మన్నుమడ్తలు దాసుకొన్న నల్లమబ్బు

ఆంధ్రజ్యోతి లో వచ్చిన 24.10.2011. నాకు నచ్చిన కవిత

Posted in సేకరణలు | Leave a comment

గురజాడ కన్యాశుల్కం — 5 —స్త్రీ పాత్రలు

గురజాడ కన్యాశుల్కం — 5  —స్త్రీ పాత్రలు
                        అగ్నిహోత్రావధానులు పెద్ద కూతురు బుచ్చమ్మ .తల చెడింది .”మంచం మీంచి దిన్చేయ్యతానికి సిద్ధం గా ఉన్న వాడికి 1500 రూపాయలు కు ”వధువు ”పేరుతొ అమ్మబడిన పిల్ల .గిరీశం బొట్లేరు ఇంగ్లీష్ కు మురిసి ,అతనొక సంస్కారి అనినమ్మిన పల్లెటూరి పిల్ల .విధివంచిత .మధురవాణి ,సౌజన్యారావు ల సౌజన్యం తో బయట పడింది .తనకు జరిగిన అన్యాయం తన చెల్లెలికి జరుగ రాదనీ ప్రయత్నించిన సహృదయ .చెల్లెలి బలిని ఆపటానికి గిరీశం మాటలు నమ్మింది పాపం .లేచిపోవటానికి సిద్ధపడిన అమాయిక .
                       వీళ్ళిద్దరి తల్లి వెంకమ్మ .కూతురికి మొగుడు చస్తే ఎంత ఆస్తి వస్తుంది అని లేక్కలేసే అగ్నిహోత్రావధాన్ల పెళ్ళాం .పెద్ద కూతురు బతుకు బుగ్గి అయింది -అలా చిన్న కూతురుకు కాకూఅదని భావించి ఎదిరించే ధైర్యం లేక నుయ్యో గొయ్యో చూసుకుంటానని ,నిజంగానే దూకేసిన ఆనాటి వెర్రి  తల్లులకు ప్రతీక .చండ కోపిష్టి ,అపర దూర్వాసుడు నిజంగానే అగ్నిహోత్రుడు అయిన మొగుడు కొట్టినా ,తిట్టినా ,ఏ చెడ్డ నిర్ణయం ఆయన తీసుకున్నా ,నోరెత్తని ,సాహసం లేనిబానిస   బతుకు బతికింది
                   మీనాక్షి లుబ్దావధాన్ల కూతురు .విధవ .ఆమె ప్రవర్తన మంచిది కాదనిరామప్ప పంతులు మధుర వాణికి ,గిరీశం బుచ్చమ్మ కు చెప్తారు .బాలవితంతువు పక్క మార్గం పట్టటానికి కారణం బాల వైధవ్యమే .విధవా వివాహాలు ఆనాడు లేవు వయస్సులో వుంది ,శారీరక సుఖాలు తీరని యవ్వన స్త్రీ.కట్టు దాటటం సహజమే .అది వయసు చేసే పొరపాటు .అక్రమ సంబంధం ఆమెతో  పెట్టుకోవటానికి
రామప్ప పంతులికి ఇష్టమే .వివాహం మాత్రం చేసుకోడు .పైగా ఆమెను ”చెడిన ఆడది ‘అనే ముద్ర వేష్తాడు ఇంకెవరు ఆమె దగ్గరికి రాకుండా ఉండాలనే ఉపాయం తో ..
                 పూతకూల్లమ్మడీ ఇదే తంతు .వీరంతా విధి వంచితలు గా కనిపిస్తారు .ఒక్క వెంకమ్మ మాత్రం డబ్బు కాపీనం ,దుష్టపన్నాగం వున్న భర్తకు లొంగి పోయింది పైవాళ్ళు సంఘం లోని దురాచారాలకు ,కాపత్యానికి ,దుష్ట శక్తులకు బలి పోయారు .మనకు వీరందరి మీద సానుభూతి కలిగిస్తాడు గురజాడ .వాళ్ళు ఏ పరిస్థితుల్లో దారి తప్పారో ఆలోచింప జేస్తారు వారి అంతరంగాలలో పరకాయ ప్రవేశం చేసి సజీవ పాత్రలుగా మనముందు నిలబెడతాడు .అవి మట్టి బొమ్మలు కాదు .ఉప్పూ ,కారం తింటున్న మనుషులు .మనకున్నట్లే వాలకూ కోరికలుంటాయి .అవి తీరక తీర్చుకోలేక నలిగే విధి వంచితలు .బాధా సర్ప దష్టులు .
                                                                         మద్ధుర వాణి
                            కన్యాశుల్కం మణిపూస మధురవాణి .మృదు మధుర వాణి .అప్పారావు గారి తలలోంచి ఊడిపడిన గడుసు పిండం అన్నారామెను .ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలిసిన సరసురాలు .వేశ్య .ఆ వృత్తిలోనే జీవించాల్సి వచ్చిన పరిస్థితి ఆమెది ”తనను తాను రకరకాలైన మగవాల్లకీ ,విభిన్న వయసున్న వారికీ అమ్ముకుంటే తప్ప బతుకు గడవని దైన్యం ఆమెది .అందం ,తెలివి తేటలు ,సమయస్ఫూర్తి ,విద్య ,  మాటకారి తనం అన్నీ   వున్నా చెడిపోయిన ఆడది .ఆర్ధిక ,సాంఘిక ,సామాజిక భద్రత లేని ,వాటికి నోచుకోని  అభాగిని .,పతిత .గిరీశం వలలో పడిందీ ,రామపకు చిక్కిందీ డబ్బు ,గౌరవం కోసమే ..”అని ఆ పాత్రను విశ్లేషించారు
                    ఒకసారి రామప్ప పంతులుతో ”నేను డబ్బు ఇక్కడ దాచుకుంటే ,అక్కడ మాతలి కాలక్షేపం చేయటం ఎలా ?”అంటుంది .తల్లి పోషణకు ఈ వృత్తే ఆమెకు ఆధారం .ద్రవ్యాకర్షణ వున్నా సుబ్బమ్మ ,లుబ్దావధాన్ల పెళ్లి ఆపటానికి ప్రయత్నం చేసే సందర్భం లో కరటక శాస్త్రి తో ”మధుర వాణికి దయా దాక్షిణ్యాలు సున్నా అని మీరు తలచారో?మీ తోడబుట్టిన దానికి ప్రమాదం వచ్చినపుడు నేను డబ్బుకు ఆశిస్తానా ?అని చెప్పిన సంస్కారం ఆమెది .
                లుబ్దావధాన్లు చేయని నేరానికి శిక్ష పడకుండా కాపాడటానికి మగవేశం లో aantinaach అయిన సౌజన్యారావు ను కలిసింది .శిక్ష పడకుండా కాపాడింది .బుచ్చమ్మ ను గిరీశం బారి నుండి రక్షించింది .లుబ్దున్ని కాపాడటానికి తన ఫీజు గా” చిన్న ముద్దు ”ఇవ్వాలని చిలిపితనంతో షరతు మ్పెట్టింది .అయినా సౌజన్యారావు వంటి పెద్దమనుష్యులకు ”వ్రతభంగం ”చేయరాదని భావించి ”చెడని వారిని చెడగొట్టవద్దని మా అమ్మ చెప్పింది ”అని అతన్ని వరిస్తుంది .తన లిమిట్ ఏమో బాగా తెలిసిన జాణ .
                     కరటక శాస్త్రిఆమె విద్యా,సౌందర్యాలను వర్ణిస్తే ”కాపు మనిషిని పుట్టి ,మొగుడి పొలం లో వంగాలకు మేరపలకు దోహదం చేస్తే ,యావజ్జీవితం కాపాడే తన వాల్లన వాళ్ళు వుండే వారేమో ?అని చెప్పి తన వ్రుత్తి తనకు కల్పించని భద్రతకు బాధ ,విచారం పడుతుంది .ఆనాటి సమాజం లో పరస్త్రీ సంపర్కం ,సరసం ,రసికత్వం గా చెలామణీ గా వుండేది .వేశ్యను వుంచుకోవటం సమాజం లో స్టేటస్ .సింబల్ .కాని స్త్రీ తన జీవనోపాధికి శరీరాన్ని అమ్ముకోవటం ,చనువు గా వుండటం జరిగితే పతిత గా ముద్ర వేసే వారు .చీడ పురుగ్గా చూసే వారు .సౌజన్యారావు లాంటి సహృదయులు కోడా వేశ్యలను పెళ్లి చేసుకోవటానికి జంకారు .
                   కరటక శాస్త్రి ని ఆడుకోవటం లో ,మీనాక్షిని పెళ్ళిచేసుకోమని రామప్ప పంతులుకు చెప్పటం లో మధురవాణి మంచి మనసున్న ఆడది అనిపిస్తుంది .మృచ్చకటికం నాటకం లోని ”వసంతసేన’సరి జోడు అనిపిస్తుంది .రామప్ప ను నిజమైన భర్త గానే చూసింది మకాం విశాఖపట్నానికి మార్చింది .తన వ్రుత్తి లో హైన్యాన్ని ,దైన్యాన్ని,మాలిన్యాన్ని క్రమంగా గుర్తించింది .మహిళా జీవన వికాసానికి ధనసంపాదన –హేయమైన వ్రుత్తి ,అతిభోగం మార్గాలు కావు అని గ్రహించింది .
                     కరటక శాస్త్రి తన స్వార్ధం కోసం మధురవాణి ని డిప్యూటి కలెక్టర్ కు అంతగాత్తతానికి ప్రయత్నిస్తే అప్పుడామే ఎంతో నిజాయితీగా చెప్పిన మాటలు చెన్నా కోలు దేబ్బల్లాగావున్నాయి చూడండి  .”నేను వేల్లదలచుకో లేదు .ఇటుపైన ఊర కుక్కలకు ,సీమ కుక్కలకు దూరం గా ఉండ టానికి ఆలోచిస్తునాను ”ఆమె లో ఆత్మ గౌరవం ఏ స్థాయిలోకి పెరిగిందో ,చదువుకున్న శాస్త్రి బతుకు ఎంత బస్టాండ్ అయిందో తెలుస్తుంది .
            మధుర వాణి సుభాషిని ,సుమధుర భాషిని .చతుర సంభాషిని ,చమత్కార వాహిని .వేశ్యాల్లో కూడా ఉన్నత లక్షణాలు ,లక్ష్యాలు ,లాలిత్యం ,గాంభీర్యం ,కరుణ,మానవత్వం ఉంటాయని నిరూపించిన వేశ్య శిఖామణి మధుర వాణి .ఆమె ను వేశ్యగా చూసినందుకు మనం సిగ్గు తో తల vanchukovaalemo >సంజీవదేవ్ ”మధురవాణి ఆస్థి ,చర్మ ,రక్త మాంస శరీరం లో మేఘాలమీది ఇంద్రధనుస్సును ప్రత్యక్ష పరచాడు గురజాడ ”అన్న మాట అక్షర సత్యం .
” కన్యాశుల్కం లో పాత్రలన్నీ మానస శిఖరాలే వాటిలో మధురవాణి మహోన్నత శిఖరం .ఈనాడు మనం ఎంత అభివృద్ధి సాధించినా ఆకాశం కాంతితో వున్నా భూమిమీద శాంతి కరువైంది .మధురవాణి పదును గల మేధావి గా సరళమైన రసజీవిగా మలిచారు నిపుణ సాహితీ శిల్పి గురజాడ .సున్నిత వైవిధ్యాలకు ,చురుకైన వైరుధ్యాలకు ఆమె నికేతనం -వ్యక్త జీవితం లోని గుప్త జేవితం మధుర వాణి ”
అన్న రసరేఖల సంజీవ దేవ్ రసహృదయం మధుర వాణి సరసహృదయాన్ని రసమయం గా ఆవిష్కరించారు
                                                  సశేషం
                                                              మీ  — గబ్బిట దుర్గా ప్రసాద్ -24 -10 -11
Posted in రచనలు | 1 Comment

కలాసాక్షి లేపాక్షి 64 కళలు – అక్టోబర్ సంచిక

http://64kalalu.com/samskruthi

64 కళలు లో

Posted in రచనలు | Leave a comment

గురజాడ కన్యాశుల్కం –4

గురజాడ  కన్యాశుల్కం  –4
                అంపశయ్య నవీన్ అంటే స్ట్రేం  of consciousness  గుర్తుకు వస్తుంది దీన్నే తెలుగు లో చైతన్య స్రవంతి  అంటారని అందరికి తెలుసు .ఆయన కన్యాశుల్కాన్ని estimate చేస్తూ ”ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా టాకు టాకీ  అన్యులమనముల్నొప్పించక  తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ ”లా మనమనస్సుల లో సుప్తచైతన్యం లో దాగిన అనేక ప్రవ్రుత్తుల్ని గిరీశం ద్వారా బహిర్గాతమయాయి .అందుకే గిరీశం అందరి హృదయాలలోనూ పలుకు తాడు .”అన్నారు .గురజాడ లో కూడా ఇలాంటి ప్రవ్రుత్తి తనలో అణచబడి వుండాలి.ఆయానా వ్యక్తిత్వం లో ఒక భాగమే గిరీశం .అన్నాడాయన .ప్రముఖ విమర్శకుడు ఆర్.ఎస్ .సుదర్శనం ”గిరీశం పాత్రలో హాస్య రసానుభూతి పొందాలంటే నీతి అనే కొలబద్దను తాత్కాలికం గా నైనా పక్కకు పెట్టాల్సిందే .అప్పుడే గిరీశం మాటలు ,సమయస్ఫూర్తి ,మనకు ఆహ్లాదం కలిగిస్తాయి ”అని వివరించారు .పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకున్న ఉబలాటం వున్న నాటి యువకులకు అతను ప్రతీక .అతనికి ఆర్ధిక స్తోమత లేదు .ఏది సంపాదిన్చాలన్నా అడ్డదారే గతి అనుకొన్నాడు .ఎదుటి వాడిని మాటలతో బురిడీ కొట్టించే వాక్చాతుర్యం వుంది ..అందుకే ”నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్  ”అన్నాడు అంత ధైర్యం గా .అది డబ్బా కొట్టటం కాదు తనకు ఆ శక్తి వుందని చాటి చెప్పటమే .మధురవాణని ”It is that seduces all mankind ”అన్నాడు .బుచ్చమ్మ ను చేసుకోవాలనే కోరిక లో స్వార్ధం తో పాటు పరార్ధం కూడా వుంది .చాందస కుటుంబం లో పుట్టిన గిరీశానికి తన కాలమ్ కంటే ముందు ఆలోచించే శక్తి వుందని తెలిపాడు .ముక్కు పచ్చలారని సుబ్బమ్మకు ,ముసలి లుబ్దావదాన్లతో పెళ్లి జరగబోతోందని తెలిసి ఆపటానికి గట్టి ప్రయత్నమే చేశాడు .బుచ్చమ్మ ను లేవదీసుకొని వెళ్తే సుబ్బి పెళ్లి ఆగిపోతుందని ప్లాన్ వేశాడు .సుబ్బికి లుబ్దునికి పెళ్లి ఆపటం లో తన స్వార్ధం వున్నా దాన్ని తప్పించి తన స్వార్ధం కోసం వాడుకున్నాడు .
                       ప్రతి పరిస్థితినీ తనకు అనుకూలం గా మలుచుకున్న నేర్పు అతనిది .అయితేనేమి చివరి సీన్ లో కధ అద్దం గా తిరిగింది .దామిట్ అన్నాడు దాన్ని .సౌజన్యా రావు పంతులు దగ్గర తనను ”నెపోలియన్ ఆఫ్ అంటి నాచ్ ”అని డబ్బా కొట్టుకున్నాడు .అక్కడే పప్పులోనూ ,తప్పులోను కాలు వేశాడు .అతి తెలివి తేటలతో బొక్క బోర్లా పడ్డాడు .తాను వేశ్య మధుర వాణిని ఉంచుకున్న సంగతి పంతులు గారికి తెలీదనుకున్నాడు పాపం .బయటపడటానికి ,ఆయన్ను ప్రసన్నం చేసుకోవటానికీ చివరి ప్రయత్నం చేశాడు ”కొంత కాలమ్ కింద గిరీశం అనేఫూలిష్యంగ్యంగ్   మ్యానోకడు ఉండేవాడు .మధురవాణి అనే బ్యూటిఫుల్  యంగ్ నాచ్ డెవిల్ ఒకటి వుండేది .వాడి దురదృష్టం వల్ల దాని వలలో చిక్కి ,మైమరచి ,అంధకారం లో పడిపోయిన మాట వాస్తవం .గురువుల ఉపదేశం కొంతకాలానికి జ్ఞప్తికి తెచ్చుకొని ,ఆ అంధకారం లోంచి వెలువడి ,గురువుల పాదములు చేరుకొని ,గతం కళగా భావించి మంచి తోవలో పడ్డాడు .ఆ గిరీశమే ఈ గిరీశం ,ఆ మధుర వానే ఈ మధుర వాణి ”అంటూ పశ్చాత్తాపం తో చెంపలు వేసుకోన్నట్లు నటించి బయటపడాలని పాచిక వేశాడు .తనను క్షమించి ఉచ్చమ్మ తో పెళ్లి చేయించమని కోరాడు .మంచిగా బతకటానికి అవకాశం ఇవ్వమని కోరుతాడు .”నా వంటి sinners   కు సాయం చేసి  సహాయం చేసిమంచ్చ్చచ్చ్చ్చి వాళ్ళను చేయటంతమకు బిరుదు కాని బతుకు చేరచటం న్యాయం కాదు ”అని ములగచెట్టు ఎక్కిన్చాలనుకొన్నాడు .ఆవులిస్తే పేగులే కాదు అన్నీ లెక్కించే నేర్పున్న ఆడు సౌజన్యా రావు పంతులు గారు .”ఎంనేల్లయిన్దేమిటి చీకటి లోంచి వెలుగు లోకి వురికి ?”అని అడిగితే చెప్పలేక తబ్బిబ్బయి ”ఎన్నాల్లయితే నేమండీ ట్రూ రిపెంటేన్స్ కు త్వేంటి ఫర్ అవర్స్ చాలదా ”అని బుకాయించాడు .ఆయన క్ష్మించలేదు ఈ ఆషాఢ భూతిని .బుచ్చమ్మనుపూనా లో  విడోస్ హోం లో చేర్పిస్తాడు .ఆమె చదువుకు ఏర్పాట్లు చేస్తాడు .చదువు అయింతర్వాత ఆమె ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకొంటుంది అని వివరం గా చెప్పాడు .గిరీశాన్ని కూడా కాలేజి లో చదివి పైకి రమ్మని సలహా ఇచ్చాడు .ఇకనుంచైనా మంచి బుద్ధితో మెలగమని ఆదేశిస్తూ ”తక్షణం ఇంట్లోంచి ఫో ‘అని అని గెంటేశాడు .అప్పుడే famous quotation ”కధ అడ్డం తిరిగింది ‘  ‘అంటూ గిరీశం వెళ్ళిపోతాడు .విధవా వివాహాలను ప్రోత్చాహించాల్సిందే .కాని గిరీశం లాంటి కపటులకు వారిని దూరం చేయాలి .వీరి కుహనా సంస్కరణ లనుంచి వాళ్ళను కాపాడాలి .అందుకే పంతులు గారు ”త్వేంటి ఫౌర్ హౌర్స్ లో వచ్చిన రేపెంతెన్సు ట్రూ రేపెంతెన్సు కాదు .అది నిలబడాలి .అతని కాలమీద అతను నిలబడాలి .బుచ్చమ్మ కూడా ఈ లోపల ప్రపంచాన్ని అర్ధం చేసుకుంటుంది .కావాలంటే అప్పుడే పెళ్లి చేసుకో వచ్చు .ఇలా ఒక అర్ధవంతమైన ముగింపు ఇస్తాడు గురజాడ .గిరీశం మాట్లాడిన మాటల వెనుక గురజాడ హృదయం వుంది అంటారు నవీన్ .
                                                        సశేషం
                                                                        మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –13 -10 -11
Posted in రచనలు | Leave a comment

గురజాడ కన్యా శుల్కం —3

                గురజాడ కన్యా శుల్కం —3
                          ”చూసే కల్లున్నవారికి ,చూడగల మనసున్న వారికి ,కన్యాశుల్కం techni కలర్ లో కనిపిస్తుంది .అదొక అక్షయ తూఈరం .తరగని పంట .in between lines చాలా వుంది వ్యవహారభాషను రంయాతిరమ్యం గా మలచిన శిల్పం .ఈ క్ర్శిలో సంఘోద్ధరను మించి సాహిత్యోద్ధారణ జరిగింది ”అంటారు ప్రఖ్యాత రచయిత ,పత్రికా సంపాదకులు స్వర్గీయ పురాణం సుబ్రహ్మణ్యశర్మ  .1915 లో గురజాడచని పోయినా   1915 తర్వాతే జీవించటం ప్రారంభించాడు  అన్నారు కృష్ణ శాస్త్రి గారు .”వాడుకభాష కు ఇంతటి గౌరవం సంపాదించి పెట్టింది గురజాడే .కులాలకూ ,మనః ప్రవృత్తులకు చెందిన ఎందరో వ్యక్తులు నిత్యజీవితం లో తాము ఎలామాట్లాడుతారో అలాగే కన్యాశుల్కం లో మాట్లాడతారు .కృత్రిమత కన్పించాడు .అందుకే కాన్యాశుల్క రచనకు ప్రేరకమైన భాషా సంస్కరణ సృష్టి ఆ నాటకం లో
మహోనాహం గా వుంది .”అంటాడు ఆరాధనా భావంతో శ్రీ శ్రీ.
                                                                 పాత్రల మనో విశ్లేషణ —గిరీశం
                 ఇంత గొప్ప నాటకం ఇంత చిరస్మరణీయం గా నిలిచింది అంటే పాత్రలన్నీ సజీవాలై వుండటం వల్లే .వాటికి ఒక లక్ష్య నిర్దేశం ,గమ్యం వుండటం సామాజిక స్థితిని ప్రతిబిమ్బించటం ఆ పాత్రలు ఎలా ప్రవర్తిన్చాయో చూద్దాం .పాత్రల స్వభావం తెలియజేసే విధం గా పేర్లు పెట్టాడు గురజాడ .పీనాసితనం మూర్తీభవించిన వాడిని లుబ్ధావధానులు అనీ ,చాన్దాసం కోపం ఉద్రేకం వున్న వాడిని అగ్నిహోత్రావధాని అనీ ,కరణపు తెలివితేటలున్న లితిగతిఒన్ చక్రవర్తికి రామప్ప పంతులు ,ఆయన చేతిలో మోసపోయిన మీనాక్షి ,అమాయకత్వానికి మారు పేరైన బుచ్చమ్మ ,కుహనా సంస్కరణ వాది గిరీశం మంచి మాట కారీ అందర్నీ రేమోతే కంట్రోల్ తో ఆడించిన మధురవాణి ,పేర్లన్నీ తగినట్లు పెట్టాడు .ఆ పాత్రలే నేటికీ మనకు సమాజం లో కనిపిస్తున్నాయి ఆనాడే పోలీసులు కొట్టే దెబ్బల సంగతి చెపాడు గురజాడ .అవి ఈనాడూ ,వికృతం గా మారి ,థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ .లూ ,లాకప్ మరణాలు ఎన్కౌంటర్లు గా మార్పు చెందాయి .”నేషనల్ కాంగ్రెస్ గురించి లెచ్తురె ఇస్తూ ,వాళ్ల వోరి హెడ్ కానిస్తాబుల్ని ఎప్పుడు బదిలీ చేస్తారు అని అడుగుతాడు పోలీసు .ఈనాడు కూడా వ్యవస్థకు వ్యతిరేకం గా మాట్లాడిన వాడి గతి అంతే కదా .నూరేళ్ళు దాటినా తీరు లో మార్పు లేదు .కన్యాశుల్కం పోయింది కాని వరకట్నం దాని స్థానం లో రాజ్యమేలుతోంది .అప్పుడు ,ఇప్పుడు ఈ బాధలకు గురి అయింది స్త్రీ ఏ. కనుకనే కాలాన్ని దాటి కన్యాశుల్కనాటకం బతుకు తోంది .
                        కన్యాశుల్క నాటకం లో కధానాయకుడు లేదు .కాని గిరీశమే అందరి మనసుల్ని లాగేసే పాత్ర .సమాజం లోని కపట ప్రవర్తనకు ,కుహనా సంస్కర్తలకు నాయకులకు సజీవ ప్రతీక  .మొదటి స్సీన్ లోనే దర్శనం ఇస్తాడు .తనను తాను పరిచయం చేసుకుంటాడు .సంస్కరణ ఉద్యమాలలో ఫలితాన్ని సొంతానికి వాడుకునే ”ఆశాధభూతి ‘గిరేశం .బొంకులదిబ్బ దగ్గర పరిచయమవుతాడు మనకు .ఇరవై రూపాయలు డాన్సింగ్ గాళ్ కోసం ఖర్చుపెట్టిన వేశ్యాలోలుడు .పోతకూల్లమ్మకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టే సిద్ధహస్తుడు ..”వెంకుపంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసిన జులాయి  .శిష్యుడు వెంకటేశానికి పాఠాలు చెప్పకుండా చుట్టకాల్చటం నేర్పిన కొంటె గురువు .ఒకరకం గా గిరీశానికి miniyeture వెంకటేశం .గిరీశం శిష్యరికం లో అబ్బిన దుర్వ్యసనాలు ,అగ్రహారపు జిద్దుతనం పోత పోసిన విగ్రహం వాడు .బ్కదుద్ధాయిలా కన్పించినా అవసరం వస్తే గురువుకి     మించిన శిష్యుడే .  ఇలాంటి శిష్యుల్ని తయారు చేసిన కపట సంస్కర్తల నిజ స్వరూపాన్ని గిరీశం గా మనకు ముందే పరిచయం చేసి జాగ్రత్త అని చెప్పకనే చెప్పాడు .”బుచ్చమ్మ లాంటి యంగ్ విడోలు సమాజం లో ఉండాలంటే విదోమారేజీలు జరపాలి ట .ఈ ఉద్యమం నడపాలంటే ఇన్ఫాంట్ మారేజీలూ ఉండాలట .”విధవా వివాహమే నాగరకతకు నిగ్గు అయితే బాల్యవివాహాలు లేకపోతే నాగరకత ఆగిపోతుందట ”అని మోకాలికి బట్టతలకు ముడివేసి వాదిస్తాడు .ఇదో కొత్త discovery . ”కన్యాశుల్కం లేని మారేజీ ఈ భూప్రపంచం లో లేదు అని వెంకటేశం తో వాదిస్తాడు .బుద్ధిని నాలుకను ఎలాగయినా మలచగల నేర్పరి .
             ”లుబ్దావధాన్లు ముసిలాడు .బంగారప్పిచ్చికాసు .రెండేళ్లలో బాల్చీ తన్నేస్తాడు .దాంతో నీ చెల్లెలు రిచ్ విడో అవుతుంది నువ్వు పెద్దవదివై దానికి విదోమారేజి చేసి శాశ్వతమైన కీర్తి సంపాదించవచ్చు ”అని వెంకటేశానికి క్లాస్స్ పీకుతాడు .”The widow ”అనే కవిత లో తనభావాలను ఆవిష్కరిస్తాడు .
తన అమర ప్రేమను వెల్లడిస్తాడుi.చివరలో I love the widow however she be –married again or single be ‘
”ఈ విడో బ్యూటీ చొస్తే ఏమీ తోచకుండా వుంది .అయితే ఇది చెప్పినత్లుఅల్ల వశమయ్యేది కాదు .పాథ దస్తాలెం పనికి రావటం లేదు .నా experience ,శృంగార చేష్టలు ,గుడ్డిగావ్వంత కోడా పనిచేయటం లేదు .దీనికి లవ్ సిగ్నల్స్ రామ రామా ఏమీ తెలియవు .దీన్ని చూసిందగ్గర్నుంచి టౌన్ లవ్ అన్నా డాన్సింగ్ గాళ్ ఆ అసహ్యం వేస్తోంది .మధురవానికీ ఈ మనిషికీ కంపారిజన్ ఉందా ?అది రంగు వేసిన గాజు పూసా .ఇది ప్యూర్ డయమండ్ .దీనిని చెదగోత్తతానికి ప్రయత్నం చెయ్యకూడదు .చేసినా సాగేది కాదు .కనుక కొత్తదారీ ,కొంత న్యాయమైన దారీ తొక్కాలి .homely is the best way . మాయోపాయం చేసి దీన్ని లేవదీసుకొని పోయి విడో మారేజీ చేసుకుంటే నట్టాయినా కీర్తి సుఖం దక్కుతాయి ”’అని పాచిక వేస్తాడు .ఆమెను వివాహం చేసుకోవటం వల్ల వచ్చే లాభాలు ,నష్టాలు బెరీఎజు వేసుకొంటాడు .ఇకాడే నిజమైన స్సంస్కర్త హృదయాన్ని ఆవిష్కరించాడు .”బుచ్చమ్మ లాంటి అమాయకపు పిలను ఒప్పించి పెళ్లాడితే మజా ప్రయోజకత్వం కానీ రెండేసి మూడేసి సంతానాలు కలిగి తురకదితోనో దూదేకులాదితోనో లేచిపోవటానికి సిద్ధం గా వున్న దండుమున్దల్ని పెళ్ళాడడం విడో మారేజీ అనిపించుకోదు ..అది దొంగముండా మారేజీ ”అదీ గిరీశం ఆదర్శం .మహోన్నతాభిప్రాయం ,చమత్కారంకూడా .ఈ మాటలతోనే బుచ్చమ్మ అతని వలలో పడింది .అందుకే గిరీశాన్ని ఒక లవబుల్ స్కౌంద్రల్ అన్నారు .అప్పారావు గారి ఊహకు మించి పెరిగిపోయాదన్నారు .”Gireesham must have taken the author imself by storm and argued and bluffed his way into the drama ‘అని తేల్చారు ప్రముఖ విమర్శకులు శ్రీ ఎస్ .వై .ఏం స్వామి .
Posted in రచనలు | Leave a comment

గురజాడ కన్యాశుల్కం —2

గురజాడ కన్యాశుల్కం —2
                   తెలుగు లో ఆధునిక యుగం కీ.శ.1800 నుంచి ప్రారంభం అయింది .1800 –1850   కాలాన్ని బ్రౌన్ యుగం అనీ ,1850 నుంచి 1900  కాలాన్ని వీరేశాలింగాయుగం అనీ 1900 —1915 వరకు ఉన్న కాలాన్ని గురజాడ యుగమనీ అంటారు .అంటే గురజాడ యుగపురుషుడు .బాలా వితంతువుల దుర్భర జీవితం ,కన్యాశుల్కం బిల్లు విఫలత ,శిధిల సామాజికి స్థితి ,విజ్రుమ్భించిన వేశ్యావృత్తి ,గురజాడను కన్యాశుల్క రచనకు ప్రోత్చాహించాయి .”నేను రచయితను కావాలనుకోలేదు ”అన్న గురజాడ రాజు గారి ప్రేరణతో తెలుగులో రచన ప్రారంభించాడు .అప్పటికే విశ్వ సాహిత్య పరిచయం వుంది .సాంఘిక దురన్యాయాలను వ్యతిరేకిన్చాతానికి ప్రజాభిప్రాయం కొద గట్టాలి అందుకు నాటకమే సరైన ప్రక్రియ అని భావించాడు .కదా వస్తువును హాశ్యం తో మేళవించి ,సమశ్యను వివిధ కోణాల్లో చిత్రించటం ,పరిష్కారం సూచిన్చాకుండా ప్రజలకే వదిలేయటం ఆయన మార్గం .ఈ నాటకంనూటైరవై ఏళ్ళ చరిత్ర అలిగి వుంది .దీన్ని కన్నడం ,తమిళం ,ఇంగ్లీష్ ల లోకి రష్యన్ భాష లోకి హిందీ లోకి అనువాదం జరిగింది .”కన్యాశుల్కం భూమిక గా ,బాల్యవివాహాలు ,విధవా పునర్వివాహాలు వేశ్యాసమస్యాల సోపానం తో గురజాడ నిర్మించిన మహాసౌధం కన్యాశుల్కం ”అనారు విశ్లేషకులు .ఈ సౌద నిర్మాణానికి సంఘ సంస్కరణ ,భాషా సంస్కరణ ,ఉత్తమ నాటక సృష్టి మూల స్తంభాలు .
                           సామాన్య జనానీకానికి తనభావాలు చేరాలంటే వాళ్ళ వ్యవహారిక భాష లోనే రాయాలి .కనుక మాండలీకాల స్ఫూర్తి కలిగించాలి .మాటలతో గాయాలు చేయకుండా సుతి మెత్తని హాశ్యం తో గిలిగింతలు పెడుతూ ,ఆలోచిమ్పజేయాలి .తానూ భావించిన లక్ష్యాలకు లక్షణం గా నాటకాన్ని తెర్చిదిడ్డాలి అని గురజాడ ఆలోచించి ఆచరించాడు .”నాది ప్రజల ఉద్యమం ‘అన్నాడాయన .అందుకే ”ఆధునిక తెలుగు నాటకకానికి కన్యాశుల్కం ప్రామాణికం ”అని అంటాడు ,నటుడు రచయిత ప్రయోక్త ,విమర్శకుడు కాకరాల .కర్చీఫులు ,కొంగులు తడిసి పోయేట్లుఏది పించ రాదు అన్యాయాల మూలాలు అందించాలి  వాటిపై ప్రజలు ఆలోచించాలి అని గురజాడ ఆరాటం .”నేను మితమైన మిత వాదిని ,మితమైన అతి వాదిని ”అని తనను ఆవిష్కరించుకున్నాడు ..౧౯౦౮ లో మద్రాస్ లో జరిగిన కాంగ్రెస్ సభలకు హాజరైనాడు .జాతీయభావాలు ఆకళింపు చేసుకున్నాడు .అప్పటికే 19 వ శతాబ్దపు కవులు కొందరు దేశభాషలలో రచనలు చేశారు .గురజాడ జాతీయోద్యమ స్ఫూర్తి తో ”ముత్యాల సరాలు ”అనే స్వీయ ఛందస్సులో రచనలు చేశాడు .”మేలుకొలుపుల కోడి కూసేనాను ”అనీ ,”చదల చీకటి కదలబారెను ”అనీ కొత్త గోతుకతో మేలుకొలుపులు చేశాడు .అదే సమయం లో ఆంద్ర దేశం లో సురెంద్రనాద్ బెనర్జీ సుడిగాలి లా తిరిగి ఉపన్యాస ఝారితో ఉత్తేజితులను చేశాడు ”ఎల్లలోకము ఒక్క ఇల్లై -వర్నభేదములేల్ల కలి ,మమతలన్న్యు మాసి పోయి జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును ”అని అంతర్జాతీయ స్పృహను కలిగించాడు .మరి తాను రాసే కన్యాశుల్కనాటకం ఆస్తాయికి తగ్గరాదు ,దానిని మించి ఉండాలన్న తపన చెందాడు .అందుకే ఆయన హృదయపు లోతులోంచి కన్యాశుల్కం అచ్చమైన నీల ముత్యం లా ప్రభాసించింది అంటారు విమర్శకులు .”జీవితం లోంచి పుట్టుకొచ్చింది ,జీవితాన్ని వ్యాఖ్యానించింది సమాజ రుగ్మతకు శస్త్ర చికిత్చ చేసింది వాస్తవికతనుప్రతిబింబింప జేశింది .తన నాటకానికి నైతిక ప్రయోజనం వుందని గురజాడే తెలిపాడు .
                 ఒంగోలు లోని తన మిత్రుడు ముని సుబ్రహ్మణ్యానికి ఈ విషాలన్ని పూసా గుచ్చినట్లు లేఖ లో తెలిపాడు .పాత్రోచితమైన భాష ,జీవకళ ఉట్టిపడే పాత్రలు ,సులభమైన భాషా ,తేలికైన శైలీ ,భావగర్భిత పదజాలం ,చమత్కార కల్పనలతో నాటకానికి సమగ్రత్వం తెచ్చారు .”ఆయన ప్రతిభా సర్వస్వం ప్రతిఫలించిన అద్భుత మని దర్పం కన్యాశుల్కం ”అంటారు అందుకనే .”రాబోయే యుగం రూపు రేఖలు ,రాబోయే సమాజ స్వరూపం ,స్వహావాం ,రావాల్సిన మార్పులు ,చేయాల్సిన చేర్పులు తెలుగుభాషకు అవసరమైన చర్యలు ఉత్తమ , మానవ సమాజ స్థాపన ”ఇందులో అనిపిస్తాయి,ప్రతిబింబిస్తాయి .
                     సంస్కృతరూపకాలలో   శూద్రక మహాకవి రాసిన మ్రుత్చాకటికం ఎంత విశిష్ట మైనదో ,తెలుగులో కన్యాశుల్కం అంత గొప్పది . రెండూ సామాజిక ఇతి వృత్తం కలవే లోక వృత్తం వుంది .సామాన్యులే పాత్రధారులు .అభ్యుదయ వాదుల దృష్టి లో ఆ రెండూ ఉత్తమ నాటకాలే .అని మహాకవి శ్ర్రీ శ్రీ కి భావకవి అబ్బూరికి అనిపించాయి .
                       ప్రపంచనాటక రంగం లో గురజాడతో పోల్చదగిన వారు ఎవరైనా వున్నారా అని ఆలోచిస్తే జర్మనీ నాటక రచయిత HOSTMAN  కనిపిస్తాడు .ఇద్దరు ఒకే సంవత్చారం అంటే 1862 లో జన్మించారు . కన్యాశుల్కానికి ముందు తెలుగు దేశం లో ఏ పరిస్థితులు వున్నాయో జర్మని లోనూ అవే పరిస్థితులున్నాయి .HOSTMAN ”THE WEAVERS “‘ .అనే నాటకాన్ని రాసే వరకు సామాన్య మానవుడిని ఎవరూ అక్కడ పట్టించుకోలేదు .ఏ రచయితా వాళ్ళ జీవితాలపై రచన చేయ లేదు .వెట్టిచాకిరీ చేసే సామాన్య నేత కార్మికుల కరుణామయ గాధను నాటకీకరించి ,ప్రజాదరణ పొందాడు .గ్రామీణ ,ప్రాంతీయ వ్యావహారిక భాషను హోస్త్మన్ వాడి నాటకాన్ని సామాన్యుల దగ్గరకు చేర్చాడు .దాదాపు గురజాడ ,ఆయన ఒకే సమయం లో ఈ నాటకాలు రాశారు .ఒకరికొకరు తెలియరు .ఒకరి నాటకం ఇంకొరు చదివే అవకాశమూ లేదు .ఆయన  కూడా  సామాన్యులేనా  నా యకులు అన్నాడు .అందులో నాయకులు అంటే హీరో ఎవరు లేరు.  హోస్త్మన్ ,గురజాడలు ఆధునిక నాటక రంగానికి మరపు రానిమనీషులు  .ప్రగతిపద కేతనం ఎగరేసిన వీరులు .ఈ విషయమంతా అబ్బూరి రామ కృష్ణా రావు గారు తెలియ జేస్తూ ”ఎన్ని నేరజాడలున్నా గురజాడకు సాటి రారు ‘అని కితాబు ఇచ్చారు .
                                                                సశేషం
                                                                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

గురజాడ కన్యాశుల్కం —–1

గురజాడ కన్యాశుల్కం —–1
                          నవయుగ వైతాళికుడు ,తెలుగు జాతి కి మహోదయాన్ని తెచ్చిన వేగుచుక ,యుగపురుషుడు గురజాడ వెంకట అప్పా రావు కన్యాశుల్క నాటకం గురజాడ అపూర్వ సృష్టి .ఈ నాటకాన్ని 1892 ఆగస్ట్ 13 న   జగ్కన్నాధ విలాసినీ నాటక సమాజం వారు మొట్టమొదటి సారిగా విజయనగరం లో ప్రదర్శించారు .ప్రజలంతా తండోప తండాలుగా వచ్చి చూశారు .చాలా బాగుందని మెచ్చారు .పౌరాణిక నాటకాలతో విసిగి పోయిన వారికి ఒక గొప్ప రిలీఫ్ ను ఈ నాటకం ఇచ్చింది .అందులోని పాత్రలన్నీ నిజజీవితం లోనివి అవటం ,భాష సజీవం గా వుంది విజయనగర మాండలీకాన్ని ఉపయోగించటం జనానికి నచ్చింది .ప్రదర్శన్ అత్యద్భుత విజయం .ఈ నాటక ప్రదర్శన పై విజయనగర ఆంగ్ల పత్రిక ”The telugu harp ”ఆంగ్లం లో ”కన్యాశుల్కం రచనలో ,ఆంద్ర నాటక సాహిత్యం లో ఒక సరికొత్త పద్ధతి,కొత్తమార్గాన్ని ప్రారంభించిందనీ ఇతివృత్తం తో మన కళ్ళ ఎదుట జర్గే సంఘటనల్ని ,మనం రోజూ చూసే మనుషుల్ని గొప్ప గా పాత్రలుగా చిత్రిన్చారానీ సన్నివేశ కల్పన ,హాస్యరస పోషణ తో పాటు చిత్రీకరణ ,characterization  చాలా బాగా వుంది ”అని ప్రశంశించింది
                      ఆ తర్వాత అనేక నాటక బృందాలు కన్యాశుల్కాన్ని ప్రదర్శించాయి .శ్రీ స్థానం నరశింహారావు గారు వంద సార్లు ప్రదర్శించి నట్లు చెపారు .శ్రీకులం నటరాజ సమితి 350 కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు .అబ్బూరి రామ కృష్ణా రావు గారు కూడా 100  ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు .ఆయనే ”కన్యాశుల్కం నేడే కాదు రేపతికోడా ఆడదగిందీ ,చూడ దగిందీ ”అన్నారు .నటరాజ కళాసమితి వారు వారు జే.వి.సోమయాజులు రామప్ప పంతులుగా ,ఆయన తమ్ముడు రమణమూర్తి గిరీశం గా నటించి ,నాటకానికి మంచి సౌష్టవం ,పేరు ,ప్రఖ్యాతులు తెచ్చారు .వీరిదరు ఆ తర్వాత సినిమా నటులూ అయారు .అయినా వీలు దొరికి నప్పుడల్లా నాటకాన్ని ప్రదర్శించే వారు .కన్యాశుల్కానికి వందేళ్ళు వచ్చిన సందర్భం గా 1992 జూన్ 27 న విశాఖపట్నం లో గొప్ప ప్రదర్శన ఇచ్చారు .ప్రేక్షకులు విపరీతం గా మెచ్చి మర్నాడు కూడా నాటకం వేయమని కోరితే వేసి ప్రేక్షక దేవుళ్ళ మనోభీష్టాన్ని నెరవేర్చారు సోమయాజులుసోదరులు . . గిరీశం లోని ఆశాధభూతిత్వాన్ని లౌక్యాన్ని రమణమూర్తి రక్తి కట్టించారు .సంహాశానలను చాలా సహజం గా పలికి,modulation  తో జనఃరుదయం గెలిచారు గిరీశం అంటే రామనమూర్తే వేయాలి అనిపించారు .ఆయన హావ ,భావ ప్రకటనకు ముగ్దులయారు జనం .సోమయాజులు రామప్ప పంతులుగా దామ్బికాన్ని ,భేషజాన్ని ,జాకాల్ తత్వాని బహు ప్రశంశనీయం గా నటించి జీవించారు .వీరిద్దరి combination ఆ రోజుల్లో అదుర్స్ అనిపించేది ..
                    ప్రముఖ రంగస్థల నటుడు ,ఆంద్ర విశ్వ విద్యాలి నాటక రంగ దర్శకులు స్వర్గీయ కత్తుల వెంకటేశ్వర రావు radio  లో కన్యాశుల్కాన్ని ఆకర్షణీయం గా వేసి మెప్పించాడు .తాను గిరీశం పాత్రధారణ చేశాడు .విజయనగారమాన్దలికాన్ని అర్ధవంతం గా పలికే నేర్పు ఆయనకు బాగా వుండేది .నటనలోగొప్ప ease  వుండేది  .
                 ఆ కాలమ్ లో కన్యాశుల్కాన్ని మూడు గంటల పాటు ప్రదర్శించేవారు .నాటకాన్ని కుదించటం వల్ల ప్రయోజనం దెబ్బతింటోంది అనే భావన కలిగింది చాలా మందిలో .అందుకనే నూరేళ్ళ పండుగ నాడు 1992  నవంబర్ లో నాటకాన్ని 49 మంది కళాకారులతో ,తొమ్మిది గంటల పాటు ప్రదర్శన్ జరిపారు .అది ఒక గొప్ప అనుభూతి గా మిగిలి పోయింది .కన్యాశుల్కాన్ని ఒకే వేదిక మీద కంటే ,వేదికల సముదాయలపై ప్రదర్శిస్తే ఇంకా గొప్ప గా ఉంటుందనే ఆలోచన వచ్చింది .డ్రామా అండ్ సౌండ్ విభాగం వారు ”రూప వాణి ”(లైట్ అండ్ సౌండ్ )ద్వారా ప్రదర్శిస్తే అనుభూతి గొప్పగా ఉంటుందని భావించి ప్రఖ్యాత నటులు ,పత్రికా రచయిత శ్రీ ఏ.ఆర్ .కృష్ణ నాటకం గా మలిచి ప్రదర్శించి మంచి ఫలితం సాధించారు .అప్పుడే నాటకం చోశామన్న సంతృప్తి కలిగింది అందరికి .కన్యాశుల్కం సినిమా గా కూడా వచ్చింది యెన్.టి .రామా రావు గిరీశం గా ,సావిత్రి మధురవానిగా ,సి.ఎస్ ఆర్ .రామప్పపంతులుగా ,నాటక రంగస్థల ,నటుడు రామప్పపంతులు నులక అగ్నిహోత్రావధానులు గా ,గోవిందరాజుల సుబ్బా రావు లుబ్దావదానులుగా ,జానకి బుచ్చెమ్మ గా నటించిన ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించి అందరినుంచి మంచి నటన రాబట్టారు .”చిటారు కొమ్మన మిథాయి పొట్లం ”పాట ,శ్రీ శ్రీ రాసిన ”ఆనందం అ అర్ణవమైతే అనురాగం అంబరమైతే ఆనందపు అంచులు చోద్దాం అనురాగపు లోతులు చూద్దాం ”పాట మంచి హిట్టు .గుమ్మడి సౌజన్యారావు పంతులు గా సహజనటన ప్రదర్శించాడు .ఘంటసాల సంగీతం వన్నె తెచ్చింది .సావిత్రి నటన అమోఘం ..అప్పా రావు గారు రాసి నట్లే చేసి అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది .అయితే రామా రావు కష్ట పడ్డాడు కాని నటన లో సహజత్వం కనిపించలేదు .ప్రేక్షకులకు నచ్చలేదు .ఫ్లాప్ సినిమా లో చేరింది .గొప్ప విషయం ఏమిటంటే సినిమా గా తీయటం .అందరు అత్యద్భుతం గా నటించటం .ఆ పాత్రలకు వారు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరని పించటం .మా తరం వారు బాగా ఆరాధించిన సినిమా అది .సావిత్రి నటన కోసం అందరు చూడాల్సిందే .
                                                        నాటక రచన
                       కన్యాశుల్కం నాటకాన్ని మొదటిసారి 1892 లో ప్రదర్శిస్తే 1897 లో మాత్రమే అది అక్షర రూపం దాల్చి అచ్చు అయింది .మొదటి కూర్పులో అయిదు అంకాలు ,ముప్ఫై రెండు రంగాలు ఉనాయి .మళ్ళీ దాన్ని పోర్తిగా మార్చి ఏడు అన్కాలతో ,ముప్ఫిమూడు రంగాలతో తీర్చి దిద్దాడు గురజాడ .దీనితో నాటక స్వరూపమే మారిపోయింది .పాత్రల తీరు ,తెన్ను పోర్తిగా మారిపోయాయి .రంగాలు మారాయి .మరింత జాగ్రత్త తీసుకుని అప్పారావు గారు నాటకాన్ని ఇప్పుడున ఈ రూపం లోకి తెచ్చారు .మొదటి కూర్పులో మధురవాణి ఒకవేష్య మాత్రమే .రెండవ దానిలో ఆమె ఒక సజీవ పాత్ర ,అందరికి బుద్ధి చెప్పే పాత్ర ,సంఘం లో తానూ మంచి చేయగలను అని  రుజువు చేసిన పాత్ర .
                                                   కన్యాశుల్కానికి నేపధ్యం
                      గ్గురజాడ జాతీయ పునరుజ్జీవన( Renaissance period )కు చెందిన కవి .ఇంగ్లీష్ లో దిట్ట హేతువాదం ,వైజ్ఞానిక దృక్పధం వన్న వాడు .ఆధునిక ఆలోచన కలవాడు .సామాజిక స్పృహ వుంది .రీస్ అండ్ రయ్యత్ అనే పత్రికలో ఇంగ్లీష్ లో వ్యాసాలు రాస్తూందే వాడు .దాని సంపాదకుడు శంభుచంద్ర ముఖేర్జీ తెలుగులో రచనలు చేయమని గురాడకు సలహా నిచ్చాడు .దానితో తెలుగులో రాయటం ప్రారంభించాడు .ఆ సమయం లో తెలుగు సాహిత్యాన్ని పాథశాల పండితులు ,కవులే రాస్తుండేవారు .భాష పరమ గ్రాంధికం గా వుండేది .కొత్తదనం అసలు మచ్చుకు కూడా కనిపించేది కాదు .ఆ నాడు విజయనగరం ప్రాంతాల్లో డబ్బుకు పిలను అమ్ముకోవటం అనే దురాచారం వుండేది దీన్నే కన్యాశుల్కం అంటారు .ఇది ఉన్నత కుటుంబాలలో ముఖ్యం గా బ్రాహ్మణ కుటుంబాలలో జాస్తి .దీనికి తోడు అతిబాల్య వివాహాలు జరిపే వారు .ఆ నాటి విజయనగర రాజు పోసపాటి ఆనంద గజపతి రాజు సర్వే చేయిస్తే సంవత్చారానికి 344 కన్యాశుల్క వివాహాలు జరుగుతున్నట్లు తెలిసింది .అందులో ఒకటి నుంచి అయిదేళ్ళ కన్యాలకే 188   మందికి వివాహాలు జరిగాయట .శుల్కం దాదాపు నాలుగు వందల రూపాయిలు ఆనాడే .ఇప్పటి లెక్క లో ఎంతుంటుందో ఆలోచించండి .పొత్తిళ్ళ లోని పసి కందుల్ని కూడా బేరం చేసే వారు .ఉత్తరాంధ్ర ,కాలింగ ,సర్కారు జిల్లాల్లో ఈ వివాహాలు బాగా ఎక్కువ .బానిసలను అమ్మినట్లు కనేలను అమ్మటం ,కొనటం జరిగేది .ముసలి వరులకు ఆస్తికోసం పసిపిల్లలను బలి పెట్టె వారు .చావు సమీపిస్తున్నా వాడికి పిల్లను కట్టబెట్టి ఆస్తి దక్కించుకోవాలన్న అత్యాశ తండ్రులకు బాగా వుండేది .ఇదో దురాచారం గా మారింది .వీటిని మహారాజు ”రాక్షస వివాహాలు ”అని ఈసడించుకున్నాడు .the kanyasulka act 1889 ప్రవేశపెట్టాడు .ప్రభుత్వం ఇద్దరు అనధికారుల అభిప్రాయం కోరితే వారిద్దరూ బిల్లును వ్యతిరేకిన్చారుట .బాల్య వివాహాల వల్లనే కన్యాశుల్కం ఎక్కువ అవుతోందని ,దీన్ని తొలగిస్తే అదికూడా పోతుందని సలహా ఇచ్చారు .దేనికి ప్రత్యెక శాసనం అక్కరలేదన్నారు  ప్రభ్త్వ . జోక్యం వద్దన్నారు .గజపతి నిరుత్చాహపడ లేదు .దివాన్ అయిన గురజాడ ను ఈ దురాచారాన్ని రూపు మాపటానికి ఒక మంచి నాటకం రాయమని సూచించారు .”ప్రజాబాహుళ్యానికి పుస్తకపథానం అలవాటయ్యేంతవరకు ,అలాంటి ఆరోగ్య కరమైన భావ వ్యాప్తికి నాటకరంగాని ఆశ్రయించాల్సి వుంటుంది .కన్యాశుల్క నాటక రచనకు నన్ను ప్రోత్చాహించింది అదే ”అన్నాడు గురజాడ
                                            సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —23 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

గురజాడ ల 150 జయంతి ఉత్చవ సభలు -ఉయ్యూరు లో

విశ్వకవి రవీంద్ర, మహాకవి గురజాడ (150)  వ జయంతి ఉత్సవ సభలు ఉయ్యూరు లో 22.10.2011 AG & SG కాలేజీ లో జరిగాయి

సాహితీ బంధువులకు –దీపావళి శుభా కాంక్షలు .ఇవాళ సరసభారతి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ,ఉయ్యూరు డిగ్రీ కాలేజి సంయుక్తం గా నిర్వహించిన టాగూర్ ,గురజాడ ల 150  జయంతి ఉత్చావ సభలు అద్భుతం గా జరిగాయి .విద్యార్ధులు బాగా స్పందించారు .ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు మధ్యలో ఒక గంట విరామం తో జరిగాయి అందరు బాగా మాట్లాడి విద్యార్ధులను ఆకర్షించారు .ఇద్దరు విద్యార్ధులతో రవీంద్రుని ,గురజాడ వేషాలు వేయించి స్టేజి మీద మీటింగ్ అయేవరకు కూర్చో పెట్టాం .అంటే వారిద్దరి సమక్షం లో సభ జరిగిన అనుభూతి కల్గిన్చాము .ఆలోచన నాది ఆచరణ ఫ్లోరా హై స్చ్ల్ ప్రిన్సిపాల్ అయిన శ్యామలా దేవి గారికిది .చాలా అద్భుతం అని అందరు అభినందించారు .ఇలా ఇద్దరి జయంతి ఒకే వేదిక మీద ఎవరు ఇంతవరకు చెయ్యలేదు .ఈ వేషాలు అదనపు ఆకర్షణ .వారిద్దరికీ మండలి బుధ ప్రసాద్ గారి తో జ్ఞాపికలు అంద జేయిన్చాము .చాలాగొప్పగా   జరిపించినందుకు అందరు మమ్మల్ని  అభినందించారు .అతిదులందరికి ,వచ్చిన సాహితీ ప్రియులకు ఉదయం టిఫిన్ ,మధ్యాహ్నం భోజనం ,సాఉయన్త్రమ్ టిఫిన్ టీ ,మధ్యాహ్నం పదకొండు గంటలకు టీ ఇచ్చారు clollege వాళ్ళు .ఆ సభలో రచయితల సంఘం సరసభారతి కలిసి ప్రిన్సిపాల్ శ్రీ రాయుడు గారికి surprise గా సన్మానం చేశాం .ఆనందం తో ఆయనకు నోట మాట రాలేదు .విద్యార్ధులతో వారి స్పందనను తెలియజేయిన్చాము .ఉదయం ఇద్దరు శ్రీ మాదిరాజు రామలింగేస్వర రావు గారు ,ద్వా.నా. శాస్త్రి ,గారు సాయంత్రం శ్రీ ఎస్.వి రావు ,శ్రీమతి కే.లావణ్య ,శ్రీ గుమ్మా సాంబశివ రావు లు వరుసగా గీతాంజలి ,కన్యాశుల్కం ,టాగూర్ జీవితం ,టాగూర్ ఇతర రచనలు ,గురజాడ ,రచనలు జీవితం పై అద్భుత ప్రసంగాలు చేశారు .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిధి గా విచ్చేసి స్ఫోర్తి కలగే టట్లు మాట్లాడారు .కే సి పీ .జెనెరల్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర రావు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షా కార్యదర్శులు శ్రీ సుబ్బా రావు .శ్రీ పూర్ణచంద్ సభాధ్యక్షత ,లక్ష్య ప్రస్తావన చేశారు .విద్యార్ధులకు గురజాడ టాగూర్ లపై వ్యాస రచన ,వక్తృత్వం లో పోటీలు నిర్వైంచి విజేతలకు బుద్ధ ప్రసాద్ గారిచే బహుమతులు అంద జేశాము .అందరికి గొప్ప సంతృప్తిని కల్గించిన సభ గా మన్ననలు   అందుకొన్నాము .—మీ దుర్గా ప్రసాద్

Posted in సభలు సమావేశాలు | Leave a comment

మార్టిన్ గార్దేనేర్ —2

    మార్టిన్ గార్దేనేర్ —2
                    తాను రాసిన వ్యాసాలలో ఎందరికో తెలియని సంగతులను తెలియజేశాడు గార్దేనేర్ .hesenberg అనే జర్మనీ కి చెందిన యూదు శాస్త్రవేత్త ,నాజీలకు సలాం చేసే వాడట .”heir Hitler ‘అని గౌరవం గా ఉత్తరాలు రాసే వాడట .హిట్లర్ కోసం ప్రాణాలైనా ఇస్తానని అనే వాడటహిట్లర్ జ్యూల ను అంతహిమ్సిన్చినా ,అంతమంది యూదుల్ని అన్యాయం గా చంపేసినా .కాసిడే అనే సైంటిస్ట్ ”అన్ని విషయాలు లాగానే సైన్సు కూడ జాతిరక్తం వల్ల నియంత్రిన్చాబడుతుంది ”అన్నాడట .జర్మని ,ఫ్రాన్సు దేశాలలోని ఆర్యులు అయిస్తీన్ కంటే ముందే సాపేక్ష సిద్ధాంతం పై ఆలోచన చేశారు అన్నాడు .టి.ఎస్.ఇలియట్ రాసిన వాక్యాన్ని గుర్తు చేశాడు గార్దేనేర్ ” .When Apolinax visited the United States ,his laughter tinkled among the tea cups ”.అలాగే గణితం గురించి ఒక అజ్ఞాత కవి రాసిన కవితను గుర్తు చేశాడు ”IIn the world of Math –That man has wrought –The great gain –Was the thought of naught ;”‘;అట్లాగే పియాట్ హీన్ అనే కవి రాసిన కవిత ”Life is two locked boxes –each containing the other”s key ”.
                     కాలమ్ మీద ఎడ్గార్ అల్లెన్ పో రాసిన కవిత ను మెచ్చాడు గార్దేనేర్  By a route obscure aand lonely –haunted by ill angels only –where as Eidolin nnamed night –on a black throne reigns upright –I have reached these lands but newly –from an ultimate dim –Thule –from a wild weird clime that lieth sublime out of space –out of time ”ఇది  రాసి  అలెన్  పో  యురేకా  అని  అరిచాడట  archimedees లాగా .అనటమే కాదు ఈ కవితను 500  కాపీలు తీసి స్నేహితులందరికీ పంచిపెట్టాదట .దీని పేరు కూడా యురేకా నే .ఈ కవిత రాసిన ఆనందం  లో ”I have no desire to live since I have done EUreka “”అనిసంబర పది పోయాడట   .అంతకు మించిన కవిత్వం ఇక రాయాలేమో నని భావిన్చాడన్నమాట .ఈ కవిత్వాని ఆంగ్లం లోనే అనుభవిస్తే బాగుంటుందని ఆ స్క్రిప్ట్ నే ఇచ్చాను నేను. .ఇంతకంటే తాను సాధించాల్సింది ఇంకేమీ లేదనే పరమ సంతృప్తి ని పొందాడన్నా మాట .
                       అమెరికన్ తొలి కవుల్లో ఒకడైన పో ను మహా  దార్శనికుడు అంటాడు గార్దేనేర్  .ఆనాటికే బ్లాక్ హోల్ పై సమగ్ర అవగాహన వున్న  సైంటిస్ట్ అలెన్ పో అని అభిప్రాయ పడ్డాడు .ఆయన ప్రతిభకు జేజేలు పలికాడు .ఒక్క సారి ఆ” కృష్ణ బిలం ”లోకి తొంగి చూద్దాం .”భగవంతుడు శూన్యం లో నుంచి ఒక మూల కణాన్ని (pre-mordial particle )ను సృష్టించటం తో విశ్వ జననం  ప్రారంభమైంది .దాని నుంచి పదార్ధం గోళా కారం గాఅన్ని వైపులకు వ్యాపించింది .ఆ వ్యాపనం వ్యక్తీకరణకు అతీతం గా ,బృహత్తరం గా అతితక్కువగా వున్న ,ఊహలకు అందని రీతిగా అనంతం కాని ,అతి సూక్ష్మ పరమాణువులచే జరిగింది .విశ్వం వ్యాపించిన కొద్దీ గురుత్వాకర్షణ శక్తిది పై చేయి అయింది .దానితో పదార్ధం నక్షత్రాలుగా ,గ్రహాలుగా ఘనీభవించింది .అదే సమయం లో గురుత్వాకర్షణ బలం వ్యాపనాన్ని నియంత్రించింది .విశ్వం క్రమం గా సంకోచించటం ప్రారంభించి మళ్ళీ  శూన్యం లోకి ప్రవేశించింది .గ్రహ తారకల తో కూడిన విశ్వం అకస్మాత్తుగా అంతలోనే అదృశ్యమై పోతుంది ”  ఆనాడే బ్లాక్ హోల్లెస్ ను ఎలా ఊహించాడో అలెన్ పో అని ఆశ్చర్య పోయాడు గార్దేనేర్ .”మన విశ్వానికి చెందిన మనభగవంతుడు   అన్నిటి లోను ఎప్పుడు ఉంటాడు ”అని అల్లెన్ పో భావించటం అతని దార్శనికత కు నిదర్శనం అన్నాడు గార్దేనేర్ .
                      గార్దేనేర్ చెప్పిన ఇంకోవింతను   ను మీ ముందుంచుతాను .”పూఫ్ బర్డ్ ”అనే పక్షి ,వెనక్కి పరిగెట్టడం లో ఘటికు రాలు .క్రమం గా తగ్గిపోయే చక్రభ్రమణం తో వెనక్కు ఎగురుతూ చివరికి పాపం( పూఫ్ )దాని గుదం( Anus )లోకి అదృశ్యమై పోతుందట ”.దీని లాగానే మన విశ్వం కూడా అదృశ్యమై పోతుందా /అలా అవటానికి భౌతిక శాస్త్ర సిదాన్తాలు ఒప్పుకోవు కదా  కాని . అలా జరగటం అనేది సత్య విషయమేగా /అలాగే ఏమీ లేకపోవటం ,అన్నీ వున్న దాంట్లో భాగమే .(nothing is a part of every thing ).
                 అలాగే వ్హీలేర్ అనే శాస్త్రవేత్తచెప్పిన   భావాలను ఆవిష్కరిస్తూ ”మన విశ్వం అనంత కోటి విశ్వాలలో ఒకటి .అది సూపెర్ స్పేస్ అనే కొత్త అంతరిక్షం చేత పోదగాబడింది ”అన్నాడు .దీనినే అల్లెన్ పో కవి కూడా దర్శించాడని చెబుతూ ”పవిత్ర హృదయం (heart divine ),మన విశ్వ దేవుడు ,లేక అందరికంటే ఘనమైన దేవత ,ఈ చిల్లరదేవుళ్ళ నందర్నీ కంటితో గమనిస్తూనే ఉంటాడు(వుంటుంది )ఎక్కడినుంచి చూస్తుందంటే సూపెర్ స్పేస్ లోని స్థావరం నుంచి ”.వీరిదరిభావాలు ఒకటిగా వుండటం సత్యదర్శనం గా వుందని అంటాడు గార్దేనేర్ .దీన్నే హిందూ మతానికి అన్వయిస్తే ”నేతి,నేతి అనే వేదాంతులు బావన చేస్తూ ,చివరికి నిగూఢమైన ,సర్వోత్కృష్టమైన పరబ్రహ్మను చేరుతారు .ఆయనను దర్శించాలంటే సూపెర్ సూపెర్ సోపెర్ డూపర్ నేత్రం కావాలి అతి ఉత్కృష్ట నేత్రం మాత్రమే ఆ పరబ్రహ్మ ను దర్శించగలదు ;”
                   ఋగ్వేద సంహిత లో ”ప్రపంచం ఏర్పడిందా /స్వయం ఆవిష్కారమా ?అనేది ఆయనకే పూర్తిగా తెలుసు .నిర్ధారణగా ఆయనకు మాత్రమే తెలుసు .అన్నిటికి ఆయన  పరమ స్థానం లో వుండి ,అంతటిని రక్షిస్తూ  గమనిస్తుంటాడు ,.నిజం గా ఆయనకే తెలుసు .బహుశా ఆయనకే తెలుసు అన్నది ఆయనకు తెలియదేమో ?”అని వుందని గార్దేనేర్ గుర్తు చేశాడు .విల్లియం జేమ్స్ ఒక తమాసా చెప్పాడట ”ఒక బిషప్పవిత్ర వాక్యం వివరిస్తూ   ,దేవుని ఉనికి గురించి చెప్పిన మాటలు విన్న ఒకరైతు   ”మీరు చెప్పిన పవిత్ర వాక్యం చాలా అద్భుతం గా వుంది .కాని చివరికి భగవంతుడు ఉన్నాడని నాకు నమ్మకం ఎప్పుడో కలిగింది ;’అని రివర్స్ పంచ్ ఇచ్చాడని మార్టిన్ గార్దేనేర్ తెలియ జేశాడు .
                                                   సమాప్తం
                                                      మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -10 -11 .

 

Posted in అనువాదాలు | Leave a comment

ఇరవ్యవ శతాబ్దపు మహా మేధావి మార్టిన్ గార్దేనేర్ –1

                       ఇరవ్యవ శతాబ్దపు మహా మేధావి మార్టిన్ గార్దేనేర్ –1
                          అరుదైన వ్యక్తిత్వం తో ,తనను తాను ఆవిష్కరించుకున్న మహా మేధావి మార్టిన్ గార్దేనేర్ .చాలా కష్టతర మైన విషయాలంటే అతనికి మహా ఇష్టం .,ఆకర్షణ కూడా .దాదాపు డెబ్భై సంవత్చరాల రచనా  వ్యాసంగం లో పండిన వాడు .ఇరవయవ శతాబ్దపు గార్దేనేర్ లలో గార్దేనేర్ ఒకరు .సాహిత్యం ,సైన్సు ,గణితం ల పై 1930 నుంచి అమెరికా లోని చికాగో విశ్వ విద్యాలయం లో ఉంటూ ,సాదిఆరిక వ్యాసాలు రాశాడు .అమెరికా లో సాఫల్యవంతమైన రచనా ప్రవీణుడు గా గుర్తింపు పొందాడు .”సమాధానాలు దొరకని ప్రశ్నలు ”కు అద్భుత విశ్లేషణ చేసి సంతృప్తికరం గా సమాధానాలు చెప్పిన ఆలోచనా పరుడు .సైన్సు లోని క్వాంటం సిద్ధాంతం దగ్గర నుంచి భగవంతుని అస్తిత్వం దాకా విశ్లేషణ చేసిన మేదోత్పన్న బుద్ధి జీవి .చాలా తెలివిగల వాడిగా వున్నా .ఆటకోలు తనం కూడా వుండేది .అయితే మంచి అణకువ గలవాడు అని పేరు .ఒక తరం పాతకులకు ,రచయితలకు ప్రేరణ గా నిఇచిన మేధోమధన జీవి గార్దేనేర్ .
                         సైంటిఫిక్ అమెరికన్ జర్నల్ లో 25  సంవత్చరాల పాటు మతేమతిచ్స్ గేమ్స్ ఏకధాటిగా నిర్వహించాడు .The unoted Alice ,The whys of a philosophical scrivener అనే గొప్ప పుస్తకాలు రాశాడు .మేధో జీవులను నిరంతరం తట్టి లేపే వ్యాస పరంపర రాశాడు .1914 లో జన్మించి అమెరికా లోని నార్త్ కెరొలినా లో హిందేర్సన్ విల్లీ లో జీవితం గడిపాడు .thenewyork రివ్యూ కు నిరంతర సమీక్షకుడు .సైంటిఫిక్ అమెరికన్ జర్నల్ కు చాయా వ్యాసాలు ,పుస్తకాలు రాశాడు .నీటికి వృత్త సౌష్టవం (spherical symmetry ) వుందని చెప్పాడు .అంతరిక్ష నౌక లోని కాలం కు భోమి మీద కాలమ్ కు తేడా ఉంటుందని వివరించాడు .దీనినే టైం dilation  అంటారు .దీనికి ఒక కధ కూడా చెపాడు ”bright అనే యువతీ వుండేది .ఆమె కాంతి వేగం కంటే వేగం గా ప్రయానించేది .ఒక రోజూ ఆమె ప్రయాణం ప్రారంభించి ,ఆ ముందు రోజూ రాత్రికే బయల్దేరిన చోటుకు తిరిగి వచ్చింది .ఇదే సాపేక్ష సిద్ధాంతం అంటే ”అన్నాడు .ముందు రోజుకే తిరిగి రావటం తో తన dooplicate నే చూసిందని భావం .టైం travel లో జ్ఞాపక శక్తి పోవటం వల్ల అలా జరిగిందంటాడు బుద్ధి గ్రహించక పోతే ఏ వస్తువు కు అస్తిత్వం వుండదు .వుండటం అంటే గ్రహించటం .(Nothing can exist unless it is perceived by a mind .To be is to perceive .)దేవుడు  విశ్వం  తో  పాచికలు  ఆడుతాడు  అని Einstein        చెప్పలేదు     అంటాడు    గార్దేనేర్  .అలాగే ఎలేక్ట్రోన్ ను కొలిస్తే తప్ప దాని ఉనికిని చెప్పలేము అన్నాడు
                                            సశేషం
                                మీ దుర్గా ప్రసాద్ –21 -10 -11

 

Posted in అనువాదాలు | Leave a comment

దార్సినికుడు మాల్ రక్స్ —2

         దార్సినికుడు మాల్ రక్స్ —2
                  1957  కేమాస్ కు నోబెల్ పురస్కారం ప్రకటిస్తే ”నోబెల్ బహుమతి మాల్ రక్స్ కు ఇచ్చి వుండాల్సింది ‘అని బాహాటం గానే ప్రకటించుకున్న నోబెల్ పిచ్చాడుమాల్ రక్స్ .1966 లో Grand and petit  palace లో pikasso retrospect  (సింహావలోకనం )నుమాల్ రాక్స్  అత్యద్భుతం గా నిర్వహించాడు .అయితేఅధికారుల  అలసత్వం తో ఆ కార్యక్రమ ఆహ్వానం చిత్రకారుడు పికాసో కు అందలేదు .పికాసో కు ఎక్కడో మండి ”నేను చచ్చానను కున్నారా ?”అని మాల్ రక్స్ కు టెలిగ్రాం ఇచ్చాడు .మనవాడు ”నేనేమైనా మినిస్టర్ ను అనుకున్నావా ”అని గోల్మాల్ సమాధానం ఇచ్చాట్ట .చైనా అధ్యక్షుడు మావ్ సే టుంగ్ తన జీవిత చరిత్రను memoirs  పేరుతో రాస్తే మనవాడు అంటి మేమోఇర్స్ (అపస్మ్రుతులు )రాశాడు .మాల్ రక్స్ కు భారతదేశం అంటే వల్లమాలిన గౌరవం ,అభిమానం .”అన్ని నాగారకతలు సమానమే ,కాని భారతీయ నాగరకత సమానమైన కొన్నిటికంటే ఇంకా ఎక్కువ (more equal )అని కితాబు ఇచ్చాడు .మనదేశామంటే విపరీతమైన వ్యామోహం కూడా వుండేది .నమ్మకం లేని మతపరమైన నమ్మకం వున్న వాడు (religious mind without faith ).”గాంధి మహాత్ముడు అడ్డుపడక పోతే ,ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్యోతిని ప్రసాదిస్తున్న భారత దేశం ,ఆసియా లోనే తిరుగు బాటు స్థానం గా చరిత్రలో మిగిలి వుండేది ”అనిమహోన్నతం గా భారతీయ సనాతన పరంపరను ,అహింసా మూర్తి ,గాంధీ మహాత్ముని విశిష్ట వ్యక్తిత్వాన్ని ఆరాధనాభావం తో విశ్లేషించాడు .” భారతీయ ఆత్మను దర్శిస్తేనే భారతీయులు అర్ధమవుతారు ‘,వారి మేధోవిజ్ఞానం  తెలుస్తుంది ”అని పరమాద్భుతం గా చెప్పాడు రక్స్ .
                               మాల్ రక్స్ కు భారతదేశం లో గొప్ప గణిత శాస్త్రజ్ఞులు ,వైద్యులు ఉన్నట్లు తెలియదు .మధుర మీనాక్షి దేవాలయం ను సందర్శించినపుడు డాక్టర్ రాజా రావు గైడు గా వ్యవహరించారు .”సూర్యుడు శిఖరాన్ని వెలిగించేది , శిల్ప కళా వైభవాన్ని  చాటి చెప్పేది ఈ దేవాలయమేనా ?అని అడిగారు మాల్ రక్స్ ఆశ్చర్యం గా .దానికి రావు గారు ”మనిషి ఒక వస్తువు మీద దృష్టి పెడితే అది అతని లో కరిగి పోతుంది .ఇక్కడి గోపురం అంతరిక్షానికి  చిహ్నం .ఆకాశం లోని సూర్యుడు క్రిందిభూమినిచల్లబరుస్తాడు .ఇక్కడి అసంగత విషయం( Absurd )ఏమిటంటే దానికి సమాధానం అనేది దొరకదు ”అని చెప్పారట .
                    1958  లో ప్రఖ్యాత రచయిత కుష్వంత్ సింగ్ మాల్ రక్స్ ను ఇంటర్వ్యూ చేశాడు .”మాల్ రక్స్ ఫ్రేజులు టపా కాయలు లాగాపేలుతాయి      .అందులో భయంకర శబ్దాలు మెరుపులు కనిపిస్తాయి .అంతా అయాక మిగిలేది వట్టి నల్లటి పొగ మాత్రమే ”అని తేల్చాడు .కాశీ క్షేత్రం లో గంగానదిని చూసి ”ఈ గంగా జలం సగం నోరు తెరిచి చనిపోయిన వారి నోల్లల్లోకి చేరి పవిత్రం చేస్తాయి ”అన్నాడు .ఫ్రాన్సు దేశం లో భారత దేశ రాయబారి రామేశ్వర్ దయాళ్ -మాల్ రక్స్ ను చూడటానికి వస్తానని చెబితే మాల్ రక్స్ వచ్చేటప్పుడు పవిత్ర గంగాజలం ను తీసుకుని రమ్మని చెప్పాడట .అంతటి పవిత్రభావం ఆయనకు వుండేది గంగా నది పైన .ఆయన కోరినట్లే గంగాజలం తెప్పించి ,వెండి పాత్రలో పోసి తీసుకొని వెళ్లి అందించాడు దయాళ్ .
                       తాను లెక్కించదగిన రచయితనుఅని తానే దంకా   బాజా ఇంచాడు మాల్ రక్స్ .1969  లో జార్జెస్ పామ్పిడో -దేగాల్లి ని వోడించి  ఫ్రాన్సు అధ్యక్షుడు అయాడు . .రాజకీయం గా తెరమరుగైనాడు మాల్ రక్స్ .”రాయటం ఒక బలమైన మందు ”అంటాడు రక్స్ .”దీనిపై స్పందించిన డేగాల్లి ”మూటలో ఏముందో మరిచేట్లు చేస్తుంది .అది చాలా ముఖ్యం ”అని తిప్పి కొట్టాడు .తాను పికాసో అంత జీనియస్ అని స్వంత డబ్బా కొట్టుకోవటం పాపం అతని బలహీనత .”నాకు పాబ్లో ఎవరో తెలీదు .అతనొక ఏకాంత వాసి .కాని పికాసో అంటే బాగా తెలుసు ”అని అమాయకం గా అంటూ అసలు పికాసో కు అస్తిత్వం వుండటం ఆశ్చర్యకరం అని చెబుతూఅలాగే  మాల్ రక్స్ జీవించివున్నాడుఅంటమ్  కూడా అంతే ఆశ్చర్యం అన్నాడు మాల్ రక్స్ .
                  తాగుడుకు పూర్తి బానిస అయినా అది మాల్రక్స్ బుద్ధి కుశలతను తగ్గించలేక పోయింది 71 వ ఏట తన తోటి వారు ,తాను అత్యధికం గా ప్రేమించిన వారు ప్రమాదాలలో మరణించినందుకు చాలా కలత చెండాడు .ఈ స్థితి లో ఇంకా బతికి వుండటం చావుతో సమానం అన్నాడు .అతని ఆర్ట్ పుస్తకాలు గొప్ప ఆల్బం లు గా ప్రసిద్ధి చెందాయి .”విషయం ఎంత ప్రాముఖ్యం పొందిందో ,చిత్రాలు అంతే ప్రాముఖ్యం పొందాయి కాలమ్ తో బాటు రచన ఎలా రూపాంతరం  చెందుతుందో సోదాహరణం గా వివరించాడు .శతాబ్దాలు గడిచిపోయిన తర్వాత ,ఆ రచన దేనికోసం ఉద్దేశింపబడి చేయబడిందో ,దాని నుంచి వేరై పవిత్రాక్రుతి దాలుస్తుంది అంటాడు .”ప్రతి సంస్కృతి విశ్వజనీనమై ,సత్యమై వుంటుంది .కళా కృత్యం ఆ కాలమ్ లో ఆవిర్భవించి అందులోనే జీవించి ,అది కళాత్మకం గా కాలాన్ని దాటి నిలిచి పోతుంది .
దాన్ని అర్ధం చేసుకోవా టానికి కావలసిన సమస్తమైన సమాధానాలు అందులోనే కనిపిస్తాయి .వెతికే ఓపిక వుండాలి సంస్కృతి కేవలం జ్ఞానమే కాదు అదొక గొప్ప ఆవిష్కరణ .మేధావి సత్యాన్నే గ్రహిస్తాడు .కళ లో అంతకు ముందు లేని భావాన్ని మేధావి అయిన రచయిత ,కళా కారుడు ఆవిష్కరిస్తాడు అతను చారిత్రాత్మక నాయకునితో సమానం .హీరో లకుగొప్ప శక్తి వుంటుంది .అది వారికి మాత్రమే చెందినది కాదు కలాక్రుతిలో సౌందర్యం ముఖ్య కారణం గా వుంటుంది .కళ అమరత్వానికి అవతార స్వరూపం అది అనంతత్వానికి ,తిరుగుబాటు కు ,విప్లవానికి ,మానవ జీవితం లో రోజూ అనుభవించే దాని తిరస్కారానికి ప్రతీక .మనం కాలాన్ని మోయటానికి జన్మిస్తునాం.దాని నుంచి తప్పించుకోవటానికి కాదు .”అని చాలా అనుభవ పూర్వకం గాఅనుభూతి కలిగిస్తాడు .ఇవి చాలా విలువైన మాటలు అతని విశ్లేషణ శక్తికి ఆనవాళ్ళు ..ఇవన్నీ ఆయన నిర్దుష్ట అభిప్రాయాలు .”నా జీవితమే ఒక నవల ”అని challenge  చేసి  చెప్పిన రచయిత ,చిత్రకారుడు ,వార్ హీరో ,రాజకీయ చతురుడు ,మంత్రిసత్తముడు ,మాటల మార్మికుడు ,మహత్తర ఆలోచంనాపరుడు ,మేధావి ,కళా సౌందర్య పిపాసి ,వ్యాఖ్యాత ఆండ్రీ . మాల్ రక్స్
                                                      అయిపొయింది
                                            మీ – గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -10 -11
Posted in అనువాదాలు | Leave a comment

డాంబికుడు మాల్-రక్స్ —1

డాంబికుడు మాల్-రక్స్ —1
                    ఫ్రెంచ్ రచయిత ,విమర్శకుడు ,కళాచరిత్ర కారుడు ,,యుద్ధ వీరుడు ,రాజకీయనాయకుడు ,మంత్రి డాంబికుడు ఆండ్రే మాల్ రక్స్ .జననం-03 -11 -1901 -మరణం -23 -11 -1976
la condition humane ,the voice of silence ,history and philosophy of world art ,museum without walls మొదలైన గ్రంధాలు రాశాడు .సంపన్న కుటుంబం జన్మించాడు .౧౯౨౯ లో ఆఫ్ఘనిస్తాన్ లో గ్రీకో బుద్ధిష్ట్ కళను గుర్తించాడు .౧౯౩౪ లో అరబియా లో queen sheebaa  నగరాన్ని కనుగొన్నాడు .1926 లో మొదటి నవల The temptations of the West రాశాడు .ల కండిషన్ హుమనే కు మంచి పేరు వచ్చింది .మాస్టర్ పీస్ అన్నారు  అంతా .ఫ్రెంచ్ నవలాకారులలో అగ్రేసరుడు అయాడు .ఆయన వచన రచన కవిత్వం లాగా వుంటుంది .అద్భుత జ్ఞాపకశక్తి కలవాడు .అపారజ్ఞాన సంపన్నుడు .1936  లో స్పానిష్ యుద్ధం తర్వాత స్పైన్ వెళ్లి అక్కడినుంచి అమెరికా చేరి ,స్పైన్ కు వైద్య సేవ అందేట్లు చేశాడు .L-espoir సినిమా కు దర్శకుడయాడు .ఆ సినిమా రెండవ ప్రపంచయుద్ధం తర్వాతే విడుదల అయింది .ఆ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఫ్రెంచ్ ట్యాంక్ unit లో చేరాడు .1944 కాల్పుల్లో గాయపడ్డాడు .బందీ కూడా అయాడు .ఫ్రీ ఫ్రెంచ్ brigadior  ఏర్పరచి కమాన్దర్ అయాడు .చాలా ప్రతిభ తో శక్తివంత మైన నవలలు రాశాడు .1945    తర్వాత చరిత్రకారునిగా ,క్రిటిక్ గా మారాడు .కళా విమర్శకుడు గా మంచి పేరు వచ్చింది .తన జీవిత చరిత్రను Antimemoirs   గా 1967 లో రాశాడు  ఇదంతా ఒక పార్శ్వ్యం .దీనికి మించి అతనిలోని ఇంకా చాలా పార్శ్వ్యాలు వున్నాయి .వాటిలోకి ప్రవేశిద్దాం .
                            1920  లో కళలకు పుట్టినిల్లు అయిన పారిస్ నగరం నుంచి మిలిటరీ ప్రభుత్వాలైన కంబోడియా ,చైనా ,స్పైన్ దేశాల మీదుగా ,అంతర్యుద్ధ కాలమ్ లో మారాడు .సరదాగా అబదాలాడే నైజం వున్న వాడు .గొప్పలు చెప్పుకోవటం మహా ఇష్తం .చైనా కమ్యూనిస్ట్ అధినేత మావో తనకు మంచిమిత్రుడు అనే వాడు .అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ ను ఒక్కసారి మాత్రమే చూసినా ,ఆయన తనను ట్యూటర్ గా వున్దమన్నాడని కోతలు కోసేవాడు .యుద్ధభూమికి దగ్గరలో తనే చేసుకున్న గాయం తో ఫ్రెంచ్ యుద్ధవీరుడు అయి పోయాడని చెప్పుకుంటారు .అతని రేనైసేన్స్ కధలు ,గాధలు విపరీతం గా ప్రచారం పొందాయి .అక్షదేశాలు యుద్ధం ప్రారంభించాతానికి కొన్ని వారాల క్రితమే అతను సైన్యం లో చేరాడు అనీ ,ఒక విమర్శ కూడా వుంది .తనను గురించి చెప్పుకున్న గొప్పలుకోతలు దాటే టట్లు చెప్పే నేర్పున్న వాడు . ..
                          మాల్ రాక్స్ మంచి చిత్రకారుడు .వందకు పైగా అద్భుత చిత్రాలు గీశాడు .అవి మ్యూజియం లలో ,యాత్రా ప్రదర్శనల లో వన్నె కెక్కాయి .ఫ్రాన్సు దేశ సైన్యాధ్యక్షుడు (జనరల్),ఆ తర్వాత దేశాధ్యక్షుడు అయిన డేగాల్లీ కు తానే దిక్కు అని బడాయి కబుర్లు చెప్పేవాడు .దేగాలీ ఏ పనీ సరిగ్గా చేయడు ,చేయలేదు అని ఒక statement పారేశాడు ఫ్రాన్సు ప్రజలకు యామి కావాలో దాన్ని డేగాల్లి చేయలేదని విమర్శించాడు .మాల్ రాక్స్ అంటేనే wine ,whisky  తాగుడు గాడు అని అభిప్రాయం వుంది .జనరల్ డేగాల్లి ని ఆరు ఏళ్ళు ఆరాధించి ,ఆ తర్వాత మళ్ళీ సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నాడు .కంయూనిస్తులనే ఎందుకో చిరాకు .వాళ్ళు కోరుకొనేది సరైనదే నని అయితే వారు చేసే తీరు నీచం గా వుంటుంది అనే వాడు .మాల్ రాక్స్ charactor  అపకేంద్రగామి (సెంట్రిఫుగల్ )గా కంటే (centripetal )కేంద్రాకర్షణ గామి గా వుండే వాడు .1958  లో డేగాల్లి అధికారం హస్తగతం చేసుకోవటం ప్రారంభించాడు .డేగాల్లి మంత్ర్వర్గం లో మాల్ రాక్స్ సంస్కృతి శాఖ మంత్రి గా పని చేశాడు .దాన్ని గురించి పత్రికల   వారికి చెబుతూ ”నేను చేబట్టే మంత్రిత్వ శాఖ శ్మశానం లాంటిది .దాని పని అయిపోగానే ,నన్ను కలిసి మాట్లాడమని కోరుతాను ”అన్నాడు .అతని దృష్టి లో ఫ్రాన్సు దేశం లో రెండు విహార స్థలాలు  వునాయత .ఒకటి అధ్యక్షుడు డేగాల్లి ,రెండు తాను .
                    ఫ్రాన్సు దేశపు జనరల్ radio గురించి మాట్లాడుతూ ”ఇదొక దెయ్యపు నౌక -అది ఇంకా కుంచిన్చుకుపోలేదు .రాజకీయ పక్షాలకు ధర్మ సంస్థ గా వుంది .పదవిలోకి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ ,తనకు అనుకూలం గా వున్న ప్రతి వారికీ ,ముఖ్యం గా కమ్యూనిస్టుల నుంచి వలస వచ్చిన వాళ్లకు నిలయం గా వుంది .”అన్నాడు .రాజకీయ సంమేలలో దీన్నే ప్రధానం గా ఎంచుకుంటారు .దీన్ని నడపటానికి కనీసం యాభై మంది సాంకేతిక నిపుణులు వుంటే చాలు .అన్నాడు
                     గాలిజం (డేగాలిజం )లోని వామ భావాలకు మాల్ రాక్స్ ప్రతినిధి .మాల్ రాక్స్ ను ”జనరల్ దేగాల్లి daancer ”అనే వారు .అంటే ఆయన చెప్పినట్లు ఆడేవాడు అని భావం .ప్రపంచం లోని ప్రజాస్వామ్య దేశాలలో సంస్కృతికి ఒక మంత్రి ని ఏర్పాటు చేసిన అతి కొద్ది దేశాల్లో ఫ్రాన్సు ఒకటి అయింది అని గొప్పగా చెప్పాడు .ఇందులో నిజం లేక పోలేదు .1958  డిసెంబర్ 21 న డేగాల్లి అయిదవ రిపబ్లిక్ అయిన ఫ్రాన్సు కు మొదటి అధ్యక్షుడు అయాడు .మాల్ రాక్స్ ” Ministre -da -etat”అంటే సాంస్కృతిక శాఖకు అమాత్యుడు అయాడు .కేబినేట్ సమేవేశాల్లో డేగాల్లి కుడి పక్కనే కూర్చునే వాడు .అంటే చాలా ప్రాముఖ్యమైన స్థానం అని అర్ధం చేసుకోవాలి .పదేళ్ళ పరిపాలన లో మంత్రిగా 26  సార్లు మాత్రమే అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఘనుడు .మాల్ రాక్స్ ను సహజ మేధావి గా ,ఆలోచనాపరుడు గా అందరు భావిస్తారు .”సంస్కృతి అంటే ఏమిటో తెలియని ఏకైక మంత్రిని నేనే ”అని గప్పాలు పలికాడు .అయితే డేగాల్లి అతన్ని తమ జాతి ఉత్తమోత్తమ రచయిత గా అందరికి చెప్పేవాడు .కళా చరిత్ర మంత్రిగా వున్నవాడు చివరికి ఉత్త చరిత్ర మంత్రి అయాడు పాపం ”.విషయాన్ని విష్పస్తం గా చెప్పలేని వారు హృదయం లేని వారు ”.అన్నాడు ఒక సారి .భావ వ్యక్తీకరణ ,ఆత్మ ,ఆధ్యాత్మికత క్రైస్తవ కళ లో వున్నాయని భావించాడు .జగత్ప్రసిద్ద చిత్రకారుడు డావిన్సి తాను గీసినా వర్జిన్ చిత్రం లో ,నవ్వులో వీటిని చూపాడు అని విశ్లేషించాడు .అందుకే దాన్ని secular చిత్రం గా మలిచాడని అభిప్రాయ పడ్డాడు .లియోనార్డో డావిన్సి స్త్రీల ఆత్మను మనోహరం గా దర్శింప   జేశాడుఅని నిర్ధారించాడు
              ”  రాజకీయాగ్ని లో ఇనుము ”అని మాల్ రాక్స్ ను అనే వారు .అధ్యక్షుడు దేగాల్లిని సరదాగా ”the girafee ”అన్నాడు .నిజం గా దేగాల్లిఅలానే   వుండే వాడు ఆరడుగులు పైన వుండే అందగానిలా .”జెనరల్ దేగాల్లి సాధించిన ఏకైక విజం మాల్ రాక్స్ ‘అని డబ్బా కొట్టుకొనేవాడు .”అయితే నేనెప్పుడు ఆయనకు ఆ మాట చెప్పలేక పోయాను ”అని మరోముక్తాయింపు ఇచ్చాడు .డేగాల్లి తనను” ఫ్రాన్సు దేశం తో అభిన్నుడు” .గా భావించుకొనే వాడు .పాపం మాల్ రాక్స్ తానే డేగాల్లి అనుకొనేవాడు .మాల్ రాక్స్ ఆఫీసు లోని లాంప్ నెపోలియన్ ది అని గర్వం గా చెప్పుకొనే వాడు .అలేక్జాన్దర్ ద్యూమాస్ కూర్చున్న చోటే తానూ కూర్చుని పని చేస్తున్నందుకు సంతోషం గా వుండేది ఆయనకు .తన పనిథేఎరు ను గురించి వివరిస్తూ ”నాకు కావలసింది దుస్సాహసం ,వెర్రి నేను చేయగలిగింది మాత్రం ఏమీ లేదు ”అని తనను ఆవిష్కరించుకునేవాడు .విపరీతం గా స్మోకే చేసే” SMO -కింగ్ ”అతను .తనకు నోబెల్ బహుమతి రాలేదని తెగ బాధ పడే వాడు .నోబెల్ పురస్కారం రా తగిన అర్హత తనకే ఉందనే వాడు .అమెరికా నవలా రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే కు నోబెల్ పురస్కారం ప్రకటించినపుడు ,అతని కంటే తానే గొప్పవాడినని అన్నాడు .ఆనాటి సాటి రచయితలలో తానే సిఖరాయమానం అని ప్రగల్భాలు పలికాడు .జీన్పాల్ సాత్రే ,అలేగాన్ లు తన తర్వాతే అని చెప్పుకున్నాడు .అమెరికా రచయిత జాన్ స్తీన్బెక్ కు నోబెల్ వస్తే పెదవి విరిచిన ప్రబుద్ధుడు మాల్ రాక్స్ .
                                        మిగిలిన విషయాలు ఇంకో సారి .
                                              మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -20 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

పద్మ ప్రాభ్రుతకం (తామర పువ్వు కానుక )–అలంకార సంపద –3

పద్మ ప్రాభ్రుతకం (తామర పువ్వు కానుక )–అలంకార సంపద –3
                పేర్లు పెట్టటం లోను మహాకవి శూద్రకుడు మంచి చమత్కారం చేశాడు .ఒక విటుడి పేరు ”హ్రీ రమ్యుడు ”  అంటే సిగ్గుతో శోభించేవాడు అని అర్ధం .కాని ఇక్కడ వీడు పట్టపగలే శృంగారక్రీద చేసే వాడు .    అందుకే వాడికి  ”పట్టపగటి ప్రణయ కళా పట్టభద్రుడు ”అని సరదా బిరుదు తగిలించాడు .ఎగతాళి చేయటం ఒక కళ అట .అది ఎలాంటిది అంటే ”ఆకారం పైన వేసిన ముసుగు కూడా అదే ఆకారాన్ని ధరించి నట్లుందట ””నడుస్తున్న కామ రధం కాడి విరుగకొట్ట రాదు ”అనే విట సామెత కూడా చక్కగా సరిపోయేట్లు చెప్పాడు .దీవెన కోద్కా అదే స్థాయిలో వుండాలి కదా ”అవిరళ కామోత్చవోస్తూ ”
అని గార్గి గారి అబ్బాయిని ఆశీర్వదిస్తాడు .సందర్భానికి తగినట్లుగా .ఇదే విధం గా మగధసుందరి అనే గణిక (వేశ్య ) బ్రహ్మచారి గా ఉంటూ వసంతుడిని ఉపాశిస్తోందని తెలిసి ”దంతపు గాట్లతో నీ పెదవులు నలిగినట్లున్నాయి.నీ అంతకు నీవే నియమాలు పెట్టుకోవటం ఎలా వుందంటే ”వ్రతము భంగంము కాని చాన్ద్రాయనమున ముద్దులు ఉద్యాపనంమగు సుద్ది తోచే ”అంటాడు .వ్రతభంగం లేని చాంద్రాయణం లో ముద్దులే వ్రతం చివర చేసే ఉద్యాపనం అని భలే చాకచక్యం గా ,వ్రాతభాష లో సమర్ధించాడు కవి .”తోట అంటే మదన కర్మాంత భూమి ”అని చక్కని పేరు పెట్టాడు .
                       సిగ్గు అనేది యుక్త వయసు వచ్చిన ఆడడానికి ,పైపెచ్చు ప్రౌఢ కాని ముద్దు గుమ్మకు అరణపు సొమ్ము లాంటిది .అంటే సహజమైనది కాదు .–ఎరువు తెచ్చుకున్నది అంటాడు చమత్కారం గా .ఒకడే అనేకమంది స్త్రీలను కట్టుకోవటం కొత్తకాడని చెబుతూ దక్షప్రజాపతి కూతుళ్ళు ఇరవైఏడు మంది చంద్రుని భార్యలు అయారు కదా అంటాడు .అలాగే మామిడి చెట్టుకు ఒకే వేరు నుంచి రెండు తీగలు సాగి అల్లుకోవటం సహజమే కదా అని సమర్ధించాడు .దేవసేన అనే వేశ్య ఆప్యాయం గా తామర పువ్వును కానుకగా కర్నిపుత్రుడికి ఇవ్వమని ఈ విటుడికి అంటే మన భాణం లోని బాణం లాంటి వాడైన వాడికి అందిస్తుంది .ఇదే కారని పుత్రుడైన ఆచార్య మూలదేవుడికి సంజీవి ఆగా పనిచేస్తుందన్న ఆశను వేలిబుచ్చటం తో భాణం ముగుస్తుంది .
                       రజనీకాంత రావు గారి తెనుగు సేత రజనీ గంధం లా సువాసనలీనింది .పద్యం ,గద్యం హృద్యం గా సాగాయి .అసలవి తెలుగు లోనే ఉన్నాయా అన్నంత సహజం గా ,ఆశ్చర్య జనకం గా వున్నాయి .చతుర్భాని నేడు జనరంజకంగా లేకపోయినా ఆ నాడు జనఃరుదయాలను గెలిచినవే .శూద్రకుని భాణం తెలుగు పత్రికా సరస్వతి ”భారతి ”లో ప్రచురితమైంది .భాణం రాసిన వాళ్ళలో వరరుచి ముందు వాడు .రజని గారు వరరుచి రాసిన భాణం ”ఉభాయాభిసారిక ”ను ఆంద్ర ప్రాధ్యాపకులు ,హైదరాబాద్ లోని శారదానగర్ పారదర్శి విద్వ్కద్వరెన్యులు ,చాతుర్భానిని తెలిగిమ్పప్రోత్చాహించిన వారు అయిన శ్రీ ఇప్పగుంట స్సయిబాబా గారికి అంకితమిచ్చారు .ఋణం తీర్చుకున్నారు .
               శ్రీ సాయిబాబా గారు నా అడ్రస్ యెట్లా సంపాదించారో నాకు తెలియదు కాని పుస్తకాన్ని పోస్ట్ లో పంపారు (ఆంద్ర చతుర్భాని) .నేను అందిన వెంటనే వారికి ఫోన్ చేసి కృతజ్ఞతలను చెప్పి నా అడ్రస్ ఎలా తెలిసింది అని అడిగాను .వారు నేను రాసిన పుస్తకం ఎవరో ఇస్తే చదివానని అందులోని అడ్రెస్స్ చూసి మంచి సాహితీ సేవ చేసే వారి గా గుర్తించి పంపాను అని చెప్పారు .నేను సరసభారతి ప్రచురించిన అయిదు పుస్తకాలను వారికి పంపాను .వారు అందినట్లు జాబు రాసి తమ సహ్రుదయతను చాటారు .ఇది అంతా యాదృచ్చికం గా జరిగిన విషయం .ఎవరు ఎప్పుడు ఎలా చేరువవుతారో మనకే తెలీదు .పుస్తకం చదువు తుంటే శూద్రకుని భాణం అడుగడుగునా నన్ను ఆశ్చర్య పరిచింది,మనసుకు పట్టేసింది .అందులోని అలంకారం,నిర్వహణ ,లోకోక్తులు ఆకర్షించాయి .దీనిపై చిన్న వ్యాసం రాయాలనిపించింది .అది క్రమం గా పెరిగి ఇంత అయింది .ఈ వ్యాసం శ్రీ సాయిబాబా గారికి రజనీ కాంత రావు గారి భాష లో ‘హరిచందనపు పూత.”గా అందిస్తూ ,వారికే అంకితం చేస్తున్నాను .
                        చక్కని ముద్రణ ,ఆకర్షణీయమైన ముఖచిత్రం ఈ పుస్తకానికి వన్నె చిన్నెలు .మొదటి ముద్రణ 2005  లోనే జరిగినా ,శ్రీ సాయిబాబా గారి వల్ల ఇప్పుడే చూడగలిగాను .ఇప్ప పూవు ఒక రకమైన రుచిగా ,మత్తునిచ్చే ద్రవ్య నిదిగా ,భద్రాచల శ్రీరాముని ప్రసాదం గా మనందరికీ తెలుసు .మరి ఇది ”ఇప్పగుంట ”కదా .శృంగార ఖని గా భాసించింది .దాన్ని ఆడరించ్ ప్రోత్చాహించింది .శూద్రక కవి ”తామరపువ్వుకానుక ”లో పుష్పవీది లోని వసంత వధువును నానా కుసుమ సముదాయం గా వర్ణించిన తీరు ,దాన్ని రజని గారి అనువాదం  పుష్పసుగందాన్ని రాశీభూతం చేస్తే ,దాన్ని అత్యంత సుందరం గా చిత్రించారు ”బ్నిం ”.ముఖ చిత్రం ,ఉజ్జయిని లో ఒజ్జల వద్ద విద్యనేర్చే చాత్రవరుల లోపలి చిత్రం ,అట్టచివర సంగీత సాహిత్య బయకారుడు ,ఉభయకారుడు ,వాగ్గేయకారుడు అయిన మాన్యశ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారి చిత్రం ఆకట్టు కుంటాయి .శూద్రుని భాణం ”పద్మ ప్రాభ్రుతకం ”ను స్నిగ్ధ హృదయుడు ,కళా హృదయుడు అయిన సొగసు కాడు స్వర్గీయ ఆచంట జానకి రాం గారికి అంకితమిచ్చారు.  ఈశ్వరదత్తభానం ‘  ధూర్త విట  సంవాదం ”ను ఆకాశవాణి పూర్వ సంచాలకులు కీర్తిశేషులు పెనుబోలు బాల గురుమూర్తి (బాలు )గారికి అంకితం చేసి సహృదయత చాటుకున్నారు సౌమిల్లకునిభాణం ”పాద తాడితం ”ను ప్రముఖ పరిష్కర్త ,85 ఏళ్ళ క్రితమే ”పాటలీపుత్ర చతుర్భాని ” పేర ముద్రించి వెలుగులోకి తెచ్చిన కీర్తి శేషులు మానవల్లి రామ క్రిష్నయ్య కవి పంతులు గారికి అంకితమిచ్చి తన కృతజ్ఞతను తెలియ జేసుకున్నారు .
                     ఇవన్నీ పాటలీపుత్రం లో జరిగే శృంగార కధలే ఇవి .పాటలీపుత్రానికే కుసుమపురం అనే పేరుంది .అదే నేడు పాట్నా అయింది .ఆందరూ లబ్ధ ప్రతిష్టులైన కవీశ్వరులే నవరత్న కవుల సరసన వున్న వారే .శ్రీ ఇప్పగుంట సాయిబాబా గారు విస్తృతమైన ”భూమిక ”కూర్చి ,తమ సంస్కృత ,ఆంద్ర భాషా శేముషిని ఎరుక పరచారు .నాలుగు భాణాల్లో” పుష్ప  భాణం ”గా ఎదను తాకిన శూద్రక భాణం నిజం గా రసజ్ఞులకు ”పద్మ ప్రాభ్రుతకమే ”అంటే ”తామర పువ్వు కానుకే ”.
                                                                       సంపూర్ణం
                                                            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

పద్మ ప్రాభ్రుతకం (తామర పువ్వు కానుక )–అలంకార సంపద —-2

          పద్మ ప్రాభ్రుతకం (తామర పువ్వు కానుక )–అలంకార సంపద —-2
                           వసంతుడిని పుష్పాలతో అర్చించటం ఉచితమేనా ?ఉచితమే అంటూ బహు గొప్పగా సమర్ధించాడు శూద్రక కవి .సూర్యునికి దీపారాధనతో ,సముద్రానికి అందులోని నీటితో పూజ చేయటం లోక సహజమే .వాక్కు కు ప్రభువైన బ్రహ్మదేవుడిని వాక్కులతో అర్చించటం లోక రీతి .అలాగే వసంతుడినీ ఆయన ఇచ్చే పూలతో పూజించటం సహజమేనంటాడు కవి .తనను చూసి తప్పించుకు పోతున్న విపులామాత్యుడిని పలకరిస్తూ ”కలువ స్నేహితులను మేలుకొలపని,పగటి చంద్రుడిలాగా దాటుకు పోతున్నావెం?”అని ఆలంకారికం గా ప్రశ్నిస్తాడు .వాన ,బురద తో ,వరదలతో నది కలుషితమైనపుదు ,దాన్ని శుభ్రపరచాటానికి శరదృతువు వస్తుంది .తీవ్రమైన చలి రాత్రిలో విసనకర్ర తో విసురు కోవటం వ్యర్ధం .వ్యాకరణ పాండిత్యం తో హడలగొట్టే ”దత్తకలాషి ”అనే విటుడికి స్వాగతం చెబుతూ ”స్వాగతం అక్షరాల బందెల దొడ్డికి ‘అని చురుక్కున మాటల ఈటెలతో పొడుస్తాడు .ఉక్కనేలపై తాబేలుగా తిస్తవేయటం ,వారుణీ జఘన పాత్రం గంగా తీర్ధం లాగా పవిత్రం అనటం ,గొల్లపేట లో పెరుగు అమ్మటం ,కపటప్రచార కంచుకం తీసివేయటం చక్కని పలుకుబళ్ళు .దీనికి సంస్కృతం లో శూద్రకునికి ,తెలుగు చేసిన రజనికి వందనాలు .
                      పువ్వులు అమ్మే వీధిలో అనేక పూలసముదాయం అంగ ప్రత్యన్గాలుగా రూపుదాల్చిన వసంత వధువు లాగా ఉందట పూలు అమ్మే వీధి అంతా .ఆ వర్ణనా  మనోహరం గా వుంది . .పదండి నాతో పూలరంగడులు లా ఆ వీధిలోకి .బాగా విచ్చుకొన్న తామర పూవు వసంతం అనే వధువు సిరిమోము (శ్రీముఖం )లాగా ,విరజాజిమొగ్గలు పలువరుసగా ,కలువపూలె కన్నులుగా ,ఎర్రమద్ది పూవు క్రింది పెదవిగా ,తుమ్మెద రోద తేట తేనె పలుకులా ,పూలగుత్తులు రోమ్ములుగా ,సిగచుట్టు దండలే నగలుగా ,పేర్చిన పుష్ప్పాలే వస్త్రాలుగా ,పూలమాలలేమొలనూలుగా  ,పుష్పాలతో అమరిన స్త్రీ రూపు ధరించి పుష్పవీది వసంతుని రాణి లాగా శోభలీనుతోందట ..సాహిత్యచరిత్రలో పుష్పవీధిని ఇంత ఊహాత్మకం గా వ్యూహాత్మకంగా చిత్రించిన కవి లేడేమో /
                        పండుముసలివాడిని చూసి ”ముసలితనం బాగా పండుతోంది కదా ?’అని అంటే వాడు ”ముదిసిన పాములాగా ముసలితనపు కుబుసం వదలగోట్టుకున్తున్నాను ”అని గడుసు సమాధానం చెప్తాడు .ముసలాయన సోయగాన్ని ఎట్టిపోదిచినట్లు మెచ్చుకుంటూ ”కట్టి అంటని గండభాగం తో ముఖం ,పాథ ఇంటికి సున్నం కొడితే శోభించినట్లు గా వుంది ”అని నర్మ గర్భం గా అంటాడు పాత్రధారి సూత్రధారి ,అయిన విటుడు.ముందే చెప్పినట్లు అన్ని పాత్రలు అతనే పోషిస్తాడు .వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసి మాట్లాడుతున్నట్లుంటాడు .అవతలి వాడు అనవలసిన మాటల్ని ,వాళ్ళు అన్నట్లు గా భావించి తనే అనటం భాణం లో ప్రత్యేకత .ఇదే కవి కున్న నేర్పు .ఇంకో బకరా గాడు తనను తప్పించుకొని పోతుంటే ,వాదిమొహం మీదే ”వెన్నెల్ని తప్పించుకొని ,గొడుగులో తలదాచుకోన్నట్లు ,స్నేహితుడిని అయిన నన్ను తప్పించుకుని ,స్థంభం చాటుకు చేరావెందుకురా ?”అని గద్దిస్తాడు .అలాగే ”అందని కోరికలు పొందే లోగా ,అందిన సుఖాలను త్యాగం చేయటం పురుషలక్షణం కాదు అని అంటూ నిప్పు వెదకటానికి దీపం కావాలా?”అని సందేశం ఇస్తాడు కోరిన స్త్రీ ని వాడు చేరు కోవటానికి వీలుగా .
                            వేశ్యవాటికను కూడా సందర్భోచితం గా వర్ణిస్తాడు శూద్రక మహాకవి .మన్మధుని ఇల్లు ,జూదరి పాథశాల ,మాయలకు నిలయం ,వంచనకు పంచ ,అది .అక్కడ డబ్బులేని వాడికి స్వాగతం హుళక్కి .వెతలు కూడా రామ్యమఎదే వేశ్యాగృహం ట.విటుడి అనుభవాలన్నీ కవి ఏకరువు పెట్టాడు .ఆయనకూ అనుభవైక వేద్యాలా ?ఒక బౌద్ధ సన్యాసి ,దొంగచాటుగా వేశ్యా సాంగత్యం పొంది ,ముఖానికి ముసుగేసుకొని ,బయటకు వస్తు మన విటశిఖా మణికి   అడ్డం గా దొరికి పోయాడు .అతన్ని ఆటపట్టిస్తూ ,పనిలో పనిగా బౌద్ధం మీద క్లాస్స్ తీసుకుంటూ విరుచుకు పడ్డాడు .”అర్ధం లేని బోడి దొంగ సన్యాసుల చేత మైలపడి పోతున్న బుద్ధ ధర్మానికి ఎటువంటి దుర్గతి పట్టింది /కాకుల ఎంగిలికి తీర్ధజలం మైలపడటం లేదా ?”అనుకొంటూ ,వాడిని ”విహార బేతాళా ?”‘అని సంబోధించాడు .”వేశ్యా వాటిక అనే దిగుడుబావి దగ్గర అప్పుడే వాలిన కొంగలా ,దొంగ అడుగులు వేస్తూ పోతావెం ?సురత (రతి) పిందపాతం అనుష్టీయతేనా ?చీకటి తప్పూ చేసి ,చేయి కడుకోవటం కాదు కదా ?”అని ఝాడించి పారేశాడు .అప్పటికే బౌద్ధం వెర్రితలలు వేసి ,ధర్మభ్రష్తమై క్షీణదశకు చేరుకోన్నట్లుంది .సంఘం నైతికం గా ,సాంఘికం గా దిగజారిన స్థితి .మళ్ళీ సనాతన ధర్మం వైపుకు ప్రజలు అడుగులు వేస్తున్న జాడ కనబడుతోంది .కాంక్షతో కాని అనుకోకుండా కాని వేశ్యల కొమ్పలకు చేరే భిక్షువులు ,జైన బౌద్ధ సూత్రాలను ఓంకార శబ్దం లాగా విఫలురు అవుతారు కాని దాని నుంచి ఏ వెలుగునూ పొందలేరు ‘అని కవి వాక్కులు .కాలమ్ దానినే రుజువు చేసింది కదా /కవిచెప్పినవన్నీ  తాను ప్రత్యక్షం గా చూసినవే ,అనుభవాలే .”సకల జనులమీద ప్రసన్న చిత్తం వుండాలి కదా ?”అని ఆ భిక్షువు,తనచేష్ట nu సమర్దిన్చుకొంటే ,మనవాడు ”అర్ధం లేని తల గోరుగుడుకి ,స్థిరం లేని మనస్సు వల్ల సిగ్గు కాక  మరేమిటి ?”అని గడ్డి పెడతాడు .,మందలిస్తాడు .”మదన భ్రమ చేత శుద్ధ ఆచమనం లాగా ,నీ వల్ల బుద్ధవచనం భ్రష్టం అయింది ”అని మనవాడు బాధ ,సానుభూతి వ్యక్తం చేస్తాడు .ధర్మ భ్రష్టులుఏ కాలమ్  లోనైనా వుంటారు అని తెలియజెప్పే సన్ని వేశం .ఇలా శూద్రక కవి ఎన్నోసామాజికాంశాలను   స్పృశించి వెలుగు లోకి తెచ్చాడు .భాణం అని పేరే కాని చెడు మీదకు ,అధర్మం మీదకు ,అపకారం మీదకు ,అశ్లీలత పైకి ,అధర్మం మీదకు ,చాపల్యం మీదకు సంధించిన బాణం అది అనిపిస్తుంది లోతుగా పరిశీలిస్తే .వ్యంగ్యవైభవం మూర్తీభావించింది ఇందులో . ,
                              ఇంకాసిని విశేషాలు ఇంకోసారి .
                                                                       మీ –గబ్బిట దుర్గాప్రసాద్ .—19 -10 -11
Posted in రచనలు | Leave a comment

పద్మ ప్రాభ్రుతకం భాణం –లో అలంకార సంపద –1

       పద్మ ప్రాభ్రుతకం భాణం –లో అలంకార సంపద –1
                 శూద్రక మహా కవి సంస్కృతం లో ”మ్రుత్చాకటికం ”(మట్టి బండి )అనే నాటకం రాశాడు .అది చాలా ప్రసిద్ధమైనది .అదే తెలుగులో ”వసంత సేన ”అనే సినిమా గా వచ్చింది .ఆ నాటకం లో వసంతసేన అనే వేశ్య పాత్రను అత్యద్భుతం గా తీర్చి దిద్దాడు .మన గురజాడ వారి ”కన్యాశుల్కం ”నాటకం లోని మధురవాణి నిని వసంతసేన తో పోలుస్తారు .ఆ శోద్రక మహా కవే ”పద్మ ప్రాభ్రుతకం అంటే ”తామర పువ్వు కానుక ”అనే భాణం కూడా రాశాడు .అన్ని భాణాల లో అది చాలా విశిష్ట మైంది .ఈ కవి క్రీస్తు పూర్వం రెండువందల ఏళ్ళ నాటి కవి .ఇంతకీ భాణం అంటే ఏమిటో తెలుసు కుందాం .సంస్కృత నాటకాలలో కధానాయకుడు పురాణపురుషుడు కాని ,ఉదాత్తపురుషుడు కాని అయి ఉంటాడు .అయితే రూపకం అనే పిలువబడే ప్రకరణం ,ప్రహసనం ,వీధీ ,భాణం లలో కధానాయకుడు మధ్యతరగతి వాడు.విషయం కూడా మధ్యతరగతికి చెందినది అయి వుంటుంది .సాంఘిక ఇతివృత్తం అన్న మాట భాణం లో ఒకే ఒక పాత్ర రంగస్థలం మీద కన్పిస్తుంది ..ఇతడే విటుడు .కదాఆయకుడు కాదు .కాని ,నాయకునికి ,నాయికకు మిత్రుడు ,సచివుడు లాంటి వాడు .ధూర్తుడు అని ముద్ర పడ్డ వాడు .శతుడు (shathudu ).కళా శాస్త్ర ప్రావీణ్యం వున్న వేశ్యాలోలుడు .అందచందాలున్న కొత్త నాయికలను ప్రేమించి,ప్రేమిమ్పజేసుకొనే వాడు .వీడినే ధీరలలితుడు అంటారు .ఇతని ప్రేయసిలందరూ సామాన్యలె .ఒకరకం గా చెప్పాలంటే ఈ విటుడు ఇవాల్టి మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అనిపిస్తాడు .అన్నిపాత్రల సంభాషణల్ని ,తన గొంతులో పలికించే నేర్పున్న వాడు .దీన్నే ”స్వర వ్యంజనం ”అంటారు .కనుక విటుడి అనుభవానికి హద్దులు వుండవు .రెచ్చిపోవటానికి హద్దులు లేని అవకాశాలు .అభినయానికి పుష్కలం గా సామగ్రి వుంటుంది .పరిమితి లేని నటన తో పండించ గలడు .శృంగారం పుష్కలం .ఆ రోజుల్లో భాణం ప్రక్రియ అందర్నీ ఆకర్షించింది,ఆహ్లాద పరిచేది .దీనిలో రసం కంటే రసాభాసం ఎక్కువ .రసాస్వాదన లో దగ్గరదారి ”భాణం ”అని విమర్శకుల అభిప్రాయం .భాణం లో సమకాలీన సాంఘిక జీవనం  ప్రతిఫలించడం విశేషం .
                         ఆకాలానికి ఆధునికం గా మొదట రూపకం గా ”ధూర్త విట సంవాదం ”అనే భానాన్ని ఈశ్వర దత్తు అనే కవి సంస్కృతం లో రాశాడు .రెండవ భాణం వరరుచి కవి రాసిన ‘ఉభయాభి సారిక ‘
మూడవది శూద్రక కవి రాసిన ”పద్మ ప్రాభ్రుతక మ్ ”.నాల్గవ భాణంఈశ్వరదట్టు  కుమారుడు సౌమిల్లకుడు రాసిన ‘పాద తాదితం ‘;.ఈ నాలుగింటినీ కలిపి ”చతుర్భాని ”అంటారు వీటిని తెలుగు లోకి ”ఆంద్ర చతుర్భాని ‘గా తేట తెల్లం గా ,కవిహృదయ విశ్లేశకం గా అనువదించిన వారు ప్రముఖ వాగ్గేయ కారులు ,ఆకాశవాణి పూర్వ సంచాలకులు  ,కళాప్రపూర్ణ .శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారు .ఇవి ఆకాశవాణి ద్వారా ప్రసారం కూడా అయాయి .రసికజనులను అలరించాయి .వీటిలో శూద్రక మహ్హకవి రాసిన భాణం పద్మ ప్రాభ్రుతకం (తామరపువ్వు కానుక )లో మెరిసిన అలంకార సంపదనన్నెంతో ఆకర్షించింది .ఆ సంపదను నేను మాత్రమే అనుభవించే సంకుచిత బుద్ధి నాకు లేదు .కనుక ఆ సంపదను మీకూ పంచి ,నేనూ ఆనందాన్ని పొందుతున్నాను .అక్కడకడ పండిన మధుర  హాస్యాన్ని అందిస్తున్నాను .
                          సంవత్చరం అనే విలాస పురుషుడికి చలికాలపు ముసలితనం లో సర్వమూ వుడిగిపోయాయత .అయితేనేమి హిమరసాయనం సేవించటం వల్ల మళ్ళీ వసంత కిశోరత్వం (చిన్న తనం )వచ్చిందట .రుతుపరం గా సంవత్చారాన్ని అద్భుతం గా ఆవిష్కరించాడు ఆలన్కారికం గా శూద్రక మహా కవి .అప్పుడున్న వసంత శోభ ఎలా వుందో తెలియజేస్తున్నాడు చూడండి .చివర్లు అలల్లాడుతుంటే చెట్లు నృత్యం చేస్తున్నట్లుందట .దానితో తీగలు ,పూలు పూసి యవ్వనాన్ని పొందాయత .తిలకం అనే చెట్టు శిరస్సు పై వున్న కోయిల కొత్తముడి గా ఉందట .కుందపుశ్పం మీద కూర్చున్న తుమ్మెద అందమైన స్త్రీ చూపు లాగా ఉందట .ఆకుపచ్చని తామర మొగ్గ అప్పుడే తల ఊపే కన్నె పిల్ల లాగా ఉందట .ఆమని (వసంతం )అనే కోడె (యువకుడు )గాలి వీస్తుంటే వలపు చెలగాటం లో అలసి చెమర్చిన జవరాలి (యవ్వనం లో వున్న )స్థనాల స్పర్శ సుఖం లాగా ఉందట .
                     ఇంకో చోట ”దేవదత్త తో సాంగత్యం అనే మధుపానికి (తుమ్మెద )పక్కనంజుడు కూరలాంటిది దానిచెల్లెలి పొత్తు ”అంటాడు .ఆ పరిసరాలు ,ఆ తాగుడు ,చీకుల నంజుడు   భాషలో .వేరొక చోట ”మదనజ్వరం తేలికగా కనబడుతున్నా ,మహాచేడ్డబలమైనది అంటాడు .ఉజ్జయినీ నగరవైభావం చాలా కొత్తభాషలో చెప్పాడు .”వసుంధర (భూమి )అనే వధువుకి జంబూద్వీపం వదన కపోలం (చెక్కిలి )అయితే దానిమీద చిత్రలేఖనం గా అనిపించే అవంతి సుందరి ఈ ఉజ్జయిని అపర లక్ష్మీదేవి లా విరాజిల్లుతోంది .చాలా గొప్ప ఆవిష్కరణ ఇది .అలాగే అర్ధవంతమైన మాటల సంభాషానాన్ని ‘సరస్వతీ లతకు పూసిన వాక్ పుష్పాలు ”అనటం శూద్రక మహాకవికే చెల్లింది .
                                       మరిన్ని విశేషాలు మరోసారి
                                                                                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —19 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

వైల్దేరిసం (Wilderism )

     వైల్దేరిసం               (Wilderism )
Thornton Wilder గొప్ప అమెరికన్ నాటక రచయిత అని చేపాను కదా .ఇప్పుడు అతని మనోభావాలు తెలియ జేస్తాను .అవి అందరు తెలుసుకోవలసినవే ..రచయిత రాసే భాష అతను జీర్ణించుకున్న అనుభవం ద్వారా తనను గురించి తనకు తాను తెలియ జెప్పుకొంటాడు అంటాడు ఆయన .నాటక రంగం మీద ప్రతిక్షణం ”ఇప్పుడే ”అనిపిస్తుంది .భవిష్యత్తుకు ,భూతకాలానికి మధ్య పాత్రధారులు ఖడ్గ ధార (rajor edge )మీద నిలబడి ,అత్యంత అవసరమైన అంతరాత్మ ప్రబోధకం గా మాటలు పెదాలు దాటి అప్పటికపుడు ప్రయత్నా రహితం గా మాట్లాడుతారు .నవలా అంటే జరిగి పోయిన విషయం .చెప్పేవాడికి స్వయం గారద్దు పరచేదేమి లేక  ఉండక విషయాన్ని దాచి మనకు అతని గొంతు వినిపించేట్లు చేస్తాడు .మళ్ళీ మళ్ళీ లేక్కలేసుకుంటూ జరిగి పోయిన సంఘటనలతో తాను ఎంచుకున్న సంఘటనలను జ్ఞాపకం చేసు కుంటాడు .ఇతను లెక్కించటానికి వీలు కాని ఇతరుల కంటే మనముందు నిలిచి తనకున్న పరిజ్ఞానాన్ని ఆవిష్కరిస్తాడు అంటాడు వైల్దేర్
                   నాటక రంగం అన్ని కళల కంటే మహోన్నత మైనదని అతని భావన .మానవుడు తన లాంటి మరో మానవుని మనోభావాలను అప్పటికప్పుడు  పంచుకొనే వీలున్న  రంగం .రచయిత లందరికి ఏదో కొంత నీతిని బోధించాలని పిస్తుంది .అక్కడినుంచి ,యంత్రం కదలటం మొదలవుతుంది .ఇంకో రకం గా చెప్పాలంటే మనం గాస్ స్టవ్ మీద వండుకొన్న పదార్ధం ఆ గాస్ వాసనతో వుండదు .కాని మనం అందులే వేసిన దినుసుల లోని రుచే వస్తుంది .నాటకం చెప్పేదేమిటంటే -జీవితం జీవిస్తూ ,అందులోనే జీవితాన్ని తెలుసుకోవటం లా వుంటుంది .”మీరు ఎందుకు రాస్తున్నారు ?”అని వైల్దేర్ ను అడిగితే ”నేను ఎందుకు రాస్తున్నాను అంటే -నాపై నేను ప్రయోగం చేసుకుంటూ ,కొత్తపుస్తకాన్ని ఆవిష్కరించాతానికే ,అది చదివి నేను ఆనందించటానికి,లేకపోతే ఒక కొత్త నాటకం తో నన్ను నేను మరచిపోవటానికి,లేక తాదాత్మ్యం చెందటానికి”అన్నాడు ”మీరు చెప్పిన విషయాలన్నీ మీరు రాసిన పుస్తకాలు నేరవేర్చాయా ?”అని ప్రశ్నిస్తే ”లేదు ”అని ఖచ్చితం గా చెప్పాడు .
                         వైల్దేర్ అభిప్రాయం ప్రకారం రచయిత తప్పని సరిగా విమర్శకుడు అయివుండాలి ..ప్రతి వాక్యం శక్తివంతం గా తిరస్కరిమ్పబడే అస్తిపంజరమే నంటాడు .ప్రతి అంగీకారం సత్యం శక్తి ,సౌందర్యం మొదలైన వాటిని పాలించేదే .రచనావ్యాసంగం చాలాభాగం వదలివేయబడే వ్యూహాత్మక అంతశ్చేతనా విధానమే .విమర్శకుడు పందోమిదిభాగాలు నీళ్ళలోనే మునిగివుందే మంచుపర్వతమే (ఐస్ బెర్గ్ )అంటాడు నాటక కర్త వైల్దేర్ .ఎందుకు ,ఎలా రాశాడు అనే విషయం మీద రాసే వారిని W.B.yeats  ”వసంతాన్ని మురికి చేయటం వంటిది ”అన్న మహాకవి బ్రౌనింగ్ వాక్యం తో హెచ్చరించినట్లు వైల్దేర్ చెప్పాడు చివరగా వైల్దేర్ ”ఆపిల్ పండుఎర్రబడిన   చోట తొంగి చూడకు-చూస్తే   మన స్వంత ఎడెన్ కాని నువ్వు కాని నేను కాని ఉండము ‘.అని హితవు చెప్తాడు
                                                       మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –18 -10 -11 .

 

Posted in అనువాదాలు | Leave a comment

నాటక రచయిత wilder

                        నాటక రచయిత wilder
ప్రయోగాత్మక నాటక రచయిత గా ప్రపంచ ప్రసిద్ధి పొందిన నాటక రచయిత  Thorton wilder .అమెరికా లోని విస్కాన్సిన్ లో ని మాడిసన్ లో 17 -04 -1897  లో జన్మించాడు .సృజాత్మక నవలా కారుడు ,నాటక రచయిత .విశ్వం మీదఆయన  ఆలోచనలు ఆశ్చర్యం కలిగిస్తాయి .1920 లో yale  విశ్వ విద్యాలయం లో డిగ్రీ పూర్తి చేశాడు .1930 -37 మధ్య చికాగో విశ్వ విద్యాలయం లో డ్రా ,క్లాసిక్స్ బోధించాడు .1926 లో   the kobaala అనే  మొదటి    నవల  రాశాడు   .తర్వాతి   నవల   bridge of saint louis   1927 లో రాస్తే దాన్ని సినిమా తీశారు .టి.వి .లో కూడా వాడుకునారు .1930 లో the women of andros రాశాడు .ఆయన రాసిన దాన్ని బట్టి ఆయన్ను అమెరికన్ అని అనుకోలేదు .గ్రీకు రచయిత ఏమో ననుకున్నారు .అంటే అతని కృషి యెంత గొప్పదో తెలుస్తుంది .1948 లో the ides of march ,1967  లో  The english day ,1973 లో    Thiophilus North రాశాడు  .
                 అతని నాటకాలు కొత్త తరహా గా వుంటాయి .అందులోని పాత్రలు ప్రేక్షకులతో మాట్లాడు తాయి .అంటే ఆ కాలాన్ని మనముందు ఆవిష్కరిస్తాడు . . .మనం ఆ కాలమ్ లో వున్న  అనుభూతి వుంటుంది .అందులో భాగస్వాములం అవుతాం .అదొక గొప్ప థ్రిల్లింగ్ .1938 లో రాసిన నాటకం అవర్ టౌన్ ..ఇందులో స్టేజి మేనేజర్ పాత్ర సృష్టికి ఆశ్చర్య పోతాం .1958 లో వచ్చిన the match maker  లో కూడా ఇలాంటి సృజనాత్మక ప్రయోగమే చేశాడు .ప్రేక్షకులతో మాట్లాడటమే వీటి ప్రత్యేకత .helo daddy naatakam కూడా  super hit .ఇది ముసిచల్ డ్రామా గా సినిమా గా వచ్చింది .
                      the skin of our teeth నాటకం 1942 లో ఒక కాలానికి చెందిన విషయాలను వరుస తప్పించి ,తారుమారు చేసే పధ్ధతి anachronism అంటే కాల వ్యతిక్రమం అనే కొత్త విధానం తో రాశాడు .ఆ నాటి భౌగోళిక చారిత్రాత్మక కాలాల లోని పాత్రలను తీసుకొని వారి తోనే ప్రేక్షకులతో మాట్లాడించే విధానం ఇందులో వుంది .ఇదో నూతన ప్రక్రియ .దీని వల మానవ అనుభవాలు ఏ కాలమ్ లో నైనా ,ఏ ప్రదేశం లో నైనా ఒకటి గానే వుంటాయి అని చెప్పటం అతను సాధించిన విజయం .ఇలా కొత్త తరహా ప్రయోగాలను నాటక రంగం లో చేసి సఫలీక్రుతుదయాడు .విపరీతం గా ప్రేక్షక ఆదరణ పొందాడు
wilder .అతని అనుభవాలను గురించి ఇంకో సారి తెలియ జేస్తాను .
                                                             మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -10 -1
Posted in సేకరణలు | Leave a comment

“సరదాగా కాసేపు ” ఆవిష్కరణ న్యూస్ పేపర్స్ లో

Newspaper-clips

Posted in సభలు సమావేశాలు | Leave a comment

SARADAGA KASEPU by Gabbita KrishnaMohan Book release function

Title of the book: SARADAGA KASEPU by Gabbita KrishnaMohan Book release function held today 15th October 2011, at Ravindra Bharati. This book is adapted in Telugu based on Ten Selected short strories from Mulliner Series of P G Wodehouse. The book was released by Mr Mohan Kanda IAS, former Chief Secretary, Andhra Pradesh Other dignatories on stage were: Mr Vamsi, Writer, Music Director, Film Director and Singer Ms Ravalapalli Suneetha – eminent writer Hasya Brahma Sankarnarayana from Eenadu group Poodoori Rajireddy, Editor FUNDAY – SAKSHI B. Eswara Reddy, Manager, Visalaandhra Publishing house Anchored by: Rampa, Cartoonist Book Published by: Visalaandhra Publishing House

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సాహితీ మండలి ఉయ్యురు 260 వ సమావేశం

Sahithimandali 260 111016_0001

Posted in సభలు సమావేశాలు | Leave a comment

మండలి బుద్ధ ప్రసాద్ – సన్మాన సభ – అవనిగడ్డ – 14.10.2011

Posted in సభలు సమావేశాలు | Leave a comment

తెలుగు భాష “చిరంజీవి”

Telugu Basha Chiranjivi

Posted in సభలు సమావేశాలు | Leave a comment

గురజాడ 150 వ జయంతి ఉయ్యూరు లో – కృష్ణా జిల్లా రచయతల సంఘం – సరస భారతి –

Gurajada 150 111022

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

గాంధీతాతా నువ్వే చెప్పు! – కంచ ఐలయ్య

గాంధీతాతా నువ్వే చెప్పు!
11_10_2011_004 Gandhi tata

రావాలనుకున్న తెలంగాణ రాష్ట్రం రాక మా ప్రాంతపు ముగ్గురు నేతలు నువ్వు పుట్టిన రోజున నీ సమాధి దగ్గర నీ టోపి పెట్టుకొని కూర్చున్నారు. ఆ మూడు ఫోటోలు చూస్తే నాకు నువ్వు బతికి వుండగా మూడు కోతులకు చెడు మాట్లాడం, చెడు వినం, చెడు చూడం అని నేర్పిన నీతి గుర్తొచ్చింది. అందులో ఒకాయిన గాడ్సే గాడిలో ముసలితనం పొంది ఇప్పుడు నీ గాడికొచ్చాడు. ప్రాంతాల పంపకంలో 55 కోట్ల రూపాయలు పాకిస్థానుకియ్యాలని నువ్వు ఉపవాసనమున్నందుకు నిన్ను చంపుడు సరైందని వాదించి, వాదించి ఇప్పుడు నీ దగ్గరికెందుకొచ్చాడు?

ఆయన పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో నీ అహింస సూత్రం ఆకుతో సమానమని ముస్లిం ఆడోల్ల కడుపులు కోసి పిండాలను మంటల్లో ఏసిన అహింసా అసలు రూపం అని వాదించాడు. అలా వాదించి, వాదించి మొన్న మోడీ సద్భావనంలో నీ ఫోటో పెట్టుకోగానే నువ్వు కాంగ్రెస్‌ను వదిలేసి వాళ్ళతో పోతున్నావని ఈయన నీ సమాధి దగ్గరికొచ్చి, చెడు చేసుడటుంచి, చెడు మాట్లాడనన్నట్టు కూర్చున్నాడు.

తెలంగాణలో వాళ్ళ రాజ్యమొస్తే ముస్లింలను ఊచకోత కొయ్యమని ఎక్కడ చెప్పడం లేదు. స్వాతంత్య్రం రాకముందే ముస్లింల రక్షణ మీద, రాజ్యం ఏర్పాటు మీద (పాకిస్థాన్) నువ్వు 1931 నాటికే ఒప్పుకున్నావుగా. మైనార్టీల వాటాపై గాని రక్షణపై గాని వీళ్ళు అగ్రిమెంట్ ముందు అవసరం లేదంటున్నారు. నువ్వేమో వాళ్ళకు ప్రత్యేక దేశమివ్వటానికే ఒప్పుకున్నావు. నిన్ను వాళ్ళు చంపి 63 ఏండ్లయింది. ఎన్నడు నీ దగ్గరికి రానోళ్ళు గీ చిన్న తెలంగాణ కోసమొస్తున్నారంటే మాకందరికి భయమేస్తుంది.

తెలంగాణ ప్రాంతానికి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, చత్తీస్‌ఘడ్ నుంచి వీళ్ళ కన్న తల్లి ఆర్.యస్.యస్. పైసల్నీ పదాతిదళాల్ని పెద్ద ఎత్తున పంపుతుంది. భాషా రాష్ట్రాలను విడగొట్టడం తెలంగాణతో మొదలుపెట్టి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లకు చిన్న రాష్ట్రాల ఉద్యమాన్ని పాకించి, కరప్షన్‌తో చిన్న రాష్ట్రాల ఉద్యమాన్ని జోడించి సోనియా గాంధీని ఇటలీకి పంపించాలనేది వాళ్ళ వ్యూహం. ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెలమ దొరల రాజ్యం ఏర్పరచవచ్చని ఒక ప్రయత్నం జరుగుతుంది.

మీ దగ్గరికొచ్చిన రెండోనేత ఇక్కడ తెలంగాణ రాజ్యాన్ని నడపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌ను ఆక్రమించుకున్నాక ఇక్కడ రెడ్డి, వెలమలను కొంత అణచిపెట్టారు. కాంగ్రెస్ గూటి నుండి ఒక దళితుడు, టిడిపి గూటి నుండి ఒక బి.సి. తెలంగాణలో ముందున్న పెట్టుబడిదారులుగా కనిపించారు. ఒక ముస్లిం కుటుంబం కూడా ఎదిగింది. గ్రామీణ ప్రాంతాల్లో యస్.సి, బి.సి.లు అన్ని రంగాల్లో కనిపించడం మొదలైంది. కుల నిర్మూలన అసలు చెయ్యొద్దనీ నువ్వు కూడా అంబేద్కర్‌తో పోరాడి దాన్ని కాపాడావు కదా! దాని నిర్మూలనకు ఇదొక ‘అడ్డ’గా తయారైందని వీళ్ళు తపన చెందుతున్నారు.

ఇక్కడి మూడు ప్రాంతాల్లో అన్నిటికంటె ఎక్కువ ‘బి.సి’ చైతన్యం ఉన్న ‘అడ్డ’గా ఇది తయారైంది. ఈ ప్రమాదం నుండి కాపాడాలంటే ‘ఆంధ్ర కమ్మరాజ్యం’ ‘రాయలసీమ రెడ్డిరాజ్యం’గా మారినట్టు దీన్ని ‘వెలమ రాజ్యం’గా మార్చే ‘విప్లవం’ ముందుకొచ్చింది. చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ సిద్ధాంతం ఎట్లా తప్పో ఇక్కడే నిరూపించాలని ఈ ఇద్దరు నాయకుల్ని నీదగ్గరికొచ్చిన పెద్ద రావు, అడవిలోని అజ్ఞాతరావు అనుమతితోనే ముందుపెట్టారు. అంటే ఈ చిన్న రాష్ట్రంలో వెలమరాజ్యం రాబోతుందన్నమాట. నీ అండదండలతో నెహ్రూ చెప్పినట్లు ఈయన ఆంధ్ర పాలకుల దీవెనలతో ఎదిగి కుటుంబపార్టీని పెట్టాడు. 2001లో అప్పులతో పార్టీ ప్రారంభించి “కలెక్షన్ క్యాపిటల్ అక్యుములేషన్” ఒక కొత్త సిద్ధాంతాన్ని అమెరికా నుంచే దిగుమతి చేశారు. ఈ అక్యుములేషన్ బనియా “బిజినెస్ క్యాపిటల్ అక్యుములేషన్” పూర్తిగా విరుద్ధమైంది.

బనియా బిజినెస్ క్యాపిటల్ పిసినారితనం కలిగి ఉంటుంది. కాని కలెక్షన్ క్యాపిటల్ ఖర్చు చేస్తుంది, కొంత ఇన్‌వెస్ట్ చేస్తుంది. ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఎన్నడు ఖర్చుపెట్టలేదు. కాని ఈయన కుటుంబ సభ్యుల నేతృత్వంలోని స్వాడ్‌లకు భయపడి బాగానే రాలారు. ఈ క్రమంలోనే వెలమ కలెక్షన్ క్యాపిటల్ కూడ కొన్ని కుటుంబాల్లో జమైంది. ఇప్పుడు వెలమలకు రెండు టి.వి. చానెల్స్ ఒక తెలుగు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో ‘తంతే వీరు హైదరాబాద్ పరుపులో’ పడ్డారు. ఇటువంటి మీడియా పట్టు తెలంగాణ రెడ్డి క్యాపిటల్‌కు లేదు.

బి.సి., యస్.సి.లు ఈ క్యాపిటల్ ప్రచార సాధనాల ముందు నిలువలేదు. తెలంగాణ రెడ్లు రాయలసీమ రెడ్ల గుప్పిట్లో ఇరుక్కుపోయి బయటపడేలోపే పనంతా జరిగిపోయింది. ఇక్కడి వెలమలు అన్ని రంగాల్లో రెడ్లకు అందనంత ఎత్తు ఎదిగారు. తాతా నీది చిన్నకులమైనా అది జాతి అంతటా ఉంది కనుక నువ్వొక జాతీయవాదివయ్యావు. వీళ్ళది చిన్న ప్రాంతంలోని చిన్నకులం కనుక ప్రాంతీయ వాదమే వారికి ‘శ్రీరామ రక్ష’. నీకు లేని మంచి లక్షణాలు కొన్ని వాళ్ళకున్నాయి. నీకు ఫార్‌మల్ పవర్ వద్దన్నావు. వాళ్ళకది సంపూర్ణంగా కావాలి.

నువ్వు సిద్ధాంత శత్రువువనుకున్న అంబేద్కర్‌ను డిస్‌ప్రూవ్ చేసి చిన్న రాష్ట్రాల్లో ఎంత చిన్నవైన అగ్రకులాలే అధికారంలోకి వస్తాయని చెప్పడానికి వాళ్ళు నీ దగ్గరికొచ్చారు. అన్ని రంగాల్లో అంబేద్కర్ సిద్ధాంతం చితికిపోవడమే నువ్వు కోరుకునేది కూడ. ఆ పని వాళ్ళు చెయ్యగలరు. ఐతే ఈ ‘కలెక్షన్ క్యాపిటల్’ చలనశక్తి ఎంతో మీ తరానికి అర్థంకాదు. ఇది ముందు బొంబాయిలో శివసేనతో ప్రారంభమైంది. ఇది చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. సెంటిమెంట్ ప్రాంతీయ వాదం దీని బలం.

దీని మజిల్ పవర్ ఇంగ్లీషు విద్యలేని బి.సి.ల నుండే ఎక్కువ వస్తుంది. ఇది ఎంత వేగంగా కలెక్ట్ అవుతుందో అంత వేగంగా ఖర్చు అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. దీనికి ఆర్.యస్.యస్. అండ, అడవి పోరాటం అండ రెండు ఉండడంతో ఇది ఇంకా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఈ ఊపులోనే ఇక్కడ అంబేద్కర్‌ను చంపడం దాని లక్ష్యం. ఈ హత్య నీ అహింస సిద్ధాంతంతో కూడ చెయ్యొచ్చు. అంబేద్కర్ చచ్చిన కులాల్ని లేపి విద్యతో అధికారుల్ని, మంత్రుల్ని చేశాడు. అది తెలంగాణ వెలమలకు రెడ్లకు అసలె గిట్టని సమస్య. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రభుత్వ స్కూళ్ళు మూస్తే అంబేద్కర్ ఆటోమ్యాటిక్‌గా చస్తాడు. ఆ పని 1969 నుండే ప్రారంభమైంది. గత రెండు ఏండ్లలో తారాస్థాయికి చేరుకుంది.

తెలంగాణ రాగానే తెలుగుతల్లి సహాయంతో వెలమ పాలకులు ఇంగ్లీషు విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఆపేస్తారు. అది నీకు ఇష్టమే. గత పదేండ్లలో ‘కమ్మ క్యాపిటల్’ పాలనలో కాస్త కదిలాడిన తెలంగాణ బి.సి.లు, మాదిగలు ఇప్పటికే మంటగలిసే రోజొచ్చింది. ఇక్కడున్న వెలమ-రెడ్లు కొన్ని చిన్న కులాల నుంచి వచ్చిన మేధావులు తమ వెంట ఉంచుకోవచ్చు. కాని సామాజిక తెలంగాణ బి.సి., మాదిగ, ముస్లిం, క్రిస్టియన్ ఐక్యతలోనైన సందుపట్టే చాన్స్‌పోయింది.

ఇప్పుడు తెలంగాణ వస్తే వెలమ క్యాపిటల్‌కు-రెడ్డి క్యాపిటల్‌కు మధ్యనే అధికారం తిరుగుతుంది. సమైక్యాంధ్రలో అది రెడ్డి, కమ్మ క్యాపిటల్ మధ్య తిరిగేది. వెలమలు సమైక్యాంధ్రను ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న ‘కలెక్షన్ క్యాపిటల్’ బిజినెస్ క్యాపిటల్ అడవి అండతో కూడ పరిపాలించలేరు. కమ్మ క్యాపిటల్‌తో తట్టుకోలేని సమైక్యాంధ్ర రెడ్లు వైఎస్ఆర్ హయాంలో ‘అగ్రెసివ్ స్టేట్ ప్లండర్’ రూపంలో నిలదొక్కుకోవడమే కాక కమ్మ క్యాపిటల్‌నే ఉక్కిరిబిక్కిరి చేశారు.

తాతా, గ్లోబలైజ్‌డ్ పెట్టుబడితో ఆర్గనైజ్‌డ్ అగ్రెసివ్ పెట్టుబడి సమీకరణ నీకాలంనాటి బనియా వ్యాపారంలా చిన్న మొత్తాలను దండి కొట్టే వ్యాపారంతో సంపాదించదు. అది రోజువారీగా దండుకుంటుంది. మొదట్లో కొంత అభివృద్ధి లక్షణమున్న కమ్మ క్యాపిటల్, అది అధికారంలో ఉన్న ఆఖరి దశలో చాలా గర్విష్టిగా తయారై ఒక పక్క మొత్తం వ్యవసాయ రంగాన్ని, మరో పక్క తెలంగాణ వెలమ రెడ్లని, కాలికింద బంతిలా తొక్కింది. ఆ అణచివేత నుండి ఈ అగ్రెసివ్ వెలమ ‘కలెక్షన్’ క్యాపిటల్ పుట్టింది. ఇది త్వరలోనే నిలదొక్కుకున్నది. పెరిగి పెద్దదయింది.

దీనికి వెనుకబడిన, ప్రాంతాల స్వయం పాలన సిద్ధాంతాన్ని తుపాకిలా పట్టుకున్న ‘అన్న’ల అండ దొరికింది. వాళ్ళు ఓటు బైకాట్ అని బయటికి చెప్పినా, అది కనుసైగతో కొత్త పార్టీ బాక్సుల్లో పడ్డది. ఇలా పుట్టిన పార్టీలు ఆత్మగౌరవం నినాదంతో గులాబీ జెండా కింద సకల వెలమల్ని సమీకరించింది. 1969లో పోరాటం ఆంధ్రా తెలంగాణ భూస్వామ్య శక్తుల మధ్య జరిగి చివరికి ఆంధ్ర రెడ్డి భూస్వామ్య శక్తులు చెన్నారెడ్డితో పరిపాలించబడడానికి సిద్ధపడ్డాయి. ఇప్పుడు పోరు పెట్టుబడి రంగానికి మారింది. నక్సలిజానికి ఉత్తర తెలంగాణ వెలమ పెట్టుబడిదారులకు ఉన్న కుల పునాదుల్ని కమ్మ పెట్టుబడి అర్థం చేసుకోవడంలో పూర్తిగా ఫేలయింది.

నీ దగ్గరకొచ్చిన మూడో టోపి పౌరహక్కుల పాయది. అది మధ్యవర్తిత్వ పని చేస్తున్నది. పౌరహక్కుల ఉద్యమంలో బాగా కష్టపడి కాలం గడిచిన ఒక మిత్రుడు చెప్పినట్లు ఆ ఉద్యమంలో కొంతమంది ఆస్తుల్ని కాపాడుకోవడానికి పనిచేశారు. ఇప్పుడు అటువంటి కొన్ని శక్తులు ఆస్తులు కాపాడుకోవడం దశ దాటిపోయి, ఆస్తుల్ని పెంచుకొని కొత్త అవతారమెత్తడానికి ఇదొక అదును. ఈ టోపీ, మార్క్స్‌కూ, మావోకు టోపీ పెట్టి నీ దగ్గరకొచ్చింది. ఆస్తుల పెంపకంలో ఈ కోవవారు ప్రస్తుతం కాషాయ టోపీ, ‘కద్దర్’ టోపీ ఏదైన పెట్టడానికి సిద్ధం. ఐతే దాని ప్రధాన పని వెలమ-రెడ్ల మధ్య మధ్యవర్తిత్వం. ముందేమైతదో చెప్పలేం.

ఈ ఉద్యమంలో దళిత నేతృత్వ పాయకూడ ఒకటున్నది. దానికి కిందా పైనా వెలమలే ఉన్నారు. ఈ పాయ అంబేద్కర్ సిద్ధాంతాన్ని నీ వేషంలో చెబుతుంది. గదెట్ల సాధ్యం. గణపతికి కల్లుతాపాలని చూస్తే తాగుతాడా? ఆయన తనవాళ్ళు నుండొచ్చే విస్కే తాగుతాడు. అందుకే సకల సమ్మెలో దళిత-బహుజనుల ఏకైక పెట్టుబడైన చదువు బందు పెట్టిండ్రుగాని విస్కీతాగుడు బందు పెట్టలే. ఈ కొత్త పెట్టుబడికి దేన్ని ఎప్పుడు, ఎట్లా బందు పెట్టాలో తొందర్లోనే అర్థమైంది. అది ఎంత ఆడిన, పాడిన అధికారం దాని చేతికి రాదు. అది కలవారి కాలువల్లో నీళ్ళు మాత్రమే పోయగలదు. ఆ నీళ్ళన్నీ ఈ ప్రాంతపు దొరవారి నదిలోనే పడుతాయి.

తాతా నీకు అనుభవమున్నది. నీ జాతీయ పోరాటంలో ఒక్క అంబేద్కర్ మాత్రమే నీ కాలువలకు నీళ్ళురాకుండా తన పెరట్లో తన చెట్లో పెట్టుకొని నీళ్ళుపోసుకున్నాడు. జిన్నా నీ కాలువకే గండికొట్టి తనదో చెరువు కట్టుకున్నాడు. ఇక మిగతా కాలువల్లోని నీళ్ళు నీ నదిలోనే పడ్డాయి. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఏదో ఒక కాలువలో నీళ్ళుపోసి వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజల నాలుకలెండ కొట్టినోల్లే. వాళ్ళనుండి పూర్తిగా లాభం పొందింది నువ్వే. వాళ్ళదప్పుడు ఎంత మంచి జాతీయవాదమో ఇప్పుడంత మంచి ప్రాంతీయ వాదం కూడా.

నిన్ను నేనడిగే అఖరి ప్రశ్నేమంటే, ఆంధ్ర కమ్మ-రెడ్డి క్యాపిటల్‌లో కొంత భాగం ఇంత తొందరగా వెలమల గంపలో పడ్డాక వచ్చే కొత్త రాష్ట్రంలో సామాజిక తెలంగాణో, బహుజన తెలంగాణో సాధ్యమేనా? ఇప్పటికీ వెలమల క్యాపిటల్‌కు ఉన్న తిరోగమన అగ్రెసివ్ హిందుత్వ లక్షణాలను మా కండ్ల ముందే చూస్తున్నాం. రాజ్‌ఘాట్‌లో వాళ్ళకు, నీకు కుదిరిన అగ్రిమెంట్ తెలంగాణలో అంబేద్కర్‌ను చంపడమే అయితే ఈ చిన్న రాష్ట్రాల కోసం జరిగే పోరాటంలో నీ అహింస పోరాటం ప్రకారమే దళిత-బహుజనులు తమను తామే చంపుకుంటున్నారు కదా! ఇది ఎంత కాలం జరగాలి? ఎంత మంది సచ్చేదాక జరగాలి? ఇక్కడ ప్రజలంత సచ్చి పాలకులు బతికుంటే చాలా? నువ్వు నడిపిన మొత్తం స్వాతంత్య్ర పోరాటంలో కూడ ఇంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారా?

క్యాపిటల్ ఆంధ్రదైనా, రాయలసీమదైనా, తెలంగాణదైనా ఇక్కడి పాలకకులాల మధ్యే తిరుగుతుంది. అధికారం మాకు కావాలనుకునే దళిత-బహుజన రాజకీయ నేతలైనా, ఉద్యమ నేతలైనా పెట్టుబడి ఏ కులాల్లో ఉంది, దాని బలమెంతో చూడకుండా చూస్తే సామాజిక న్యాయం దొరుకుతుందనుకుంటే గాంధీ టోపి వీరి నెత్తుల మీద కూడ పెడతారు. సిద్ధాంతాలకతీతంగా రాష్ట్రం సాధించుకోవాలి అని ఆర్.యస్.యస్.ని, అంబేద్కర్‌ని, మావోను ఒకే పడవెక్కిస్తే పడవ మునుగుద్ది కాని బతికి బయట పడేది నాలుగు పడగల హైందవ నాగరాజే.

– కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత

Posted in రాజకీయం | 2 Comments

ముక్కోతి కొమ్మచ్చి లో రమణుడి నానుడి

Ramanudi Naanudi

Posted in ముళ్ళపూడి & బాపు | Leave a comment

సరదాగా కాసేపు పది కధలు

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఏమండోయ్ ! తప్పకరండి సరదాగా కాసేపు పి జి వుడ్ హౌస్ – పది కధలు – ఆవిష్కరణ ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | 2 Comments

సరసభారతి – 27.09.2011

ఆడియో -౨ adiyo -3

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

బతుకమ్మ కాదు… రాజకీయాలాడలి … ఆంధ్ర జ్యోతి

IMG

Posted in సేకరణలు | 1 Comment

రసభారతి – జాషువా జయంతి- విజయవాడ- సాహితీ మండలి – వుయ్యూరు సమావేశం

రసభారతి  – జాషువా జయంతి – విజయవాడ

 

Posted in సభలు సమావేశాలు | Leave a comment

అనంతం – రసభారతి

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఆంద్ర జ్యోతి లో కంచ అయిలయ్య రాసిన ”చదువులకు సమ్మె వద్దు ‘

Posted in సమయం - సందర్భం | Leave a comment

హైకూలు

 హైకూలు
01 -పది రోజులు రోడ్డు మీద
     రక్తమే కాని, మంచినీటి వాసన
     ఆశ ఎండ మావియా ?
02 -అస్థవ్యస్థత అవహేళన నుంచి
      రాజీ  నాగరికం
      రెండూ  ఎక్కడున్నవి అక్కడే
03 -ప్రతి తరం
      నాగరికతను  నేర్చుకొంటుంది
      లేకుంటే అందనంత ఎత్తున వుంటుంది
04 -అసలైన వాళ్ళు వదిలేసి వెళ్ళారు
      వేలాది  ఏళ్ళు   గడిచి పోయాయి
      వారి జన్యు సంపద వెనుదిరిగింది
05 -అంతులేని నరకులాట
      తోచిన విధం గా పొగడ్తలు
      చరిత్ర-అంతా  బుకాయింపే
06 -అశ్లీలం,అవాస్తకత
      విధి బాధిత చిన్నారులు
      నెత్తుటితో తడిసిన చీలిక పేలికలు
07 -జాగ్రత్తగా మనం ఏడుస్తాం
      గడిచిన గాధల ఆనవాళ్ళు
      ఆశ ,ప్రేమ ఇక్కడే నిలిచి పోయాయి
08 -కామం ఇంద్రియాన్ని పట్టుకొంటుంది
      సత్యాన్వేషణ లో శరీరగతమవుతుంది
      వాటి అన్వేషణ అనంతం
09 -వాగ్దానాల  వర్షం
    శీఘ్రం గా తొందర్లోనే మరుపు
    అయినా వాటినే పట్టుకు వేలాడటం
10 -చిన్న నా పగిలిన గుండె
      నవ్వు పుట్టిస్తుంది విపరీతం గా
      సూర్య కాంతి కీచు   ధ్వని
ఈ హైకూలను ”hyku-you ”పేరిట ”Cindy  Rosecrance అనే ఆమె రాసింది .ఆమె midwest లో montana  నివాసి .నిజాన్ని నిర్భయం గా చురుక్కుమనేట్లు చెప్పే చేవ వుందామెకు .యుద్ధం   ,స్నేహం  ,ప్రేమ ,మరణాల పై భావాత్మక రచనలు …చేసిన మంచి రచయిత్రి .ఈమె కవితల్లో నవ్వు పుట్టించే తప్పుల తడక విషయాలే కాక దుఃఖ భారాన్ని కల్గించే విషాదమూ ఉంటుంది .అన్ని సహజ నిజాలే .
         నాకు తోచిన రీతిలో వీటిని అనువదించి అందిస్తున్నాను .సూచనలుంటే తెలియ జేయండి .ఆ రచయిత్రిని పరిచయం చేయటానికే నేను చేసిన ప్రయత్నం
            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —16 -09 -11 .
Posted in అనువాదాలు | 1 Comment

పుస్తకావిష్కరణ సభ – ఆహ్వానమ

ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సరసభారతి 29 వ సమావేశం -ఆహ్వానం

సరసభారతి 29 వ సమావేశం ఆహ్వానం

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

సంపూర్ణ ఆహారం -అవిశ

Avisa

Posted in ఆరోగ్యం | Leave a comment

నాకు నచ్చిన రెండు మంచి కవితలు

 రెండు మంచి కవితలు
                                      1  —    శై ”శవ”గీతం —రచన —చల్లా మధుసూదన్ –9490638222
         ఆకాశం  కాలు   జారి   –నెలనీల్లోసుకొంది  నీల్లోసుకొంది
         అడవికి వంధ్యత్వం–సాగర గర్భం లో సంతాన సాఫల్య కేంద్రం
          ఆకలికి ఒక ఆలింగనం -దాహానికి -గాఢ   చుంబనం
          కాలంతో మైధునం –అరక్షిత లైంగిక సంబంధం .
          నిద్రలేమి స్వప్నాన్ని స్కలించింది –కాలానికి బిడ్డలు కావాలి –వేగంతో సహ జీవనం జీవిస్తోంది
         యూజ్ అండ్ త్రో –శుక్రకణాలు -లేటెస్ట్ ట్యూబ్ లో –అండం ఫలదీకరణ
          కండోం అడ్డు గోడలు –అన్వాన్తేడ్ వాంచలు దాటి –అండ  నిర్ధారణ జరిగి –డిస్పోజబుల్ పిల్లల జననం .
         తల్లి పాల వారోత్చావాలు –తెట్రాప్యాక్ లోముర్రుపాలు
         చుక్కల మందు మాత్రల విందు
         సన్  ఆఫ్ లేకుండా –కేరాఫ్ అడ్డ్రెస్ వెతుక్కుంటూ–కేర్ కేర్ మంటూ –చైల్డ్ కేర్ సెంటర్ కు
         విదేశీ నిధులు –స్వచ్చంద విధులు –అనాధ శరణాలయాలకు –పాక్కొంటు వెళుతున్నారు .
        సెక్స్ లోను బుక్స్ లోను –సగం సగం —కుటుంబ నియంత్రణ లో మాత్రం —సింహభాగం
        అంగం వెనకాల –వో గర్భాశయం –పాపా(యి ) లతో నిండి –ప్రసవించేందుకు సిద్ధం గా వుంది
        కత్తులు మరగ బెట్టండి  –బల్లలు సిద్ధం చేయండి –మగాళ్ళకు —మ్రుగాళ్ళకు —వేసేక్టమి చేసెయ్యండి ..
                             -2-మరిచిపోయాను —–రచన  –మరాతి మూలం –ఏ;ది .జోషి —అనువాదం –డాక్టర్ నలిమెల భాస్కర్ –9704374081
                              ——————-
           హాల్లోకి   టి .వి  వచ్చాక  –నేను మాట్లాడ్డం మరిచి పోయాను —
ఇంటికి వాహనం తెచ్చాక –నేను నడవటమే మర్చిపోయాను —
      జేబులోకి కాలిక్యులతోర్ వచ్చాక –ఎక్కాలన్నీ మర్చిపోయాను
      తార్రోడ్డు వచ్చాక -మట్టి సుగంధం మర్చి పోయాను
      కుహనాసంబంధాల్ని  సంబాలించ లేక –ప్రేమానురాగాలు మరిచి పోయాను
     ఫాస్ట్ ఫుడ్ ప్రపంచం లో –తృప్తిచెందతమూ   మర్చిపోయాను
   పాప్, రాక్ రణ గోనల్లో –సంగీత సరిగమలు మర్చి పోయాను
   క్షణిక మైన ఎండమావుల వెంట పరుగు పెట్టి –ఒక మంచిపని వల్ల లభించే తృప్తిని మరిచి పోయాను
  నాలుగు రాళ్ళు కూడబెట్టుకొనే ప్రయత్నం లో –తోటి వాళ్ళ స్ప్రుహనే మర్చిపోయాను
  ఈ ఉరుకుల పరుగుల ప్రపంచం లో –ప్రశాంతం గా వో క్షణం నిలవడం మర్చి పోయాను .
మనసు విప్పి హాయిగా నవ్వడం మర్చి పోయాను –నవ్వడం మరిచాక జీవించటం కూడా మర్చిపోయాను .
            ఈ రేడు కవితలు ఈ రోజూ అంటే 10 -09 -11  ఆంద్ర జ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురింపబడ్డాయి .నాకు నచ్చి మీకూ నచ్చుతాయని పంపుతున్నాను .మీ స్పందన తెలియ జేయటానికి కవుల సెల్ నేమ్బెర్లు కూడా  ఇచ్చాను .మీ స్పందన వారిని ఉత్తేజితం చేస్తుందని భావిస్తూ
                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —10 -09 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in సమయం - సందర్భం | Leave a comment

సినిమా పోస్టర్’ పుస్తకావిష్కరణకు ఆహ్వానం

Eswar

Posted in సమయం - సందర్భం | Leave a comment

శ్రీ రమణ కద – మిధునం

శ్రీ రమణ కద – మిధునం

Posted in ముళ్ళపూడి & బాపు | 4 Comments

నేను చదివిన – ఓ మధుర జ్ఞాపకం

Sankarambadi Sundarachari

Posted in సరసభారతి ఉయ్యూరు | 4 Comments

సర్వే పల్లి జన్మ దినమే గురు పూజోత్చవం

   సర్వే పల్లి జన్మ దినమే గురు పూజోత్చవం
                   ఈ రోజూమాజీ  రాష్ట్రపతి ,జగద్విఖ్యాత మహా తత్వ వేత్త  రాజనీతిజ్ఞుడు ,ఆదర్శ ఆచార్యుడు ,విశిష్ట దౌత్య వేత్త  -సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 129  వ జయంతి .దీనినే భారత దేశం ”గురుపూజోత్చావం ”గా జరుపుకొంటూ ,ఆ మహనీయుని కి కృతజ్ఞతలను తెలుపుతోంది ”.Platonoc kingdom ”కు రాజైన రాష్ట్ర పతి ఆయన .సర్వ మత రహస్యాలను ఆకళింపు చేసికొనిన వ్యక్తిత్వం .మనసును వశ పరచుకొనే ,మూర్తిమత్వం భారతీయత ఉట్టిపడే స్వచ్చమైన సాంప్రదాయక  వస్త్ర   దారణ ,సంభాషణ ,సర్వ వేదాంత రహస్యాలు నాలుక చివర వుండే అత్యంత మేధో సంపత్తి వారిది .వారి సంభాషణం గంగానదీ ప్రవాహమే .మహా నియంత ,రష్యా అధినేత స్టాలిన్ హృదయాన్ని దోచుకొన్న మనీషి .తాను చేసిన తప్పులను రాదా కృష్ణన్ ఎదుట ఒప్పుకొని ,ఆ నియంత పశ్చాత్తాప పడ్డాడంటే ,ఆయన వ్యక్తిత్వం యెంత గొప్పదో తెలుస్తోంది .”ప్రొఫెసర్ ”అని స్టాలిన్ వీరిని గౌరవం గా పిలిచే వాడు .”త్వరలోనే తత్వ వేత్తలు రాజ్యాధి కారులు అవుతారు ”అని ఆయన తో చెప్పి భవిష్యత్తును ఊహించాడు స్టాలిన్ . .
               రాదా కృష్ణన్ వాగ్ధాటి అమోఘం .బ్బ్రిటిష్ ప్రధాని anthoni eden  రాదా కృష్ణన్ వచో వైభవం స్వయం చూసి ”మా దేశం లో రాదా కృష్ణన్ లాగా ఆంగ్లం లో అనర్గళం గా మాట్లాడే వారు ఒకరో ,ఇద్దరో వుంటారు ..దున్నిన నాగేటి చాలులో చెంగు చెంగున ఎగిరే కుందేలు పిల్ల లా ఆయన మాట్లాడుతుంటే ,కాళ్ళు తడ బడే పసిపిల్ల   వాడిలా వుంది నా పరిస్థితి”అని నిర్మోహ మాటం గా చెప్పి సర్వేపల్లి వాక్ చాతుర్యాన్ని మెచ్చాడు .రాజ్యసభలో ఆయన ఇచ్చినరూలింగ్స్   అన్నీ ఆదర్శ ప్రాయమైనవే నని విజ్ఞుల అభిప్రాయం .ఆయన అనే వారు ”సంప్రదాయాన్ని విచ్చిన్నం చేస్తే ఇక ముందు అంతా. విచ్చిన్నమే సాంప్రదాయం అవుతుంది ”.
ఆయన లో హాస్య ప్రియత్వం బాగా వుండేది .ఒకసారి భూపేష్ గుప్తా అనే కమ్యునిస్ట్ సభ్యుడు ”ఒక సమయోచిత ప్రశ్న వేస్తాను ”అన్నాడట .దానికి రాధాకృష్ణన్ ”మొదటి సారిగా సమయోచిత ప్రశ్న వేస్తున్నారట వినండి ”అని చమత్కరించారు .యోగ విద్య పై సభలో అంతా మాట్లాడుతుంటే ”ఒక అరగంట మాట్లాడ కుండా వుంటే అదే యోగం ”అని చురక వేశారు .ఒక సారి ప్రధాని నెహ్రు లోక్ సభలో మాత్రమే ఆమోదించబడిన బిలును”పార్లమెంట్ ఆమోదించింది ”అన్నాడు .వెంటనే సర్వేపల్లి ”’పండిత్జీ    !పార్లమెంట్ అంటే లోక్సభా ,రాజ్య సభ కలిసి”అనిఅనగానే  నాలిక కరచుకొని నవ్వేశాడు పండిట్ నెహ్రు .ఉపరాష్ట్రపతి రాజ్య సభ చైర్మన్ గా వ్యవహరిస్తారని మనకు తెలుసు కదా .
              గాంధీ జి కి సర్వేపల్లి   అంటే గురుభావం .ఆయనకు ఈయనంటే విపరీతమైన అభిమానం .తాను భగవద్గీతకు వ్యాఖ్యానం రాసి గాంధిగారికి  అంకితం ఇచ్చారు .అప్పుడు మహాత్ముడు ”నేను మీ అర్జునున్ని .మీరు నా శ్రీ కృష్ణులు ”అన్నారు .ఒకసారి గాంధీని కూడాఆట  పట్టించారు .”ఆవు పాలు తాగటం అంటే మాంసం తినటమే”అన్నాడు గాంధి ఒక సందర్భం లో .ప్రక్కనే వున్న రాదా కృష్ణ పండితుడు ”అయితె తల్లి పాలు తాగిన వాడు నర మాంసం తిన్నట్లేనా “”?అని చమత్కరిస్తే బోసి నవ్వుల బాపు కూడా ముసి ముసి నవ్వులు నవ్వాడట .
             సర్వే పల్లి ఇతరులతోసంభాశిస్తుంటే   ఒక్కొక్క సారి ”మౌన వ్యాఖ్యాన దక్షిణా మూర్తి ‘లాగా ,ఇంకొక సారి ,నిమిషానికి రెండొందల పదాల వేగం గా ,ఎక్కడా తడబాటు లేకుండా ,వియద్గంగా ప్రవాహం గా వుంటుంది .మంచి ఉదాత్త ,అనుదాత్తాలతో ,భావ సంజ్న లతో మహా వేగం గా జాలు వారుతుంది .బ్రిటిష్ మేధావులు ,మహా వక్తలు ,తత్వ వేత్తలు ,ఆయన వేదాంత సంభాషణా గరిమకు ముగ్ధులై తాముమళ్ళీఆ ప్లేటో ,అరిస్టాటిల్ కాలమ్ లో వున్నామా అని సంభ్రమం ప్రకటించే వారట .అందుకే వారు ”The return of Plato ”అని సగౌరవం గా భావించే వారు .విజ్ఞాన ఖని ,మేధో నిధి ,రాదా కృష్ణన్ .”Radha krishnan  fought true war of independence at the academic flora of the rulers ”.అని కీర్తింప బడిన చాతుర్యం సర్వే పల్లి పండితునిది  .
        శాస్త్ర ,మత ,వేదాంతాల త్రివేణీ సంగమమే సర్వే పల్లి పండితుడు .భినత్వం లో ఏకత్వ దర్శన ఆయన అభిమతం . అప్పటి దాకా భిన్న దృక్పదాలతో వున్న సైన్సు కు ,మతానికి చక్కని స్నేహ సేతువును నిర్మించిన ఘనత ఆయనది .ఒక సారి ఆయన్ను నోబెల్ బహుమతికి  nominate చేయటానికి అంగీకారం తెలియ జేయమని కోరారు .అప్పుడు ఆ మహా తత్వ వేత్త”Do you want to buy peace (shanti ),I hold dear,in exchange for the profits from the sale of an ingrediant for weapons of destruction ”?అని నిర్మోహ మాటం గా తిరస్కరించిన ఉత్తమ సంస్కారి .
    వినయమే ఆయన భూషణం .విద్యార్ధులకు ఆయన ఇచ్చిన సందేశం ”The  philosopher;s laboratory   is life as it lived and the product of the work in it ,is the marga pointing to the goal of oneness ” .వసుధైక   కుటుమ్బాకం అనేది ఆయనకు నచ్చిన భావం .ఆయన రాష్ట్ర పతి గా వున్న కాలమ్ లో రాష్ట్రపతి భవనం ఒక దేవాలయం గా వుండేది .దేశ విదేశాలనుంచి mahonnatulu,తత్వ వేత్తలు ,జ్ఞానులు వారిని సందర్శించి ప్రభా  వితులవుతూండే వారు . అత్యున్నత విలువలకు ప్రాధాన్యత నిచ్చిన మహోన్నత వ్యక్తీ రాదా కృష్ణన్ .మన తెలుగు వాడు అని గర్వ పడే వాళ్ళం .ఆయన పాలనను ” he established the precedent of independent action by the president disowning the dummification of the post ”.అని గర్వం గా చెప్పుకొనే వారు .రబ్బర్ స్టాంప్ ప్రసిడెంట్ గా ఆయన వ్యవహరించలేదు .ఆ స్థానానికి విలువ ,పేరు ,హుందా ను తెచ్చారు .ఆయన కాలమ్ లో చాలా సార్లు ప్రదానికీ  ,కాబినెట్ మంత్రులకు ,రాష్ట్ర పతికి వున్న విశేష అధికారాన్ని ,తుది మాట రాష్ట్ర పతిదే ననిగుర్తు చేస్తూ . చెప్పాల్సిన సందర్భాలు వచ్చాయి .తన విదుక్త ధర్మాన్ని త్రికరణ శుద్ధి గా నమ్మి పరిఆలించిన రాష్ట్ర పతి శ్రీ సర్వే పల్లి రాదా కృష్ణన్ . .ఆంద్ర ప్రదేశ్ లోని చిత్తూర్జిల్లా కాళహస్తి లోయువ  ఉపాధ్యాయునిగాప్రారంభమైన ఆయన జీవితం సర్వోత్క్రుస్త రాష్ట్ర పతి పదవి తో పరిపూర్ణమై ,ఆదర్శ వంతమై శ్రేష్టమై పూజనీయమైంది . వారి జన్మ దిన మైన ఈ రోజూ న గురు పూజోత్చావ సందర్భం గా  ఉపాధ్యాయులందరికి శుభా కాంక్షలు .సర్వే పల్లి సర్వ ఉత్కృష్ట  జీవితం అందరికి ఆదర్శ ప్రాయం కావాలని ,ఈ దేశ భవిష్యత్తును తీర్చి దిద్దే గురుతర బాధ్యత వారిపైన వుందని గుర్తు చేస్తూ –సెలవ్ —
               మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –05 -09 -11 .
Posted in సమయం - సందర్భం | Leave a comment

మా అక్కయ్య సమీక్ష – ఆంధ్ర భూమి – ఆదివారం రివ్యూ

ఆంధ్ర భూమి రివ్యూ

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

ఆంద్ర బిర్లా శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్

    ఆంద్ర బిర్లా శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
ఆయన్ను ఆంధ్ర బిర్లా ఎందుకంటే ఆయన పరిశ్రమలు సాధారణ పిన్ నుంచి రాకెట్ ఇంధనం  వరకు అన్నీ తయారుచేసే రక రకాల పరిశ్రమలు స్థాపించారు.
          సార్ధక నామదేయులు శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ .హరిశ్చంద్రుని లోని ,మనో నిబ్బరం ,నిష్ట ,నియమం ఆయన్ను గొప్ప పారిశ్రామిక వేత్తను చేశాయి .ఆయన కట్టు ,బొట్టు ,నడక ,నడత చూస్తె ఒక ఆదర్శ మూర్తి మనకు ప్రత్యక్ష మైనట్లున్తుంది .యెంత ఎదిగినా ఒదిగి వుండే స్వభావం ,తల ఎత్తుకొని నిలబడే విధానం ఆయన్ను అందరికీ ఆరాధ్యుడిని చేశాయి .పశ్చిమ గోదావరి జిల్లా కు ముఖ్యం గా తణుకు పట్టణానికి  భారత దేశ పటం లో ఒక గుర్తింపు స్థానాన్ని తెచ్చిన ఘనుడు ఆయన .ఆంద్ర దేశం లో పారిశ్రామిక విప్లవాన్ని స్వాగతించి ,దాని ద్వారా తణుకును తీర్చి దిద్దిన మేధావి ..విద్య ముఖ్యం కాదు ,వివేచనా ,ఆదర్శం ,శక్తి సామర్ధ్యం వుంటే అన్నిటా అగ్ర శ్రేణి లో ఉండవచ్చు నని రుజువు చేసిన వ్యాపార”భగీరధుడు” ‘ .విద్యా ,వైద్య రంగాలలో గణనీయ మైన సేవ లందించి ”ఆంధ్రా బిర్లా ”అని అప్యాయం గా అందరి ప్రశంశలు అందుకొన్న అవిశ్రాంత పధికుడు .,91 సంవత్చారాలు నిండు జేవనం గడిపి   నిన్ననే  కను మూసిన మాన వీయ మూర్తి శ్రీముళ్ళ పూడి  హరిశ్చంద్ర ప్రసాద్ ఇక లేరు .
              రాబోయే తరాలకు ఏమి కావాలో హరిశ్చంద్ర ప్రసాద్ గారికి తెలుసు .అందుకనే ”ఆంద్ర షుగర్స్ ”సంస్థను స్థాపించి దాన్ని శాఖోప శాఖలు గా విస్తరించారు .స్వాతత్ర్యం రావటానికి ముందే దీన్ని స్థాపించటం విశేషం .తణుకు లో రాకెట్ ఇంధనం తయారీ ని చేబట్టారు  .ఇది ఆధునిక పారిశ్రామిక రంగం లో కొత్త మలుపు .అక్క మాంబా  textiles ,ఆంద్ర పెట్రో chemicals ,హిందూ స్థాన allied chemicals ,స్థాపన లో ఆయన ద్రుష్టి యెంత విశాలమైనదో తెలుస్తుంది .ఆయన పారిశ్రామిక సేవలను విశాఖ పట్నం ,గుంటూరు లకూ విస్తరించారు .వ్యవసాయ రంగమే అన్నిటికి మూలం అన్న అభిప్రాయానికి చేదోడుగా పారిశ్రామీకరణ అవసరాని గుర్తించి అమలు చేసిన తొలి తరం పెద్దాయన ప్రసాద్ గారు అందుకనే ఆయన్ను అందరు ”పెద్దాయన ”అని ఆత్మీయం గా పిలుచుకొని భక్తీ ప్రదర్శిస్తారు .పరిశ్రమలు పట్టణాలకే పరిమితం కాకూడదని ,పల్లెలకు విస్తరింపజేసిన ముందు చూపు వారిది .కావాల్సిన యంత్రాలన్నిటిని  విదేశాలనుంచి తెప్పించారు .వెలగ పూడి రామ కృష్ణ గారి సలహా లతో ముందడుగు వేశారు .రామ కృష్ణ గారితో కలిసి అమెరికా ,జపాన్,యూరప్ దేశాలను సందర్శించి అవసరమైన పరిజ్ఞానాన్ని పొందారు .అక్కడి పరిశ్రమల పని తీరును పరిశీలించారు . 600 టన్నుల సామర్ధ్యం తో ప్రారంభమైన షుగర్ ఫ్యాక్టరీ ,నేడు 6000  టన్నుల సామర్ధ్యానికి చేరటం వారి నిరంతర కృషి ఫలితమే .
         శ్రీ ప్రసాద్ ఫాఫ్సి ప్రెసిడెంట్ గా పని చేశారు .వాణిజ్య రంగ విస్తరణకు దారులు చూపారు .ఆయన సంస్థలలో ఉద్యోగులను తన స్వంత కుటుంబ సభ్యులను గా చూడటం గొప్ప విశేషం .ఖద్దరు  దుస్తులేధరించే వారు .పంచె ,లాల్చి ఖండువా  ధరిస్తారు .ముఖం మీద నిలువు బొట్టు తీర్చిదిద్ది  నట్లుంటుంది .కోటేరు తీసిన ముక్కు వారి ఆత్మ విశ్వాసానికి ప్రతీక అని పిస్తుంది .యెంత గొప్ప పారిశ్రామిక వేత్త గా గుర్తింపు పొందినా  విలువలను అతి భద్రం గా కాపాడారు .సాధారణమైన ,హుందా అయిన జీవితాన్నే జీవించారు .వ్యవసాయం ఆధారం గా పరిశ్రమలు విస్తరించాలి అని వారి తాపత్రయం .సాటి పారిశ్రామిక వేత్తలు ఆయన్ను” భీష్మా చార్యులు ”గా గౌరవించే వారు .                             విద్యా రంగ వికాసానికీ ముళ్ళపూడి విశేష కృషి చేశారు .తణుకు లో polytechnic కళాశాల స్థాపించి వేలాది విద్యార్ధుల బంగారుభవిష్యత్తు   కు బాట వేశారు .ఆ కళాశాల అంటే ఆంద్ర దేశం లో గొప్ప పేరు .అక్కడ సీట్ రావటం మామూలు విషయం కాదు .అంతా పకడ్బంది నియమాలు .అక్కడ చదివి పాస్స్ అయితె ఎక్కడైనా కళ్ళకు అద్దు కోని ఉద్యోగం ఇచ్చేవారు .అక్కడి శిక్షణ కు గొప్ప పేరుండేది .సమర్ధులైన  అధ్యాపకులుండే వారు .కాకినాడ లో రంగ రాయ మెడికల్ కాలేజీ స్థాపనకు హరిశ్చంద్ర ప్రసాద్ విశేష కృషి సలిపారు .
          మెక్షికొ లో జరిగిన అంతర్జాతీయ షుగర్ industry సదస్సులో పాల్గొన్న ఘనత వారిది .ఆయనకు బెస్ట్ management అవార్డ్ వచ్చింది .ఉత్తమ పరిశోధనా పురస్కారం వారిని వరించింది .  నాగార్జున విశ్వ విద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ నిచ్చింది .”చక్కర కళా ప్రపూర్ణ ”బిరుదును అనకా పల్లి చెరుకు పరిశోధనా సంస్థ ప్రదానం చేసింది .తణుకు లో అన్ని వసతులతో 172  పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు వైద్యాన్ని అందు బాటు లోకి తెచ్చారు .అక్కడే మంచి గ్రంధాలయమూ,నెలకొల్పారు .
           శ్రీ ప్రసాద్ రాజకీయాలలోనూ రాణించారు .తొమ్మిదేళ్ళు ఆంధ్రా కాంగ్రెస్ పార్టి సభ్యులుగా వున్నారు .1952 -55 కాలమ్ లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో విధాన మండలి సభ్యులు గా వున్నారు .రెండు సార్లు తణుకు నుంచి శాసన సభకు సభ్యుడు గా ఎన్నికయారు .అయిదేళ్ళు తణుకు మునిసిపల్ చైర్మన్ గా పని చేశారు .నందమూరి తారక రామా రావు ముఖ్య మంత్రి గా వున్నపుడు ఆయన ఆన్తరంగికులలో ఒకరు గా మెలిగారు .ఆంద్ర జ్యోతి పత్రికకు కొంత కాలమ్ డైరెక్టర్ గా వున్నారు . ఇన్ని రకాల సేవలందించి ,పారిశ్రామిక రంగ పురోగతికి సాక్షీభూతుడై ,”,పరిశ్రమల పితామహుడు ”గా పేరు ప్రఖ్యాతులు పొందిన శ్రీ ప్రసాద్ చదువుకొన్నది ఎస్.ఎస్.ఎల్.సి .మాత్రమే నని తెలిస్తే ఆశ్చర్య పోతాం .
                           మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ –04 -09 -11 .
Posted in సమయం - సందర్భం | Leave a comment

విశ్వాత్మ లోకి విశ్వ నరుడు -నండూరి రామ మోహన రావు గారు

             విశ్వాత్మ లోకి విశ్వ నరుడు
                 నండూరి రామ మోహన రావు గారు ఇక లేరు అక్షర విశ్వ రూపం చూపిన దార్శనికులాయన .ఆయనకు ఖగోళం ,భౌతిక శాస్తాలు కరతలామలకం .పరిణామ  క్రమాన్ని అధ్యనం చేసిన శాస్త్ర వేత్త .దానితో” నరావతారం ”రాసి మానవ ఆవిర్భావాన్ని ఆవిష్కించారు శాస్త్ర్రేయతను జోడించి .ప్రపంచ సాహిత్య మధనం చేసిన పండితుడు .తత్వ శాస్త్రాన్ని కూలంకషం గా ,పరీక్షించి ,బహుదేశ సిద్ధాంతాలను అవలోడనం చేసి ,సమగ్రమ్ గా ,”విశ్వ దర్శనం” రాశారు .ఆయన అన్ని ప్రక్రియలను సుసంపన్నం చేశారు .రాజకీయ వ్యంగ్య రచనలు చేసి ”సవ్య సాచి ”అని పించుకొన్నారు .అవి నాయకులకు కొరడాలైతే చదువరులకు దీపావళి మతాబులైనాయి .ప్రఖ్యాత ఈసబ్ కధలను ”కధా గేయ సుధానిధి ”గా రాశారు .బాపు బొమ్మలు వేస్తె ”మిత్రలాభం ,మిత్రభేదం ”రాసి అందరికి ఆనందాన్ని ,విజ్ఞానాని ,వినోదాన్ని పంచారు .అనువాదం లో అందే వేసిన చేయి రావు గారిది .మార్క్ ట్విన్ రచించిన Tom sawer ,huckle berrifin ”నవలను తెలుగు లో అద్భుతం గా అనువదించారు .అవి సీరియల్ గా వస్తున్నంతకాలం ఆత్రం గా ఎదురు చూసే వారు .అలాగే రాజు -పేద ,విచిత్ర వ్యక్తీ అనేవి కూడా ఆయన అనువాద రచనలే .ఆయన అనువాద శైలి చాలా ఆకట్టుకొనేది .ఒరిజినల్ పుస్తకమే చదువుతున్న ఫీలింగ్ కల్పించే వారు .సరళం గా ,సవ్యం గా సూటిగా సాగే రచన వారి ప్రత్యేకం .ఱొబెర్త్ళౌఇస్  stevenson రాసిన treasure island  ను” కాంచన ద్వీపం” గా తెలుగు లోకి తెచ్చారు .అదీ సూపర్ హిట్ అయింది .అందుకేనేమో బాపు రమణలు కొంటెగా ”అనువాద హనుమంతు ”అని పిలిచే వారట .ఆయన బాల సాహిత్యమూ సృజించారు .హరి విల్లు ,బాల గేయాలు  అందు లో ముఖ్య మైనవి .
            ముళ్ళ పూడి వెంకట రమణ గారి భార్య రామ మోహన రావు గారి సోదరే .ఆయన కృష్ణా జిల్లా ఆరుగొలను గ్రామం  లో జన్మించారు 1927 లో .ఇరవయి ఒకటి వయసు లోనే” విజ్ఞానం” అనే లిఖిత పత్రికకు  సంపాదకులైనారు .ఆ తర్వాత పత్రికా రంగం లో దేదీప్య మానం గా వెలిగి పోయారు .ఆంద్ర పత్రిక లో ప్రవేశించి ,ఆ తర్వాత ఆంద్ర జ్యోతి కి సబ్ ఎడితరై సమాదకులుగా 1980  లో  బాధ్యతలు చేబట్టారు .నార్ల తరువాత జ్యోతి బాధ్యతలు ఆయనే చేబట్టారు .సుమారు 34  సంవత్చారాలు దాని సంపాదకులు గా పనిచేసి ఎందరో రచయితలను ప్రోత్చాహించారు .కొత్త శీర్షికలను ప్రవేశ పెట్టారు .పత్రిక సర్వాంగ సుందరం గా తీర్చి దిద్దే వారు .ఆయన సంపాదకీయాలు చాలా సూటిగా సరళం గా ఉండేవి .వాటిని ఒక సంపుటం గా తెచ్చారు .ఈ నాటి తరానికి అవి కరదీపికలే .అలాగే అనుపల్లవి ,వ్యాఖ్యావళి ,చిరంజీవులు పుస్తకాలను రచించారు .l ముళ్ళ పూడి వెంకట రమణ గారు గతించిన కొన్ని నెలలకే నండూరి రామ మోహన రావు గారుతమ ఎనభై నాల్గవ ఏట,పరమ పదించటం   ఆ కుటుంబానికి తీరని వ్యదే .సాహితీ కుటుంబానికి తీరని లోటే .వారి ఆత్మ కు శాంతి కాగాలని కోరుకొందాం .
                     మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -09 -11 .
Posted in సమయం - సందర్భం | Leave a comment

హాస్యపు – ఉండ్రాళ్ళు- హాస్యం – వినాయకచవితి శుభాకాంక్షలు

హాస్యం ఉండ్రాళ్ళు

              పొద్దున్నే వినాయక చవితి పూజ ఏర్పాట్లు చేసుకొంతూండగా మా బావ మరిది ఏదో కొంప మునిగి పోయినట్లు హడావిడి పడుతూ వచ్చాడు .ఏరా ఏమిటి కధ అన్నాను .కదేమిటి బావా నువ్వు సహకరించాలి కాని అందరికి హాస్యపు  సుధ పంచాలని వచ్చాను అన్నాడు .సుధ  ఏమో కాని వ్యధ పంచిపెదతావేమోనని బాధ అన్నా .మూతి బిగించి వాడు అదే నీతో వున్న చిక్కు .బావమరిదిని కదా నన్ను ఎంకరేజ్ చెయ్యవ్ .ఎప్పుడూ ,నీ పేరు ,ప్రఖ్యాతులేనా మేమూ వున్నాం బాబూ .మమ్మల్నీ కనిపెట్టాలి అన్నాడు నిష్టూరం గా .సరేరా అసలు విషయం ఏమిటి అడిగాను .వాడు .ఇవాళ వినాయక చవితి కదా సాయంత్రం ఒక సాహితీ సభ జరుగు తోంది అందులో నన్నూ పాల్గొనమని కబురు చేశారు .నీకు వేరే ప్రోగ్రాం ఉందటగా .నీ బదులు నేనట .ఇంతకీ ఏమిటి ప్రోగ్రాం అన్నాను .హాస్యం వండి వడ్డించాలి  .మనకు ఎప్పుడు అలవాటు లేదాయే .నువ్వున్నావనే ధైర్యం తో ఒప్పుకొన్నాను బావా నీవే తప్ప ఇతహ్పరంబెరుగా ఆనాడు బేలగా ,పీలగా .సరేరా .నువ్వెంతవరకు prepare అయావు అని అడిగా .వెంటనే ఒక చిట్టా జేబులోంచి తీసి చేత్తో పట్టుకొన్నాడు .బావా -ఈ మధ్య కొన్ని కంపెనీలు యాద్డ్  కోసం రాయమనే పేపర్ ప్రకటన చూసి కొంత రాశా .పంపావా అని అడిగాను .పంపాను తిరుగుటపా   లో వచ్చేశాయిఅన్నాడు కూల్ గా .అర్ధమైంది వాడి పరిస్థితి రోట్లో తలపెట్టేశాగా ఇంక రోకటి పోట్లకు వెరవటం ఎందుకు ?.సరే చిట్టా విప్పమన్నాను .బావా నవ్వద్దు .ఎంకరేజ్ చెయ్యి బావా .మర్రి చెట్టుకింద మోకను చేస్తున్నావు నన్ను ఎదగానీకుండా అనిమల్లీ గగ్గ్గోలు .సరే కానిమ్మన్నాను
     పోటాష్ తయారు చేసే కంపనీ ki ఒక స్లోగన్ రాశా .విను అన్నాడు .ఒదులు అన్నా.”వాడండి మీ చేలకు పోటాష్ -లేకుంటే మీరు మటాష్ ”అని చదివాడు .నోర్ముయ్యి కామోష్ అన్నా భరించలేక .ఇంకోటి చూడు .అవతలి వాడి ప్రతిభ అంటే నీకు ఈర్ష బావా మొదట్నించీ .అని రెండోది చెప్పాడు ”వినాయక చవితికి ఉండ్రాళ్ళు -తింటే బిడ్డలను కంటారు గొద్రాళ్ళు ”అన్నాడు .రాళ్ళతో ఊడగోడ్తారు పళ్ళు అన్నాను .కొంచెం చిన్న బుచ్చుకొని మూడోది లంకించుకొన్నాడు .”పెరిగింది పెరిగింది అవినీతి –నీతి అతిగ్గా పెరిగితే వచ్చేదే అవినీతి ”అని చల్లగా వినిపించాడు ”.నీ మతి మండితే వచ్చేదే ఈ కపి నీతి ”అని అడ్డకట్ట వేశాను .సరే ఇంకోటి విడుస్తా విను అన్నాడు .నీకున్న సిగ్గు లజ్జా వదులు చాలు అదే పెద్ద హాష్యం అన్నా.వాడు ఊరుకోంటాడా ?
”అన్నా హజారే –అరె అరె -దేశం బేజారే-ఆయన మాట అంటే జీ హుజూరే –దేశానికి ఆయన ఒక కొత్త వజీరే ” అన్నాడు .కొంచెం దగ్గిరికి వచ్చావురా అన్నా .బావా నువ్వు అండ గా వుంటే చెలరేగుతాచూడు   అన్నాడు .అంత చెలగాటం వద్దు నాయనా అని సర్ది చెప్పా .”నాగం గురించి ఒకటి రాశా అన్నాడు సరే విడువు అన్నా ”అన్నా నాగం -నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆగం –నీతో కష్టం వేగటం -మీ ఆవిడ యెట్లా భరిస్తోందో నీ  ఆగడం ”పర్లేదు కానీ అని ఉత్చాహ పరిచాను .”అందరి మీదా కాలు దువ్వె కే.సి ఆర్.–కిక్కురు మనకుండా వున్నావేమిటి యార్ ”ఒరే దవడ పగలగోడతారు  take care  అని వారించాను .సరే .”ఉద్యోగుల సమ్మె మళ్ళీ వాయిదా –వాళ్ల కేమి పోయింది ఫాయిదా ”అన్నాడు అర్ధం ఏమిటీ అన్నాను .ఏదో ప్రాస కలిసింది కదానని వాయించా అన్నాడు .నిన్ను వాయించేస్తారు ఖాయలా పడతావు అన్నాను .”పాలైతే నువ్వు జైలు –ఎవడో ఇప్పించక పోడు  బెయిలు ”- వహ్వా వహ్వా అన్నా.వాడు యెగిరి గంతేశాడు .”పావలాకే పంట ఋణం –అదీ పండితే గా తీర్చేది ఋణం ”భేష్ అన్నాను ..మా వాడు రెచ్చిపోయాడు .”మన్యాన్ని ఒనికిస్తున్న డెంగ్యు –చెయ్యాలి దానితో పాపం కుంగ్ ఫ్యూ ”సెహబాష్ అన్నాను .”అవినీతి లో ఆఫీసర్ బీల –దొరికి పొతే అయాడు  బేల .”ఇంకా వుంది నీ కడుపు లోకక్కెయ్యి అన్నా ..”అవినీతి వర్గం పై వుమ్మీయ్యి అన్నాడొకడు –తీరా ఉమ్మేస్తే పడేది వాడి మీద కాదా అన్నాదిన్కోడు ” —
”తెలుగును ఉద్ధరించాలి మనం -అదీ సి.ఏం .తో ప్రారంభించాలి అదే మన ఖర్మం ”. దారిలో పడ్డాడు మా వాడు అని లోపల కొంత సంతోషం .బయటికి అంటే మరీ రెచ్చిపోతాడని వూరుకొన్నాను .”గణపతి విగ్రహాలకు వాడండి మట్టి –లేకుంటే పర్యావరణం  నోట్లో మట్టి ”అని చదివాడు .ఇంక ఆపక పొతే చంపేస్తాను కుట్టి కుట్టి .అని వాడి హాస్య ప్రయత్నానికి పెట్టించాను ఫుల్ స్టాప్ .పాపం బిక్క మొహం తో వెళ్లి పోయాడు వాడు కనీసం వెళ్తానని చెప్పకుండా వాళ్ల అక్కతో కూడా మాట్లాడకుండా .
రాత్రి లోకల్ chaannel లోమా బావ మరిది హాసపు ఉండ్రాల్లకు ప్రధమ బహుమతి వచ్చింది అని    విన్నాను .అంటే తెలుగు హాస్యం యెంతబాగా వృద్ధి చెందిందో నని   బాధ పడ్డాను .ఇది చదివి నవ్వు రాక పొతే తప్పూ నాది కాదు  –.నవ్వక పొతే తప్పు మీది  .
               శుభా కాంక్షలతో –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -09 -11 .

 

Posted in సమయం - సందర్భం | 2 Comments