సమస్యలు ”అన్న అంశం పై ”మండలి వెంకట కృష్ణా రావు వేదిక ” పై  జరిగింది .డాక్టర్ గౌరి శంకర్ సమన్వయ కారగా వ్యవహరించారు .ఓడిస్సా నుంచి డాక్టర్ ఆర్తి రఘునాధ వర్మ ,శ్రీమతి పుష్పలత గార్లు తామంతా తెలుగు సంస్కృతిని కాపాడు కొంటూనే ఉన్నామని , కళల ను  బోధించే ఉపాధ్యాయులు తమ కు లేరని ,తెలుపుతూ ,తెలుగు పుస్తకాలను అందించమని కోరారు .తెలుగు పాతశాలలు తగ్గి పోయాయని ఉపాధ్యాయుల కొరత తీవ్రం గా వుందని అన్నారు .ఇదివరకు వేసిన హౌసు కమిటీ కి కాలదోషం పట్టిందని దాన్ని పునరుద్ధరించా టానికి  కృషి చేయాలని కోరారు .అల్లాగే ఉపాధ్యాయ శిక్షణా  కేంద్రాన్ని ఎత్తి వేశారని ,   దానిని పునరుద్ధరించా టానికి ఒత్తిడి తేవాలని అన్నారు .తమ పిల్లలకు తెలుగు లో అభిరుచి కలిగే టట్లు చేయమని విన్నవించారు .
       తమిళనాడు కు చెందిన ప్రముఖ పరిశోధకులు శ్రీ సా.వెం .రమేష్ -తెలుగు వాళ్ల  మనసుల్లోంచి రాజకీయ చిత్రపటాలను తొలగిన్చుకోవలసిన దిగా  సూచించారు .తమిళనాడు ,కేరళ కర్ణాటక రాష్ట్రాల లోని కింది తరగతి జాతుల వద్ద అమూల్య భాషా సంపద ,చరిత్ర పాటల రూపం లో వుందని వాటిని ఇలాంటి సంస్థలు అక్కడికి వెళ్లి రికార్డు చేసి భద్రపరచమని సలహా ఇచ్చారు .తమ ప్రాంతానికి వచ్చి తెలుగు కు ప్రోత్చాహం ఇవ్వమని కోరారు .ఎవరైనా తెలుగును అవమానిస్తే నిలదీసి బుద్ధి చెప్పమని సూచించారు .శ్రీ బెల్లం కొండ నాగేశ్వర రావు  ,శ్రీ కలువ కుంట  నారాయణ రెడ్డి ,శ్రీ .ఏం .ఎస్ రామస్వామి రెడ్డి , .శ్రీ వై రామ కృష్ణ గార్లు తెలుగు  పాథ  శాలలు తగ్గి పోతున్నందుకు ఆందోళన చెందారు .పాథ శాలలో చేరే విద్యార్ధుల సంఖ్య క్రమంగా తగ్గి పోతోందని ,దీనికి కారణం తమిళ ప్రభుత్వ నిరంకుశ విధానమే నని ఆవేదన చెందారు .నిర్బంధం గా తమిళం నేర్చుకోవలసి వస్తోనని ,అక్కడి తెలుగు వారు మూడవ స్థాయి పౌరులుగా మారిపోవటం బాధాకరం గా వుందని తెలియ జేశారు .తెలుగును మొదటి భాష గా చేసేట్లు తమిళనాడు ప్రభుత్వం పైన ఒత్తిడి తెసుకొని రావలసినదిగా చెప్పారు .”ముగ్గురమ్మల    మూల పుటమ్మ  కు అమ్మ తెలుగమ్మ ”అన్న మాట మరచిపొవద్దని హితవు పలికారు .
         మహారాష్ట్ర నుంచి వచ్చిన శ్రీ అంబల్ల జనార్దన్ ,శ్రీ రాయచోటి కృష్ణ మూర్తి -అక్కడి తెలుగు వారికి సమస్యలు తక్కువేనని ,వున్నా   తామే పరిష్కరించు కొంటున్నామని తెలియ జేశారు .పుస్తక ప్రచురణకు సహకరించి ,ఆవిష్కరణ ఖర్చులు తగ్గించేట్లు చేయమని కోరారు .ప్రచురణ లో రాజకీయం చోటు చేసుకోవటం హర్షణీయం కాదనిఅన్నారు .సమీక్క్ష ల  కోసం ప్రత్యేకం గా పత్రికలు రావాలి అని అభిప్రాయ పడ్డారు . .  సమన్వయ కర్త శ్రీ గౌరి శంకర్ తనకు అన్ని రాష్ట్రాల వారితో సంబంధం వుందని వారి సమస్యలు కూడా తెలుసనీ తరచుగా వారితో  సంప్రదిస్తూ సమస్యా పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూనే ఉంటున్నానని ,ఇక్కడి ప్రభుత్వం ఆయా రాష్ట్రాల లోని తెలుగు వారికి ఇతోధికం గా సాయం చేస్తేనే వారి సమస్యలు తీరుతాయని తమ ప్రసంగం లో తెలిపారు .శ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ -తెలుగుభాష కు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని ,తెలుగును మనమే కాపాడు కోవాలాని ,మనమే ముందు వుండి  పల్లెల పాఠాశాలలో తెలుగును బోధించే ఒత్తిడి తే వాలని ఆభిప్రాయా ప్రకటన చేశారు .భారతీయ భాషా కేంద్రమ్ అధికారి శ్రీ జి .ప్రభాకర్ తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను వివరించి ,అవసరమైన వారు సంస్థ నుంచి సేవలు అందుకోవలసినది గా సూచించారు .
  శ్రీమతి ఏ.బి.కే సుజాత కవితా సంపుటి ”బాల కవిత్వం ”,శ్రీమతి అమరజ్యోతి రాసిన ”మొలుస్తున్న రెక్కలు ”,శ్రీ శ్రీహరి కోటి రచన ”విద్యా శతక పద్యాలు ”పుస్తకాలను శ్రీ లక్ష్మి ప్రసాద్ ఆవిష్కరించారు .
ఆశించిన విధం గా రెండు సభలు విజయవంత మయాయి .ఆ తరువాత స్వర్గీయ ”వేగుంట మోహన ప్రసాద్ వేదిక ”మీద డాక్టర్ కే.బి .లక్ష్మి గారి ఆధ్వర్యం లో ప్రత్యెక కవి సమ్మేళనం జరిగింది .శ్రీ అనంత శ్రీ రాం ,వంగపండు ప్రసాద రావు ,శ్రీ ఆశావాది ప్రకాశ రావు ,మొదలైన ప్రమముఖ కవులు పాల్గొని నేటి సమాజని ప్రభావితం చేసే కవితలతో శ్రోతలను అలరించారు .
Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష

           కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో ,ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ ,ఆంద్ర ప్రదేశ్ హిందీ అకాడెమీ ,మైసూర్ లోని భారతీయ భాషా కేంద్రం ,న్యు ధిల్లీ లోని సాహిత్య అకాడెమీ వారి సౌజన్యం తో ”ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహాసభలు 13 -08 -11  నుండి 15 -08 -11 వరకు విజయవాడ లో జరిగాయి 13  వ తేదీ శనివారం ఉదయం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్ర ప్రాంగణం లో ”తెలుగు తల్లి ” విగ్రహాన్ని పద్మ భూషణ్ ,శ్రీ సి .నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించటం తో సభలు ప్రారంభమయి నాయి .ప్రారంభ సభా   వేటూరి సుందర రామ మూర్తి సభా ప్రాంగణ వేదిక పై జరిగింది .”చరిత్ర ,సంస్కృతి ,సాంకేతికత -రేపటి అవసరాలు ”నేపధ్యం గా ఈ సభలను నిర్వహించారు .వేలాది ప్రతినిధులు ,తెలుగు భాషాభిమానులు పాల్గొని నిండుదనం తెచ్చారు .ఈ సభల గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించారు .ఆయన తన ప్రసంగం లో దేశ విదేశాల నుండి వచ్చిన ప్రతినిధులందరికీ ధన్య వాదాలు తెలియ జేశారు .తన ఆరోగ్యం కంటే తెలుగు భాష ఆరోగ్యమే ముఖ్యం గా భావించి ,అనారోగ్యాన్ని లెక్క చేయకుండా నారాయణ రెడ్డి గారు విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు .అలాగే తెలుగు భాష కు తమ పత్రికలు, చానెళ్ళ ద్వారా విశేష కృషి చేస్తున్న ఈనాడు గ్రూప్ చైర్మన్ శ్రీ రామోజీ రావు ను అభినందించారు .తెలుగు భాష కోసం ,ఇంతమంది ఆవేదన చెంది పరితపించి భాషను కాపాడుకోవా టానికి వచ్చిన వారందరికీ ఆహ్వానం పలుకుతూ వారంతా సైనికులు లాగా పని చేయాలని కోరారు .పదిహేడు కోట్ల  మంది  మాతృభాష తెలుగు అనీ ,కాని దాని ప్రగతి  ప్రశ్నార్ధ కం గా మారటం విచారకరమని ,దిశా నిర్దేశం లేకుండా పోయిందనీ ప్రపంచీకరణ లో తెలుగు ఉక్కిరిబిక్కిరి అయిపోయిందనీ ,ఈ సమయం లో మనం చైతన్య స్ఫూర్తిని కల్గించక పోతే భవిష్యత్తు మనల్ని క్షమించదనీ అన్నారు .రచయితలు అందరు బాగా ఆలోచించి దిశానిర్దేశం చేయాలని సూచించారు

—         కార్యనిర్వాహక అధ్యక్షులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లక్ష్య ప్రస్తావన చేశారు .2007 లో జరిగిన మొదటి సభలలో తెలుగు రచయితలన్దర్నీ ఒకే వేదిక మీదకు రప్పించటం లో కృత క్రుత్యులయామనీ ,తెలుగును తల్లిభాష గా చేసేందుకు మంచి ప్రయత్నం చేశామనీ ,చైతన్య యాత్రలు జరిపి తెలుగు కు ప్రాచీన హోదా సాధించామనీ ,ఆ తరువాత ముందుకు అడుగు వేయలేదని అన్నారు .తెలుగు సంస్కృతి తగ్గిపోయింది .రచయితలు దిశా నిర్దేశం చేయాలని,పాఠాశాలలో తప్పకుండా తెలుగును బోధించాలనీ ,రేపటి తరం సాంకేతికం గా పురోగమిస్తుందనీ ,దానికి తగ్గట్టు గా మనం తయారవాలనీ మన భాషను విశ్వ వ్యాప్తం చేయాలని దిశా నిర్దేశం చేశారు

            జ్ఞాన  పీథ  పురస్కారగ్రహీత ,పద్మభూషణ్ శ్రీ నారాయణ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు .ఇతరదేశాలనుంచి ,ఇతరభాషా రచయితలు రావటం శుభ సూచకం అన్నారు .శాతవాహనుల కాలమ్ లోనే అంటే క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఏళ్ళ నాటికే తెలుగు భాష వున్నట్లు కరీం నగర్ జిల్లా కోటిలింగాల వద్ద లభించిన శాసనాలు ,నాణాలు వల్ల తెలుస్తోంది .మెదక్ జిల్లా కొండాపూర్ లో టంక శాల  వుండేది .ప్రాకృత కావ్యం గాదా సప్తశతి లో పాడి ,కొట్టం ,చోద్యం వంటి తెలుగుపదాలున్నాయి .”సుందర తెలుంగు ”అని తమిలకవి సుబ్రహ్మణ్య భారతి ప్రశంసించిన భాష తెలుగు .విదేశీ యాత్రికుడు నికోలాకొంటీ విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించి అక్కడ తెలుగు అమలు అవుతున్న తీరును చూసి ముగ్దుదయాడు .ఇప్పుడు ప్రసారమాధ్యమాలలో ,ఆంగ్ల వాడకం పెరిగింది  .తెలుగు మాధుర్యం వున్న అజంత భాష .గాంధీజీ రోజూ డైరీ రాసేవారు .తాను దాన్ని”గాన్దేయం”అన్న పేరుతొ తెలుగు చేశాననీ ,అందులో మహాత్ముడు ”మాతృభాషా తిరస్కారం -మాతృదేశ తిరస్కారమే ”అన్న మాట మనం గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు .ఆంగ్లకవి  ఈట్స్   ప్రతినాగారకజాతి తన మాతృభాషలోనే మాట్లాడుతుందని తెలియజేశాడని ,భాషాపండితుడు హాల్డేన్ తెలుగుకు జీర్ణశక్తి ఎక్కువ అని ఇతరభాషా పదాలను తనలో చక్కగా ఇముడ్చుకోన్నదని మెచ్చినట్లు చెప్పారు .తెలుగును ప్రాధమిక స్థాయినుంచి పాతశాలల్లో బోధించాలని కోరారు .”మన మాత్రు భాష తెలుగు -మన రక్త ఘోష తెలుగు ”అని కవితాత్మికం గా చెప్పారు .రచయితలందరూ సామూహిక స్వరం తో ప్రభుత్వానికి అర్ధవంతమైన నివేదిక ఇచ్చి తోడ్పదవలసినడిగా కోరారు .
          ఈనాడు గ్రూప చైర్మన్ శ్రీ రామోజీ రావు -ఈ సభల సందర్భం గా 126 మండి లబ్ధ ప్రతిస్తులైన రచయితల రచనలతో ప్రచురించబడినబృహత్ గ్రంధం  ”తెలుగు పున్నమి ”ని ఆవిష్కరించారు .రామోజీ రావు తమ ఉపన్యాసం లో తెలుగు గడ్డ మీద పుట్టటం మన అదృష్టం .సంస్కృతి ,సంప్రదాయం ,జీవన విధానం ,కట్టుబాట్లకు భాష ప్రతిబింబం .మాతృభాష లో విద్యనేర్వటం తేలిక .సామాజికం గా ,ఆర్ధికం గా భాష ఉపయోగ పడాలి .సంస్కృతి తో భాష జీవకళ తో ఉట్టిపడుతుంది .నెహ్రు పండితుడు కోడా పాలనాభాష గా మాతృభాష వుండాలని కోరిన సంగతి గుర్తు చేశారు .యాస భాషకు బలం అన్నారు .జనభాష కావాలి .అవగాహన  ,ప్రేమ ల వల్ల , భాష బలపడుతుంది నిజమైన భాప ప ల్లెల్లో నే వుంది  .భాష ,సంస్క్రుతులే మన ఆస్తులని వాటిని జాగ్రత్త గా కాపాడుకోవాలని సూచించారు .తాము అందరు ఈ సభా లక్ష్యానికి పూర్తి మద్దతునిస్తామనీ తెలుగుభాష కొత్త పుంతలు తోక్కాలనీ నిర్దిష్ట  కార్యాచరణ తో పధకాన్ని రూపొందించి ,అమలు జేసేందుకు రచయితలు కృషి చేయమని కోరారు . తర్వాత ”తెలుగు వెన్నెల ”సావనీర్ ఆవిష్కరణ జరిగింది
           శాంతాబయోటేక్  అధినేత పద్మభూషణ్ డాక్టర్ కే.యి .వర ప్రసాద రెడ్డి ప్రసంగిస్తూ ,ప్రాచీన  భాషా హోదా నిలబెట్టుకోవాలి .జనాభాకు తెలుగు పాథకులకు  నిష్పత్తి విలోమం గా వుండటం బాధాకరం .దృశ్యమాధ్యమ ప్రభావం వల్ల పుస్తక పథనం తగ్గిందని ,యువత కు అవసరమైన రచనలు చేసి వారిని తీర్చి దిద్దాలని కోరారు .ఆశావాదం వైపు వారిని మల్లించాలి .సెన్సేషన్ నుంచి పాజిటివ్ దృక్పధం లోకి మార్చాలి .ఆత్మస్థైర్యం కలిగించాలి .అంతస్చేతనాను మేల్కొల్పాలి .భాష నాశనం అయితే సంస్కృతి వినాశనం అవుతుంది .విద్యార్ధులు పుస్తకాలు చదివి గోష్టిలో పాల్గొనే టట్లు చేయాలి .  ”తెలుగు అంటే ఆమని –నిరంతర సౌదామిని ”అని కవితాత్మకం గా ప్రసంగం ముగించారు .
          కేంద్ర సాహిత్య అకాడెమి కార్యదర్శి శ్రీ అగ్రహారం  కృష్ణ మూర్తి తాను తెలుగు దేశానికి చెందిన వాడినేనని కన్నడ ప్రాంతం లో వుండటం వల్ల తెలుగు మాట్లాడ లేనని తెలుగులో ప్రారంభించి ఆంగ్లం లో ప్రసంగించారు .కన్నడ ఆచయితలే ”తెలుగు తేట ”అని ప్రశంసించారని ,తెలుగుకు ,కన్నడానికి చాలా మంచి సంబంధాలున్నాయని  అకాడమి తరఫున అన్ని భాషల రచయిత లను పాల్గొనే టట్లు చేశామని ,భాషే అన్నిటి కంటే గొప్పది అన్నారు .తెలుగు అంతర్జాతీయ కీర్తి పొందిన భాష . తెలుగు లోని అభ్యుదయ వాదం ఇతరభాష లను ప్రభావితం చేసిందని తెలియ జేశారు .,
     ప్రసిద్ధ ఉర్దూ కవి ,ఇక్బాల్ పురస్కార గ్రహీత –శ్రీ షీన్ కాఫ్ నిజాం ధర్మార్ధ కామ మోక్షాలు లేని రచనలు పనికిరావు అన్నారు .”Poetic language is the   inner language of the poet ”అని తెలియ జేశారు
           సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి మాలతీ చందూర్ స్వర్గీయ ముక్కామల భూషణం  గారి సి.డి .లను ఆవిష్కరించి ముక్కామల శత జయంతిసంవత్చరం లో    ఇలా ఆవిష్కరించటం తన అదృష్టం అన్నారు .రచయితలు భాష కువెంనేముకలనీ   ,ఈ సభల తర్వాత కూడా ఈ స్ఫూర్తి తో పని చేయాలని సూచించారు .తెలుగు కధానిలయం సంస్థాపకులు,ప్రసిద్ధ కధా రచయిత శ్రీ కాళీపట్నం రామా రావు -తెలుగు కలుషితం అవుతూండటం బాధాకరమని ,ప్రసారమాధ్యమాలు భాషా కాలుష్యాన్ని తగ్గించాలని కోరారు .ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీ కే.శ్రీనివాస్ -తెలుగు నిఘంటువును ఎప్పటికప్పుడు ఆధునీకరించాలని ,దీనికోసం ప్రత్యెక ,శాశ్వత వ్యవస్థ వుండాలని సూచించారు .
          ఈ ప్రారంభ సభకు అతిధులను కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డాక్టర్ జి .వి .పూర్ణ చంద్ వేదిక పైకి ఆహ్వానించారు అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బా రావు మాట్లాడుతూ ,మొదటి ప్రపంచ రచయితల సభలు గొప్ప స్ఫూర్తిని ఇచ్చాయనీ ,ఇప్పటి సభలు అంతర్జాలం తో అనుసంధానం జరిగి ,తెలుగు విశ్వ వ్యాప్తమై వెలగాలన్న ఆకాంక్ష తో నిర్వహిస్తున్నామని తెలియ జేశారు .వేదిక పై పద్మ్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ,శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ,డి.ఏం.ఆర్.శేఖర్ ,డెట్రాయట్ నుంచి వచ్చినడాక్టర్  ముక్కామల అప్పా రావు ,శాసనమండలి సభ్యులు శ్రీ ఐలాపురం వెంకయ్య ,జోర్డాన్ నుంచి విచ్చేసిన శ్రీ రమేష్ ,శ్రీ ఇమ్మడిసేట్టి రాం కుమార్ వంటి ప్రముఖులు ఆసీనులై వేదికకు ,సభకు, నిండుదనం తెచ్చారు .
           రేపటి మనుగడకు ,రేపటి పరిస్థితుల పై దృష్టి పెట్టి నిర్వహిస్తున ఈ సభలు ఉచ్చాహభారిత వాతావరణం లో ప్రారంభమై ,తెలుగు భాషా ,సంస్కృతి లను పరి రక్షించు కోవాలన తపన అందరిలోనూ కన్పించించి ,కర్తవ్య దీక్ష కు పూనుకోవాలి అన్న సందేశం ధ్వనించింది ,ప్రతిధ్వనించింది
Posted in సభలు సమావేశాలు | Leave a comment

సరసభారతి -28 వ సమావేశం “మా అక్కయ్య ” అనురాగ కవిత సంపుటి – ఆవిష్కరణ సభ

28 వ సమావేశం – మా అక్కయ్య

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

నన్నయ్య నుంచి నా(నారాయణ రెడ్డి) వరకు నారాయణీయం – రమ్యభారతి లో … ఆర్టికల్

నారాయణీయం

Posted in రచనలు | Leave a comment

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు – విజయవాడ 13,14,15

Prapancha Telugu 2


కృష్ణా జిల్లా తెలుగు రచయతల రెండవ ప్రపంచ మహా సభ

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఆంధ్రప్రదేశ్ లో హాలిడే మూడ్

       హాలిడే మూడ్ ఇన్ ఆంద్ర
            వేసవి శలవులు అయి పోయి జూన్ లో schools ,colleges తేరిచారు .బిల బిల మంటూ విద్యార్ధులు చదువులు ప్రారంభించారు .ఇదే తరుణం లో ఇప్పటి దాకా భూములకు శలవు లిచ్చిన రైతన్నలు మళ్ళీ సేద్యం పనులు ప్రారంభిస్తారు .నారు పొయ్యటం తో పనులు ప్రారంభమై ,నాట్లు వేయటం ,కలుపు తీయటం ,ఎరువులు వేసి భూమిని ఆకు పచ్చ బంగారం గా మార్చటం ,చివరకు భూదేవి పులకరించి పచ్చని బంగారం గా మారటం ,కోతలు ,కట్టివేతలు ,కుప్పలు వేయటం ,ధాన్యం నూర్పిడి ,కల్లాలన్నీ మేలిమి బంగారు రాశులు లాగా కళ కళ లాడటం .ఆ ధాన్యాన్ని ఇంటికి తొలి పురులు కట్టటం ,గాదెల్లో నిలవ చేయటం ,సంక్రాంతి మా లక్ష్మి ని పూజించి బసవన్నను ,దాసరులను ,గంగిరెద్దు మేలాలను సత్కరించటం ,ఇంటిముందు గొబ్బీమ్మలు ముగ్గుల హరివిల్లులు లతో ప్రతి పల్లె పులకరించి పోవటం సహజం గా జరిగే పధ్ధతి ఇప్పుడు దీనికి విరుద్ధం గా రైతన్న అలిగాడు .చేసేది లేక చేతులు ముడుచుకొని కూర్చున్నాడు .కదలడు ,మేదలడు .ఈ సంవత్చరం పంటకు సెలవు అన్నాడు .అన్న పూర్ణ గా విలసిల్లె ఆంద్ర దేశం లో అన్నానికే కరువు వచ్చే పరిస్థితి .దేశానికి ,వెన్నెముక అనీ ,అన్నదాత అనీ కీర్తి కిరీటాలు పెట్టటమే కాని ,అడిగిన ధర అందించే పాలకుడు కాని ,కళ్ళాల్లో అమ్ముకొనే స్థితి నుంచి బైట పడేసే నాధుడు కానీ ,కల్తీ విత్తనాలతో బతుకు భారం అవుతుంటే చూసి నివారించే అధికారి గానీ ,ఎరువులు అడిగిన వాడికి తప్ప అందరికీ సరఫరా అవుతున్నా ,కల్తీ ఎరువులు పొలాల్ని బీళ్ళు గా మారుస్తున్నా ,ఓదార్చే వాడు  ఆదుకొనే  వాడు లేక ఎన్ని మార్లు విన్న విన్చినా గోడు పట్టించుకోక పెడచెవిని పెడుతున్న ప్రభుత్వాన్ని ,దాని కొయ్యగుర్రం పాలనా అసమర్ధతను చూసి ,విసిగి వేసారి ,అలిగి ఆక్రోశించి ,మద్దతు ధరకోసం రోడ్డెక్కి అలిసి పోయి తనకున్న సమస్తాన్ని పొలం మీదే పెట్టుబడి పెట్టి అందు లోంచి కానీ కూడా రాలక పొతే ,వచ్చినా తెచ్చిన డబ్బుకు వడ్డీకి కూడా చాలకుంటే నిస్సహాయ స్థితి లో అన్నదాతలు తీసుకొన్న అసాధారణ నిర్ణయం ఇది .కడుపు మండి చేస్తున్న పంట సత్యాగ్రహం .బధిర శ్శన్ఖారవం గా మారిన ప్రభువుల కళ్ళు  ,చెవి తెరిపించే సాహసోపేత నిర్ణయం .గత్యంతరం లేకనే చేసిన పని .అదే క్రాప్ హాలిడే .                                      పూర్వం ఎప్పుడోకొన్నేళ్ళ   క్రితంపొగాకు  హాలిడేప్రకటించమని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు జ్ఞాపకం .అప్పుడూ ,ప్రభుత్వపు అసమర్ధత కే అది అద్దం పట్టింది .మనకు తిండి తిన టానికి జనం లేక కాదు .ఎగుమతులు చేసే వీలు లేక కాదు కానీ    వున్న ధాన్యం నిల్వ చేసే దిక్కు లేదు ,గోదాములు నిర్మించి ఆదు కొనే ఆపన్న హస్తం లేదు .దాచిన ధాన్యాన్ని సద్విని యోగం చేసే ప్రణాళిక లేదు .పనికి ఆహారం మాటల్లో నే కాని చేతల్లో ఎక్కడా విజయవంతం కాలేదు .అవుతుందని నమ్మించి అదంతా బడా బాబుల జేబుల్లోకి ,ప్రోక్లైనర్ల వోనర్ల పరం చేయటమే .వ్యవసాయ మంత్రి ఏమి మాట్లడుతాడో ఆయనకే తెలీదు .వ్యవసాయ విస్తరనాది కారులు వుండరు .కొత్త వారిని నియమించారు.నియమించినా వాళ్ళు చేరే నమ్మకం లేదు .వున్నా వాళ్ళు ప్రజాప్రతినిధుల బంటులు గానే వ్యవహరిస్తున్నారు కానీ  రైతు మేలు కోరి ఎక్కడా ప్రవర్తించరు .అంతా దళారీ వ్యవస్థ .గత ఏడేళ్ళు గా రాష్ట్రం అన్ని రంగాల్లో ను వెనకడుగే ఇక్కడ   అవినీతిలో ,ఆశ్రిత పక్షపాతం లో ,సెజ్ ల పేర పేదల కడుపు కొట్టటం లో ,అడివి పుత్రులను ,గిరిజనులను ,మత్చ్య కారుల్నీ వంచించటం లోను ,కారిడార్ల పేరిటా భూములన్నీ లాక్కోవటం లోను ,గనుల తవ్వకం పేరిట ఘనులకు గనులన్నీ అప్పనం గా సమర్పించటం లోను మనమే ముందు .బీహారును ,లాలూను ,మధు కొడాలను ,హర్షద్ మెహతాలను మనం మింపోయి ముందు నిలిచాము .మాటలకు చేతలకు పొంతన లేదు .ముఖ్యమంత్రి ఎవరో ఏంచేస్తున్నాడో ఎవరికీ తెలియదు ,పాలసీ ఏమిటో ,పదకాలేమితో వివరం వుండదు.ఇవన్నీ రైతుల పాలిటి శాపాలయాయి .సామాన్యుల పాలిటి పాశాలయాయి .అందుకే రైతన్నలు పొలం ,గట్టు చెట్టు చేమ,నీళ్ళు కాలువలు అనీ వదిలి భీష్మ ప్రతిజ్న తో దీక్ష చేబట్టారు .ఇది అందరికీ కళ్ళు తెరిపించాలి .అందరు శ్రద్ధ బట్టాలి .అంతా కలిసి నడవాలి .మనకు తిండి  పెట్టె అన్న పూర్ణ అయిన భూమాతను నిర్జీవం చేయద్దు ,పంట సిరి తో కలకలలాడే మాగాణులను ఎండు భూములు కానివ్వద్దు .త్వరగా నిర్ణయాలు తీసుకో వాళి .మళ్ళీ మన చేలు బంగారం పండాలి .అన్న పూర్ణ ఆంద్ర దేశం అన్న కీర్తి నిలవాలి .సస్య విప్లవం ,నీలి విప్లవం ,శ్వేత విప్లవం సాధించిన జాతి మనది .మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని సంతరించాలి.   రైతన్న   గుండెలో గుబులు పోగొట్టాలి .గుండె ధైర్యం నింపాలి ఆసరాగా నిలవాలి .మన వెన్నెముకను మనమే రక్షించు కోవాలి .అది విరిగిన ,వంగినా ప్రమాదమే .అందరు కలిసి ముందుకు కదులుదాం దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు ధైర్యం చెప్పి ,అతని కోరికలు తీర్చి కన్నీరు తుడిచి మనమే అతనికి వెన్నెముక గా నిలుద్దాం .
             సరే ఇది ఇట్లావుంటే అసలు మనకు అంతా హాలిడే గానే కనిపిస్తోంది ఆంద్ర దేశం లో .మంత్రులు లేరు రాజీ నామా చేశారు .విధులు లేవు నిధులు మాత్రం అన్డుతున్నాయనే అంటున్నారు .శాసన సభ్యులు రాజీ నామా .వాళ్ళుఅంతే   హాయిగా అనుభవిస్తున్నారు .ప్రజలదగ్గరకు వెళ్ళక్కర్లేదు .ప్రజా సమస్యలు పట్టించుకోనక్కర్లేదు ,పనులు అడిగే వాడు లేడు చేసే వాడు లేడు .శాసన సభా సమావేశం అవదు .అయినా అక్కడేమీ జరగదని ముందే అందరికి తెలుసు speaker విదేశీ tours .కనుక అదీ హాలిడే ను ఎంజాయ్ చేస్తోంది .
                స్కూళ్ళు ,కాలేజీలు తెరిచినా నామ మాత్రమే .పనిరోజులు తక్కువ హాలిడే లు ఎక్కువ .ఎప్పుడు మూస్తారో ఎప్పుడు తెరుస్తారో ఎవరికీ తెలీదు .తెలంగాణా అనుకూలురు ,ప్రతికూలురు ఇద్దరు మద్దెల వాయిస్తూ అన్నిటికీ హాలిడే తో సరదా తీర్చుకొంటున్నారు  .బస్సులు తిరగవు .వాటికీ చక్రాల హాలిడే .ఫ్యాక్టరీలు పని చేయవు .వాటికి పొగ గొట్టం హాలిడే .విధులు బహిష్కరణ తో అన్నిటికీ దీర్ఘ కాల హాలిడే .కోర్టు పెట్టాలంటూ లాయర్ల సమ్మె తో కోర్తుకూ హాలిడే .హాలిడే లేనిది ,దినపత్రికలకు ,న్యూసు చాన్నేల్లకే .అవి అవిశ్రాంతంగా వార్తలు కుప్ప  పోస్తూనే వుంటాయి,చేరుగుతూనే వుంటాయి , చెండాడు తూనే వుంటాయి   ,భయపెడుతూనే వుంటాయి ,అభూత కల్పనల తో బుర్ర తినేస్తూనే వుంటాయి .న్యూస్ నాణ్యత తగ్గి వ్యూస్    కు ప్రాధాన్యత పెరిగి పోయింది పాపం పెరిగినట్లు .చిన్న సంఘటన జరిగితే కెమెరా అక్కడ పెట్టటం చొల్లు కబుర్లతో కాలమ్ వ్యర్ధం చేయటం .దీనికి హాలిడే లేదు ,రాదు ,వుంటే వాటికి మనుగడ లెదు .
          తెలంగాణా వాళ్ళు ఆంధ్రా వాళ్ళని ,వీళ్ళు వాళ్ళని తిట్టినా  తిట్టు తిట్టకుండా నాన్ స్టాప్ గా తిట్టుకొంటూనే  వున్నారు .దీనికి హాలిడే  లెదు .ఆందోళనకు బందులకు రాస్తా రోకోలకు ,బస్సులు తగలపెట్ట తానికీ హాలిడే లెదు .అనుక్షణం జరుగు తూనే వుంది .ఒకే భాష మాట్లాడుతున్నామన ఇంగిత జ్ఞానం కోల్పోయాం .ఒకే  తల్లి బిడ్డలం అని ఏనాడో మర్చి పోయాం .సభ్యతా ,సంస్కారానికీ హాలిడే ప్రకటించాం .మానవత్వానికి ముందే దీర్ఘ హాలిడే ఇచ్చేశాం .యాసిడ్ దాడులకు ,మాన భంగాలకు ,క్రౌర్యానికీ హింసకు ,ప్రతిహిమ్సకు ,నో హాలిడే స్త్రీల    పట్ల సభ్యతకు ,ప్రేమ విషయం లో బరి తెగిన్చాతానికీ, కట్నం విషయం లో బలవంతం గా గుంజటానికీ ,గృహ హింసకూ
మనం హాలిడే   ఇవ్వం .అవి నాన్ స్టాప్ గా జరక్క పొతే మన పైశాచిక ఆనందానికి హాలిడే వస్తుందని భయం .
            తెలుగు భాషకు ,సంస్కృతికీ హాలిడే ఎప్పుడో ఇచ్చేశాం .భావ దారిద్ర్యానికి ద్వారాలు ఏనాడో తెరిచే శాం .విదేశీ వ్యామోహం కు మాత్రం నో హాలిడే .అవన్నీ జాలీ డేలె  .కుంభకోణాలకు,ఆశ్రిత పక్ష   పాతానికీ ,అవినీతికీ, లంచాలకు ,అయినవాడికి ఆకుల్లో కాని వాడికి కంచాల్లోవడ్డించ తానికీ  నో హాలిడే .ప్రతిక్షణం ఇవి జరిగి పోతూనే వుంటాయి .కబ్జాలకు ,సేటిల్మెంట్లకు ,దోపిడీకి అన్యాక్రాన్తానికీ దేవునికే శత గోపురం పెట్ట తానికీ నో హాలిడే .ఇదంతాజాలీ గా  చేస్తూ అనుభవిస్తున్న హాపి డేస్
          దేశాన్ని  నేహ్రు అనుయాయులు పాలించాటానికి హాలిడే లెదు ,రాదు .గాంధి గారికి మాత్రం సెలవే .ఇప్పుడు కేంద్రం లో రాష్ట్రం లో ప్రభుత్వాలు వున్నాయని ఎవ్వరూ భ్రమించటం లెదు .అవి అధికారుల రధ చక్రాల మీదే   నడుస్తున్నాయి .మంత్రులు వున్నా కుంభకోణాల్లో దాగి వున్నారు .బయట పడలేరు .పడినా మళ్ళీ వాళ్లకు హాలిడేదొరకడు   .మళ్ళీ పదవుల్లో దూరుతారు .అదీ మన గొప్ప తనం .కుంభకోణాలకు సెలవే లెదు .యధేచ్చ గా సాగిపోతూనే వుంటాయి .ప్రధానికి అంత పెద్ద జోడు వున్నా అసలువి ఏవీ చూడ లెడు  ,వినలెడు   ,విన్నా నిర్లిప్తుడు .పాపం ఆయన చేతుల్లో ఏమీ లెదు .ఆయనా హాలిడే పురుషుడే .మొత్తం యంత్రాంగాన్ని ,మంత్రామ్గాన్ని తిప్పే మహిళకు పాపం జబ్బు చేసి దేశం వెలుపల వుంది .అందుకని ఇక్కడ పరిపాలన కు తాత్కాలిక హాలిడేస్ ప్రకటించారు .దిల్లి   సందర్శనకు పీ.ఏం ఆఫీసుకు సెలవే ఒక వేల వున్న లేనట్లే .అయితె ”జాదూ ”మామయ్యతో సంప్రదింపులకు నో హాలిడే .నిత్యం కొలువు నడుస్తూనే వుంటుంది .ఇదీ రాష్ట్ర దేశ పరిస్థితి .అంతా హాలిడే మీద నడుస్తోంది ఈ హాలిడే కి హాలిడే ఎప్పుడు వస్తుందో?ఎప్పుడు జన జీవనం శాంతి భద్రతల తో విలసిల్లుతుందో ?హాలిడే మూడ్ మారి హోలీడే   గా మారాలని అందరి ఆకాంక్ష.జాలీ  డే ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ప్రస్తుతం ఈ రాతకు హాలిడే ప్రకటిస్తూ   శెలవ్ .
                 మీ దుర్గా ప్రసాద్ –10 -08 -11 .
Posted in రాజకీయం | 2 Comments

కృష్ణా జిల్లా ప్రపంచ తెలుగు రచయతల 2 వ మహాసభ ఆగస్ట్ 13,14,15… విజయవాడ లో…

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఏడు కొండల పై అయిదడుగుల అంద గాడు”

    ఏడు కొండల పై అయిదడుగుల అంద గాడు”
           జూలై ముప్ఫై తేదిశని వారం సాయంత్రం  నీ దివ్యసుందర విగ్రహాన్ని దర్శించాలని నీ సన్నిధికి చేరాం సకుటుంబ సమేతం గా .మేత అంటే గుర్తుకొచ్చింది .మా మేత ను మేమే తెచ్చుకోన్నాం దారిలో మెయ్యటానికి .భక్తీ ఎంతున్నా  బలం కూడా కావాలిగా .లోపల ఆకలి గంటలు కొట్టు తుంటే నీ గుడి గంటలు ఎలా వాయిన్చగలం స్వామీ .మర్చిపోయా అసలు గంటలే మోగించే పనే లేకుండా చేశావు .సరే స్వామీ .అధికారుల మనస్సులో దూరి కొన్ని మంచి పనులు చేయిస్తున్నా వయ్యా .మా బోటి ముసలి వారికీ ,కాలు కన్ను లేని వికలాంగులకు ఉచితం గా శీఘ్రం గా దర్శన యోగం కలిగిస్తున్నావు .చాలా సంతోషం స్వామీ .అదిగో అలాంటి దర్శనమే నేను నా భార్య ప్రభావతి చేశాం.యాభై రూపాయల టికెట్టు తో మా అబ్బాయి శర్మ ,కోడలు ఇందిరా ,మనవడు శ్రీ హర్ష ,మానవ రాలు హర్షిత ,ఉయ్యూరు  నుంచి వచ్చి మాతో చేరిన మా నాలుగో వాడు వెంకట రమణ ,కోడలు మహేశ్వరి లోపల మా లైన్ లోనే కలిశారు .అందరం రెప్పలు అర్చకుండా నీ సన్నిధి ని  నిలిచాం .ఎక్కడో చీకటి గుహలో వున్నావేం స్వామీ ?ఎంతో ఆర్భాటం గా రంగ రంగ వైభవం గా కనిపిస్తావని ఎదురు చూశాం .ఏమిటో మరీ చిన్న వాడివి గా కనిపించావేమిటి ?నాకు మాత్రమే నేమో అనుకొన్నా.అందరూ అదే మాట .ఆభరణాలూ లేవు .దండల సంభారమూ లేదు .బోసి పోయావయ్యా .మనసుకు ఎందుకో సంతోషం కలగ లేదయ్యా .అయినా నీది కటాక్ష వీక్షణమో ,ఆనంద హేలో ,అనుగ్రహ మో,తెలుసు కొనే సమయం ఎక్కడ /నీ నామాలు అన్నీ కప్పేశాయి .ఏభావము గొచరం కాదు .అదేదో మేమే అనుభవించాలని నీ టైరు భావం ఏమో .ఒక్క క్షణం నీ సుందర మంద హాస ముఖారవిందాన్ని చూద్దామనే ఆశ తో వచ్చాం.కాని ఎక్కడ నిలువ నిస్తున్నారయ్యా ?ఒకటే తోపుడు .పడ ,పడ మని విసవిసలు ,రుస రుసలు .త్తోపులాతలు తోడ తోక్కిల్లు .ఎక్కడ కింద పడతామో నని భయం చిన్న గాయలయితే నీకేమీ పట్టాడు .పెద్ద వాటికే నువ్వు భరోసా .అది సరే అంత చీకటి గుయ్యారం లో వుంది ఈ సకల భువనాలను ఎలా ఎలుతున్నావయ్య ?ఏదో ఆరడుగుల అంద గాదివని రామ ,కృష్ణుల అవతారాల్లో నిన్ను పూజించాం .నీ వైభవాన్ని ,సుందర రూపాన్ని పోగిదాం.ఇప్పుడేముంది ?నామాలే కదా స్వామీ ?అదియాన్ దాసోహమే నీకు కావాల్సింది .అది సరే అసలు నీ విగ్రహం అంత చినడైన్దేమిటి సామీ ?maayaa ?మర్మమా ?లఘు ,శూక్ష్మ లఘు దర్శనాలిస్తున్నందున నువ్వు లఘువు అయావా ?కొండలనే మాయ చేసిన నాయకులు నీకేక్కడి తిప్పలు తెస్తున్నారో నని బాధ గా వుంది .స్వర్ణ మయం అంటాడొకడు ,అనంత స్వర్ణం అన్తాదిన్కోడు ,అక్కడున్న బంగారం కంటే విలువైన శాసన సంపద ఎవరికీ అక్కర్లేదు .నువ్వు ఇవన్నీ కావాలని కోరావా ?మా కోరిక ఇలా తీర్చుకొనే ఉపాయమే ఇది .పోయింది పోగా ఇంకా వచ్చి చేరుతూనే వుంది నీ దివాణం లోకి పెన్నిధి .,
         ఒక దేశం ,ఒక ప్రాంతం అని ,ఒక మతం ,ఒక విశ్వాసమనీ ఏమీ లేదు .అందరు నీలో వారి వారి దేవతలను దర్శిస్తున్నారు .అందుకే ముజ్జగాల దొరవైనావు .విభావానికీ ,విధానానికీ కొదవ లేదు .నీకు ఏది కావాలన్నా సమ కూర్చే సంపన్నులున్నారు .సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకొనే వదాన్యులున్నారు .సేవా భావం తో సేవిస్తున్న లక్షలాది జనం వున్నారు .నీ గుది ఇక్కడ మాత్రమే పరిమితం కాదు .దాదాపు అన్ని దేశాల్లో నిన్ను వెలయింప జేసుకొన్నారు .పూజాదికాలతో ,భక్తీ ప్రపత్తులతో ,నిన్ను అనుక్షణం కొలుస్తున్నారు .కోరికలు నీకు నివేదించి ,సాఫల్యం పొందుతున్నారు .ఏ మూడింటికో నిన్ను లేపి అన్నీ నీకు నివేదించి దర్శన ప్రాప్తి కల్గిస్తున్నారు .మళ్ళీ అర్ధ రాత్రి దాకా నీకు విశ్రాంతి లేదు .ఎప్పుడు నిద్రిస్తావో ,ఎప్పుడు మేల్కొంతావో తెలీదు .సకల భువన రాక్షకుడికి నిద్రేమిటి?భోజన ,భాజనాలేమిటి .నీ కోసమా ఇవన్నీ ,కాదు మా కోసం .అన్నీ చూస్తూనే ఉంటావు .ఏమీ తెలీనట్లున్తావు .అంతా మునిగే దాకా కళ్ళు తెర్వ్వు .ఇలా అయితె ఎలా గయ్యా బాబూ?
           నీ దర్శనం చేసి విశ్రాంతి కోసం గడులున్నాఎమో నని ఇంటర్నెట్ లో వెతుకు తుంటే మూడు నెలల దాకా ఖాళీ లేవు అని తక్కున సమాధానం వస్తుంది .నిజమే ననుకొని నమ్మితే మునిగి పోవామే .తెలిసిన వాడినో ,బలిసిన వాడినో ,ఆశ్రయిస్తే అయిదు నిమిషాల్లో గది హుజూర్ అంతు ముందు నిలుచుంటుంది .నీకే పంగ నామాలు పెట్టె ఘనులు కో కొల్లలు నీ కొండ మీద .అడుగడుగునా ఏదో దగా ,మోసం .ఎలా భరిస్తున్నావు మహాను భావా /నీ దర్శనం చేసిన వారందరికీ ఉచితం గా చిన్న గోలీ కాయ సైజు లడ్డు ప్రసాదం గా ఇస్తున్నారు .బాగుంది .అందరికీ నీ లడ్డు ఉచితం గా అందుతోందని సంబర పడ్డాను .సామీ !అందులో పచ్చి సెనగ పిండి ఇంత పంచదార తప్ప ఏమీ లేదు .నువ్వు తినవుగానీకేమీతెలుస్తుంది దాని రుచి?
           ఎన్ని చూసుకోవాలి కొండపై నువ్వు ?బస్సులు ,వ్వతి సిబ్బంది ,సంబారాలు ,వసతి గృహాలు ,వాటి నిర్వహణ ,ప్రసాదాలు ,వినియోగం ,పూజలు ,పునస్కారాలు ,నిత్యకళ్యాణం పచ్చత్రనాలు ,ఉత్చవాలు ,వేడుకలు ,అడుగడుగు దండాలు ,ఆపదలు తీర్చటాలు ,హుండీ డబ్బులు ,దానికి కంటికి రెప్ప లా కాపాడు కోవతాలు ,లెక్కింపులో వెయ్యి కళ్ళ నిఘా వున్న తస్క్రులున్తూనే వుండటం ,అధికారులు ,వారికి రాచ మర్యాదలు ,మంత్రులు ,గవర్నర్లు దేశ విదేశీ ప్రముఖులు ,స్టార్లు ,సినిమా స్టార్లు ,వీళ్ళందరికీ సంతృప్తి పరచే ఏర్పాట్లు పాపం ఇవన్నే నువ్వు చూసు కో లేవని పాలక మండలిని ఏర్పాటు చేస్తే .అది నీకు శత గోపం పెట్టె స్తోంది .
            రామా రావు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు చేబట్టిన నిత్యాన్న దాన పధకం మహా భేషుగ్గా నడుస్తోంది .శ్రీ వారి ప్రసాదం గా కళ్ళ కద్దుకొని తింటున్నారు .దాని నిర్వహణా బాగుంది .దాన్ని ఇప్పుడు ఇంకా విస్తరించి గొప్ప సేవ చేయిస్తునావు .నీ కొండపై ఆకలితో ఒక్కరు ఉండ కూడదను కొన్నావా స్వామీ ?అందరికి ఉచిత భోజనమా ?ప్రపంచం లో ఇది ఎక్కడైనా సాధ్యమా ?ఇక్కడ అది సాధ్యమయింది .అన్న పూర్నా దేవి ఇక్కడ కొలువైంది .భక్తుల కోరికలు నువ్వు తీరుస్తుంటే ఆకలి ఆమె తీరుస్తోంది .అవును ఆమె నీ సోదరే కదా ?కొత్తగా వేగ్నేశ రాజు గారు ‘నిరతాన్న దానానికి సకల సదుపాయాయాలతో కట్టించిన ”తరిగొండ వెంగమాంబ నిత్యాన్న దాన భవనం ”రాజు గారి భక్తీ ప్రపత్తులకు నిదర్శనం .ఒకే సారి ౫౦౦౦మన్ది భోజనం చేసే ఏర్పాట్లు బహు భేషుగ్గా వున్నాయి .ఎంతో సేవా భావం తో అక్కడ అన్న దాన కార్యక్రమం పవిత్రం గా జరుగు తోంది .భోజన సమయం లో విని పించే వేదోచ్చారణ ,ఆరన పూర్నాస్తకం వీనుల విందే కాదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఎరుక కలిగిస్తోంది .అన్నాన్ని నినదించ వద్దు ,అన్నాని పారేయవద్దు అని చెప్పే ఉపనిషద్ వాక్యాలు కర్తవ్య బోధ చేస్తున్నాయి .అదే భోజనం బయట వందరూపాయలు పెట్టినా లభించదు .శుచి ,శుభ్రం గా అక్కడి వారు మర్యాదగా ,గౌరవం గా ప్రవర్తించి ,అడిగి అడిగి ,మరీ తినిపిస్తున్నారు .నీ దర్శనం చేసిన వెంటనే నీ ఆలయానికి ప్రక్కనే ఇది వుండటం భక్తుల అదృష్టం .ఉత్తరాది వారికీ కావలసిన పదార్ధాలు అంటే రొట్టె చపాతి పూరీ వగైరాలు పెట్టె విధానమూ ఏర్పాటు చేసి వారినీ సంతృప్తి పరుస్తున్నావు .అయితె స్వామీ .ఒక్క మాట చెప్ప కుండా ఉండలేను .భోజనం కొంత అరవ వాసన వేస్తోంది .ఇంకా పూర్తి తెలుగు భోజనం అని పించటం లేదు .కాస్త కనికరించి తెలుగు రుచులు కలిగించు .ఇప్పుడు పెట్టె భోజనం బానే వున్నా రుచి లేదు .సారీ సామీ రుచి అంటే ఉప్పు కాదు .తినటానికి హితవు గా లేక పోవటమే .దాన్ని కాస్త పర్యవేక్షించి ఆంధ్రా భోజనమందించి ,ఆస్వాదిన్చేట్లు చెయ్యి స్వామీ .రేపటి బ్రహ్మోత్చావాలకు షడ్రసోపేతమైన భోజనం అందిస్తామని నిన్ను పాలించే సారీ నీ గుడిని పాలించే అధికారులు అంటున్నారు .చాలా సంతోషం .అప్పుడు నీను చెప్పింది కూడా గుర్తు చెయ్యి అన్న దాటా .
         నీ ఆలయ శోభ చూసే సమయం ,నీ ఆలయం లో శిల్ప కళా సౌందర్యాని దర్శించే భాగ్యం తగ్గి పోతోంది-నీ దర్శనపు తొందరలో .అవన్నే చూపించటానికి నీ ప్రచార సాధనం టి.వి వుంది గా .అందు లో చూసి తరించాల్సిందే .పూర్వం చక్రపొంగలి పులిహోర దద్ధోజనం ,వడ ప్రసాదాలున్దేవి .కొనుక్కోవటానికి దొరికేవి .ఇప్పుడవన్నీ ఎత్తేశారు పాపం ఒక లడ్డు తో నిన్ను సరి పుచ్చుతున్నారు .
            ఎంతో ఖర్చుతో నాద నీరాజనాన్ని సాయంత్రం పూట ఏర్పాటు చేస్తున్నారు .కాని అక్కడ కూర్చుని ఆస్వాదించే రసజ్ఞులు వెళ్ళ మీద లెక్క పెట్టినంత కూడా వుండటం లేదు .ఇది చాలా బాధాకరం గా వుంది స్వామీ .ఆరు ఏళ్ళ తర్వాత మళ్ళీ నీ దివ్య దర్శనం చేయించావు .నీ కళ్ళతో నిన్ను చూపించావు .కృతజ్ఞులం .లోపాలుంటాయి .సరి చేసు కోని ముందుకు సాగుదాం .జై శ్రీ వేంకటేశ .నమో నమో శ్రీ వేంకటేశ
           మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -08 -11 .

 

Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 Comment

”మో”హరించిన జ్ఞాపకాలు

”మో”హరించిన జ్ఞాపకాలు 
                    వేగుంట మోహన ప్రసాద్ ఉయ్యూరు లో అడుసుమిల్లి గోపాల క్రిష్నయ్య మరియు చెరుకు రైతుల కళాశాలలో ఆంగ్ల ఉపన్యాసకుని గా పనిచేసారు .అప్పటికే ఆయన కవిత్వపు హోరు ఆంద్ర దేశం అంతా నినదిస్తోంది .మాదాల కాశీ విశ్వేశ్వర రావు గారు ప్రిన్సిపాల్ గ పని చేస్తున్న కాలమ్ అని జ్ఞాపకం .పరుచూరి గోపాల కృష్ణ కూడా .కళాశాల ప్రారంభం లో వున్న తెలుగు లెక్చరర్ .ఇంటర్వ్యూ కువచ్చార్రు . నేను హాజరయాను తెలుగు పోస్ట్ కు .నాకు recommendation లేదు అప్పటికే నేను జిల్లా పరిషత్ లో సైన్సు టీచర్ గా పని చేస్తున్నాను అనే .. పిచ్చి బాబు కూడా చాలా తీవ్రం గా అన్ని కోణాల్లో నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు .గోపాల కృష్ణ తణుకు కాలేజి లో పని చేస్తూ వచ్చాడు .ఇంటర్వ్యూ సమయం లో ఖాళీ గ వున్నప్పుడు చాలా జోకులు పెల్చేవాడు .కధలు చెప్పే వాడు .ఇక్కడికి దగ్గరలో వున్న మేడూరు గ్రామస్తుడు .అనుభవం వుంది ,చాతుర్యం వుంది .అతను ఒక జోకు లాంటి నిజం చెప్పాడు .ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం .ఒక సారి ఒక ఆంగ్లేయుడు ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ ని చూడ టానికి వచ్చాడట .అడుసుమిల్లి గోపాల క్రిష్నయ్య గారు అన్నీ దగ్గరుండి చూపిస్తున్నారట .పంచదార చాలా నాన్యం గా వుందని ఇంగ్లీష్ వాడు మెచ్చాదట .దానికి సమాధానం గా గోపాల క్రిష్నయ్య గారు ”సార్ !మా మేకు ఏం మేకు సార్ మీఇంగ్లీషు వాడి  మీకే మేకు ”అన్నారట. .అంటే ,మా తయారు లో గొప్ప ఏముందండి ,మీ తయారే గొప్ప అని అర్ధం అలా మేకు బందీతో తెలుగు ఆంగ్లం కలిపి వాయిన్చాదట గోపాల క్రిష్నయ్య గారు ..ఇంగ్లీష్ వచ్చినా రాక పోయినా ఆయనకేమీ నష్టం లేదు . షుగర్ ఫ్యాక్టరీ నెలకొల్పి ఇక్కడి పారిశ్రామిక వికాసానికి ,రైతు అభ్యుదయానికీ ,కూలీల పనికి ఆర్ధిక రంగ పురోగతికి బాటలు వేసిన మహనీయుడు ..పరుచూరి చెప్పిన ఆ మాటలు విని కడుపుబ్బా నవ్వు కొన్నాం .పరుచురికి ,పిచ్చి బాబుకు పోస్ట్ లు వచ్చాయి .అదో గొప్ప అనుభవం .ఆ తర్వాత ఇక్కడ పని చేసిన కాలమ్ లో పరుచూరి కాలేజీ లో మంచి నాటకాలు రచించి ,విద్యార్ధులతో వేయించేవాడు .మా పెద్దబ్బాయి శాస్త్రి ఆయన శిష్యుడే .ఒక నాటకం లో ఆడ వేషం వేశాడు మా వాడు .ప్రైజ్ కూడా వచ్చింది .సందడి చేయటం పరుచూరి కి ఒక కళ .ఇక్కడినుంచే నెమ్మదిగా సినిమా కి వెళ్ళాడు అప్పటికే అన్న వెంకటేశ్వర రావు ఆ రంగం లో బాగా రాణిస్తున్నాడు .ఇద్దరు కలిసి పరుచూరి బ్రదర్స్ గా సిని ఫీల్డ్ ను చాలా కాలమ్ నుంచి దున్నేస్తున్నారు .పేరు ,ప్రతిష్ట ,డబ్బు దశకం ,అన్నీ బాగానే సంపాదించారు .గోపాల కృష్ణ ఈ కాలేజీ నుంచి వెళ్ళిన వాడే నని చెప్పటానికే ఇది అంతా .
                అలాగే వేగుంట మోహన ప్రసాద్ గారు ఇక్కడ పని చేసి ఇక్కడి నుంచే విజయవాడ సిద్ధార్ధ కాలేజీ కి ఆంగ్ల శాఖ అధిపతిగా వెళ్లి నట్లు జ్ఞాపకం .అక్కడినుంచే ఆయన సాహితీ ప్రస్తానం అనేక రూపులు దాల్చి ,లబ్ధ ప్రతిస్తూ లైనాడు .ఇక్కడ వుండగా నా మిత్రుడు ,ప్రముఖ సాహితీ విమర్శకుడు స్వర్గీయ టి.ఎల్. కాంతా రావు ఇక్కడ జిల్లా పరిషత్ హై స్చోల్ లో మాతో పాటు పని చేశాడు .మోహన ప్రసాద్ కవిత్వం అంటే మహదానంద పడి పోయేవాడు .ఆ కవితలు చదివి విని పించి మమ్మల్ని మో వైపుకు ఆకర్షించే ప్రయత్నం చేశాడు .అప్పుడప్పుడు మో ను కలుస్తుండే వాళ్ళం .నేను పెద్ద గా మాట్లాడే వాణ్ని కాదు .కారణం ఆయన కవిత్వపు లోతు పాటులు నాకు తెలీవు .కాంతా రావు కు కొట్టిన పిండి .అప్పటికే రావు ఆంగ్ల కవులు ఫ్రెంచ్ ,కగ్ర్ర్మన్ కవుల కవితలన్నీ పుక్కిలి పట్టాడు .నేను ఇంకా ప్రవేశమే చేయని వాడిని .అతనితో పాటు నేను .ఆంజనేయ శాస్త్రి ,హిందీ మాష్టారు రామ రావు ,జ్ఞానసుందరం ,కలిసే వాళ్ళం .మో కొంత గంభీరం గా వుండే వాడు .మూతి బిగించే వుండేది .ఉండాల్సిన కొలత కంటే రెండూ మూడు అంగుళాల పొట్టి చొక్కా వేసే వాడు .తమాషా గా వుండేది నాకు .చేతిలో అణు క్షణ అగ్నిహోత్రం..కాంతా  రావు మాట్లాడు తుంటే వినటమే మా పని .అయితె ఆప్యాయం గా పలకరించే వాడు మో రాసిన చితి చింత కవిత కు అవార్డ్ వచ్చినపుడు కాంతా రావు సంబర పడి పోయాడు .ఆ పుస్తకం నాకు ఇచ్చి చదవ మన్నాడు .చాలా సార్లు ప్రయత్నించా .అందు లోకి నేను ప్రవేశించలేక పోయాను .నాకు అర్ధం కాదని తేలిపోయింది పుస్తకం తిరిగి ఇచ్చేశాను .కాంతా రావు ఆ పుస్తకం మీద చాలా గొప్పగా మాట్లాడే వాడు .వ్యాసాలు రాసిన జ్ఞాపకం .మో పెదిమలు కొంచెం మొద్దు గా వుంటాయి ఆయన కవిత్వ లక్షణం లాగా నేమో .తర్వాత కాంతా రావు కూడా విజయవాడ సిద్ధార్ధ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా చేరి ఇక్కడినుంచి వెళ్లి పోయాడు .అక్కడ మో తో మొదట్లో చాలా స్నేహం గానే వుండే వాడు .కాంతా రావు  బోలా  వాడు .అందరినీ నమ్మేస్తాడు .అది విజయవాడ .ఎన్ని రకాల మనుషులుంటారో తెలీని అమాయకత్వం లో కొంత కాలమ్ వున్నాడు .చివరికి blood is thicker than water  అని తెలుసు కున్నానని కనిపించినపుడల్లా చెప్పే వాడు .అక్కడ సావాసా దోషం అతన్ని మృత్యువుకు అతి త్వరగా చేర్చటం జీర్ణించుకోలేని విషయం .
                    వేగుంట అంటే నాకు ఎందుకో వాళ్ల నాన్న గారు వేగుంట కనక రామ బ్రహ్మం గారు జ్ఞాపకం వస్తారు .ఏలూరు దగ్గర వట్లూరు లో ఆయన ప్రతి ఏడు సభలు ,సమావేశాలు నిర్వహించి ,లబ్ధ ప్రతిస్తులైన వారి నందర్నీరప్పించి   విందు భోజనాలు ,గోస్టులు ,చర్చలు జరుపుతుందే వారు .ఇవన్నీ పేపర్ లో చదివే వాడిని .అ సభలు దేని గురించో ,ఎవరెవరు వచ్చే వారో నాకు జ్ఞాపకం లేదు .అంటే మో కు కూడా తండ్రి వారసత్వం అబ్బి ఎప్పు డు పది  మందితో వుండటం కని పించేది .బెజవాడ లో జరిగే ప్రముఖ సభలన్నిటికీ హాజరు వేయించుకొనే వారు .అవసరం వస్తేనే మాట్లాడే వారు .పత్రికల వాళ్ళందరికీ ఇష్టుడు .radio  లో చాలా ప్రసంగాలు చేశారు .ఆయన చెబుతుంటే వినటం ఒక ఆనందం .మాట తడబడదు .ఎక్కడో మొదలు పెట్టి ఎకదికేక్కడికో తీసుకు పోతూ,యేవో శిఖరాలు ఎక్కిస్తూ ,అమాంతం గా లోయలోకి నెట్టేస్తూ ,చేయి పట్టుకొనినది  నడి సంద్రం లో ఈదిస్తూ ,చేయి వదిలేసి ,భయపెడుతూ ,ఆటగా పాటగా సాగుతుంది ఆయన రాత అయినా ప్రసంగమైనా .ఎంతమంది కవులుకళా కారులు  రచయితలు ఆయన ముని వెళ్ళ మధ్య ఉంటారో ఆశ్చర్యం వేస్తుంది ..ఆ ప్రవాహానికి ఒరవడికి ఉక్కిరి బిక్కిరి అవుతాం .తాను మాత్రం చిదానందం గా నే ఉంటాడు .ఇంతవరకు ఆయన కవిత్వం లో నాకు ఒక్కటి కూడా అర్ధం కాలేదంటే ఆశ్చర్యం లేదు .అది నా లోపమే .అందులో ప్రవేశించే ఓర్పు ,నేర్పు మనకు వుండాలి కాని ఆయనేం చేస్తాడు .అందుకనే నాకు అనిపిస్తుంది కన్యా శుల్కంలో  గిరీశం తో గురజాడ అనిపించినట్లు ”algebra made difficult  ”లాగానే పాపం మో కూడా కవిత్వాన్ని most difficult గా మార్చేశా డేమో నని . .
             అతను విషాదాన్ని ప్రేమిచాడు .నిరీహలో మునిగి పోయాడు .రహస్తంత్రిని మీటి రసనాడుల్ని కదిలించాలను కొన్నాడు .అయితె అతని ఆవేశం ముందు అతని కవిత్వం ఒంకర్లు కొంకర్లు పోయింది .అలవి కాని గుర్రం అయిందేమో అనిపిస్తుంది .విషాద మోహనం మోహన విషాద మయింది .ప్రపంచాకవులు ,దేశీయ కవులు అతని ఆక్రమించుకొని ,నడిపించారు .ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడికి చేరు తాడో తెలీని నట్టడవి మార్గ గమనం అని పిస్తుంది .విశ్వ మానవ సంవేదనకు సంకేతం గా నిలబడాలన్న ఆకాంక్ష మో ది .అది ఎంతవరకు సాధించాడో తెలిసిన వాళ్ళు చెప్పాలి .తన కవితా త్న్త్రులతో జగతిని మేలు కొలిపే కవి తనమెదడు    లోని తంత్రులే తెగి ,రక్తం గడ్డ కట్టి మెదడు స్తంభించిన అచేతన స్థితి లో కొన్ని గంటల కాలమ్ వున్నా డంటే అమితాస్చర్యం వేస్తుంది  మెదడును  కదిలించే కవిత్వం చెప్పిన వాడి మెదడు డెడ్ అయిందంటే విధి వైపరీత్యాన్ని ఏమను కోవాలి ?
                 ”ఆట కదరా శివా ”అని శివ సాన్నిధ్యం లో నిరంతరం సంచరించే తనికెళ్ళ భరణి కి మో ఆప్తుడు ఎలా అయాడా  అని నాకు తీరని సందేహం .అంతేకాక తన పేరిట ఇచ్చే మొదటి పురస్కారం మోకు అందివ్వటం మరీ విడ్డురం .ఇద్దరి జన్మ సంస్కారాలకు అవి తీపి గురుతులు .అనిర్వచనీయ స్నేహ ,సోశీల్యాలకు హారతులు .
               కుప్పం ద్రావిడ విశ్వ విద్యాలయం లో అనువాదకుడు గా పనిచేసి నిజంగా తెలుగు సాహితీ లోకానికి అమూల్య సేవ లందించాడు మో .రావి శాస్త్రి కదల ను ఆంగ్లం లోకి అనువదించటానికి పడిన శ్రమ ,తీసుకొన్న శ్రద్ధ ,ఎంపిక చేసుకొన్నా విశిష్ట వ్యక్తుల తీరు చూస్తె ఆయన perfection కు యెంత విలువ నిస్తాడో నాకు అర్ధమయింది .ఆ పుస్తకాన్ని అమెరికా లో మేము వుండగా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారునాకు పంపించారు .అప్పుడే చదివాను .చాలా గొప్ప అనువాదం .రావి శాస్త్రి గారి తెలుగు అంతా అందులో దిగుమతియింది .ఆశ్చర్యం కలిగించింది .మో ఇంకా ఏయే అను   వాదాలు చేశారో తెలీదు కాని ఏది చేసినా ఆయన ముద్ర వుండటం ఖాయం .
               కృష్ణ జిల్లా రచయితల సంఘం ద్రావిడ విశ్వ విద్యాలయం సంయుక్తం గా నిర్వహించిన అనేక కార్య క్రమాల్లో మోహన ప్రసాద్ వచ్చి ,మౌన ప్రేక్షకుని గా వుండే వారు  ఆయన   రాక  కోసం అభిమానులు ఎదురు చూసే వారు ..ఆయన రాక నిండుదనం తెచ్చేది .తన దేహాని పరోపకారం కోసం అవయవ దానం చేసిన మానవీయ మూర్తి .మో ను నిర్వచించటం కష్టం .అనిర్వచనీయం ఆయన కవిత్వం ,వ్యక్తిత్వం .మో అంటే మోహన కవిత్వం లో ముంచే వాడు .మో అంటే మొగమాటం లేని వాడు .మో అంటే మొద్దు నిద్ర వదిలిన్చేవాడు .మూక కవిత్వాన్ని పక్కకు నెట్టి  ,ప్రత్యేకతకు ముందు నిలిచేవాడు ,.మో కవితకు పదార్ధ నిఘంటువు అవసరం.దాన్ని రూపొందించే కృషి లో మో అభిమానులు ముందు నిలవాలి . మో ఒక్కడే ఒక కవితా శిఖరం .దాని పైకి పాకాలంటే గుండె ధైర్యం కావాలి ప్రతిభ కావాలి ,అనుభూతి చెందే హృదయం కావాలి .లేకుంటే అదొక సంక్లిష్ట కల్లోల కాసారమే .దిగిన కొద్దీ లోతు ,ఊపిరి సలపని ఉత్కాన్త ,వేదన ,సంవేదన ,విషాద నిషాద భరిత ఆక్రోశం ,ఆవేదన అంతు చిక్కని శోధన
               నాకు తెలుగు సాహిత్యం లోముగ్గురు విలక్షనులు   కనిపిస్తున్నారు .ఒకరు కదా రచయిత త్రిపుర ,రెండు నవలా రచయిత వడ్డెర చండీ దాసు ,మూడు modern   కవి మో  ..ముగ్గురూ ముగ్గురేఅర్ధం కారు .అర్ధం చేసుకో కుండా ఉండలేము . అర్ధం అయినట్లు నటించను లేము ..
                         మీ — —  గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు –04 -08 -11
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
Posted in రచనలు | 1 Comment

శాస్త్ర వేత్త ఆర్థర్ సి..క్లార్క్

        శాస్త్ర వేత్త  ఆర్థర్ సి..క్లార్క్
—                     దాదాపు 900 రచనలు చేసిన ఆర్థర్ క్లార్క్ 1917 లో డిసెంబర్ 17 న జన్మించాడు . ఏడవ ఏడునుంచి శిలాజాల మీద ,డినోసార్స్,మీద FLYING   మీద  ద్రుష్టి నిలిపాడు .స్వంత TELESCOPE ను ,రాకెట్ ను తయారు చేశాడు .తండ్రి టెలిఫోన్ ,టెలిగ్రాఫ్ లలో పని చేశాడు .తల్లి ,సోదరుడు కూడా TELEGRAPHISTS పద్దెనిమిది ఏళ్ళ వయసు లోనే port ఆఫీసు లో పనిచేసి ,TRANSMITTER ,CRYSTAL RADIO సెట్ తయారు చేసిన  సృజన ఉన్న వాడు .అతని టీచర్స్ అతని పై మంచి ప్రభావం చూపించారు .కధలు బాగా చెప్పే నేర్పు వుండేది .బాబి పియర్స్ అతనికి ఫిజిక్స్ ,MATHS బోధించిన గురువు . .
డబ్బు లేక యూనివెర్సిటీ  .లో చదవ లేక పోయాడు .సివిల్ సర్వీసు పరీక్షలు రాసి ,ఆ డిపార్ట్మెంట్ లో నే పని చేశాడు .18 ఏళ్ళ వయసు లో లండన్ చేరాడు .SPACE TRVEL మీద ,సైన్సు FICTION .మీద శ్రద్ధ చూపాడు . SPACESHIP తయారు చేయటం లో సాయ పడ్డాడు .ASTRONOMY మీద శ్రద్ధ పెరిగింది .CELESTIAL NAAVIGATION చదివాడు .ఇంతటి తో ఆగలేదు ELECTONICS లో శిక్షణ పొందాడు .”mORE TELEVISION WAVE FORMS ”అనే గొప్ప వ్యాసం రాసి అందరి ద్రుష్టి లో పడ్డాడు .GLIDE PATH అనే FICTION రాశాడు ..” principle of communication satillites ”మీద చాలా వివరణాత్మక         వ్యాసాలు  రాసి  ,ఆ  రంగం లో అభ్యుదయానికి   బాటలు   వేశాడు     .స్పేస్  fiction మీద preludes   రాశాడు .
                        ఫిజిక్స్ abstract అనే పత్రిక కు సహాయ సంపాదకుడై నాడు .humorous stories about psuedo science పేర చాలా కధలురాసి   అందర్నీ ఆకర్షించాడు .ఇవన్నీ  ”Tales from the white heart ”పేర ప్రచురితం .అయాయి .తాను రాసే వాటికి ఉద్యోగం అడ్డం గా వుందని భావించి పూర్తి కాలమ్ రచయిత అయాడు .స్పేస్ travel మీద శాశ్రీయ అవగాహనతో ”ఇంటర్ planetary ఫ్లైట్ ”పుస్తకాన్ని ,”An introduction to astronautics ”ను రాశాడు .ఈ రెండూ సామాన్యులకు ,ఆ రంగం లో అవగాహన కల్పించ టానికే రాశాడు .తర్వాత మొదటి సారి అమెరికా కు వెళ్ళాడు . తాను రాశిన ”The exploration of space ”పుస్తకాన్ని అమెరికా లో ప్రచ్రించాడు .1952  లో   newyork     radio   ,టి.వి.  ప్రొగ్రమ్మెస్ లో  పాల్గొన్నాడు .తనకున్న శాస్త్రీయ ఆవ గాహన తో ”The sands on Mars ” రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .ఈయన రాసిన ”స్పేస్ ఒడిస్సే ”అనే పుస్తకం( 2001 )యాభై సార్లు ముద్రణ పొంది మూడు మిలియన్ల కాపీలు అమ్ముడయి రికార్డు సృష్టించింది .
                      లండన్ కు మళ్ళీ చేరాడు క్లార్క్ .ఒకే సమయం లో చాలా ప్రాజెక్ట్స్ చేబట్టి విజయ వంతం గా ముగించాడు .”Childhood ”s end ”పుస్తకం రాశాడు .అదే సమయం లో ”Expedition to Earth ”రాసి ఆశ్చర్య పరిచాడు .1953 లోమళ్ళీ అమెరికా వెళ్ళాడు  ఫ్లోరిడా లో diving నేర్చుకొన్నాడు . పెళ్లి చేసుకొన్నాడు కాని ఆరు నెలల్లో పెదాకులు .,విడాకులు ..ఎప్పటికి అప్పుడు కొత్తది ”నేర్చుకోవాలనే తపన .అందిన దానితో తృప్తి పడ లేదు .తర్వాత ద్రుష్టి అంతా ఇప్పుడు సముద్ర యానం మీద పడింది .1956 లో సింహళం లో స్థిర పదాలని పించింది .”The fortunes of paradise
రాశాడు .”Deep range ,dolphin island ,imperial earth ”అనే fiction  పుస్తకాలు రాశాడు ఇరవై ఏళ్ళు శ్రీలంక లో నే వున్నాడు . అక్కడి tax సమస్యల వల్ల లంకను ఆరు నెలలకు ఒక సారి వదిలి విదేశాలకు వెళ్ళే వాడు .తర్వాత  ,బ్రిటిష్ పోరాసత్వము పొంది ,లంక లో ఇల్లు కొనుక్కున్నాడు .ఒక దేశ పౌరిడిగా వుంటూ  ,వేరొక దేశం లో స్థిర నివాసం పొందిన ఘనుడు క్లార్క్ .లంక లో residential స్టేటస్ పొందాడు .1976 లో లంక ప్రభుత్వం ”the  clerk act ‘  ‘తెచ్చింది ‘  ఇతరదేశీయులు లంక లో స్వంత ఇంటిలో వుంటే పన్ను కట్టక్కర లేదు అని సారాంశం ..ఇది ఆయన కోసమే చేసినా ,చాలా మందికి ప్రయోజనం కలిగింది .తెచ్చింది ..residential గెస్ట్ గా మొదట గుర్తింపు పొందిన వాడు క్లార్క్ .
                   ప్లే బాయ్ లాంటి పత్రికలకు రాస్తూనే వున్నాడు .”A fall of moon dust ”అనే సీరియల్ రాశాడు .శ్రీ లంక సముద్రం లో మునిగి ఈత కొడుతుంటే రెండు లోయలు ,చాలా వెండి నాణాలు కని పించాయి /.తన యాత్రను ”indian ocean treasure ”గా రాశాడు .తరువాత ” the treasure of the great reef ”అనే రెండవ పుస్తకమూ రాశాడు .1962 లో gummam తగిలి రక్తం గడ్డ కట్టి పక్షవాతం వచ్చింది పాపం .అయినా రచన మాన లేదు ‘ తర్వాత ఓల్డ్ polio జబ్బు చేసింది .”The ghost from the grand banks ,the hammer of god ,garden of Rama ,Rama revealed ”పుస్తకాలు అంత వ్యాధి లోను రాసి తన వ్యాధిని రాతతో జయించే పని చేశాడు .ఎన్నో విశ్వ విద్యాలయాలాకు వెళ్లి అద్భుతమైన ఉపన్యాసాలతో విద్యార్ధులను ,శాస్త్రీయ అవగాహన పొందేట్లు స్ఫూర్తి నిచ్చాడు .స్వంత తెలివి తేటలతో సృజన తో ,పరిశోధన తో ,అరుదైన రచనల తో ప్రభావితం చేసి ఆదర్శ ప్రాయుడైన శాస్త్ర వేత్త గా నిలిచాడు ,ప్రజా హృదయం గెలిచాడు అర్హర్ సి,క్లార్క్ .ధన్య జీవి .సకల కళా ప్రవీణుడు .
                               మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -07 -11 –క్యాంపు –బెంగళూర్    . –
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
Posted in రచనలు | Leave a comment

చంద్ర నివాసం

    చంద్ర నివాసం
                 చంద్ర  యానం తేలికై పోయింది .అక్కడ వుండి జనంజీవించాలంటే చాలా కష్టమే .దాన్ని వాస యోగ్యం చేసు కోవాలి .భూభారం తగ్గించి చంద్ర లోకం లో నివశించాలని అందరు ఉబలాట పడుతున్నారు .స్థలాల అమ్మకాలు జరుగు తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే .పూర్తి జన జీవితం అక్కడ వర్ధిల్లాలి అంటే ఏమి చేయాలి అని శాస్త్రజ్ఞులు బుర్రలు బద్దల కొట్టు కుంటున్నారు .అయితె అది అసాధ్యం కాదు ,కష్టమైనా సుసాధ్యమే నని తెలియ జేస్తున్నారు .దానికి అనుసరించాల్సిన వ్యూహాలను రచించు కొని వాటి ప్రకారం నడిస్తే చంద్ర నివాసం తేలికే నని నీల్ అనే స్పేస్ శాస్త్ర వేత్త చాలా వ్యాసాల ద్వారా ఊహించి సూచించారు .అందు లోని కొన్ని విషయాలు మీ ముందుంచుతున్నాను .
                       ముందుగా చంద్రుని పై మూడు islaands   ను ఏర్పాటు చేయాలి మొదటి islaand ను చాలా పెద్ద గోలాకారపు  donut shape   వున్న  tori లాంటిది ఏర్పాటు చేయాలి .దీనిలో మనకు కావలసిన ఆహార ధాన్యాలనుకూరలు పండ్లు  పండించుకో వచ్చు ..ఇది స్వయం పోషకం గా వుండే collony  లాగా పని చేయాలి అంతే కాక భూమికి ఆర్ధికం గా సాయం చేసే ట్లు నిర్వహించు కోవాలి .ఇది ఒక పక్కా గా    చాలా పెద్దది గా వుండాలి /.భూమి చంద్రుల మధ్య సయోధ్య వున్నంతకాలం ఇది  ఉండాల్సిందే .ఎల్.  5 అనే   సొసైటీ ఏర్పడాలి .ఇది స్పేస్ లో colonization ఏర్పరిచి ,,దీన్ని నేషనల్  స్పేస్ institution తో కలిపేయాలి .దీని వల్ల ఇప్పుడు నేషనల్ స్పేస్ సొసైటీ ఏర్పడుతుంది .
        రెండవ island  గురించి తెలుసు కొందాం .చంద్రుని మీద workers  కోసం కాలనీ ఏర్పాటు చేయాలి .  ఇది మాస్ డ్రైవర్ లాగా పని చేయాలని నీల్ భావించాడు .ఇందులోని   ఎలెక్ట్రో మాగ్నెటిక్ re -circulating conveyor బెల్ట్ లెక్క పెట్ట టానికి వీలు లేనన్ని buckets ను అనంతం గా లునార్ పదార్ధం తో నింపి ఎల్ five కు అంటే పైన చెప్పిన చోటికి పంపుతూనే వుంటుంది .దీనితో అక్కడ నిర్మాణ కార్య  క్రమాన్ని నిరాఘాటం గా కోన సాగించ వచ్చు .ఇది ఆరు వేల అడుగుల పొడవు ఉండి ,నాలుగు మైళ్ళ eqatorial పరిధి  తో ,140 ,౦౦౦  ల జనాభా j తోఉంటుందట .  .
                             island  –3  అన్నిటికంటే పెద్ద ది. .నాలుగు మైళ్ళ వెడల్పు ,ఇరవై మైళ్ళ పొడవు తో 500 చదరపు మైళ్ళ వైశాల్యం తో వుంటుంది . ఈ దీవిని మామూలు material  తో కట్ట వచ్చునట .అంటే ఇనుము ,అల్యుమినుం ,స్పెషల్ గ్లాస్స్ , లను ఉపయోగించి కట్టచ్చు .అయితె దీనిలో oxygen పీడనం  సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తున వున్నట్లుఎనభై మైళ్ళ పొడవు ,పదహారు మైళ్ళ వెడల్పు తో వుండాలి .స్విర్జేర్లాండ్ లో సగం అన్న మాట ఇక్కడ artificial గ్రావిటీ వుంటుంది భూమి మీద ఉన్నట్లే ఇక్కడ కూడా ,గాలి ,భూమి ,నీరు ,సహజ సూర్య కాంతి
లభిస్తాయి .20   మైళ్ళ  పొడవు ఇరవై మైళ్ళ వెడల్పు వున్న cylinders .  ఒకదానికి ఒకటి  సమాంతరం గా నిర్మించి ,వాటి చివరలను అర్ధ గోలాకారపు మూత లతో మూసేయాలి .ఆ సిలెండర్లు భ్రమణం చెందు తూంటే గ్రావిటీ ఏర్పడు తుంది .ఒక అద్భుత మైన లోయ లో ఉంటున్న అనుభవం కలుగు తుందట  దీనినే కమ్యునిటీ అంటారు . సూర్య కాంతి నే శక్తి జనకం గా ఉపయోగిస్తారు .ఇక్కడ మచ్చు కైనా తుఫాన్లు ,మంచు ,వరదల బెడద ,మంచు తుఫాన్లు ఉండక పోవటం ఆశ్చర్యం కల్గిస్తుంది .;ఇంకో విశేషం ఏమిటంటే చలి కాలమ్ అనేది ఇక్కడికి ప్రవేశించనే ప్రవేశించదు .ఈ మూడవ islaand లో
పది మిలియన్ల జనం నివశించ వచ్చునట    మనుష్యులతో పాటు ,కోళ్ళు ,టర్కీలు ,పందులను కూడా పెంచుకో వచ్చు నట ఇక్కడ ..ఇన్ని అవకాశాలుంటే ఎందుకండీ భూమిని నమ్ము కోని వుండటం?కొంప ,గోడు మ్ముకొని చంద్ర మండలం పై .జెండా పాతెద్దాం.భూమి మీద జన సమ్మర్దం తగ్గిద్దాం ..అయితె బాబుల్లారా.!ఇవన్నీ శాస్త్ర వేత్త నీల్ గారి ఊహలు .అవి ఆచరణ లోకి రావటం ఎప్పుడో ?మనం చంద్ర సదనం చేరటం ఎప్పుడో ?నిరాశ వద్దు .నేటి శాస్త్ర వేత్త ఊహే రేపటి ఆవిష్కారం అని చాలా సార్లు రుజు వైంది .జలాంతర్గామి ,చంద్ర మండల యాత్ర missile ఇవన్నీ ఊహల్లోంచి అంటే సైన్సు fiction లోంచి సైంటిఫిక్ truth గా మారినవే ..”ఉందిలే మంచి కాలమ్ ముందు ముందునా ”అని పాడు కొంటు ఎదురు చూద్దాం .
                                                 మొత్తం మీద మొన్న కుజ గ్రహం మీద ,ఇవాళ చంద్రగ్రహం మీద నివాసం వుండే అవకాశాలు  అన్నీ చూసారు నాతొ పాటు వచ్చి..థాంక్స్
                                             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -07 -11 .క్యాంపు—బెంగళూర్
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

మూడు దేశాలు –భిన్న భావాలు

—                                                               మూడు దేశాలు –భిన్న భావాలు
                                                       
                                                                      భూటాన్
                        హిమాలయ రాజ్యం భూటాన్ .బౌద్ధం వ్యాపించిన దేశం .మానవాభి వృద్ధికి భూటాన్ ఒక ప్రయోగ శాల అంటారు .”నా తలిదండ్రులు అనేకులు.వారిని బాధించకుండా వుండాలి ”అన్నది భూటాన్ సూక్తి .నేరాల రేట్ బాగా తక్కువగా  గా వున్న దేశం .హత్య అనే మాట  ఇక్కడ ఎక్కడా వినబడదు .సగటు ఆయుర్దాయం 42 నుంచి   64     సంవత్చారాలకు పెరిగింది ఈ దేశం లో శైనికుల కంటే బౌద్ధ సన్యాసులు ,గురువులు ఎక్కువ .ఇక్కడ పొగాకు అమ్మకం నిషేధించారు .ఇక్కడి సైన్యం liquor తయారు చేస్తుంది అంటే అంత తీరిక  గా వుంటారు . అందులో రెడ్ పాండా బీర్ ,డ్రాగన్ రం ప్రసిద్ధ మైనవి .వీరికి  13   నెంబర్   చాలా లక్కీ నెంబర్ .మార్జువానా ను అసలు వాడరు .దాన్ని పందులకు ఆహారం గా పెడతారు .దాన్ని తింటే ఆకలి బాగా వేసి తిండి బాగా తిని పందులు దున్న పోతుల్లా బలుస్తాయ ట ఇక్కడ ”ల”అనే మాట ఎక్కువగా వినపడుతుంది అంటే సర్ అని అర్ధం .మర్యాద బాగా వుంటుంది .శాంతి కాముకులు .అహింసను ఆచరణ లో పాటిస్తారు . . .
                                                            క్వటార్
                       ఈ దేశం గ్యాస్ మీద నిర్మించబడిన దేశం .ప్రపంచ చమురు నిల్వ వున్న దేశాల్లో ఇది మూడవది .అంటే సహజ వాయువు విరివి గా లభించే దేశం .అక్కడ లభ్యమవుతున్న గ్యాస్ తో అమెరికా లోని మొత్తం జనాభా 100   ఏళ్ళు heat ను పొందవచ్చట స్త్రీలు కార్లు నడుపుతారు .వోట్హక్కును విని యోగించుకొంటారు ప్రజలు ఎక్కువ కాలమ్ ఆరోగ్యం తో జీవిస్తారు . అయితె ఎక్కువ శాతం మంది సేవకులే .ఇక్కడి భూమిలో 98 శాతం ఎడారే .మిగిలిన నివాస భూమి రెండు శాతమే .ఇసుక తుఫానులు రెండు వందల అడుగుల ఎత్తుకు వస్తాయి అందుకనే వలసలు పోతుంటారు .  .
  ఒక క్షణం వున్న భూమి మరు క్షణం కన్పించాడు  ,అభద్రతా ,.. .అనిశ్చిత పరిస్థితి  అంత ఎక్కువ గా .  వుంటుంది ప్రజా జీవితమంతా పై కప్పు లేని ఇళ్ళల్లోనే .”The ground means the sand is literally shifting from their feet ”నీతి ప్రవ్వాహం కాళ్ళ కింద ఇసకను తొలగిస్తున్నట్లు ఇసుకే ఇక్కడ జారి ,పారి పోతుంటుంది .ఇసుక సముద్రం లో చుక్కాని లేని స్థితి వారిది .
                   వీళ్ళ చరిత్ర క్రీస్తు శకం 650 ఉంచి 1600 వరకు రికార్డు చేయబడ లేదు .తమకు అంటూ స్వంత సంస్కృతీ లేని వాళ్ళు .ఇవాళ సంస్కృతీ తో చాలా comfortable   ఈ దేశం లో lotteries బాగా ఎక్కువ .
                                                         మోల్డోవా     
                  ఈ దేశం పూర్వ soviet union లోనిది చాలా చిన్న దేశం .ఇక్కడ దరిద్రం ,బాధలు చాలా ఎక్కువ . దీని రాజ ధాని chisinow ప్రజలు దుర్భర జీవితాలను గడుపుతారు .వీళ్ళు పూర్వం రోమన్లు .అదే వీరి చారిత్రిక వెళ్ళు అక్కడే వున్నాయి .యునియన్ లో వున్నపుడు ఏ దేశానికి అయినా వెళ్ళే హక్కు వుండేది .ఇప్పుడు యుక్రెయిన్ కు తప్ప ఎక్కడికి వెళ్ళా లన్నా వీసా కావాల్సి రావటం వీరి దుర దృష్టం . వీరి ఆరాధ్య రచయిత పుష్కిన్ ..ఈ దేశం కంటే బీదరికం లో వున్న దేశాలు సంతోషం గా వున్నాయి .విధి వీరి జీవితాలతో ఆడుకొని విధి వంచితులను చేసి ,సంతోషాన్ని ,ఆనందాన్ని దూరం చేసింది ..దీనికి కారణం చుట్టూ వున్న దేశాలు బాగా ధనిక దేశాలవటమే ..వారి మనోభావాన్ని వారి మాటల్లో విందాం  ”.”we have been abused and.abandoned by every where .We have no pride in any thing .Not even our language ”. వాళ్ల మంత్రులు కూడా కంత్రీలే.అంటున్నారు .వాళ్ళు కూడా స్వంత భాష లో మాట్లాడారట .రాస్ష్యాన్ భాషే మాట్లాడు తారు అని ఈసడిస్తారు .మాల్దోవాన్సంస్కృతి అనేది నాశన మై పోయిందని విచారిస్తున్నారు .ఎవరి సంస్కృతిని వాళ్ళు కాపాడు కొనక పొతే మిగిలేది శూన్యమే .ఇది అన్ని దేశాల వాళ్ళు గ్రహించాల్సిన పరమ సత్యం .ఇది వరకు చెప్పు కొన్న క్వటార్ దేశం ధనిక దేశంకాని అక్కడ సంస్కృతీ లేదు .ఇది బీద దేశమైనా సంస్కృతీ నాశనం అయింది ..
అందుకనే ఈ దేశాన్ని  ”least happy place in the soviet union ”అంటారు .ఇక్కడి భాష లో ce  sa fac అంటే ‘ ”what  can   i  do ” అని అర్ధం .?
                        ఇప్పటి మన దేశం లో లాగా అవినీతి ,లంచగొండి తనం పుచ్చి పురుగులు కారుతోంది అక్కడ .35 ఏళ్ళ లోపు వాళ్ళు డాక్టర్ దగ్గరకు వెళ్ళారట .దీనికి కారనక్మ్ డబ్బు తో డాక్టర్ డిగ్రీ కొన్నారని భయం .అధికారులన్న ,ప్రజా ప్రతినిదులన్న డాక్టర్స్ ఆనా ,engineerlu అన్న ,మేస్టార్లు అన్న అందరికీ సంకోచమే .అపనమ్మకమే కారణం .నమ్మకం లేని చోట బ్రతుకు యెంత దుర్భరమో వాళ్ళను చూస్తె తెలుస్తుంది .పెద్దలన్నా ,మరణించిన వారన్నా అపార గౌరవం వీళ్ళకు .ఏడాది కో సారి జాతీయ శలవు దినం వుంటుంది .పెద్దలను ఆత్మీయం గా గొప్ప గా సన్మానిస్తారు .అందుకనే  .
”Moldovans treat the dead better than the living ”అని అనుకొంటారు .”పోయినోళ్ళు ఎప్పుడు మంచోల్లే”    అన్నది బాగానే వుంది ”  వున్న వొళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు ”అని మాత్రం భావించక పోవటం విచార కరం .మర్యాద రామన్నలు ఆయె స్థితి వాళ్లకు లేదు .నిత్య విచార గ్రస్తులు ,బాధా సర్పdastulu.happin ess అనేది వీళ్ళ జీవితాల   లోంచి తొలగి పోయింది పాపం .  . .                     రాస్ష్యాన్ భాష లో schaste  అంటే happiness .జెర్మనీ ఆ ”గో మెన్ నసి ”అంటే ”i am sorry ”.అయితె ఇంత మర్యాదగా మాట్లాడటం  మాల్డోవ సంస్కృతీ లో లేదు .వాళ్ల డి  అంతా rough అండ్ తౌఘ్  ”The seeds of Maldovan unhappiness are planted in their culture ..A culture that be littles the value of trust and friend ship ”అని తెసిన వాళ్ళు సానుభూతి చూపిస్తారు .అందుకనే సెయింట్ Augustine .  ”the happiness  of hope ”కావాలని అంటాడు .  . భారత దేశం లో  ”Hope is the sheet anchor of every man .When hope is destroyed ,great grief ఫోల్లోవ్స్ which is almost equal to death itself ”   అని భావించి ముందుకు దూసుకు పోతారు
               చివరగా  జర్మన్  తత్వ వేత్త Schopenhauer అన్న మాటలు అందరం మననం చేసు కొందాం ”Because they feel unhappy ,,,–men cannot bear the sight of some one they think is happy ”
                       మోల్డోవా దేశ ప్రజల జీవితాలలో ఆనందం వెల్లి విరియాలనీ ,దానికి కావలసిన ఆశ ను వారు ఆహ్వానించి బతుకు భయం నుంచి బయట పడి మిగతా సోదర దేశాల లాగాఅభి వృద్ధి సాధించాలని కోరుకొందాం . శోకాల    తిమిరావళి ఆనంద దీపావళి గా మారాలని ఆశిద్దాం .
                                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -07 -11 . క్యాంపు–బెంగళూర్
Posted in సేకరణలు | 1 Comment

బ్లాకు హోల్ (కృష్ణ బిలం ) -2

                                    బ్లాకు హోల్ (కృష్ణ బిలం )  —౨ సెకను   
                                 అకస్మాత్తు గా నక్షత్ర ద్రవ్య రాశి అంతా కేంద్ర బిందువు దగ్గరకి సంకోచం చెందిచేరుతుంది  .ఈ క్రియ అతి వేగం గా జరుగుతుంది కనుక  చూడలేరు .ఒక  వద్ద        సెకను లో మిలియన్ భాగం కాలమ్ లో ఇది జరిగి పోతుంది .అపుడు అతి శక్తి వంత మైన గామా కిరణాలు వెలువడతాయి .ఇలా ఏర్పడిన బ్లాకు హోల్ యొక్క density ,gravitation   ఫోర్సు లు ఈ పాయింట్ వద్ద    అనంతం  గా అయిపోతాయి .. దీనినే singularity అంటారు అప్పుడు స్టార్ లోని ద్రవ్యపదార్ధం పూర్తిగా అణచి వేయబడి ఉనికినే కోల్పోతుంది .ఈ singularity చుట్టూ అంతరిక్ష volume అందులో పదార్ధం అంతా పడి పోయి ,ఏదీ దాని నుంచి  తప్పించు కోలేని పరిస్థితిఏర్పడు తుంది .ఇదే బ్లాకు హోల్ .నల్ల బిలం దీని  వ్యాసార్ధాన్ని          .”schwarzschild  radius కేంద్రం నుంచి కొలుస్తారు .         
                             ఏ నక్షత్రం ద్రవ్య రాశి అయినా  పది సోలార్ మాస్ కంటే ఎక్కువైతే ,బ్లాకు హోల్ ఏర్పడి హైడ్రోజెన్ అంతా ఖర్చు అయి పోయి ,దాని పతనానికి ఏదీ అడ్డు పడ లేని పరిస్థితి ఏర్పడుతుంది .దీనికి సూపర్ నోవా ఏర్పడే అవసరము ,రాదు .దాని బరువే దాని పతన హేతువు .బరువంతా బ్లాకు హోల్  లోకి కుంచించుకు పోతుంది .
                       సోలార్ మాస్ ఒకటి పాయింట్ నాలుగు కంటే తక్కువ గా వుంటే అవి వైట్ dvarf స్టార్స్ అవుతాయి .అంటే వాటిలోని న్యూక్లియర్ energy  పూర్తిగా ఖర్చు అయి పోయిందన్న మాట .
 ఇది  వరకు చెప్పు కొన్న రెడ్ giant తెల్ల వామన నక్షత్రం లాగా మారి స్థిర పడి పోతుంది .  ఈ  తెల్ల వామన నక్షత్రాలు ఇంకా సంద్రం గానే వుంటాయి .దీన్నికి కారణం వీటి లోని degenerated మేటర్ .
  న్యూట్రాన్ స్టార్ కు అందులో కొంత స్థిరమన critical ద్రవ్యం వుంది ,తదుపరి పతనాన్ని ఆపే శక్తి కలిగి ఉండదు ఈ లిమిట్ నే ”చంద్ర శేఖర్ లిమిట్ ”అని నోబెల్ బహుమతి గ్రహీత మన చంద్ర శేఖర్ పేరు గా పిలుస్తారు .అదే ఒకటి పాయింట్ నాలుగు సోలార్ మాస్ .దీనికి మించిన తెల్ల వామన తార బరువు గా వుంటే అది collaapsar స్టార్ అయి చివరికి బ్లాకు హోల్ గా మారి పోతుంది
   బ్లాకు హోల్ చుట్టూ వున్న పరిధి ని ఈవెంట్ horizon అంటారు దేనికి వెలుపల వున్న అంత రిక్ష యాత్రికునికి ఈవెంట్ హారిసన్ లోపల ఏమి జరుగు తున్నది తెలియదు .అంటే బ్లాకు హోల్ లోపల ఏమి జరిగేదీ ఎవరికి తెలియదన్న మాట .దీనికి కారణం ఏమిటీ అని ఆలోచిస్తే బ్లాకు హోల్ గ్రావిటీ చాలా లోతుగా సాంద్రం గా వుండి ,కాంతికూడా ఈవెంట్ హోరిజోన్ నుంచి తప్పించుకో లేక పోవటమే .
                       సాధారణం గా శక్తి  frequency  కి అనులోమాను పాతం గా వుంటుంది .కాంతి శక్తిని కోల్పోతే దాని frequency కూడా తగ్గి పోతుంది . frequency ,మరియు తరంగ దైర్ఘ్యం అంటే wave length  లు విలోమాను పాతం లో వుంటాయి .కనుక frequency తగ్గితే wave  length  పెరుగు తుంది .ఇలా తరంగ దైర్ఘ్యం పెరగటాన్ని  రెడ్ షిఫ్ట్ అంటారు .దీనికి కారణం ఎరుపు రంగు  wave length .ఎక్కువకావటమే మిగతా రంగుల కంటే ..బ్లాకు హోల్ కేంద్రం లో గ్రావిటీ అనంతం .కనుక దీనినుంచి తప్పించు కోవాలి అనుకొనే కాంతి అనంతం గా శక్తిని కోల్పోతుంది .అందుకే రెడ్ షిఫ్ట్    ఈ ప్రాంతం లో అనంతం గా వుంటుంది ..
                        ఈవెంట్ హోరిజోన్ లో కాలమ్ కూడా స్తంభించి పోతుంది  అంటే అంతరిక్ష నావికుడికి ఇక్కడ ఒక సెకండ్ కాలమ్ గడిస్తే మిగతా విశ్వం లో అనంత కాలమ్ గడిచి పోయినట్లే .దీనినే టైం ఫ్రోజెన్ అంటారు .అంతరిక్ష నావికుడు తన telescope లో చూస్తూ వుంటే ఇక్కడ ఆస్ట్రోనాట్ నెమ్మది నెమ్మదిగా ఈవెంట్ హోరిజోన్ వైపుకు పడి పోతున్నట్లు గమనిస్తాడు .చివరిగా ఈవెంట్ హోరిజోన్ లో ప్రయాణీకుడుశాశ్వతం గాఫ్రోజెన్ అయినట్లు   అనిపిస్తుంది . einstein శాస్త్రజ్ఞుడు  అందుకే ద్రవ్యం ,కాలమ్ ,పొడవు అన్నీ సాపెక్షాలు అన్నాడు .ఇవి మనం చూసే పాయింట్ అఫ్ viiew  ,మరియు, చూసే ప్రదేశం అంటే frame ల మీద ఆధార పడి వుంటాయి అని వివరించాడు .   .
                     iఇవీ   నల్ల బిల విశేషాలు ..దాని ప్రభావం లోకి జార కుండా జాగ్రత్త వహిద్దాం .ఇంత సేపు నాతొ అంత రిక్ష యానం చేసి ,బ్లాకు హోల్ విశేషాలను తెలుసు కొన్నందుకు కృతజ్ఞతలు
                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -07 -11 .క్యాంపు–బెంగళూర్  
Posted in రచనలు | 1 Comment

బ్లాకు హోల్ (కృష్ణ బిలం )–1

                 బ్లాకు హోల్ (కృష్ణ బిలం )–1
                       జాన్ వీలెర్ అనే శాస్త్ర వేత్త 1969 లో ”solar gravitation collapse  గురించి రాస్తూ బ్లాకు హోల్ అనే పదం మొదటి సారిగా ఉపయోగించాడు .అయితె దీన్ని 18 వ శతాబ్దం లో మాత్రమే జాన్ మిచెల్ ,డీ లాప్లేస్ శాస్త్రజ్ఞులు ప్రతిపాదించి సమర్ధించారు .ఇంతకీ అందరు ఈ పదాన్ని వాడుతారు కాని దీన్ని గురించి పూర్తిగా తెలియదు .ఇది ఒక బాగా ఎక్కువ  సాంద్రత గల దట్టమైన నక్షత్రం .దాని బరువు విపరీతం గా పెరిగి పోవటం తో అది కూలి పోతుంది అందులోకి అతి వేగవంతమైన కాంతి కూడా దానిఆకర్షణ నుంచి తప్పించుకో లేదు  .ఏదీ దాని నుంచి తప్పించుకో లేదు .కనుక అది అడుగున ఖాళీ గా వున్న పెద్ద బిలం లాగా అనిపిస్తుందిఅంతరిక్షం లో ..దాని సమీపానికి వచ్చిన ప్రతి దాన్ని పీల్చేస్తుంది .నల్ల బిలం అని  ఎందుకు అంతాఅంటారు అంటే    దానిలో కాంతి ప్రకాశించ దు .  మన సూర్యుడు కూడా పెద్ద నక్షత్రమే అయినా సూర్య గోళం బ్లాకు హోల్ గా మార లేదు .దీనికి కారణం దాని బరువు చాలదు.1 .4 సోలార్ మాస్ కాని అంతా కంటే ఎక్కువ ఉంటేనే అది బ్లాకు హోల్ గా మారుతుంది  . .మన సూర్యునికి అంత సీన్ లేదు .ఇప్పుడు అంత పెద్ద బరువున్న తారలు బ్లాకు హోల్ గా ఎలా మారుతాయో తెలుసు కొందాం …
                          మున్దుఆ నక్షత్రం అంటే ఏమిటో తెలుసు కొందాం .తార అంటే hydrogen .గోలమే ..హైడ్రోజెన్ ఒకే పరమాణువు గల తేలికైన మూలకం .రెండు పరమాణువులతో హైడ్రోజెన్ అణువు ఏర్పడుతుంది .ఇదే హైడ్రోజెన్ వాయు molicule .దీని కేంద్రకం అంటే న్యుక్లియస్ ఫ్యూజన్ కు గురి అవుతుంది దాని మధ్య భాగం లో .అప్పుడు అక్కడ .నాలుగు మిలియన్ల centigrade ఉష్ణోగ్రత ఏర్పడుతుంది .ప్రతి నక్షత్రానికి శక్తి ఈ ఫ్యూజన్ వల్లే లభిస్తుంది .ఇప్పుడే నాలుగు హైడ్రోజెన్ న్యూక్లియై కలిసి ఒక హీలియం న్యూక్లియస్ గా మారుతుంది .  ఈ స్థితి లో కొంత ద్రవ్యం శక్తి గా మారుతుంది .సూర్యునిలో ప్రతి సెకనుకు నాలుగు మిలియన్ల పదార్ధం శక్తి గామారుతుంది .అయిన్స్టీన్  శక్తి సూత్రం ప్రకారం  సూర్యుడు 4 .4  ..సేస్తిలియాన్ హర్సే పవర్ శక్తిని ఒక సెకను కు ఇస్తాడు .ఈ శక్తి దాని వ్యాప్తికి తోడ్పడు తుంది .ఈ వ్యాప్తి శక్తి దాని సంకోచ బలాన్ని సమ తుల్యం చేస్తుంది .ఈ contraaction  ఫోర్సు నక్షత్రం బయటి పొరలను బట్టి వుంటుంది .బయటి ద్రవ్యం నాశనమాయే స్థితి లోకి వచ్చి లోపలి gravitation center  లో కూలి పోతుంది .అప్పుడు అందు లోని హీలియం ఆ నక్షత్రానికి ఇంధనం గా మారు తుంది .ఇప్పటి వరకు  దానికి ఇంధనం హైడ్రోజెన్ మాత్రమే .నక్షత్రానికి హాట్ core అనేది వుంటుంది .కానీ బయటి పొరల్లోకి విపరీతం గా వ్యాకోచం చెందు తూ వుంటుంది .అలాంటి స్టార్స్ ను  రెడ్ giants అంటారు .. దాని వ్యాకోచ పరిమాణం ను బట్టి రంగును బట్టి ఆ పేరు వస్తుంది .
                       కానీ ఇందాక చెప్పిన సూర్యుని కంటే అనేక రెట్లు పెద్ద గా వున్న నక్షత్రాల లో న్యూక్లియర్ రియాక్షన్ core  లోజరిగిస్వాధీనం తప్పే స్థితి లో వుంటాయి .అప్పుడు ఆ ప్రదేశం collapse  అవుతుంది  ..అప్పుడు విస్ఫోటనం జరుగు తుంది .ఆ స్థితి లో స్టార్ తన ద్రవ్యాన్ని అంతరిక్షం లోకి నెట్టేస్తుంది దానినే సూపర్ నోవ అంటారు .ఆ తర్వాత నక్షత్ర పదార్ధం చిన్న సాంద్ర మయిన వస్తువు గా మారి పోతుంది .ప్రోటాన్ లు ,ఎలేక్ట్రోన్ లు ధీకోని న్యుట్రాన్లు  .   ఏర్పడుతాయి అప్పుడుసూపర్  dense స్టార్ ఏర్పడుతుంది .అప్పుడు   స్టార్  దాని core లో సాలిడ్ న్యుట్రాన్లు మాత్రమే వుంటాయి .ఇదే న్యూట్రాన్ స్టార్ .ఇవి ఒక cubic centimeter కు పది మిలియన్ టన్నుల సాంద్రత లో వుంటాయి .అంటే నీటి కంటే తొమ్మిది trliyan . రెట్లు ఎక్కువ.
                   స్టార్ బరువు 1 .4 .నుంచి రెండు సోలార్  మాస్ మాత్రమే వుంటే –అది న్యూట్రాన్ స్టార్ గా మారి పోతుంది .మాస్ రెండు దాటితే  ఇంకా సంకోచం జరుగు తుంది .అప్పుడు న్యూట్రాన్ స్టార్ collapsar స్టార్ అవుతుంది .అది gravitation ఆకర్షణ వల్ల కేంద్రం లోకి collaapse అవుతుంది .కుంచించుకు పోయిన కొద్దీ దాని వ్యాసార్ధం తగ్గుతుంది .చివరికి ఒక లిమిట్  కు చేరుతుంది .దీనినే squarzschild radius అంటారు .ఈ దశలో బయటి ద్రవ్యం చాలా సాంద్రత చెందుతుంది .చివరికి కాంతి కూడా దీని ప్రభావానినికి లోను కాక తప్పదు .ఆ నక్షత్ర ఆకర్షణ క్షేత్రం విపరీతం గా పెరిగి పోతుంది .కనుక అంతరిక్షం లో ప్రయాణించే ఏ నావికుడికి  ఇది కన్పించదు .
                             ఇప్పటికే అంతరిక్ష శోధన లో చాలా దూరం వెళ్లాం .ఇక్కడ ఆగి మళ్ళీ కృష్ణ బిలం అదే బ్లాకు హోల్ గురించి మళ్ళీ పూర్తిగా తెలుసు కొందాం .akkade వుండండి
                             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -07 -11 .క్యాంపు–బెంగళూర్

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
Posted in రచనలు | 1 Comment

కుజ గ్రహ నివాసం

                                కుజ నివాసం
                      భూమి  మీద జనాభా పెరిగి పోతోంది .నివాసానికి తగిన స్థలం లేక జనం విల వల  లాడుతున్నారు .తగినంత ఆహారము దొరకటం లేదు .అందుకని వేరే గ్రహం మీద వుండే ఆవ కాశం కోసం శాస్త్రజ్ఞులు వెతుకు తున్నారు .అనేక ప్రయోగాలు చేసిన తరువాత మాన్నవులకు ఆవాస యోగ్యమైనది కుజ గ్రహమే నని నిర్ణయించారు .మనకు అక్కడ లభించే సౌకర్యాలేమిటి ?అక్కడ మానవ జీవతం దివ్యం గా సాగుతుందా ?అని అందరి అనుమానం .ఆ అనుమానాలు తీర్చే ప్రయత్నమే ఇది .
                            కుజ గ్రహ్హం లో అద్భత సుందర దృశ్యాలు కని పిస్తాయి .అక్కడి పర్వతాలు ఎవేరేస్ట్ పర్వ తానికంటే మూడు రెట్లు పెద్దవి .లోయలు అమెరికా లోని కాన్యోన్స్ లోయ కంటే మూడు రెట్లు లోతైనవి ,అయిదు రెట్లు పొడవైనవి విశాల మైన మంచు క్షేత్రాలున్నాయి .వేలాది కిలోమీటర్ ల పొడవైన వింత యైన ఎండి పోయిన నదీ గర్భాలున్నాయి .కుజు ని లోని గాలిలో తొంభై అయిదు శాతం caarbon dioxide  వుంటుంది .ఇది మానవుడు జీవిన్చాతానికేమాత్రము పనికి రాని వాయువు అని అందరికి తెలుసు .సముద్ర మట్టానికి దగ్గర లో వున్న వారు 150   మిల్లిరియం ల radiation  ను ఒక ఏడాది లో లోనవుతుంటారు .కుజునిలో గ్రావిటీ సున్నా .దీని వల్ల కండరాలు శిధిలమై పోతాయి .  అందుకే కుజుని పైకి అంతరిక్ష నౌకలు పంపేటప్పుడు నావికులకు ”micro gravity science ””
 పై మంచి అవగాహన కల్పిస్తారు .అక్కడి వాతావరణం immune system దెబ్బ  తింటుంది .అందుకని నౌకల్లో కృత్రిమ గ్రావిటీ ని కల్పిస్తారు .తోక చుక్కలు కుజున్ని తాకి నప్పుడు వెలువడే ధూళి మానవులకు ప్రమాదం కల్గిస్తుఅక్కడి క్రిములు వ్యోమ గామి ద్వారా భూమిని చేరి జబ్బులు వ్యాపించ వచ్చు .
—        కుజుని లో పగటి కాలమ్ ఇరవై నాలుగు గంటలు వుంటుంది .పగటి  వేడి –50 డిగ్రీలు నుంచి +10degreella వరకు వుంటుంది  .భుఉమిమీద ఆకర్ర్షణ శక్తి కుజుని పై దానికంటే రెండున్నర రెట్లు .చంద్రును గ్రావిటీ కంట కుజునిది సుమారు రెండున్నర రెట్లు . చంద్రుని లో వాతావరణం లేదు .అక్కడ రోజుకు 672 గంటలు . అయితెకుజులో తేమ వేడివుంటాయి .కనుక జీవులు బతికే  ఇక్కడి mఆవ కాశం ఉండ వచ్చు .కార్బోన్ dioxide ఎక్కువ కనుక గ్రీన్ హుసే వాయువుల ప్రమాదమూ ఎక్కువే .భూమి మీద ఉన్నట్లే.మూడు పాయింట్ ఏడుబిలియన్ సంవత్చరాల కిందటి  ”micro cosmic organism ”.. ఉండ వచ్చు .మార్స్ మీద compass పని చేయదు .కారణం అక్కడ అయస్కాంత శక్తి లేక పోవటమే .”celestial navigation ” విధానం లో దిశలను తెలుసు కొంటారు .అక్షంస రేఖాంశాలను నిర్నయిస్తాఉ .మార్స్ కు ధ్రువ తార అంటే పోల్ స్టార్ లేదు .ఫోబోస్ ,మరియు ,diemos   అనే asteroids దీని చుట్టూ తిరుగు తాయి .మార్స్ లో ఒక రోజూ అంటే 24 గంటల 39 నిమిషాల 6 సెకన్లు .ఇక్కడ సంవత్చారానికి 669  రోజులు .వీటిని sols అంటారు .ఇక్కడ మంచు భూమికి ఒక మేటర్ లోతున వుంటుంది .అమెరికా లోని కొలరాడో లో ఇంటికి ఒక వైపు వింటర్ (నార్త్ ) రెండో వైపు
 సుమ్మెర్  ( సౌత్ )  ఒకే కాల లో వుండి ఆశ్చర్యం కలిగిస్తాయి .అలాగే కుజునిలోఇలాగే వుండిఆశ్చర్యం కలిగిస్తాయి మార్స్ లో కూడా ఆగష్టు మధ్యలో కన్పిస్తాయి ఇక్కడి మంచు ను i    perma frost అనీ లేక ఫ్రోజెన్ mud అనీ అంటారు .
                   కుజునిలో వెండి ,lanthanum ,cerium ,సోమరియం ,గల్లియం ,gadolium ,బంగారం ,palladium ,రుబీడియం ,platinum ,ర్హోదియం ,యూరోపెం మొదలైన విలువైన ఖనిజాలున్నాయి .భూమి నుంచి కుజునికి అక్కడి నుంచి భూమికి వస్తువులను త్రి భుజ విధానం లో వ్యాపారం చేయ వచ్చు  దీని విషయం లో జాన్ మిల్టన్ కవి కొత్త లోకాన్ని గురించి  రాసిన కవిత బలేగా వుంది చదవండి ”Witness ts new made world another heaven —From heaven gate not faarr founded in view –on the clear Hayaline ,the glaassie sea –Of amptitude almost immence with stars –Numerous and every starr perhaps a world –Of destined habitation .”
              అందుకని  మానవులకు మార్స్ రెండవ నివాస స్థానం అవాలని భావిస్తున్నారు .అందుకు అక్కడ ఏమి చేయాలి ?కొత్త సరిహద్దుల్ని ఏర్పాటు చేయాలి .లేక పొతే సాంకేతిక మైన స్తబ్ధత ఏర్పడు తుంది .ఇప్పటికే అభివృద్ధి రాటు తగ్గి పోయింది .అందుకు martian ingenunity కావాలి .దాని వల్ల సృజనాత్మకత పెరిగి ఏవి కావాలో వేటిని వదిలించుకోవాలో తలిసి అభి వృద్ధికి మార్గం తేలిక అవుతుంది .కుజున్ని రెడ్ ప్లానెట్ అంటారని మనకు తెలుసు . మాల్తుస్ చెప్పిన అంచనాలన్నీ తప్పినాయి .మానవులు ఉత్పత్తులను వ్యయం చేసే వారు మాత్రమే కాదు ,వనరులను సృజించే నేర్పు కూడా వున్న వారు .ఈ విషయం అతనికి అప్పటికి తెలీదు .దీనికి కొత్త సాంకేతికత శాస్త్రీయ జ్ఞానం తోడ్పడు తాయి .జనాభా పెరిగితే ఆక్రమణ రేట్ వేగవంతం అవుతుంది .
               భూమికి కుజుని కంటే మిగిలిన గ్రహాలూ చాలా దూరం లో వున్నాయి .ఇది అమెరికా నుంచి యూరప్ కు వున్న దూరానికి లక్ష రెట్లు దూరం లో  మార్స్  ఉంది .మార్స్ లో రవాణా చేయటం చాలా సులభం .అక్కడున్న కార్బోన్ డి oxide ను hydrogen తో కలిపి mithane ను తయారీ చేసి శక్తి గా వినియోగించవచ్చు నని శాస్త్రజ్ఞుల భావన .ఇవాళ ప్రపంచం క్లిష్ట పరిస్థితులలో వుంది .మన పాత సరిహద్దులు మూసుకు పోయాయి .సాంఘిక జడత్వం వచ్చేసింది .అభివృద్ధి నెమ్మదిలో నడుస్తోంది .ఇది చాలదు .ప్రభుత్వాలు inkaa  పూర్తిగా కళ్ళు తెరవటం లేదు .ద్రుష్టి పెట్ట లేక పోతున్నాయి.కుజ నివాసం కష్టమే .కాని తప్పదు .జండా అక్కడికి ఎత్తేయాల్సిందే తప్పదు ..ఇక్కడపప్పులు ఉడకటం లేదు .కొత్త బంగారు లోకం చూడాల్సిందే .దుకాణం పెట్టాల్సిందే .అక్కడికి చేరే వారికి అవసరమైన టెక్నాలజీ ని అందించాలి .శాస్త్రీయ దృక్పధాన్ని కల్గించాలి .సృజనాత్మకతను ప్రోత్చాహించాలి .స్వేచ్చ గా అలోచించి కొత్త పరికరాల రూప కల్పనకు వీలు కల్పించాలి .ఆ సాహస వంతులకు అండగా నిలవాలి ..కుజ గ్రహం జడత్వం వున్న మనుష్యులను కోరదు .అక్కడ నిరంతర అన్వేషణ తో ముందుకు సాగే వారికే స్థానం .ముసలి వారు  ముతక vaaru పనికి రారు .యువరక్తం పొంగి పొరలే నవ యువత కావాలని స్వాగతిస్తోంది కుజగ్ర్హం .గ్రహచారం బాగుండక  కుజ గ్రహానికి వెళ్ళద్దు .అక్కడి గ్రహ చారాన్ని మానవులకు అనుకూలం గా మార్చటానికి వెళ్ళాలి అక్కడి మంచును నీరుగా మార్చాలి .కార్బోన్ దిఒక్షిదె ను పంటలకు ఉపయోగించాలి .పరిశారమలను నెలకొల్పాలి .వున్న భూమి లో అనుకూల మైన పంట పండించాలి .భూమి నున్దిఅక్కడికి కావాల్సినవి దిగుమతి చేసుకొని ,అక్కడి పారిశ్రామిక వస్తువులను భూమికి ఎగుమతి చేయ వచ్చు .ఇది సాధ్య్యమాయే రోజూ త్వరలోనే రానుంది   అప్పుడు రెడ్ ప్లానెట్ అయిన కుజ గ్రహం మనకు రెడ్ కార్పెట్  welcome ఇస్తుంది                                                          
                                                                      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –౨౭-07-11.camp–bengalur
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in సేకరణలు | Leave a comment

థాయి ల్యాండ్ విశేషాలు

        థాయి ల్యాండ్ విశేషాలు
                                     థాయి లాండ్ ప్రజల కళ్ళల్లోనే నవ్వు కన్పిస్తుంది .మంచి చిరు నవ్వు కోసం ఎదురు చూస్తుంటారు శ్మశానం లో కూడా నవ్వటం వారి ప్రత్యేకత ..ఈప్రజలు మన  చిరుఅవ్వును మెచ్చుతారు .మనతో ఏకీభవించక పోయినా ,మన పద్ధతికి అడ్డు పడరు .ఏదైనా బాగా చెయ్యాలి అనే సంకల్పం వాళ్ళది .sad స్మైల్ కూడా వుంది .”నేను నవ్వ టానికి ప్రయత్నిస్తున్నా కాని ,నవ్వ లేక పోతున్నానని నిజాయితీ గా చెప్తారు .కస్టపడి పని చేసి సాధిస్తారు .సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు కొననే కొనరు ,చదవరు కూడా .సంతోషం గురించి ఆలోచిస్తుంటే ఆ ఆనందం తగ్గి పోతుంది అంటారు ,.సంతోషాన్ని వెలువ రించా టానికి మాటలు లెవ్వు ,చాలవు అని వారి విశ్వాశం .లైట్ గ తీసుకోవటం వాళ్ల పధ్ధతి .అందుకే ఏమి జరిగినా వాళ్ల భాష లో ”mai  penlai  ”అంటారు అంటే ”నెవెర్ మైండ్ ”.వాళ్ళది ”జై -యెన్ ”అనగా కూల్-హార్ట్ .గొప్ప కబుర్ల పోచిగోరులు .మాంచి వ్యూహ కర్తలు కూడా . .
                         వాళ్ల దేశం లో ఎక్కడ చూసినా”” హ్యాపీ ”అనే మాటే కన్పిస్తుంది .happy toilet ,హ్యాపీ లైఫ్ ,హ్యాపీ pub  వగైరాలన్న మాట .వాళ్ల వంటకాలలో గొప్పది ”హ్యాపీ పబ్ ”ఇది noodles తో చేసిన వంటకం  ,,ఇదే వాళ్లకు double happiness .దేని గురించీ seriousness లేదు .”We do not take anything seriously ..What ever it is we accept it ‘అనటం వాళ్ల నైజం .
”We laugh and laugh non stop .>We still run over and help ,but we are laughing at the same time .”అని వాళ్ల సహజ స్వభావాన్ని చక్కగా ఆవిష్కరిస్తారు .నడి రోడ్డు మీద ఎవరైనా పొరపాటున పడ్డా ,వారిని చూసి నవ్వుతూనే వుంటారు .అయితె వారికి చేయాల్సిన సహాయాన్ని నవ్వు తూనే చేస్తారు .అదీ వీరి ప్రత్యేకత .ఎవరికైనా ఒత్తిడి (stress )వుంటే ప్రవర్తన మార్చుకోమని సలహా ఇస్తారు .ఎంత ధన వంతు లైనా తోట పని చేసుకొంటారు .గడ్డిని mow చేసుకొంటారు .అదొక fun అంటారు .fun ను వాళ్ల భాషలో ”సానుక్ ”అంటారు .
             సభల్లో ,సమావేశాల్లో కూడా నవ్వుతూనే వుంటారు .అది మాకు సహజం అంటారు వాళ్ళు .నవ్వు లేకుండా ఉండలేరు .ఊపిరి పీల్చినంత సహజం వాళ్లకు నవ్వు .లావుగా వుండే వాళ్ళను హాష్యం తో గేలి చేస్తుంటారు .వాళ్ళను ”హిప్పో ”అంటారు నవ్వుతూనే
                 2004 లో సునామి వచ్చినపుడు వేలాది మంది చని పోయారు .దీనికి కారణం ప్రభుత్వం అని నెపం వేయలేదు థాయి ప్రజలు .జరిగిన దాన్ని వినయం గా స్వీకరించారు . ఈ జన్మ లో అనుకొన్నది సాధించలేక పొతే మరుసటి జన్మ లో సాధించు కో వచ్చును అను కొంటారు .అయ్యో అయ్యో అయోయ్యో చెయ్యి  జారి పోయిందే నని విచారీన్చరు,బాధ పడరు ,కుమిలి పోరు . భవిష్య వాణిని నమ్ముతారు .ముస్లిమ్స్ దాడి చేసి సర్వ నాశనం చేస్తే తిట్ట లేదు ,బజారున పడ లేదు ,ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయలేదు ..సహనం తో ఒర్చుకొన్నారు .ఆవేశం తో వివేకం కోల్పో లేదు .ఆయుధాలు సంధించి తిరగ బడ లేదు .శాంతి ,సహనమే వాళ్ల ఆభరణాలు .అహింసా పరమో ధర్మః అనేదే వాళ్ల నమ్మకం .వేల కొలది తెల్ల cranes ను తెల్ల కాగితాలతో తయారు చేసి విమానాల నుంచి శాంతి కోసం జారవిడిచి తమ శాంతి పధాన్ని ప్రపంచానికి చాటారు .శాంతి కాముకు లైన థాయి లాండ్ ప్రజలు .అందరికి వారు ఆదర్శం గా నిలిచారు
                                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —27 -07 -11 –క్యాంపు –బెంగళూర్
Posted in రచనలు | Leave a comment

శ్రావణ బెలగోల బేలూర్ హలేబేడు యాత్ర —-3

                 శ్రావణ బెలగోల బేలూర్ హలేబేడు యాత్ర —-3
                                                     హలేబేడు  శ్రీ హొయసలేశ్వర స్వామి దేవాలయం
                    బేలూరు కు 16 కి.మీ. దూరం లోను ,హసన్ కు 31 కి.మీ.లోను ,మైసూర్ కు 149 కి.మీ.దూరం లోను హలేబేడు వుంది .బంతి పూల వనాలు రోజా , పూల చెట్లు ,బంగాళా దుంప పొలాలు చూడ ముచ్చటగా వుంటాయి pine aapple . పంట ఎక్కువ ఇది 12 .వ శతాబ్ది లో హోయసల రాజుల రాజధాని .ఇక్కడ్డి శివుని పేరు హోయశాలేస్వరుడు .నిర్మించిన శిల్పి కేతన మల్ల వర్మ  విష్ణు వర్ధన మహా రాజు కాలమ్ లో నిర్మాణం జరిగింది ..దీనికి ఆనుకొనే ,ఆయన భార్య శాంతలాదేవి రాణి నిర్మించిన దేవాలయమూ వుంది .ఈ దేవాలయాలకు ముందు చాలా విశాల మైన సరస్సు వుంది .సముద్రం లాగా పొంగి ప్రవహించే సరస్సు నుంచి ,ఆలయానికి ప్రవేశించాలి కనుక ద్వార సముద్రం అనే పేరు వచ్చింది ఈ వూరికి .ఇంతకీ  హలేబేడు ”అంటే ”నాశన మయిన నగరం” అని అర్ధం .14  వ శతాబ్దం  లో మాలికాఫార్ దీనిపైకి దండెత్తాడు .అయితె ఇక్కడి ప్రజలు ఇసుక  తో ఆలయం అంతా కప్పేసి కాపాడు కొన్నారట .హలేబేడు దేవాలయ శిల్ప సౌందర్యం నభూతో న భవిష్యతి గా వుంటుంది .భారతీయ ఆలయ శిల్ప నిర్మాణ కళ లో దీని ప్రత్యేకత ఇంక దేనికీ లేదు ..బేలూర్ దేవాలయం లో లోపలి శిల్ప సౌందర్యం అద్భుతం అని పిస్తే హలేబేడు దేవాలయం బాహ్య శిల్ప సౌందర్యానికి దర్పణం .విధానం అంతా బేలూర్ ఆలయం గానే వుంటుంది .అయితె ఎత్తైన ప్లాట్ ఫారం మీద అక్కడి లానే నిర్మించబడింది.ఇది ద్వికూట విమాన పధ్ధతి లో వుంది .అంటే ఇద్దరు మూల దేవతలుంటారు .అంటే రెండు శివ లింగాలుంటాయి .ఈ దేవాలయ సముదాయం కూడా ”chloritic chist ”. శిల తో నిర్మించారు .అంటే మెత్తగా సబ్బు లాగ వుంటుంది శీలా .విగ్రహం పూర్తి అవగానే ఇనుము లాగా గట్టి పడటం దీని ప్రత్యేకత .దీన్నే pot stone అని కూడా అంటారు . హోయసల శిల్ప కళా చాతుర్యం అంతా ఇక్కడ కని పిస్తుంది .ఇక్కడి రెండు శివ లింగాలు తూర్పు ముఖం గావుండి ,ప్రతి దానికి ప్రత్యెక మండపం కలిగి వుంటాయి .ఈ రెండు కలిసి బృహత్ ఆలయం గా ,విశాల మైన పండపం గా కనిపిస్తుంది .లోపల రాజులు ,రాణీలు ,అంతఃపుర జనం కూర్చొనే గల్లెరీ లున్నాయి .లోపల జరిగే కార్య క్రమాలను వారుహాయిగా వీక్షించ వచ్చు   రంగ మంటపాలున్నాయినాత్యం చేసేందుకు వీక్షించ  .చిన్న శివ లింగాలు వున్నాయి రెండు ఆలయాలలోను .నిత్య పూజ జరుగు తుంది .అయితె గాలి గోపురం లేదు .గర్భాలయాన్ని మంటపాన్ని కలిపే ప్రదేశాన్ని శుక నాసి అంటారు .దీని స్తంభాలన్నీ శిల్ప కళా శోభితం .పైన వివిధ శిల్ప శోభితమైన పై కప్పు వుంది .చూడ టానికి కళ్ళు చాలవు అని పిస్తాయి .అతి పెద్ద ,అతి చిన్న శిల్పాలను ఉంచటానికి తగిన ప్రదేశం వుంది .గోతిక్ ఆర్ట్ కు మించిన కళా వైభవం వుందని విశ్లేషకుల భావన .  ఇంగ్లీష్ లో చాలా వివరం గా ,వేగం గా ,ద్వార పాలకులైన నంది డుంతి విగ్రహాలు సకల కళా శోభితాలు .ముక్కు దగ్గర అతి శూక్ష్మ రంద్రాలున్నాయి .అందు లో నుంచి సన్నని పుడక దూరిస్తే దూరి పోతుంది .అన్త్తటి సూక్ష్మ విషయాలపైన కూడా శ్రద్ధ పెట్టి చెక్కిన శిల్పాలవి .అనితర సాధ్యం అని పిస్తుంది .చూసి ఆనందించాలే కాని చెప్పి తే తెలిసేది కాదు .ఆ అనుభూతే వేరు మా గయుడు ఇంగ్లీష్ లో చాలా వివరం గా విశ్లేశానాత్మకం గా ,సూది గుచ్చి నట్లు మంచి శైలి లో వివరించి అనుభూతి చెందేట్లు చేశాడు .రెండు ఆలయాలకు వున్న భేదాలు స్పష్టం గా వివరించాడు .వీటికి మించిన శిల్ప కళ ప్రపంచం లో నే లేదు లేదు లేదు అని ఘంటా పధం గా చెప్పటం అందరికి గొప్ప ఆనందం కల్గించింది ;.ఇప్పటికి సగటున రోజూ కు కనీసం రెండు వేల మంది వీక్షకులు వస్తారట .ఇది un season .సీజన్లో లో కనీసం పది వేల మందికి తక్కువ కాకుండా దర్శిస్తారట  .కొద్ది రోజుల్లో ప్రపంచం లోనే గొప్ప యాత్రాస్థలం గా బేలూర్ హలేబేడు లు అవుతాయని విశ్వాశం గా చెప్పాడు .అలా కావాలని అందరం భావించాం.మంచి ప్రయాణ సౌకర్యం వుంది ,రోడ్లు బాగున్నాయి ,వసతి భోజన సౌకర్యాలు సంతృప్తికరం .
                         ఉత్తర ద్వారం నుంచి ఆలయం లోకి ప్రవేశించాలి .ఇంకా దక్షిణ ,తూర్పు ,పడమర ద్వారాలున్నాయి .స్తంభాలన్నీ lathe తో చిత్రిక పట్టి వుంటాయి .సూర్య విగ్రహం చాలా పెద్దది .జగతి ప్లాట్ ఫారం మీడే ఇదీ నిర్మించబడి ,ప్రదక్షిణ కు అనువుగా వుంటుంది .వెనుక భాగాన నల్ల రాతి తో చేసిన చాలా పెద్ద నంది విగ్రహం మనోహరం గా వుంది .ఇది దేశం లోని పెద్ద నంది విగ్రహాలలో మూడవది .లేపాఖి ,నంది అన్నిటికన్నా పెద్దది .అయితె ఈ నందీశ్వరుని వుచ్చ్వాష ,నిస్శ్వాసాలను చిత్రించిన తీరు పరమ ఆశ్చర్యం .దేనికి తోడూ నంది శరీరం పై మూపురం పై ,మెడపై చెక్కిన అందమైన ఆభరణాలు మువ్వలు ,గంటలు చూస్తె ఇంత పరమ కళా వైభవం తో ఇంకీక్కడా నంది విగ్రహం లేదని పించటం ఖాయం .అందుకనే శిల్ప కళ రీత్యా ఇదే ప్రపంచం లో అతి సుందర నంది విగ్రహం గా భావిస్తారు .అంటే ఇదే నెంబర్ one bull structure .చుట్టూ వున్న శిల్ప కళా శోభ బేలూర్ లానే వుంటుంది .శివుని  వివిధ భంగిమలు అంటే కామ దహనం ,పార్వతీ కల్యాణం ,గజాసుర సంహారం ,రావణుడు కైలాసాన్ని పైకేత్టటం ,వినాయక నృత్యం ,కుమారస్వామి సూర్యుడు ,,చుట్టూ చెక్కిన మదనికలు ,ఏనుగులు ,సింహాలు ,గుర్రాలు అన్నీ బేలూర్ లానే వున్నై .హోయసల దేవాలయాలన్నీ బయటి గోడలపై వుండే శిల్పాలకు ప్రసిద్ధి .
రెక్కల సొగసు తో వుండే గరుత్మన్తుడున్న గరుడా స్థంభం ఇక్కడ ప్రసిద్ధ మైనది .ఇక్కడి గరుడులు రాజు రాణి లకు రక్షణ బంట్లు .రెండవ వీర భాల్లాల రాజు అంగరక్షకుడు కురువ లక్ష్మణ విగ్రహం వుంది .భాల్లాలుని మరణం విని యితడు భార్య ,పిల్లలు ,మిగిలిన అంగ రక్షకులతో ఆత్మ బలిదానం చేసుకొని స్వామి భక్తిని ప్రకతిన్చుకోన్నాదట .ఈ కధప్రాచీన కన్నడ లిపి లో ఒక స్థంభం మీద చెక్కబడి వుంది .ఈ ఆలయానికి నైరుతి దిశ లో నక్షత్రాక్రుతి లోని అందమైన కేదారేశ్వర దేవాలయం వుంది .
          హలీబేడు లో పార్శ్వ నాద మందిరం వుంది .శిల్పకళకు పరాకాష్ట గా దీని నిర్మాణం ఉంటుందట .14 అడుగుల పార్శ్వ నాద విగ్రహం చూడ ముచ్చట  గా ఉంటుందట  .ఆయన శిరస్సుపై ఏడు తలల పాము చెక్కబడి వుంటుంది .అలాగే శాంతి నాద స్వామి ,ఆది నాద స్వామి అనే జైన తీర్ధంకరుల దేవాలయాలు ఇక్కడ వున్నాయట .మేము ఇవేవీ చూడ లేదు .
అలాగే శేషశాయను డైన రంగనాధ స్వామి దేవాలయం కళా శోభితం గా ఉంటుందట ఆయన బొడ్డు లోనుంచి ఉద్భవించిన బ్రహ్మ ,ఆది దేవియిన లక్ష్మి విగ్రహాలతో శోభస్కర మైన ఆలయం.మేము చూడ లేదు .
ఇంతటి శిల్ప కళా శోభితమైన ,అరుదైన హోయసల రాజుల కళావైదగ్ధ్యాన్ని  ,అమరశిల్పి జక్కనా చార్య ,,ఆయన కుమారుడు అపర మయబ్రహ్మ అయిన దంకనా చార్యుడు ల  మనోహర కళా సృష్టికి జేజేలు .ఈ శిల్పాలను దర్శించటానికి మామూలు  నేత్రం కాదు మనో నేత్రం వుండాలి ,చూసింది మననం చేసుకొనే ఓపిక వుండాలి మెచ్చే సంస్కారం కావాలి .శిల్పి ఎభావంతో చేక్కాడో తెలుసుకొనే నేర్పున్డాలి .వీటిని అన్నిటిని అనుభవించి అనుభూతి చెందే హృదయం కావాలి .వీటికి మించి ,తీరిక గా చూసే సమయమూ కావాలి .అప్పుడు ఒక కళా క్షేత్రాన్ని దర్శించిన చిరంతనానుభావం తో మనసు పరవళ్ళు తొక్కుతుంది .కొద్ది సమయం లోనే ఇంతటి అనుభూతిని పొందాం’ఏ పూర్వ జన్మల సుక్రుతమో ?  జన్మ ధన్య మైంది.i.ఇంకో విషయం వింటే మరీ ముక్కు మీద వేలు వేసుకో కుండా ఉండలేము .హౌరా ! అనుకోకుండా ఉండలేము .అదేమిటి అంటే ఈ ఆలయాలలోని శిల్పాలను చక్కగా వెతి కవి విడదీసి పక్కన పెట్టి మళ్ళీ ఇలాగీ ఈ బృహత్ ఆలయాలను పునర్నిర్మించ వచ్చునట .అంటే ఫ్రేము   ఫ్రేమే ల మీద శిల్పాలు చెక్కి అమర్చారన్న మాట .ఫ్రమే కనుక తీసేసి మళ్ళీ ఇంకో చోట బిగించు కో వచ్చు .ఎక్కడా అతికిన్చినట్లుండదు .కాని దేని కడిగా విడి విడి గా వున్నట్లు అనిపించదు .ఇదీ ఆ మహా శిల్పుల నిర్మాణ చాతుర్యం .అపర బ్రాహ్మలు సృష్టికే ప్రతి సృష్టి చేశారు మరో మయులు వారందరూ
                         దాదాపు అయిదున్నర గంటలకు మళ్ళీ బస్ ఎక్కి రాత్రి ఎనిమిదిన్నరకు బెంగళూర్ చేరాను .మజేస్తిక్ బస్ స్టాండ్ లో బస్ ఎక్కి మార్త హళ్లి కి తోమ్మిదిమ్బావుకు చేరాను .మా అబ్బాయి శర్మ కార్ లో వచ్చి ,ఇంటికి మునే కోలాల కు తీసుకొని వెళ్ళాడు .
                                   కే.ఎస్.టి.డి  ఆఫీసు లోకర్ణాటక రాష్ట్రం గురించి   రాసిన మాట నాకు నిజమని పించింది ”One state but many worlds ”
                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —27 -07 -11 .క్యాంపు –బెంగళూర్ .

This slideshow requires JavaScript.

Posted in నేను చూసినవ ప్రదేశాలు, రచనలు | Leave a comment

శ్రావణ బెల్గోల,బేలూర్ హలేబేడు యాత్ర —2

శ్రావణ బెల్గోల,బేలూర్ హలేబేడు యాత్ర  —2
                                                   బేలూర్ చెన్న కేశవ స్వామి దేవాలయం
              శ్రావణ బెల్గోలా నుంచి బేలూర్ వచ్చాం .బెల్గోలా లో మెట్ల లెక్క తప్పు గా రాశాను .చంద్రా గిరి కొనండ యక్క తానికీ దిగ టానికీ పక్క పక్కనే వేరు వేరు గా మెట్లుంటాయి .తొక్కిసలాట లకు అవకాశం లేదు .ఈ రెండు దారుల్లోని మొత్తం మెట్లు 641 మాత్రమే 1282 అని పొరపాటుగా చెప్పాను .
బేలూర్ అనగానే శ్రీ రామ కృష్ణ పరమ హంస కొలువై వున్న పశ్చిమ బెంగాల్ లో కలకత్తా కు దగ్గర వున్న బేలూర్ అను కొంటారు చాలా మంది .కాదు .ఆది ఆధ్యాత్మిక సౌందర్య కేంద్రం .ఇది నేత్రానందాన్ని ఇచ్చే కళా సౌందర్య కేంద్రం .అక్కడ ముక్తి ,ఇక్కడ మనోల్లాసం లభిస్తాయి .బేలూర్ హసన్ కు 38ki బెంగళూర్ కు 222 కి .దూరం .తేల్లాని పూలతోవున్నబంగాళా దుంప పండే పొలాలతో ,బంతిపూల వనాలతో , చెట్లు కళకళ లాడుతూ దారి అంతా హరిత వనం లా కనిపిస్తుంది .
            ఇక్కడి దైవం చెన్న కేశవ స్వామి .వీళ్ళు విష్ణు టెంపుల్ అంటారు .చెన్న అంటే సుందరమైన అని అర్ధం .విష్ణు నామాలలో మొదటిదే కేశవ అనే నామం .స్వామికి ముక్కుకు ముక్కెర వుండటం విశేషం .స్త్రీత్వం  కన్నులు  తో కనిపిస్తూ  బహు సుందరునిగా ఉంటాడు .మోహినీ ఆవ తారం గా భావిస్తారు .ఇక్కడి శిల్ప సంపద వర్ణనా తీతం .కన్నుల పండువ .ప్రతి శూక్ష్మ విషయాన్ని శిల్పి మనో నేత్రం తో దర్శించి శిల్పించాడు .బేలూర్ అన గానే అమర శిల్పి జక్కన్న జ్ఞాపకం వస్తాడు .”ఈ నల్లని రాలలో ఏ కన్నులు  దాగెనో ,ఈ బండల మాటునా యే గుండెలు మొగెనో —పైన కఠిన manipin ,లోన వెన్నా  అనిపించును ,ఉలి అలికిడి తాక గానే గలగలా మని పొంగి poralunu ” అనే నారాయణ రెడ్డి గారి పాట చెవుల్లో రింగుమంటుంది .నాగేశ్వర రావు నటన అద్భుతం అని పిసుంది .ఇక్కడే కళా తపస్వి విశ్వ నాద్ ”శంకరా భరణం ”సినిమా లో మంజు భార్గవి నాట్యాన్ని చిత్రీక రించారు .ఎన్నో సినిమాలకు వేదికయింది .ఇవన్నీ ఒకసారి మనసు లో మెదిలాయి ఇప్పుడు దీని చారిత్రిక వైభవాన్ని తెలుసు కొందాం .గైడు ఇంగ్లీష్ లో చాలా బాగా వివరించాడు .ప్రతి శిల్పాన్ని దగ్గరుండి చూపించి అందులోని కళా సారాన్ని తేలిగ్గా చెప్పాడు .ప్రతి సూక్ష్మ విషయం వివరించాడు .
                    బేలూరు ను వేలా  అనే పురీ అనే వారు .క్రమంగా వేలూరు గా చివరికి బీలుర్ గా మారింది .హోయసల రాజులు దాదాపు మూడు వందల సంవత్చారాలు పాలించిన దేశం .హోయ -సాల ”అనే  రెండు మాటలు కలిసి హోయసల అయింది .అంటే అర్ధం” ! సాల ! కొట్టు ”..ఈ రాజ్య మూల పురుషుడు సాలుడు ఇక్కడ సింహాన్ని సంహరించాదట .అప్పటినుంచి వారి వంశం  నామం హోయసల అనగా సింహాన్ని ఒంటి చేతితో చంపినా వాడు అని మార్చుకొన్నారు ..వీరు దేవగిరికి చెందిన సేఉన యాదవుల కు చెందిన వారు .అవక్ర పరాక్రమంతో చాళుక్య ,చోళ పాన్ద్యులను ఓడించి హోయసల సామ్రాజ్యాన్ని విస్తరించారు .
వీరిలో విష్ణు వర్ధన మహారాజు చాళుక్యులను ఓడించి సామ్రాజ్య సుస్థిరతకు బాట వేశాడు .ఆయన కాలమ్ లోనే కర్ణాటక రాజ్యం లో కనీ ,వినీ ఎరుగని రీతి లో దేవాలయాలను నిర్మించాడు .అందులో ఈ ముఖ్యమైనవి బేలూర్ లోని కేశవాలయం ,హలేబేడు లోని శివాలయం ..అప్పటి వరకు జైన మతాన్ని అవలంబించిన విష్ణు వర్ధనుడు ,వైష్ణవ మతాన్ని మతాన్ని స్వీకరించి ,తన ,ధర్మాన్ని విశ్వాసాన్ని తెలియ జేయటానికి వీటిని నిర్మిఇంచాడని శాశ నాలు తెలియ జేస్తున్నాయి .ఇంకో కధనం ప్రకారం చాళుక్యులను ఓడించిన విజయ గాధకు చిహ్నం గా నిర్మించాడని .తలకాడు లో చాలక్యుల పై విజయమే ఈ నిర్మాణానికి కారణం .ఆ కాలమ్ లో దేవాలయాలలు మతానికి ,న్యాయానికి ,ధనాగారానికి ,ఆధ్యాత్మిక జ్ఞాన బోధకు ,సంగీతా నాట్య కళలకు నిలయాలు ..హోయసల రాజులు కళా ,శిల్పకళ ,మతాలకు అధిక ప్రాముఖ్యతనిచ్చారు .బేలూరు దేవాలయం ఏక కూట ,హలేబేడు లో ద్వికూటా  సోమనాధ పురం లో త్రికూట ఆలయాలు నిర్మింపజేశారు .హోయసల రాజులు 950 లో రాజ్య పాలకు లయారు .పదమూడవ శతాబ్దం లో కర్ణాటక అంతా వారి స్వాధీనం లోకి వచ్చింది హర్ష వర్ధనుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించటానికి ప్రయత్నిస్తే కుమారుడు రెండవ వీర భాల్లాలుడు ఆ కోర్కెను నెర వేర్చాడ్డు .చోలులను రాజ్యానికి తెచ్చి ”చోళ ప్రతిస్తాపనా చార్య ”అనీ .”దక్షిణ చక్ర వర్తి ”అనీ ”హోయసల చక్ర వర్తి అనీ ”అనీ బిరుదు పొందాడు .చివరికి హోయసల రాజ్యం విజయ నగర సామ్రాజ్యం అధీనం లోకి ,చివరికి ధిల్లీ సుల్తానుల చేతిలోకి జారి పోయింది
                                   రాజా విష్ణు వర్ధనుడు భగవద్ శ్రీ రామానుజ్జుల శిషుడు .ఈ ఆలయాల నిర్మాణం విష్ణు వర్ధనుని కాలమ్ లో మొదలై ,మూడవ నరసింహుని కాలమ్ లో పూర్తి అయాయి .మొత్తం103  సమ్వత్చరాలుపట్టింది నిర్మాణానికి .కర్ణాటక ,ద్రావిడ శిల్ప సంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది .118   శిలా శాశనాలు కన్పించాయి ఈ ఆలయ నిర్మాణానికి వాడిన శిలను ”chloritic schist ”అంటారు తెలుగు లో సబ్బు శిల అనచ్చు .అంటే అంత  మెత్తగా ఉంటుందట .శిల్పం పూర్తి అవగానే చాలా గట్టి పది పోతుందట .అదీ దీని గొప్పతనం .అంతా మెత్త గా ఉండ బట్టే ఇంత సూక్ష్మ కళను ప్రదర్శించ గలిగారు .అంటే చెక్కే టప్పుడు మైనం లాగా ఒదిగి పోంది
.ఏ రూపం .,కావాలంటే ఆ రూపం పొందుతుంది శిల్పి చేతిలో .నగిషీ చెక్కటానికి బంగారం లాగా ప్రవర్తిస్తుంది .ఒక రకం గా ఇది శిలా బంగారం అన్న మాట ..ఈ ఆలయాలు ఎత్తైన పీఠం మీద ఉండేట్లు నిర్మించారు .అదో విశేషం  .మన ఆలయాలు నెల మట్టం గా వుంటాయి .అడుగు భాగాన ఏనుగులు ,వాటిపై సింహాలు ,వాటిపై అశ్వం మీద శైనికులు ఆలయం చుట్టూ చెక్కారు .ఏనుగు బలానికి ,సింహం ధైర్యానికి అశ్వం వేగానికి ప్రతీకలు .ఒక శిల్పానికి ,ఇంకో దానికి సంబంధం వుండదు .దేని కదే ముచ్చటగా వేరు వేరు భంగిమలలో కన్పించటం శిల్పుల ప్రతిభకు అద్దం పడుతుంది .అనేక లతలు ,పురాణ గాధలు ఆలయం అంతా బయటి వైపు కనిపిస్తాయి .ఆలయాన్ని ”జగతి ” వేదిక మీద నిర్మించారు .దీని వల్ల భక్తులు ప్రదక్షిణ చేయ టానికి ఏ మాత్రం ఇబ్బంది వుండదు .
     లోపల కళా సంపద తో విలసిల్లె స్తంభాలు న్నాయి .గోడలలో గాలి వెలుతురూ ,లోపలి రావా టానికి వీలుగా నక్షత్రం ఆకారపు ఖాళీలను చెక్కారు .విష్ణు వర్ధన మహారాజు ,అతని రాణి శాంతలా దేవి విగ్రహాలను కమనీయం గా చెక్కారు .లోపల గర్భాలయం వుంది .రంగ మంటపం లో ఆలయ నాట్య కట్టెలు నృత్యం చేసే వారు .మొత్తం మీద 28   ventilator  నారశింహ ,ఆంజనేయ విగ్రహాలు రమణీయం గా వున్నాయి .వీరి ఇలవేలుపు నృశింహ స్వామి .అందుకని అన్ని వైపులా ప్రహ్లాద వరడుడిని ,హిరణ్య కశిప సంహారాన్ని కళా త్మకం గా చెక్కారు . ఆలయం లోని విమానం కాల క్రమం లోద్వంశం అయింది .శ్రీ కృష్ణ దేవరాయలు గోపర నిర్మాణం చేశాడు . రాతి రధం వుత్చావాలలో ఉపయోగిస్తారు . .
                       ఆలయం వెలుపల గోడల పై 644   ఏనుగులు   చెక్కారు  చిన్నగా ముచ్చటగా వుంటాయి .తూర్పున వున్న ద్వారం వద్ద రతీ మన్మధుల విగ్రహాలు అతి సుందరం గా వున్నాయి .లోపల నారశింహ స్స్తంభం వుంది .ఇది బాల్ bearingu ల మీద చక్క గా తిరుగు తుంది ..ఆ నాదే baall bearing   విధానం అమల్లో ఉందన్న మాట .లోపల వున్న నలభై ఎనిమిది శిల్ప కళా వైభవం తో ఉన్న రాతి స్తంభాలున్నాయి .వాటి సౌందర్యం వర్ణనా తీతమే .మండపం పై కప్పు మీద కూడా గొప్పప కళా వైభవం దర్శన మిస్తుంది .ఒక దేవేంద్ర సభలో వున్న అనుభూతి కలుగు తుంది .ఈ శిల్పాలు వ్వులితో కొన్ని lathe యంత్రాల మీద కొన్ని నగిషీలు చెక్కారు .ఈ స్తంభాల మీద 42 సాల భంజికలు అంటే మదనికలు  వివిధ భంగిమలతో మనసును దోచేస్తాయి .వీరినే శిలా బాలికలు అంటారు బయట చెక్కిన దర్పణ సుందరి శిల్పం ,భస్మ మోహిని ,లోపలి స్థంభ భట్టాలికా శిల్పాలు శిల్పి ఊహలకు ప్రతిబింబాలు .గజాసురున్ని శివుడు సంహారించే దృశ్యం ,గరుడుని రెక్కలు ,రూపం ,వామనావ తారం ,కైలాసాన్ని పెకలించే రావణుడు ,దుర్గా దేవి ,మహిసాసుర మర్దనం ,వరాహ అవతారం ,,భైరవ  రూపం లోని శివుడు ,సూర్య దేవుడు ,రధం ,కళా చాతుర్యానికి పరా కాస్ట .ఇంత సుందరం గా ,ఇంత సున్నితమైన చెక్కడం ప్రపంచం లో లేనే లేదు .హాట్స్ ఆఫ్ to జక్కనా చార్యా ,ఆయన కుమారుడు ,వారికి సహకరించిన ఇతర స్థాపతులకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద సాల మహారాజు సింహాన్ని చంపే శిల్పం మనోహరం .ఇదే హోయసల రాజ్య చిహ్నం .
               చెన్న కేశవ స్వామినే విజయ నారాయణుడు అంటారు .1117  లో దీన్నిప్రతిష్టించారు .నాలుగు హస్తాలాతో శంకు ,చక్ర గద ,పద్మాలతో పరమ మనోహరం గా దర్శనం ఇస్తాడు .ముందే చెప్పినట్లు ముక్కుకు ముక్కేర్ తో బాటు తలలో పువ్వులు కూడా వుండటం ప్రత్యేకత .ఇదే మోహినీ అవతారం .విగ్రహం పై భాగాన చుట్టూ దశావతారాలు అతి సూక్ష్మం గా చెక్కబడి విష్ణువు అనంతత్వాన్ని సూచిస్తుంది .దీనినే” ప్రభావలి” అంటారు .
                    ప్రధాన ఆలయం అయిన చెన్న కేశవ స్వామి ఆలయానికి దక్షిణాన ”కప్పే చెన్నగ రాయా ”విగ్రహాన్ని రాణి శాంతలా దేవి ప్రతిష్టించింది .దీన్నే కప్పు చెన్న  కేశవ ఆలయం అంటారు .దీనిలో గణపతి ,సరస్వతి ,లక్ష్మి నాయన ,చామున్దేశ్వారి ,వేణుగోపాల విగ్రహాలు వున్నాయి ..ప్రసిద్ధ శిల్పి జక్కనా చార్యుడు తన స్వగ్రామం కైదల నుంచి ఇక్కడికి వచ్చాడు .అతని కుమారుడు దంకనా చార్యుడు తండ్రిని వెతుక్కొంటూ ఇక్కడికి వచ్చాడు .ఒకరికొకరు తెలియదు .జక్కన చెన్న కేశవ విగ్రహం చెక్కాడు  .కొడుకు ఆ శిల్పం లో  లోపం ఉందన్నాడు .లేదని వాదించాడు తండ్రి .లోపం చూపిస్తే కుడి చేయి నరుక్కున్తానని శపథం చేశాడు . విగ్రహానికి  నీళ్ళతో కలిసిన గంధం పట్టించారు . .గంధం అంతా యిట్టె ఆరిపోయి బొడ్డు దగ్గర మాత్రం ఆర లేదు .అక్కడ ఒక ఖాళీ కనిపించింది .అందులో ప్రాణం తో వున్న k కప్ప బయట పడింది .ఇచ్చిన మాటకు నిలబడి జక్కనా చార్యుడు  చేయి నరుక్కున్నాడు ..అందుకనే ఈ విగ్రహాన్ని కప్ప చెన్నగ రాయ అంటారు .దేవుడు కలలో కన్పించి స్వగ్రామ రమ్మన్నాడట .తండ్రి కొడుకులు అక్కడికి చేరి భగవంతుని ఆజ్ఞా గా చెన్న కేశవ ఆలయాన్ని కట్టారు .జక్కన చేయి మళ్ళీ తిరిగి వచ్చిందట ..
              చెన్న కేశవ ఆలయం కు పడమర వీర నారాయణ  ,దక్షిణాన సౌమ్యనాయకి దేవాలయం ,ఆండాళ్ దేవాలయం వున్నాయి .ఆలయం బయట  నలభై రెండడుగుల గ్రావిటీ పిల్లర్ వుంది   ,అన్నిటినీ తట్టుకొని చరిత్రకు సాక్షి గా నిలబడి వుంది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .
                 అతి సున్నితమైన శిల్ప చాతుర్యానికి బేలూర్ దేవాలయం సజీవ సాక్షి .జీవితం లో తప్పక అందరు చూదాల్సినదే .ఒక్క రోజూ చాలదు .శిల్ప రహస్యం ,శిల్పి చాతుర్యం ,శిల్పి ఉహా త్మక్త అర్ధం చేసు కోవాలంటే రోజులు పడుతుంది .పరమ కళా వైభవం తో విలసిల్లె ఈ శిల్ప సంపదను గురించి ఎంతో కాలమ్ గా వినటమే కాని ఇప్పుడే ప్రత్యక్షం గా చూసి ,అనుభవించాను .నేను చూసింది ,తెలుసు కొన్న దానిలో వెయ్యో వంతు కూడామీకు విడమర్చి చెప్పి ఉండనని నా నమ్మకం .నాతొ పాటు ఆ కళా జగత్తు లో విహరించిన మీకు ధన్య వాదాలు  .ఇక్కడి కళా సౌందర్యాన్ని అనుభవించి మయూర హోటల్ లో భోజనం చేసి ఇక్కడికి 22   కి మే ,దూరం లో వున్న హలేబెడుకు ఒక అరగంటలో చేరాము .శ్రావణ బెలగోల ,బేలూర్ ,హలేబేడు కలిసి త్రిభుజం లాగా వుంటుంది .అందుకే దీన్ని triangular trip అంటారు .
హలేబేడు లోని హోయశాలేస్వర దేవాలయం గురించి తరువాత రెలియ జేస్తాను .
                                    మీ –గబ్బిట .దుర్గా ప్రసాద్ .–26 -07 -11 .క్యాంపు–bengaalu
Posted in నేను చూసినవ ప్రదేశాలు | 2 Comments

శ్రావణ బెలగోల ,బేలూర్ ,హలేబేడు యాత్ర —-1

శ్రావణ బెలగోల ,బేలూర్ ,హలేబేడు యాత్ర   —-1
                    ఈ నెల ఇరవై మూడు శనివారం పై మూడు ప్రదేశ సందర్శనకు కే.ఎస్.టి.డి .అంటే కర్ణాటకస్టేట్  టూరిసం దేవేలోప్మేంట్  వాళ్ల బస్ లో  వెళ్లాన్ను .రాను ,పోను 500ki .మీ. దూరం .935 rs  ఉదయం నాలుగింటికే లేచి ,స్నానం ,సంధ్య ,పూజ చేసుకొని ,పొద్దున్నే అయిద్య్మ్బావుకు మార్త హళ్లి బస్ స్టాండ్ లో corporation సర్కిల్ కు అక్కడి బాదామి హుసే దగ్గర బస్ ఎక్కాను .పావు తక్కువ ఏడుకు బయల్దేరింది .వోల్వ బస్ ,ఏ.సి . మంచి రోడ్ ,లాంకో వాళ్ళు నిర్మించిన యెన్.హెచ్ .48 .హసన్ మీదు గా వెళుతుంది ,ఇది దాటితే మాంగాలుర్ ,మలబారు తీరం .అవి కాఫీ ,తేయాకు ,రబ్బర్ తోటలకు ప్రసిద్ధి .ఉదయం ఎనిమిదిన్నరకు”” ఎద్యుర్  ”అనేకి.మీ. చోట కాఫీ ,తిఫ్ఫిన్లకు ఆపాడు .గారే తిని     ,కాఫీ తాగాను .బానే వున్నాయి తొమ్మిదిన్నరకు శ్రావణ బెలగోలా చేరింది బస్ .బెంగళూర్ నుంచి 160, కి.మీ.కొబ్బరి తోటలు ,పనస చెట్లు ,చెరుకు తోటల మధ్య ప్రయాణం .మెయిన్ రోడ్ నుంచి ,single రూట్ లో  ప్రయాణం .మన కోన సీమ అందాలన్నీ ఇక్కడ క్కనిపిస్తాయి .అయితె అక్కడి లాగా కాలువలుండవు ..పరవశించే ప్రకృతి .ఉదయం కదా చాలా ఆహ్లాదం గా వుంది .
                            గంట సమయం ఇచ్చారు .పైకి వెళ్లి ”జైన ముని బాహుబలిని దర్శించి తిరిగి రావా టానికి .రాను పోను 1282 రాతి మెట్లు .పట్టుకొని నడవ టానికి ఇనుప రాడులున్నాయి   ..మొదట్లో మెట్లు చిన్ని గా వున్నా పోను పోను మోకాళ్ళు ఎత్తి అడుగులు వేయాలి .మొత్తం మీద రొప్పు కొంటు ,రోజూ కొంటు పైకి వెళ్లి గోమాతేస్వర దర్శనం చేశాను .58 అడుగుల ఎనిమిది అంగుళాల ఏకశిలా విగ్రహం .తెల్ల graanite రాయితో చేయ బడింది .ఇదంతా కొండపై చెక్కారు .చూడ ముచ్చట గా వుంది విగ్రహం .కళ్ళు చాలా పైకెత్తి చూడాలి .మహా నగిషీ గా చెక్కాడు శిల్పి .బాహుబలి కాళ్ళ కు చుట్టూ కొన్న లతలు ,,నుంచొని తపస్సు చేస్తుంటే పేరిగినా పొదలు చెట్లను సూచిస్తుంది పక్కనే పాము .తపస్సును భంగం చేయ టానికి వచ్చిందట .ఇవేమీ గమనించక తీవ్ర తపస్సును నుంచునే ఆయన చేశారట జ్ఞానోదయాన్ని పొందారు మా బాచ్ పదిఎడు మంది .అందర్లో ముందు దర్శించి కిందికి దిగింది నేనే .ఒక అమ్మాయి ఇరవై ఎల్లున్తాఎమో ,నా నడక .స్పీడు చూసి తన వాళ్ళతో  ”this gentle man seems much younger to me ”అంటున్డటం విన్నాను .జైనులు ,నడవలేని వాళ్ళు phrame పడక కుర్చీ లో పడుకుంటే కూలీలు మోసుకు పోతున్నారు పైకి .డోలీ అంటారు .అంతా భక్తీ భావం తో వస్తారు ఇన్ని మెట్లు ఎక్కి దిగటం చాలా కష్టమే .కాని ఇస్టమై వస్తున్నాము కనుక ఏమీ అనిపించదు .ఈ మధ్యే జైన ,బౌద్ధ మతాలను గురించి రాశాను కనుక ఇప్పుడిక్కడ చూడటం ఆనందం ,జీవిత సాఫల్యం ..ఇన్నాళ్ళ కు కోరిక తీర్చాడు జైన ముని .మనసార నమస్కరించాను .ప్రపంచం లో శాంతి విస్తరిమ్పజేయ మని ఆ మహా బలిని కోరాను
                            ఇప్పుడు ఈ క్షేత్రం లోని విశేషాలను వివరిస్తాను .బెల్ అంటే తెల్లని కోలా అంటే సరస్సు .కొలను అన్న మాట .స్వచ్చమైన తెల్లని నీటితో నిండిన సరస్సుఅని పూర్తి అర్ధం శ్వేత సరోవరం ..అలాంటి సరస్సు ,దానికి మెట్లు ,నిండా నీరు తో కనపడి దాని అర్ధాన్ని తెలియ జేస్తుంది గ్రామ మధ్యమం లో ఉందీ కొలను .ఈ మూడు క్షేత్రాలు హసన్ జిల్లా లో వుండటం విశేషం .తలకాడుకు చెందిన విశ్వకర్మ స్థపతులు ,ఈ మహా విగ్రహాన్ని చెక్కిన శిల్పులు .ప్రపంచం లో దీనికి మించిన ఏక శిలా విగ్రహం ఇంకీక్కడా లేదు .ఇక్కడ రెండు కొండలున్నా యి ఇంద్ర గిరి ,చంద్ర గిరి .మౌర్య చంద్ర గుప్తుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేయటం వల్ల చంద్ర గిరి అనే పేరు వచ్చింది .దానికి జ్ఞాపకం గా అశోకుడు ఇక్కడ ఒక బాసాది నిక్రీస్తు పూర్వం,మూడవ శతాబ్దం లో నిర్మించాడు దీనితో పాటు ఇక్కడ తపస్సు చేసిన వివిధ మత గురువుల ,అంటే శ్రమనకుల ఆలయాలు క్రీస్తు తర్వాత అయిదు ,ఆరు శతాబ్దుల లో నిర్మించారు .నేమి చంద్ర సిద్ధాంత చక్ర వర్తికి శిష్యుడైన చాముండా రాయలు అనే రాష్ట్ర కూట రాజు చంద్ర గిరి మీద దేవాలయం కట్టించాడు .ఇక్కడ 800 కు పైగా శిలా శాశనాలు కనిపించాయట .ఇవి పూర్వ కనడ అంటే హల కనడ భాష లో వుంటాయి ఇది భట్టారక మతానికి పీఠం .వీరు దేశీయ గంగ మూల సంఘానికి చెందిన వారు .   .
                        జైన తీర్ధన్కరులు ఇరవై నలుగురు .మొదటి ఆయన పురు దేవుడు .ఈ యాన్నె వృషభ దేవ అనీ ఆది నాదుదని అంటారు .ఈయనకు ఇద్దరు భార్యలు పెద్ద రాణి యశస్వతి .ఈమెకు భరతుడు అనే కుమారుడు,ఇంకా వందమంది కొడుకులు ,బ్రహ్మ అనే కుమార్తె కలిగారాట్ .చిన్న రాణి సునందకు బాహుబలి అనే కొడుకు పుట్టాడు .ఒకప్పుడు ఇంద్రుడు నీలాంజన అనే దేవ దాసీ చేత వ్రుశాభుడి కొలువు లో నాట్యం చేయిన్చాదట .భరతునికి పట్టాభిషేకం చేసి రాజ్యం ఇచ్చాడు .బాహు బాల్ని .యువ రాజు గా అభిషేకించాడు రాజు వృషభ దేవుడు .భరతుడు అయోధ్యను ,బాహు బలి పౌదానా పురాన్ని రాజధానులు గా చేసుకొని పాలించారు .ఒక రోజూ భరతుని ఆయుధాగారం లో చక్ర రత్న అనే విసిరే గుండ్రటి వస్తువు కనిపించింది .దీన్ని చూసిన జ్యోతిష్యులు హరతుడు చక్ర వర్తి అవుతాడని చెప్పారు .దీనితో ఆశ పెరిగి తాను జగజ్జేత కావాలని నిర్ణయించుకొని ,తన కింద వున్న సామంతుల్నందర్నీ లొంగి పోమన్నాడు .యుద్ధం ప్రకటించాడు .కాని తమ్ముడు బాహుబలి లొంగ లేదు .పెద్ద యుద్ధమే జరిగి వేలాది మంది చనిపోయే     ప్రమాదం వుందని    ఇరువైపులా మంత్రులు సమాలోచనలు జరిపి ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేశేట్లు నిర్ణయించారు .యుద్ధం తీవ్రం గా జరిగింది .బాహుబలిదే పైచేయి అయింది ..అన్న తల వంచాడు .విజయం తమ్ముడిదే నని ఒప్పుకొన్నాడు .కాని వెంటనే బాహు బలికి జ్ఞానోదయం అయింది .ఈ ప్రపంచం శాశ్వతం కాదు ,ఈ భోగాలు ,రాజ్యం శాశ్వతం కాదు అనిపించింది .తన రాజ్యాన్ని కూడా అన్న భారతునికే  ఇచ్చి ,అతడే చక్రవర్తి అని ప్రకటించి తపస్సు కోసం అడవులకు వెంటనే బయల్దేరి వెళ్ళాడు .
                    భగవాన్ బాహుబలి నుంచునే ఘోర తపస్సు ధ్యానం చేశాడు .ఆయన చుట్టూ చీమలు పుట్టలు పెట్టాయి .ఆయన ఏమీ చలించ లేదు .పాములు కాళ్ళకు చుట్టుకోన్నాయి .లతలు ఒళ్ళంతా అల్లుకు పోయాయి .కేవల జ్ఞానాన్ని సాధించటం కోసం వేటినీ లెక్క పెట్ట లేదు .కాని మనసు ఇంకాస్థిర   పడ లేదు .రాజ్యం మీద ఏమూలనో కాంక్ష వున్నట్లు అనిపించింది .అన్న కు ఇది తెలిసి వచ్చాడు .తన కిరీటాన్ని తీసి తమ్ముడి పాదాల చెంత పెట్టాడు .”ఇది నీ రాజ్యం .నువ్వు నాకు ఇచ్చావు .దీని గురించి చింత వద్దు ”.అన్నాడు .అప్పుడు ఒక్క సారిగా బాహుబలి మనో కవాటాలు విచ్చుకొన్నాయి .సంకుచితత్వం పోయింది   కేవల జ్ఞానం సాధించి చివరికి నిర్వాణం ప్న్డాడు .వేలాది మందికి  జ్ఞానం కలిగించాడు  . గాంగ వంశానికి చెందిన రెండవ రాచమల్లు .మహా రాజు గారి మంత్రి చావుండా రాయాలె ఇక్కడి బాహుబలి విగ్రహాన్ని చేక్కించింది .ఆచార్య నేమి చంద్ర సిద్ధాంత చక్ర వర్తి గారి ఆధ్వర్యం లో క్రీస్తు శకం 981 లో ఈ మహా నిర్మాణం జరిగింది . అంటే 1030 .సంవత్చరాల నాటి విగ్రహం చావుందరాయలను గోమాథ gomatha అని కూడా అంటారు .అందుకే  బహుబలిని gomathesvaru డు అంటారు ఆచార్య నేమి రెండు సిద్ధాంతాలని ప్రతిపాదించాడు .ఆయన ప్రియ శిష్యుడైన గోమాథుడు వాటిని gomatha సార జీవకాండ అని ,gomatha సార కర్మ కాండ అని ప్రచారం లో వున్నాయి ..
                           గోమతేస్వరుడు అనే బాహుబలి విగ్రహం పీఠం మీద కన్నడ ,తమిళ పూర్వ maraatha అక్షరాలూ కని పిస్తాయి ఇవి 981 కాలానికి చెందినవి .ఇంత మహా విగ్రహం చేక్కిన్చాటానికి కారణం ఏమిటి ?అని ఆలో చిస్తే కర్మ పై మానవుడు సాధించిన విజయమే అది అని తెలుస్తుంది .ఒక మహాజ్ఞాని ,మహాతపస్సంపంనుడుఅత్యంత ప్రశాంతితో ఎలా ఉంటాడో తెలియ జేస్తుంది కూడా .విగ్రహం వెడల్పు 26 అడుగులు .పూర్తి దిగంబర విగ్రహం .అక్కడికి వెళ్లి దర్శిస్తుంటే ఏ మనో వికారాలు కలగక పోవటం నాకే ఆశ్చర్యం గా వుంది .అంతటి ప్రభావం వుంది అక్కడ .అద్భత శిల్ప చాతుర్యం ,సునిశిత చెక్కడం మనకు ఆశ్చర్యం కల్గిస్తాయి  ఒక్కొక్క కాలు పది అడుగుల పొడవు .పూర్తి సౌష్టవం తో శిల్ప కళా మర్మజ్నం తో చెక్కిన విగ్రగ్రహం .బాహుబలి జుట్టువంకీలు  తిరిగి poduggవుంటుంది .ఆయన వున్న తపో భంగిమకు ”కాయతోత్సర్గ ”అంటారు .కళ్ళు తెరుచుకొని వుంటాయి .చెవులు విశాల మైనవి .పెదిమల చివర చిరు నవ్వు ,ప్రపంచాన్ని చూస్తున్న ద్రుష్టి ,ప్రశాంతత ,మూర్తీభవించి నట్లుండె మంగళ కర విగ్రహం .విశాల బాహువులు చేతులను కిందికి వదిలేసినట్లున్తాయి .యే రక మైన ఆధారం లేకుండా ఇంత భారీ విగ్రహం అన్ని ఆటు పోట్లు తట్టుకొని శతాబ్దాల పాటు నిలిచి ,ఇప్పటికి దేశ విదేశాలనుంచి జైన మతారాధకులను ఆకర్షిస్తోంది .పన్నెండు సంవత్చారాల్కు ఒక సారి బాహు బలికి మహా కుంభాభిషేకం జరుగు తుంది .ఆవుపాలునెయ్యి పెరుగు గంధం .. పూల్లు మస్తాకానికి అభిషేకం నిర్వహిస్తారు .లక్ష లాది జనం పాల్గొని భక్తీ ప్రపత్తులతో దర్శించి ,పూజించి ,తరిస్తారు .ఇందిరా గాంధి ప్రధాన  మంత్రి గా అక్కడికి వెళ్లి కుంభాభిషేకం లో ఒక సారి పాల్గొన్నారు .పైనుంచి పడిన అభిషేక  పదార్ధాలు  పాదాల మీద పడాలి   .అప్పుడే అది పూర్తి అయినట్లు ఒక సారి అలాజరగ లేదట  ఒక భక్తురాలు ”గుల్లిక యాజ్జి ”అనే ఆమె పోసింతర్వాత అభిషేక జలం పాదాలను తాకిందట అందుకని ఆమె జ్ఞాప కార్ధం ఒక
చిన్న గుడీ కట్టారు అక్కడే . ఈ వూరు హసన్ కు పదిహేను కిలో మీటర్లు .ఆచార్య నిమికి దేవాలయం వుంది .
                     మహా బాహుబలి దివ్యదర్శనం తో మనసంతా ఆనందాన్ని నింపుకొని ,,పురాతన చరిత్రను మననం చేసుకొంటూ బస్ ఎక్కాను .పదకొండు గంటలకు బస్ బయల్దేరి బెలూరుకు పన్న్నేన్డుం బావుకు తొంభై కిలో మీటర్లు ప్రయాణించి చేరింది
                        బేలూరు విశేషాలు మరో సారి తెలియ జేస్తాను .
                                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —25-07-11.–క్యాంపు   –బెంగళూర్
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

తెల్ల కొక్కెర తెప్పం –పుస్తక సమీక్షా —2

 తెల్ల కొక్కెర తెప్పం –పుస్తక సమీక్షా —2
         —————————————–”
డాక్టర్ వసంత్ రాసిన ”తెల్ల కొప్పెర తెప్పం ;;”కధా సంపుటి లోని కధలను గురించి తెలియ జేశాను కదా .ఇప్పుడు అందు లోని జాతీయాలు ,సామెతలు ,మాండలీక వైభవం గురించి వివ రిస్తాను .శేప్పేది శేప్పి శేప్పులా కొట్టి ,శిప్పలా బెల్లము పెడతాడు ముసిలోడు .”పగోన్ని పంచాంగము అడిగి నట్లు ”’కర్నాతకము   గుర్రమైతే తమిళ నాడు గాడిదే ”.”ఆలు పోయెరా గోవిందా –ఆలు పోయిన అనంత పురముల అన్నెము దొరికేర గోవిందా ”
”      ”పొద్దున్న పోయేది టీ అంగడి .పొద్దు మునిగ వంక పోయేది మందు అంగడి ..”కసువామి కాడ కుక్క  కసువు తినేలా ,పశువుని తిన్నిచ్చేలా ”తాను తినడు ఇతరులకు పెట్టడు అన్న అర్ధం లో వాడింది .
”తిరిసి తినేదానింటికి గింజల పులుసుకి పొతే గిద్ది పీక్కొని అమ్పించిందట ”అడుక్కొని తినే దానింటికి ఏదైనా పెట్టమని వెళ్తే గిన్నె లాక్కొని పంపించిందట .
”రాగ్గింజంత రెడ్దోడుంటే రాజ్యమే శేది పోతుంది ”రెడ్ల మీది ద్వేషాన్ని తెలియ జేసే సామెత మనం కూడా ”ఉల్లి పాయంత  కాపు వుంటే ఊరంతా చెడ గోద్తాడు ”
”శివుని పూజలా కరిడి దూరినట్లు ”  శివ పూజ చేస్తుంటే ఎలుగు బంటి అడ్డ మోచ్చినట్లు అనే భావం .అడ్డ మొచ్చి పని చెడ గొట్టే వాళ్ల గురించి అనే మాట .
”కారే మారే కట్టాలి పట్టా ,కాలకుండా పోనుకోవే బొండెం బిడ్డా ”ఒక జాన పద పాట
”ఎదురిల్లు పాడైతే ఎండిన కట్టెలు శ్హిక్కు తాయని ఎదురు శుశే కాలమ్ .అవతలీ  వాడి బాధ చూసి ఆనందించే వాడు .
”గౌనోల్ల శాద్యం ఎడూల్ల ఎల్లెలుపంత ”అంటే గౌడుల వ్యవసాయం ఎడ్ల వెడల్పు అనగా బాగా విస్తరించి వుంటుంది .”గోనోల్ల శేనులా పంట పండిందంటే ,పేదోళ్ళ ఇంటిలా గాదినిన్దినట్లే ”గౌడులు ఉదార స్వభావం వున్న వాళ్ళు అని తెలియ జేస్తోంది . వాళ్ల  చేనుల్లో పంట బాగా పండితే బీదా ,బిక్కి కి అన్నానికి కొదవ ఉండదని భరోసా .’
      ”మ్మన మెట్లా సంతకు పొతే మంచి సరుకునే ఏరి కొంటామో ,,ఆ దేవుడు కూడా అట్లే మంచోల్లని ముందర తీసుకొని పోతాడు ”.
      ”గువ్వ    ఇడిసి పోయిన గూడు లా వుంది ”
”తినేది ,కుడిసేది ,తిమ్మక్క ఇంట్లా -పోనుకోనేది లేశేది పాపక్క ఇంట్లా”  సత్రా  భోజనం మఠా నిద్ర అన్నట్లుంది .    ”
”ఉబిసో ఉబ్బెసో ఎపించుకొందాం ”పని అవాలంటే అవతలి వాడిని వుబ్బేసి లేక తిట్టి పని చేయించు కోవాలని భావం .
”బోరని వానలా వాన పడితే ధరణి పండుద్ది అంటా ”అంటే భరణి కార్తె లో వర్షం పడితే భూంమి బాగా పండుతుంది .
”బంతి భోజనానికి ముందుండాల ,ఎదురు యాజ్యానికి ఎన కుండాల ””మా పక్క యా పొద్దు వడ్లకు   ,రెడ్లకు కొదవ లేదు .”అంటే ఎక్కడ చూసినా రెడ్లే కనిపిస్తారు .వడ్లు పండే పొలాలే కని పిస్తాయి
ఇలాంటివి సందర్భోచితం గా ప్రయోగించి కధా గమనానికి ,అర్ధం ,పరమార్ధం కల్పించారు రచయిత .ఇంకా ఎన్నో హోసూరు జాతీయాలు ,సామెతలు వుండి వుంటాయి వాటిని అన్నిటిని భద్రం  చేయాల్సిన అవసరం వుంది .హోసూరు తెలుగు ప్రజానీకం మీద ఈ బాధ్యత చాల వుంది .
                                                                 మాండ లీకాలు
  హోసూర్ మాండలీకాలు బాగున్నాయి .భాషా వేత్తలు ,సామాన్య జనం మర్చి పోయిన వాటిని వీళ్ళు చాల ధారాళం గా వాడుతున్నట్లు కన్పించింది .అందులో నాకు బాగా నచ్చిన పదం ”మొయిలు ”అంటే మేఘం ..ఇది కావ్యాలకే పరిమిత మయింది .కానీ ఇక్కడ ఎక్కువ గా వాడుతున్నారు నాకు ఎంతో ఆనందం కల్గింది .సువర్ణ సుందరి సినిమా లో ”ఏమో తటిల్లతిక మేమో ,మై మరపేమో ,మొయిలు రాజు దరిమురిసినదేమో ”  అన్న పాట జ్ఞాపకం వచ్చింది .దీన్ని ఇప్పటికీ వాడుతున్న హోసూర్ తెలుగు ప్రజకు వీర తాళ్ళు .                                                                                                                                                                                
                         రంగుల తొండను  బాపన తొన కత్తె అంటారు .మేడి పండ్లకు ఆత్తి పండ్లంటారు .మనము వాడతాం .ఇంద్ర ధనసు కు మరో ముద్దు  పేరు కాముని బిల్లు .అంటే కాముని విల్లు .మీజు అంటారు నీటిలో  ఈదటాన్ని . వగరును తొగరు అనటం కావ్యాలలో వుంది .కాలీ ఫ్లవర్ వీళ్ళకు పువ్వు కోసు .చిన్నరాలును రోలు   ను  కటాని అని పిలుస్తారు ..సాయంత్రాన్ని మాపు సారి అంటారు మాపు అంటే సాయం సమయమే .పందిరికి సప్పరం అంటారు .చలువ చప్పరం మనకు వాడుక లో వుంది చప్పరం సప్పరం అయింది .వంటిల్లు వీళ్ళకు మూలిల్లు .అర్ధవంత మైన మాటే .నట్టిల్లు అంటే ముందు ఇల్లు .నడిమింటి సంగమేశ్వర శాస్త్రి జ్ఞాపకం వస్తారు .ఊరేగింపుకు మెరగని అనటం మామూలు .పొలాన్ని మడి అంటారు .అందరు వాడేదే మాదిగే నాలు అంటే పొలం గట్లు .కొక్కెర అంటే కొంగ చిన్నయ సూరి గారి పంచతంత్రం లో చదివిన మాటే .మెట్ట ను శేను అని ,మాగాణిని కాన అనీ అంటారు .సన్నాయి కి కొలువు అనే మంచి పేరు వాడు తారు .పరక అంటే చీపిరి .మనం కూడా పరక కొట్టటం అంటాము .అంటే వూడవటం .కలంగిరి కాయ అంటే పుచ్చ కాయ .పంగల కర్రను కవలు కొమ్మ అంటారు .కవల అంటే జంట .రెండు కొమ్మలు కలిసింది మంచి మాట .పువ్విరిసి –గంగ రావి .కరిడి –ఎలుగు బంటి .మట్టిగాడు –చిరుత .సేండు –బంతీ .ఇది చెండు కు అపభ్రంశం .కేళిక –వీధి భాగవతం –కేళి అంటే భలే మంచి మాట .”మగువ తన కేళికా మందిరమునకు జనియెన్ ”అని చదువు కొన్నాం .కొబ్బరి కాయలకు భలే మంచి పేరుంది వీళ్ళకు ”ఎల నీరు కాయ ”అంటే లేత నీల్లున్న కాయలు అనే అర్ధం .మోచ్చులు –కత్తులు .ఇదీ కొంత మంది వాడే మాటే .పొంజు –కాగడా .కిరసనాయలు కు సీమ నూనె అని పేరు .దీన్ని అంతా వాడతారు .
జీతం–సంబలం .గర్భిణి –యాగిటి  urumunu గుడుగు అని మెరుపును మించు అని అంటారు .ఇవీ కావ్యాలలో కని పించే మాటలే .యెర్ర బడటం –కేమ్బారు   .–కెంపు అవటం   కెంపు అంటే ఎరుపే ..
తమిళులు –కొంగోళ్ళు …ఒగ్గట్టు –ఐక మత్యం  –ఒక కట్టు గా వుండటం .కట్టు గట్టు అయింది .ఆశ –ఆపెకారము .–అంటే ఆపేక్ష .గోరటి గువ్వ –గోరింక .మాను కుంకే గువ్వ –వడ్రంగి పిట్ట .మాను అంటే చెట్టు చెట్టును ముక్కుతో తొలి చేది .జమ్సరి –విజయ దశమి .పన్యారం –ప్రసాదం .మసలకు –తెల్ల వారు జామున మసలు వేళ అని వాడతారు .తిరిసి తినడం –అడుక్కొని తినటం .”తిరిపెమునకు ఇద్దరాల్లా గంగ విడువు పార్వతి చాలున్ ”అని శ్రీనాధుని చాటు   వు .కిర్లి కిర్లి  ———— –పడి పడి   నవ్వటం ఏడవటం .
దూర్లు –చాడీలు –దూరటం అంటే తిట్టటం .గాసి –కష్టం –గాసిలి అని వాడటం తెలుసు .తిక్కన పద బంధం .ఆరట్లు –బాతా ఖానీ –తడుసు కోనేకి –ఆగ టానికి .తడవు అంటే ఆలస్యం చేయటం.సంబళము –జీతం .ఇది వినని మాటే మనకు .ఎండ్లేలుగు –వెన్నెల .అంటే ఎండ లాంటి వెలుగు –లేక వెండి వెలుగు .పుట్టి –గంప .నీళ్ళ పై ప్రయాణించే గుండ్రని ది పుట్టి మునిగింది అంతా అయిపొయింది అని అర్ధం .రాతి గువ్వలు –గబ్బిలాలు .వాటి ఆవాస స్థానం వల్ల వచ్చిన్ అ పేరు .రణ వంతులు –రాబందులు –పీక్కు తినేవి అనే భావమేమో .చీటీగ –దోమ -..ఇదీ వినని మాటే నాకు .సోగుడు –మంచు .ఈ మాట  కావ్యాలలో ఉందేమో .గొన్ని పులుగు –లద్దె పురుగు –పులుగు అంటే పక్షి అని సాధారణం గా అనుకొంటాము .ఇక్కడ పురుగు కు కూడా అన్వయించింది .
      పునాది–తలాడి .బోకలు –పెంకులు .ఇదీ వింత మాటే . . రెయ్యి –అర్ధ రాత్రి -సగం రేయి –సగం రాత్రి
ఇంక వాక్య నిర్మాణం లో ఎలాంటి మార్పులున్నాయో చూద్దాం .ఎపుడు అనేది యెబుడు అయింది .రాతో రాత్రి –రాత్రికి రాత్రికి   కోడి కూసే జాము –తొందరలో కోడి గూజాము .అయింది .జంబు సవారి స్పీడు లో జెంసరి  ఇచ్చి విడి చేస్తే –అయిన్దోచ్చు .ఇచ్చి-విడిచేస్తేc  –ఇచ్చిడిస్తే  అయింది చే వ్రాలు చేవ రాలు గా  మారింది అలాగే తిట్టు పదం దూట్టడికే –తూత్తేలికే అయుండచ్చు .నవ్వుతు నవ్వుతు కాస్తా ”నాగ నగతా ”గా మారింది .
               ఇన్ని చక్కని సామెతలు జాతీయాలను ,అర్ధ వంతమైన మాండాలి కాన్ని   తన కధల్లో నింపి వాటికి ,కావ్య  గౌరవాన్ని తెచ్చిపెట్టి , ,వారి జీవన విధానానికి హోసూరు కు ,అక్కడి తెలుగు ప్రజలకు తెలుగు భాషకు తెలుగు తల్లికి నీరాజనం గా అందించిన డాక్టర్ వసంత్ గారిని మనసారా అభినందిస్తూ ,మరిన్ని రచనలు వారి నుండి రావాలని కోరుకొంటూ ,వస్తాయనిఆశిస్తూ ,,మిగిలిన బ్రాహ్మణ వైశ్య ,కుమ్మరి కమ్మరి మ్మోదలైన వృత్తుల వారి జీవన విధానాలను కధలుగా రాసి ,,రాసి పోయాలని కోరుతూ    ,సెలవ్  .
                        మీ  — గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -07 -11 .క్యాంపు —బెంగళూర్  .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad

 

Posted in రచనలు | Leave a comment

తెల్ల కొక్కెర తెప్పం –కదా సంకలనం –పుస్తక సమీక్ష —1

        తెల్ల కొక్కెర తెప్పం –కదా సంకలనం –పుస్తక సమీక్ష —
            ——————————————————
                   ఈ నెల 18 వ తేది బెంగళూర్ నుంచి హోసూర్ వెల్లి నపుడు అక్కడి సాహితీ మిత్రులను కలిసిన వివరాలన్నీ మీకుఅంద జేశాను .అక్కడి యువకుడు ,ఉత్చాహ వంతుడు ,తెలుగు భాషా కార్య కర్త ,కవి ,కధకుడు అయిన డాక్టర్ యెన్ .వసంత్ గారు తన మొదటి కధా సంపుటి ”తెల్ల కొక్కెర తెప్పం ”నాకు బహూక రించారు ..దాన్ని వెంటనే చదివాను .ఇది హోసూర్ మాండలికం లో రాసిన కధా హారం .మాండలికాలు భాష కు జీవ నాడులు ..వాటిలో కాలా తీత మైన శబ్ద సంపద వుంటుంది .కాల క్రమేనా భాష పై అనేక శక్తుల ప్రభావం పని చేయటం వల్ల మాండలికాలు మరుగై పోతున్నాయి .అది గ్రహించిన రచయితలు ,చైతన్న్య వంతులై తమ ప్రాంత మాండలికాన్ని బ్రతికించు కొనే ఉద్దేశం తో మాండలికం లో కధా రచన ప్రారంభించారు .కవితా సంపుటులు తెస్తున్నారు .మామూలు వ్యాసాలు మాండలికం లో రాసి భాష అస్తిత్వాన్ని నిల బెట్టు తున్నారు .ఇలా వచ్చిన వే నామిని సుబ్రహ్మణ్యం రాయల సీమ మాండలికం లోను ,ఖదీర్ బాబు కధలు ,బార్బర్ కధలు ,మిట్టూరోడి  కధలు ,ముస్లిం మైనారిటీ కధలు ,తెలంగాణా మాండలికం లోను ,ఉత్తరాంధ్ర మాండలికం లోను వస్తున్న కధలు .వీటి నన్నిటిని పాథకులు ఆదరిస్తూనే వున్నారు .పత్రికలూ ప్రోత్చాహిస్తూనే వున్నాయి ..హోసూర్ ప్రాంతం లోని మాండలికం నేపధ్యం తో ,తన తల్లి గారు చెప్పినవిషయాలను భద్రపరచి ,స.వెం గారి ప్రోత్చాహం తో వసంత్ ఈ కధలు రాశారు. ఇది ఆయన ప్రధమ ప్రయత్నమని అంటున్నారు కాని ,ఒక చేయి తిరిగిన రచయిత రాసిన తీరుగా వుండటం డాక్టర్ గారి ప్రతిభకు నిదర్శనం  
                      ఇరవై కధలున్న ఈ సంపుటి కధల్ని హోసూర్ కధలు గా కూడా పిలుస్తున్నారు .ఈ పుస్తకాన్ని వసంత్ తన తేనే పలుకుల తెలుగమ్మతన తొలి మాటలతో పలకరించిన తన కన్నతల్లి
వెంకట లక్ష్మమ్మ గారికి అంకితమిచ్చి ,తల్లి రుణాన్ని ,తెలుగు భాషామ తల్లి రుణాన్ని తీర్చు కొన్నారు .ఇక్కడ తెలుగును రెండవ అధికార భాష గా చెయ్యాలనే ఉద్యమ స్ఫూర్తి కలవారు వసంత్ .అంతే కాదు తమ కళ్ళముందే తెలుగు మాట ,పాట పద్యం ఊర్ల పేర్లు ఆటలు కనుమరుగవటం తో తల్ల డిల్లి పోయారు .ఇక్కడి సామెతలు ,ఆచార వ్యవహారాలూ ,చిన్న నాటి జ్ఞాపకాలను కతలు గా మలచాలన్న  రమేష్ గారి హితం  బలం గా పనిచేసి కధలకు శ్రీ కారం చుట్టారు .
               ఇందులోని వాన కోయిల ,చీమక్క దోమక్క ,కాకమ్మ గువ్వమ్మ ,బంగారు పేట కధలు పశు పక్షాదులను పాత్రలు గా చేసుకొని వాటిలోనూ సామాజిక నీతి ని చెప్పారు .ఇవి పంచ తంత్ర కధల్లా బాగా వున్నాయి .కొన్ని కధలు వాళ్ల పల్లె టూరి జ్ఞాపకాలను ,పెళ్ళిళ్ళను ,దేవుడి ఉత్చ వాలనుగురించి చెబితే ,భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచినపుడు ఇక్కడి హోసూర్ ప్రాంతాన్ని తెలుగు రాష్ట్రం లో కలపమని గోల చేసినా పట్టించు కోని ఆంద్ర వాళ్ల చేతకాని తనాన్ని గురించి ,ఇంకొన్ని భాషా సమస్య ,సెజ్ ల వ్యాప్తితో వచ్చిన పెను ముప్పు ,జీవన సరళిలో వచ్చిన మార్పు ,మళ్ళీ వాటిని కాపాడు కోవటానికి   ,పిన్నలు ,పెద్దలు చేసిన పోరాటం గురించి వున్నాయి .దారి తప్పిన యువకుల్ని ఉపాయం తో గాడిలో పెట్టిన కదా ,ఉపాయం తో అపాయం తప్పించిన పెద్దమ్మ కధ చెప్పటం లో అలాగే పల్లె బతుకులు శిధిల మాయే తీరు కొండ కోనా యేరు వూరు గురించిన తీయని జ్ఞాపకాలన్నే కల గలిపిన పుస్తకం ఇది .చాలా ఆవేదనతో ,అనుభవంతో అడుగడుగునా తన మాండలీకానికి పట్టం కడుతూ ,అందర్నీ చదివిన్చేట్లు చేసిన కధలివి .మంచి ప్రయత్నం .దీనిని చూసి ఈప్రయత్నానికి   సంబర పడి ,గుర్తించి వసంత్ గారికి ఆగస్ట్ ఏడవ తేది హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయం లో  సంమానిస్తూ , అవార్డ్ ప్రదానం చేస్తున్నారు . .వారికి మనఃపూర్వక అభినందనలు .తొలి ప్రయత్నం తో మంచి గుర్తింపు లభించింది .
                  ఏటి గడ్డ కధలో తన పల్లె లోని చిన్న నాటి అనుభవాలను గుది  గుచ్చి . ఆ చల్ల గాలి ,తోట దొడ్డి యేరు నీరు ,ఆట పాట గువ్వల గుసగుసలు గాలి రాయబారాలు ఇంకెక్కడా దొరకవని ఒక్క తన పల్లె లోనే వున్నాయని సంబర పడ్డారు . తన బాబాయి అంటే పిన్నప్ప పెళ్లి జ్ఞాపకాలను ,తీరును కళ్ళకు కట్టినట్లు వర్ణించారు పిన్నయ్య పెళ్లి కతలో .తెల్ల కొక్కెర  తెప్పం అంటే తెల్ల కొంగల సమూహం  అవి నీటి మీద వాలితే ఒక తెప్ప లాగా కని పించటం .చిన్న నాడుఏడాదిలో కొన్ని రోజులు ఎక్కడి నుంచో కొంగలు వచ్చి వాళ్ల వూరి చెరువు లో దిగి బండ రాయి మీద చేరితే ఒక తెల్ల తెప్ప లాగా కని పించింది రచయితకు .కొంగలు యెగిరి పోగానేతెప్పం   కూడా పోయిన్దనుకొనే అమాయక పిల్లగాడు .పాలేరు వివరించి చెబితే తెలిసింది .కొంగలు బండ మీద వాలటం వల్ల తెప్పగా కనిపించిందని ,కొంగలు యెగిరి పోగానే బండ అక్కడే వుందని తెలుసుకొన్నాడు ”కొన్ని సమాశారాలు ఒగరు సెప్పి తెలుసుకొనే దాని కన్నా ,మనము నేరుగా సూసి అర్తము శేషు కొంటె ఆ ఆనందమే వేరు గౌడూ ”అని మన్చి హిత బోధ చేశాడు జర గప్ప ఈ కద పేరే కధా సంపుటానికి పేరు అయింది .పల్లె టూరి అమాయ కత్వం ప్రకృతి సొగసు ,పక్షుల స్వైర విహారం ,నేత్రానందమైన అనుభూతి పల్లె సొగసులు వున్న కధలకు ఈ పేరు సహజం గా వుంది ., .నీడ నీళ్ళు కద లో అమాయకం గా ఒక చిన్నోడు మంచినీళ్ళు దోసిళ్ళలో తాగుతుంటే చెట్టు మీది చిన్న తొండ పిల్ల ఆ దోసితి నీటిలో పడి కడుపు లోకి పోయిందని ,మనో వ్యాధి తో చిక్కి శల్యమైన వాడి భయాన్ని పక్క వూరి మంత్ర గాడిని రప్పించి ,దోకులకు  మందిచ్చి ,కక్కించి ,తాను పట్టి తెచ్చిన తొండ పిల్లను అందు లో వేసి బయటకు వచ్చేసిందనినమ్మకం   కలిగించి వాణ్ని మామూలు మనిషిని చేసిన పెద్దమ్మ తెలివి తేటలను బయట పెట్టిన కద .ఆద్యంతం సరదా గా సాగుతుంది ..
                        ఊళ్ళోని పంటను చెట్టు కాయలను అర్ధ రాత్రి ఊళ్ళోని కొందరి  సాయం తో దొంగలు కాజేస్తుంటే అది కొరివి దెయ్యాల పని అనుకొనే అమాయక జనం కళ్ళునుతెరిపించి  ప్రత్యక్షం గా చూపించిన గౌడు కధే కొరివి దయ్యాలు .దొంగ గా ,తాగు బోతూ గా మారిన ఒక యువకుడిని వాడి, తండ్రి మార్చమని కోరటం తో వూరి పెద్ద గౌడు  వాన రాయ సామి వుత్చావం లో లో ఉపాయంగా మార్చి ,మళ్ళీ మామూలు మనిషిని చేసిన కద .వాన కోసం వాన రాయ స్వామిని పూజించటం పల్లె టూరి పధ్ధతి .తెలుగు భాష ను దూరం చేసే పనులు తమిళ ప్రభుత్వమూ ,తమిళ అది కారులు చేస్తుంటే వూరు కో లేక మాస్టారు సహాయం తో పిన్నా పెద్ద కుర్రాళ్ళు అంతా కలిసి పోరాడి తెలుగుకు మళ్ళీ మంచి రోజులు తెచ్చిన కదే మా వూరు .గుమ్మయ్య మొడుగు అంటే గుమ్మయ్య మడుగుఅని అర్ధం .ఈ కధలో ఆ మడుగు చుట్టూ వున్న faunaa ,floraa లను అత్యద్భుతం గా వర్ణించారు ,వాళ్ళమ్మ  వండే పిండి వంటల లిస్టు కూడా బాగుంటుంది నోరు ఊరిస్తూ .ఇంత అందమైన మడుగు పరిశ్రామల పేరిట వ్యర్ధ పదార్ధాలు తమిళ తంబుల మేడలలోని మురికి నీరు ,చేరి వాతావరణ కాలుష్యం ,జల.వాయు కాలుష్యం ఏర్పడి జన జీవనం దుర్భర మైంది .ఎవరు తమిళుల ను ఎదిరించే సాహసం చేయ లేక పోయారు .భరిస్తూ వూరు కొన్నారు .పారిశ్రామిక ప్రగతి తెచ్చిన ప్రమాదం ఇది .దసరా పది రోజుల వుత్చావాన్ని ”జం సవారీ ”కడలో బాగా వివరించారు .నాకు తెలిసి నంతవరకు మేము హిందూ పురం లో వుండగా ”జంబు సవారి ”అని దసరా పండుగను చేయటం జ్ఞాపకం వచ్చింది .విజయ దశమి నాడు వాహనాలలో కార్లలో బస్సుల్లో సాయంత్రం అందరు డబ్బు ఖర్చు లేకుండా ఊరంతా ఫ్రీ గా తిరిగే వారు .మేమప్పుడు పిల్లలం .జంబు సవారి అని తెగ సంబర పడే వాళ్ళం .బస్సుల్లో సుగూరు ఆంజనేయ స్వామి గుడికి ఫ్రీ గా వెల్లి వచ్చే వాళ్ళం .ఆ జంబు సవారే ఇక్కడ జం సవారి అయిందని పిస్తోంది .అమ్మాయి ,అల్లుడు ఇద్దరు ఉద్యోగాల్లో ఉండి ,డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకు తుంటే తండ్రి మారప్ప ఉపాయం ఆలోచించి తన వూరిలో జరిగే పరస అంటే దేవుడి పండుగకు బలవంతం మీద ఒప్పించి ,రప్పించి ,వాళ్ల మనస్సుల్లో మార్పు తెప్పించి ,సంసారసౌఖ్యాన్నిఅర్ధం చేసుకోనేట్లు రాసిన కధే ”పరస ”బాగా రాస్శారు .
                    చిన్నతనం లో చిరు తప్పు చేస్తే ,దానిని మహాత్ముల బోధనా తో సరిదిద్దు కోని మళ్ళీ ఆ తప్పు చేయకుండా అందరి క్షేమం కోసం పాటు పడుతూ ,తన యావత్ ఆస్తిని ఆఅశ్రమానికి రాసిచ్చి ,అందులోనే స్వామి సేవ చేస్తూ ,జీవితాన్ని పందిన్చుకోంది పెద్దమ్మ .అయితెకొన్నేళ్ళకు   ఎవరో వచ్చి చిన్నప్పుడు ఆమె చేసిన తప్పును జ్ఞాపకం చేసి ఆశ్రమ వాసులకు చెబితే అప్పటిదాకా  నిప్పులా  చూసిన వాళ్ళు ఆమెను దూరం చేశారు .భరించ లేక వేరే వూరు వెల్లి అక్కడా సమాజ హితం గా బతుకు తూ చని పోయింది .అక్కడి ప్రజా అంతా ఆమెను దేవతలాగా భావించి అంత్య క్రియలను అత్యంత వైభవం గా జరిపారు .ఇక్కడి ఆశ్రమ వాస్లు వెల్లి చూసి తమ తప్పిదం తెలుసు కొన్నారు .ఈ కధే ”పెద్ద మనసు పెద్దమ్మ ”మనిషి చనిపోతే జనం యెంత ఎక్కువ గా వస్తే వాళ్ళు స్వర్గానికి పోతారని పెద్దమ్మ అంటూ వుండేది .అదే నిజ మయింది .
              సెజ్ ల పేర భూములు పోగొట్టుకొని చిన్నా ,చితక రైతులు రోడ్ మీద పడిన కధే ‘ఆపత్తు ”.తన సర్వం తన తొందర వల్ల ,కొడుకు వ్యసనాల వల్ల పో గోట్టుకొన్న గౌడు చివరికి తన కర్మ మిగిలిన రైతులకు కలగ కూడదని ,రైతులన్దర్నీ సమీకరించి ,ప్రభుత్వాన్ని నిలదీసి ,అధికార్లను ఒప్పించి మార్పు తెప్పించాడు .మంది కలిస్తే సమాస్యా విడి పోతుంది .అని తెలియ జెప్పారు .
మన ప్రాంతం లో సంస్కృతం అంటే దేవ భాష మాత్రమే కాదు బూతు అని కూడా అని అర్ధం వున్న సంగతి అందరికి తెలిసిందే .దీన్నే మనం పన్నెండో నెంబర్ భాష అంటాం  .పిట్టన్నకు సంస్కృతం నేర్చుకొంటే గౌరవం పెరుగు త్తుందని భావించి జిట్టన్న మాట విని పక్క వూరికి పోయి అక్కడ అమ్మ లక్కలు తిట్టు కొనే బూతులు చాటుగా విని వాళ్ల కళ్ళలో పడి దెబ్బలు తిన్నాడు సరదా గా సాగే కద ”.రచయిత సెన్స్ అఫ్ హుమౌర్ కి మచ్చు తునక” .సముస్క్రుతము ”కద
                     పంచాయితీ ఎన్నికల్లో గెలవా టానికి అన్ని పాట్లు పడతాడు శీనప్ప   .చివరికి గెలిచాడు .తెలుగు లో ప్రమాణ స్వీకారం చేస్తానంటే అది కారి ఒప్పుకో లేదు .ఇంకేమి వుంది ?తెలుగు లంతా సమాయత్త మినారు .అన్ని పంచాయితీ అధ్యక్షులుకలిసి నడిచారు .ఏకమై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు .ప్రభుత్వం దిగి వచ్చి ప్రజల కోరిక మన్నించింది .అందరు ఒకే సారి వారి ఊళ్లలో తెలుగు లో ప్రమాణ స్వీకారం చేసిన కధే ”తల వర ”అంతే పంచాయితీ అధ్యక్షుడు .దాన్ని తిర గేస్తే వర తల విశిష్ట మైన తల .హెడ్ మాస్టర్ లాగా .అంటే గ్రామానికి ముఖ్యడు .
            ఈ ప్రాంతపు సాహితీ వేత్త ,కవి ,రచయిత నంద్యాల నారాయణ రెడ్డి   గారి కి ఆంధ్రలు యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ సరిగా తెలుగు వాళ్ళను పట్టించు కో లేదని .ఆ కోపం ఇప్పటి దాక వుంది .ఆ అసహనాన్ని వీలైనప్పుడల్లా ఆయన ప్రదర్శిస్తారు .ఇక్కడ ఏ కార్య క్రమం జరిగిన ఆయనే ముందుంటారు .మంచి సలహాలనిస్తారు …అర్జీలు రాస్తారు .తెలుగే కాదు తమిళ ,కన్నడాలలోను మాట్లాడ గలరు ,రాయ గలరు .వారి కోప తాపాలను తమాషా గా తెలియ జేసే కధే ”ఆంధ్రా వొళ్ళ శేతలా అయితిండా ?.బాగా చెప్పారు రచయిత .చక్కని హాస్యము పండించారు నారాయణ తాత ,నాయినమ్మ సంభాషణలలో .
             ఒక వాన కోయిల అక్కను ఆవ మాన పరిచి అక్క తనకు అన్య్యాయం చేసిందని గుడ్డి గా నమ్మి అక్కనే కాళ్ళతో తన్ని బయట పడేస్తే బండ రాయి తగిలి అక్క చని పోయింది .తాగినమైకం దిగి తప్పు తెలుసు కోని విల విలా ఏడుస్తూ అక్క కోసం దేశం అంతా ”ఆక-ఆక ”అని పిలుసు గాలిస్తోందట ..వాన కోయిల హోసూర్ ప్రాంతం లో దుక్కులు దున్నే టప్పుడు కని పించే పిట్ట అది ఆకా -ఆకా అని కూస్తుందట .దీన్ని ఆధారంగా చాలా కమ్మటి నీతి బోధక మైన కద చెప్పటం వసంత్ గారి భావుకతకు  అద్దం పాడు తుంది .తొందర పాటు అనర్ధం అని నీతి .
               కోలారు ప్రాంతం లో బంగారు గనులున్నాయని అందరికి తెల్లుసు ..బాల రాజు అనే రాజు  ఏడవ రానికి కడుపు వచ్చింది /బిడ్డ పుడితే  రాజ్యానికి అరిష్టం అని మిగిలిన రాణులు , భావించి ఆమెను చంపాలని రాణుల ఆలోచన తెలుసుకొనిబంగారమ్మ  రాణీ వాసం వదిలి అడవి చేరింది  అక్కడ ప్రసవించింది .కొడుకుని ఒకా బావురుపిల్లికిబిడ్డ ను పెంచే బాధ్యత అప్పగించి చని పోయింది .ఒక రోజూ రాజు చంద్ర చూదేశ్వర స్వామి దర్శనానికి రాణులతో వచ్చాడు .అక్కడకొడుకుని  చూస్సాడు .అందరు వాడికి రాజా కళ వుందని భావించారు .అపుడు బావురు పిల్లి నిజం చెప్పింది రాజైన బాల రాజుకు  బంగా రమ్మ గొప్ప తనాన్ని తెలుసు కోని వారంతా చేసిన తప్పు తెలుసు కొన్నారు .కొడుకును స్వీకరించాడు రాజు .బంగారమ్మ చేసిన త్యాగానికి ముగ్ధుడై ఆమె పేర బంగారు పేట కట్టించాడు .కోలారు సీమ లో వున్డిది బెంగాల్లుర్ నుంచి మద్రాస్ వెళ్ళే రైల్ దారిలో ఈ వూరు కనిపిస్తుంది .తర తరాలు గా వస్తున్న కధకు శాశ్వత రూపం ఇచ్చి బంగారు కద తయారు చేశారు సంపెంగ పూవుల వంటి గుబాళింపుతో సంపత్ .
యెంత బల శాలి అయినా ఒక్కడు ఏమి చేయలేదు .కలిసి వుంటే కలదు సుఖం .అని తెలియ జెప్పిన కధే ”చీమక్క -దోమక్క ”అలానే  ”కాకమ్మ గువ్వమ్మ ”కధలో బద్ధకం పనికి రాదనీ ,శ్రమించి పనిచేస్తే సౌఖ్యం అని తెలియ జెప్పారు .సోంబేరి తనం కొంప మీదికి తెస్తుంది .చివరి కద ”ఎల్లమ్మ తెలివి ;;”.ఎల్లమ్మ కొడుకులు వూళ్ళో లేరని తెలిసి దొంగలు ఆమె ఇంటికి చేరి దోచుకోవటానికి సిద్ధమైనారు .ఎల్లమ్మ తెలివైనది పరిస్థితి అర్ధం చేసు కోని తన కొడుకులు ఇంట్లూనే తలో చోటా వున్నట్లు బిల్డ్ అప్  ఇచ్చి ,పేరు పేరునా వాళ్ళని పిలుస్తూ ,గొంతు మార్చి వాళ్ళే సమాధానం చెబుతున్నట్లు సమాధానం ఇస్తూ దొంగల్ని బెదిరించి పారి పోయేట్లు చేసింది .అపాయాన్ని ఉపాయం తో తప్పించింది తెలివి గల ఎల్లామ్మ .
ఈ విధం గా ఇరవై కధల్లో వైవిధ్యం వుంది .సామాజిక బాధ్యత వుంది .పల్లె సొగసుల పట్ల ఆరాధనా భావం వుంది .తెలుగు భాషకు జరుగు తున్న అపకారంవుంది ,దాన్నించి కాపాడు కొనే ఆలోచన వుంది ,మాండలీకానికి మహర్దశ పట్టించిన విధానం వుంది .కమ్మని కధలు ,కమ కమ్మని శైలి ,నిండు కావేరి లాంటి స్వత్చత వుంది .ఎక్కడా ఆవేశ కావేశాలు ,చంపు ,నరుకు లేవు .ఆలోచన వుంది .దానికి తగ్గ ఆచరణ మార్గం వుంది .కధలో మాండలికాలు బయటి వాళ్లకు అర్ధం కావేమో నని ప్రతి కద చివర వాటికి వాడుక లోని  అర్ధాలు ఇవ్వటం బాగుంది .
            ఇప్పటి దాక  కధా ,దాని సంవిధానం  మాత్రమే  చెప్పాను .అందులోని సామెతలు జాతీయాలు ,మాండలికం లోని సొగసులు తరువాత తెలియ జేస్తాను
                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -౦.అలానే 7 -11 –క్యాంపు–బెంగళూర్ .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

టర్కీ రచయిత ఒర్హం పానుక్

        టర్కీ రచయిత ఒర్హం పానుక్
                         —————————–
                             సాహిత్యం అంటె ఒక మందు .అన్నాడు టర్కీ రచయిత ఒర్హం పానుక్ .టర్కీ భాష లో ఏడు నవలలు రాశాడు .స్వీయ అనుభవాల గురించి చాలా వ్యాసాలు రాశాడు .వీటిలో తన జీవిత కవాటాలను అందరి కోసం తెరిచాడు ..బాగా చైన్స్మోకింగ్ చేసే వాడు .దాని దుష్ఫలితాలను అనుభవించి  పూర్తిగా మానేశాడు .తన జీవిత చరిత్రను ”other colours ”గా రాశాడు .దీనికే ఆయనకు నోబెల్ బహుమతి లభించింది చాలా తమాషా గా  ,కదిలించేట్లుగా ఆడుతూ పాడుతూ చెప్పినట్లు వుంటుంది ఆయన కధనం .తన సాహిత్య జీవితం లో ఆయనే తల మానిక .తన కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూపించే నేర్పు ఆయనది .చాలా భావ శ్పోరకం గా ,సప్త వర్ణ మాలగా ఆయన రచన వుంటుంది .ముఖ్య మైన విషయాన్ని దేనినీ ఆయన దాచడు ,వదిలి పెట్టడు . .
                 ఆయన నవల ”my   name is red ”కు డబ్లిన్ లిటరరీ అవార్డ్ వచ్చింది .పానుక్ రచనలు యాభై పైగా ఇతర భాషల్లోకి అనువదింప బడినాయి ..ఆయన స్వగ్రామం ఇస్తాంబుల్ .దానితో ఆయన అనుబంధం విడ దీయ లేనిది ..ఆయన రచన లన్నీ దాని చుట్టే తిరుగు తాయి రాస్శ్యా కు చెందిన ప్రఖ్యాత నవలా రచయిత దాస్తోవిస్కీ కూడా సెయింట్ పీటర్స్ బర్గ్ గురించీ ,దానితో తన సంబంధం గురించే ఎక్కువ గా రాశాడని అందరికి తెలుసు .అలాగే జేమ్స్ జాయిస్ డబ్లిన్ గురించీ,ప్రౌస్ట్ పారిస్ గురించీ ఇలానే రాశారు .అది వారికి తీపి అనుబంధం .ఏది చెప్పినా వాటి చుట్టూనేకధ తిరుగుతుంది .ఇలా రాయటం వల్ల ప్రపంచం లోని అన్ని దేశాల పాథాకులు ,తాము స్వయం గా ఆ పట్టణాలలో తిరుగుతూ ,ఆ కధా విధానాన్ని అనుభూతి పొందినట్లున్తుంది .అదీ వారి ప్రత్యేకత .ఈ విషయాన్ని తానె స్వయం గా నోబెల్ బహుమతి తీసుకొనే టప్పుడు ఉపన్యాసం గా చెప్పాడు పానుక్ .
                     మీరు కవి ఎందుకు కాలేదు అని అడిగితె ఆయన ”God was not  speaking to me –I realised that a poet is some one through whom God is speaking .You have to be possessed by poetry ”.అని తనకు దేవుని అనుగ్రహం లేదని ,కవిత్వం భగవద్దత్తం అయిన వరం అని ,.కవిత్వం ద్వారా భగవంతుడు మాట్లాడు తాడని చాలా నిజాయితీ గా చెప్పాడు .అందుకని తాను ఒక గుమాస్తా లాగా పని చేస్తున్నానని అంటె వచనమే రాస్తున్నానని తమాషా గా అంటాడు .తనకు Thomas Man ”ఆదర్శ రచయిత అన్నాడు తన తలలో screw లూజు ”అనీ చెప్పాడాయన .  .
తన తరం రచయితలు జాతీయ భావం తో కూడిన ఆదునిక సాహిత్యం సృష్టించాలని కోరాడు ఎందుకు అంటె తాను ”I am a westernizer ”అని ఒప్పుఒన్నాదు కనుక తాను కోరినట్లు మిగతా వారైనా రాస్తే బాగుంటుందని భావించాడు ..భేషజం  లేకుండా చెప్పాడు .
                      ఒర్హం పానుక్ ఒక తమాషా కధ చెప్పాడు .అది ఇబ్ని అరేబి చెప్పిన కధ అని ఆయనే చెప్పాడు .ఒక సుల్తాన్ చిత్ర రచనలో పోటీలు పెట్టాడటచైనా అరిస్ట్ లకు ,మిగతా వారికి .రెండు గోడల మధ్య తెర కట్టించాడు .ఒక గోడపై చైనా చిత్ర కారులు ,ఇంకో గోడపై మిగిలిన దేశాల చిత్రకారులు painting వేయాలి .మిగిలిన వారు చాలా కష్ట పడి చిత్ర రచన చేశారు ..చైనా వాళ్ళు మాత్రం గోడంతా గోకి అద్దం లా పైంట్ చేశారు .సుల్తాన్ పరీక్షించ టానికి వచ్చాడు ..ముందుగా మిగిలిన దేశాల వారి పైంటింగ్ చూశాడు .అద్భతం అన్నాడు .తర్వాత తెర తీయించి చైనా వాళ్ల పైంటింగ్ చూశాడు  .అందులో ఏమీ లేదు .అవతలి వారు వేసిన painting ను ఈ గోడ అద్దం లాగా చూపించేట్లు చేశారు చైనా వాళ్ళు .చైనా వాళ్ళకే బహుమతిని ఇచ్చాడు సుల్తాన్ .గోడ ను అద్దం లా మార్చిన వారి కళా హృదయాన్ని మెచ్చాడన్నా మాట సుల్తాన్ .
                  రచన గురించి పానుక్ కు కొన్ని నిశ్చితాభిప్రాయాలు వున్నాయి .వాటిని గురించి తెలుసు కొందాం .
            ”A writer talks of things that every one knows ,but does know they know .”
            ”I write because I want to read books like the ones I write ”
           I can only part take in real life by changing it .I write because it is a habit ,a passion .I write because I am afraid of being forgotten .I like the glory and interest that writing brings .I write to be alone ..Every one expects me to write .”
             ఇలా కుండ బద్దలు కొట్టి నట్లు చెప్పటం పానుక్ ప్రత్యేకత .ముసుగు వుండదు .సూటిగా హృదయానికి తాకుతుంది .ఆలోచన రేకెత్తిస్తుంది అదీ పానుక్ ప్రత్యేకత .ఒక టర్కీ రచయిత నోబెల్ పొందటం పానుక్ తో నేప్రారంభం అనుకొంటా  ..
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -07 -11 .–క్యాంపు –బెంగళూర్
Posted in రచనలు | Leave a comment

శ్రీ రమణ వాణి

   శ్రీ రమణ వాణి
      —————
                    రామన్  అని పిలువ బడే శ్రీ రమణ మహర్షికి ఆ పేరు పెట్టింది ఆంద్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్ర లో శ్రీకాకుళం దగ్గరలో జన్మించిన శ్రీ అ యల సోమయాజుల గణపతి శాస్త్రి గారు .వారినే వాశిష్ట గణపతి అని గణపతి ముని అని అంటారు .రమణ మహర్షి లోని  అనంత జ్ఞానాన్ని అర్ధం చేసుకొని శ్రీ రమణులు అని పిలవటం ప్రారంభించారు గణపతి ముని .రమణులు వీరిని గౌరవం గా ”నాయన గారూ”అని పిలిచే వారు .గణపతి ముని గొప్ప తపస్సంపన్నులు .వెద వేదాంగాలన్నీ క్షుణ్ణం గా చదివారు .వేదం లోని విషయాలు భారతం లో పాత్రల రూపం లో ఎలా చోటు చేసు కొన్నాయో వివరం గా పుస్తకం రాశారు .రమణ మహర్షి గొప్ప తనాన్ని లోకానికి అనేక ఉపన్యాసాల ద్వారా ,పుస్తకాల ద్వారా తెలియ జేశారు .ఎన్నో స్తోత్రాలు రాశారు .అమ్మ ఆయన నోట పలుకు తుందని ప్రతీతి .అలాగే ఆంద్ర దేశం లోని సూరి నాగమ్మ గారు రమణాశ్రమం లో వుండి ,శ్రీ రమణుల సేవలో పునీతురాలైనారు .ఆమె వ్రాసిన” రమణాశ్రమం ఉత్తరాలు ”చాలా ప్రాచుర్యం పొందాయని అందరికి తెలుసు .గుడిపాటి వెంకట చలం గారు అన్నీ వదిలి చివరికి రమణ మహర్షి చెంత చేరి జీవితం ధన్యం చేసుకోన్నారన్నది లోక విదితమే .చింతా దీక్షితులు శ్వాశ అంతా రమణ భగ వానే .ఇలా ఎందరెందరినో తన  అమృత వాక్కుల చేత ప్రభావితం చేశారు భగవాన్ రమణ మహర్షి .వారి ఉపదేశ సారాన్ని ఇప్పుడు తెలుసు కొందాం .
                       పురుషార్ధం అంటే పరమ పురుషున్ని అర్ధం చేసుకోవటమే .పురుష ప్రయత్నానికీ ఇదే అర్ధం .
భాగవతం లో జడ భరతుడిని గురించి చెబుతూ పోతన్న గారు  ”చంపగ .వచ్చిన వారి యందు ,కరవాలము నందు ,కాళి యందు ,ను అచ్యుత భావము వహించే ”అంటారు .అంటే దేని మీద ఆయనకు ద్వేషం ,ప్రేమ అనేవి లేవు .అంతా సమ భావనమే .ఇదే స్థితి ని శ్రీ రామ కృష్ణ పరమ హమ పొందారని విజ్ఞులు తెలియ జేశారు .
         వలలో చిక్కిన పక్షి ప్రాణ వాయువును నిరోధించి నట్లు మనం కూడా చేస్తే మనసు లోని చాంచల్యం  పోతుంది .దీనినే ”జాల పక్షి వద్రోధ సాధనం ”అన్నారు రమణ మహర్షి
  ప్రాణా యామం అంటే ప్రాణ శక్తిని ,మనస్సును ,సమన్వయము చేయటమే .”మనసా ప్రాణస్య ఈక్షణం –ఇతి ప్రాణా యామః ”అంటే మనసును ,ప్రాణం పైన పెట్టటమే .
మనసు ,ప్రాణం రెండు ఒకే వృక్షం యొక్క రెండు శాఖలే .
”హృదయ మేవ ప్రాణ ,మనసోరుత్పత్తి స్థానం   భవతి –హృద్యేవ ఆత్మ జ్యొథిహ్ ప్రకాశతే ”ప్రాణం ,మనసు  ఉత్పత్తి స్థానం ఆత్మజ్యోతి ప్రకాశించే హృదయమే .
  లయం అనే మాట తరుచు గా వాడుతాం .లయం అంటే తాత్కాలికం గా శాన్తిన్చాటమే .నిద్ర పోవటం లాంటిది .ప్రాణా యామం ద్వారా మనసు శాంతిన్చినా ,తాత్కాలికమే .ఆ స్థితి అయి పోగానే మనసు మళ్ళీ చంచలమవుతుంది ..అయితె జ్ఞానం ద్వారా పొందిన మనసు వాసనలను పొందదు. .స్థిరం గా వుంటుంది .అందుకే ”మనో నాశాయ మోక్షం ”అన్నారు .జాగృతి స్థితి లో మేలు కోని వున్నా ,మనసు బ్రహ్మ భావన పొందితే ఇంక గ్రహణ శక్తి వుండదు .
     ”ఆజ్యం పునః క్షీరో న భవతి ”నెయ్యి మళ్ళీ పాలు కాలేవు ..కావు కూడా .పండు మళ్ళీ కాయ  కాలేదు .అట్లాగే మరణిస్తే మళ్ళీ పుట్టదు .
  ప్రాణాన్ని నిరోధిస్తే మనసు లయం అవుతుంది .మనో వృత్తిని నిరోధిస్తే మనసు వినాశం అవుతుంది .ప్రాణ నిరోధం తో లయమైన మనసు ,మళ్ళీ పని చేస్తూ వుంటుంది . .మనసు లోని వాసనల నాశనమే నిజమైన నాశనం .”లయ వినాశనే ఉభయ రోదనే –లయా గతం పునర్భవతి’నో మృతం ”’అన్నాడు గీతా చార్యుడు . మనో నాశ మోక్షం అమనస్క యోగం కావాలి .అలాంటి స్వ -ఆత్మ స్థితి లో ఉత్కృష్టమైన యోగికి ఇంక ఏ పనీ చేయాల్సిన అవసరం వుండదు .
     ”దృశ్య వారితం –చిత్త మాత్మనః –చిత్త దర్శనం -తత్వ దర్శనం ”మనసు అంతర్ముఖం చేసి ,ఆత్మ స్వరూపం లో ఉంచటమే చిత్ లేక తత్వ దర్శనం .
మనసు అంటే అంతఃకరణం .–కరణం అంటే పని ముట్టు ..అంటే మనసు మన లో వుండే లోపలి పని ముట్టు .కాళ్ళు ,చేతులు బయటి పని ముట్లు .”
”తెలియ బడు చున్న విశ్వంబు దృశ్య మగును –తెలివినై   సర్వమును కాంచు –దృక్కు నేను –మిగుల నా కంటే అన్యమేమియును లేదు –సత్యమిది –సర్వ వేదాంత సంగ్రహంబు ”అని సీతా రామాంజనేయ సంవాదం చెబుతున్నది ఇదే .
మనసు ,మనసు అని విచారణ చేస్తే ,చివరికి చేరేది మూల స్థాన మైన పరమేశ్వర స్థానమే .అంటే మనస్సు అనేదే లేని స్తానం .
పతంజలి మహర్షి ;యోగః ;  చిత్త వ్రుత్తి నిరోధః ”అన్నారు .చూచే వాడు ,చూసేది చూడ బడేది కలిస్తే త్రిపుటి అంటారు .జ్ఞాని అంటే కళ్ళున్న గుడ్డి వాడు .అంటే  కళ్ళు  వున్నా బయటి ప్రపంచ జ్ఞానం లేని వాడు .అంటే త్రిపుటి రాహిత్యం పొందిన వాడు .
ఇంగ్లీష్ లో నెవెర్ మైండ్ అంటారు అంటే పట్టించుకోక పోవటమే .దీన్నే మన వాళ్ళు ”నైవ మానసం ”అన్నారు .పట్టించుకోవటాన్ని విషయం అంటారు .పట్టించుకోక పొతే ఏమీ వుండదు .ఆలోచనా ప్రవ్రుత్తి నుండి ,మనసునుతన వైపుకు  మరల్చు కోవటమే .”ద్రుశ్యాను విద్ధ సంకల్ప సమాధి ”అన్నారు .అదే నెవెర్ మైండ్ .సహజం గా మనసు ప్రశాంతం గా నే వుంటుంది .దానిపై ఆలోచనలను కేంద్రీకరిస్తే సంసారం అవుతుంది .లేక పొతే ఏదీ లేదు .మనసు వాటి వెంట పరిగెత్తితే అశాంతి పరిగెత్తకుండా వుంటే పరమ శాంతి .అదే నిశ్చింత .ఇదే నైవ మానసం .నైవ మానసమే అమనస్క యోగం .
వృత్తులు రెండు రకాలు ఇదం వ్రుత్తి .,అహం వ్రుత్తి .ఇదం వ్రుత్తి అంటే ప్రాణాయామం ధ్యానం వల్ల నియమించ బడటం ..అహం వ్రుత్తి అంటే మనసు పై లగ్నం చేస్తేనే నశించేది .
”సత్తాయా చిత్ –చిత్త యామ్యహం ”అంటారు రమణ మహర్షి .సత్ నే చిత్ అంటారు .ఆ చిత్ అంటే ”నేను ”
దేహ ఉపాధి ధ్యాస వదిలేస్తే ఈశ్వర దర్శన మైన స్వ ఆత్మ స్వరూప దర్శనం లభిస్తుంది .అప్పుడే తాను ఈశ్వర స్వరూపుడు అవుతాడు .
 జీవస్తు దైవికః ””ఇక్కడ దైవిక అనే పదం శ్రీ రమణుల సృష్టే .దైవ గుణం తో వున్న జ్ఞానినే దైవికుడు అంటారు .దైవికః జీవః  అంటే సత్వ గుణ ప్రదానుడే దేవుడు .
”ఆహామపేతకం –మహాదిదంత పో రమణ వాణి దం” అహంకారాలు నాశన మైతే ,ఆత్మ స్వరూపం తెలిసిన జ్ఞానమే నిజమైన తపస్సు .  ”అని భగవాన్ శ్రీ రమణ మహర్షి అభి భాషణం
                         ముప్ఫై శ్లోకాలలో చక్కగా ఆత్మ దర్శనాన్ని ,పాడుకోవటానికి వీలుగా వున్న ఛందస్సులో సంస్కృతం లో ”ఉపదేశ సారం ”అనే పేరిట  అద్భతం గా చెప్పారు భగవాన్ శ్రీ రమణ మహర్షి
అందు లోని సారాన్ని శ్రీ ఏకాత్మ గారు మనోహరం గా ,సుబోధకం గా ఆవిష్కరించారు అందులో కొంత సార సంగ్రహం చేసి మీకు అందించాను . ..
                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —21 -07 -11 .క్యాంపు –బెంగళూర్  .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —4

   హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —4
              ———————————————–
                              ఇంతవరకు హోసూరు తెలుగు ప్రజలు నిర్వహించిన వివిధ సాహిత్య ,కార్య క్రమాలను గురించి తెలుసు కొన్నాం .ఇంత చేస్తున్నా తమిళ తంబి కరుణ తెలుగు వారికి నిధి ఇవ్వ లేదు ,విధి ఇవ్వలేదు .తన తమిళ ఆధిపత్యం నెత్తి కెక్కింది .”ఎంగుం తమిళం –ఎదలుం తమిళం ”అనే నినాదం తో శివాలెత్తి పోతున్నాడు కరుణ .ఈ మాటలకు అర్ధం ఎక్కడైనా ,ఎందులోనైనా తమిళం మాత్రమే ఉండాలట .మిగతా భాష లన్ని తీసి కట్టు అట. ఇప్పుడు ఒక్క ఓటర్ లిస్టు లో మాత్రమే తెలుగు పేర్లు కనిపిస్తాయి .మిగత ఎక్కడా తెలుగు వాసన కూడా లేదు .అయితె ఓటర్ పేరు పక్క వూరి పేరు మాత్రం తమిళం లోనే ఉంటుందట .ఇంకా పిచ్చి ముదిరి అసలు మీ పేర్లు తెలుగు  లో రాయలేక చస్తున్నాం .పేర్లు తమిళ పేర్లు పెట్టు కొండి అని ఉచిత సలహా పారేశాడు కళ్ళ జోడు కరుణ .లోకం అంతా పచ్చ గా కనిపిస్తుందట కామెర్ల వాడికి ..ఇది మరీ చిచ్చు పెట్టింది .తెలుగుల ఆత్మ గౌరవం దెబ్బతింది .తెలుగు వారికే కాదు కన్నడ ,మలయాళీ ,ఉర్దూ మైనారిటీ లకు కూడా ఇదే దుస్థితి ..ఇక సహించ లేక పోయారు .ఎదురు తిరగటం ప్రారంభించారు .మైనారిటీ లంతా    కలిసి పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని గ్రహించారు .ఇంకా వూరు కొంటె అసమర్ధత అవుతుందని ,తొండ ముదిరితే ఊసర వెల్లి అవుతుందని అర్ధమయింది అందరికి            ..              కర్నాటక లో ముప్ఫై మూడు శాతం తెలుగు వారు న్నారు .ఏడు జిల్లాలలో మెజారిటీ తెలుగు వారిదే .అయితె తెలుగు స్చూల్స్ మాత్రం 170 మాత్రమే నట .వీటినీ పెంచుకోవాలనే స్థిర సంకల్పం తో వున్నారు .కన్నడ ప్రభుత్వం తో పేచీ లేదు .

This slideshow requires JavaScript.

                     అన్ని సమస్యలు ఒక్కటొక్కటే పరిష్కరించు కుంటు వస్తున్నారు హోసూర్ తెలుగు వారు .అయితె ఇప్పుడు ఇంకో కొత్త ప్రమాదం వచ్చి పడింది వారికి .హోసూర్ లో రెండు పారిశ్రామిక వాడలను తమిళ నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది తూర్పు ,పడమరలు గా .ఇండియా లోనే ఇంత పెద్ద పరిశ్రమలు ఇంక ఎక్కడా లేవట .ఇవన్నీ sipcot
అనే పేర వెలిశాయి .అంటె ”smaall    scale industries promotion corporation of tamil naadu ”మొత్తం ఏడు వేల కోట్ల పెట్టుబడి .ఇక్కడ గుండు సూది మొదలు చిన్న విమానాలు వరకు తయారు చేస్తారు .టి.వి.ఎస్. ,titan ,అశోక్ లేలాండ్ ,ఇండియన్ నిప్పాన్ మొదలైన 5000 లకు పైగా భారీ ,మధ్య తరగతి పరిష్మలున్నాయి .లారీలు బైకులు ,ఆటోలు చిన్న విమానాలు ఇక్కడ తయారు చేస్తారు .ఇ.టి .పార్క్ ,500 కోట్లతో సెజ్ వున్నాయి అటో mobiles leather,ప్లాస్టిక్పరిశ్రమలు వుండి  ఎగుమతులకు బాగా తోడ్పడు తున్నాయి .ఉపాధి అవకాశాలు బాగా నే వున్నా,పంట భూములన్నీ హారతి కర్పూరం అయి పోయాయని ఇక్కడి రైతులు నిర్వేదం గా వున్నారు .60 ,౦౦౦మన్దికి ఇవి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి .కానీ తమిళులు వచ్చి ఇక్కడ ఉద్యోగాలలో స్థిర పడ టం తో మళ్ళీ తెలుగు భాషా వ్యాప్తికి చాలా అడ్డంకి కలుగు తోందని భాషాభిమానుల మనో వేదన .రెడ్డొచ్చె మొదలాడు అన్న తీరు గా వుంది ఈ పారిశ్రామీకరణ 2005 నుంచే ప్రారంభం అయింది .రెండు దశల్లో .ఇదికూడా కరుణానిధి ఇక్కడి తెలుగును ,తెలుగు వారినీ దెబ్బ తీయటానికి పన్నిన పన్నుగడ అని అంటున్నారు మిత్రులు .నోటితో పలకరించి నొసలు తో వెక్కి రించి నట్టుంది .
                 ఇవీ హోసూరు లోని తెలుగు వాళ్ల మనో వేదన ,బాధ  ..ఒక పక్క ఆధునికత వచ్చిందని ఆనందం ఇంకో పక్క తెలుగు అస్తిత్వానికి మళ్ళీ ప్రమాదం ఏర్పడుతోందని బాధ
                   ఏమైనా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పోరాట పటిమ గల ఇక్కడి తెలుగు ప్రజలు సమస్యలను వ్యూహాత్మకం గా పరిష్క రించు కో గలరనే గొప్ప విశ్వాసం వాళ్ళను ,వారి అకున్తిత దీక్షను ,పట్టు వదలని విక్రమాదిత్యాన్ని .ఓర్పు నేర్పు లను చూసిన తరువాత నాకు అని పించింది ..భవిష్యత్తు వారందరికీ భద్రం గా వుండాలని ,తెలుగు కు పట్టాభిషేకం జరుపుతూ తెలుగు తేజాన్ని దశ దిశలా వెద జల్లు తారని భావిస్తున్నాను .వారందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ధైర్య స్తైర్యాలు ప్రాసాదించ వలసినది గా భగ వంతుడిని ప్రార్ధిస్తున్నాను .సరస్వతీ దేవి  వారికి ఎప్పుడు అండ గా నిలుస్తుందని భావిస్తాను .హోసూరు తెలుగు వాణి హోరెత్తి దశ దిశలా మారు మోగాలి .అందరికీ హోసూరు ఆదర్శం కావాలి .హోసూర్ మిత్రు లందరికి మరొక్క సారి నమస్సులు ,అభినందనలు తెలియ జేస్తున్నాను
..                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -07 -11 .–క్యాంపు –బెంగళూర్

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజా వాణి —3

        హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజా వాణి —3
  —————————————-
                      ఇలా అప్రతిహతం గా తెలుగు ప్రజలు హోసూరు లో అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు ..ప్రక్క నున్న రాయ వెల్లూర్ ను ప్రభావితం చేసి ,అక్కడా తెలుగు పునరుజ్జీవనానికి సాయ పడ్డారు .’.ఈ ప్రాంతం లో దాదాపు యాభై దాకా జానపద కళలు వున్నాయి .అవి జీవచ్చవాలై పోయే పరిస్థితి వస్తోందని .ఆరాటం చెందారు .వాటిని మళ్ళీ వెలుగు లోకి తెచ్చి ఆ కళా కారులకు జీవన భ్రుతి కి లోటు లేకుండా చేయాలనే ఆలోచన వచ్చింది .స.వెం .రమేష్ గారు ఇక్కడికి వచ్చి జాన పద కలలను ఒక జాతర గా నిర్వహించాలని సూచించి ,వెంట నిలిచి ,కార్యక్రమానికి శ్రీ కాం చుట్టారు .దానిని ”పల్లె కళల పరస ” అనే పేరుతొ 2007 మార్చ్ 24  ,25 ., తేదీలలో హోసూర్ లో చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు .నాయని కృష్ణ కుమారి ,చిలుకూరి దేవపుత్ర రమేష్ బాబు ,రమేష్ వంటి ప్రముఖులు హాజరై దాన్ని దగ్గరుండి నడిపించారు .ఇది రెండు రోజుల పండుగ గా జరిగింది పరస అంతే జాతర .మనం కళా జాతర అంటాం .ముప్ఫై పల్లె కలలను కళా కారులు ప్రదర్శించ్చారు .దీని పై సావనీర్ కూడా తీసుకొని వచ్చారు .తెలుగు విస్గ్వ విద్యాలయం ,దాతల సహకారం తో రంగ రంగ వైభవం గా పరస జరిగి తెలుగు వారినే కాక అందర్నీ పరవశింప జేసింది .

డా వసంత్ , నారాయణ రెడ్డి, నేను , కృష్ణప్ప , ముని రాజు

                           ఇక్కడి యువ రచయితలను ప్రోత్చాహించే తలంపు తో తెలుగు కధ లను రచించే విధానం పై వర్క్ షాప్ నిర్వహించారు .ఆర్ వి ఎస్ .సుందరం వంటి రచయితలూ వచ్చి అర్ధవంతమైన రీతి లో నిర్వహించారు .హోసూర్ మాండలికం లో కధలు రాయించారు ..వాటిని ప్రచురిన్న్చి రచయితలకు గొప్ప ప్రోత్చాహం కలిగించారు .హోసూర్ సామెతలు ,నానుడులు ,పద బంధాలు శిధిలం కాకుండా వాటిని జాగ్రత్త గా సేకరించి భద్ర పరిచే కార్య క్రమం చే బడు తున్నారు ..ఇదే మన తరగని ఆస్తి .విజ్ఞాన సంపద .తరతరాల నుండి వస్తున్న నిధి .దాని విలువ అపూర్వం అనంతం .దాన్ని కాపాడు కోవాలి .మన తరం లో చేయ్క్క పొతే భవిష్యత్ తరాలు అసలు చెయ్యలేవు . వారికి అందుబాటు లో కూడా వుండవు దీన్ని బాధ్యత గా డాక్టర్ వసంత్ లాంటి యువకులు
సేకరిస్తున్నారు .
                          అనుక్షణ ఆలోచనా పరుడైన స.వెం .రమేష్ గారికి ఒక కొత్త ఆలోచన వచ్చింది .దక్షిణ రాష్ట్రాలయిన తెలుగు ,కన్నడ ,తమిళ మళయాళ మొదలైన అయిదు రాష్ట్రాల జాన పద కలాజాతర చేసి అందర్నీ తెలుగు జన జీవన స్రవంతిలో కలపాలి .అంతే అది వెంటనే కార్య రూపం దాల్చింది .తమిళనాడు లోని తిరుచు నాపల్లి అనే తిరుచి లో ఏర్పాటు చేశారు ..ఇదీ పల్లె కళల పరస పేరుతొ జరిగింది .అప్పటి దాకా విడి విడిగా వున్న పదిహేడు తెలుగు జాతులను సమావేశ పరిచి రమేష్ గారు వారందర్నీ ఒకే వేదిక మీదకు తెచ్చ్చారు .వారిలో ఐక్యత సాధించి ముందడుగు వేశారు తిరుచి లో అంతా రెడ్లు .బాగా సంపన్నులు .ఇదివరకు అంతా తెలుగే ఇప్పుడు మారింది .వాసవి మహల్ లో తిరుచ్చి కోట ఆకారం లో వేదిక ఏర్పాటు చేశారు .కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ,ఇతర రాష్ట్రాల మంత్రులు అందరు హాజ రైనారు .”దక్షిణ భారత పల్లె కళల పండుగ ”అని తెలుగు అక్షరాలతో వేదిక మీద అతి పెద్ద బాన్నెర్ కట్టారు ..”మా తెలుగు తల్లి కి మల్లె పూదండ ”పాటతో కార్యక్రమ ప్రారంభమయింది .కూచిపూడి నాట్యం తో కళా సంరంభం ప్రారంభమైది . మహా సంబరం గా జరిగాయి కళా వేడుకలు .జనం మెచ్చి వేలాది రూపాయలు కళా కారులకు ఇష్ట పూర్తిగా చదివించారు .ఆ ఉత్చాహం వర్ణనా తీతం .అంతా కన్నుల పండగే .ఒక్క క్షణం వృధా పోలేదు వచ్చిన వారందరికీ పెళ్లి భోజనాలను మించిన భోజనాలు వసతి కల్పించారు .స్థానిక రెడ్డి సంఘం మొత్తం ఖర్చు భరించి రెండు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసింది .మొత్తం 400 మంది కళా కారులు పాల్గొన్నారు .తమిళులు నోరు వెళ్ళ బెట్టి చూశారట .తెలుగు ఇంత ప్రమాదమా ?అని ముక్కున వేలు వేసు కొన్నారట .ప్రమాదం అంటె వాళ్ల భాషలో అద్భుతం అని అర్ధం ..ఇలా చేయటం వల్ల తెలుగు వారికి ఏమి ఒరిగింది అనే సందేహం రా వచ్చు .తెలుగు భాష ,సంస్కృతి ఎంత ప్రాచీనమైనవో    ,యెంత కళా సంపద తెలుగు వారికి ఉన్నదో ,ఎన్నెన్ని కళా రూపాలు తెలుగు లో వున్నాయో ఒకే వేదిక మీద తెలుగు వారి తో సహా అందరు చూసి తెలుసు కున్నారు .తల్లి భాష తెలుగు పట్ల పూజ్య  భావం ,gouravam,ఆరాధన కలిగాయి తెల్లుగు మాత్రుభాషీయుల ఉత్చాహం చాలా గొప్పది అనే అభిప్రాయం సర్వత్ర్ గోచరించింది .దీనిని చూసిన వారంతా తమ జిల్లాలో ఇలాంటి జాతర చేయమని మరీ మరీ కోరారట .అంతా స్పందన లభించింది .హోసూర్ ఏం ఎల్ ఏ..గోపీనాద్ గారు దీని కోసం చాలా shraminchaarata  ..ఆయన తెలుగు వాడే .తమిళ అసెంబ్లీ లో తెలుగు లోనే మాట్లాడు తారట .ఇదంతా రమేష్ గారి ప్రోత్చాహం ,హోసూర్ తెలుగు సంఘాల నిర్వహణ సామర్ధ్యం ..ప్రజల సహకారం ..
                                     హోసూర్ గురించి మరిఒన్ని సంగతులు నాల్గ భాగమైన చివరి భాగం లో తెలియ జేస్తాను
                                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —20 -07 -11 .క్యాంపు బెంగళూర్
Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 Comment

హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —-2

             హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —-2
        ———————————————
                         హోసూరు తమిళ నాడు రాష్ట్రం లో కృష్ణ గిరి జిల్లా లో వుంది .దీనికి అయిదు కిలోమీటర్ల దూరం లోనే కర్నాటక సరిహద్దు వుంది .హోసూర్ జనాభా లక్ష మంది .అందులో తెలుగు వారు అరవై శాతం .అంతే షుమారు అరవై వేల మంది అన్న మాట .ఇక్కడ కన్నడ ఉర్దూ ,మళయాళ ,తమిళాలు లో  మాట్లాడే వారు కూడా వున్నారు .రాజ్యం తమిలులది .సంపర్కం కన్నడం .తెలుగు వారు అంతా ఇళ్ళల్లో తెలుగే మాట్లాడు తారు .కొందరు తెలుగు ,కన్నడం కలిపి మాట్లాడు తారు .హిందూ పురం లో లాగా అనిపిస్తుంది .తమిళం చాలా కాలమ్ వీళ్ళకు తెలియదు .తమిళం మాట్లాడే వారిని అంటరాని వారి గా భావించే వారు .దిగువ సీమకు చెందిన వాళ్ళు అని తమిలుల్ని ఈసడించే వారట .కానీ ఇవాళ సీన్ రివర్స్ అయింది .సుమారు పది హీను కిలో మీటర్ల పరిధి లో హోసూర్ వుంది .హోసూర్ తాలుకా కూడా .తాలూకా లోని మొత్తం జనాభా రెండు లక్షలు .ఒక్క హోసూర్ పట్టణం లోనే లక్ష జనాభా. .వర్షాధార పంటలే ఇక్కడ .రాగి బాగా పండుతుంది .బోరు బావులు తవ్వి సేద్యం చేస్తున్నారు ,.బావుల కింద వారి కొద్ది గా పండిస్తారు .కూర గాయాలు బాగా పండించి బెంగళూర్ ,తదితర ప్రదేశాలకు పంపుతారు ..ఇక్కడ గులాబి పూలు విపరీతం గ పూస్తాయి .ఇక్కడినుంచే ఎక్కడికైనా ఎగుమతి .జరుగు తుంది .వాతావరణం ఆహ్లాదం గా వుంటుంది .తమిళ తెలుగు ,కన్నడ రాష్ట్ర బస్ లు ఇక్కడ కన్పిస్తాయి .సేలం ,చెన్నై కి ఇక్కడినుంచి వెళ్ళ వచ్చు .కుప్పం దగ్గరే .అలాగే రాయ వేలుర్ కూడా . ఎయిర్ conditioned సిటీ గా హోసూర్ ను భావిస్తారు ఏప్రిల్ మే నెలల్లో మాత్రం కొంచెం వుక్క పోస్తుందట . .

ముని రాజు , కృష్ణప్ప

                            1970 వరకు హోసూర్ లో పూర్తిగా తెలుగే వుండేది .సేలం వరకు తెలుగు తప్ప ఇంకోటి మాట్లాడే వారు కాదట .1970 లో  డి.ఏం .కే .అధికారం లోకి వచ్చింది .అప్పటినుంచి హోసూర్ తెలుగు వారి కస్టాలు ప్రారంభం అయాయి .తమిళాన్ని ఇక్కడ నిర్బంధం చేసింది .ఆ పార్టి భాషోన్మాదం తో తెలుగు ప్రజ అల్లాడి poyindi .వీరి  .వల్ల భయం ఏమిటంటే తెలుగు వాళ్ళు ఎక్కడ పెరిగి పోయి ,తమిళ అస్తిత్వాన్ని దెబ్బ తీస్తారో నని .అందుకని చట్టాలన్నీ కఠిన తరం చేసింది .ఉక్కు పాదం తో తెలుగును అణగ  దొక్క టానికి అన్ని ప్రయత్నాలు చేసింది దానికి రంగు పూయటానికి హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టింది .అలాగే తెలుగు ”ఒళిగా”అంటె  quit తెలుగు  ఉద్యమం అన్న మాట. అప్పటి దాకా వెయ్యి తెలుగు స్చూల్స్ ఉండేవి  ..రిజిస్ట్రేషన్ తో సహా వ్యవహారం అంతా తెలుగు లోనే జరిగేది .ఇది కరుణానిధి కి కన్ను కుట్టింది .కరుణ పోయి అకారణం గా ఆకరుణఆవేశించింది  .పూర్తి అధికారం వుంది .పైన ఎదిరించే సాహసం ఎవరికి లేదు .కేంద్రం లో ఏ ప్రభుత్వం వున్నా ,బెదిరించి ,పోట్లాడి ,అలిగి నీలిగి  ,బెదిరించి ,అన్నీ సాధించుకొనే నేర్పు అతనిది .కక్కా లేక మింగా లేక పోతున్నాడు 1990  వరకు ఏమీ చెయ్య లేక పోయాడు కరుణ .అప్పటిదాకా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు   తెలుగు లోనే జరిగేవి .హోయసల రాజుల కాలమ్ నుంచి హోసూర్ వుంది హస వూరు హోసూర్ గా మారిందని అంటారు .
                        అప్పటి దాకా మద్రాస్ రాష్ట్రం గా వున్న దీని పేరును తమిళనాడు గా 69 లో మార్చారు …మైసూర్ స్టేట్ ను 73  కర్నాటక గా మార్చారు .  భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచేసమయం
లో 1956   లో  పటాస్క్కర్ కమిటీ సర్వ్ చేసి హోసూరు ప్రజలు ఏ రాష్ట్రం లో కావాలంటే ఆ రాష్ట్రం లో ఉండ వచ్చునని రిపోర్ట్ ఇచ్చింది .అయితె ఆంద్ర రాష్ట్రం లో చేరి పోవాలని హోసూర్ ప్రజలకు పూర్తిగా వున్నా ఎవరు వుద్యమించలేదు .ఎవరికీ గట్టిగా విన్నపాలు చేయక పోవటం పాపం ఇప్పుడ వారు అనుభవించే కష్టాలకు కారణం అయింది .దీని పక్కనే వున్న దేన్కని కోట తాలూక కన్యా కుమారి జిల్లా అంతపెద్దది దాన్ని రెండు గా విభజించి హోసూర్ ,దేన్కని తాలూకా లను ఏర్పాటు చేశారు .దేన్కని అంటె తెన్కని అనేనేమో తెన్కని ప్రభువు నన్నే చోడుడు కుమార సంభవం  కావ్యం తెలుగు లో రాశాడ్డు .తెన్కనాదిత్య బిరుదు వుంది ఆయనకు .ప్రబంధాలకు మార్గ దర్శి అయాడు
డా వసంత్
తమిళ భాషా సమస్య చాపకింద నీరు లాగా ప్రవేశించింది .ఇది తెలుసు కొనే సరికే అంతా మించి పోయింది .అప్పటి దాకా తెలుగే అధికార భాష గా వుంది .ఇప్పుడు తమిళాన్ని ఇక్కడ అధికార బాష గా చేయటం పుండు మీద కారం చల్లి నట్లయింది ఈ మార్పును ఒప్పుకో లేదు .జీర్ణించుకో లేక పోయారు .ఇక్కడ తెలుగు సంఘాలు యాబ్భై ఏళ్ళ నుంచే వున్నాయి .అయినా చురుగ్గా పని చేయ లేక పోయాయని ఇప్పటి వారి భావన .. అప్పటి శాసన సభ్యులు కోదండ రామయ్య శక్తి వంచన లేకుండా తెలుగును రక్షించటానికి ప్రయత్నించారు .అప్పుడే  తమిళ నాడు లో తెలుగు భాషోద్యమ సంఘం ఏర్పడి పని చేస్తోంది .
.                   హోసూర్ ప్రజలు జై తెలుగు తల్లి అని ఉద్యమం ప్రారంభించారు .ఇక్కడి బోసు బజార్ లో ని మిత్రబృందం మొదటి సారిగా ఉద్యమించింది .వీరికి ఘంటసాల మిత్ర బృందం తోడైంది .,నంద్యాల నారాయణ రెడ్డి గారి ప్రోద్బలం తో తెలుగు  ప్రజ లు అంతా  సంఘటిత మయారు .తెలుగు భాషోద్యమ నాయకులు సామల రమేష్ బాబు గారు ,సా.వెం .రమేష్ గారు వీరికి అండ గా నిలిచారు .వారిద్దరూ ఇక్కడికి వచ్చి మార్గ నిర్దేశం చేశారు .వీరికి ఆత్మ స్థైర్యాన్ని ,ధైర్యాని కల్గించి వెన్ను తట్టి ,అండగా నిలిచారు .దీనికి ఇక్క్కడి ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకులు ,కైవారం తాతయ్య గారు ,ప్రేరణ నిచ్చారు .స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు .”దూషించు వారి -నయ భాషిన్చి –ప్రేమతో భూషించావే  మనసా  ”అన్న తాతయ్య గారి గీతం వీరికి భగవద్గీతే అయింది .కర్తవ్యమ్ బోధ పడి ముందడుగు వేశారు .ఇక మడమ తిప్ప లేదు .ఇలా అయిదు వైపులా నుంచి ప్రోత్చాహం లభించి కదం తొక్కారు ఇక్కడి తెలుగు ప్రజ ..తర్వాత 2001 లో  కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయితల సంఘం ఏర్పడింది .ఇది మరీ వూతాన్ని ఇచ్చింది .దీన్ని వీళ్ళు ముద్దుగా కృష్ణ రసం అన్నారు .సంక్షిప్త పరచి …ప్రతి నెల మొదటి ఆది వారం అందరు సమావేశం అవుతారు ..తర్వాత కోదండ రామయ్య ఆంద్ర సంస్కృతి సమితి భవనం లో సమావేశాలు జరుగు తాయి .రచయితల సంఘం వారం లో మూడు రోజులు పర్యటించి ,సమస్యలను తెలుసు కొంటారు .ఆదివారం సమావేశం లో చర్చించి పరిష్కారాలను కనుగొంటారు .సామల రమేష్ బాబు ,స.వెం రమేష్ గార్లు వీరికి పరమ ఆత్మీయులై నారు .వారిద్దరిని సంప్రదించ కుండా ఏ కార్యక్రమం జరపరు .
                           తమిళ ప్రభుత్వ తెలుగు వ్యతిరేకత వల విద్యార్ధులు తెలుగు స్కూల్ లలో చేరటం తగ్గింది ..దీన్ని ఎదుర్కోవాలని నిర్ణయించారు .అందుకే ప్రతి సంవత్చరం మే ,జూన్ నెలల్లో ఇంటింటికి తిరిగి తెలుగు స్చూల్లలో విద్యార్ధులను చేర్పించటానికి శాయ శక్తులా కృషి చేస్తున్నారు .వీరి ప్రయత్నాలు ఫలించి ,తలిదండ్రులు తెలుగు స్చూల్స్ లో చేర్పిస్తున్నారు క్రమంగా తమిళ బడులన్ని తెలుగు బడులు  గా మారాయి .చీకటిని తిట్టుకుంటూ కూర్చోటం కంటే చిరు  దీపం వెలిగిస్తే అంతా కాంతి ఏ కదా .ఫెబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ”తెలుగు మాత్రు   భాషా దినోత్చవం ”వైభవం గా జరుపు తారు .అంతా కలిసి బాన్నేర్లు పట్టుకొని గ్రామాల్లో ప్రచార యాత్ర చేసి వుత్చాహం కల్గిస్తారు .ప్రతి ఉగాది పండుగ నాడు బోస్ బజారు నుంచి వూరు ఊరంతా ఉగాది శుభా కాంక్షల బాన్నేర్లు ,flexeelu ఏర్పాటు చేసి పండగ వాతావరణాన్ని తెస్తారు .అచ్చమైన తెలుగు పండుగ కదా ఉగాది .అందుక అంతటి సంబరాలు నిర్వహించటం .ఆగస్ట్ లో గిడుగు రామ మూర్తి జయంతిని వ్యావహారిక భాష దినోత్చవం గా నిర్వహిస్తారు .నవంబెర్ లో తెలుగు భాషకు ఎన లేని సేవ చేసి ,అనేక గ్రంధాలను ప్రచ్రించిన ప్రాతస్మరనీయుడు సి .పీ .బ్రౌన్  జయంతి జరిపి ఆయన భాషా సేవను గుర్తుకు తెచ్చుకుంటారు .స్ఫూర్తిని పొందుతారు .విద్యార్ధులకు వేమన పద్యాలపై పోటీలను నిర్వహిస్తారు .ఇక్కడి బస్తి యువక సంఘం ఆధ్వర్యం లో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించి కవితా సంకలనం తెస్తారు .
                 2004  లో  ”తెలుగు వాణి ”పత్రిక నెల కొల్పి ఉత్చాహ వంతులైన యువ రచయితలతో కవితలు ,హోసూర్ మాండలికం లో కధలు ,వ్యాసాలు రాయిస్తున్నారు .ఇది ఎందరికో మంచి వేదిక అయింది .వారి సృజనకు గొప్ప అవకాశం లభించింది ,..బోధనా ,పరిశోధనా ధ్యేయం గా వాణి తన  బాణీ ని చాటు తోంది ..దీనికి తోడు ”తల్లి భాష ” మాస పత్రిక ఇక్కడితెలుగులా మనో భావాలను కవిత ,కధ పాట పద్యం ,మాండలికం ద్వారా  ప్రతి బిమ్బించేట్లు  చేస్తోంది .
                         హోసూర్ లో జరుగు తున్న ఈ వైవిధ్యభరిత  కార్యక్రమాలను చూసిన రాయ వెల్లూర్ తెలుగు ప్రజానీకం తాము ,తమ పిల్లలు తెలుగు నేర్చుకున్తామని ,నేర్పే ఏర్పాటు చేయమని వీరిని కోరారు .వీరికి మంచి ఉత్చాహం లభించింది .తమ ప్రయత్నాలు ప్రక్క ప్రదేశాలకు విస్తరిస్తున్నందున కుసంబర పడ్డారు ..అయితె వారికి నేర్పాలంటే సు స్సిక్షుతులు అయిన కార్య కర్తలు కావాలి .వారికి తెలుగు ఎలా నేర్పాలో తెలియాలి ..అందుకని దగ్గర లో వున్న కుప్పం ద్రావిడ విశ్వ విద్యాలయాన్ని ఆశ్రయించారు .వారు రేసౌర్సే పెర్సొన్స్ కు శిక్షణ నిచ్చారు కస్తూరి విశ్వనాధం ,పరిమి రామ నరసింహం వంటి వుద్దండులుకదిలి వచ్చి యువకులకు మంచి శిక్షణ నిచ్చి తీర్చి దిద్దారు .వెల్లూర్ జిల్లా లోని 120 గ్రామాల నుండి గ్రామానికి కనీసం ముప్ఫై మంది వరకు వచ్చి నేర్చుకొన్నారు .తెలుగు లో ప్రావీణ్యం పొందారు .నల్లూరు గ్రామం లో ఏడు రోజుల పాటు శిబిరం నిర్వహించారు .స్త్రీలు విశేషం గా పాల్గొని ,తాము ,ఏమీ ,వెనుక బడ లేదని నిరూపించారు …దీని ప్రభావం బాగా వుంది .తమిళ విద్యార్ధులు తెలుగు కవితలు రాసి తెలుగు వారినే ఆశ్చర్య పడేట్లు చేశారు కృషి వుంటే మనుషులు రుషులవు తారు ,మహా పురుషు లవు   తారు అన్న దానికి ఇది నిదర్శనం .ఈ ఖర్చును అజంతా వాచ్ కంపెని వారు ,ఇతర వదాన్యులైన దాతలు భరించి ఒక గొప్ప సామాజిక మార్పుకు దోహద పడ్డారు .వారందరూ అభినంద నీయులు .ఈ విజయం అంతా హోసూరు లోని తెలుగు సంస్థ కు ,దాని నిర్వాహకులకు దక్కు తుంది
                             మరిన్ని హోసూరు విషయాలు ఇంకో సారి .
                              మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -07 -11 . క్యాంపు —బెంగళూర్
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి ——1

     హోరెత్తిస్తున్న హోసూర్  తెలుగు ప్రజా వాణి   ——1
                                                                 ——————————————–
                                హోసూర్ గురించి చాలా కాల0 గా వింటున్నాను .అక్కడి తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు నడుస్తున్న చరిత్ర మాస పత్రిక లో చదువుతున్నాను .అడపా దడాపా దాని సంపాదకులు ,ఆప్తులు డాక్టర్ సామల రమేష్ బాబు గారు కృష్ణా జిల్లా రచయితల సంఘం లో చేసే ప్రసంగాల ద్వారా కూడా  తెలుస్తున్నాయి .సా.వెం .రమేష్ గారి రచనల ద్వారా చాలావిషయాలతెలిశాయి .
అక్కడ తెలుగు భాషను రక్షించుకోవటానికి వారు చేస్తున్న పోరాటాలు ,తెలుగు సంస్కృతిని కాపాడుకోవటానికి  అవలంబిస్తున్న  విధానాలు ,తమిళనాడు ప్రభుత్వం హోసూర్ తెలుగు వారికి చేస్తున్న అన్యాయం ,ఆ అన్యాయాన్ని సరిదిద్దటానికి వారు చేస్తున్న పోరాటం ,విని ,చదివి హోసూర్ చూడాలనే అభిప్రాయం మనసులో బలం గా నాటుకొంది .ప్రత్యక్షం గా అక్కడి విషయాలు తెలుసుకోవాలనిపించింది .ఎట్లాగు బెంగళూర్ లో వున్నాను కనుకా,ఇక్కడికి హోసూర్ బాగా దగ్గర కనుక వెళ్ళటానికి నిర్నయిన్చుకొని ఉయ్యూరు లోని మా అబ్బాయి రమణకు ఫోన్ చేసి రమేష్ బాబు గారికి ఫోన్ చేసి హోసూర్ లో ఆయనకు తెలిసిన వారి ఫోన్ నెంబర్ అడిగి తెలుసు కోమని చెప్పాను .వాడు వెంటనే ఆయన నుంచి అక్కడి డాక్టర్ వసంత్ గారి ఫోన్ నెంబర్ ఇచ్చాడు .

నంద్యాల నారాయణ రెడ్డి గారు

ఈ నెల పద్దెనిమిదవ తేది సోమవారం ఉదయం బెంగళూర్ లో పదిగంటల కల్లా భోజనం చేసి మా అబ్బాయి శర్మ వాళ్ల ఇంటిను౦చి బయల్దేరాను .సిటీ బస్ ఎక్కి సిల్క్ బోర్డు దగ్గర దిగాను .ఇక్కడ సేనియర్ సిటిజెన్స్ కు కన్సెషన్ వుంది బస్సుల్లో .సిల్క్ బోర్డు దగ్గర తమిళనాడు బస్సు ఎక్కి హోసూర్ మధ్యాహ్నం పన్నెండున్నరకు చేరాను .బస్ స్టాండ్ నుంచి వసంత్ గారికి ఫోన్ చేసి హోసూర్ కు వచ్చిన విషయం చెప్పాను .ఆయనకు ముందుగా నేను ఫోన్ చెయ్యలేదు .ఇప్పుడే చేశాను .పాపం ఆయన ఎంతో బాధ గా తాను హోసూర్ కు ముప్ఫై కిలోమీటర్ల దూరం లోచిన్న తిరుపతి అనే  ఒక పల్లె టూరిలో క్లినిక్ లో వున్నానని ,సాయంత్రం దాకా రాలేనని ,తన మిత్రుడు రఘునాధ రెడ్డి గారిని పంపిస్తున్నానని ,ఆయన అన్ని విషయాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు .రెడ్డి గారు నాకోసం వచ్చి నన్ను తన బండి మీద నంద్యాల నారాయణ రెడ్డి గారింటికి తీసుకొని వెళ్లి ,నా గురించి చెప్పి ,హోసూర్ లో జరిగే కార్య క్రమాలన్ని నాకు తెలియ జేయమని చెప్పారు .తాను మళ్లి వచ్చి కలుస్తానని చెప్పి వెళ్ళారు వీరు అగ్రిగోల్డ్ లో పని చేస్తూ ,మంచి సేవా కార్య కర్త గా పేరు తెచ్చుకొన్నారు .నారాయణ రెడ్డి గారు వ్యవసాయ దారులు యాభై అయిదేళ్ళ పైవారు .మంచి రచయిత .తమిళ కన్నడాలలో మంచి పట్టున్న వారు .ఏ రకమైన మెమొరాండం అయిన ఏ భాషలో నైనా రాయ గలరు .మంచి శైలి ,ఆవేశం ,తెలుగు ను రక్షించు కొనే తపన వున్న వారు .ఆయన రాసిన దంతా నాకు చదివి విని పించారు .అదంతా నేను వాయిస్ రికార్డర్ లో రికార్డు చేశాను .దాదాపు రెండు గంటలు ఇలా గడిపాము .భోజనం చెయ్యమన్నారు .చేసి వచ్చానని చెప్పాను .రెండు సార్లు కాఫీ ఇచ్చారు .ఇంతలో క్క్రిష్ణప్ప గారు వచ్చారు .ఆయన స్వతహాగా కన్నడిగులు.అయినా తెలుగు భాషోద్యమానికి తీవ్రం గా కృషి చేస్తున్నారు .కాసేపటికి మునిరాజు వచ్చారు .యువకుడు ,కవి ,కధా రచయిత .పత్రికలలో ఆయన రాసినవి పడుతుంటాయి .చివరగా డాక్టర్ వసంత్ చేరారు .అందరం సరదాగా కబుర్లు చెప్పుకొన్నాం .వసంత్ గారు మంచి కార్య దీక్షా పరులు .యువకుడు .సాయంత్రం ఆయన ఇంటిదగ్గర క్లినిక్ లో వుంటారు .”తెల్ల కొక్కెర తెప్పం ”అనే కధా సంపుటి వెలువరించారు ..దీనికి ఆగస్ట్ ఏడవ తేదిన వారికి హైదరాబాద్ లో తెలుగు విశ్వ విద్యాలయం లో సన్మానం ,పురస్కారం వున్నట్లు చెప్పారు .ఆ సమయం లో సా.వెం .రమేష్ గారు వీరితో ఫోన్ చేసి మాట్లాడారు నాతో  కూడా ఫోన్ లో రమేష్ గారు మాట్లాడారు .ఆయన రచనలు చదవటమే కాని ప్రత్యక్షం గా చూడ లేదు .ఆయన నిరంతర సంచారి .ఎప్పుడు ఏదో ప్రదేశానికి వెళ్లి అక్కడి తెలుగు వారి భాషా విషయాలు పరిశోధించి వ్యాసాలు రాస్తుంటారు .ప్రళయ కావేరి అనే వారి కధా సంపుటికి అవార్డు వచ్చింది .నాతొ చాల ఆత్మీయం గా మాట్లాడారు .ఉయ్యూరు ,ఆ పరిసర ప్రాంతాలు తెలుసు నని ,చెప్పారు .ఇక్కడి ఈ మిత్ర బృందానికి ఆయన గొప్ప ప్రేరణ .అలాగే రమేష్ బాబు గారు .వాళ్లిద్దరే స్ఫూర్తి ప్రదాతలు గా నిండు మనసుతో అందరు చెప్పారు .ఇలాంటి మిత్రులకు ఇంకో యాభై మంది సుశిక్షుతులైన కార్య కర్తలు తోడ్పడుతూ ,చాలా కార్య క్రమాల్ని దిగ్విజం గా జరపటం విశేషం .మంచి అనుభూతి పొందాను .ఇక్కడికి రావటం నాకు చాలా ఉపయోగ పడింది ..అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని ,ఫోటోలు దిగి ,వసంత గారి కారు లో మునిరాజు గారితో కలిసి హోటల్ కువెళ్ళి టిఫిన్ చేసి ,రాత్రి ఏడు గంటలకు బస్ ఎక్కి తొమ్మిదింటికి బెంగళూర్ చేరాను అక్కడి విషయాలన్నీ నారాయణ రెడ్డి గారు చెప్పిన వివరాలు మీకు వివరం గా తెలియ జేస్తాను .మంచి మిత్రబృందాన్ని ,సేవా నిరతుల్ని ,భాషాభి మానుల్ని ,భాషోద్యమ కార్య కర్తల్ని ,అకున్తిత దీక్షా దక్షుల్ని ,అంకిత భావం తో ,ప్రతి ఫలా పేక్ష లేకుండా ,తమ అమూల్య సమయాన్ని ,ధనాన్ని తెలుగును నిలబెట్ట టానికి కృషి చేస్తున్న నిత్కృషీ వాళుల్ని చూసిన ఆనందం మనసు నిండా నింపుకొని ఇంటికి సంతృప్తిగా చేరాను .వారి మర్యాద ,మన్నన ,పెద్దరికం ,కలుపుగోలు తనం నన్ను బాగా ఆకర్షించాయి మేమున్న మార్త హళ్లి కి హోసూర్ సుమారు నలభై కిలో మీటర్లు .వెళ్లి తిరిగి రావా టానికి సుమారు వందరూపాయలవుతుంది .

రఘునాధ రెడ్డి

హోసూరు కృష్ణా గిరి జిల్లా లో వుంది-తమిళనాడు నాడు లో .అయిదు కిలో మీటర్ల లో కర్నాటక సరిహద్దు .దీపావళికి బెంగళూర్ వాళ్ళంతా హోసూర్ వెళ్లి టపాకాయలు కొనుక్కుంటారు .చవక .అవి తమిళనాడు లోని శివ కాశి నుంచి వస్తాయ.పెద్ద ఊరే లక్ష జనాభా .అందులో అరవై వేలమంది తెలుగు వారే .ఇక్కడి శాసన సభ్యుడు తెలుగు వారే ..అయినా భాషా వివక్షతకు ఇక్కడి తెలుగు వారు ,కన్నడిగులు ,మలయాళీలు ,ఇబ్బంది పడుతున్నారు .ఇవన్నీ వివరం గా మళ్ళీ రాస్తాను
                                      మీ —-గబ్బిట దుర్గా ప్రసాద్ —20 -07 -11 —-క్యాంపు —బెంగళూర్ .
Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

అలాస్కా విశేషాలు

                అలాస్కా విశేషాలు 
                        అలాస్క ధ్రువ ప్రాంతం లో వున్న సంగతి అందరికి తెలుసు .ఇక్కడి క్యాలెండరు Tlingit–indian calender ను ఉపయోగిస్తారు .వీరి సంవత్చరం ఆగస్ట్ తో ప్రారంభం అవుతుంది .అప్పుడు పక్షులు పర్వతాల మీద నుండి కిందికి దిగుతాయి జంతువులూ శీతాకాలం గుహల్లోకి ప్రవేశిస్తాయి .సెప్టెంబర్ ను స్మాల్ మూన్ అంటారు .చేపలు ,బెర్రీలు కనిపించవు .నవంబర్ ను స్నో మూన్  అంటారు .నీళ్ళు గడ్డ కడతాయి .డిసెంబర్ ను సైలెంట్ మూన్ అంటారు .డోనట్లు తింటారు .దినసరి చర్యలేమీ వుండవు .
—                జనవరి లో గూస్ మూన్ వస్తుంది .బాతులు ఉత్తరం వైపు చూస్తాయి .సూర్యుడు నెమ్మది గా కనిపిస్తాడు తిరుగు ప్రయాణం లో .ఉత్తరాన గొప్ప ఆరోరా కనిపించి అద్భుతం అని పిస్తుంది .ఫెబ్రవరి లో కనిపించే చంద్రున్ని బేర్ మూన్ అంటారు .నిద్రలో వున్న నల్ల ఎలుగులు అన్నీ రెండవ వైపుకు తిరుగు తాయి .మార్చ్ లో వచ్చేదిసి ఫ్లవర్ మూన్    సముద్రం లోని జీవ జాతులన్నీ పెరగటం ప్రారంభిస్తాయి .ఏప్రిల్ చంద్రున్ని మూన్ ఆఫ్ రియల్ ఫ్లవరింగ్ అంటారు .భూమి మీద వున్నమొక్కలకు ప్రాణం వస్తుంది ..
                 మే లో హాచింగ్ మూన్ వస్తుంది .పక్షులు గుడ్లు పెడతాయి జూన్ లో సాల్మన్ మూన్ వస్తుంది .సముద్ర జలాల్లో సాల్మన్ చేపలు విపరీతం గా కన్పిస్తాయి .అక్కడ వుండే netive అలాస్కంలు చెట్టు కొమ్మలతో అదిరించి పట్టుకొంటారు జూలై లో మూన్ అఫ్ బర్త్ వస్తుంది .తీరాల్లో టెంట్లు వేసుకొని జనం చేరతారు .రద్దీ ఏర్పడుతుంది .చైతన్యం తోనికిస లాడు తుంది .ఆగస్ట్ నెలలో మొదటి పదిహేను రోజులను పదమూడవ నెలగా  భావిస్తారు .దీనికి ఇంకో పేరే ఫాట్టింగ్ మూన్ ..జంతువులూ kovvuto బలిసి వుంటాయి వీటితో వ్యాపారం బాగా చేస్తారు .సంపాదన కాలమ్ ఇదే .
                         అలాస్కా లోని  ప్రజల భాష ను చినూక్ అంటారు .దీనిలో 500 మాటలే వుంటాయి .ఇదంతా వ్యాపార పరిభాష గా వుంటుంది .దీనికి వ్యాకరణం లేదు .ఈ భాష ప్రదేశాన్ని బట్టి మారుతుంది .ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ పదాలు వచ్చి చేరు తున్నాయి .
సరదాగా కొన్ని పదాలు ,వాటి అర్ధాలు తెలుసు కొందాం.
హి-హి –అంటే నవ్వు -మనం కూడా హి హి అని నవ్వుతాము కదా .సరైన మాట.
pish అంటే చేప .–ఎఫ్ బదులు పీ వచ్చింది .ఒకరకం గా వికృతి అన్న మాట    —
హీ-హీ-house –వినోదం ఇచ్చే చోటు
ఇల్లాహీ–భూమి
hi -yu అంటే   చాలా . —
mukka a -muck – –ఆహారం —మన ముక్కా -ముడుసు లాటిదేమో ?
siwash –అంటే –ఇండియన్ —నీచుడు అనే అర్ధం లో వాడుతారు .అయ్యో రాత అక్కడా మనం నీచం గానే చూడబడుతున్నాం అన్న మాట .
tillicum   స్నేహితుడు .
                                    ఇట్లు మీ tillicum అంటే స్నేహితుడు ——గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -07 -11 –క్యాంపు —బెంగళూర్ .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కునే స్థితి లో సైంటిస్ట్ హేబెర్

     అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కునే స్థితి లో సైంటిస్ట్ హేబెర్
                           పదవ,తరగతి,ఆపైన చదివిన వారందరికీ గాలి లోని nitrogen ,hydrogen  లను ఎక్కువ పీడనం ,ఉష్ణోగ్రతల లో ఉత్ప్రేరకం సమక్షం లో సంయోగ పరిస్తే అమ్మోనియా ఏర్పడుతుందని తెలుసు .ఈ పద్ధతినే హేబెర్ ప్రాసెస్ అంటారు .దీన్ని కనిపెట్టిన వాడు హేబెర్ అనే జెర్మనీ శాస్త్ర వేత్త .ఆయన ఒక యూదు అంటె jew .గొప్ప శాస్త్రవేత్త గా పేరు .అమ్మోనియా తయారు తో కృత్రిమ ఎరువులు తయారై హరిత విప్లవానికి నాందిఅయాడు హేబెర్ .తర్వాత యుద్ధంలో శత్రునాశనానికి  విష వాయువులు కని పెట్టి ప్రయోగించాడు .సైన్యం లో అత్యున్నత పదవి పొంది యుద్ధ వ్యూహం లో ఆరితేరాడు .కానీ నాజీ ప్రభుత్వం ఏర్పడి హిట్లర్ అధికారానికి రాగానే యూదులందర్నీ ఏరి చంపేశాడు .పాపం హేబెర్ కూడా సర్వస్వం కోల్పోయి ,అనామకుడుగా ,అనాధగా మిగిలి పోయాడు .అతని జీవితం ఒక పాఠం మాత్రమే కాదు అందరికి గుణ పాఠం కూడా .ఎందుకు ,ఎలా ,ఏమిటీ అనుకుంటూ ,ఆ వివరాలు తెలుసు కొందాము .  ,
                              ముందే చెప్పినట్లు హేబెర్ బాష్ తో కలిసి అమ్మోనియా తయారు చేశాడు .దీనితో కృత్రిమ రసాయనిక ఎరువులు తయారయాయి .పంటలకు వర ప్రసాదం అయింది .పంటలు రెట్టింపు గా పండాయి. సశ్యవిప్లవ సాధనకు రాచ మార్గం ఏర్పడింది .మనం తినే అన్ని పదార్ధాలలో nitrogen వుంది .జనుము ,పిల్లి పెసర  మొదలైన మొక్కల వెళ్ళ మీద నైట్రోజెన్ స్థాపక శూక్ష్మ జీవులు౦టాయని చదువు కొన్నాం .హేబెర్ ఈ విషయాలను సూక్ష్మం గా పరిశోధించాడు .నైట్రోజెన్ వాడకం పెరిగితే అంతా మార్పే అని భావించాడు .ఆయనకు laboratory ,ఫ్యాక్టరీ ,యుద్ధ రంగాలు ఇష్టమైనవి . మార్పు తేవటం ,కొత్తది సృష్టించటం అతనికి చాలా ఇష్టం .అతను క్రూరుడు కాదు కానీ ,అతను మంచి విధేయుడు ,ఉదారుడు ,కష్టపడే వాడు ,సృజన కలవాడు .వీటన్నిటికి తగిన ప్రతిఫలాలను పొందాడు .
                         బెర్లిన్ లో piperonal అనే వాసన వేసే రాసాయననాన్ని కనిపెట్టాడు .1891 లో chemistry ,ఫిజిక్స్ ,philosophy  లలో డిగ్రీ సాధించాడు .physical chemistry నీ అధ్యనం చేశాడు .అప్పటికి జెర్మనీ లో వున్నా పదివేల మంది యూదులలో  హేబెర్ కూడా ఒకడు . ఆడవాళ్ళను అర్ధం చేసుకొనే మనస్తత్వం అతనికి లేదు .వారి విషయం లో అతని అభి ప్రాయం ఇలా వుంది
”women are like lovely butterflies to me .I admire their colours and glitter ,but i get no future ”.రంగుల సీతా కొక చిలుకలు  ఆడవాళ్ళు వారి పై మెరుగులే చూస్తాను అనే తత్త్వం ..బిస్మార్క్ అనే వాడట ”the german’s fear nothing but god ”germany     వాళ్ళు సిద్ధాంతాన్ని నమ్మితే అమెరికన్లు సాంకేతిక విధానం పై ద్రుష్టి సారిస్తారు .  చివరికి germanlu
సాంకేతిక మిలిటరీ విధానాన్ని అనుసరించారు .సృజనకు విలువ నిచ్చారు .ఆయుధమే విజయానికి కారణం గా తెలుసు కొన్నారు .ప్రప్పంచాదిపత్యం కావాలంటే జెర్మనికి ,దాని అస్తిత్వానికి ఆయుధబలమే శరణ్యం అని తెలుసు కొన్నారు .జెర్మని దేశానికి జీవిత కాల సివిల్ సర్వీసు ప్రొఫెసర్ గా వున్నాడు హేబెర్ .అతని అమ్మోనియా ప్రాజెక్ట్ వల్ల దేశం లో ప్రతి వారికి తిండి దొరికింది .ఒక రకంగా అన్న దాత అయాడు .అందరిలోనూ ముఖ్యుడయ్యాడు .తాను జెర్మని లో అతి శక్తి సామర్ధ్యాలు కలవాడిని అన్నాడు .తాను పరిశ్రమలకే ఆద్యుడు .జెర్మని మిలటరీ విధానం లోను ,ఆర్ధిక విషయాలల లోను అగ్రగామి కావటానికి తానే కారకుడనని తనకు జెర్మని లో ప్రవేశార్హత లేని ప్రదేశం లేదని , చెప్పాడు కూడా …
                         హేబెర్ తీరు తెన్నులు చూసి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ ”our entire much praised technological progress and civilization generally could be compare to an ax in the hand of pathological criminal ”అని హెచ్చరిన్న్చాడు ఇతను కనిపెట్టిన విష పదార్ధాలను గురించి తెలుసు కోని .
                 1914  లో    germani  దేశంలతో యుద్ధం చేసింది .ఫ్రాన్సు  ఇంగ్లాండ్ లతో యుద్ధం చేసింది .వాళ్ళను జయించటం కష్టమైంది .కందకాలలో వున్న శత్రువులను తరిమి వేయటం కష్టమైంది .అప్పుడు dia nisidine chloro sulphate .ఉపయోగించారు  .ఏ ప్రభావం కలిగించ లేదు .ఇదే ప్రపంచం లో మొదటి వాయు   ప్రయోగం ..తర్వాత బెంజాల్ bromide గ్యాస్ ప్రయోగించాడు .శత్రువుల కళ్ళు మండాయి .తరువాత tear దీనినే zxylyl bromide  గ్యాస్ అంటారు .శత్రు సంహారం  జరిగి జెర్మని గెలిచింది ఇవన్నీ హేబెర్ సృష్టించినవే .”హేబెర్ was fascinated .his mind latched on to the problems of gas weaponry and did not let go for the rest of the war ..అంతా ఎదిగి పోయాడు ,అంతా ముఖ్యుడైనాడు యుద్ధ వ్యూహం లో .
                         క్రమం గా మిలిటరీ సలహా దారుడై నాడు .స్వయం గా యుద్ధ రంగం లో నిలిచాడు .మిలిటరీ జనరల్ గా ఆలోచించాడు .తన మేధా సంపత్తికి ,విధి నిర్వహణను జోడించాడు .చివరికి పర్ స్యన్ ఆఫీసర్ అయాడు .autocratic and and useless in his will to victory అని   పించుకొన్నాడు . మిలిటరీ వ్యవస్థ ను నిర్వహించే దశకు పెరిగాడు .ఒక సారి ఆయన ప్రయోగ శాలలో ఒక విద్యార్ధి ప్రయోగం చేస్తుంటే అనుకోకండా ఒక గ్యాస్ ఏర్పడి ఆ విద్యార్ధి చని పోయాడు .అప్పుడు హేబెర్ కు అర్ధమైంది గ్యాస్ వే అపోన్ ఎంతటి దారుణం చేయ గలదో .అదే క్లోరిన్ గ్యాస్ .దాన్ని ట్యాంకులలో ఎక్కువ పీడనం తో నింపి బెల్జియం సిటీ లోని ఎప్రేస్స్ లోని ట్రెంచ్ లో వున్న శత్రు శైనికు లపై ప్రయోగించాడు .వాళ్ళంతా ఊపిరి ఆడక దెబ్బకి ఠా . .దీనితో యుద్ధం లో విప్లవాత్మక మార్పు వచ్చింది .గ్యాస్ నుపయోగించి శత్రు శైన్యాన్ని చంప వచ్చు అతి తేలికగా .ఈ రోజునే డే అఫ్ cypress అంటారు ఇలాంటి ప్రయోగాలు భార్య క్లారా కు ఇష్టం లేదు .వద్దు అని వారించింది .మానవాళికి చేటు అని హెచ్చరించింది .మొండి హేబెర్ వినలేదు .చివరికి ఆమె పిస్టల్  తో కాల్చుకోని ఆత్మ హత్య చేసుకోంది .  గ్యాస్ వేఅపోన్ మీద విల్ఫ్రెడ్ ఓవెన్ అనే బ్రిటిష్ సైనికుడు ,కవి ఒక కవిత కూడా రాశాడు దాని దుష్పరిణామం మీద .తర్వాత అమెరికా hydrogen cyanide గ్యాస్ ను వాడింది .దీనినే pervertion of science  గా అందరు విమర్శించారు .అయితే దీన్ని ప్స్య్చోలూగికాల్ గా చూశాడు హేబెర్ .తేలిగ్గా తీసుకొన్నాడు .           .
                  హేబెర్ అమ్మోనియా మీద రాయల్టీ బాగా వచ్చేది హేబెర్ కు . లో 1918 లో జర్మనీ ఓడి పోయింది .యుద్ధ విమానాల వాడకం అవసర మైంది .మిరచ్లె వేఅపొంస్  సాధించటం లో నిమగ్న మైంది .నోబెల్ బహుమతి పొందాడు హేబెర్ .౧౯౩౨ ఎన్నికలలో నాజి పారి అధికారం లోకి వచ్చింది హిట్లేర్ తిరుగు లేని నాయకుడయ్యాడు .యూదులను నిర్దాక్షిణ్యంగా గా కాల్చి చంపేశాడు .పదవులన్నీ పోయాయి హేబెర్ కు .అస్తిత్వానికే ఎసరు వచ్చింది .జెర్మనీ నుంచి వ్ల్లిపోఎవారికి కొంత అవకాశం ఇచ్చారు .వెళ్ళే వాళ్ళందరికీ హేబెర్ సాయం చేశాడు .తాను ఎటు తేల్చుకో లేక పోయాడు .అమ్మోనియా అమ్మకం తగ్గి రాబడి బాగా తగ్గింది .సహాయం కోసం అందర్నీ యాచించాడు ఎవరు ముందుకు రాలేదు .
స్విర్జర్లాండ్ చేరాడు .క్షయ వ్యాధి తో బాధ పడ్డాడు .శానిటోరియం లో చేరాడు  .తన భాగస్వామి బాష్ ను సహాయం చేయమని రాశాడు .వాడేమి పట్టి౦చు కోలేదు .కొత్త ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకొని వాడు మళ్ళీ సంపాదన మీద పడ్డాడు .1934 ౨౯  janavari న బాసెల్ లో చనిపోయాడు .ప్రముఖ భౌతిక శాస్త్ర వేత్త మక్ష్ ప్లాంక్ మాత్రమే అంత్యక్రియలకు హాజరైనాడు .జెర్మనీ పట్టించుకోలేదు .పేపర్ లో వార్త కూడా రాయ లేదు .మొదటి ప్రపంచ యుద్ధ కాలమ్ లో జెర్మని కి అత్యధికం గా సేవలందించిన వాళ్ళలో ప్రధముడు హేబెర్ .అలాంటి వాడికే ఇంతటి దుర్గతి .అతని బంధువులనందర్నీ గ్యాస్ చా౦బర్ లలో పెట్టి చంపేసింది నాజి ప్రభుత్వం .చివరికి విస్మృత శాస్త్ర వేత్త గా మిగిలి పోయాడు .అతని స్మ్రుతి చిహ్నం కూడా లేదు .
                   హేబర్ హీరో మరియు విలన్ .అయాడు .”german ,patriot ,a victim of naazi’s .A patron saint for guns and butter .he was the founder of the military industrial complex and the inventor of the chemistry through which the world now feeds itself ”ఇంతటి గొప్ప శాస్త్ర వేత్తకు ఇంతటి దుర్గతి ..ఆయన నిర్మించిన తూర్పు జెర్మని లోని Leuna -వేర్కే
ఆయన జీవిత సర్వస్వం .ఆ పేరు తీసేసింది నాజి ప్రభుత్వం .చివరి జీవిత కాలమ్ లో ప్రవాసి గా గడపవలసి వచ్చిది పాపం .1952  లోని   బెర్లిన్ లోని  . ”The fritz Haber institute of the Max plank society మాత్రమే మిగిలింది .
          celebration of a murderer –heber —father of gas war fare ” ani 1968  లో న్యువ శాస్త్ర వేత్తలు జర్మని లో జరుపు కొన్నారు
scientists could desclaim direct responsibility for theuse to which mankind  had put their disinterested discoveries .We feel compelled to tae a more active stand now ,because –nuclear power is fraught with infinity greater danger than were all the inventions of the past ”’అని ఫ్రాంక్ రిపోర్ట్ వచ్చింది .ఇదే కొత్త ఉద్యమం గా మారింది .
       సాంకేతిక శక్తిని the machine అన్నారు .గ్యాస్ weapons ను గ్యాస్ -troops అన్నారు . .శాస్తవేత్తలు సరాసరి యుద్ధ విధానాలలో పాల్గొన రాదు .తాము శోధించి సాధించిన విపత్కర ఆయుధాలు ,మాన వాళి వినాశకరం కా కుండా జాగ్రత్త పడాలి .లేకుంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అణు బాంబు యెంత మానవ విధ్వంసం చేసిందో గుర్తుంచు కోవాలి.
                                  మీ —గబ్బిటదుర్గా ప్రసాద్   —17 -07 -11 —క్యాంపు –బెంగళూర్ . .
Posted in రచనలు | Leave a comment