‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-21

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-21

పోస్టల్ బాంబ్ ?

విజ్ఞాన శాస్త్ర మహా వృక్షపు శాఖలన్నిటినీ సమర్దులైనవారు తీర్చి దిద్దుతున్నారు .రామయ్య గారి ప్రయోగ శాలలో ఎప్పుడూ ,ఎన్నడూ తగాదాలు ,అపోహలు రాలేదు . ఎప్పుడూ చిరునవ్వులే వికసించేవి .మనస్పూర్తి అభినందనలే ఉండేవి .అకస్మాత్తుగా ఒక రోజు ఒక ఉత్తరం రామయ్యగారికి ‘’బాకు ‘’లో ఉండే స్నేహితుల నుండి వచ్చింది .దానిపైన పొగలుకక్కే ఒక గుండ్రని బాంబు బొమ్మ దాని ,కింద  ‘’జాగ్రత్త .ఒక గ్రెనేడ్ ను పంపుతున్నాం ‘’అని రాసి ఉంది. టెన్షన్ మొదలైంది .ఒక రోజు తరవాత ఒక పార్సిల్ వచ్చింది .విప్పి చూస్తె అందులో పళ్ళు ,దానిమ్మ పళ్ళు ఉన్నాయి .ఒక హెచ్చరిక కూడా రాసి ఉంది ‘’కొత్త విధానం లో మీరు నిర్వహించిన పరీక్షలు దిగ్విజయం అయినాయని తెలిసి సంతోషం తో అభినందిస్తున్నాం .త్వరలో ప్రోటోకాల్ పంపుతున్నాం .drink to your health ‘’అని చదివి అందరూ తేలికగా హాయిగా ఊపిరి  పీల్చుకొన్నారు .సైంటిస్ట్ రామయ్య’’ సక్సెస్ రామయ్య’’అయ్యారు .

రామయ్య గారింటికి  భారతీయల రాకపోకలు

యాభవ దశకం లో (1950) ఇండియా నుంచి ఎక్కువగా భారతీయులు మాస్కో కు రావటం ప్రారంభించారు .ఇందులో సైంటిస్ట్ లు ,వివిధ విషయాలలో స్పెషలిస్ట్ లూ ,రిసెర్చ్ స్కాలర్లు ,పోస్ట్ గ్రాడ్యుయేట్లు ,విద్యార్ధులు ఉన్నారు .కళాకారులు రచయితలూ వచ్చేవారు .అందులో రామయ్య గారి ఆంద్ర దేశ బంధు గణమూ ఉండేది .

రామయ్య గారి  తెలుగు నిఘంటు నిర్మాణం

అనుకోకండా ఒక సారి రామయ్యగారు తెలుగు నిఘంటు నిర్మాణం ప్రారంభించారు .దీనితో పరిచయాలు మరీ  విస్తృతమైనాయి .భాషా శాస్త్ర వేత్తలు ,భాషా తత్వ శాస్త్ర్జులు (ఫైలాలజిస్ట్ లు ),అనువాదకులు ఇంటికి వచ్చి చర్చలలో పాల్గొనేవారు .తెలుగు నేర్చుకోవాలన్న అభిలాష గల విద్యార్ధులు వచ్చి రామయ్యగారి వద్ద తెలుగు నేర్చుకొనేవారు .ఒక సారి ‘’ఆంధ్రుల చరిత్ర ‘’ను రష్యన్ భాషలోకి అనువదించమని కోరటం జరిగింది .చాలా సంతోషం గా దీన్ని నిర్వహించారు .ఇండో రష్యన్  ప్రజలు పరస్పరం అర్ధం చేసుకొని సహకరించుకోవాల్సిన అవసరం ఏంతో ఉంది అనిపించింది .మంచి స్నేహితులు ,ఇండాలజిస్ట్ లు ఆయనతో కలిసి పని చేసేవారు .తనను వారందరూ జ్ఞాపకం చేసుకొంటూనే ఉంటారని ,మనసులలో ఆత్మీయ భావాన్ని చూపుతూ ఉంటారని భావించారు రామయ్య .

అన్నపూర్ణ గృహం

మాస్కో వచ్చిన ప్రతి భారతీయుడు తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం పొంది స్వంత ఇంట్లో ఉన్న అనుభూతికి లోనయ్యేవారు .అప్పటికే రామయ్యగారికి 78 ఏళ్ళు వచ్చాయి .వయసురీత్యా తాను  ఇండియన్ కమ్యూనిటీలో పెద్ద వాడినని అనుకోవటం లేదన్నారు .అంతేకాదు తాను  ఆ జన సమూహం లో లేరు కూడా .తానొక సోవియట్ పౌరుడినని ,ఇదే తన ఇల్లు అని అనుకొనేవారు .అయినా ఇండియా నుంచివచ్చే యువకులు , వృద్ధులు రామయ్య గారింటికి వచ్చి టీ తాగి హాయిగా కబుర్లు చెప్పుకొని వెడుతూ ఉండేవారు .వారందరికీ తను పెద్ద అంతే .వారిని చూడటం వారితో మాట్లాడటం రామయ్యగారికీ ఎక్కువ సంతోషంగా నే ఉండేది .వారంతా తన సోదరులనుకోనేవారు. తాను  పెద్దన్న .ఇన్నేళ్ళుగా తాను  రష్యాలో ఉంటున్నా తన మాత్రుదేశమైన తెలుగు దేశం తెలుగుభాష సంస్కృతీ ,పద్ధతులను మరచిపోలేదని గర్వంగా రామయ్య గారు చెప్పుకొన్నారు .వారికి సదా ఆహ్వానం అనేవారు రష్యన్ పద్ధతిలో వారికి ఆతిధ్యమిస్తాను అన్నారు .భారతీయ సంస్కృతికి దూరం కాలేదన్నారు .తనకు జన్మ నిచ్చిన దేశమాత ఋణం తీర్చుకోలేనిదనేవారు. తనను పెంచుకొన్న తండ్రి నేర్పిన సంస్కార బలమే ఇదంతా అనేవారు .

శక్తి తగ్గి పోతుండగా ఒక సారైనా తనను కనీ ,పెంచి ఇంత దూరంలో ఇంత అందమైన దేశానికి  పంపిన మాత్రు దేశం ఇండియా వెళ్లి చూసి రావాలనిపించేది .ఆంద్ర దేశపు శ్రావ్య సంగీత ధ్వనులు చెవులలో రింగున మారు మోగుతూ ఉండేవి .భారత దేశం సందర్శించమని ఎందరో ప్రముఖుల నుండి సంస్థలనుండి ఆహ్వానాలు వస్తూ౦డేవి .వీటన్నిటికి సమాధానం గా 1963లో 42 ఏళ్ళ తర్వాతా 42 రోజులు ఇండియాలో గడపటానికి రామయ్య గారు వచ్చారని మొదట్లోనే చెప్పుకొన్నాం .రామయ్యగారి’’ కేమోటాలజి ‘’ని ఇప్పుడు ‘’ట్రైబో కేమిస్ట్రి’’అని పిలుస్తున్నారు .కేమోటాలజిపిత ‘’ ఇప్పుడు’’ ట్రైబో కెమిస్ట్రీ పిత ‘’అయ్యారన్నమాట .

రామయ్య గారి కుటుంబం

రామయ్య గారు మాస్కో చేరిన కొన్నేళ్ళకు జర్మన్ జాతికి చెందిన వోల్గా తీరం లోని పావ్ లోఝీ ప్రాంతానికి చెందిన ఏంజెల్ వాసి ‘’ఎకటేరినా లోగన్నోవ్నా బెల్జేర్ అనే ఆవిడను వివాహం చేసుకొన్నారు .ఈవిడనే’’ కాత్యా’’ అంటారు .ఆమె అతిదులపాలిటి  ‘’కాత్యా ‘’యనీ దేవి .1934 లో ఈ కాత్యా ,రామయ్య దంపతులకు లీలావతి అనే కుమార్తె జన్మించింది .ఈమె బయలాజికల్ సైన్సెస్ లో మాస్టర్ డిగ్రీ సాధించి ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ జెనరల్ జెనెటిక్స్ R.A.N .లో సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్  గా ఉంది .1936 లోనే రామయ్య సోవియట్ పౌరులయ్యారు .సోవియట్ లో ఉండటం వలన ఆ దేశం తో బాటు తానూ కష్టమూ సుఖమూ రెండూ అనుభవించాను అంటూ ఉండేవారు .తాను ఇండియాలో పుట్టినా జీవితం లో ఎక్కువ భాగం రష్యాలో గడిపానని ,సోవియట్ పౌరుడుగా ఉన్నందుకు గర్వం గా ఉందని చెప్పేవారు .1945లో రామయ్య దంపతులకు రెండవ ఆడపిల్ల నీల వేణి పుట్టింది .ఆమె స్టేజి నటి .డెన్మార్క్ కు వెళ్లి ,అక్కడ నటన లో శిక్షణ నిచ్చి  కోపెన్హాం లో ధీరిటికల్ ఇన్స్టిట్యూట్ ను నడుపుతోంది .

మాస్కో  లో ఉన్న రామయ్య నిజమైన సోవియెట్ పౌరునిగా  ఉండేవారు . అంతమాత్రం చేత భారత దేశాన్ని ,తన మూలాలున్న స్వగ్రామం ఉయ్యూరును విస్మరించలేదు .ఆయన ఆల్బం లో వీటి తాలూకు తీపి గుర్తుల ఫోటోలున్నాయి .వాళ్ళ పొలాలు ,నీటిబావి ,బిల్డింగులు అన్నీ భద్రం గా ఫోటోలలో భద్ర పరచుకొన్నారు .మాతృభూమి అభిమానం అంత గొప్పది .తన బంధు గణం గురించి చాలా ఏళ్ళు ఆయనకు తెలియనే తెలియదు .కుటుంబం లో వచ్చిన మార్పులూ తెలియవు .బ్రిటిష్ వారు పరి పాలిస్తున్న రోజులు కదా అవి .అందుకని ఇంటికి ఉత్తరం రాస్తే ప్రభుత్వం వారిని ‘’బ్లాక్ లిస్టు ‘’లో పెడుతుందేమో అనే అనుమానమూ ఉండేది, ఉందికూడా .1947లో భారత  దేశం స్వాతంత్ర్యాన్ని పొందటం అందరికి సంతోషమైంది .అప్పటి నుండి రామయ్యగారు స్వగ్రామానికి ఉత్తర ప్రత్యుత్తరాలు కొన సాగించారు .ఇప్పుడు ఉయ్యూరులో ఉన్నవారందరూ తన కుమారులు ,మనవళ్ళు అయిపోయారు .ఉయ్యూరు బంధువులను రామయ్యగారు భార్యా పిల్లలకు పరిచయం చేసేవారు .పిల్లలు కూడా తమ తండ్రిగారి ఉయ్యూరు మూలాలు చూసి, విని పులకించి పోయేవారు .ఎంత దూరమైనా రక్త సంబంధం అంత తియ్యగా ఉంటుందన్నమాట .ఒక సారి రెండవ కూతురు నీలవేణి తన తోటి సెకండరీ క్లాసు పిల్లలకు ఇండియా, దాని భౌగోళిక పరిస్తితుల గురించి చక్కని రిపోర్ట్ ఇచ్చిందని రామయ్య గారు గర్వంగా చెప్పుకొన్నారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15 –ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.