’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘29(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘29(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

ఏమైనా నేను  అదృశ్య మైపోతున్నా.మళ్ళీ నేను సరిగా గాలి పీల్చలేక పోతున్నా .కళ్ళముందు ప్రతిదీ  నల్లగా ఉంది . మళ్ళీ కనిపిస్తున్నాయి .ఎంతో తీక్ష్ణమైన వెలుగు .నాలో కొంత పడిపోయి శక్తిని కాంతిమయం చేస్తోంది అంతరిక్షం లో సోల్కొవ్ స్కి ‘’మనం జీవిత సమాప్తకాలం లో కాంతిగా మరిపోతాం .సముద్రమంతటి విజ్ఞానాన్ని తరించి తీరం చేరలేము మనం .కాని ఎప్పుడో ఒకప్పుడు ఒక వ్యక్తి చాల భాగం నేర్చి , అర్ధం చేసుకొని ,విలువలకు మేధస్సు తో తగినట్లు జీవిస్తాడు ‘’అన్నమాట గుర్తుకొచ్చింది ..నేను రాద్దామని అనుకుంటున్న ముఖ్యమైన ఆర్టికల్ రాయ లేక పోయాను .కాని ఇక్కడ నేను కాంతిని ప్రసారం చేస్తున్నాను .ఇందులో ఏదైనా విశేషార్ధం ఉందేమో ఎవరికి తెలుసు ?

పంటలపై సంగీత ప్రభావం –భాషా మూలాలు

నా విమానం నేలమీదికి దిగుతోంది .ఇప్పటిదాకా ఆకాశ గమనం చేశాను .ఇప్పుడు నేలమీద కాలు మోపాలి .మాక్సిం గోర్కి అంటాడు ‘’దేవతలు మన ప్రాచీన కార్యా(వ్యా)లకు హీరోలు .రాముడెవరు ?భలే ప్రశ్న ఇండియాలో అరటి తోటలను చూశాను . పూలు పూసే సమయం లో అక్కడ ఫ్లూట్ వాయిస్తే అరటి చెట్లు హాయిగా విని ఇబ్బడి ముబ్బడిగా అధికమైన గెలలు వేసి ఎక్కువ ఫలసాయాన్ని  ఇస్తున్నాయి .ఈ చెట్ల ఫోటోలు నాతొ పాటు తెచ్చుకుంటున్నా .ఇక్కడ దీనికి ఆనుకొని ఉన్న తోట ‘’కంట్రోల్ ‘’ పేరిట సంగీతాన్ని వినిపిస్తారు .వీటినుంచే ‘’సంగీత వినికిడి అరటి ‘’  పండిస్తున్నారు . గెలల బరువుకు   అరటి చెట్లు నేలకు ఆనుకొంటు న్నాయి. భలే సరదాగా ,వింతగా ఉంది నాకు చూడటానికి .ఎవరో ముందు దీన్ని గమనించి ఉంటారు .అదొక కొత్త డిస్కవరీ అయిపొయింది .కొంత కాలం ఫలితాలు సంతృప్తి కరంగా రాకపోయినా కాల క్రమేణా గొప్ప దిగుబడి సాధించారు .పంటలపై సంగీత ప్రభావం జాస్తీగా ఉందని రుజువైంది .ఇవే అతిముఖ్యమైన ఆలోచనలు. ‘’the induction period of sediment formation in motor oil ‘’వ్యాసం రాయటానికి ఉపకరించాయి .తెలుగులో ‘’ఒకటి, రెందు మూడు – సంస్కృతం లో’’ అద్నా ,ద్వా ,త్రై .స్లావిక్ భాషలో’’ ఓద్నా ,ద్వే,ట్రై’’ఇంగ్లీష్ లో’’వన్  టు,త్రీ ‘’తేడా ఏమైనా ఉందా ? అన్ని భాషల మూల స్వరూపాలు ఒకటే .

మనుషులంతా ఒకటే

ఉత్తరాన కరేలియా లో ‘’కందలస్క ‘’అనే నగరం ఉంది . ఈ ఫిన్నిష్ సెటిల్మెంట్  పేరుకు సంస్కృతం లో అర్ధం ‘’శత సహస్ర దుంపలు(కంద గడ్డలు ) .ఇండియాలో తెరకోయా టౌన్ ను చూశా దీనికి .ఫిన్నిష్ భాషలో ‘ ధాన్యాగారం ‘’ ‘’అని అర్ధం . ఇండియా ఆగ్నేయ భాగం నుండి ఎప్పుడో మనుషులు ఇక్కడికి ఈ ఫిన్నిష్ ప్రాంతం చేరుకొని ఉంటారు .వాళ్ళే ఇప్పుడు ఫిన్నిస్ అని పిలువ బడుతున్నారు .ఆ వచ్చిన వాళ్ళు ఇండియన్స్ ఏమో ?ఎక్కడి నుంచి వచ్చాం మనం ?మనం ఎవరం ?ఎక్కడికి వెడుతున్నాం ?’’గాగ్విన్’’ లా కాకుండా నేనే బాధ్యత వహిస్తా.నేనే సమాధానం చెబుతా .’’మనమందరం ఒకే మూల కుదురు నుండి పుట్టాం .మనది   ఒకే మానవ జాతి.మనం  అందరం మనుషులం .ఇందులోనే గౌరవానికి మన పరీక్ష ఉంది .మనం చీకటి నుండి వెలుగులోకి ప్రయాణం చేస్తున్నాం ‘’అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా ‘’.మనది వసుధైక కుటుంబకం .’’

‘’ టర్కిష్ ప్రజలు ‘’మెన్ ,సేన్ ‘’అంటే ,ఫిన్నీష్ వాళ్ళు ‘’మినా ,సినా ‘’అంటారు అంటే అర్ధం నేను ,నువ్వు కలిస్తే మనం . నాయనలారా ఇదే అసలైన విజ్ఞానం .దీన్ని తెలుసుకోకుండా భేషజాలు పోతున్నాం. కలిసి బతకాల్సిన వాళ్ళం కాట్లాడి, పోట్లాడి విడిపోతున్నాం .ఒక సారి మహా తత్వ వేత్త సోక్రటీస్ ను ఒకాయన అడిగాడట ‘’మీరు ఎక్కడి నుండి వచ్చారు “’? అని .దానికి ఆ మహానుభావుడు ’’ఏదేన్స్ నుంచి ‘’అని  సమాధానం చెప్పకుండా ‘’ఈ విశ్వం నుండి ‘’అన్నాడు .అదీ ఆ దార్శనికుని విశాల దృక్పధం ,లోకోత్తర భావం, భావన  ఈ విశాల విశ్వమే తన  జన్మ స్థలం అన్నాడు .ఆయన తన అధిక సంపన్నమైన  విజ్ఞానాన్ని  ప్రేమను ,తనకూ మనకూ  సర్వ మానవాళికీ పంచిపెట్టిన మహోన్నతమానవుడు , ఆదర్శ తత్వ వేత్త  .అంతటి విశాల దృక్పధం మనలో రావాలి .ఇరుకు భావాల చీకటి గదుల నుండి బయటికి రావాలి .అంతటా వెలుగును  దర్శించాలి .అప్పుడే మానవ జన్మ సార్ధకం ‘’

ఇండో రష్యన్ భాయి భాయి

‘’నేను ఇటీవల ఇండియా వెళ్ళినప్పుడుఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో  నన్నొక ప్రశ్న అడిగారు .’’ఇండియా శాంతికాముక దేశం కదా ,సోవియట్ యూనియన్ శక్తి వంతమైన మిలిటరీ రాజ్యం .ఇండియాపై రష్యా దురాక్రమణ చేయదని గ్యారెంటీ ఏమిటి ?అది అనుకోకుండా వేసిన ప్రశ్నకాదుకాని ,అసంబద్ధమైన ప్రశ్న అనిపించి౦దినాకు .అనుకోకుండా నాకు నవ్వొచ్చి నవ్వేశాను  .నేను నవ్వటం చూసి ప్రేక్షకులూ నాతొ బాటు నవ్వారు .కానీ ప్రశ్న ప్రశ్నయే కదా .దీనికి నేను సరైన సమాధానం చెప్పాలి .నేను చెప్పటం ప్రారంభించా’’దాదాపు అర్ధ శతాబ్దం గా ఇండియా సోవియట్ యూనియన్ కలిసి నడుస్తున్నాయి .ఇరు దేశాల మధ్య ఎలాంటి వివాదం లేదు .కొన్ని విషయాలలో భేద భావాలు ఉండవచ్చు అయినా కలిసే నడుస్తున్నాయి .రష్యాలో విభిన్నమైన రాజకీయ వ్యవస్థ ఉన్నంత మాత్రాన ఆ దేశం భారత్ పై దాడి చేస్తుంది అనటానికి ఏ మాత్రం అవకాశం లేదు .ఇంతకాలం గా సోవియట్ రష్యా ఏ దేశం మీదా దాడి చేసిన దాఖలాలు లేవు .దీనికి విరుద్ధం గా రష్యానే అనేక దాడులకు గురైంది .సంబంధాల విషయానికి వస్తే  రష్యా ఇండియాకు  మెటలర్జికల్ కాంప్లెక్స్ ల నిర్మాణానికి ,జాతీయ పారిశ్రామిక వ్యవస్థల నిర్మాణాలకు సహాయం చేస్తోంది .’’ఇలాంటి దాడులు ‘’చేస్తున్నందుకు స్వాగతించారు .’’అని చెప్పగానే అందరూ భారీగా కరతాళ ధ్వనులతో ఆమోదం తెలియ జేశారు .నేనెవర్ని ?నేను ఇండియన్ ను ,సోవియట్ యూనియన్ వాడిని కూడా .అన్ని విషయాలలో ఇలాగే ఉన్నాం .కనుక రెండు దేశాల మధ్య వైరుధ్యమే లేదు .కలిసి నడుస్తూ ప్రగతి పధం లో దూసుకు పోతున్నాం .’’ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘28(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘28(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

రామయ్య రష్యాకు తిరుగు ప్రయాణం

హృదయ యంత్రం శిదిలమైంది

‘’నేనెక్కిన విమానం తాష్కెంట్ వైపు దూసుకు పోతోంది .నా వెనక ,కిందా ఇండియా ఉంది .పర్వతాలు శిఖరాలు లోయలు నదులు కనిపించి కనుమరుగై పోతున్నాయి .కింద భూమి ,పైన ఆకాశ౦ మాత్రమె  ఉన్నాయి .మళ్ళీ కలిసే దాకా ఇండియా నీకు వీడ్కోలు పలుకుతున్నాను .నా యువ కిశోరాల్లారా !మీకు గుడ్ బై చెప్పను .హలో రష్యా వచ్చేస్తున్నాను .ఎప్పటికైనా నీకూ వీడ్కోలు చెప్పాల్సి౦దేగా నేను .ఇక కాలం పెద్దగా మిగల లేదు .కొన్ని నెలలో రోజులో ?కాని నేను చేయాల్సింది చాల ఉండిపోయిందే .నేను గుండె జబ్బు మనిషిని కూడా .నా ‘’గుండె ఇంజన్ ‘’ముసలిది పనికి రానిది అయి పోయింది .ఇక దానికి ఏరకమైన లూబ్రికంట్లు వాడినా  ,ఎడిటివ్ లు మార్చినా  ఏమీ పని చేసే శక్తి లేదుదానికి .  హృదయ యంత్రం శిధిలమైంది .అవి నిష్ఫలం కూడా .నేనేమీ ముసలివాడినికాను .బాధా పడటం లేదు . అకస్మాతుగా ఊపిరి అందటం లేదు .పై పెచ్చు నీరసం ఒకటి ఏడ్చింది .నీరసం, నీరసం   అదే బాధ .అంతకంటే ఏమీ లేదు .’’

హిమనగాలపై వాయుయాన అనుభూతి  -తన పరిశోధనలతో పోలిక

‘’సర్వ సమర్ధుడు దైవం అయిన  శ్రీరాముడు ఇండియా నుండి లంకకు వెళ్ళాడు .అప్పుడు ఆయనకు విమానం లో ఒక సీట్ లో కూర్చోమని ఆహ్వానించి ఉంటె ,హిమాలయాలమీదుగా ప్రయాణించి, మన పైలట్లు తన లాగా దైవ సమానులు అని ప్రకటించి ఉండేవాడు .అందులోని ఎయిర్ హోస్టెస్ లను అప్సరలు అని ఉండేవాడు .న్యాయానికి అదేమీ అంత ఆశ్చర్య పరిచే గొప్ప విషయం కాదు .’’గాలి కన్యలు ‘’అంద చందాలతో అతిధి మర్యాదలు చేస్తూ హిమాలయాలకంటే ఎత్తైన ప్రదేశాలలో,గగనం లో టీ అంద జేస్తూ  దేవకన్యలను మరిపించేట్లు చేయటం వింతైన విషయం .విమాన కిటికీ లకు బయట -50 డిగ్రీల (మైనస్ యాభై డిగ్రీల )  ఉష్ణోగ్రతః ఉండటం అక్కడే శివ మహా దేవుడు కైలాస శిఖరం మీద కొలువై ఉంటాడంటే నమ్మగలమా?

.పర్వతాలు వరుస తప్పటం కనిపించింది .అది నా పరిశోధనలోని లూబ్రికంట్ ల లక్షణాలను  పోలి ఉందనిపించింది .ఈ పర్వత ,లోయల  వంకరలు లూబ్రికంట్ లలో ఎడిటివ్ లను పోస్తే ఏర్పడే  సెడి మెంట్  ఫార్మేషన్ లాగా ఉందనిపించింది .మేఘాలతో కప్పబడిన పర్వత శిఖరం సెడిమేంట్ అవక్షేపం (ప్రిసిపిటేషన్) ఎర్పడటాన్ని సూచిస్తోంది .వెంటనే నా నోట్ బుక్ తీసి లూబ్రికంట్ ఆయిల్స్ లలో  సెడిమేంట్ ఏర్పడటం లో ఉన్న ఇండక్షన్ కాలం గురించి ఆర్టికల్ రాయటానికి స్కెచ్ తయారు చేసుకొన్నాను .మా  ఫ్లైట్ ఒక  మాలిక్యూల్ లాగా ఉందనిపించింది .  విమానం పైనుంచి కిందికి దిగటం అంటే ఏదో పతనం చెందినట్లు భావించరాదు .అదొక ప్రశాంత మైన ,సుతి మెత్తని ,గంభీర విధానం .నాకు అనుకోకుండా భలే వింత ఆలోచనలోచ్చాయే !వెంటనే దీనిమీద సమగ్రంగా ఆలోచించి  ఈ భూమిక నుండి మంచి వ్యాసం  తాష్కెంట్ చేరుకొనే లోపు రాసెయ్యాలి ‘’.

‘’నాకు వచ్చిన వి బేసిక్ ఆలోచనలా? ఏవి ఇక్కడ  బేసిక్ థాట్స్ ?ఒకటి రెండు మూడు –.మనిషి జీవించటం మంచిదే .ఇంకా 36 ఏళ్ళు జీవించాలి .అది సాధ్యమా ?అంటే అనుమానమే .ప్రసిద్ధ ఇటలీ చిత్రకారుడు, శిల్పి మైకెలేంజిలో89 ఏళ్ళ వయసులో ‘’ఇదేమీ బాగాలేదు .నేను ఇప్పుడే కళ అంటే ఏమిటో  అర్ధం చేసుకోవటం మొదలు పెట్టాను’’అన్నాడు .అంతటి గొప్పవాడే ఆ మాట అంటే ,నా బోటి సామాన్యుడు ఏమనుకోవాలి ? ‘’

ఇ౦జన్ లో వచ్చే కదలికలు గ్లాసులోని నీళ్ళను వణి కేట్లు చేస్తాయి .ఇది తప్ప మిగిలినదంతా ప్రశాంతంగానే ఉంటుంది .విశ్వం మధ్య భాగం లో విమానం మొద్దుబారి పోతుంది. కాని దానికే ప్రమాదం ఉండదు .’’ఆగు .ఒక్క క్షణం ‘’అని ముసలి ఫౌస్ట్ కలగన్నాడు మళ్ళీ యవ్వనం పొందాలని. నాకూయవ్వనం పొందాలని ఉందా?నేను  ఏంతో చేయగలిగాను .చాలు .నాకు యవ్వనం ప్రాప్తిస్తే నేను అంతటి ముసలివాడిని కాదుకదా . నాకు ముసలితనం వచ్చి౦దనుకోను .నాకు ఇంకా 78  ఏళ్ళు మాత్రమే .

రష్యన్ మిరకిల్

‘’  ఈ 78 ఏళ్ళలో ఏం జరిగింది నా జీవితం లో ?నా చేతిలో మొరాకో  బైండింగ్ తో ఉన్న నీలిరంగు మంచి పుస్తకం ఉంది .మట్టి రంగు పర్వతాల కు ఆకాశపు  నీలి ఆభరణం లాగా .చదువుదాం .ఇవిగో చివరి పేజీలు  .ఇక్కడే హీరో ఇంటికి తిరిగి వెడుతున్నాడు .వాండర్ హేంక్ కు ఇంకా నేను సోవియట్ రష్యా ఎందుకు వెళ్ళానో అర్ధం కాలేదు .చాలాసార్లు హేంక్ కోరినట్లు కెరీర్ ను అమెరికాలోనే సాగిద్దామా అనుకొన్నాను .ప్రతి సారీ వచ్చిన అవకాశాన్ని హీరో తిరస్కరించాడు .నిజమే అన్నీ తేలికైనవి, సాధారణమైనవి గా రష్యాలో  ఉండవు .కాని అది అంతముఖ్యమా?ఈ పుస్తకం లో ముఖ్య విషయాన్ని కొట్టి పారేయ టానికి వీలు లేదు .నా సిద్ధాంతం లో యదార్ధం ,నా కొత్త  విధానాలు , ఇంత కాలంగా  అన్నీ నేనే  సృష్టించు కొన్నవే.ఇదంతా నా సృజన మాత్రమే .నేను చేయగలిగినది అంతా చేసేశాను .నేను ఒంటరి వాడిని మాత్రం కాదు .నా పని ,నా మిగిలిన కామ్రేడ్ ల పని నుంచి వేరు చేయలేనిది .ఇవాళ ఎవరూ ‘’రష్యన్ మిరకిల్ ‘’ను కాదన లేరు . యుద్ధ భీభత్సం ,రక్త పాతాలతో శిధిలమై పోయిన దేశం ఆధునిక సర్వతో భద్రమైన ఉన్నత దేశం గా ఎదిగింది అన్నదే రష్యన్ మిరకిల్ . ‘’

‘’ ఇండియా నుంచి రష్యాకు విమానం లో పర్వతాలపై  యెగిరి వస్తున్నాను . స్పుత్నిక్ మార్గాల కిందుగా నా ప్రయాణం సాగుతోంది .నేను ఇంట్లో ఉన్నాను .భూగ్రహం మీద ఉన్నాను  .వేర్నాడ్ స్కి చెప్పిన ‘’మనం సూర్య సంతానం .మనం కాస్మిక్ అయినా భూమిమీద ఉన్నాం .భూమి నీ స్వంత తోట కాని పెరటి తోటకాని కాదు అని అర్ధం చేసుకో .భూమి మన వనం .వెనుక భూమి .దాన్ని మనం చాలా నిర్లక్ష్యం చేశాం .దాన్ని సంరక్షి౦చు కోలేక పోతున్నాం .మనలో ఉన్న పనికి మాలిన తగాదాలను వదిలేసి ,భూమాతను సరైన క్రమ పద్ధతిలో ఉంచాలి .అప్పుడే మనకు ముఖ్య సత్యం స్పష్టంగా అవగతమవుతుంది .ప్రపంచం ఇంత అద్భుతంగా దర్శన మిస్తోంది అంటే దాన్ని మనమే అలా చేయగలిగాం ‘’అన్నమాటల తో నేను ఏకీభవిస్తాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-15 –ఉయ్యూరు

 

 

 

 

 

 

‘’

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘27(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘27(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

రష్యాకు తిరుగు ప్రయాణం

‘’ ఇండియా వదిలి వెళ్ళేటప్పుడు శ్రీపాద్ అమృత డాంగే ‘’మీకు సర్వదా కృతజ్ఞులం .మీరు ఇండియా –రష్యా మిత్రత్వానికి చాలా తోడ్పడ్డారు .ప్రతి ,ప్రతి నిధి బృందం ఇలా చేయ లేదు .అదీ మీ ప్రత్యేకత .’’అన్నాడు నాతో .నాకు ఆశ్చర్యమేసింది .నేనేమీ రాజకీయ ఉద్దేశ్యం తో రాలేదే .నేనేది అనుకున్నానో, దేన్నీ ఆలోచించానో  అదే చెప్పాను .అచ్చమైన నిజాలే మాట్లాడాను .ఇండియా సర్వతోముఖంగా ,విద్యా ,సాంస్కృతిక రంగాలలో సంతోషంగా అభి వృద్ధి చెందాలని  నా ఆకాంక్ష .దీనికోసం భారతీయ ప్రజలందరూ  సోవియట్ ప్రజలు లాగా  ఐకమత్యం తో ఒకే కుటుంబంగా కలిసి పని చేసి  ,మనుషులను విడదీసే ,అపోహలు  అదృశ్యమై ,కులమత వర్గ భాషావ రోధాలను తుడిచిపెట్టి  అధిగమించాలని నే కోరుతున్నా. ప్రజలకు  తాము మాత్రమె తమ కొత్త దేశాన్ని నిర్మించగల౦  అనే నమ్మకం రావాలి .  దీని వల్లనే సగుణాత్మక మార్పులు వస్తాయి  .వారిలోని ప్రతీక శక్తుల కబంధ హస్తాలను చేదించుకొని బయటికి రావాలి .గతానికి చెందిన విలువైనది అయిన ప్రతి దానినీ కాపాడుకోవాలి .బానిసత్వ భావలనుండి బయట పడాలి .ఒకరిపై మరొకరికి అపనమ్మకం ఉండరాదు .భారత దేశ చరిత్రలో ఉత్తమమైన వాటిని ,జీవితానికి వెలుగు నిచ్చేవాటిని ,శాంతి ని పెంచే వాటిని గౌరవించాలి .ప్రతి తరం తన బాధ్యతను  సక్రమంగా నిర్వర్తించి ,సరైన అవగాహన తో ప్రతి వ్యక్తీ  ప్రగతికి,దేశాభ్యుదయమే ధ్యేయంగా   ముందుకు కదలాలి ..మీ కుటుంబం మానవ కుటుంబం అనే భావన మనసులో స్తిరమై ఉండాలి .అందుకే ఇతరులతో మంచి మర్యాదలతో ప్రవర్తింఛి వారిమేలుకు కృషి చేసే  సుగుణం అలవడాలి .పతనం చెందటం చాలా తేలికే .కాని లేచి నిలబడి ముందుకు సాగటం కష్ట సాధ్యమైన విషయమని గుర్తించాలి .ఇదే ప్రతిమనిషికి తగిన, విలువైన మార్గం .వేరే మార్గాలలో వెడితే అసహనం, అసూయ, యుద్ధాలే గతి .ఈ విషయాలు నా భారత ప్రజలకు నచ్చి గుండెలను తాకితే వారూ నా వంటి వారే నని అనుకొంటాను .ఇండియాకు నేను వచ్చించి ఏదో ఉద్యమం నడుపుదామనికాదు .నేను  చాలా ఉదాత్త భావనతో వచ్చాను .నా మాత్రు దేశాన్ని నాజీవిత౦ పొద్దు బారి పోతున్న వేళ కనులారా చూద్దామని ,మాత్రమె ఆశతో వచ్చాను .ఇండియా యువతను చూసిన తర్వాత నాలో యవ్వనాన్ని నింపుకొన్నానని పించింది .

‘’రామయ్య ఇండియన్ ,కాని ఒక్క ఇండియా వాడు మాత్రమేకాదు .ఆయన ఇండియా –రష్యా మిశ్రమ వ్యక్తీ . ఆయనలో ఉన్న ఈ భారతీయ  పునాది అపూర్వమైనది .ఆయనే  ‘’నేను ఇండియాను నాకు జన్మ నిచ్చినందుకుప్రేమిస్తాను  అంటాడు. ఇది ఆదర్శ మాత్రు ప్రేమ ‘’అని  నా గురించి అందరూ చెప్పేమాట నాకూ నిజమేనని పిస్తుంది .ఇండియా రావటం వేరు ,ఇక్కడ జీవించటం వేరు నా దృష్టిలో . .నేను ఇన్నేళ్ళు రష్యాలో పని చేశాను. కాదు సేవచేశాను .అది కాంట్రాక్ట్ పని కాదు .నేనేదో గొప్పవాడినని , ఏదో అద్భుతాలు సాధించానని గొప్పలు చెప్పుకోవటానికి రాలేదు .చాలా వినయ విదేయతలతో వచ్చాను .అర్ధం చేసుకోవటానికే వచ్చాను .నా జీవితం సార్ధకమయింది. ఈ అనుభవం ఒక జీవితకాలం నాలో గొప్పగా నిలిచిపోతుంది. ధన్యుడిని నేను .అందరూ దీన్ని అర్ధం చేసుకోలేరు .కాని నావిషయం లో ఇది నూటికి నూరు పాళ్ళు యదార్ధం .’’

‘’జీవిత చరమాంకం లో యెంత సుదీర్ఘ కాలం జీవించినా మిగిలిన కాలం చాలా స్వల్పమనిపిస్తుంది .ఇంత సుదీర్ఘ జీవన యానం లో నేనెప్పుడూ జబ్బు పడి ఎరుగను .ఇప్పుడూ రోగ గ్రస్తుడినికాను  అదే నా  అదృష్టమేమో !కాని  ఊపిరి పీల్చటం కొంచెం కష్టంగా ఉంది .నీరస౦గా కూడా ఉంది .’’ఛా వెధవ నీరసం’’ .పక్షుల కిలకిలారావాలు నాకు శక్తినిస్తాయి. ఆనందాన్ని ,సంతోషాన్ని ,అందజేస్తాయి .అపూర్వ సందేశమేదో ఇస్తున్నట్లనిపిస్తుంది .నేను విషాదానికి గురి అయితే ఇక ఎక్కువ కాలం బతకను .ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది .కనుక నిరాశ చెందటానికి నాకు ఏ కారణమూ కనిపించదు .’’

‘’ నాకు  దక్కినవన్నీ మీకు ఇచ్చి పోతున్నాను .నేనెలా జీవి౦చానో దాన్ని కూడా .నేను చాలా కన్సర్వేటివ్ ను అంటే సంప్రదాయ బద్ధుడిని .అవకాశాలున్నంత వరకు నేను నాతండ్రి నాకు వారసత్వంగా అందజేసిన  సనాతన సంప్రదాయాన్ని పాటించాను .ఆయన లాగా నేను కూడా ఒకే చోట కొన్ని దశాబ్దాలున్నాను కదలకుండా .ఆయనలాగే నేనూ నా అర్ధాంగిని ప్రేమించాను .కాని జీవితం లో ‘’ఒక వ్యక్తీ పై ఉన్న ప్రేమ’’ను మర్చి పోలేక పోయాను .నేను కా౦క్ష లున్న మనిషిని కాదు .ఇతరులకున్నదానికంటే నేనెప్పుడూ అధికం గా నాకు కావాలని కోరుకో లేదు .’’

‘’ అనుక్షణం  విధి నిర్వహణలో గడపటం వలన  నేను నా వెనుక జ్ఞాపకాల ఆస్తిని, కొన్ని సైంటిఫిక్  ఆర్టికల్స్   మాత్రమె నా వారికి వదిలి పెట్టి వెడుతున్నాను .నా జీవిత చరిత్ర రాసుకోవటం లో సఫలుడిని కాలేక పోయాను .’’ధీరీ ఆఫ్ ప్లాస్టిక్ మీడియం’’   ఉపన్యాసాలలో ,జ్ఞాపకాలలో ‘’చెల్లా చెదురుగా ఉండి పోయింది .దాన్ని పూర్తిగా కంఠతా పట్టలేక పోయాను .’’

‘’ఇదంత పెద్ద ప్రాముఖ్యమైన విషయ౦  కాదు  ఒక్కసారి గతం లోకి వెళ్లి చూస్తె నేను చేసిన పొరబాట్లు ,తప్పులు వైఫల్యాలు  కనిపిస్తాయి .అయితే వాటి గురించి ఎవరినీ క్షమాపణలు కోరను .జరిగిందేదో జరిగి పోయింది . నేనెంచుకొన్న నా మార్గం కఠిన తరమైనది .కాని అది తిన్నని రహదారి. రాజమార్గమే. నా అంత రాత్మకు వ్యతి రేకం గా ఏ ఒక్కపనీ చేయలేదునేను .ఎవరినీ మోసగించలేదు .ఎవరికీ ద్రోహం చేయలేదు .నాకు నేను విధేయుడిగా ఉండటం వలన ఇన్ని విజయాలు సాధించగలిగానని నేను విశ్వ సిస్తాను .నా జీవితాన్ని వ్యర్ధంగా గడపలేదన్న సంపూర్ణ నమ్మకం నాకుంది .ఇది చాలు ఈ జీవికి .నేను చాలా సంత్రుప్తి కరమైన సార్ధక జీవితాన్ని గడిపాను .ఇంత కంటే కావాల్సింది ఇంకే ముంది ?

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-15 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘26(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘26(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

రామయ్య వెంకన్న దర్శనం

‘’ నాకు తెలియ కుండా ఇక్కడ చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి .అంతా మారిపోయింది .అంతా కొత్తగా కనిపిస్తోంది .అందులో చాలా నాకు తెలియని విషయాలే .నేను యిక్కడ యవ్వనం లో ఉన్నప్పుడు నాకేం తెలిసి౦ది కనక?ఉయ్యూరు ,మద్రాస్, కొలంబో .అప్పుడు ధిల్లీ అంటేనే బహుదూరం అని పించేది .ఇప్పడు ‘’అబ్ ధిల్లీ దూర్ నహీ ‘’అనిపిస్తుంది .బొంబాయి మరో దేశపు ఓడ రేవు అనిపించేది .ఇప్పుడే నా మాతృదేశం గురించి సరైన అవగాహన ,,పరిచయం కలిగింది .ఒక సరిహద్దునుంచి ఇంకొక సరిహద్దుకు జరిగింది నా పయనం .’’ఇండియా ఎలా అనిపిస్తోంది ?’’అని అడిగితె నా సమాధానం ఒక్కటే ‘’నేను మొట్ట మొదటి సారిగా ఇండియాలో ఉన్నాను ‘’అని .

‘’   ‘’ఏడుకొండలెక్కి  వేంకటేశ్వరుని దర్శించా .ఆశ్చర్యకరమైన చోటు. భౌతిక ఆరోగ్యానికి, మానసిక అనుభూతికి మంచి ప్రదేశం అది .అక్కడి ప్రక్రుతి సౌందర్యానికి ముగ్దుడనయ్యాను . కనులారా ఆ సౌందర్యాన్నిఆస్వాదించి  ఆరాధించాను .ఈ ప్రదేశం గురించి నాకు తెలుసు .నాన్న దీని గురించి కధలు గాధలుగా చెప్పేవారు . దేశం నలుమూలలనుంచి భక్తులు యాత్రికులు వచ్చి శ్రీ మహా విష్ణు స్వరూపుడైన బాలాజీని దర్శిస్తారు .ఈ రోజు  కూడా భక్త జనసముద్రం  పొంగిపోయి ఉందిక్కడ .దేవాలయ సందర్శనం తర్వాత ఆరోగ్య కేంద్రాలను దర్శించాను .ఎందుకిలా చేశానో తెలీదు .  .ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో తెలియటం లేదు .కొద్దికాలం లో ఈ అమూల్య అద్భుత  ప్రక్రుతి సంపద ఒక జాతీయ పార్క్ గా రూపు దాల్చి వర్కర్ల  విశ్రాంతి కి ,చికిత్సకు ఉపయోగ పడుతుంది  .’’

‘’నాకు కూడా ఇక్కడ విశ్రాంతి అనుభావి౦చాలనే ఉంది .ఈ ట్రిప్ ఉత్సాహం గా ఉన్నా ,బాగా అలసట అనిపించింది .ఒక అనుభూతి ముద్ర నుంచి మరో దానికి వెళ్ళే వీలు కనిపించలేదు .నాకు ఇండియా చూడాలని ,దాన్ని గురించి వినాలని ,అంతటినీ  జీర్ణించుకోవాలని అతి తొందరగా ఉంది .ఇదే మొదటి సారి ఇదే చివరిసారి వచ్చిన అవకాశం .అంతేకాదు ఎందరెందరితోనో చర్చలు సమావేశాలు జరుగుతూ ఉండటం, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం ,సమావేశాలలో,సభలలో  ప్రసంగించటం జరిగింది .అనేక సమస్యలపై  చర్చి౦చు కోన్నాం .వేల మైళ్ళ దూరం నుంచి ఇక్కడికి వచ్చాను ,నాకు అంతా పూర్తిగా సమగ్రంగా సంపూర్ణంగా అర్ధమైంది .ఇండియా అంతా ఒకే  దీర్ఘ దినం లో  చూశాను అన్న భావన కలిగింది .

భారతీయులలో చోటు చేసుకోన్నమార్పు

‘’ డిబేట్ లలో నేనేమీ బలవంతంగా నమ్మించటం కాని ,ఒప్పించటం కాని చేయ లేదు .నాదృక్కోణం లో విషయ వివరణ చేశాను అంతే.నేను చెప్పేదాని కంటే వినటానికే ఎక్కువ ప్రాదాన్యమిచ్చాను .నాతొ సంభాషించేవారి గురించి నాకు ఎక్కువ తెలిసిందా లేక వారికి నా గురించి ఎక్కువ తెలిసిందా అంటే తేల్చి చెప్పటం కష్టం .చాలా సార్లు సంభాషకులు చెప్పింది వినటానికే ఎక్కువ అవకాశ మిచ్చాను .కాని నాగురించి ,,నా పరిశోధనాంశాల గురించి ,సోవియట్ దేశం గురించి చెప్పాల్సినవన్నీ చెప్పేవాడిని .వీళ్ళకు నా దేశం గురించి ఎక్కడినుంచి ఎందుకు ఇంత  అభిమానం  కలుగుతోందో తెలియదు .నాకు తెలిసింది ఏమిటంటే వీరికి ప్రపంచం లో అన్ని విషయాలు కావాలి .ఇదే నవ భారత ప్రత్యేక లక్షణం .అయితే సోవియట్ రష్యా గురించి ‘’ అభిరుచి మాత్రం ప్రత్యేకం .సోవియట్ దేశ అభివృద్ధి వీరిని  ఒక అయస్కాంతం  లాగా ఆకర్షిస్తోంది .అణచి వేత  సృ౦ఖలా బద్ధమైన  రష్యా దేశం ఆ సంకెళ్ళు తెంచుకొని , వెనుకబాటు తనాన్ని అధిగమించి ,నిరక్షరాస్యతను పాతి బెట్టి ,ఆకలిని  రోగాల్ని అంతం చేసి,కొత్త బలీయమైన సర్వ  సమృద్ధద్ధమైన  పారిశ్రామిక దేశం గా స్వయం శక్తితో  మారిందని ఇక్కడి ప్రజలు గ్రహించారు .,భారదేశ ప్రజలు కూడా అలానే  ఇండియా బలీయమైన దేశం గా అభి వృద్ధి  చెందుతుందన్న    సంపూర్ణ  విశ్వాసం తో ఉన్నట్లు నాకు అనిపించింది .ఇదే నేను కోరు కొన్నది , నాపర్యటన పర్యవసానం అదే  అయినందుకు సంతృప్తిగా ఉంది’’ .

వెయ్యి డాలర్ల(రూబుల్) ప్రశ్న

‘’ చాలా మందికి నా స్వవిషయాలపై ఆరాటం ఎక్కువగా కనిపించింది .అందరూ తెల్ల వాళ్ళున్న రష్యా దేశం లో ఇండియన్ అయిన నేను అసాధారణ, అత్యున్నత శిఖరాలను  ఆ సంఘం లో అధిరోహించటానికి అవకాశాలు రావటం ,చాలా ముఖ్యమైన శాస్త్ర జ్ఞానం వృత్తిగా ఎంచుకోవటం ,అనేక  ప్రాజెక్ట్ లకు ,తీసుకొన్న విషయాలకు  జీవం పోయటం వారికి అమితాశ్చర్యాన్ని కలిగించింది .వారు దీన్ని ఊహించలేకపోవటమేకాదు ,గ్రహించనూ లేక పోయారు. ఇది ఆ దేశం లో ఒక ఇండియన్ కు సాధ్యమా అనుకొన్నారు .ఆ దేశం ఇతనికి ఇంతటి గొప్ప తనాన్ని కట్ట బెట్టిందా అనే సంభ్రమం లో నాభారతీయ సోదరులున్నారు .దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు .అది సరే ఎవరికీ దక్కని అరుదైన ‘’సుప్రీం సోవియట్ అవార్డ్ ‘’రామయ్యకు అందజేయటం ఏమిటి ?అనుకొన్నారు కూడా .కలయో వైష్ణవ మాయ యో లాగా ఉంది వారి పరిస్తితి .ఎందుకు సుప్రీం సోవియెట్ ఈ ఇండియన్ ను గుర్తించి ఆదరించింది ,అభిమానించింది తనవాడు అనుకొన్నది? ఇదే అగ్రాహ్యమైన విషయం .’’థౌసండ్ డాలర్(రూబుల్ ) ప్రశ్న ‘’ అయింది వారికి . దీనికి సమాధానం వారే తెలుసుకోవాలి రాబోయే కాలం లో .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘25(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘25(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

ఆహ్వాన వైవిధ్యం

‘’అన్ని మీటింగులు ఒకలా లేవు .వృద్ధులు వేరొక విధం గా  కలిసేవారు. ప్రెస్ కాన్ఫ రెన్స్ లో అన్ని ప్రశ్నలూ స్నేహ పూరితంగా వేసే వారుకాదు .రైటిస్ట్ వాదులు వారి పంధాలో ప్రచురిస్తే ,మా బ్రాహ్నాలు సంప్రదాయంగా ప్రవర్తించారు .మా బంధువులు నా ప్రక్కన కూర్చునే వారు కాదు .ఒకే టేబుల్ మీద నాతొ భోజనం చేయలేదు .ఊరికే తల ఊపుతూ ఉండేవారు .కొత్త వాళ్ళు పాత తరం వాళ్ళూ స్నేహితుల్లా కలిసి ఉండలేరా ?అని అనిపించింది .ఇది వయసు వ్యత్యాసం ఒక్కటిమాత్రమే కాదు .ముసలి సన్యాసులలో  అందరూ దైవ సేవలో అంకిత భావం తో పని చేసేవారుకాదు .కొలంబో క్రిస్టియన్ ల లాగా వారిలో ఏదో ఉంది .వీరిలో నటన లేదు పూర్తిగా దైవ సేవలో నిమగ్నమయి ఉండేవారు .వీళ్ళతో మాట్లాడటానికి నాకు ఏ విషయమూ ఉండేదికాదు .’’ఈ నాటి పవిత్రకార్యం పోరాటమే ‘’అని వారికి ఎలా చెప్పగలను ?ఉరక లెత్తే సముద్రాన్ని  అందులో మునిగి ఈదటాన్ని వదిలేసి ,పగలును రాత్రి నుండి రక్షించుకొని , చావు నుండి నుండి  జీవితాన్ని రక్షించుకొని ,యుద్ధం నుంచి శాంతిని కాపాడుకోవటం మహత్కార్యం .ఎవరి జీవితాన్ని వారికిస్టమైనట్లు జీవించ వచ్చు. అభ్యంతరం లేదు .ఇలాంటి వారిని నేను  నిందించను .అంతమాత్రాన వారిని సమర్ది౦చనూ లేను .ఈ సారి వచ్చే యుద్ధం నిన్నూ నన్నూ ప్రపంచాన్ని కబళిస్తుంది .జాతీయత నినాదం అచ్సిరాదు.వీరిలో ఇండియాను నేను గుర్తించలేను .’’

స్వంత ఇంట్లో రామయ్య –బాలిక ఆత్మ హత్య

‘’మా ఇంటి దగ్గర ఉన్న  పాత బావి ని  నేను గుర్తుపట్టాను . నా చిన్ననాటి స్నేహితునిచూడటానికి వాళ్ళ ఇంటి   వైపు నడుస్తుంటే నా చెయ్యి పట్టుకొని ఆపేసింది మా బంధువులమ్మాయి .’’దయ చేసి వెళ్ళకు .అదొక విషాదం ‘’అంది  ఆమెకు సోదరి   వరుస అయిన  ఆవిడ విషాద గాధ వినిపించింది .ఆమెకు ఇష్టం లేకుండా ఒకడికిచ్చిఆమె పెళ్లి చేయాలనుకొన్నారు .పైగా ఆతను ఆమె  దగ్గర బంధువుకూడా .ఇష్టం లేని వాడిని కట్టుకోలేక ,మరో దారి లేక ఆ పిల్ల నూతిలో దూకి ప్రాణం తీసుకొంది .అప్పటి నుండి ఆ బావి నీరు ఎవరూ వాడటం లేదు .ఆ బావి పక్కనుంచి వెళ్ళే వారు విషాదం తో తల ఆడిస్తూ నడిచి వెళ్ళేవారు .నన్ను ఆపినా నేను వెళ్లి ఆ బావి ని చూశాను .ఆ నీటిలో నా ముఖం ,ఆకాశం ప్రతి ఫలించాయి .ఒక్క క్షణం నాకు ‘’అరె !నేను బతికే ఉన్నానే ?’’అనిపించింది .బతికి ఉన్నందుకు ఆనంద పడటం చూసి అభినందించాను. నాకు తెలియని ఆ బాలిక మరణానికి చింతించాను .పాత నూయి ఆమెను ఆహ్వానించింది గావుల్ను .

యాకమూరు పారిశ్రామిక వాడ

ఒక సారి కొదరు యువకులు కలిసి   మాట్లాడకుండా నావైపు  చూస్తున్నారు . వాళ్ల కళ్ళల్లో పెద్ద వారి కళ్ళల్లో కనిపించని వింత భావం ఏదో నాకు కనిపించింది .వాళ్లకు నేను కొత్త వాడినైనా ఆంధ్రుడిని అనిపించిందని అర్ధమైంది నాకు .ఇక్కడే ఒక చిన్న తమాషా జరిగింది .అందులో మెరిసే తెల్లని పలువరస తో ఉన్న ఒక కుర్రాడు నాదగ్గరకొచ్చి ‘’నాపేరు లాల్ గోవింద్ రామయ్య ‘’అన్నాడు .ఆశ్చర్యం తో అతని మొహం  లోకి తొంగి  చూశాను .ఏమైనా నాకు తెలియని ప్రపంచం లోకి నేను అడుగు పెట్టాను .నా ఉయ్యూరు పల్లె నుండి పట్నంగా మారింది .నేను పుట్టిన యాకమూరూ మారిపోయింది .పారిశ్రామిక వాడ గా కనిపిస్తోంది. అయితే అది స్థానిక వ్యాపారానికి సంబంధించినదే .అక్కడొక చిన్న ఫాక్టరీ దగ్గరకు వెళ్ళగానే నా అన్నగారమ్మాయి ‘’ఇదేమిటో తెలుసా ?అద్దకం ఫాక్టరీ .వాళ్ళు బాటిక్ (రంగుల డిజైన్లు )తయారు చేస్తున్నారు ‘’అంది .చిన్నప్పుడు నా తండ్రి అద్దకపు పరిశ్రమ గురించి చెప్పగా విన్నాను .ఇప్పుడిక్కడ డిజైన్లు రూపు  దిద్దు తున్నారు .’’అద్దకమా –చాలా బాగుంది ‘’అన్నాను .అది తయారు చేసే వాళ్ళను చూడాలని ఉంది అన్నాను .ఇద్దరం  ఫాక్టరీ లోకి వెళ్లాం .

ఇదొక చేనేత పరిశ్రమ .ఇప్పుడు కొత్త పద్ధతులలో శక్తి వంతమైంది పని చేసే చోటుకు వెళ్లి పరిశీలించాను యువకులు యువతులు వాట్ మన్ పేపర్ మీద ఆభరణాల డిజైన్లు వేస్తున్నారు .నేర్పే మాస్టారు వారి పని తీరును నిశితంగా పరిశీలిస్తున్నాడు .ఈ కళ ఎవరి దగ్గర నేర్చుకోన్నావు అని అతన్ని అడిగాను .అతనుఇక్కడే ఎప్పుడో చేరి పని చేసిన తన తాత గారి నుండి ఈ విద్య నేర్చుకోన్నానని చెప్పాడు .ఎప్పుడో ఒకప్పుడు  తనను కూడా ఇక్కడికి వచ్చి పని చేయమని ఆ ముసలాయన చెప్పాడని అన్నాడు .ఇక్కడ నేర్చే యువకులు  శక్తి యుక్తుల్ని బాగా ఉపయోగించి అంకిత భావం తో పని చేస్తున్నారు అని తెలుసుకొన్నాను .’’ఈ పనికి డిమాండ్ బాగా ఉందా ?’’అని అడిగాను .అప్పుడు మేష్టారు ‘’రామయ్య గారూ !ఈ పిల్లలంటే నాకు అమితమైన అభిమానం .నేను నా తండ్రికంటే ఏంతో గొప్ప పని మంతుడిని అయ్యాను .అలానే వీళ్ళూ ఈ గురువును మించిన శిష్యులవ్వాలని నా కోరిక .’’అన్నాడు తర్వాత అక్కడే ఉన్న వర్క్ షాప్ కు వెళ్లాను. అక్కడ మిరుమిట్లు గొలిపే ఇంద్ర ధనుసు రంగులున్నాయి.. తల  ఆడిస్తూ ముందుకు సాగిపోయాను .మధ్యమధ్యలో ‘’ఎంత గొప్ప డిజైన్ ?రంగులు యెంత అద్భుతంగా ఉన్నాయి ?అనే వాడిని .నా మాటలు నాకే నవ్వు తెప్పించేవి .నా మాట తీరు రష్యన్ యాస తో ఉండేది .నాకు ఇస్టమైనదాన్ని ఎంచుకోమని మాస్టారు కోరారు .చాలా వింత అయినదాన్ని ఎంచుకొన్నాను .మాస్టారు ఆశ్చర్యపడి ‘’ఇది మీకు గుర్తుందా ?ఈ మాదిరి (మోడల్ )నా చిన్నతనం నుంచి ఉంది ‘’అన్నాడు నవ్వుతూ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-15 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమీనపురం సాయిరాజుగారి కవితలు

sayraj1 001 sayraj2 001అమీనపురం సాయిరాజుగారి కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

క్షేత్రాలు పుస్తకం పై రామచంద్రాపుర వాసి ఆదిశేషా రావు గారి స్పందన

spandana 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘24(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా )’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘24(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా )’)

ఆత్మీయ స్వాగతం –     పుష్ప వృష్టి

‘’అందరూ వచ్చి వరుసగా నా మెడలో దండలు వేస్తున్నారు .పుష్ప వృష్టి  కురిపిస్తున్నారు ఆ పూలలో నన్ను ముంచేశారు .ఆ పువ్వుల పరిమళం తో బాటు వారందరి ఆత్మీయ సురభిళం నన్ను పరవశింప జేసింది .ఈ’’ హార భారం  ‘’ నేను మోయలేనంత బరువుగా ఉంది. కుంగి పోతానేమోనని పించింది .దాదాపు అన్నిరంగుల ,రకాల దండలూ కలిపి 45 దాకా ఉండచ్చు .ఒక పెద్దాయన నాదగ్గరకు వచ్చి వంగి నమస్కరించి ‘’లాల్ గోవింద్ ! నేను గుర్తున్నానా ?మనిద్దరం స్కూల్ లో కలిసి చదువుకొన్నాం ‘’అన్నాడు .’అరే భగవాన్ ! స్కూల్ లోనా ?అని ఆశ్చర్య పడ్డాను .నెమ్మదిగా జ్ఞాపకం వచ్చి పలకరించాను .యెంత అభిమానం నా మీద ?ఇంత దూరం నాకోసం వచ్చాడా శ్రమపడి అనుకొన్నాను .నిజంగా అతను నాకు జ్ఞాపకం లేడు. కాని ప్రేమగా పలకరించి కబుర్లు అడిగాను .నాకు గుర్తున్నదల్లా’’ కుమార్ ‘’ఒక్కడు మాత్రమె .దయ గల అతనికళ్ళు,వణికే చేతులు ఆప్యాయంగా నన్ను చుట్టేసుకోవటం జ్ఞాపకమున్నాయి  ఆతను ఉన్నాడా?ఏం చేస్తున్నాడు ?ప్రశ్నలు నాలోసుళ్ళు తిరిగాయి ,అప్పుడు నాలో ఏదో కొంత భాగం జాగ్రుతమైంది .ఇండియా అంతా ఇక్కడికి రాలేదుకదా ! సముద్రం దాటి బయటి దేశాలకు వెళ్ళిన నన్ను సాంప్రదాయ బ్రాహ్మణులు  ఆహ్వానిస్తారా ?అని ప్రశ్నలు నాలో చెల రేగాయి .’’

‘’  కమ్యూనిస్ట్ లు , వామ భావ సంస్థల వారు నాకు  ఆత్మీయంగా  స్వాగతం పలికారు .ఇప్పుడు అంతా బాగానే ఉంది .పరిస్తితులు  సర్దుకోన్నాయనిపించింది .నేను నిజమైన భారత దేశం లోనే ఉన్నాను ,ఏదో ఊహా  లోకం లో లేను అని తెలిసింది . కమ్యూనిస్ట్ లు  వామ పక్షాల వారు ఉన్నారు అంటే ఇండియాలో రైటిస్ట్ భావాల వారూ ఉన్నారన్నమాట .కనుక ఇండియా కు మార్గం అంత సులభమైనదికాదు అనుకొన్నాను .ఈ కళ్ళు ,ఈ నవ్వులు నాకు చిరపరిచితాలే  .జో ,అలేక్సీలు ,గుయనీస్ చెడ్డి అందరు ఒకసారి గుర్తుకొచ్చారు .దయా హ్రుదయుడు దేనికీ లొంగని స్వభావుడు అయిన మా నాన్న ఆత్మబలం ,స్థిర సంకల్పం జ్ఞాపకం వచ్చాయి .మానవ గౌరవాన్ని కాపాడుకోవటం కోసం అది పొందిన ప్రతి దాన్నీ విసర్జించటం కాదు ,దూరం గా ఇంకా దూరంగా ముందుకు వెళ్ళటమే .భారత దేశమా మళ్ళీ మనం కలుసుకొన్నందుకు మహదానందం గా ఉంది ‘’.నా సోదర సోదరీమణులారా !ఇదిగో నేనొచ్చేశా .మీ ముందున్నా.నేనే నేను నేనే . భారతీయుడిని ,సోవియెట్ యూనియన్  పౌరుడిని .అందుకే నేను మీకు ‘’హలో బ్రదర్’’ లా ‘’డబుల్ బ్రదర్’’ ని .తేడా ఏమీ లేదు .ఒక వ్యక్తికీ రెండు మాత్రు దేశాలు ఉన్నాయి అంటే భవిష్యత్తులో ప్రపంచమంతా ప్రజలంద మాతృదేశం అవుతుందన్నమాట .’’

‘’మీ ముందు నేను వినమ్రంగా నిలబడి ఉన్నాను .ఈ భూమిమీదనే నిలిచి ఉన్నాను  .కాని నా పాదం ఒకటి ఇండియా లో ,రెండవది రష్యాలో ఉంది .ఈ రెండు స్థిరమైన బలమైన ఆధారాల మీదనే నిలిచి ఉన్నాయి .ఇలా నిలబడి చూస్తుంటే భవిష్యత్తు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది .ప్రకాశ వంతమైన ప్రపంచాలు  నాముందు ఆవిష్కారం అయినట్లు గోచరిస్తోంది .అవి ‘’స్ప్రింగ్ బీటిల్స్ ‘’లాగా ‘’స్పుత్నిక్ ‘’ల లాగా నా చుట్టూ  ఎగురు తున్నట్లు అనిపిస్తున్నాయి .నా భుజాలపై వెలుగు లీనే సప్త వర్ణ ఇంద్ర ధనుస్సు   కాంతు లీను తోంది .సూర్యుడిని నా దోసిట్లో పట్టుకొన్నాను  .అది భూమిపై వెచ్చదనాన్నిఅందరికీ అందిస్తోంది .’’

ఎంత భావ గర్భితం గా కవి తాత్మకంగా రామయ్య గారు తన అనుభూతిని వివరించారో మనకు తెలుస్తోంది ఆయనలో ఒక సైంటిస్ట్ మాత్రమేకాదు ఉత్తమ భావుకుడు ఉత్తమకవి మనకు దర్శన మిస్తారు .  .

భారత్ లో యాత్రా సందర్శనం

‘’ఇండియాలో నా పర్యటన అంతా ఎక్కడా ఆపులేకండా నాన్ స్టాప్ గాఉత్సవంలాగా  సాగిపోయింది .దీనికి నేను ఎవరికి కృతజ్ఞతలు తెలపాలో అర్ధం కాలేదు .అదృష్టం అందామా అంటే నాకు దానిపై నమ్మకం లేదే !దేవుని దయ అనుకొందామా అంటే నా ఒంటికి వాళ్ళు పడరే .’’చాన్స్’’ అను కొంటె ఏ సమస్యా ఉండదు .నా పర్యటనను ప్రగతి శీల వ్యక్తులు,సంస్థలు ఏర్పాటు చేసి నిర్వహించారు .రోజులు గడుస్తున్న కొద్దీ నాకు నమ్మకం కుదిరింది .ఇండియాకు నాపై నమ్మకం కలిగింది అనుకొన్నాను . అవును అది సాధ్యమే .అతను చేయ గలిగాడు .మనం కూడా చేయగలం .అతను సాధించాడు అన్నీ. మనమూ ప్రయత్నం చేస్తే సాధించి తీరుతాం అనుకొన్నారు ప్రజలు నన్ను చూసి  అనిపించింది .

‘’  ఆంద్ర దేశం లో  నా స్వగ్రామం ఉయ్యూరు వెళ్ళేదారిలో మా రైలు అనుకోకుండా ఒక చోట ఆగింది .అక్కడేమైనా రోడ్డు ప్రమాదం జరిగిందేమోననుకోన్నాను .అది యాక్సి డెంట్ ను మించిన విషయం అయింది .రైతు ప్రతినిధులు మా కంపార్ట్ మెంట్ లోకి ఒక్క సారి దూసుకు వచ్చారు .నా దగ్గరకొచ్చి ఆత్మీయ స్పర్శ తో కౌగిలించుకొని  నాపేరు చెక్కిన విలువైన గడియారాన్ని నాకు కానుకగా ఇచ్చారు .ఎవరు వీళ్ళు ?నన్నెప్పుడూ చూడలేదే ?అందులో ఏ ఒక్కరూ నాకు తెలిసిన వారు కాదే?నేను వస్తున్నట్లు వాళ్లకు ఎలా తెలిసింది ?అదీ నాకు తెలియ లేదు .రైలు ఆగటానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ?నాకు అసలేదీ తెలియదు .వాళ్లకు నేనొక’’ ప్రతీక ‘’ను అయ్యాను  అనుకొన్నాను .కీర్తి చాలా బరువైనది .మళ్ళీ పూల దండలు ,అభి మానపు పలకరింపులు ,పూల జల్లులు . కృతజ్ఞత తో  తడిసి ముద్ద అయ్యాను.ఇంతటి అభిమానానికి నేను అర్హుడినా?మొదలైన  ప్రశ్నలు  నన్ను కలవర పెడుతున్నాయి . వంగి వంగి నమస్కారాలు, కులాసా పలకరింపులు , ,స్వాగతాలు అన్నీ ఆర్భాటం గా ఉన్నాయి .వారిలో ఏదో తెలీని ఉత్సాహం ,ఉత్సుకత ,ఆనందం తాండవిస్తోంది .అభిమానం కురిపించి మరీ నన్ను కుంగ దీసేస్తున్నారు .అ మనుషుల కళ్ళు తలలు ముఖాలు నవ్వులే నాకు కనిపించాయి .ఇంతకంటే మహోత్కృష్టమైన ఆనందం ,సంతోషం ,అనుభూతి మరెప్పుడూ నేను అనుభవించలేదు .మనసంతా ఆనంద కోలాహలం గా ఉంది .ప్రతి సారీ నాకు యువకులే కనిపిస్తున్నారు .వాళ్ళను చూస్తుంటే నేనూ యువకుడిగా మారిపోయానని పించింది .ఇండియా నుండి మళ్ళీ మాస్కో చేరిన తర్వాత నాకు సన్నిహితులు నవ్వుతూ ‘’మీరు అక్కడ ముసలి తనాన్ని వదిలేసి యవ్వనాన్ని మోసుకొచ్చారు ‘’అని జోక్ చేశారు దానికి నేను ‘’అవును .నిజమే .నేను యాభై ఏళ్ళు  వెనక్కు వెళ్లాను ‘’అన్నాను నేనూ నవ్వుతూ .అంతటి ఉత్సాహం నాకు నా ఇండియా ప్రయాణం కలగ జేసి నన్ను యవ్వన వంతుడిని చేసింది మానసికం గా .ధన్య వాదాలు భారత మాతా ధన్యవాదాలు ఆంద్ర మాతా ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-15 ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆకాశ కవచం మరియు భారత్ భూఫలకానికి అంత వేగం ఎందుకు/

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పోరాటమే నా మనో బలం -కేశవ్ రావు జాదవ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేపాల్ బాధ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి నాటి ఆశలు నెరవేరేనా ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“బోస్ ” వీరులు -భూలాభాయ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-23

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-23

రామయ్య గారి సాహిత్య కృషి

ఏటుకూరి బలరామ మూర్తి రాసిన ‘’ఏ బ్రీఫ్ సర్వే ఆఫ్ ది హిస్టరి ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంద్ర ‘’అని పుస్తకాన్ని రామయ్యగారు రష్యన్ భాషలోకి అనువదించారు ఈ అనువాదానికి జోర్యా పెట్రుచినోవా ,అనే తెలంగాణా ఉద్యమ విద్యార్ధి సహకరించాడు .అతనే మొట్టమొదటి సోవియెట్ ఫైలాలజిస్ట్ .ఆతను తెలుగు భాష ,సాహిత్యం లో ప్రత్యేక  కృషి చేశాడు రష్యన్ అనువాదం 1956 లో మాస్కో లో ప్రచురింపబడి విడుదలయింది .రామయ్య గారు మొదటి తెలుగు –రష్యన్ నిఘంటు నిర్మాణానికి కృషి చేశారు .దీనికి కొందరు ఇండాలజిస్ట్ లు స్వెత్లానా జీనిట్ ఆధ్వర్యం లో సహకరించారు .

‘’  ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు విజ్ఞానపు  వెన్నెలొచ్చెనమ్మా ,వెల్లువచ్చే నమ్మా ‘’

రామయ్య గారి మాటల్లో ఇండియా సందర్శన విశేషాలు

‘’1963 ఏప్రిల్ లో విమానం ధిల్లీ లో దిగింది .బయట ఉష్ణోగ్రత 45 డిగ్రీలుంది .అంత వేడిని నేనెప్పుడూ భరించలేదు .ఉత్తర దేశాలలోనూ ఇంత ఎండ చూడలేదు .ఏం చేయాలో పాలుపోలేదు .ఎవరొ ఒకరు కరు  నన్ను  కలవటానికి వస్తారని ఎదురు చూస్తున్నాను .రష్యన్ ఎ౦బసీకి మాత్రమె నా రాక తెలుసు .బంధువులనుండి అప్పుడప్పుడు గ్రీటింగ్ కార్డ్ లు అందాయి . వారెవరో  నాకు పూర్తిగా తెలియదు .భగవంతుడికే తెలియాలి ఆ బంధుత్వం .దాదాపు అర్ధ శతాబ్దకాలం  ఈ నేల మీద అడుగు పెట్టనే లేదునేను .

విమానం దిగుతూ మెట్లమీద కొంత గందర గోళం లో నేను నిలిచిపోయాను .ఎదుట జనం బాగా ఉన్నట్లు కనిపించారు .వారందరూ  ఎవరికోసమో  వచ్చినవారు అనిపించింది .నాకోసం అని నేననుకోలేదు  నావెనక ఎవరైనా ఉన్నారేమో చూశాను. కాని ఎవరూ లేరు .నేనే విమానం దిగిన చివరి వాడిని .అప్పుడు తెలిసింది ఈ వచ్చిన వారంతా నాకోసమే, నన్ను కలవటానికే  వచ్చారని .అక్కడ చేరిన జనం నవ్వుతున్నారు .కొందరు పాటలు పాడుతున్నారు .వారందరూ యువకులే అనిపించింది ఆ క్షణంలో .అన్ని వయసుల వారూ అందులో ఉన్నారు .మగ వారు ,ఆడ వారూ కనిపించారు .అందరు అత్యుత్సాహం గా నాదగ్గరకు వచ్చి స్వాగతం చెప్పారు .నాకు ఉక్కిరి బిక్కిరి అయింది .ఆనందం కలిగింది .కంగారు పడ్డాను .విచిత్రం ఏమిటంటే అందులో ఎవరూ నాకు తెలిసిన వారు లేరు  .అంతమంది అంత ఉత్సాహం గా అక్కడ చేరి నాకు  మనస్పూర్తిగా ఆహ్వానం పలకటం నేనెప్పుడూ చూడలేదు .కాసేపు మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయాను .కాసేపటికి తేరుకొని వచ్చిన వారిలో ఎక్కువ మంది నా బంధువులు కూడా ఉన్నారని తెలుసుకొన్నాను .అర్ధ శతాబ్దం తర్వాత వచ్చిన నాకు వారందరూ కొత్త వారే .కాని అక్కడున్న వారిలో నా ఆంద్ర జనం చాలా తక్కువగా ఉన్నట్లు అనిపించింది .అక్కడ చేరిన వారిలో ధిల్లీ వాసులు తమిళులు ఎక్కువ మంది ఉన్నారు .కేరళ నుంచి వచ్చిన వారూ ఉన్నారు .అప్పుడు నాకు ‘’ భారత మాత ‘’నన్ను ఆహ్వానిస్తోంది అనిపించింది .ఒక ఆవిడకు వంగి నమస్కరిస్తే ఆమెకూడా అలాగే చేసింది .ఆమె నవ్వింది .రెండు చేతులు జోడించి సంప్రదాయ బద్ధం గా నమస్కరించింది .’’మీకు కృతజ్ఞులం లాల్ ‘’అన్నదామె .వాళ్ళు నాకు కృతజ్ఞత చెప్పటం ఏమిటి అని పించింది .ఇన్నేళ్ళు అయినా నేను నా భాషను ,ఆచార వ్యవహారాలను మర్చిపోలేదని తెలుసుకొన్నాను .నేను వచ్చింది నాకు ఆరంభాన్నిచ్చిన ఈ నేలకు నేను గౌరవ వందనం ,కృతజ్ఞత చెప్పాలని  . వాళ్ళను మర్చిపోలేదని ,తేలిక భావం తో చూడలేదని వారు గ్రహించారు. వాళ్ళ ఆశలను వమ్ము చేయ లేదని సంతోషించారు .వాళ్ళు అనుకొన్నట్లు నేను తాసీల్దార్ కాలేక పోయానని  ,పనికి రాని  పువ్వుగా ఉండిపోలేదని తెలుసుకొన్నారు .నన్ను చూసినందుకు వారందరికీ సంతోషం సంతృప్తి కలిగింది .నా జీవితం ఆ దేశం లో వ్యర్ధం కాలేదని పొంగిపోయారు .నేను నా జీవితం లో ఇండియాకు రష్యాకు సమానంగా చెందినా వాడిలాగానే ఉన్నాను .భారత మాత పుత్రుడొకడు రష్యాలో ప్రసిద్ధు డయ్యాడని వారు తెలిసి సంబర పడ్డారు .నన్ను చూసి గర్వ పడ్డారు .నాలో వారు  కష్టమైన మార్గం లో పయనించి సత్యం ,సంతోషం లకు చేరువయ్యే భారత దేశాన్ని చూశారనిపించింది   ..

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

మాయాకురంగం – హుళ్ళక్కి భాస్కరుడు

scan0002 scan0003 scan0004

Posted in సేకరణలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-22

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-22

కాన్ స్టాన్టిన్ సెర్జియో విచ్ –అనే రామయ్య

1959లో మాస్కో లో ఒక ఇంటర్వ్యు ఇస్తూ రామయ్య ‘’ఇండియా, రష్యా ప్రజలకు సహాయం చేయటం నావిధి .వారు ఒకరినొకరు పరస్పరం అర్ధం చేసుకోవాలి .’’అన్నారు చెప్పటమేకాడు అక్షరాలా చేసి చూపించారు .ఈ ఇంటర్ వ్యూ ను ‘’సోవియట్ లాండ్ ‘’పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు అందులో రామయ్యగారు భౌతిక ,రసాయన శాస్త్రాలలో చేసిన కృషిని వివరిస్తూ ఆయన అందించిన విశిష్ట సేవలను ప్రస్తుతించాడు ఇంటర్వ్యు చేసిన అయన .రామయ్య గారు తన  ఫ్లాట్ లో తరచుగా ఇండియన్ ,రష్యన్ స్నేహితులతో కలిసి మాట్లాడేవారు .’’ఓరియెంటల్ స్టడీస్ ‘’,ఇండాలజీ ‘’లకు చెందిన విద్యార్ధులు వచ్చి తెలుగు నేర్చుకొనేవారు రామయ్యగారి వద్ద .’’ప్రోగ్రెస్ ‘’అనే ప్రచురణ సంస్థ రామయ్య గారి దగ్గరకు వచ్చి ,తమ ఇండియా ప్రచురణల పై ,ఇండియాను గురించి తెస్తున్న ప్రచురణలపై సలహాలు తీసుకొనే వారు .సంప్రదింపులు  జరిపే వారు . వారందరికీ భారతీయమైన సంప్రదాయమైన ఆతిధ్యం ఇవ్వటం రామయ్య గారి ప్రత్యేకత .వారు అడిగే ప్రశ్నలకు వివరంగా సమాధానాలు చెప్పేవారు .అవసరమైతే ఇండియా పై,సోవియట్ పై  ఉపన్యాసాలు చేసేవారు .వచ్చిన అతిధులకు తెలుగు జానపద గీతాలను రికార్డ్ ప్లేయర్ పై వినిపించి ఆనందం కలిగించేవారు .ఇండియా నుంచి వచ్చే రష్యా యాత్రికులూ క్యూ కట్టే వారు .అందరికి చిరునవ్వు తో ప్రశాంత వదనం తో భార్య కాత్యా ఆతిధ్యమిచ్చేది .ఆమె వారందరికీ ‘’రష్యన్ సీత ‘’ అయి పోయింది .ఆమె వికసిత నీలి కనులతో  ,అందమైన నల్లని కురుల మధ్యలో తెల్లని  పాయలలతో ,చెరగని చిరు నగవుతో ,గాంభీర్య వదనం తో అపర అన్నపూర్ణా దేవి అనిపించేది .కాత్యా కాదు ఆత్మీయులకు ‘’కాత్యాయనీ దేవి ‘’అనిపించేది .వాళ్లకు ఆంధ్రా రామయ్య- రష్యన్ ఆంధ్రుడుగా ,సోవియెట్ ఆంధ్రునిగా, మాస్కో ఆంధ్రునిగా  దర్శనమిచ్చేవారు. ఆ అనుభూతి పొంది వారు ధన్యులమయ్యాం అనుకొనేవారు .సోవియట్ ప్రజలు ఆయన్ను ‘’కాన్ స్టాన్టిన్, సెర్జియో విచ్ ‘’అనే రష్యన్ పేరుతొ సంబోధించేవారు .కాని ఉత్తర ప్రత్యుత్తరాలలో ‘’రామయ్య’’ అనే సీతారామయ్య గారు రాసేవారు .అందుకని రామయ్య పేరే అందరికి బాగా పరిచయమై  ప్రాబల్యమైంది .

రామయ్యగారి మహోన్నత మూర్తిమత్వం

రామయ్య గారి మర్యాదపూర్వక సౌజన్యానికి అందరూ ముగ్దులయ్యేవారు .ఎక్కడా ఎప్పుడూ ఆయనలో’’ ఈగో ‘’అనేది కనిపించేదికాదు .ఈగో ను ‘’గో ‘’అని తరిమేసిన పెద్దమనిషి రామయ్య .యెంత పెద్ద పెద్ద ప్రముఖ వ్యక్తులోచ్చినా ,ప్రసిద్ధ శాస్త్ర వేత్తలు వచ్చినా వారితో అనువుగా, చనువుగా, అణకువగా సంచరించేవారు .ఆధిక్యం ఏ కోశానా కనపరచేవారుకాదు .రామయ్య గారు డబ్బు మనిషి కాదు. సంపదల వెంట పరుగులు తీయ లేదు .ఆయన ఉన్న అపార్ట్ మెంట్ లో కనీస సౌకర్యాలు మాత్రమే ఏర్పాటు చేసుకొన్నారు ఇండియా నుంచి వచ్చిన వారు అందజేసిన బహుమతులు ,ప్రతిమలు ,అల్లికలు , కేలెండర్ లు విలువైన తెలుగు గ్రందాలతో  ఫ్లాట్ నిండిపోయి ఉండేది  .వారికి  తెలుగు  మహాకావ్యాలలోని తనకిష్టమైన    పద్యాలను  మరీమరీ చదివి వినిపించేవారు . తనకు అభిమానులైన మహాకవి తిక్కన ,మధురకవి బమ్మెర పోతన ల రస గుళికల వంటి వందలాది పద్యాలు రామయ్యగారికి కంఠతా ‘వచ్చు .కృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద ప్రబంధం అంటే ఆయనకు పరమ ప్రీతీ .అందులోని ప్రతిపద్యం, తాత్పర్యం లోతైన విషయాలు ఆయనకు కరతలామలకాలే .సంప్రదాయ సాహిత్యం అంటే ఎంతటి’’ మోజు’’ ఉండేదో రామయ్య గారికి, విప్లవ భావాలతో శ్రీ శ్రీ రాసిన మహా ప్రస్తాన గేయాలన్నా అంతటి ‘’క్రేజు ‘’ఉండేది .అందులో గీతాలను గుక్క తిప్పుకోకుండా అప్పగించినట్లు ఉదాహరిస్తూ చెప్పి ఆశ్చర్య పరచేవారు .కవిత్వం పై అంతటి సమ ద్రుష్టి ఆయనది .కొడవటిగంటి కుటుంబరావు రాసిన వాస్తవ నవలలు ఆసక్తిగా చదివారు .

యువజన విద్యార్ధి బృందానికి ఆతిధ్యం

కాట్రగడ్డ గంగయ్య అనే ఆయన ముగ్గురు యువకులతో ఆంద్ర దేశం నుండి మాస్కో నగరానికి 1957 లో’’ ‘’ ఆరవ ప్రపంచ యువ జన విద్యార్ధి ఉత్సవాలకు ‘’ వచ్చి రామయ్యగారిని దర్శించి అమితానందాన్ని పొందారు .వాళ్ళు హోటల్’’ ఆస్టాన్ కినో ‘’లో ఉండి రామయ్యగారికి ఫోన్ చేశారు .ఫోన్ నంబర్ ను ‘’అతడు –ఆమె ‘’నవలా రచయిత  రష్యాలో అనువాదకుడిగా పని చేసిన ఉప్పల లక్ష్మణ రావు గారి నుండి తీసుకొన్నామని రామయ్య గారికి చెప్పారు .ఫోన్ అందుకొన్న రామయ్య గారు అచ్చమైన తెలుగులో ‘’నమస్కారం గంగయ్య గారూ !మా ఊరికి ఎప్పుడోచ్చారు?’’అని కుశల ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకొన్న మనసున్న మనిషి. వారు రామయ్య గారిని తామున్న  చోటుకు రావద్దని ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ,అప్పటికి తనకున్న ఎంగేజ్ మెంట్ లనన్నిటిని రద్దు చేసుకొని ,తన కూతురు లీలావతి ని  వెంట తీసుకొని ఒక గంట లోపే హోటల్ కు చేరారు .వాళ్లకు కూతురిని పరిచయం చేస్తూ ‘’ఈమె లీలావతి మా పెద్దమ్మాయి .వ్యవసాయ శాస్త్రం చదువుతోంది .’’అని కమ్మని తెలుగులో చెప్పారు .తెల్లబోయారు గంగయ్య .ఒకరికొకరు బాగా పరిచయమై వివరాలన్నీ మాట్లాడుకొన్నారు .వారిమధ్య సంభాషణ తెలుగులోనే దాదాపు జరిగింది .ఆంద్ర నుండి వచ్చిన వారికి మాట్లాడేటప్పుడు  సరైన తెలుగు మాట  స్పురించక పొతే రామయ్య గారే వెంటనే సరైన మాట చెప్పి ఆశ్చర్య పరచేవారు .గంగయ్య బృందం పదిహేను రోజులు ఉంది మాస్కో లో తరచూ వీరితో సమావేశామయేవారు .రామయ్యగారి ఫ్లాట్ కు వచ్చి ఆతిధ్యం తీసుకొన్నారు . కాత్యా వారందరికీ ఆంధ్రా వంటకాలు చేసి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టింది .రామయ్య గారి స్టడీ రూమ్ లో తెలుగు దినపత్రికలైన ఆంద్ర పత్రిక ,కృష్ణా పత్రిక ,విశాలాంధ్ర కట్టలు కట్టలుగా ఉండేవి .ఇందులోకొన్ని 1930 కాలం నుండి కూడా ఉన్నాయి. వీటిని ఇంత భద్రం గా బంగారంగా దాచుకొన్నారు ఆంధ్రాభిమాని రామయ్య .అవన్నీ అప్పుడు విజ్ఞాన సర్వస్వాలుగా ఉండేవి .ప్రతి సంచికా దాని ప్రత్యేకత కలిగి ఉండేది .అదొక అక్షర నిధి .అందుకే రామయ్య అంత జాగ్రత్తగా పదిల పరచుకొన్నారు .గ్రామఫోన్ లో  తెలుగు పాటలు వారికి వినిపించారు .వీరినీ వీరితో బాటు వచ్చిన యువజన విద్యార్ధి బృందాన్ని తాన ఇన్ ష్టి ట్యూట్ కు ఆహ్వానించి అక్కడ జరుగుతున్న పరిశోధనలపై అవగాహన కలిగించారు . రామయ్య గారి యెడల ఆయన సహచరులు చూపిన గౌరవ మర్యాదలకు,ప్రేమానురాగాలకు  అతిధులు ఆశ్చర్య పోయారు .అక్కడి’’ టోస్ట్’’ ను స్వీకరించి న తర్వాత అతిధులను రామయ్యగారు మాట్లాడమన్నారు ‘’మీరు తెలుగులో మాట్లాడండి .నేను రష్యన్ లోకి తర్జుమా చేసి వారికి తెలియ జేస్తాను ‘’అని చెప్పి అలానే చేశారు .గంగయ్య గారి బృందం రామయ్య గారితో ‘’అయ్యా రామయ్య గారూ ! దయ చేసి ఒక సారి మనదేశం ఇండియా ను సందర్శించ వలసినదిగా  వినయ పూర్వకం గా మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాం ‘’అని ప్రార్ధనా పూర్వకం గా వేడుకొన్నారు .’’ .కాలం కలిసి వచ్చినప్పుడు  తప్పకుండా వస్తాను ‘అని క్లుప్తంగా సమాధానం చెప్పారు రామయ్య . దటీజ్ సీతా రామయ్య .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-21

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-21

పోస్టల్ బాంబ్ ?

విజ్ఞాన శాస్త్ర మహా వృక్షపు శాఖలన్నిటినీ సమర్దులైనవారు తీర్చి దిద్దుతున్నారు .రామయ్య గారి ప్రయోగ శాలలో ఎప్పుడూ ,ఎన్నడూ తగాదాలు ,అపోహలు రాలేదు . ఎప్పుడూ చిరునవ్వులే వికసించేవి .మనస్పూర్తి అభినందనలే ఉండేవి .అకస్మాత్తుగా ఒక రోజు ఒక ఉత్తరం రామయ్యగారికి ‘’బాకు ‘’లో ఉండే స్నేహితుల నుండి వచ్చింది .దానిపైన పొగలుకక్కే ఒక గుండ్రని బాంబు బొమ్మ దాని ,కింద  ‘’జాగ్రత్త .ఒక గ్రెనేడ్ ను పంపుతున్నాం ‘’అని రాసి ఉంది. టెన్షన్ మొదలైంది .ఒక రోజు తరవాత ఒక పార్సిల్ వచ్చింది .విప్పి చూస్తె అందులో పళ్ళు ,దానిమ్మ పళ్ళు ఉన్నాయి .ఒక హెచ్చరిక కూడా రాసి ఉంది ‘’కొత్త విధానం లో మీరు నిర్వహించిన పరీక్షలు దిగ్విజయం అయినాయని తెలిసి సంతోషం తో అభినందిస్తున్నాం .త్వరలో ప్రోటోకాల్ పంపుతున్నాం .drink to your health ‘’అని చదివి అందరూ తేలికగా హాయిగా ఊపిరి  పీల్చుకొన్నారు .సైంటిస్ట్ రామయ్య’’ సక్సెస్ రామయ్య’’అయ్యారు .

రామయ్య గారింటికి  భారతీయల రాకపోకలు

యాభవ దశకం లో (1950) ఇండియా నుంచి ఎక్కువగా భారతీయులు మాస్కో కు రావటం ప్రారంభించారు .ఇందులో సైంటిస్ట్ లు ,వివిధ విషయాలలో స్పెషలిస్ట్ లూ ,రిసెర్చ్ స్కాలర్లు ,పోస్ట్ గ్రాడ్యుయేట్లు ,విద్యార్ధులు ఉన్నారు .కళాకారులు రచయితలూ వచ్చేవారు .అందులో రామయ్య గారి ఆంద్ర దేశ బంధు గణమూ ఉండేది .

రామయ్య గారి  తెలుగు నిఘంటు నిర్మాణం

అనుకోకండా ఒక సారి రామయ్యగారు తెలుగు నిఘంటు నిర్మాణం ప్రారంభించారు .దీనితో పరిచయాలు మరీ  విస్తృతమైనాయి .భాషా శాస్త్ర వేత్తలు ,భాషా తత్వ శాస్త్ర్జులు (ఫైలాలజిస్ట్ లు ),అనువాదకులు ఇంటికి వచ్చి చర్చలలో పాల్గొనేవారు .తెలుగు నేర్చుకోవాలన్న అభిలాష గల విద్యార్ధులు వచ్చి రామయ్యగారి వద్ద తెలుగు నేర్చుకొనేవారు .ఒక సారి ‘’ఆంధ్రుల చరిత్ర ‘’ను రష్యన్ భాషలోకి అనువదించమని కోరటం జరిగింది .చాలా సంతోషం గా దీన్ని నిర్వహించారు .ఇండో రష్యన్  ప్రజలు పరస్పరం అర్ధం చేసుకొని సహకరించుకోవాల్సిన అవసరం ఏంతో ఉంది అనిపించింది .మంచి స్నేహితులు ,ఇండాలజిస్ట్ లు ఆయనతో కలిసి పని చేసేవారు .తనను వారందరూ జ్ఞాపకం చేసుకొంటూనే ఉంటారని ,మనసులలో ఆత్మీయ భావాన్ని చూపుతూ ఉంటారని భావించారు రామయ్య .

అన్నపూర్ణ గృహం

మాస్కో వచ్చిన ప్రతి భారతీయుడు తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం పొంది స్వంత ఇంట్లో ఉన్న అనుభూతికి లోనయ్యేవారు .అప్పటికే రామయ్యగారికి 78 ఏళ్ళు వచ్చాయి .వయసురీత్యా తాను  ఇండియన్ కమ్యూనిటీలో పెద్ద వాడినని అనుకోవటం లేదన్నారు .అంతేకాదు తాను  ఆ జన సమూహం లో లేరు కూడా .తానొక సోవియట్ పౌరుడినని ,ఇదే తన ఇల్లు అని అనుకొనేవారు .అయినా ఇండియా నుంచివచ్చే యువకులు , వృద్ధులు రామయ్య గారింటికి వచ్చి టీ తాగి హాయిగా కబుర్లు చెప్పుకొని వెడుతూ ఉండేవారు .వారందరికీ తను పెద్ద అంతే .వారిని చూడటం వారితో మాట్లాడటం రామయ్యగారికీ ఎక్కువ సంతోషంగా నే ఉండేది .వారంతా తన సోదరులనుకోనేవారు. తాను  పెద్దన్న .ఇన్నేళ్ళుగా తాను  రష్యాలో ఉంటున్నా తన మాత్రుదేశమైన తెలుగు దేశం తెలుగుభాష సంస్కృతీ ,పద్ధతులను మరచిపోలేదని గర్వంగా రామయ్య గారు చెప్పుకొన్నారు .వారికి సదా ఆహ్వానం అనేవారు రష్యన్ పద్ధతిలో వారికి ఆతిధ్యమిస్తాను అన్నారు .భారతీయ సంస్కృతికి దూరం కాలేదన్నారు .తనకు జన్మ నిచ్చిన దేశమాత ఋణం తీర్చుకోలేనిదనేవారు. తనను పెంచుకొన్న తండ్రి నేర్పిన సంస్కార బలమే ఇదంతా అనేవారు .

శక్తి తగ్గి పోతుండగా ఒక సారైనా తనను కనీ ,పెంచి ఇంత దూరంలో ఇంత అందమైన దేశానికి  పంపిన మాత్రు దేశం ఇండియా వెళ్లి చూసి రావాలనిపించేది .ఆంద్ర దేశపు శ్రావ్య సంగీత ధ్వనులు చెవులలో రింగున మారు మోగుతూ ఉండేవి .భారత దేశం సందర్శించమని ఎందరో ప్రముఖుల నుండి సంస్థలనుండి ఆహ్వానాలు వస్తూ౦డేవి .వీటన్నిటికి సమాధానం గా 1963లో 42 ఏళ్ళ తర్వాతా 42 రోజులు ఇండియాలో గడపటానికి రామయ్య గారు వచ్చారని మొదట్లోనే చెప్పుకొన్నాం .రామయ్యగారి’’ కేమోటాలజి ‘’ని ఇప్పుడు ‘’ట్రైబో కేమిస్ట్రి’’అని పిలుస్తున్నారు .కేమోటాలజిపిత ‘’ ఇప్పుడు’’ ట్రైబో కెమిస్ట్రీ పిత ‘’అయ్యారన్నమాట .

రామయ్య గారి కుటుంబం

రామయ్య గారు మాస్కో చేరిన కొన్నేళ్ళకు జర్మన్ జాతికి చెందిన వోల్గా తీరం లోని పావ్ లోఝీ ప్రాంతానికి చెందిన ఏంజెల్ వాసి ‘’ఎకటేరినా లోగన్నోవ్నా బెల్జేర్ అనే ఆవిడను వివాహం చేసుకొన్నారు .ఈవిడనే’’ కాత్యా’’ అంటారు .ఆమె అతిదులపాలిటి  ‘’కాత్యా ‘’యనీ దేవి .1934 లో ఈ కాత్యా ,రామయ్య దంపతులకు లీలావతి అనే కుమార్తె జన్మించింది .ఈమె బయలాజికల్ సైన్సెస్ లో మాస్టర్ డిగ్రీ సాధించి ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ జెనరల్ జెనెటిక్స్ R.A.N .లో సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్  గా ఉంది .1936 లోనే రామయ్య సోవియట్ పౌరులయ్యారు .సోవియట్ లో ఉండటం వలన ఆ దేశం తో బాటు తానూ కష్టమూ సుఖమూ రెండూ అనుభవించాను అంటూ ఉండేవారు .తాను ఇండియాలో పుట్టినా జీవితం లో ఎక్కువ భాగం రష్యాలో గడిపానని ,సోవియట్ పౌరుడుగా ఉన్నందుకు గర్వం గా ఉందని చెప్పేవారు .1945లో రామయ్య దంపతులకు రెండవ ఆడపిల్ల నీల వేణి పుట్టింది .ఆమె స్టేజి నటి .డెన్మార్క్ కు వెళ్లి ,అక్కడ నటన లో శిక్షణ నిచ్చి  కోపెన్హాం లో ధీరిటికల్ ఇన్స్టిట్యూట్ ను నడుపుతోంది .

మాస్కో  లో ఉన్న రామయ్య నిజమైన సోవియెట్ పౌరునిగా  ఉండేవారు . అంతమాత్రం చేత భారత దేశాన్ని ,తన మూలాలున్న స్వగ్రామం ఉయ్యూరును విస్మరించలేదు .ఆయన ఆల్బం లో వీటి తాలూకు తీపి గుర్తుల ఫోటోలున్నాయి .వాళ్ళ పొలాలు ,నీటిబావి ,బిల్డింగులు అన్నీ భద్రం గా ఫోటోలలో భద్ర పరచుకొన్నారు .మాతృభూమి అభిమానం అంత గొప్పది .తన బంధు గణం గురించి చాలా ఏళ్ళు ఆయనకు తెలియనే తెలియదు .కుటుంబం లో వచ్చిన మార్పులూ తెలియవు .బ్రిటిష్ వారు పరి పాలిస్తున్న రోజులు కదా అవి .అందుకని ఇంటికి ఉత్తరం రాస్తే ప్రభుత్వం వారిని ‘’బ్లాక్ లిస్టు ‘’లో పెడుతుందేమో అనే అనుమానమూ ఉండేది, ఉందికూడా .1947లో భారత  దేశం స్వాతంత్ర్యాన్ని పొందటం అందరికి సంతోషమైంది .అప్పటి నుండి రామయ్యగారు స్వగ్రామానికి ఉత్తర ప్రత్యుత్తరాలు కొన సాగించారు .ఇప్పుడు ఉయ్యూరులో ఉన్నవారందరూ తన కుమారులు ,మనవళ్ళు అయిపోయారు .ఉయ్యూరు బంధువులను రామయ్యగారు భార్యా పిల్లలకు పరిచయం చేసేవారు .పిల్లలు కూడా తమ తండ్రిగారి ఉయ్యూరు మూలాలు చూసి, విని పులకించి పోయేవారు .ఎంత దూరమైనా రక్త సంబంధం అంత తియ్యగా ఉంటుందన్నమాట .ఒక సారి రెండవ కూతురు నీలవేణి తన తోటి సెకండరీ క్లాసు పిల్లలకు ఇండియా, దాని భౌగోళిక పరిస్తితుల గురించి చక్కని రిపోర్ట్ ఇచ్చిందని రామయ్య గారు గర్వంగా చెప్పుకొన్నారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-20

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-20

రామయ్య గారి మిత్రబృందం లో మరి కొందరు ప్రముఖులు

రెజెర్ ఫోర్డ్ ను తన స్నేహితుడు అని చెప్పుకొనే సాహసం చేయలేను అంటారు రామయ్య .మహోన్నతుడైన ఆ మహానుభావుడి పరిధిలో జీవించాను అని గర్వ పడ్డారు. ఆయనకు రామయ్యగారంటే మహా అభిమానం  .కాని మర్యాదకు ఆయన మాత్రం రామయ్య గారిని ‘’నీకు తెలుసా మిత్రమా ?’’అని సంబోది౦చే వాడట .అలాగే ఎకడమీషియన్స్  గుబ్కిన్ ,నమేట్కిన్ కూడా  అదే తీరున మాట్లాడేవారు .రబీందర్ సరే సరి .రబీందర్ తో బాంధవ్య విషయం లో  మర్యాద పూర్వకమైన దూరాన్ని కలిగి ఉండేవాడినని,ఆతను తనకు నిజమైన మిత్రుడు అనటం లో ఏ సందేహమూ లేదన్నారు. ఆతను కూడా రామయ్య గారిని అలానే భావించేవాడు .

వెర్నాడ్ స్కి

వెర్నాడ్ స్కి మాత్రం ఆశ్చర్యకరమైన మనిషి .ఆయనకున్న అపార జ్ఞానం రామయ్యగారిని సంభ్రమ పరచింది. ఆయనతో మాట్లాడటం ఏంతో  సంతోషంగా ఉండేది . అతనికి ఇండియన్ ఫిలాసఫీ పై ఉన్న అపార జ్ఞానానికి ,పట్టుకు అతనిపై గౌరవం పెరిగింది కూడా .ప్రపంచ దృష్టిలో భారత దేశం పై గౌరవం వెర్నాడ్ స్కివలన పెరిగింది అనుకొనేవారు .అతని శాస్త్రీయ కీలక భావనలకు రామయ్య గారు తోడ్పడ్డారు. .అందులో ఆనందాన్ని అనుభవించానని రామయ్య గారు చెప్పుకొన్నారు .

లెనిన్ శిష్యుడు – క్రేజినోవ్ స్కి –

ఎకడమీషియన్  క్రిజినోవ్ స్కి తన మీద గొప్ప ప్రభావం కలిగించాడు అంటారు రామయ్య .అతనిలో రష్యా విప్లవ చాయలు దర్శించానన్నారు .ఆయన రష్యా రివల్యూషన్ కు ప్రతీక గా భావించారు రామయ్య .అంతే కాదు రష్యా దేశపు శాస్త్రీయ ఆధారం ,చారిత్రాత్మకంగా దాని అవసరం అన్నీ ఆయనలో కనిపిస్తాయట .ఆయన విదేశీయ విధానం లో కమిషరేట్  వర్కర్ అనిపిస్తాడు .అదే రామయ్య గారి మనసుపై భద్రమైన ముద్ర వేసింది .ఇద్దరూ ఒకే విధమైన భావాలు కలిగి ఒకే తీరున వ్యవహరించటం ఒకే రీతిలో రూపు దిద్దుకోవటం ఆశ్చర్యమేసేది రామయ్యగారికి .చాలా శక్తి గలవాడే   అయినప్పటికీ సహృదయ సంపన్నుడు . ఈ ఇద్దరూ విదేశీ విధాన వాతావరణం లో గణనీయమైన, భావాత్మక మైన ,సగుణాత్మకమైన మార్పులు తెచ్చారు .వీరిద్దరిని చూస్తే  ధ్వని శాస్త్రం లో ఉపయోగించే ‘’ట్యూనింగ్ ఫోర్క్ ‘’లా అనిపించేవారట రామయ్యగారికి .అయితే ఇందులో క్రేజేనోవ్ స్కి అంటేకొంచెం ఎక్కువ వీరాభిమానం ఉండేదట .అసదృశ వ్యక్తీ అనిపిస్తాడట .పవర్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ అయిన ఆయన లోపలి భావాగ్ని  తో నిత్యం రగులుతూ  ఉండేవాడట .పని యెడల ఆయనకున్న అమితాసక్తి, దీక్ష ,అంకితభావం అంటువ్యాధిలా అందరికీ సోకుతుంది .అదీ ఆయన ప్రభావం .లెనిన్ నాయకత్వం వహించిన బోల్షేవేక్ పార్టీకి చెందినవాడని చూడంగానే చెప్పేయచ్చు .జీవించి ఉండగా రామయ్య గారు లెనిన్ ను చూడలేక పోయారు .కాని క్రేజినవ్ స్కి ని చూస్తె లెనిన్ ఎలా ఉండేవాడో  ఊహించుకో వచ్చు ట.శిష్యుడిని చూసి గురువు స్వభావాన్ని తెలుసుకో వచ్చుకదా అంటారు

గ్లేబ్ మాక్షి మిలియోనోవిచ్ తో తాను  తన సైంటిఫిక్ సమస్యలను చర్చి౦చేవాడి నని ,ఈయన కూడా పని విషయం లో క్రేజేనోవ్ స్కి లాగే చరిత్ర సృష్టించాడని చెబుతారు .ఎందరో స్నేహితులు .,వారు పాడే విప్లవ గీతాలు రామయ్యగారికి బాగా ఇష్టం .అందులో ‘’వర్షావ్యాంకా ‘’గీతం మరీ ఇష్టం రామయ్య గారికి .ముసలి తనం లోనే కాదు యవ్వనం లోనూ ఆ గీతం ప్రభావితం చేసిందిట .ఒకప్పుడు దేశాన్ని ఉర్రూత లూగించి విప్లవోన్ముఖులను చేసిన ఈ గీతం ఇప్పుడు జానపద గీతమై పోయింది .ఈ గీతాన్ని క్రేజోనోవ్ స్కి రాశాడని తెలిసి రామయ్యగారికి వీరాభిమానం మరీ పెరిగిపోయింది .సోవియట్ సైన్స్ కు గొప్ప నిర్దేశకుడు ,నిర్వాహకుడు ,లెజెండరీ పర్సనాలిటి,  మర్యాదాపురుషుడు ,ఎప్పుడూ సర్వసిద్ధం గ ఉండేవాడు అయిన క్రిజినోవ్ స్కి నిజం గా అద్భుత వ్యక్తీ కాదా ?అవును అవును అవును .

సామాన్య అసామాన్య కృషి

వీళ్ళందర్నీ గుర్తుకు తెచ్చుకొంటు౦టే వారిలో సామాన్యుడు అసామాన్యుడు కలిసి ఉండటం యాదృచ్చికం కాదని పించింది రామయ్యగారికి .సామాన్య విషయాలలో వారి అసామాన్యత ప్రతి ఫలింఛి సోవియెట్ దేశ ప్రగతికి తోడ్పడేది .కొత్త తరహా వ్యక్తిత్వం ఆవిష్కరింప బడేది .కొత్తపాటలు బాగా ప్రాచుర్యం లోకి వచ్చాయి .వాటిని గాయకులు  పాడుతుంటే అందులోని భావ గాంభీర్యానికి ముగ్దులయ్యేవారు .క్రిజనేస్కి రచయిత ,ఆయన  ,ఒక ప్రాఫెట్ లాగా ,ఒక బోధకుడులాగా  సామాన్య జనాలకు అతీతంగా ఉన్నట్లు కనిపించేదికాదు .ఆయన కామ్రేడ్ లలో ఒక కామ్రేడ్ లాగా ఉండేవాడు .అంటే వాళ్ళపని తనపని అనుకోవటమే ఇందులో ఉన్న విశేషం .పోక్రాస్ ఇంటి పేరున్న సైంటిస్ట్ లతో రామయ్య గారు పని చేశారు .పండగ ,పబ్బాలలో,ఉత్సవాలలో వాళ్ళతోకలిసి రామయ్యగారు ‘’మాస్కో ఇన్ మే ‘’గీతం ,ఉత్సాహం గా పాడేవారు .ఈ పాట సోవియట్ యూనియన్ అంతటా బహుళ వ్యాప్తమైంది అంటే ఆశ్చర్య పడాల్సిన పని లేదని ఈ గీతాన్ని వారి సోదరులే రాశారని తెలిసి కూడా ఆశ్చర్యపడలేదు అన్నారు.

ఏదో ఒక కాన్ఫరెన్స్ లో  సహోద్యోగి రామయ్యగారితో ఒకతన్ని చూపించి ‘’ఈయన ఎవరో తెలుసా? ఫాదీవ్- లేవిన్ షన్  కేరక్టర్.కు తానే మాటలు రాసుకొన్నాడు .’’అని చెప్పినా ఆశ్చర్యం కాలేదు అదేమీ పెద్ద ప్రాధాన్య మైన విషయం అనిపించలేదు . తన ముందు ఫదీవ్ రాసిన ప్రసిద్ధ నవలలోసజీవ నాయకుడు ఉన్నాడు .అయినా మామూలు విషయం గానే తోచింది .అంతర్యుద్దం  ముగిసిన తర్వాత ఈ హీరో గారు మామూలు పనిలో చేరి కొత్త దేశ పునర్నిర్మాణం లో భాగస్వామి అయ్యాడు .ఇలాంటి హీరో  లెందరితోనో రామయ్య గారు పని చేశారు .వీరంతా చాలా సాదా సీదాగా,  ధైర్యంగా గొప్ప పనులు  చేసుకు పోయేవారు .ఇందులో ఎక్కువ మంది పుస్తకాలు రాయలేదు .రచయితలూ వీరిలో కొద్దిమందే ఉండేవారు వీరిలో చాలామంది తాము చేస్తున్న పని మహత్కార్యం అని ఎన్నడూ విర్ర వీగలేదు .కర్తవ్యమ్ చేస్తున్నాం అనే అభిప్రాయమే వారికి ఉండేది .అందుకే సామాన్యుడికి ,అసామాన్యుడికి అందరికి పనికి వచ్చే ‘’కామ్రేడ్ ‘’అనే గొప్ప మాట పుట్టి సార్ధకమయింది అంటారు రామయ్య .

రామయ్య గారి సంస్కారం

వీరందరితో తరచుగా సమావేశాలు జరపటం విషయ చర్చ,సమస్య పరిష్కారం  చేయటం నిజంగా ఆనంద దాయకమైన విషయం గా ఉండేది రామయ్య గారికి .అంతేకాదు ఆసియా ఆఫ్రికా దేశాలు ‘’కాలనీ కాడిని ‘’విప్పి అవతల పారేసి తమతో చేతులు కలిపినప్పుడు  సైన్స్ లో వారికి ఏమికావాలన్నది కూడా చర్చించేవారు .సైన్స్ చరిత్ర గురించి, దాని భవిష్యత్తు గురించి ,ప్రజల భవితవ్యాన్ని గూర్చి విపులంగా చర్చ జరిగేది .గొప్ప సైంటిస్ట్ లందరూ వీరిలో నుంచే వచ్చారు. వారు సైన్స్ కు ,ప్రజలకు చేసిన సేవ నిరుపమానం .వారి ప్రజాస్వామ్య భావాలు దెబ్బతిన కుండా వారి ప్రకృతికి విరుద్ధం కాకుండా ,పౌర జీవితం అందించటం ఒక పెను సవాలుగా ఉండేది .వెర్నాడ్ స్కి చెప్పిన ‘’మా ప్రజాస్వామ్యం లో ఆదర్శాలు సహజ  ప్రకృతితో  కలిసే ఉంటాయి .అందుకే మా భవిష్యత్తుపై నమ్మకం ,భరోసా కలిగి ఉంటాం .అది మాచేతుల్లో ఉన్నపనే ,దాన్ని జారిపోనివ్వం ‘’అని చెప్పిన మాట రామయ్య గారి చెవిలో అనుక్షణం ప్రతిధ్వనించేది .ఈ మాటలు చెప్పిన వాడు ముసలి వాడుకాదు .నవ యువకుడు .జీవిత ప్రాంగణం లోకి అడుగు పెడుతున్నవాడు ,సుదీర్ఘ ప్రయాణం ప్రారంభిస్తున్నవాడు  అతనిలో ఎంతటి ఆత్మ విశ్వాసం ఉందో నని పించింది .ఇది సైంటిఫిక్ నాలెడ్జ్ వలన ఏర్పడిందన్నారు రామయ్య. సోవియట్ దేశపు సైన్స్ స్వభావం వలన ఏర్పడిన ఆశ ,ఆత్మ విశ్వాసం అది అంటారు రామయ్య .అదే దాని నిర్మాతల(ఫౌండర్స్) కృషిలో దర్శనమిచ్చింది .

తాను  ఇంతకాలం సైన్స్ లో ఇలాంటి సామాన్య వర్కర్లతో పని చేశానని, వారు సిద్ధాంతాలనుజీవిత  ప్రయోగాలు గా మార్చి ఫలితాలు అందించారని అంటారు రామయ్య .వాళ్ళ సుఖ దుఖాలలో  తానూ పాత్రధారిగా ఉండే వాడినని నని అన్నారు  .వారి క్రుతజ్ఞతకు పాత్రత  వీరందరి సహకారం వల్లనే నన్నారు .ఈ యువత లేకపోతే తన సిద్ధాంత బీజం మొలకెత్తి వృక్ష రూపం పొందేదే కాదన్నారు. తమ విధానాలకు వాళ్ళు జీవం పోశారు .వాళ్ళే తనతో బాటు ఉండి పని చేసి తన ఆలోచనలకు రూపు రేఖ లేర్పరచి నవీన పరికరాల సృష్టిలో భాగ స్వామ్యులై  తోడ్పడ్డారని గర్వంగా చెప్పారు రామయ్య .వీరందరి సహకారం వల్లనేసోవియట్ యూనియన్లో  కొత్త సాంకేతికతలో ప్రమాణాలు (స్టాండర్డ్ లు) సాధించగలిగామని కృతజ్ఞతా భావం గా చెప్పారు .అదీ రామయ్యగారిలో ఉన్న విశేషం .అంతా తానే  అయి చేశానని ఎన్నడూ ఎక్కడా చెప్పుకోలేదు .అందరి సహకారం వల్లనే అద్భుతాలు సాధించామంటారు .ఎవరి కృషినీ విస్మరించరు .సమష్టి భాగస్వామ్యం వల్లనే ఇవి సాధ్యాలయ్యాయని వినమ్రంగా ప్రకటించటం రామయ్య గారి ప్రత్యేకత .ఇందులో కొందరితో కొన్నేళ్ళు కలిసి పని చేశారు .ఒక రకంగా వారందరూ తనకు బంధువులయ్యారు  అనటం  రామయ్య గారి సంస్కారానికి గొప్ప ఉదాహరణ .వీడరాని ఆత్మీయ బంధమేర్పడింది. వారితో .’’In fact we had become in fact relatives ,in separable from  the work  into which I imported my scientific talents ‘’ అని రామయ్యగారు మాత్రమే నిగర్వంగా చెప్పగలరు .వారు తన కింద పని చేశారు అనలేదెప్పుడూ .వారితో తానుకలిసి పని చేశాను ,దానివల్ల తన విజ్ఞాననైపుణ్యం  పెరిగింది అన్నారు ఈమాటలు అనటానికి ఎన్నో జన్మల సంస్కారం కావాలి. అది ఉంది కనుకనే ఆ మహానుభావుడు కోలాచల సీతా రామయ్య గారి గురించి ఇంత గా చెప్పుకొంటున్నాం .చెప్పుకొని మనం ధన్యులమవుతున్నాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బుద్ధం శరణం గచ్చామి -మోడీ జపం

buddhavanam 1 001 buddhavanam 2 001 buddhavanam 3 001 buddhavanam 4 001 buddhavanam 5 001



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సౌర వెలుగులు మరియు” నిలువు నగరాలలో ” భూకంపం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందరివాడు అన్నమయ్య -నేడు అన్నమయ్య జయంతి



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

2600 ఏళ్ళ ”మాయన్ నగరం ‘ – నేపాల్ లో బ బతికి బయటపడ్డ 105 ఏళ్ళ వృద్ధుడు మరియు చెక్కు చెదరని ”చిన్నారి దేవత ఆలయం ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-19

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-19

రామయ్యాగారి దృష్టిలో ‘’అలెక్సీ మిఖైలోవిచ్ ‘’

తాను  చాలా లావుగా ఉంటె అలెక్సీ భారీ మనిషి అన్నారు రామయ్య .ఒక రకంగా పెద్ద రాక్షసావతారం .కళ్ళు నీలిరంగుతో  మిరుమిట్లు గొలుపుతాయి .పెద్ద నవ్వు ఆయన ఆభరణం .ఎందుకోకాని ఆయన మంచు లోంచి వచ్చినట్లు అనిపించేవాడు .చలికి ఎర్రబడ్డట్టు ఉండేవాడు .నెత్తిమీద ,ఒళ్ళంతా పడిన స్నో ను దులుపుకొంటూ రావటం అయన ప్రత్యేకత .సరాసరి హాల్ లోకొచ్చి కూర్చునేవాడు .ఆయన కూర్చోటానికి చాలా స్థలమే పట్టేది.అయితే ఆయన వస్తే ఎవరికీ చికాకు అనిపించేదేకాడు .క్రిస్మస్ నాడు శాంతాక్రజ్ వచ్చిసంచీలోంచి బహుమతులు తీసి పంచి పెడుతున్నంత ఆనందంగా ఉండేది .రామయ్యగారమ్మాయిలు  స్వీట్ల కోసం ఎదురు చూసేవారు .గడ్డం అదీ ఉండేదికాదు కాని అదే అనుభూతిని పంచేవాడు .ఆతని ఆకృతి మనసుపొరల్లో  ముద్ర పడి స్థిరంగా ఉండిపోయింది .

అలెక్సీ ది గ్రేట్

అలెక్సీ తో ఎన్నో విషయాలు చర్చించేవారు .ఆయనకు తెలియని విషయం లేదంటే ఆశ్చర్యం లేదు .అన్ని విషయాలు తెలుసు అన్నీ ఆయనకు కావాల్సినవే .ఒక రకం గా ‘’సమాచార సేకరణ సాధనం ‘’అలెక్సీ .అయన బయో డేటా కూడా ఈ విషయాలనే రుజువు చేస్తాయి .ఆయన ఒక డాక్టర్ కాని ప్రాక్టీస్ వదిలేశాడు .చరిత్ర అధ్యయనం చేశాడు .దాని తర్వాత మానవ వంశ శాస్త్రం (ఎత్నోగ్రఫీ ) ని భాషా శాస్త్రం (లింగ్విస్టిక్స్ )చదివాడు . అందరూ ప్రయాణించే మార్గం లోకాక వేరే మార్గాలను ఎన్నుకొని ఏంతో దూరం వెళ్ళాడు. కజాన్ మెడికల్ కాలేజి నుండి గ్రాడ్యుయేట్ అయి పామీర్ పీఠభూమికి   వెళ్లి జబ్బు పడ్డ వాళ్లకు  చికిత్స చేశాడు .ఆ దేశం ఆయన్ను అత్మీయునిగా చూసింది ఎత్తైన పర్వత శిఖరాలమీద ,పీఠ భూముల మీద పాద చారియై సంచరించాడు .కనిపించిన ఆసియా ,యూరోపియన్ ల నందరితో మిత్రత్వం పెంచుకొన్నాడు .అందులో మాసిడోనియాకు లో అలేక్సాండర్ వంశానికి చెందిన బాక్త్రియన్లున్నారు .ఈ కలయికలో ఆయనకు ఎన్నోశతాబ్దాల  జాతుల వలస వాసుల లక్షణాలు గమనించాడు .పామీర్ ఖాళీ అయి చాలా మోసపుచ్చింది అనిపించింది .అందుకని మానవ వంశ శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు ఆయన ఊహించకుండానే  అనేక విషయాలు కనిపెట్టాడు .సుదూరంగా ఉన్న ఇండియా చాలా దగ్గరగా ఉండేదని పించింది .ఎత్తైన పర్వతాలు అడ్డంగా ఉన్నప్పటికీ పురాతన బంధాలు ఉండేవని అవి చాలా దృఢంగా ఉండేవని కనుగొన్నాడు .మధ్య ఆసియా తో మరీ దగ్గర సంబంధం ఇండియాకు ఉండేది .

‘’  అఫనాసి నికిటిన్ ‘’ అనే యాత్రికుడు  సముద్ర మార్గం   ద్వారా ఇండియా   సందర్శించాడు .అలాగే ఇండియన్లు సుదూర ఉత్తర ప్రాంతాలకు చేరుకొన్నారు అని అభిప్రాయ పడ్డాడు .అంతే కాదు ఇండియన్స్ ఇక్కడికి వచ్చి ఉజ్బెకిస్తాన్ లో ‘’ఉలుబెక్’’ వేధ శాల ‘’(అబ్సర్వేటరి .)నిర్మించారని తెలియజేశాడు .పామీర్ల కళ్ళు ఇతర దేశీయుల కళ్ళ కంటే తేడాగా ఉండటం గమనించాడు .అక్కడ మానవులు జీవించారు అని కూడా అలెక్సీ కనుగొని లోకానికి చాటి చెప్పాడు .ఉన్నత పర్వతాగ్రాలు ,పీఠ భూములు గత చరిత్రను నినదిస్తూనే ఉంటుంది అన్నాడు .దక్షిణాన ఉన్న దూర పర్వత శ్రేణి గొప్ప వింతైన ,ప్రేరణ కలిగించే భావోద్రేకాలను కలిగిస్తుంది అన్నాడు .ఇది చూస్తే ఇండియా తన అనంత బాహువులను తన వైపు సాచి ఆహ్వానిస్తున్నట్లుగా ఉందని పించింది అలెక్సీ మికిలోవిచ్ కి .

బహుభాషా వేత్త –రష్యాలో తెలుగు నేర్చిన మొట్ట మొదటి వ్యక్తీ

అతి స్వల్ప కాలం లో డయకోవ్ అలెక్సీ ఉర్దూ భాష నేర్చుకొన్నాడు .ఆ తర్వాత హిందీ మొదలైన భారతీయ భాషలను అధ్యయనం చేశాడు .అయన ఒక బహుభాషా వేత్త (పోలీగ్లాట్ )అయ్యాడు .ఇండాలజిస్ట్ గా(చరిత్ర సంస్కృతీ భాషల అధ్యయనం ) ,ఇండియాకు  సంబంధించిన  సర్వ విషయాలపై  స్పెషలిస్ట్ గా పేరు పొందాడు .అంతేకాదు ఆంద్ర రాష్ట్రాన్ని కనుగొన్నాడు .సోవియట్ యూనియన్ లో ఉన్న వారిలో ‘’తన భాష తెలుగు’’ నేర్చుకున్న మొట్ట మొదటి వాడు ‘’అలెక్సీ మిఖైలోవిచ్ డయకోవ్ అని రామయ్య గారు గర్వ ఒపడ్డారు ‘’ అందుకే రామయ్యగారికి ఆతను అంటే మహాభిమానం .అలెక్సీ ‘’Nationalities question in India ‘’అనే గ్రంధం రాసి ప్రచురించాడు .దీనితో సోవియెట్ యూనియన్ లో ఉన్న చదువరులకు భారత దేశం ,అందులో హిందీ తో బాటు ఉన్న పన్నెండు ప్రధాన భాషల గురించి తెలిసింది .ఇందులో ప్రతి భాషనూ కనీసం పది మిలియన్ల మంది మాట్లాడుతున్నారని తెలుసుకోగలిగారు .

అలేక్సీకు  రామయ్యగారిని  పరిచయం చేసిన రాదా కృష్ణన్

రష్యా రాయబారి సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు రామయ్య గారిని అలెక్సీ కి పరిచయం చేశారు .ఆయన రామయ్య తో ‘’మీ దేశం   లో ఇండియా పై ఒక గొప్ప ‘’ఎక్స్ పర్ట్ ‘’డయకోవ్అనే ఆయన ఉన్నారు తెలుసా?ఇప్పటిదాకా అలాంటి గొప్ప వ్యక్తిని మీరు కలుసుకోక పోవటం ఆశ్చర్యం గా ఉందే?’’అన్నారు రాదా కృష్ణ .ఆయన ‘’మీ దేశం లో ‘’అని అన్నమాట ‘’రష్యా దేశం ‘’ అని అర్ధమయింది రామయ్యగారికి .సర్వేపల్లి తనను రష్యావాడినని  పోరబడ్డారని  అనుకొన్నారు .అప్పుడు డయకోవ్ కు రామయ్యను పరిచయం చేశారు .మన రాయ బారి మహా ఘటికుడు .అనిపించింది .ఇంతకాలం అలేక్సీని కలుసుకోక పోవటం చిన్నతనం అనిపించింది .

మోటార్ ఆయిల్ పై ప్రయోగాలు ,విఫల పరీక్షలు  ,జరుగుతున్న సమయం లో ఒక రోజు అలెక్సీ ఎన్నో కొత్త వార్తలు మోసుకొచ్చాడు .హిట్టిటైట్ రాష్ట్రం చరిత్ర ఇండియా తో సంబంధం కలిగి ఉండనే వార్త చెప్పి అప్పుడు రామయ్య గారు పడుతున్న టెన్షన్ ను తగ్గించి వాతావరణాన్ని తేలిక చేశాడు .ఆ తర్వాత ఒక యువ సోవియట్ రిసేర్చర్ ‘’మాయాస్’’ వారి స్క్రిప్ట్ ను డీకోడ్ చేసి అందులోని విషయాలను తెలియజేశాడు . ‘’పక్షి ప్రేమికుడు’’ అయిన  అలెక్సీ చివరికి తనకు అభిమానమైన పక్షుల గురించి ఎన్నో విషయాలు చెప్పి అందరి మనసులను ఉల్లాస భరితం చేశాడు ..చాలా విషాద సమయాలు గడుపుతున్నప్పుడు రామయ్య గారి దగ్గరకొచ్చి బాధకు మంచిమాటలతో ఉపశమనం చేకూర్చేవాడు .విజయమూ సాధించేవాడు .ఈ విషయం లో .పని అయిన తర్వాత ఎక్కడికేక్కడికో తితిరిగే అలవాటు మార్చుకొని అలెక్సీ తో కలిసి వెళ్ళటానికి ఇష్టపడేవారు రామయ్య .

రష్యాలో నైటింగేల్ ,టాం-టిట్,పిచ్చుక ,సాధారణంగా కనిపించే పక్షులు .ఈ పక్షులంటే అలేక్సీకి ప్రాణం .అవి ఆయనకోసం పాటలు పాడేవి .రామయ్య గారు అలెక్సీ ఫ్లాట్ కు  వెళ్ళినప్పుడు స్వంత ఇంట్లో ఉన్న ఆనందం పొందేవారు . ఆయన ఎదుట అతి భారీ మనిషి , తన చుట్టూ చిన్ని చిన్ని పక్షులు .ఇది చూడటానికి వింతగానే ఉండేది .అలెక్సీ ‘’ప్రతిదీ ఎలా జరగాలని ఉంటె  అలాగే జరుగుతుంది .ఈ పక్షులు ఇక్కడ .ఇదిగో ‘’మాయా రాత ప్రతి’’.ఇక్కడే మీరు నేను .మనం సంస్కృతం లో మాట్లాడుకోగలం రష్యన్ ,తెలుగు లలో కూడా సంభాషించు కోగల౦ మనమ్. మనం ఎన్నో విషయాలపై పోట్లాడుకొనే వాళ్ళం కాని మనం ఎన్నో విషయాలపై బతకాలి .అంతమాత్రాన నిరాశ వద్దు .జరగాల్సింది జరుగుతుంది ‘’అనేవాడు .అతను చెప్పింది నిజమే .ప్రతిదీ జరగాల్సిన విధం గా జరగాల్సిన సమయం లో  జరుగుతుంది.వారి నిత్య జీవిత విధానం అదే అయిపొయింది .

రామయ్య గారికి తాను  చాలా అదృష్ట వంతుడిని అనుకొన్నారు .తాను  అనుకొన్నది ప్రతిదీ చేయ లేకపోతున్నారనుకొన్నారు . .కొందరి దృష్టిలో రామయ్య వింతమనిషి  ,అపజయాల వ్యక్తీ .దీనికి కారణం ఇంత గొప్ప పరిశోధన చేసినా ఆయన ఉద్యోగ స్థాయి పెరగలేదు .అయినా అదృష్ట వంతుడినే అనుకొనేవారు  .ఎందరో మహాను భావులను చూశానని ,మరెందరో గొప్ప మిత్రులను పొందానని పొంగిపోయే వారు …

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”నేను 8th డ్రా పౌట్ ” అన్న” ఉత్తమ విలన్ —కమల్ హసన్

నేను 8th క్లాస్‌ డ్రాపవుట్‌

నష్టం వచ్చినా, కష్టం వచ్చినా తాను అనుకున్నది తెరకెక్కించాలనే తాపత్రయం ఉన్న నటుడు కమల్‌హాసన్‌. ‘విశ్వరూపం‘ నుంచి ‘ఉత్తమ విలన్‌‘ వరకు సినిమాల విడుదలలో ఎన్నో అవరోధాలు. ఆర్థికంగా మరెన్నో అడ్డంకులు. అయినా నేను ప్రయోగాలు చేస్తూనే ఉంటాను అంటారాయన. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ చేసిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో తన కెరీర్‌, ఫ్యామిలీ గురించి మరెన్నో వివరాలు పంచుకున్నారు.

ఆర్కే: వెల్‌కం టు ఓపెన్‌ హార్ట్‌

నమస్కారం కమల్‌హాసన్‌ గారు
ఫస్ట్‌ ఐ వాంట్‌ టు టెల్‌ దట్‌ ఐయామ్‌ ఎ గ్రేట్‌ అడ్మైరర్‌ ఆఫ్‌ యు.
కమల్‌హాసన్‌: నేను కూడా అడ్మైరర్‌నే తర్వాత చెప్తాను.
ఆర్కే: జాతీయస్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ నటుడిగా అవార్డులు తీసుకున్నారు, ఇప్పుడు ‘ఉత్తమ విలన్‌’గా జనం ముందుకు వస్తున్నారు. ఎందుకనిపించింది అలా ‘ఉత్తమ విలన్‌’గా రావాలని?
కమల్‌: అందరిలో ఒక విలన్‌, ఒక నాయకుడు ఇద్దరూ ఉంటారు. అప్పుడప్పుడు విలన్‌ని తొక్కిపెట్టడమే జీవితం. అందరి జీవితాల్లో ఇది ఉంటుంది. మైథాలజీనే తీసుకుంటే ఒక్కొక్కప్పుడు కృష్ణుడు విలన్‌గా కనిపిస్తాడు. కౌరవులు, పాండవులకే కాకుండా వారి కథ చదివేవాళ్లకి కూడా విలన్‌లాగానే కనిపిస్తాడు. అదే మనుషుల ప్రత్యేకత.
ఆర్కే: అయితే విలన్‌ ముందు ఉత్తమ ఎందుకు?
కమల్‌: ఉత్తముడవడం వల్ల. ప్రతి విలన్‌కి ఉత్తముడిగా మారిపోవడం అనే దశ ఉంటుంది.


ఆర్కే: అయితే మీరు బాగా స్టడీ చేస్తారా పర్సనాలిటీస్‌ని?
కమల్‌: అవునండీ పనేమీ లేదు కదా. ఎలాగూ స్కూల్‌కి వెళ్లలేదు ఏమైనా స్టడీ చేయాలి కదా.
ఆర్కే: చాలామంది ఒప్పుకోరు. ప్రతి మనిషిలో ఒక నెగెటివ్‌ షేడ్‌ ఉంటుందని.
కమల్‌: వైట్‌ కాన్వా్‌సలో వేరే రంగు వేస్తేనే కనిపిస్తుంది. అంతేకాని అన్నీ వైట్‌ అయితే ఖాళీ కాన్వాసే.
ఆర్కే: ఇందాక చదువు లేదు అన్నారు? ఎంతవరకు చదువుకున్నారు?
కమల్‌: ఎయిత్‌ స్టాండర్డ్‌ డ్రాపవుట్‌.
ఆర్కే: ఇక అప్పటి నుంచి సినిమాల్లోనే…

కమల్‌: దానికి ముందే.. థర్డ్‌ఇయర్‌లోనే వచ్చాను. అంటే 1959లో వచ్చాను. ఆ తరువాత కళ్లు తెరిచి చూసింది సినిమాలోనే..

ఆర్కే: 55 ఏళ్ల నుంచి సినిమాల్లో చేస్తున్నారు కదా! బోర్‌ కొట్టడం కాని ఇక చాల్లే అని కాని అనిపించడం లేదా?
కమల్‌: దానికి మంచి కారణాలున్నాయి. ఇది నా ప్రొఫెషన్‌ అయితే కనుక… ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకునేవాడ్ని. కాని ఇది నా ప్రొఫెషన్‌ కాదు పాషన్‌. నన్ను చాలామంది ఎప్పుడు హాలిడే తీసుకుంటారు అని అడుగుతుంటారు. అసలు నేను పనిచేస్తే కదా హాలిడే తీసుకునేది. నాకు ప్రతిరోజూ హాలిడేనే.
ఆర్కే: యు ఎంజాయ్‌ ఇట్‌. అందుకే హాలిడే అయిపోతుంది అది.
కమల్‌: అందులో ఏమీ కష్టంలేదు. హాలిడేకి వెళ్లేవాళ్లు స్కైడైవింగ్‌ చేస్తారు, రాక్‌ క్లయింబింగ్‌ చేస్తారు. ఆఫీసులో మాత్రం ఒకచోట కూర్చున్నా అలసి పోతారు. హాలిడేకి ఎంత ఎనర్జీ అయిపోయినా ఫీలవ్వం. అందులోనూ నాకు డబ్బు కూడా ఇస్తున్నారు. ఇటీజ్‌ డబుల్‌ బోనస్‌ ఫర్‌ మి.
ఆర్కే: మీ ఫస్ట్‌ రెమ్యునరేషన్‌ ఎంత?
కమల్‌: టూ థౌజెండ్‌ రుపీస్‌. చాలా పెద్ద రెమ్యునరేషన్‌. అందులో మెయిన్‌ క్యారెక్టర్‌. హీరోలకు ఫిఫ్టీథౌజెండ్‌ వచ్చేవి. కొత్తగా వచ్చిన ఐదేళ్ల అబ్బాయికి టు థౌజెండ్‌ అంటే బిగ్‌ ఎమౌంట్‌.
 
ఆర్కే: ఆ డబ్బులు ఏం చేశారు?
కమల్‌: ఐడోన్డ్‌ రిమెంబర్‌. స్టూడియోకి వెళ్లడం. ఆడుకోవడం. ఉడెన్‌ స్వోర్డ్స్‌ చేసిస్తారు కార్పెంటరీకి వెళ్తే. లాబొరేటరీరికి వెళ్తే అక్కడ బాపిన్స్‌ ఉంటాయి. రోలర్‌ స్కేట్‌ చేసుకుని, మరో దగ్గరికి వెళ్తే తెలుగు, హిందీ సినిమాలు చూపిస్తారు. మరో చోట రికార్డింగ్‌ జరుగుతుంటుంది. పేరు తెలియని హిందీ సింగర్‌ పాట పాడుతుంటారు. ఆయనెవరు అని అడిగితే మహమ్మద్‌ రఫీ అని చెప్తే ఓహో మహమ్మద్‌ రఫీయా అని అనుకుంటూ చిన్న చిన్న పిల్లలందరం పెద్ద మనుషుల్లా తిరిగేవాళ్లం.
ఆర్కే: ఈ రంగంలోకి ఎలా వచ్చారు?
కమల్‌: మా ఫ్యామిలీ అంతా లాయర్స్‌. ఫాదర్‌, గ్రాండ్‌ఫాదర్‌, సన్‌ ఇన్‌లాస్‌.. ఇలా ఒన్‌ డజన్‌ లాయర్స్‌ ఉన్నారు. పాత అడ్వకేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా పరాశరన్‌ మై బ్రదరిల్లా. అలా ఫ్యామిలీలో చదువుకున్న వాళ్లు ఎక్కువ. కాని నేను మాత్రం డ్రాపవుట్‌. మా ఫ్యామిలీ మొత్తం మీద నేనొక్కడినే ఇలాగున్నాను. ఈవెన్‌ విమెన్‌ ఇన్‌ మై ఫ్యామిలీ మోర్‌ ఎడ్యుకేటెడ్‌. ఇక్కడ కరణాలంటారే అలాంటి కుటుంబం మాది. ఆ రోజుల్లో గాంధీజీ చెప్పగానే ఆస్తులు ఇచ్చేశారు. మా ఫాదర్‌ సాలిడ్‌ కాంగ్రెస్‌ మ్యాన్‌. నా ఎల్డెస్ట్‌ బ్రదర్‌ డిఎంకెలో చేరాడు. పార్టీ డిఫరెన్స్‌ కూడా ఉంది. మై ఫాదర్‌ ఈజ్‌ నోమోర్‌. కాని ఫ్యామిలీలో రకరకాల ఐడియాలజీలు ఉన్నవాళ్లు ఉన్నారు. స్ర్టాంగ్‌ శ్రీవైష్ణవేట్స్‌, స్ర్టాంగ్‌ రేషనలిస్ట్స్‌, కమ్యూనిస్ట్స్‌ ఇలా..
 

ఆర్కే: అయితే మీరు దేంట్లోకి వస్తారు?
కమల్‌: ఐ వుడ్‌ కం అండర్‌ రేషనలిస్ట్‌. నా చుట్టూ ఉన్న వాతావరణం ఇందుకు కారణం. నాకు అన్యాయం అనిపించిన దానికి ఎదురుగా నిలబడాలనిపిస్తుంది. కొన్నిసార్లు చిన్న వయసులో అలా తెలియక చేశాం అనిపిస్తుంది. మరొకొన్నిసార్లు అంత చిన్న వయసులోనే మాకు మంచి బుద్ధి వచ్చిందే అన్న ఫీలింగ్‌ వస్తుంది. కాబట్టి అలానే రేషనలి్‌స్టగా ఉండిపోతున్నాను. అంటే మీకు దైవం మీద విశ్వాసం లేదా అని అడగొచ్చు. నాకు మనుషుల మీద విశ్వాసం ఉంది.
 
ఆర్కే: ఆదిశంకరాచార్యుడు చెప్పింది కూడా మనుషులే దైవమని. మమ అని…
కమల్‌: మమ… గురు రుద్రేష, మనీష, మమ. ఐ ట్రస్ట్‌ విత్‌ ఆల్‌ దెయిర్‌ బ్యాడ్‌నెస్‌. హిట్లర్‌ అయినా, గాంధీ గారయినా ఎవరైనా సరే వాళ్లలో ఐ థింక్‌ దేర్‌ ఈజ్‌ ఎ స్పార్క్‌ దట్‌ కెన్‌ బి యూజ్‌ఫుల్‌ టు సొసైటీ. ‘ఉత్తమ విలన్‌’ కూడా అలానే చెబుతుంది.
 
ఆర్కే: ఎవరు పిక్‌ చేశారు మిమ్మల్ని?
 
కమల్‌: ఎ వి యం చెట్టియార్‌ గారు. దానికి ముందు డేసి రాణీ గారు. అప్పట్లో ఆమె టాప్‌ స్టార్‌. అప్పుడు టెన్‌ థౌజెండ్‌ రూపీస్‌ బుక్‌ చేసి ఫ్లయిట్‌ టికెట్‌ కూడా కొన్నారు. అప్పుడు నన్ను చూసి బాగున్నాడే అన్నారు. ఫస్ట్‌ లైట్‌ వేసింది మా నాన్న గారే. బెడ్రూమ్‌ లైట్‌ అలా తిప్పి చూశారు మమ్మల్ని. ఆ తరువాత ‘సినిమాలో నటిస్తావా’ అని అడిగితే.. ‘ఎంతిస్తారు?’ అన్నాను. ఆయనకి నచ్చిపోయింది. దెన్‌ హి సెడ్‌ క్యాన్సిల్‌ చేయండి.. డేసిరాణి గారు వద్దు అన్నారు. అయ్యో అడ్వాన్స్‌ ఇచ్చేశాం అన్నారు. ఆ తరువాత ఇంకో పిక్చర్‌ చూసుకుందాం. నాకు ఈ అబ్బాయి చాలా నచ్చాడు. వీడ్ని పెట్టి తీయండి అన్నారు. ఫస్ట్‌టైం ఎందుకు తీసుకెళ్తున్నారు ఏమిటి ఏమీ అర్థం కాలేదు. ఎవిఎం స్టూడియోకి వెళ్లాను. అక్కడ సావిత్రి గారు, జెమిని మామ ఉన్నారు. అప్పుడు చేతులతో ఎత్తుకుని చివరి వరకు వదలలేదు.
ఆర్కే: చైల్డ్‌హుడ్‌లో కొన్ని సిల్లీ థింగ్స్‌ చేస్తుంటాం. అలాంటివి మీకేమైనా ఉన్నాయా?
 
కమల్‌: సిల్లీ కాదు సిల్లీ కన్నా డేంజరస్‌ థింగ్స్‌ ఉన్నాయి. ఫస్ట్‌ నన్ను హోలీఏంజిల్స్‌ అనే అమ్మాయిల స్కూల్లో వేశారు. అక్కడ కిండర్‌ గార్డెన్‌ వరకు బోత్‌ జెండర్స్‌ను అలౌ చేస్తారన్నమాట. ఆ స్కూల్‌ బోర్‌ కొట్టింది. యుకెజిలో ఉండగా స్కూల్‌ బయటకు వచ్చి ట్యాక్సీ పట్టుకుని ఇంటికి వెళ్లాను. అప్పుడు మొదలైంది డ్రాపవుట్‌ అవ్వడం. ఆ తరువాత మూడు స్కూల్స్‌ మారాను. ఇండు హైస్కూల్స్‌ నుంచి ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఆ తరువాత ఒకసారి థర్డ్‌ స్టోర్‌ నుంచి పడ్డాను. బెట్‌ కోసం దూకాను. ఇవన్నీ చూసి ఈ అబ్బాయి వద్దు ఎప్పుడైనా చచ్చిపోతాడు. మా మీద కేస్‌ పెట్టడం ఖాయం అని పంపించేశారు. బట్‌ ఈవెన్‌ దట్‌ థింగ్‌ హెల్ప్‌మి. నేనెవరు అనేది తెలిసింది. ఎవడు వీడు నటుడట… సినిమాల్లో చేస్తాడట పిలవండి అంటే.. వెళ్లాను. అక్కడ చిల్డ్రన్స్‌ ప్లే చేస్తున్నారు. అందులో మంచి పాత్ర వేశాను. అలా మై డ్రామా లైఫ్‌ స్టార్ట్‌ అయ్యింది. అప్పుడు ఏడెమినిదేళ్ల వయసు నాకు.
ఆర్కే: ఇప్పుడు మీకేమనిపిస్తుంది. ఈ విషయాలన్నీ మీ పిల్లలకు చెబుతుంటారా?
 
కమల్‌: ఐ ఫెల్ట్‌ మై ఫాదర్‌ వజ్‌ వెరీ కైండ్‌. రేషనలిజం విషయంలో తన్ని అలా మాట్లాడకూడదు అని చెప్తే విని ఉండేవాడ్నేమో… కాని లెట్‌ హిమ్‌ థింక్‌ అని వదిలేశారు. నటిస్తానంటున్నాడు, భరతనాట్యం నేర్చుకోవాలట. కాని అదెవరూ మగవాళ్లు నేర్చుకోలేదు. చూసేవాళ్లకు బ్యాడ్‌ ఫీలింగ్‌ వస్తుంది. అదికాదు వాడికి ఏది ఇష్టమో అది చేయనీయమని ఎంకరేజ్‌ చేశారు. ఆ తరువాత కథక్‌ నేర్చుకోవాలనుంది అంటే దానికి కూడా ఏర్పాట్లు చేసి, సంగీతం నేర్పించి గో హెడ్‌ అన్నారు. భరతనాట్యం నేర్చుకున్నప్పుడు ఉదయ్‌శంకర్‌గారిలా అవ్వాలని చెప్పేవాళ్లు. సినిమాకి వెళ్తాననే ఆలోచన కాని నమ్మకం కాని నాకు లేవు అప్పుడు. ఆ తరువాత డ్యాన్స్‌ అసిస్టెంట్‌గా వచ్చాను. ఇంత చిన్న వయసులో డ్యాన్స్‌ నేర్చుకున్న వాళ్లు లేరని తంగప్ప మాస్టారు గారు నన్ను తీసుకున్నారు. అప్పట్లో తంగప్ప గారు ఎక్కువగా తెలుగు సినిమాలే చేసేవారు. మై ఫస్ట్‌ ట్రిప్‌ టు హైదరాబాద్‌ వజ్‌ ఎ టెక్నీషియన్‌. ఏఎన్నార్‌ గారి ‘శ్రీమంతుడు’ సినిమా కోసం వచ్చాను. ఫర్‌మి ఇట్స్‌ఎ వెరీ ఇంపార్టెంట్‌ ఫిల్మ్‌. ఏఎన్నార్‌ గారు వజ్‌ వెరీ కైండ్‌. ఎందుకంటే ఐ వజ్‌ 16, 17 ఇయర్స్‌. ఆయన నన్ను పిలిచి ‘వాటీజ్‌ యువర్‌ ఫీలింగ్‌’ అని అడిగారు. ‘ఐ యామ్‌ రేషనలిస్‌’అన్నాను. ‘ఎందుకలా అనుకున్నావు’ అన్నారు. ‘ముహూర్తం షాట్‌కి కొబ్బరికాయ కొడతారు కదా. దాన్నసలు ముట్టుకోలేదు నేను’ అన్నాను. ‘ఎందుకు ముట్టుకోలేదు. నువ్వు ముస్లిం కదా దానివల్లనా’ అన్నారాయన. ‘కాదండీ నేను రేషనలిస్ట్‌ అన్నాను మళ్లీ’. ‘ఆహా.. నాలుగేళ్ల తరువాత కూడా నువ్వు ఇదే చెబుతావా చూద్దాం’ అన్నారాయన. ‘మీరు చూడండి ఇలాగే ఉంటాను’ అన్నాను. ఆ తరువాత నేను యాక్టర్‌ అయిపోయాను.
 
ఆర్కే: ఎవరు సజెస్ట్‌ చేశారు మిమ్మల్ని యాక్టర్‌కమ్మని?
 
కమల్‌: నాకు ఇంట్రెస్ట్‌ లేదు. బాలచందర్‌ గారే. ఆర్‌సి శక్తి అని నా ఫ్రెండ్‌ ఉన్నాడు. హీ ఈజ్‌ నో మోర్‌ నౌ. యు మస్ట్‌ రైట్‌ అని చెప్పాడు. హైస్కూల్‌ డ్రాపవుట్‌ని నాలో రైటర్‌ ఎలా ఉంటాడని నేనంటే ‘ఉన్నాడు. నాకు తెలిసింది’ అన్నాడు. నన్ను స్ర్కీన్‌ప్లే రాయమని ఎంకరేజ్‌ చేసింది ఆయనే. అప్పటికే నేను టెక్నీషియన్‌ అయిపోయాను కాబట్టి టెక్నీషియనే సూపర్‌ అనే ఫీలింగ్‌లో ఉండేవాడ్ని. ఆ తరువాత బాలచందర్‌ గారు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సెలక్షన్‌ అని అమ్మకి చెప్పి బయల్దేరితే ‘నీ ఫోటో తీసుకెళ్లురా’ అంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌కి ఫోటో అక్కర్లేదు టాలెంట్‌ చాలన్నాను. వెళ్లగానే ఫోటో ఉందా అని అడిగారు. అరే అమ్మకి ఎలా తెలిసింది అని మనసులో అనుకున్నాను. ఫోటో చూపించాను. ఆయన ‘ఓకే మంచి క్యారెక్టర్‌ ఉంది. చేయాలి’ అన్నారు. సార్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పనిలేదా అంటే ‘నో నో యుకమ్‌’ అన్నారు. ఆ పిక్చర్‌ అయిన తరువాత ‘పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. నీలో ఉన్న యాక్టర్‌ ఎంత పెద్ద యాక్టర్‌ అవుతాడో నాకు తెలుసు. ఎప్పుడైనా డైరెక్టర్‌ కావొచ్చు. ఇది మాత్రం మళ్లీ మళ్లీ రాదు’ అని చెప్పారు. ‘ఆటోలో వస్తావా, కార్లో వస్తావా స్టూడియోకి’ అని అడిగారు. కార్లో అన్నాను. ‘అయితే యాక్టర్‌ అవ్వు. తరువాత చేసుకుందాం డైరెక్షన్‌’ అని నన్ను దార్లో పెట్టింది బాలచందర్‌ గారే. మై లైఫ్‌ వజ్‌ డైరెక్టెడ్‌ బై హిమ్‌.
 
ఆర్కే: మీరు ఆయనతో కలిసి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు?
 
కమల్‌: నా పదహారేళ్ల వయసు నుంచి ఇప్పుడు ఉత్తమ విలన్‌ వరకు. గురువుగారు అని మొదలైన రిలేషన్‌ షిప్‌ ఆ తరువాత ఎన్ని డిఫరెంట్‌ ఒపినియన్స్‌ వచ్చినా విడిపోకుండా వాళ్ల కుటుంబంలో ఒక మెంబర్‌లా ఉన్నాను. ఆయన నాకు ఫాదర్‌.
 
ఆర్కే: ఇందులో రెండున్నాయి. ఒకటి మనీ రిస్క్‌ చేస్తారు. యాక్షన్‌ కోసం శరీరాన్ని కూడా హింసించుకుంటారు. ఈ కాంబినేషన్‌ రేర్‌ కదా…
 
కమల్‌: అది గురుదత్‌ గారి వల్ల వచ్చింది. రాజ్‌కపూర్‌, శాంతారామ్‌ గారు అందరూ పాషన్‌ కోసం చేసిన వాళ్లే. సత్యజిత్‌రేగారి పేరు ఎందుకు చెప్పలేదంటే. అందులో ఒక రుషిత్వం ఉంది. అలా కాకుండా సంసారిగా ఉండి ఇలా చేయడం అనేది చాలా కష్టం.
 
ఆర్కే: వాళ్లు చేశారు. కొన్నిసార్లు దెబ్బతిన్నారు. మీరు కూడా లాంగ్‌ కెరీర్‌ కదా. యు మస్ట్‌ బి వర్త్‌ హండ్రెడ్స్‌ ఆఫ్‌ క్రోర్స్‌. కాని పరిస్థితి అలా లేదు కదా.
కమల్‌: అది డబ్బుగా లేదు. ఐ యామ్‌ వర్త్‌ మిలియన్స్‌ ఆఫ్‌ క్రోర్స్‌. ప్రేక్షకుల లెక్కలో నేను చూసుకుంటాను. పొగరుతో కాదు సవినయంగా చెప్తున్నాను. లాస్ట్‌ ఇయర్‌ నాకు ఒక ప్రాబ్లమ్‌ వచ్చింది. మనీలెండర్‌ నా ప్రాపర్టీ తీసేసుకోవాలనుకున్నాడు. అప్పుడు టీవీలో నా బాధని, కోపాన్ని వ్యక్తం చేశాను. అది చూసి తమిళనాడుకు చెందిన వ్యవసాయ కుటుంబం నాకు వాళ్ల ఇంటి డాక్యుమెంట్స్‌ పంపించారు. ప్రతి వాళ్లు తమ చేతిలో ఉన్న డబ్బు మనీ ఆర్డర్‌ చేశారు. నాకు ఇల్లు ఇచ్చిన వాళ్లకు ఒకే ఇల్లు ఉంది. వాళ్లని వెళ్లి కలిసి నమస్కరించి నాకో కొత్త బంధువు దొరికాడని చెప్పాను. నాకప్పుడు 20 డాక్యుమెంట్ల వరకు వచ్చాయి. కాని వాళ్లందరికీ వేరే ఇళ్లు ఉన్నాయి. వీళ్లకి ఉన్నది ఒకటే ఇల్లు అదీ నాకు పంపించారు.
 

ఆర్కే: ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. ఎందుకొచ్చింది ఆపేద్దాం అని అనిపించడంలేదా మీకు?
కమల్‌: ఇప్పుడు కిసాన్‌ని తీసుకుంటే అతను తన పెట్టుబడిని భూమిమీదే పెడతాడు. అలానే నేను కూడా ఇందులోనే పెడతాను. నేను కూడా కిసాన్‌ లాగానే. శ్రీమంతుడు సినిమాకోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడు నాలుగురోజుల పనికి 250 రూపాయల జీతం వచ్చింది. దటీజ్‌ మై వాల్యూ. అది హండ్రెడ్‌ టైమ్స్‌ అయినా చాలు అనుకున్న రోజులున్నాయి. ఇప్పుడది కోట్లకి వెళ్లిపోయింది.నేను మా నాన్న ప్రాపర్టీ కోసం చూడలేదు ఉపయోగించలేదు. అలాగే మా అమ్మాయి శ్రుతిని కూడా సొంతంగా సంపాదించుకునేలా ట్రైన్‌ చేశాను. చిన్న హట్‌ అయినా సొంతంగా సంపాదించుకుంటే చాలు. ఐ యామ్‌ నాట్‌ మేకింగ్‌ మనీ ఫర్‌ చిల్డ్రన్‌ అండ్‌ గ్రాండ్‌ చిల్డ్రన్‌, గ్రేట్‌ గ్రాండ్‌ చిల్డ్రన్‌. ఇట్స్‌ ఫర్‌ మి. నా తరువాత నా ఆస్తుల్ని ప్రజలకి అందివ్వమని నా కూతురికి చెప్తాను. బికాజ్‌ దే గేవ్‌ అజ్‌ మనీ. ఊరికే చెప్పడంలేదు. ఐ బిలీవ్‌ ఇట్‌. డబ్బు అనేది టూల్‌ మాత్రమే. నేనదే నమ్ముతాను. గురువుగారు కూడా అదే నేర్పారు. గ్యారెంటీలు అడుగుతూ ప్రతి అడుగు వేస్తే ముందుకు వెళ్లలేం.

ఆర్కే: పిల్లలకు స్వేచ్ఛ ఇస్తారా?
 
కమల్‌: తప్పకుండా. నాకు నటనలో 50 యేళ్ల ఎక్స్‌పిరియెన్స్‌ ఉందని వాళ్లకి ఆ విషయంలో సలహాలివ్వను. వాళ్లడిగితే సలహా ఇస్తాను. వాళ్ల టాలెంట్‌ పెరుగుదలకు నేను గైడ్‌లా ఉంటానంతే. నాకు వాళ్లను సైంటిస్టులు చేయాలని ఏవేవో ఆశలున్నాయి. కాని వాళ్లకి ఏమి నచ్చిందో అదే చేస్తున్నారు. స్పెషల్లీ శృతి పేరు వల్లనో ఏమో కాని తన ఏడో ఏట నుంచి మ్యూజిక్‌ నేర్చుకుంది. యుఎస్‌ వెళ్లి మ్యూజిక్‌లో డిగ్రీ చేసింది.
ఆర్కే: మీ గురించి మీరు డిఫైన్‌ చేసి చెప్పాలంటే ఎలా చెప్తారు?
 
కమల్‌: నేను పేరులేని, ముఖంలేని మనిషిని. నా గురించి ఆలోచించుకుంటే అదే గుర్తొస్తుంది, అంతేకాని పేరు, ముఖం గుర్తుకురావు. దటీజ్‌ మై ఫస్ట్‌ స్ర్టెంత్‌. ఆ మనిషిని జాగ్రత్తగా ప్రొటెక్ట్‌ చేసుకుంటూ వస్తున్నాను.
 
ఆర్కే: మీలో మీకు నచ్చని షేడ్‌ ఏమిటి?
 
కమల్‌: కోపం. ఒక్కొక్కప్పుడు నాకన్నా ఎవడున్నాడు అనే గర్వం అనేది వస్తుంది, అది నాసియా. అందరూ నా గురించి గొప్పగా అనుకోవాలని అనిపిస్తుంది. అదే మళ్లీ నాకు నచ్చదు. నన్ను పొగుడుకోవడం నచ్చదు.
 
ఆర్కే: మీ పిల్లలు వచ్చి ఎవరినైనా ప్రేమించాం అంటే యాక్సెప్ట్‌ చేస్తారా?
 
కమల్‌: అఫ్‌కోర్స్‌. ఇట్స్‌ హర్‌ లవ్‌. నాకు కాస్త చోటు ఉంది కదా అని అడుగుతాను. మా కమ్యూనిటీ కాకుండా వేరే కమ్యూనిటీ వాళ్లను ఎంపిక చేసుకుంటే మరింత సంతోషిస్తాను.
 
ఆర్కే: జనరల్‌గా పిల్లలు రాంగ్‌ డెసిషన్స్‌ తీసుకుంటారు అనే భయం ఉంటుంది కదా?
 
కమల్‌: ఫాదర్స్‌ మాత్రం రైట్‌ డెసిషన్స్‌ తీసుకుంటారా. తండ్రి సరైన నిర్ణయం తీసుకుని పెళ్లి చేస్తే అమ్మాయిలు కాల్చుకుని ఎందుకు చనిపోతున్నారు. ప్రతి మనిషికి ఒకలానే జరగాలనేం లేదు. పిల్లల్ని మొక్కల్లా పెంచాలి.
 
ఆర్కే: భార్యాభర్తలు విడిపోయినప్పుడు పిల్లలు తల్లితో ఉండాలనుకుంటారు కదా. కాని మీ విషయంలో మీతో ఉండాలని అనుకోవడం కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది….
 
కమల్‌: వాళ్ల చాయిస్‌ అది. ఆ చాయిస్‌ అందరికీ ఉంది. నా ఎక్స్‌ వైఫ్స్‌తో కలిపి అందరికీ…
 
ఆర్కే: ఎక్స్‌ వైఫ్స్‌ అన్నారు. ఏమన్నా పించ్‌ అనిపిస్తుంటుందా ఎందుకు ఫెయిలైంది మ్యారేజి అని…
 
కమల్‌: నేను చూసిన దైవాలందరికీ ఇద్దరు భార్యలు ఉన్నారు. అది నాకు తప్పుగా అనిపించలేదు. కాకపోతే ఒకేసారి నాకు ఇద్దరు భార్యలు లేరంతే.
ఆర్కే: అది కాదండీ… డిఫరెన్సెస్‌ గురించి…
 
కమల్‌: ఆడవాళ్లకి కూడా ఈక్వల్‌ స్టేటస్‌ ఇస్తాను. వాళ్ల డెసిషన్స్‌ వాళ్లు తీసుకుంటారు.
 
ఆర్కే: ప్రతి సినిమాలో లిప్‌ కిస్‌ ఎందుకు పెడతారు?
 
కమల్‌: ప్రతి సినిమాలో కాదు. ఇటీజ్‌ పార్ట్‌ ఆఫ్‌ మై లైఫ్‌. ప్రతి సినిమాలో మర్డర్‌ ఉందని ఎవరూ అడగలేదు. మరి కిస్‌ని ఎందుకు అడుగుతారు. కిస్‌ అనేది చాలా బ్యూటీఫుల్‌ థింగ్‌. కిస్‌ అనేది ఇటీజ్‌ దేర్‌ ఇన్‌ ఖజరహో.
 ఆర్కే: మిగిలిన కోరికలు ఏమి ఉన్నాయి?
 
కమల్‌: ప్రేక్షకుల మనసులో చిన్న చోటు కావాలి. అదికూడా శాశ్వతంగా ఉండాలనేదే ఆశ. దాని గురించి నేను పనిచేస్తున్నాను. వచ్చే తరానికి కూడా నేను గుర్తుండాలి.
 
ఆర్కే: పాలిటిక్స్‌ మీద ఇంట్రెస్ట్‌ లేదంటున్నారు ఎందుకు?
 

కమల్‌: ఐ ఫీల్‌ దట్‌ సోషల్‌ సర్వీస్‌ నీడ్‌ నాట్‌ బి డన్‌ ఓన్లీ బై పాలిటిక్స్‌. డాక్టర్‌గా, లాయర్‌గా ఉండి చేయొచ్చు. ఐ కెన్‌ డు ఇట్‌ యాజ్‌ ఎ యాక్టర్‌. నాకో ఐడియాలజీ ఉంది. దాని ప్రకారం బతుకుతున్నాను.

ఆర్కే: సినిమాల్లో నటించడం ఒక ఎత్తయితే… ఎక్స్‌పరిమెంట్స్‌ చేయాలనే ఆలోచన ఏంటి?
 
కమల్‌: అది ఇంటలెక్చువల్‌ డిఎన్‌ఎ. బాలచందర్‌ గారి దగ్గర్నించి వచ్చింది. నాన్నగారు కూడా అలాగే… ఆయన లాయర్‌ అయినప్పటికీ హిజ్‌ థాట్స్‌ వర్‌ వెరీ ఇంటర్నేషనల్‌.
 
ఆర్కే: కుటుంబమంతా ఎడ్యుకేటెడ్‌, డిసిప్లిన్‌ కదా. ఇంత అల్లరి పనులు ఎలా వచ్చాయి మీకు?
 
కమల్‌: నేను పుట్టినప్పుడు ఫాదర్‌కి 50 యేళ్లు. ఆల్‌మోస్ట్‌ ఒక గ్రాండ్‌సన్‌లాగా. అందర్నీ చదివించేశాం, ఇది ఒక ఎక్స్‌పరిమెంట్‌ చేసి చూద్దామని….
 
ఆర్కే: తెలుగు వాళ్లు కూడా మిమ్మల్ని బాగా ఓన్‌ చేసుకుంటారు ఎందుకని?
 

కమల్‌: యాక్చువల్లీ తెలుగులో స్ర్టెయిట్‌ ఫిల్మ్స్‌ తక్కువ. కానీ చేసిన అన్ని సినిమాల్లో మ్యాక్జిమమ్‌ హిట్స్‌ అయ్యాయి. ఆ రికార్డు తమిళంలో కూడా లేదు నాకు. నెక్ట్స్‌ పిక్చర్‌ తెలుగులో స్ర్టెయిట్‌ పిక్చర్‌ చేస్తున్నాను.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సఫాయి రాణి ఎండ్లూరి సుధాకర్ కవిత –

సఫాయి రాణి

ఆమె రెల్లిలోక వైతాళికురాలు
ఆమె పేరు చెబితే చాలు
కక్షలు కట్టిన కుల వివక్షలు
చెంబులు పట్టుకొని పారిపోతాయి
మానవ మలమూత్రాల్ని
పరిశుభ్రంచేసే
గంగా భాగీరధురాలు
అవమానాల గరళాన్ని దాచుకున్న
తిట్ల కెరటాల సముద్రురాలు
తరతరాల తాతల
నేతివాసనల్నే కాదు
వాళ్ళు వదిలేసి వెళ్ళిన
వారసత్వాల పీతి వాసనల్ని
పీల్చుకుంటూ వచ్చిన పీడితురాలు
ఆమె పాదం మోపితేనే
మరుగుదొడ్లకు విముక్తి
భగవంతుడి ప్రసాదమైనా
అమ్మవారి తీర్థమైనా
ఆమె చేతిలో పవిత్రం కావాల్సిందే
వేలవేల సంవత్సరాల నుంచి
ఆ గ్రామంలో భూమి
పీతి గంపల చుట్టే తిరుగుతూ వస్తోంది
ఉదయాన్నే సిగ్గులేని సూర్యుడు
సత్తురేకుల మీదుగా
చీపురు కట్టల మీదుగా ఉదయిస్తూంటాడు
అది నిన్నటి కథ
ఇప్పుడా వూళ్ళో
కొత్త ఉషోదయం
ఏ పాకీ పడతీ
నెత్తిమీద మలం బుట్టలతో కనిపించట్లేదు
ఏ వృద్ధ మెహతర్‌
మైళ్ళదూరం నడిచి
అశుద్ధాన్ని అవతల పారేయట్లేదు
ఇప్పుడే కార్మికురాలూ ఖర్మకాలి
కంపుకొట్టే మరుగుదొడ్ల నరకంలో
దుర్భర శ్వాస పీల్చుకోవట్లేదు
ఉషా చామర్‌!
సఫాయిరాణిలా దూసుకొచ్చి
ఒక పోరాటమే ప్రకటించింది
ఒక మల యుద్ధమే చేసింది
సొంత ఆస్తి ఉన్నట్టు
సొంత శౌచాలయాలు
కట్టుకోవాలని కట్టడి చేసింది
కుల నిర్మూలనే కాదు
మల నిర్మూలన జరగాలని గర్జించింది
పారిశుద్ధ్య కార్మికురాళ్ళకు
పనిగౌరవం కల్పించింది
అమానుషత్వ బానిసత్వంలోంచి
బాలకల్ని బయటికి లాగింది
ఒకస్వేచ్ఛా ప్రపంచాన్ని చూపించింది
ప్రపంచం ఆమెవైపు చూసేలా చేసింది
ఆమె గొంతు వినబడిందా
వీధులన్నీ వినయపూర్వకంగా నిలబడతాయి
ఆమె కాలు కదిపిందా
దుర్లభాలన్నీ
‘సులభా’లైపోతాయి
ఆమె నోరు విప్పిందా
ఆత్మగౌరవాలన్నీ
అత్తరుపూల దండలై
ఆమె కంఠాన్ని అలంకరిస్తాయి
సూర్యుడు అస్తమించని
బ్రిటిష్‌ సామ్రాజ్యం దాకా
ఆమె కీర్తి పరిమళం పరివ్యాప్తించింది
ఇప్పుడు రాజస్థాన్‌లోని
ఆల్వార్‌ గ్రామం రెల్లిపేటలో
ఉషోదయమంటే
ఆమె రూపమే కనిపిస్తుంది

 ఎండ్లూరి సుధాకర్‌
9246650771
(2008 న్యూయార్క్‌లో ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌’ కిరీటాన్ని దాల్చిన ఉషా చామర్‌ని బ్రిటన్‌ దేశం కూడా

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బుద్ధుని తత్వం ‘ప్రతీత్య సముత్పాద’

బుద్ధుని తత్వం ‘ప్రతీత్య సముత్పాద’

భారతీయత హైందవ మతంలో వుంది అని మన పాఠ్య పుస్తకాలు పదే పదే వల్లె వేస్తూ, హిందువులు కాని వారందరినీ ఈ దేశంలో పరాయి వారుగానూ, నేరస్థులుగానూ వెలివేసి, ఈ దేశపు వాస్తవికతను మరుగుపరిచాయి. క్రీ.పూ. ఆరవ శతాబ్దంలోనే వేదాల ప్రామాణికతను ప్రశ్నించి, బహుజన హితాన్ని బహుజనుల సుఖాన్ని ఆకాంక్షిస్తూ, సామాజిక విప్లవ సిద్ధాంతాన్ని రూపొందించిన గౌతమ బుద్ధుని తాత్వికతను అధ్యయనం చేసిన వారికి ఈ దేశం బౌద్ధ దేశమని, భారతీయత అంటూ వుంటే అది బౌద్ధంలోనే వుంది అని అర్థమవుతుంది.

వేదాలు అపౌరుషేయాలు, అవి నేరుగా సృష్టికర్త అని భావించబడుతున్న బ్రహ్మ నుంచి భూమ్మీద కొచ్చిన పవిత్ర గ్రంథాలు, అందులో వున్నదే ప్రామాణికం అని బ్రాహ్మణ మతస్థులు ప్రజల్ని నమ్మబలుకుతూ వారి అజ్ఞానాన్ని సొమ్ము చేసుకుంటున్న కాలంలో వేదాల్నే కాకుండా అప్పటికి స్థిరపడిన ఆధిపత్య భావజాలాన్ని కూడా నిలదీసి ప్రశ్నించిన తొలి సామాజిక విప్లవకారుడు బుద్ధుడు.
ప్రపంచాన్ని పట్టి పీడించే దుఃఖానికి బుద్ధుడు ‘అష్టాంగ మార్గం’లో పరిష్కారాన్ని చూపించాడు. బుద్ధుని బోధనలలో ‘అనాత్మ’ వాదం, ‘అనిత్వత’, ‘ప్రతీత్య సముత్పాద’ వంటివి బుద్ధుడిని ఇతర తత్వవేత్తల కంటే, ప్రవక్తల కంటే భిన్నం గా నిలబెట్టాయనవచ్చు. ‘అనాత్మ’ వాదం పూర్తిగా భౌతిక వాదంగా భావించవచ్చు. మతాలన్ని ఆత్మ, పరమాత్మ, స్వర్గం, నరకం వంటి భావనల చుట్టూ పరిభ్రమిస్తుంటే బుద్ధుడు ఆత్మ లేదనడం ఆనాటికే కాదు, ఈనాటికీ సాహసోపేతమైన చర్య. అలాగే ‘అనిత్వత’ అనేది- మార్పును, చలనశీలతను గురించి వివరిస్తూ బౌద్ధంలోని శాస్ర్తీయతకు అద్దం పడుతుంది. బుద్ధుని తాత్విక చింతనలో ‘ప్రతీత్య సముత్పాద’ అనేది వివిధ అంశాల మధ్య వుండే కార్యకారణ సంబంధాన్ని వివరిస్తుంది. ఇది బౌద్ధంలోని హేతువాద దృష్టికి నిదర్శనం. బుద్ధుని బోధనలలోని ‘మధ్యేమార్గం’ అన్ని అంశాలకు, అన్ని కాలాలకు సరిపోయే విధంగా ఎంతో ప్రాసంగికతను కలిగి వుంది. నైతికత, శాస్ర్తీయ దృష్టి, సమత, మైత్రి, కరుణ, ప్రజ్ఞ, శీలం అనే బౌద్ధ ధర్మంలోని భావనలు బౌద్ధాన్ని మతం అనే స్థాయి నుంచి గొప్ప తత్వశాస్త్ర స్థాయికి తీసుకెళ్ళాయనవచ్చు.
‘సంఘం’ అనే భావనకు మొట్టమొదటి సారిగా బుద్ధుడు రూపకల్పన చేసినట్లు చరిత్ర చెబుతుంది. బౌద్ధ సంఘం తదనంతరం అనేక సంఘాల నిర్మాణానికి మార్గం చూపిందనవచ్చు. ‘బుద్ధుడు’ ‘ధమ్మం’ తర్వాత త్రిశరణాలలో చివరిది ‘సంఘం’. బుద్ధుడు తన భావజాల వ్యాప్తి కోసం సంఘాన్ని నిర్మించి అందులో అన్ని వర్గాల వారికి స్థానం కల్పించాడు. మంగలి కులస్థుడైన ఉపాలి, వేశ్యాపుత్రుడైన జీవకుడు, వేశ్యయైున ఆమ్రపాలి, దొంగ అయిన అంగుళీమాలుడు బౌద్ధ సంఘంలో సభ్యత్వాన్ని పొందారు. ఇది ప్రజాస్వామికమైన నిర్మాణం.
స్ర్తీని భోగవస్తువుగా పురుషునికి వారసులను కనియిచ్చే యంత్రంగా పరిగణించే ఆనాటి సమాజంలో బుద్ధుడు స్ర్తీల విషయంలో విశాల దృష్టితో వ్యవహరించినట్లు తెలుస్తుంది. బుద్ధుని సంఘంలో రాకుమార్తెలు, బానిస స్ర్తీలు, వేశ్యా వృత్తిలో వున్నవారు, బిడ్డల చేత, భర్తల చేత నిర్లక్ష్యం చెయ్యబడిన అనాథలు సమానంగా చూడబడ్డారు. స్ర్తీలకు సన్యాసం పుచ్చుకునే స్వేచ్ఛ, కర్మ జ్ఞానాధికారాలు లేని రోజుల్లో స్ర్తీల పట్ల బుద్ధుడు వ్యవహరించిన తీరు విప్లవాత్మకమైనదనే చెప్పాలి.
వైదిక మతంలో కర్మకాండలు, యజ్ఞ యాగాలు, క్రతువుల పేరున జంతువులను వధించడాన్ని, మూఢాచారాలను బుద్ధుడు ఖండించాడు. హేతువుకు అధిక ప్రాధాన్యత నిచ్చాడు. హేతువుకు లొంగనిది ఏదీ బౌద్ధంలో లేదని బౌద్ధ పండితుడైన ప్రొఫెసర్‌ లక్ష్మీ నరుసు అభిప్రాయం. బుద్ధుని ఆలోచనా విధానం, కార్యాచరణలలో బ్రాహ్మణ వాదానికి ప్రత్యామ్నాయ దృక్పథం కనిపిస్తుంది. ఆనాటికి పండితుల భాషగా స్థిరపడిన సంస్కృతాన్ని కాదని ప్రజల భాషయైున పాళీ భాషను ప్రచార మాధ్యమంగా ఎన్నుకోవడంలో బుద్ధుడు ఒక సాంస్కృతిక విప్లవానికి నాంది పలికినట్లు తెలుస్తుంది.
అయితే బౌద్ధాన్ని సమాజంలోని వివిధ వర్గాలు ఎలా అర్థం చేసుకున్నాయి? అనేది ఆసక్తికరమైన అంశం. సాధారణంగా ఎక్కువ మంది బుద్ధుడు ఒక రాకుమారుడుగా పుట్టి, సుకుమారంగా పెరిగి, కొన్ని బాధాకరమైన దృశ్యాలను చూసి, జీవితం మీద విరక్తి కలిగి సన్యాసం పుచ్చుకున్నాడని అంటారు. గాంధే య వాదులు బుద్ధుడు జీవహింస చెయ్యకూడదని చెప్పాడు కాబట్టి ఆయన్ని ఓ అహింసామూర్తిగా అభిమానిస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వివేకానంద వంటి వారు బౌద్ధాన్ని హిందూ మతంలో భాగంగా గుర్తిస్తారు. పండిత అమోతీ దాస్‌, ప్రొఫెసర్‌ పోకల లక్ష్మీనరుసు, అంబేద్కర్‌ వంటి వారు బుద్ధుడిని బ్రాహ్మణీయ వైదిక సంస్కృతిపై తిరుగుబాటు చేసిన సామాజిక విప్లవ కారుడిగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తుంది. కానీ బుద్ధుడిని కేవలం అహింసావాదిగా చూసేవారు బుద్ధుడి యొక్క అహింసా వాదంలోని సామాజిక కోణాన్ని పరిగణించినట్లు కనిపించదు. ఎందుకంటే బుద్ధుడు భౌతిక హింస కంటే మానసిక హింసను ఎక్కువగా ఖండిస్తాడు. ఆహారపు అలవాట్ల దృష్ట్యా చూసినా కూడా బుద్ధుడు మాంసాహారి అని తెలుస్తుంది.
బౌద్ధాన్ని, బుద్ధుడిని హిందూ మతంలో భాగంగా పరిగణించే వారి వాదన బౌద్ధ ధర్మానికే విరుద్ధం. ‘బుద్ధుడు తాను ఒక మతాన్ని స్థాపిస్తున్నానని చెప్పుకోలేదు. ఆయన వైదిక మతంలో పుట్టి, పెరిగి వైదిక మతంలోనే మరణించాడు.’ అని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వ్యాఖ్యానించడం యాదృచ్ఛికం కాదు. మొదటి నుంచీ తనని వ్యతిరేకించిన వారిని తనలోనే జీర్ణం చేసుకుని అక్టోప్‌సలా విస్తరించిన హిందూ సామ్రాజ్యవాద ధోరణిగా దీనిని అర్థం చేసుకోవచ్చు. బుద్ధుని ఆలోచనా విధానంలోని కీలకాంశమైన బ్రాహ్మణ వ్యతిరేకతను ఉద్దేశ్యపూర్వకంగానే తమకు అనుకూలంగా కప్పిపుచ్చడమే! వైదిక మతంలోని డొల్లతనాన్ని, హేతు రాహిత్యాన్ని ఎండగట్టి బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసించిన బుద్ధుడు వైదిక హిందూమతంలో భాగం ఎలా అవుతాడు?
బౌద్ధాన్ని వైదిక మతంపై తిరుగుబాటుగా భావించేవారు బుద్ధుడిని సామాజిక విప్లవకారుడుగా పరిగణిస్తారు. గెయిల్‌ ఆంవెత్‌ అనే సామాజిక శాస్త్రవేత్త బౌద్ధాన్ని ఏ్ఛ్ట్ఛటౌఛీ్ఠౌ ఖ్ఛజూజీజజీౌుఽ అని పిలిచారు. సమానత్వం ప్రాతిపదికగా వున్న బౌద్ధాన్ని అమోతీదాస్‌ పీడితుల విముక్తి సిద్ధాంతంగా ప్రచారం చేశాడు. ప్రొఫెసర్‌ లక్ష్మీ నరుసు సత్యాన్వేషణకు, హేతువాద దృష్టికి బౌద్ధం పెద్దపీట వేసిందని వివరించాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను తాను ఫ్రెంచి విప్లవం నుంచి కాక బౌద్ధం నుంచి స్వీకరించానని అంబేద్కర్‌ ప్రకటించాడు. బుద్ధుడు పుట్టుక ఆధారంగా వచ్చే ఆధిక్యతను కాదని ప్రయత్నంతోనూ, ప్రజ్ఞతోనూ సాధించే ఆధిక్యతకు ప్రాధాన్యతనివ్వడం అంబేద్కర్‌కు బౌద్ధం పట్ల ఆసక్తిని కలిగించింది. అంబేద్కర్‌ బౌద్ధ ధర్మ స్వీకరణ భారతదేశపు బౌద్ధమత చరిత్రలో ఓ కీలక అధ్యాయం.
బుద్ధుని అనంతరం హిందుత్వ వాదులు ఆయన అస్తిత్వాన్ని నాశనం చేసే ఉద్దేశంతో ఆయన్ని విష్ణుమూర్తి అవతారాలలో ఒక అవతారంగా చేశారు. బౌద్ధ ఆరామాలను పడగొట్టి హిందూ దేవాలయాలుగా మలిచారు. ఆంధ్ర దేశంలోని శైవ మతానికి చెందిన పంచారామాలన్నీ ఒకప్పుడు బౌద్ధ క్షేత్రాలే! హిందూ రాజులు బౌద్ధ సన్యాసులను చంపి మిగిలిన వారిని దేశం నుంచి తరిమివేయగా మరోపక్క ఆది శంకరాచార్యుల వంటివారు బౌద్ధంపైన నైతిక దాడికి పాల్పడ్డారు. బౌద్ధాన్ని దేశం నుంచి వెళ్ళగొట్టి భారతదేశం తన ఆత్మను కోల్పోయింది అని గురజాడ వాపోయాడు.
బ్రాహ్మణవాదులు కోరుకున్నట్టు బౌద్ధ ధర్మం నశించలేదు. అది భారతదేశంలో ధ్వంసం చెయ్యబడినప్పటికీ ప్రపంచమంతా వ్యాపించింది. ఈరోజు ప్రపంచం బౌద్ధం వైపు చాలా ఆసక్తిగా చూస్తోంది. ఇటీవలి దశకాలలో దేశవ్యాప్తంగా ముందుకొచ్చిన అస్తిత్వ ఉద్యమాల సందర్భంగా సామాజిక ఉద్యమకారులు, మేధావులు, పరిశోధకులు ప్రాచీన భారతదేశంలో హేతువాద దృష్టి, సమత, కరుణ, ప్రజ్ఞ, మైత్రి వంటి భావనలను గురించి ప్రస్తావించిన బౌద్ధం వైపు తిరిగి ఆలోచించడం జరుగుతోంది. ఈ దేశ సంస్కృతిని చరిత్రకారులు ఎలా విశ్లేషించినప్పటికీ గెయిల్‌ ఆంవెత్‌ వంటి వారు భారతదేశపు నాగరికత, సంస్కృతులలో అంతర్లీనంగా ఇమిడి వున్న బౌద్ధ ధర్మాన్ని దృష్టిలో వుంచుకుని ప్రాచీన భారతదేశ నాగరికతను ‘బౌద్ధ నాగరికత’గా అభివర్ణించడం సముచితంగా వుంది.
ఇటీవల ముందుకొచ్చిన నినాదం ‘ఘర్‌ వాపసీ’ అంటే హైందవేతర మత సంస్కృతులలో వున్నవారు తిరిగి హిందూ మతంలోకి రావడం అని హిందూత్వవాదం చెబుతున్నప్పటికీ, ఈ దేశపు మత వారసత్వం బౌద్ధంలో వుందని ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాలు, ఇతర చారిత్రక ఆధారాల వలన రుజువయ్యింది. దీనికితోడు అశోక ధర్మచక్రం, సారనాథ్‌ స్థంభం వంటి జాతీయ చిహ్నాలతో పాటు పంచశీల వంటి బౌద్ధధర్మ సూత్రాలను అంబేద్కర్‌ రాజ్యాంగంలో అణువణువునా పొందుపరిచి ఈ దేశం బౌద్ధ దేశమని చాటి చెప్పాడు. అలాగే ఒక చర్మకారుడైన విధికుడు అమరావతి బౌద్ధక్షేత్రానికి కానుకగా ఇచ్చి న పూర్ణ ఘటం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిహ్నంగా గుర్తింపు పొందింది. చారిత్రక వాస్తవాల దృష్ట్యా ఈ దేశం బౌద్ధ దేశమైనప్పటికీ తర్వాత ప్రజలు ఇతర మతాలలోకి వెళ్ళి తిరిగి తమ అస్తిత్వ పునాదుల వైపు దృష్టి సారించారనవచ్చు. ఎవరి ఇంటికి వారు తిరిగి రావడం అనే దానికి జనంలో బౌద్ధం వైపు పెరుగుతున్న ఆసక్తే తార్కాణం.
చల్లపల్లి స్వరూపరాణి
(నేడు బుద్ధ పూర్ణిమ)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్య విమర్శకు చివరి ప్రతినిధి

సాహిత్య విమర్శకు చివరి ప్రతినిధి

ఇదివరకే ఎవరో రాసిన, చెప్పేసిన, అంశాలనే పునఃపునః ప్రదర్శించే ఎత్తిపోతల సిద్ధాంత గ్రంథాలకు ఎం.ఫిల్‌, డాక్టరేట్లు ప్రదానం చేసే తెలుగు రాష్ర్టాల్లోని విశ్వ విద్యాలయాలకు నరసింహమూర్తి లాంటి పరిశోధక ప్రభాకరుడు కనిపించరు. 
పెద్దాయన యు.ఎ. (ఉపాధ్యాయుల అప్పల) నరసింహమూర్తి గారితో పరిచయ భాగ్యం ఎనభైల నాటిది. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదువుతున్నప్పుడు నా మిత్రుడు విజయనగరం జిల్లా వాసి డా. సూర్యనారాయణ ద్వారా పరిచయం. నా మొదటి కవితా సంపుటి వెలువడినపుడు సాంబశివరావు వంటి వారితో పాటు నా కవిత్వాన్ని విశేషంగా అభిమానించిన వారు నరసింహమూర్తి గారు. నా విశాఖ విద్యార్థి జీవితంలో ఎప్పుడు విజయనగరం సభలకు, సమ్మేళనాలకు వెళ్లినా వాటిల్లో ఆయన ప్రమేయం తప్పక వుండేది! నా కవిత్వాభిమానం వారిచేత 2008లో పెద్ద విశ్లేషణా వ్యాసమే రాయించింది.

ఆరోగ్యకరమైన తెలుగు సాహి త్య విమర్శకు ఆఖరు ప్రతినిధి నరసింహమూర్తిగారు. కోవెల సంపత్కుమార, జి.వి. సుబ్రహ్మణ్యం, వడలి మందేశ్వర్రావు, చేకూరి రామారావు, ముదిగొండ వీరభద్రయ్య వారి సహ విమర్శకులు. ఆయన మూలాలు ఎంత సంప్రదాయలోతుల్లో వున్నాయో, ఆయన ఆలోచనలూ,ప్రతిపాదనలూ అంత ఆధునికంగా ఉంటాయి. అందుకు సాక్ష్యం – జీవిత కాలంలో ఆయన సాగించిన సాహిత్య విమర్శా ప్రస్థానం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎస్వీ జోగారావు పర్యవేక్షణలో ‘ఔచిత్య ప్రస్థానము – పింగళి సూరన’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. బహుశా ఔచిత్యాన్ని ఔపోసన పట్టడం వల్లనేమో ఆయన తన జీవితంలోనూ, రచనల్లోనూ ఎన్నడూ అనౌచిత్యానికి చోటు యివ్వలేదు. ఆయన రచించిన ‘కవిత్వ దర్శనం’ అటు కవులకు, ఇటు కవిత్వ అధ్యయనపరులకు ఒక కరదీపిక వంటిది. సృజన, ఊహ, కల్పన, బుద్ధి, సౌందర్యం, ఔచి త్యం, ధార, ఉన్మాదం వంటి దాదాపు ఇరవై అంశాలను కవిత్వంతో జోడించి చెప్పడంలో ఆయన తెలుగు పద్యాలతో పాటు, ఇటు సంస్కృతశ్లోకాలు, అటు ఆంగ్ల కవుల నిర్వచనాలను సందర్భానుసారం ఉటంకించడం చూస్తే ఆయన ఎంత అధ్యయనశీలో అర్థమవుతుంది. నన్నెచోడుని కుమార సంభవంపై ఆయన రాసిన గ్రంథం ఆంధ్ర విశ్వవిద్యాలయం తన స్వర్ణోత్సవ ప్రచురణగా వెలువరించడం విశేషం.

తెలుగు కథకు పాఠ్యాంశం అయిన చాగంటి సోమయాజులు కథలపై ఆయన రచించిన ‘కథా శిల్పి చాసో’ గ్రంథం కథా విమర్శకులకు మార్గదర్శనం చేయడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పురస్కారం అందుకొంది. వివిధ సందర్భాల్లో ఆయన రాసిన సాహిత్య వ్యాసాలు ‘రంగుటద్దాల గది’, ‘చర్వణ’ పేరుతో వెలువడ్డాయి. వీటిల్లో సమకాలీన సాహిత్య సందర్భాలపై ఆయన నిక్కచ్చి అభిప్రాయాలను గమనించవచ్చు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి కృషిచేసిన సారస్వత మూర్తుల జీవిత చరిత్రలను ఆయన గ్రంథస్థం చేసారు. ఆ క్రమంలో వచ్చినవే ‘మానవల్లి రామకృష్ణ కవి’ గ్రంథాన్ని సాహిత్య అకాడెమీ ప్రచురించగా, ‘గిడుగు రామ్మూర్తి పంతులు’పై గ్రంథాన్ని స్వీయ ముద్రణగా వెలువరించారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాను పుట్టిన గడ్డ మీదే పుట్టిన తెలుగుల దీపధారి గురజాడ అప్పారావు గారంటే మూర్తి గారికి కంఠదఘ్న ప్రేమ – అందుకే ‘కన్యాశుల్కము’ నాటకాన్ని పంతొమ్మిదో శతాబ్దపు ఆధునిక భారతీయ నాటకాలతో పోల్చి ఆయన రూపొందించిన గ్రంథం, తొలినాటి విశ్వవిద్యాలయ ఆచార్యులు, తులనాత్మక సాహిత్యాన్ని తామే పరిచయం చేసామనే ఆచార్యులు, తెలుగు అధ్యయన శాఖలకు తులనాత్మకం అనే తోకలు తగిలించుకునే వారందరూ తల వొంచుకుని సిగ్గుపడే రచన ‘కన్యాశుల్కం- ఆధునిక భారతీయ నాటకాలు’ గ్రంథం. ఈ పరిశోధన కోసం ఆయన, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, హిందీ, ఒరియా, కన్నడ నాటక రంగ ప్రముఖులను స్వయంగా కలుసుకొని చర్చించడం, పాశ్చాత్య నాటక రంగ సాహిత్యాన్ని అవలోకనం చెయ్యడం ఆయన తప్ప మరొకరు చెయ్యలేని పనులు. శ్రీరంగం నారాయణబాబు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ‘రుధిరజ్యోతి’ కావ్య సంకలనం – కానీ, నారాయణబాబు రచించిన కథలు, నాటికలు, సాహిత్య వ్యాసాలను సేకరించి, నారాయణబాబులోని మరో సాహిత్య కోణాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చెయ్యడమే కాక, ఆ గ్రంథానికి ‘నారాయణ చక్రం’ పేరుతో మంచి విశ్లేషణాత్మక పీఠిక అందించారు మూర్తి గారు. ఇన్నీ చేసారంటే, రాసారంటే ఆయన మౌలికంగా సృజనకారుడు అయి వుండాలి. అక్షరాల నిజం. ఆయన తొలుత కవి. పిదప విమర్శకుడు. అందుకు నిదర్శనం ‘యశోధర’ లఘు కావ్యం నుంచి, ఇటీవల పత్రికల్లో అరకొరగా ప్రచురితమైన ఆయన వచన కవితలు. ఆర్‌.ఎస్‌. సుదర్శనం, దీశెట్టి కేశవరావు వంటి కవులను మింగేసినట్టుగానే విమర్శ మూర్తిగారిని మింగేసింది – ఆయన అంతరంగంలో అంతటి కవి కాబట్టే సుప్రసిద్ధ ఒరియా కవి జయంత మహాపాత్ర కవితలను హృదయానికి దగ్గరగా అనువదించగలిగారు. ఈ అనువాద కవితలను ఒకటి సాహిత్య అకాడెమీ ప్రచురించగా, మరొకటి పాలపిట్ట ప్రచురించింది.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన నోబెల్‌ సాహిత్య పురస్కార విజేతల ప్రసంగాలను, ‘నోబెల్‌ సాహిత్య పురస్కార ఉపన్యాసములు’ పేరుతో తెలుగులోకి అనువదించి ప్రపంచ రచయితల భావధారను తెలుగు ప్రజలకు పరిచయం చేసారు. వీటన్నింటికీ మించి తన జీవిత సాఫల్య కృషి ఫలితమా అన్నట్టుగా ఆయన 2014లో వెలువరించిన ‘తెలుగు వచన శైలి’ గ్రంథం దాదాపు వెయ్యి పుటలతో తెలుగు భాషలో ప్రవర్తిల్లిన వచనశైలీ విన్యాసాలను తనదైన శైలిలో ఆవిష్కరించింది.

కేంద్రంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పేరుమీద వున్న ఫెలోషి్‌పకు ఎంపికయిన ఒకే ఒక తెలుగు రచయిత నరసింహమూర్తి గారు. నెలకు యాభైవేల రూపాయల గౌరవ వేతనంతో ‘భారతీయ ధార్మికత’ మీద ఆయన చేస్తున్న రచన మధ్యలోనే ఆగిపోవడం గొప్ప లోటు.

తెలుగు నేల మీద కవులూ, రచయితలకూ మరణాంతరం పేరొస్తుందన్న మహాకవి శ్రీశ్రీ మాట నిన్న గురజాడకు వర్తిస్తే, నేడు నరసింహమూర్తికి వర్తిస్తుంది. రెండు అట్టల మధ్య అందమైన అబద్ధాలను, ఇదివరకే ఎవరో రాసిన, చెప్పేసిన, అంశాలనే పునఃపునః ప్రదర్శించే ఎత్తిపోతల సిద్ధాంత గ్రంథాలకు ఎం.ఫిల్‌, డాక్టరేట్లు ప్రదానం చేసే, తెలుగు రాష్ర్టాల్లోని విశ్వవిద్యాలయాలకు నరసింహమూర్తి లాంటి పరిశోధక ప్రభాకరుడు కనిపించరు. కేవలం అకాడెమీ అవార్డులే కాదు, డి.లిట్‌ లే కాదు, తెలుగు సాహిత్య విమర్శకు ఆయన చేసిన సేవకు పద్మశ్రీలు ఆయన పాదాలముందు వినమ్రంగా చేతులు కట్టుకు నిలబడాల్సిందే! అందుకు తెలుగు సమాజం, సాహిత్యం ఇంకా ఎంతో ఎదగాల్సి వుంది.
 శిఖామణి
98482025261
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారతీయ భాషలకు -అనువాదం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేపాల్ లో లక్షన్నర ఇళ్ళు ధ్వంసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-18

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-18

నూతన ఆవిష్కరణ-ప్లాస్టిక్ మీడియం సిద్ధాంతం

అప్పటిదాకా రామయ్యగారికి ప్లాస్టిక్ మీడియం మాత్రమే తెలుసు .ఇప్పుడు మోటార్ లూబ్రికంట్ ల రాజ్యం ‘’రెజీం ‘’కు  సంబంధించిన లెక్కల షీట్లు అధ్యయనం చేశారు .అప్పుడు మనసులో అనిపించింది ‘’రామా !ధన్యుడివి .అభినందనలు .అసలైన తగిన మాటను ఉపయోగించావు .ఇప్పటి దాకా ఆకాశ విహారం చేశావు ఇక చాలించి నేలమీదకు దిగి అసలైన ఆలోచనలను చేయి .నీ శక్తి సామర్ధ్యాలను రుజువు చేసుకో .నువ్వు చెప్పిన ,కనుగోన్నదాన్ని నువ్వే నిరూపించాలి .దానికి తగిన వాదం తయారు చేసుకో .ఇలాంటి చిన్న బీజం నుండే మహోన్నత వృక్షం పెరుగుతుందని నమ్ము ‘’అని అంతరాత్మ ప్రబోధించిన అనుభూతి కలిగింది .’’దీని కీర్తి అంతా నాలోని వాడికే దక్కాలి ‘’అనుకొన్నారు ..అతను తాను  చేసిన దాన్ని మెచ్చుకోవటమేకాకుండా దానికి సంబంధించిన సిద్ధాంతం రాయమని గోల చేస్తున్నాడు .ఇతరులు మెచ్చేట్లుగా రాయాలి ,ఒప్పించేట్లుగా ఉండాలి .రవీంద్ర లాంటి వారి మాటలు జనం వింటారు .అయినా తన’’ డిసర్టేషన్’’అందరికి నమ్మకం కలిగించాలికదాఅని గుంజాటన పడ్డారు .కొత్తది ఎప్పుడూ కొత్తదే .యుద్ధం పూర్తీ అయిన తర్వాత రామయ్య గారు  ఈ నూతన సిద్ధాంతాన్ని సమర్ధింప జేసుకొని పేరుపొందారు .

కొత్తది కనిపెట్టటం ఆనందాన్ని ఇవ్వటమేకాక సైంటిస్ట్ కు  దురద్రుస్టాన్ని  తెచ్చి పెడుతుంది అన్నారు రామయ్య ..ఎందుకంటె ఒక కొత్త ఆవిష్కారం జరిగినప్పుడు ఒక శిఖరం మీద ఉండిపోవటమే కాని ఇక అంతకంటే అతను ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉండదు .అంటే ఒక సమతల ప్రదేశాన్ని చేరుకోన్నట్లే .మళ్ళీ అలాంటిది ,లేక అంతకంటే గొప్ప   విషయం కనిపెట్టే అవకాశం రాక పోవచ్చు .ఇలా రామయ్య గారు అనుకొంటుంటే రాజేంద్ర ఆయన చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారని నవ్వేసి ‘’ప్రజలు మిమ్మల్ని చూసి అసూయ పడేట్లుగా అద్భుత విషయం కనిపెట్టారు .గొప్పనూతన  ఆవిష్కరణ  చేశారు మీరు .ఇంతకంటే మీకేం కావాలి సార్ !రెండోమాట కావాలని ఆలోచిస్తున్నారా ?అది దానంతటికి అదే వస్తుంది . ఆ మాట  రావాలంటే మీరు మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది .’’అన్నాడు అతను చెప్పింది నిజమనిపించింది రామయ్య గారికి .ఇక ఆ విషయంపై ఆలోచించలేదు ‘’.ఈ జన్మకు ఇది చాలు ‘.ధన్యుడిని .జన్మ సార్ధక మైంది ‘’అనుకొన్నారు మనస్పూర్తిగా .జీవితకాలమంతా కృషి చేసి సాధించిన అపూర్వ విషయం ఇది అనిపించింది .ఈ నవీన ఆవిష్కరణ తర్వాత తనను  నిత్యం గతం లోకి లాక్కు వెళ్ళే అందమైన పడవ అనిపించింది  ఆ స్మృతి .అంత తియ్యగా ఉండేది .ముందుకు నడవకుండా వెనక్కే పడవ ప్రయాణం చేయటం బాధగా ఉండేది .

కేమోటాలజి పిత

ప్లాస్టిక్ మీడియం సిద్ధాంతం కనుక్కొన్న తర్వాత ఇక తన జీవితం లో ఏ ముఖ్యమైన ,ఆసక్తికర సంఘటన జరగ దేమోననుకొన్నారు  కాని రాజేంద్ర చెప్పిన’’ బీజమే వృక్షమవుతుంది ‘’ అన్నమాట మనసులో మెదులుతూనే ఉంది అది  వృధాకాలేదు .దీనితో సైన్స్ లో కొత్త అధ్యాయం ఆరంభమైంది .కొంతకాలం గడిచిన తర్వాత దానికి ‘’ కేమొటాలజి’’ అనే ఒక ప్రత్యేక మైన పేరు వచ్చింది .’’అదే మోటార్ ఆయిల్స్ కు సంబంధించిన రసాయన శాస్త్రం అయింది ‘’. మండే లూబ్రికంట్ పదార్ధ  స్వభావాలను విచక్షణతో ప్రయోగించే సాంకేతిక శాస్త్రం గా రూపు దిద్దుకోన్నది .దీన్ని సమర్ధించిన వారు వ్యతిరేకించిన వారూ ఏర్పడ్డారు .కాని అందరూ ఈ భావాన్ని అంటే ఐడియాను మాత్రం అంగీకరించారు .అదే ముందడుగు అయింది .బీజం క్రమగా అంకురించి మొలకెత్తి మహా వృక్షం గా ఎదిగిపోయింది. దాని విస్తరణను ఎవరూ ఆపలేక పోయారు .ఈ మహా వృక్షానికి కొమ్మలు రెమ్మలూ ఏర్పడ్డాయి .అన్నీ కలిసి అద్భుత ఫలితాల ఫలాలను అంద జేశాయి .లూబ్రికంట్ చరిత్రలో విప్లవమే వచ్చింది .అది మంచికి మార్గ దర్శనం చేసింది .కొత్త ఆలోచన ఆచరణ లోకి వచ్చి ఘన విజయాలను అందించింది . అందుకే రామయ్యగారిని ‘’కేమోటాలజి పిత ‘’-father of chemmotology’’అయ్యారు . ఈ విధానానికి మెచ్చి ‘’జాతీయ బహుమానం ‘’(స్టేట్ ప్రైజ్ )ను ప్రకటించారు .ఇక దీన్ని ఉత్పత్తి చేసి , పరీక్షించి నిగ్గు తేల్చుకోవాలి . ఇవి  వేరే ఇన్ష్టిట్యూట్ లలో జరగాలి ‘’ధీరీ’’ రామయ్య గారిది ప్రాక్టికల్ విజయం వారు సాధించి చూపాలి .

పరీక్షా విధానం

రామయ్యగారు ,చీఫ్ ‘’నూర్న్’’ కలిసి ఓల్గా తీరం లోని నిర్మాణ సంస్థ దగ్గరకు వెళ్ళారు .ఇద్దరికీ విరుద్ధమైన భావాలున్నా ఇక్కడ ఈ విషయం లో కలిసి పని చేయటం తమాషా అనిపించింది .పరీక్షించే యూనిట్ లోకి వీరిద్దరిని పంపుతూ దాని డైరెక్టర్ వాళ్ళిద్దరిని ఒక సారి చూసి ఒక చిరునవ్వు నవ్వి ‘’మీ ఇద్దరివి రెండు దృఢమైన పిడికిళ్ళు .అంతమాత్రాన మీ రిద్దరూ పోట్లాడుకొంటారని నాకు అనిపించటం లేదు .మీ ఇద్దరి ద్రుష్టి చాలా ఆకర్షణీయంగా ఉంది .మీకు విజయోస్తు ‘’అన్నాడు ఆశాభావమైన దీవెనతో . చేసిన పరిక్షలు విజయ వంతమైనాయి. తనకు అక్కడ కావాల్సింది  టెక్నాలజీ లో బాగా జ్ఞానం ఉన్న వారు కాదు .వాళ్ళ కమీషన్ లోనే రామయ్య గారి సిద్ధాంతాన్ని నమ్మని వారున్నారు .ఈ స్పెషలిస్ట్ లు ఆ మధ్యనే గ్రాడ్యుయేట్ లయిన వారు .రామయ్య గారికి వ్యతిరేకమైన ,ప్రాభవం ,పట్టూ ఉన్న వారి సంస్థలలో చదివి ఇక్కడ చేరిన  వారే వీళ్ళు .ఏమైనా ట్రయల్స్ సక్సెస్ అని చెప్పేశారు .రామయ్యగారు ,నర్మ్ ఇద్దరూ అక్కడినుంచి బయల్దేరి ఆనందం గా విజయ విలాసంగా మాస్కో చేరారు  .

రామయ్యగారు ఆ తిరుగు ప్రయాణాన్ని మనసులో భద్రం గా దాచుకొన్నారు. అది చిరస్మరణీయం గా ఉండిపోయింది .వెంటనే వచ్చిన ఆదివారం నాడు నర్మ్ తో బాటు మాస్కో-వోల్గా కాలువలో షిప్ లో ప్రయాణం చేశారు.చాలా ఆహ్లాదమైన యాత్రత అది .కాలువకు ఇరు వైపులా చెట్లు  శిశిర  శోభను సంతరించుకొని కను విందు చేశాయి పసుపు ఎరుపు ,ఊదా రంగుల ఆకులు రాలి పడుతున్నాయి . నిశ్శబ్దం గా ఉంది ప్రక్రుతి .ప్రకృతి ఇద్దర్ని పరవశుల్ని చేసింది .అనుభవించిన సంతోషం,,ప్రశాంతత శాశ్వతంగా మనసులో నిలిచిపోయాయి .ఆ ప్రశాంత సమయం లో నర్మ్ తన జీవిత చరిత్రను రామయ్యగారికి వివరంగా చెప్పాడు.ఆయనదీ తనలాంటి బతుకే అనిపించింది .ఆయన బీద ఈస్టోనియన్ రైతు కుటుంబం నుంచి వచ్చాడు.పని బరువు అతి చిన్నతనం లోనే తెలిసినవాడు .తనలాగానే ప్రపంచం సగం చుట్టి వచ్చిన వాడు .బాగా చదివుకొని ఏదో ఆకాశం లో ఆశగా విహరించాలని కాకుండా ప్రయోజన కరమైన కార్యం లో పని చేస్తున్నందుకు సంతృప్తిగా ఉన్నాడు .

చేతికి దక్కని ప్రైజ్ –ఆవరించిన నిరాశ

ఇంత ఆనందం అనుభవించిన  వీరిద్దరికీ  ఇన్ ష్టి ట్యూట్ లో చేదు అనుభవం ఎదురైంది .డైరెక్టర్ వాళ్ళిద్దరూ ఎందుకు ట్రయల్ ప్రోటోకాల్ పూర్తికాకుండా వచ్చారని ప్రశ్నించాడు .ప్రోటోకాల్ ను తర్వాత పంపిస్తామని,కమిషన్ లో అందరి సంతకాలు కాలేదని అయిన తర్వాత రిపోర్ట్ పంపిస్తామని అక్కడ వారు చెప్పారని వివరించారు  .డైరెక్టర్ తల అడ్డంగా ఊపాడు .’’సమయం మించిపోతోంది కుర్రాళ్ళారా  !’’ఆన్నాడాయన . నిజంగానే ఆయన అన్నట్లు సమయం గడిచిపోతోంది వేగంగా .డాక్యుమెంట్లు రావటానికి మరి కొద్ది రోజులే మిగిలాయి .ఈ లోపల అవి రాకపోతే ప్రైజ్ కమిటీకి వాటిని అందజేసే టైం దాటిపోతుందని భయం గా ఉంది అందరికి .కాని అదే జరిగింది . ఆనందంగా ఉన్న వారందరికీ నిరాశే మిగిలింది .పొందిన ఆనందం, సంతోషం ఒక్క సారిగా ఆవిరైపోయాయి .

రోజులు గడిచిపోతూనే ఉన్నాయి కాని ప్రోటోకాల్ రాలేదు .నర్మ్  టెస్ట్ లు జరిగిన ప్రదేశానికి వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చాడు .కమిటీలో ఇద్దరు సభ్యులు రామయ్యగారి సిద్ధాంతాన్ని అంగీకరించ లేదని  మళ్ళీ ప్రయోగాలు జరపాలని సూచించి నట్లు తెలిసింది .మిగిలిన సభ్యులందరూ రామయ్య గారి సిద్ధాంతాన్ని పూర్తిగా సమర్ధించారు .మళ్ళీ ఒక డేటా అందజేస్తే చాలని తెలిపారు .అప్పుడు వాళ్ళు సరైన దారిలో పరిశోధన చేశారని తెలుస్తు౦దట .నర్మ్ కు ఇదంతా ఒక ఫార్సుగా అనిపించి విపరీతమైన కోపం వచ్చింది .అభిప్రాయ భేదం రావటం ఏమిటని విరుచుకు పడ్డాడు .ఆయన అన్నది కరెక్టే .ఎందుకంటె ఇప్పటికే  వచ్చిన ఫలితాలు చాలు అభిప్రాయాలు ఏర్పరచుకోవటానికి.కాని ఆయన తీవ్ర పదజాలం సమస్యను మరింత జటిలం చేసింది .మళ్ళీ ప్రయోగాలు చేయాలని వారు నిర్ద్వంద్వంగా ప్రకటించేశారు .అంతలో ప్రైజ్ కమిటీ ముందు డాక్యు మెంట్లు అందజేసే సమయం అప్పటికే దాటి పోయింది ..డైరెక్టర్  భయపడింది సరైనదే అని రుజువైంది తర్వాత  .ఈ విఫల యత్నం సఫలంయ్యేలోగా నర్మ్ తీవ్రంగా అస్వస్థతకు గురైనాడు.

విజయం పొందిన రామయ్య గారి సిద్ధాంతం

.రామయ్యగారికి సంతోషం ప్రశాంతత దక్కలేదని అభిప్రాయ పడ్డారు .అది చాలా కష్టం అనిపించింది .వీరిద్దరికీ ఆ ప్రైజ్ దక్కలేదు .అది దారుణం అనిపించినా, విధి కృతం అనుకొన్నారు .సైన్స్ కు సంబంధించినంత వరకు దానికేమీ నష్టం లేదు . రిసెర్చ్ లు క్రమంగా జరుగుతూనే ఉన్నాయి .రామయ్య గారి కొత్త సిద్ధాంతం నవీనం గానే పేరు పొంది ఆ పేరు కొనసాగిందికూడా ప్రయోగాలు జరిగి జరిగి చివరికి రామయ్య గారిదే రైట్ అయింది .అని దాన్ని వ్యతిరేకించిన వారు ఓడిపోయారు .రామయ్య ఘన విజయం పొందారు .

ఒక రోజు నర్మ్ తిరిగి వచ్చాడు .ఆయన ముఖం లో కళా కాంతులు కనిపించలేదు. నిరాశలో ఉన్నట్లు అనిపించింది రామయ్య గారి అమ్మాయి సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం  చదువు కొంటున్నది .ఆమె క్రిలోవ్ రాసిన నీతికధ బట్ట్టీ పడుతోంది .ఈ కధలో ఒక చిన్న కుక్క ఇంకో బుల్లి కుక్క ఏనుగును చూసి మొరుగుతుంటే  ‘’నువ్వేదో మొరుగుతున్నావు ఆ ఏనుగుదాన్ని పట్టించుకోకుండా  దాని దారిన అది పోతోంది చూడు  ‘’అని చెపుతుంది. అది విన్న రామయ్య గారు ‘’అమ్మా !క్రిలోవ్ చెప్పింది చాలా నిజం ‘’అన్నారు .దీనితో మనసులో ఉన్న కొంత టెన్షన్ తగ్గి వాతావరణం తేలిక పడింది .మర్నాడు అనుకోని వ్యక్తీ ఒకతను వచ్చి తన స్వంత ఇంటికి వచ్చానన్న ఆనందం తో చేరి కొంత సుఖాన్ని పొందాడు .అతనే అలెక్సీ మైఖేలోవిచ్ డియకోవ్  .మూడ్ పాడైనప్పుడల్లా అతను అనుకోకుండా వచ్చి సంతోషం పంచి  వెడుతూ ఉండేవాడు .ఇదొక రిలీఫ్ గా ఉండేది రామయ్యగారికి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-17

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-17

లూబ్రికంట్స్ లో విప్లవం

ఎకడమీషియన్ రవీంద్ర ‘’ఒక మనిషి ఒకటే మాట చెప్పాలి .అంటే రెండు పదాల సూత్రం మాత్రమె ఉండాలి ‘’అని చెప్పిన మాట సహజమే నని పించింది రామయ్య గారికి .కొత్తది కనిపెట్టటం (డిస్కవరీ )అనేది ఎప్పుడూ ఒక తరహా సూత్రమే .ప్రపంచ ప్రసిద్ధ శాత్ర వేత్త లందరూ ఒకటి రెండు మాటల్లోనే వారి పరిశోధనా ఫలితాలను తెలిపారు .న్యూటన్ ‘’గురుత్వాకర్షణ శక్తి ‘’,డార్విన్ ‘జాతుల పుట్టుక ‘’,పవ్లోవ్ ‘’కండి షండ్ రిఫ్లెక్స్ ‘’ఐన్ స్టీన్ ‘’సాపేక్ష సిద్ధాంతం ‘’, దీనికి ఉదాహరణలు అన్నారు రామయ్య .జీవితం మాత్రం అందరికి  ఒకటే .రామయ్యగారు చాలా విలువైన పనే చేస్తున్నారన్నాడు రవీంద్ర .ప్రతి మనిషిలో అనేక మంది వ్యక్తులుంటారు .వారందరూ ఎవరి కర్తవ్యాన్ని  వారు నేరవేరుస్తుంటారు అన్నారు  రామయ్య .తన శక్తి యుక్తులనన్నిటినీ సంస్థాగత నిర్వహణకు ,సాంకేతిక సామర్ధ్యానికి వినియోగిస్తున్నానని భావించారు .మిగతా కాలమంతా ప్రత్యేక  ప్రయోగాల నిర్వహణ ,వాటిని ప్రాముఖ్యంమైన వాటిలో ఉపయోగ పడేట్లు చేయటం . ఇదే సమయం లో తనలోని మరో వ్యక్తి తాను చేసిన పనిని సామాన్యీకరించేవాడు అన్నారు .ఈ రెండవ వ్యక్తియే మోటారులోని ఉపరితల ఘర్షణ కు ,కార్డాన్ షాఫ్ట్ ,బాల్ బేరింగ్ లకు మధ్య ఏం జరుగుతోందో అనే దానిపై ఆసక్తి చూపేవాడేట .ఈ మనిషే ఆయన జీవితం లో అన్ని ప్రయోగాలకు కింది అధికారిగా ఉండి (సబార్డినేట్ ) తనకు తెలీయకుండానే ఏర్పడే ప్రశ్నలన్నిటికి సమాధానాలు కనుక్కోనేవాడట .రెండవ సారి రామయ్య గారి పై బడిన ఇంసిడియరి బాంబ్ ఘటన తర్వాత లూబ్రికంట్స్  లో వేర్వేరు స్థాయిలలో జరిగే చలనాలలో జరిగే మార్పులను అర్ధం చేసుకోవటానికి వీలు కలిగించింది అంటారు .ఆ బాంబు రామయ్యగారి లోపలి వ్యక్తిలో’’ బల్బ్ వెలిగించాడ’’న్నమాట .

ఆ రోజు సాయంత్రం మెట్రో రైల్ లో రామయ్య ప్రయాణం చేస్తున్నారు .ఎస్కలేటర్ వద్ద రద్దీ గా ఉంటె కాసేపు ఆగి జనం తగ్గిపోగానే ఎస్కలేటర్ ఎక్కారు .అక్కడ ఆగి ఉన్న ప్పుడు జనం తలకాయల్ని లేక్కేశారు .ఎస్కలేటర్ దగ్గరకు చేరినప్పుడు హాయిగా స్వేచ్చగా ఉన్నజనం ,అది ఎక్కినప్పుడు అటూ ఇటూ క్రమపద్ధతి లేకుండా ఊగుతూ కదలటం గమనించారు .ఇది అచ్చంగా’’ బ్రౌనియన్ మువ్ మెంట్’’ లో మాలిక్యూల్స్ కదలిక లాగా ఉందని పించింది ఫ్లాష్ గా .ఇది వరకు ఎన్నో సార్లు ఎస్కలేటర్ ఎక్కి వెళ్ళారు. కాని ఈ సారి మాత్రమే ఈ ఆలోచన రావటం విరుద్ధం గా పారడాక్స్ లాగా ఉందని పించింది .ఆశ్చర్యమేసింది .జనం అంతా ఒకే చోట స్తిరంగా ఉండటం ,కాని పూర్తీ సామర్ధ్యం తో కదలటమే ఇందులో తమాషా .ఒక్కసారిగా మనసులో ఏదో తళుక్కున భావం పొడమరించింది .తాను  చేస్తున్న ప్రయోగాలకూ దీనికీ ఏదో సంబంధం ఉండనుకొన్నారు . కొత్త ఆలోచనేదో ఒక్కసారిగా తట్టింది దీని సారాంశమే లూబ్రికంట్స్  లో ఏమి జరుగుతోందో తెలుసుకోవటానికి తోడ్పడింది అంటారు  రామయ్య .ఒక ఐడియా జీవితాన్నే  మార్చేస్తుంది అన్నట్లు  రామయ్య గారి ఆలోచన లూబ్రికంట్స్ లో విప్లవాన్నే తెచ్చింది .కారణాలు నిబంధనలకు దారి చూపుతాయి .మాలిక్యూల్స్ అవి ఉండే పరిస్తితులు ,వాటిలో వచ్చే చర్యలు పై ఆధార పడతాయి .ప్రతి చర్య ఫలితంగా అవే ,నిబంధనను మారుస్తాయి .ఈ ఆలోచన మెరపు వేగం గా రామయ్యగారికి తట్టింది. సమస్య పరిష్కారానికి దోహదం చేసింది .కళ్ళముందు అదంతా సినిమా రీల్ లాగా కనిపించింది .విపరీతమైన భావోద్రేకానికి గురై ఇంటికి చేరుకొన్నారు .ఒక సమాధి స్తితిలో ఉండిపోయి కోటుకూడా విప్పదీయకుండా ,తోచిన వివరాలను క్లుప్తంగా మననం  చేసుకొని  మనసులో స్తిరమైన భావన నేర్పరచుకొన్నారు .వాటి పర్యవసానాలను రాసి పెట్టారు .’’the lubricant is a special plastic medium ‘’అనేది ఈ ఆలోచనల మొత్తం  సారాంశం .అది ఒక స్వతంత్ర వ్యక్తిత్వం గల సమ్మేళనం ‘’(it is a compound of integrity and plasticity ‘’) గా నిర్దారించుకొన్నారు రామయ్య .అందులోని మాలిక్యూల్స్ ల పరస్పర చర్యలు వాటి ధర్మాల పై ఆధార పడి ఉంటాయి కాని ప్రతి క్రియ అంటే రియాక్షన్ ఆ గుణాలనే  మార్చేస్తుంది .అదీ ఇక్కడున్న తమాషా .కనుక దీనిని బాగా అర్ధం చేసుకోనేట్లు చెప్పటానికి కొత్త పద సృస్తి,కొత్త గుణాత్మక వివరణ ,అందుకోవటానికి కొత్త  విధానం ఏర్పడాలి  .పాత గణిత సూత్రాలేవీపని చేయవిక్కడ .అలాంటి మీడియం కాలం కూడా ప్రత్యేకంగా ఉంటుంది  .ఆ స్పెషల్ టైం నే ‘’లేటేంట్ పీరియడ్ ‘’అన్నారు .ఈ కాలం లో జరిగే మార్పులు అర్ధమయ్యేట్లు వివరించాలి .దీనితో రామయ్య గారికి పూర్వం తాము ఎక్కడ పప్పులో సారీ తప్పులో కాలేశారో తెలిసింది .తర్వాత రామయ్య గారు మిగిలిన రిసెర్చ్ విద్యార్ధులు కలిసి కూర్చుని మీడియం పై మౌలిక భావన అంటే కాన్సెప్ట్ ను సాధించారు .దీన్ని గురించి రామయ్య గారు చెబుతూ ‘’In our calculations and formulations this was an abstract volume within whose limits ,like fish in an aquarium ,the moved periodically ,sometimes colliding and coming into contact .Actually every thing was the other way .The medium was the property of these molecules .It just like the molecules in their interaction .’’అని స్పష్టంగా అందరికి అర్ధమయ్యేట్లు వివరించారు . ఈ ఆలోచనలన్నీ బాంబు ప్రేలుడు సంఘటనల ద్వారా వచ్చినవే నంటారు .ఇంతటితో అయిపోలేదని తాను వెంటనే ఆలస్యం చేయకుండా  సంవాద రూపాన్ని అంటే’’ interlocutor’’ ను కనుక్కోవాలని అన్నారు .అంటే ఇతరులకు చెప్పి అభిప్రాయం తెలుసుకోవాలని ఆయన భావం .’’యురేకా యురేకా ‘’అని ఆర్కిమిడీస్ లాగా బట్టలు లేకుండా రోడ్లవెంబడి పరి గేత్తలేదుకాని, రామయ్య గారు మహా ఉత్సాహం గా అదే భావోద్రేకం తో  పరిశోధనా ఫలితం సాధించినందుకు ఇంటికి పరిగెత్తుకొచ్చి తలుపు తట్టారు .తన ఇంట్లో ఉంటున్న ఇంజినీర్ గారు లేరు ఇంజినీర్ భార్య పని చేసి అలసట తో నిద్ర పోతోంది .మంచీ మర్యాదా పాటించకుండా రామయ్య  ఆమెను  నిద్ర లేపి క్లుప్తంగా తానూ సాధించింది తెలిపారు .ఆమె కంగారులో తల ఊపుతోంది అర్ధంకాక .తానూ సరిగ్గా ఆలోచిస్తున్నాడా లేదా అని చెప్పటానికి తగిన వ్యక్తీ లేడు.తనను తానే సంబాళించుకొని తాను  సరైన  ఆలోచనలను సరైన మార్గం లోనే చేస్తున్నాను అని సంతృప్తి పడ్డారు .ఇంజినీర్ భార్య రామయ్యగారు కోటుకూడా విప్పలేదని గుర్తు చేసింది .సిగ్గుపడ్డారు .అప్పుడు స్పృహలోకి వచ్చి తాను ఎంచేశారో తెలుసుకొన్నారు .ఆమె వెంటనే వంటగదికి వెళ్లి టీ పెట్టి తెచ్చింది .బ్రెడ్ జామ్ ఇచ్చి తినమంది ‘’అన్నయ్యా !ఇలాంటిఒక శుభ సందర్భం వస్తుందనే వాటిని జాగ్రత్తగా దాచి ఉంచాను .ఇప్పుడు అవకాశం వచ్చింది .వాటిని తీసి తిందాం .మీ పరిశోధనా ఫలితా విజయాన్ని ఉత్సవం గా ఇప్పుడే చేసుకొందాం .మీరు కనిపెట్టిన విషయం సాధారణమైనదికాడు .మీ మేధస్సు అమోఘం .కూర్చోండి .రిలాక్స్ అవ్వండి .ఆనందంగా ఈ శుభ ఘడియలను పంచుకొందాం ‘’అన్నదామె

ఇద్దరూ జామ్ నంజుకొంటూ రొట్టె తిని టీ తాగి గొప్ప అనుభూతికి లోనయ్యారు .ఈ సంఘటన తానెప్పుడూ జీవితం  లో మరచిపోలేదని రామయ్య గారు చెప్పేవారు .ఆ జామ్ రోజూకంటే రుచిగా ఉందట .దానికి కారణం దయగల  యా ఇంజనీర్ గారి ఇల్లాలు  పవిత్ర హృదయం తో ,ఆత్మీయంగా ఇచ్చి౦ది కనుక అంత గొప్ప రుచిగా ఉందట రామయ్య గారికి .రామయ్య గారు అంటే నిలువెల్లా కృతజ్ఞత నిండిన మహోన్నత వ్యక్తీ అని పిస్తుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-15 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1949లో ప్రారంభమైన మోపిదేవి హైస్కూల్ -లో మేనెల 1,2,3, తేదీలలో జరిగిన ”65 వసంతాల పూర్వ విద్యార్ధుల అపూర్వ ,ఆత్మీయ కలయిక మరియు గురు సత్కారం” -రెండవ రోజు మే2 వతేదీ శనివారం నాటి దృశ్యాలు 

1949లో ప్రారంభమైన మోపిదేవి హైస్కూల్ -లో మేనెల  1,2,3, తేదీలలో జరిగిన ”65 వసంతాల పూర్వ విద్యార్ధుల అపూర్వ ,ఆత్మీయ కలయిక మరియు గురు సత్కారం” -రెండవ రోజు మే2 వతేదీ శనివారం నాటి దృశ్యాలు jnapika mopidevi 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుస్తకం ఎలా పుట్టింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపర శబరి పోకల దమ్మక్క

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆచారాలు – విశ్వాసాలు -అరవిందరావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సూత మహర్షి పాద స్పర్శ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మేడే నాడు”బావమరది ఆనంద్ ” ఫ్యామిలి మా ఇంట్లో

మేడే నాడు”బావమరది ఆనంద్ ” ఫ్యా

మిలి మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మోడీకి అంతశ్శత్రువులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వంగసీమ ‘పంచాయతీ’…

వంగసీమ ‘పంచాయతీ’…

  • 01/05/2015
TAGS:

పశ్చిమ బెంగాల్ పురపాలక నగర పాలక మండలులకు జరిగిన ఎన్నికలలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం ఆశ్చర్యకరం కాదు. మమతా బెనర్జీ పట్ల బెంగాల్‌లోని అట్టడుగుస్థాయి ప్రజలకు అభిమానం పెరగం ఈ ఘన విజయానికి కారణం! ఇలా పెరగడానికి ప్రధాన కారణం గత శాసనసభ ఎన్నికలలోను, లోక్‌సభ ఎన్నికలలోను తృణమూల్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ప్రచారం పొందిన భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ పలుకుబడి పతనమైపోతుండడం! 2011 నాటి శాసనసభ ఎన్నికలలో మార్క్సిస్టు పార్టీ వారికి ఓట్లు వేసిన వారిలో చాలామంది ఆ పార్టీకి దూరం అవుతుండడం నాలుగేళ్ల చరిత్ర! ఇలా దూరమవుతున్నవారిలో అత్యధికులు తృణమూల్ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారన్నది స్థానిక సమర ఫలితాల వల్ల నిగ్గుతేలిన నిజం. ఇలా మార్క్సిస్టు పార్టీకి వామపక్షాలకు దూరమైన వారిలో అత్యధికులు 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ వోటర్లుగా మారారన్నది నిర్ధారిత నిజం. అందువల్లనే భాజపా వోట్ల సంఖ్య అప్పుడు పదిహేడు శాతానికి పెరిగాయి. అయితే జాతీయస్థాయి ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు మధ్య ఉన్న తేడా ఇప్పుడు మరింతగా ప్రస్ఫుటించింది. 2014 నాటి లోక్‌సభ ఎన్నికల స్థాయిలో ప్రస్తుతం భాజపా విజయం సాధించలేకపోయింది. నలబయి రెండు లోక్‌సభ స్థానాలలో రెండింటిని కైవసం చేసుకున్న భాజపా అప్పుడు మార్క్సిస్టు పార్టీతో సంఖ్యా సమానత్వం సాధించగలిగింది. మార్క్సిస్టు పార్టీకి కూడ లోక్‌సభ ఎన్నికలలో రెండు మాత్రమే దక్కాయి. పెరుగుతున్న పార్టీగా భాజపా, అంతరించి పోతున్న పక్షంగా మార్క్సిస్టు పార్టీ లోక్‌సభ ఎన్నికలలో పేరుగాంచాయి. ఈ పెరుగుదల-్భజపా వారి పెరుగుదల-ఇప్పుడు జరిగిన స్థానిక సమరంలో ప్రస్ఫుటించకపోవడానికి ప్రధాన కారణం లోక్‌సభ ఎన్నికల సమయంలోను, పురపాలక సంస్థల ఎన్నికల సమయంలోను వోటర్లు విభిన్నమైన సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం కావచ్చు! ఈ ప్రాధాన్య తారతమ్యం మరోసారి తృణమూల్ కాంగ్రెస్‌కు ఘనవిజయం చేకూర్చిపెట్టింది. మమతా బెనర్జీ ‘నియంతృత్వం’ గురించి కానీ, తృణమూల్ కాంగ్రెస్ వారి ‘రాజకీయ దౌర్జన్యం’ గురించి సామాన్య వోటర్లు పట్టించుకోలేదని ఈ ఎన్నికల ఫలితాలవల్ల మరోసారి ధ్రువపడింది! అంతేకాదు ‘శారద’ చిట్‌ఫండ్ అవినీతిలో తృణమూల్ పార్టీకి సంబంధం ఉందని జరిగిపోయిన ప్రచారం కూడ వోటర్లను ప్రభావితం చేయలేదు! వర్ధమాన్ జిల్లాలో బంగ్లాదేశీయ ఉగ్రవాదులు జరిపించిన బీభత్స కలాపాలను, రాష్టమ్రంతటా చాపకింది విషంలా విస్తరించిన జిహాదీ విద్రోహులను నిరోధించడంలో జరిగిన వైఫల్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే చెందదని కూడ ఈ ఎన్నికల ఫలితాలవల్ల తేటతెల్లమైంది! అందువల్లనే తృణమూల్ ఘనవిజయం సాధించింది!
ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న రాజకీయ పట్ల సహజంగా వ్యతిరేకత ఏర్పడడానికి ఎంతకాలం పడుతుందన్నది కూడ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక ఎన్నికలో ఘనవిజయం సాధించిన పార్టీ పట్ల క్రమంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. అందువల్లనే పదేళ్లపాటు అధికారం నిర్వహించిన పార్టీల పలుకుబడి తగ్గుతోంది! ఇలా తగ్గడంవల్ల చట్టసభలలో ఆయా పార్టీలకున్న సంఖ్య మాత్రమే తగ్గుతుందా? లేక మెజారిటీ కోల్పోవడం జరుగుతుందా? అన్నది తగ్గుదల తీవ్రతపై ఆధారపడి ఉంది! తృణమూల్ కాంగ్రెస్ పట్ల వోటర్లలో ‘అధికార వ్యతిరేకత’ ఏర్పడలేదు. లేదని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. పైగా తృణమూల్ పలుకుబడి మరింతగా పెరిగింది. వామపక్షాలకు ప్రధానంగా మార్క్సిస్టు పార్టీకి 2011 వరకు వోట్లు వేసిన వారు తృణమూల్‌కు ఈ ఎన్నికలలో వోట్లు వేసారు. భాజపా ఎదగకపోవడానికి ఇదీ కారణం. లోక్‌సభ ఎన్నికల సమయంలో వలె ‘వామ’ వోటర్లు ఇప్పుడు భాజపాకు బదిలీ కాలేదు. తొంబయి రెండు పురపాలక నగర పాలక మండలులకు ఎన్నికలు జరుగగా భాజపాకు సున్న స్థానాలలో మెజారిటీ లభించడానికి ఇదీ కారణం! లోక్‌సభా సమరాన్ని ప్రభావితం చేయగలిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణ అట్టడుగు స్థాయికి విస్తరించలేదు. ఫలితంగా వామపక్షాలకు జరిగిన నష్టం తృణమూల్ విజయ విస్తృతిని మరింత పెంచింది. 2010లో అరవై ఆరు మండలులలో సంపూర్ణ మెజారిటీ సాధించిన తృణమూల్ ఇప్పుడు డెబ్బయి ఒక్క చోట్ల విజయం సాధించడం పలుకుబడి పెరిగిందన్నదానికి ప్రమాణం! 2090 స్థానిక విభాగాలలో 1425 తృణమూల్ కైవసం కావడం పార్టీ మూలాలు మరింత బలపడినాయన్నదానికి నిదర్శనం!
తృణమూల్ పార్టీవారు శారదా చిట్‌ఫండ్ అవినీతి రెండేళ్లకు పైగా తృణమూల్ పార్టీని అప్రతిష్టపాలు చేసింది! పార్టీకి చెందిన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రులు ఇతర రాజకీయ వేత్తలు ఆరోపణగ్రస్తులయ్యారు, అభియోగగ్రస్తులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తమ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికై శారద అవినీతిలో తమ సహచరులను ఇరికించిందన్నది తృణమూల్ పార్టీ చేసిన ప్రచారం. శారద అవినీతి నిధులు వర్ధమాన్ జిల్లాలో పేలుళ్లు జరిపిన జిహాదీ టెర్రరిస్టులకు సైతం దక్కాయన్న ఆరోపణలు కూడ కొనసాగుతున్నాయి. ఈ టెర్రరిస్టులు బంగ్లాదేశ్‌నుండి చొరబడిపోయిన జిహాదీ మతోన్మాదులు! బంగ్లాదేశ్‌నుండి అక్రమంగా చొరబడిన వారిని అక్కున చేర్చుకుని వోటర్లుగా నమోదు చేయించిన ఆరోపణలు అన్ని పార్టీలకు వ్యతిరేకంగా వినిపిస్తునే ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎక్కువగా వినిపించాయి. మమతా బెనర్జీ నియంతవలె వ్యవహరిస్తోందని ప్రత్యర్థి రాజకీయ పార్టీల వారిని ప్రచార మాధ్యమాలవారిని హింసాకాండకు వేధింపులకు గురి చేస్తోందని కూడ ఆరోపణలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభావంతో భాజపా ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నది లోక్‌సభ ఎన్నికల నాటినుండి ఏర్పడిన భావం! 2016లో జరిగే శాసనసభ ఎన్నికల తరువాత పశ్చిమ బెంగాల్‌లో భాజపా ప్రభుత్వం ఏర్పడిపోవచ్చునని, లేదా అతి పెద్ద పార్టీ భాజపా అవతరించవచ్చునని ఉత్సాహవంతులు మాధ్యమాలలో ప్రచారం చేసారు. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా నైనా భాజపా శాసనసభలో అవతరిస్తుందన్నది అందరికీ కలిగిన విశ్వాసం. ఇదంతా హుళక్కి అయింది. కాంగ్రెస్ మూడవస్థానంలోను భాజపా నాలుగవ స్థానంలో, వామపక్ష కూటమి రెండవ స్థానంలో ఉండడం యథాతథ స్థితికి నిదర్శనం! భాజపా గెలిచిన వార్డుల సంఖ్య 2010నాటి 85 నుండి 186కు పెరగడమొక్కటే జరిగిన మహా పరివర్తన! వామ కూటమి బలం మరింత తగ్గడం ఆశ్చర్యకరం కాదు.
వాల్‌మార్ట్‌వంటి విదేశీయ సంస్థలు చిల్లర వ్యాపారంలో చొరబడడానికి వీలు కల్పించడం వల్ల తమ పలుకుబడి తగ్గిందని 2013లో బెంగాల్ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా వాపోయారు. 2014లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోవడానికి ఈ చిల్లర విదేశీయ వ్యాపారం కూడ ఒక కారణం! బెంగాల్‌లో ఎదిగినట్టే ఎదిగిన భాజపా మళ్లీ కూలబడడానికి కారణం భూమి సేకరణ సవరణ బిల్లు కూడ ఒక కారణం కావచ్చు! వ్యవసాయదారుల భూమిని పారిశ్రామిక వేత్తలకు అప్పగించే విధానాన్ని మమతమ్మ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ వ్యతిరేక ప్రాతిపదికగానే 2011లో బెంగాల్ శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధిం చింది. 1977 నుంచి ‘ఏలిన’ వామ కూటమి కుప్పకూలింది!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాగ్లెవ్ ట్రెయన్ ‘పట్టా’ల్లేవ్… పగ్గాల్లేవ్…

మాగ్లెవ్ ట్రెయన్ ‘పట్టా’ల్లేవ్… పగ్గాల్లేవ్…

  • 03/05/2015
  • -రామానుజం

దినపత్రికలో వచ్చిన వార్తకు సంబంధించి ‘హెడ్‌లైన్’ను చదివేలోగా మీరు ప్రయాణిస్తున్న రైలు దాదాపు 2 కిలోమీటర్ల దూరం దూసుకుపోతుంది. నమ్ముతారా..! … నమ్మాల్సిందే.. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలులో అది నిజం కనుక. భూ వాతావరణంలో ధ్వనికన్నా ఐదారు రెట్ల వేగంగా, గంటకు 7వేల కిలోమీటర్ల వేగంతో అంటే విమానం కన్నా వేగంగా దూసుకువెళ్లే రైలు భవిష్యత్‌లో మీకు సేవలందిస్తుందంటే నమ్ముతారా! మనం వెంటనే నమ్మలేకపోవచ్చు…కానీ, శాస్తవ్రేత్తలు దాన్ని నిజం చేయగలమంటున్నారు. ఆశ, తపన, నమ్మకం లేకుండా మనిషి లేడు. అందుకు ఉదాహరణే జపాన్ తాజాగా ప్రయోగించిన ‘మాగ్లెవ్ ట్రెయిన్.’ *** ఆ రైళ్లకు ఇంజన్లు, చక్రాలు ఉండవు.. అయినా భద్రంగా, అతివేగంగా గమ్యానికి మనల్ని చేరుస్తాయి.. ఆ రైళ్లు ట్రాక్‌మీద కాకుండా గాలిలో దూసుకుపోతాయ్… అయినా ప్రమాదమేమీ ఉండదు. కుదుపులు, చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా మన చేరాల్సిన చోటికి చేరవేస్తాయి. ఆ రైళ్లు పరిగెడుతూంటే… గాలిని చీల్చే శబ్దం తప్ప మరేమీ విన్పించదు. కాదు…మరే శబ్దం ఉత్పత్తికాదు. ఆ రైళ్లలో వెడుతూ అద్దాల్లోంచి బయటి దృశ్యాలను చూస్తే తప్ప మనం ప్రయాణిస్తున్న విషయం తెలీదు.. ఈ రైళ్లు కొండవీటి చాంతాడంత పొడవునా ఉండవు. బోగీల కోసం వెతుక్కోనక్కరలేదు. అంతా కలిపితే ఏడు చైర్‌కార్లుంటాయంతే. ఓ హెలికాఫ్టర్‌కన్నా…ఓ ఫార్ములావన్ రేసు కారుకన్నా…వేగంగా దూసుకుపోయే ఆ రైళ్ల పేరు ‘మాగ్లెవ్ ట్రెయిన్స్’. పదేళ్లక్రితం నుంచే ఇవి రెగ్యులర్ సేవలు అందిస్తున్నాయి. అసమాన వేగంగా, పరిమిత దూరానికి ప్రస్తుతానికి ఇవి సేవలందిస్తున్నాయి. ఈ మధ్య జపాన్‌లో జరిపిన ప్రయోగంలో గంటకు 603 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయి గతంలో తాను సృష్టించిన రికార్డును బద్దలుకొట్టిన ఆ బుల్లి మాగ్లెవ్ ట్రెయిన్ గొప్పలు అన్నీఇన్నీకావు. దాదాపు నూట పదేళ్ల క్రితమే ఈ తరహా బీజం పడినా ఎడతెగని పరిశోధనల ఫలితంగా వాటి వేగంలో వచ్చిన మార్పులు ఇప్పుడు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. మనిషి మేధోమథనం ఇలాగే కొనసాగితే విమానాల కన్నా వేగంగా, భద్రంగా మనల్ని మోసుకెళ్లే వాక్టోట్రెయిన్స్ మరో 50 ఏళ్లలో మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇంతకీ ఏమా రైళ్లు..? ఏమా కథ..? కాలంతో పరుగు ఆధునిక మానవుడికి ప్రాణం తరువాత అత్యంత విలువైనది కాలం. కాలంతో పరుగులు తీస్తూ మనోవేగాన్ని మించి దూసుకుపోవాలన్నది అతడి తపన. ఆచరణలో ఒక్కో మైలురాయి దాటుతున్నాడు. పరుగు ప్రయాణంలో వేగంగా అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచం విశ్వనగరంగా మారిపోయింది. ఒకచోటి నుంచి మరోచోటికి, ఒక ఖండం నుంచి మరో ఖండానికి రోజువారీ పర్యటనలు చేయాల్సిన స్థితికి మనిషి అవసరాలు చేరాయి. ఉక్కిరిబిక్కిరిగా, ఊపిరి సలపని పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని మనసు ఉబలాటపడుతూంటే ఆ వేగానికి తగ్గట్లు సౌకర్యాలు ఉండాలి కదా! ఆ అవసరాలు తీర్చడానికి తగిన ప్రయాణ సాధనాలను కనుగొనే పని శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది. ఇప్పుడు ఆ సాధనాల వేగం పెంచే పనిలో ఒక్కో అడుగూ ముందుకేస్తున్నాం. జపాన్‌లో మొన్న జరిగింది అదే. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మాగ్లెవ్ ట్రెయిన్ టెస్ట్ రన్ విజయవంతం కావడంతో ఆ దేశం వైపు, ఆ రైళ్లవైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. మాగ్లెవ్ ట్రెయిన్స్ అంటే… సంప్రదాయ రైళ్లు మొదట బొగ్గు, నీటి ఆవిరి, ఆ తరువాత డీజిల్, ఇప్పుడు విద్యుత్‌శక్తితో నడుస్తున్న విషయం తెలిసిందే. భారీ స్టీల్‌ట్రాక్‌లపై పెద్దశబ్దం చేస్తూ వెళ్లే ఈ రైళ్లను ఆధునీకరించి, వాటి వేగం పెంచి బుల్లెట్ ట్రైన్లుగా చెప్పుకుని మురిసిపోతాం. మనదేశంలో ఇంకా బుల్లెట్ రైళ్లు..కాగితాలపైకూడా ఇంకా పరుగులు తీయడం లేదు. కానీ, ఆసియా దేశాలైన జపాన్, చైనా,కొరియా, రెండు మూడు పాశ్చాత్య దేశాల్లో మాగ్లెవ్ రైళ్లు కాలంతో పరుగులు తీస్తూ దూసుకువెళుతున్నాయి. అయస్కాంత శక్తిని వినియోగిస్తూ నడిచే రైళ్లనే మాగ్లెవ్ రైళ్లుగా పేర్కొనవచ్చు. మాగ్నటిక్ (అయస్కాంతశక్తి), లెవిటేషన్ (గాలిలో తేలడం) అని అర్థం వచ్చినప్పటికీ అయస్కాంత శక్తివల్ల ట్రాక్‌పై తేలియాడుతూ దూసుకువెళ్లే రైళ్లుగా వీటిని అభివర్ణించవచ్చు. ఇలా రైళ్లు గాలిలో తేలుతూ వెళ్లడానికి అయస్కాంత శక్తే కారణం. అయస్కాంతంలో సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని, విజాతి ధృవాలు వికర్షించుకుంటాయని మనకు తెలుసు. రైలును ముందుకు నడిపించేందుకు, ట్రాక్‌పై బోగీలు తేలియాడేలా ఉండేందుకు ఈ సూత్రాన్ని వినియోగిస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్ (గైడ్ వే) ఉంటుంది. రైలు బోగీల కింద కొన్ని మాగ్నెటిక్ కాయిల్స్, గైడ్ వేకు ఇరువైపులా క్రమపద్ధతిలో అమరుస్తారు. అందువల్ల ఆయా కాయిల్స్ ఆకర్షించుకున్నప్పుడు రైలు ముందుకు కదులుతూంటుంది. వికర్షణ శక్తివల్ల ట్రాక్‌పై బోగీలు తేలుతూంటాయి. ఇదంతా జరగడానికి విద్యుత్‌శక్తిని ఉపయోగిస్తారు. విద్యుత్‌శక్తిని వినియోగించనప్పుడు రైలు ముందుకు కదలదు. అంటే రైలు ఆగాల్సినప్పుడు విద్యుత్‌శక్తిని వినియోగించరన్నమాట. అత్యంత వేగంగా దూసుకుపోయే రైలు వేగం నియంత్రణ కూడా విద్యుత్‌శక్తి వినియోగం ఆధారంగా ఉంటుంది. ఈ రైళ్లతో లాభాలేంటి… ప్రస్తుతం జపాన్, చైనాలు మాత్రమే పూర్తిస్థాయిలో మాగ్లెవ్ రైళ్లను నడుపుతున్నాయి. జర్మనీ, అమెరికా,బ్రిటన్, దక్షిణ కొరియా,ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు ప్రయత్నాలు, ప్రయోగాల దశలో ఉన్నాయి. వీటిలో ఒకటీ అరా దేశాలు నామమాత్రపు సర్వీసులు నడుపుతున్నాయి. వాణిజ్యపరంగా ప్రజలకు సేవలందిస్తూ రెగ్యులర్ సర్వీసులు నడుపుతున్న దేశాలు మాత్రం రెండే. అవి జపాన్, చైనా. ఈ తరహా రైళ్ల వినియోగంలో చైనా ముందున్నా వేగం, ఆధునికత విషయంలో జపాన్ అగ్రస్థానం వైపు కదులుతోంది. ఉక్కుతో చేసిన పట్టాలపై పెద్దశబ్దం చేస్తూ, ఇరుకుగా ఉండే సంప్రదాయ రైళ్లకన్నా మాగ్లెవ్ రైళ్లతో ప్రయోజనాలు ఎక్కువ. ముఖ్యంగా వీటి నిర్వహణ వ్యయం సాధారణ రైళ్ల నిర్వహణ వ్యయంకన్నా చాలా తక్కువ. పట్టాలుండవు కనుక బోగీల వాడకంలో విడిభాగాల మార్పిడి అవసరం ఉండదు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల అవసరం ఉండదు. మామూలు రైళ్లకు వినియోగించే విద్యుత్‌లో చాలా తక్కువ విద్యుత్‌తో మాగ్లెవ్ రైళ్లను నడపవచ్చు. ట్రాక్‌ల నిర్వహణ కూడా సులభమే. వాతావరణ ప్రతికూలత ప్రభావం మామూలు రైళ్లు, ట్రాక్‌లపైకన్నా తక్కువే. వాయు ధ్వని కాలుష్యం ఉండదు. ఈ రైళ్లు పట్టాలపై నడవవు.వాటికి పది మిల్లీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో గాలిలో తేలుతూ ఉంటాయి కనుక శబ్దం ఉత్పన్నం కాదు. కేవలం గాలిలో దూసుకుపోవడంవల్ల కలిగే రాపిడి వల్ల వచ్చే శబ్దం మాత్రమే విన్పిస్తుంది. పరికరాల అమరిక కోసం బోగీలో ఎక్కువ స్థలం అవసరం ఉండదు. అందువల్ల సంప్రదాయ రైళ్లలోకన్నా ఈ బోగీలు విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా వీటికి ప్రత్యేకంగా ఇంజన్లు ఉండవు. అంతా గైడ్ వేలో ప్రయాణం సాగిపోతుంది. అందువల్ల మొదటి, చివరి బోగీలు ఒకేలా మంచి డిజైన్‌తో ఉంటాయి. తక్కువ బోగీలు, సురక్షిత గైడ్ వేవల్ల బోగీలు విడిపోవడం వంటి ప్రమాదాలు జరగనే జరగవు. ఈ తరహా రైలు వ్యవస్థకు భారమల్లా గైడ్ వే ఏర్పాటు. ఇది సంప్రదాయ రైల్‌ట్రాక్ నిర్మాణవ్యయం కన్నా వందల రెట్లు అధికం. ఇది పేదదేశాలకు మోయలేని భారం. అందువల్ల అగ్ర, సంపన్న రాజ్యాలు మాత్రమే వీటి జోలికి వెళుతున్నాయి. చైనా నడుపుతున్న షాంఘై మాగ్లెవ్ రైలు మార్గం వేయడానికి కిలోమీటరుకు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల మొత్తం వ్యయమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ రెండు విధానాల్లో సేవలు మాగ్లెవ్ రైళ్లు రెండు విధానాల్లో సేవలందిస్తున్నాయి. 1901 ప్రాంతంలో జర్మనీ శాస్తవ్రేత్త మాగ్లెవ్ రైళ్ల ప్రస్తావన చేశారు. వీటికి సంబంధించి పరిశోధన పత్రాలు విడుదల చేశారు. జర్మనీ రూపొందించి అభివృద్ధి చేసిన మాగ్లెవ్ రైల్ సిస్టమ్ నిర్వహణ అంతా ఇఎంఎస్ విధానంలో ఉంటుంది. అంటే ఎలక్ట్రోమాగ్నటెక్ సస్పెన్షన్‌తో రైలు నడుస్తుందన్నమాట. ఈ విధానాన్ని అన్వయించుకుని చైనా సొంత సాంకేతిక విధానాన్ని అభివృద్ధి చేసుకుంది. అయస్కాంతశక్తితో రైళ్లు నడుస్తాయి. పరిమితంగా విద్యుత్ వినియోగిస్తారు. ఈ రైళ్లకు చక్రాలు అసలు ఉండవు. జపాన్ సొంతంగా తయారు చేసుకున్న విధానం దీనికి భిన్నం. వారు వాడే విధానాన్ని ఇడిఎస్ అని పిలుస్తారు. అంటే ఎలక్ట్రో డైనమిక్ సస్పెన్షన్. దీనివల్ల రైలు పరిమిత వేగాన్ని అందుకునేవరకు చక్రాలపై నడుస్తుంది. కేవలం పది సెకండ్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆ వేగం అందుకున్న వెంటనే రైలు చక్రాలపై కాకుండా గాలిలో తేలుతూ పరుగులు తీస్తుంది. ఈ రెండురకాల విధానంలో రైళ్లు ట్రాక్‌పై పది మిల్లీమీటర్ల (ఇఎంఎస్ విధానం) నుంచి పది సెంటీమీటర్ల ఎత్తులో(ఇడిఎస్) గాలిలో దూసుకుపోతూంటాయి. విద్యుత్‌ను వినియోగిస్తున్నప్పుడు అయస్కాంత శక్తి పనిచేస్తుంది. అప్పుడు రైలు నడుస్తుంది. విద్యుత్‌ను వినియోగించనప్పుడు రైలు ఆగిపోతుంది. ఈ రైళ్ల నిర్వహణలో కీలకమైన గైడ్‌వే (ట్రాక్-ఇరుప్రక్కలా గోడల్లాంటి, పట్టాల్లాంటి పలకలు)లోను, రైలు బోగీల అడుగు భాగంలోనూ అత్యంత శక్తివంతమైన మాగ్నెటిక్ కాయిల్స్ వాడతారు. వీటిని మరోవిధంగా ‘సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్’అని అనుకోవచ్చు. ఇవి వేడెక్కకుండా చల్లగా ఉండేలా వీటిని రేర్‌ఎర్త్ ఎలిమెంట్స్‌తో తయారు చేస్తారు. దాదాపు 15 రకాల మూలకాల మిశ్రమంతో వీటిని తయారు చేస్తారు. ప్రమాదాలు అతి తక్కువ మాగ్లెవ్ రైళ్ల నిర్వహణ ఈనాటిది కాదు. 1980 నాటికే ఇవి వినియోగంలోకి వచ్చాయి. 1984లో బర్మింగ్‌హామ్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ రైల్వెస్టేషన్‌వరకు 600 మీటర్ల దూరానికి తొలి మాగ్లెవ్ రైలును నడిపారు. అప్పుడు ఆ రైలు గంటకు 42 కిలోమీటర్ల వేగంతో నడిచేది. 11 ఏళ్లపాటు అది సేవలందించింది. జర్మనీ 1984లో తొలి షటిల్‌ను నడిపింది. అయితే, ప్రమాదాలు, సాంకేతిక ఇబ్బందులు, నిర్వహణ భారం వల్ల కొంతకాలానికి రద్దు చేశారు. మళ్లీ 1980 తరువాత వీటిపై మమకారం ప్రారంభమైంది. 2001 నాటికి జపాన్, చైనా వీటిపై ఆసక్తి చూపి కార్యరంగంలోకి దూకాయి. ఇప్పటివరకు ఐదారు అగ్నిప్రమాదాలు తప్ప పెనుప్రమాదాలేవీ జరగలేదు. చైనా తన తొలి మాగ్లెవ్ రైలును 2001లో ప్రయోగాత్మకంగాను, 2004లో వాణిజ్యపరంగాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. షాంఘై మాగ్లెవ్ పేరుతో దీనిని పుడోంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి లాంగ్‌యాంగ్ రోడ్ మెట్రోస్టేషన్ వరకు, 30 కిలోమీటర్ల దూరం నడుపుతున్నారు. కేవలం 7 నిమిషాల్లో అది గమ్యం చేరుతుంది. గంటకు 431 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రైలుగా రికార్డు సాధించింది. ప్రస్తుతం ఈ రైలు రోజుకు 115 ట్రిప్‌లతో సేవలందిస్తోంది. మున్ముందు ఈ రైలుమార్గాన్ని మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న జపాన్‌లో 603 కిలోమీటర్ల వేగంతో నడిచిన మాగ్లెవ్ రైలు ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగానే వినియోగించారు. జపాన్‌కు చెందిన లినిమో మాగ్లెవ్ రైలు ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రెండో రైలుగా రికార్డులు నమోదు చేసింది. 2005లో ఇది ప్రజల కోసం అందుబాటులోకి వచ్చింది. ఇది అందుబాటులోకి వచ్చిన తొలి మూడునెలల్లోనే కోటిమంది దీనిలో ప్రయాణించారంటే అది ఎలాంటి సేవలందిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక దక్షిణ కొరియా సైతం ఈ రంగంలో ప్రతిభ చూపింది. తన తొలి మాగ్లెవ్ రైలును గత ఏడాది ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రసిద్ధ ఇంచియాన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుండి యాంగ్యు వరకు దీనిని నడుపుతున్నారు. చైనా, జపాన్, కొరియా దేశాలు మరికొన్ని ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకువెళుతున్నాయి. ముఖ్యంగా జపాన్ తన టోక్యొ-ఒసాకా మాగ్లెవ్ రైలు వ్యవస్థను పూర్తిచేయాలని చూస్తోంది. 2027 నాటికి తొలిదశను అంటే నగొయా వరకు 286 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 40 నిమిషాల్లో చేరేలా ప్రయత్నిస్తోంది. 2047 నాటికి ఒసాకాకు, అంటే 410 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఒకగంట ఏడు నిమిషాల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కారులో టోక్యోనుంచి ఒసాకోకు చేరడానికి 5 గంటల సమయం పడుతోంది. మాగ్లెవ్ వ్యవస్థ పూర్తయితే కేవలం గంట 7 నిమిషాల్లో గమ్యాన్ని చేరవచ్చు. ఈ వ్యవస్థ ప్రకారం న్యూయార్క్-శాన్‌ఫ్రాన్సిస్కోల మధ్య ఉన్న 4,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల్లో అధిగమించవచ్చు. అయితే ఈ ప్రయత్నంలో అమెరికా ఇంకా చాలాదూరం ప్రయాణించవలసి ఉంది. ఈ దేశంలో ఇప్పటికి అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న రైలు ఆమ్‌ట్రెక్ అసెలా ఎక్స్‌ప్రెస్. ఇది గంటకు 241 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తోంది. ఇక ఇంగ్లండ్‌లో ప్రతిపాదనలో ఉన్న హెచ్‌ఎస్2 హైస్పీడ్ రైలు వేగం గంటకు 400 కిలోమీటర్లుగా ఉంది. వివిధ దేశాల్లో హైస్పీడ్ రైళ్లు, మాగ్లెవ్ రైళ్ల వేగం ఇలా ఉంది. షాంఘై మాగ్లెవ్ 431 కెఎంపిహెచ్, లినిమో-380, హార్మని సిఆర్‌హెచ్ 380ఎ-380, ఎజియు-ఇటలో-360, సిమన్స్ వెలరో(స్పెయిన్)-350, టల్గో-350 (స్పెయిన్) తొలి ఆరు స్థానాల్లో ఉన్నాయి. వీటి వేగం ఇదీ… భూమీద వేగంగా నడిచే ప్రయాణ సాధనాలను పరిశీలిస్తే ప్రస్తుతానికి మొన్న జపాన్‌లో రికార్డు సృష్టించిన మాగ్లెవ్ రైలుదే అగ్రస్థానం. దీని వేగం గంటకు 603 కిలోమీటర్లు. మరికొన్ని మగ్లెవ్ రైళ్లు 403 నుంచి హీనపక్షం గంటకు 350 కి.మీ.ల వేగంతో దూసుకువెళుతున్నాయి. ఫార్ములా-1 రేస్ కారు వేగం గంటకు 320 కిలోమీటర్లు కాగా జపాన్‌లోని ప్రతిష్టాత్మక షిన్‌కసు బుల్లెట్ రైలు వేగం 321 కెఎంపిహెచ్. యూరోస్టార్ హైస్పీడ్ రైలు వేగం గంటకు 300 మాత్రమే. కాలగతిలో ఆధునిక మానవుడు ఎలా అభివృద్ధి చెందాడో గమనిస్తే మున్ముందు మరిన్ని మేలైన ఆవిష్కరణలు సాక్షాత్కరిస్తాయనే విశ్వసించాలి. మానవాళి ప్రగతికి అవసరమైన సేవలు మరింత చౌకగా, భద్రంగా, చేరువగా రావాలంటే ఇలాంటి ప్రయోగాలు జరగాలి. ఒక్కో విజయం కొత్త ఆశలకు ఊపిరిలూదుతుంది. ఈ వేగం, విజయం జపాన్ సాధించినా, భారత్ సాధించినా ఒక్కటే. అది ముమ్మాటికీ మానవుడి విజయం. కాదంటారా..? ………………………………….. భారత్‌లో ఎప్పుడు..? భారత్‌లో హైస్పీడ్ రైళ్ల వేగం 160 (దిల్లీ-్భపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్) కిమీలకు మించదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ భారత్‌లో బుల్లెట్ రైళ్లకోసం పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. భారీ వ్యయం, ఎక్కువ సమయం తీసుకునే ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి రావడానికి చాలాకాలం పట్టవచ్చు. భారత్‌లో మాగ్లెవ్ రైళ్లు పరుగుపెట్టాలంటే ఒకటి రెండు దశాబ్దాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ, మనవాళ్లూ వీటిపై మనసుపడినమాట నిజం. కొన్ని ప్రతిపాదనలు, కొన్ని మార్గాల్లో వీటని నడపాలన్న ఆలోచనలు ఎప్పుడో చర్చకు వచ్చాయి. లాలూప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు ఒక అమెరికన్ కంపెనీ మాగ్లెవ్ రైళ్లపై ఓ నివేదిక సమర్పించింది. పూణె-ముంబయి మధ్య నిర్మించ తలపెట్టిన మాగ్లెవ్ రైలువ్యవస్థకు 30 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. లాభనష్టాలపై బేరీజు వేసిన లాలూ పేదలకు అందుబాటులో ఉండే ‘గరీభ్ రథ్’పై మొగ్గుచూపి మాగ్లెవ్‌ను పక్కనపడేశారు. నిజానికి ఈ మాగ్లెవ్ రైలును పూణెలోని పింపిల్ సౌదనగర్ నుంచి ముంబైలోని పడ్వేల్ వరకు నడపాలని ప్రతిపాదించారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 112 కి.మీ. దూరం ఉంది. నిజానికి అత్యంత రద్దీగా ఉండే ముంబయి-పూణె మార్గంలో రోజూ 14 వేల వాహనాలు తిరుగుతాయి. ఈ మార్గంలో మాగ్లెవ్ రైలు నడిపితే రెండు గంటల ప్రయాణ సమయంలో గంటన్నర సమయం ఆదా అవుతుంది. అంటే కేవలం 30 నిమిషాల్లో గమ్యం చేరవచ్చు. ఈ ప్రతిపాదనను మహారాష్టక్రు చెందిన ఓ మంత్రి చేసినా అది కాగితాలకే పరిమితమైంది. ముంబయి-్ఢల్లీ మధ్య కూడా ఇలాంటి రైలు నడపాలన్న ప్రతిపాదనలు వచ్చినపుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ ప్రయోగం సఫలమైతే మరిన్ని ప్రాంతాల్లో అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ రైల్వెమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగింది. కానీ అమలు కాలేదు. ఇక చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఇలాంటి రైలును నడపాలన్న ప్రతిపాదన 2012లో కర్నాటక మంత్రి ఒకరు చేశారు. దీనిపై సౌత్ కొరియాకు చెందిన ఒక సంస్థ ప్రాజెక్టు రిపోర్డును కూడా ఇచ్చింది. ఆ తరువాత దానిపై ఎవరూ ముందుకు వెళ్లలేదు. ముంబయి-నాగపూర్ మధ్య వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది. మహారాష్టల్రోని వెనుకబడిన (అహ్మద్‌నగర్, బీడ్, లాతూర్, నాందేడ్)ప్రాంతాల మీదుగా ఓ రైలు వేయాలన్న ప్రతిపాదన కూడా గతంలో తెరపైకి వచ్చింది. ఇవన్నీ రాష్టస్థ్రాయిలో జరిగిన మాటామంతీయే తప్ప సీరియస్ ప్రయత్నాలు కావు. ……………………………………………….. వాక్టో ట్యూబ్ ట్రైన్‌@6,400 కెఎంపిహెచ్ ఔను…అన్నీ అనుకున్నట్లు జరిగితే, పరిశోధనలు నిజమే అయితే- అవి సత్ఫలితాన్ని ఇస్తే శాస్తవ్రేత్తలు కంటున్న కలలు నిజమైతే..ఆ రైలు వేగం గంటకు కనీసం 6400 కిలోమీటర్లు. గరిష్ఠ వేగం..గంటకు 8వేల కిలోమీటర్లు. ఇది ప్రస్తుతానికి నమ్మశక్యం కాదు. కానీ వీటిపై చైనాకు చెందిన సౌత్‌వెస్ట్ జయాటోంక్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తున్నారని అంటున్నారు. ఈ రైళ్లకు వారు ‘వాక్టో ట్యూబ్ ట్రెయిన్స్’ అని పేరుపెట్టారు. గాలిలేని ట్యూబుల్లో ప్రయాణించే రైళ్లు అన్నమాట. గాలి ఒత్తిడివల్ల రైళ్లవేగం మందగిస్తుంది. గాలే లేని విధంగా నిర్మించిన టనె్నల్స్ లేదా ట్యూబుల్లో ప్రయాణించే రైళ్లను సృష్టించాలన్నది ఆలోచన. గాలి ఒత్తిడి లేనప్పుడు ఆ రైళ్లవేగం గంటకు 6 వేల కిలోమీటర్లపైగానే ఉంటుందన్నది వారి అంచనా. ఇది భూ వాతావరణంలో ధ్వనివేగం కన్నా ఐదారురెట్లు ఎక్కువ. వీరిలెక్కలు, అంచనాలు కార్యరూపంలోకి వస్తే బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు రెండు గంటల్లో చేరిపోవచ్చు. ఆ వేగం ఓ విమానం ప్రయాణించే వేగంగా ఎక్కువ. నిజానికి 1970లోనే వీటిపై పరిశోధనాపత్రాలు వెలువడ్డాయని అంటారు. కానీ ఇదంతా పుక్కిట పురాణమేనని, ఇది అసాధ్యమని అంటున్నవాళ్లూ ఉన్నారు. చైనా యూనివర్శిటీ శాస్తవ్రేత్తలు ఒక్కటి మాత్రం స్పష్టం చేశారు- ‘తామేమీ పరిశోధనలు చేయడం లేద’ని. కానీ- చేసేవన్నీ ముందు చెబుతారా ఏంటి.? అదీ చైనాలో..! …………………………. జపాన్ మాగ్లెవ్-603 ఈ రైలు వేగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రయోగాత్మకంగా జపాన్ పరిశీలించింది. ఏడు బోగీలున్న ఈ మాగ్లెవ్ రైలు కేవలం 10.8 సెకండ్లలో 1.8 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంది. ఇది గంటకు 603 కిలోమీటర్ల వేగంతో సమానం. దీంతో ప్రపంచం కళ్లు జపాన్‌వైపు, ఆ మాగ్లెవ్ రైలువైపు పడ్డాయి. నిజానికి సరిగ్గా వారం ముందు అదే రైలు వేగాన్ని పరిశీలించినపుడు గంటకు 590 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రికార్డు సృష్టించింది. అంటే తాజాగా తన రికార్డును బద్దలుకొట్టి సరికొత్త రికార్డును నమోదు చేసిందన్నమాట. అది ఆ రైలుకు కొత్తకాదు. ఇదే రైలు తొలిసారి అంటే 2003లో గంటకు 581 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. జపాన్ మాగ్లెవ్ అంటే ఆషామాషీ కాదు కదా!

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేపాల్ కు సాయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

థాయిలాండ్ లో చేపల వాన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇలా బతికి బట్ట పడ్డాను -నేపాల్ యాత్రికురాలి అనుభూతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మార్తాండ తేజం తో మోడీ పవర్ యాగం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పక్షుల అన్వేషకుడు -జాఫర్ పుటే హళ్లి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment