క్విట్ ఇండియా ఉద్యమనాయకురాలు ,శతాయుస్సుతో జీవించిన గాంధీ శిష్యురాలు, కేరళ జాతి రత్నం –అనక్కర వడక్కత్ జి.సుశీలమ్మ

క్విట్ ఇండియా ఉద్యమనాయకురాలు ,శతాయుస్సుతో జీవించిన గాంధీ శిష్యురాలు, కేరళ జాతి రత్నం –అనక్కర వడక్కత్ జి.సుశీలమ్మ

కేరళలో అనక్కర వడక్కత్ తరవాడు కుటుంబంలో చివరి సభ్యురాలు అనక్కర వడక్కత్ జి.సుశీలమ్మ1921లో జన్మించింది .మద్రాస్ లో చదువుతుండగానే క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొన్న దేశ భక్తురాలు .1943 ఫిబ్రవరిలో అరెస్ట్ అయి ,వెల్లూరు స్త్రీల కారాగారం లో జైలు శిక్ష అనుభవించింది .మహాత్మా గాంధీ ఆదర్శాలకు ప్రభావితురాలై ,కాంగ్రెస్ లో చేరి ,కాంగ్రెస్ మహిళా విభాగం కు జాతీయ సెక్రేటరిగా పని చేసింది .రోజూ ఖాదీ వడికి ఆదర్శప్రాయమైంది  స్వాతంత్ర్యానంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నది .అనక్కార వడక్కత్ ఫామిలి కి చెందిన ప్రసిద్ధ మహిళలో  స్వాతంత్ర సమరయోధులు అమ్ము స్వామినాధన్ ,ఏ.వి కుట్టిమలు అమ్మ ,కెప్టెన్ లక్ష్మి ,ప్రముఖ నాట్య కళాకారిణి మృణాలిని సారాబాయి ఉన్నారు .స్వాతంత్ర్య సమర యోధులకిచ్చే తన పెన్షన్ ను అట్టడుగు ప్రజల సంక్షేమానికి అందించేది .చాలాకాలం కల్లదత్తూర్ లోని చిన్మయా స్కూల్ కు సేక్రేటరిగా ఉన్నది .

 సుశీలమ్మ భర్త కుంజి కృష్ణన్ కూడా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడే . ఈ దంపతులకు  ఇందు ధరన్ కుమారుడు .నందిత కుమార్తె . చివరికాలం లో దాదాపు 8ఏళ్ళు అనారోగ్యంతో మంచం పైనే ఉండి పోయింది సుశీలమ్మ .22-9-2021 న శతాయుష్షు పూర్తయి సుశీలమ్మ మరణించింది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-4-23-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

డా.సాగిరాజువారి తిక్కన ద్రోణ పర్వము.5వ భాగం.30.4.23

డా.సాగిరాజువారి తిక్కన ద్రోణ పర్వము.5వ భాగం.30.4.23

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.65వ భాగం.శ్రీ శంకరాద్వైతం.30.4.23.

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.65వ భాగం.శ్రీ శంకరాద్వైతం.30.4.23.

Posted in రచనలు | Leave a comment

డా.సాగిరాజు వారి తిక్కన ద్రోణ పర్వము.4వ భాగం.29.4.23.

డా.సాగిరాజు వారి తిక్కన ద్రోణ పర్వము.4వ భాగం.29.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.64వ భాగం.శ్రీ శంకరాద్వైతం.29.4.23.

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.64వ భాగం.శ్రీ శంకరాద్వైతం.29.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

1-తిరువాన్కూర్ ప్రధానిగా  ,కేరళ ముఖ్య మంత్రిగా ,ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పని చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు –పట్టం థాను పిళ్లై

1-తిరువాన్కూర్ ప్రధానిగా  ,కేరళ ముఖ్య మంత్రిగా ,ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పని చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు –పట్టం థాను పిళ్లై

పట్టం ఏ..థాను పిల్లై 15-7-1885 న కేరళలోని తిరువనంత పురం లో జన్మించాడు .పట్టం లో నివసించటం వలన ఆపెరుతోనే పిలిచేవారు .లాలో డిగ్రీ చేసి లాయర్ గా ప్రాక్తీస్ చేశాడు .కొద్దికాలానికే వృత్తి కి గుడ్బై చెప్పి భారత జాతీయ కాంగ్రెస్  లో చేరి స్వాతంత్ర్య సమర౦ లో పాల్గొన్నాడు .గుర్తింపు పొంది కేరళ ముఖ్యనాయకుడయ్యాడు .ట్రావెంకూర్ అంటే తిరువనంత పురం కాంగ్రెస్ నాయకుడు గా పార్టీ 1946లో నియమిస్తే శాయశక్తుల పార్టీకి ఉద్యమానికి సేవలందించాడు .రాజ్యాంగ సభకు సభ్యుడు అయ్యాడు .భారత స్వాతంత్ర్యానికి కీలక పాత్ర పోషించాడు .

 స్వాతంత్ర్యం వచ్చాక పిల్లై  ట్రావెన్కూర్ ప్రధాని పదవి చేబట్టగా అప్పుడు ట్రావెంకూర్ ,కొచ్చిన్ లు కలిసిపోయాయి .1954లో P.S.P పార్టీలో చేరి పట్టం నుంచి శాసన సభకు ఎన్నికై ,ట్రావెంకూర్ –కొచ్చిన్ ముఖ్యమంత్రి అయ్యాడు .1956లో కేరళ రాష్ట్రం ఏర్పడి ,ఎన్నికలు  జరుగగా ఆయన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ చేతిలో ఓడిపోయింది పిల్లై మాత్రం శాసనసభకు ఎన్నికయ్యాడు .తర్వాత విమోచన సమరంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం పతనమైంది .1960లో PSP-కాంగ్రెస్ సంయుక్త ప్రభుత్వ్వం లో ఆయన కేరళ ముఖ్యమంత్రి అయ్యాడు .రెండేళ్లు ఉన్నాడు .తర్వాత పంజాబ్ గవర్నర్ గా ,1964-66,ఆతర్వాత ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా 1964-68వరకు ఉన్నాడు .27-7-1970 న 85వ ఏట మరణించాడు .

2-కేరళ నుంచి ఎన్నికైన మొదటిలోక్ సభ సభ్యురాలు ,కేరళ మొదటి మహిళా మంత్రి ,గాంధీతో సుతిమెత్తని చీవాట్లు తిన్న స్వాతంత్ర్య సమరయోధురాలు –  ఆనీ మాస్కరీస్

ఆనీ మాస్కరీన్ (1902 జూన్ 6 – 1963 జూలై 19) స్వాతంత్ర్య సమర యోధురాలు, రాజకీయవేత్త, న్యాయవాది, కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఆనీ, పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసింది. అలా చేసిన మొదటి మహిళ ఆమె. కేరళలో మొదటి మహిళా మంత్రి కూడా.

కుటుంబం, విద్య

మాస్కరీన్ 1902 జూన్‌లో ఒక లాటిన్ కాథలిక్ కుటుంబంలో, త్రివేండ్రంలో జన్మించింది. ఆమె తండ్రి, గాబ్రియేల్ మాస్కరీన్, ట్రావన్‌కోర్ సంస్థానంలో అధికారి. ఆమె 1925 లో మహారాజా కాలేజీ ట్రావెన్‌కోర్‌లో చరిత్ర, ఆర్థికశాస్త్రంలో డబుల్ ఎంఏ సంపాదించింది. సిలోన్‌లో ఉపాధ్యాయురాలిగా కొన్నాళ్ళు పనిచేసి, తిరిగి వచ్చాక, త్రివేండ్రం లోని మహారాజా ఆర్ట్స్ అండ్ లా కాలేజీలో చేరి, న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించింది. [1] [2]

స్వాతంత్ర్య సమరం, రాజకీయాలు

అక్కమ్మ చెరియన్పట్టం థాను పిళ్లైతో పాటు, మాస్కరీన్ స్వాతంత్ర్య సమరంలో పాల్గొంది. సంస్థానాల విలినం కోసం కృషిచేసిన నాయకులలో ఆమె ఒకరు. [3] [4] 1938 ఫిబ్రవరిలో, ట్రావెన్‌కోర్ స్టేట్ కాంగ్రెస్ అనే రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు, అందులో చేరిన మొదటి మహిళలలో ఆమె ఒకరు. ట్రావెన్‌కోర్ కోసం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని స్థాపించడమే ఆ పార్టీ లక్ష్యం. దానికి అధ్యక్షుడిగా పట్టం థాను పిళ్లై నాయకత్వం వహించాడు. అందులో KT థామస్, PS నటరాజ పిళ్లై, కార్యదర్శులుగాను, MR మాధవ వారియర్, కోశాధికారిగానూ పనిచేశారు. మాస్కరీన్ కార్యవర్గ సభ్యురాలిగా నియమించబడింది. పార్టీ ప్రచార కమిటీలో కూడా ఆమె పనిచేసింది. సంస్థాన దివానుగా సర్ సిపి రామస్వామి అయ్యర్ నియామకాన్ని రద్దు చేయాలని, అతని పరిపాలన, నియామకాలు, ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలనీ డిమాండ్ చేస్తూ మహారాజా చితిర తిరునాల్‌కు మెమోరాండం పంపడం కార్యనిర్వాహక కమిటీ తీసుకున్న తొలి చర్యలలో ఒకటి. అయ్యర్ పరిపాలనపై దాడి చేసినందుకు గాను, అతడూ అతని అనుచరులూ ప్రతీకారం తీర్చుకున్నారు. [5]

పార్టీ అధ్యక్షుడు పిళ్ళైతో కలిసి చేపట్టిన రాష్ట్రవ్యాప్త ప్రచార పర్యటనలో మాస్కరీన్, శాసనసభలోను, ప్రభుత్వం లోనూ దివాను జోక్యం చేసుకోవడాన్ని ఆమె విమర్శించింది. ఆమె స్టేట్‌మెంట్ల కారణంగా ఓ పోలీసు అధికారి ఆమెపై దాడి చేసాడు. ఆమె ఇంటిని పగలగొట్టి, ఆస్తిని దోచుకెళ్ళారు. ఆమె ఈ ఘటనపై కథనాన్ని ప్రచురించి, పోలీసుల ఆగ్రహానికి గురైంది. [6] [7] అయ్యర్ ఆమెకు వ్యతిరేకంగా మహారాజాతో మాట్లాడాడు, మాస్కరీన్ ప్రభుత్వ పరువు తీసే ప్రసంగాలు చేస్తోందనీ, పన్నులు చెల్లించవద్దని ప్రజలను ప్రోత్సహిస్తోందనీ ఆరోపించాడు. ఆమె ప్రమాదకరమనీ, అసంతృప్తిని రగిలించిందనీ పోలీసు కమిషనరు కూడా నివేదించారు. [6] ఆమె క్రియాశీలత కారణంగా 1939-1947 మధ్య వివిధ సందర్భాల్లో అనేక సార్లు అరెస్టైంది. జైలుశిక్షలు అనుభవించింది. [8]

1938, 1939 ల్లో, మాస్కరీన్ ట్రావెన్‌కోర్ ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డులో పనిచేసింది. [9] [10] రాష్ట్ర శాసనసభలో ఉండగా ఆమె, శక్తివంతమైన వక్తగా మారింది. విధాన నిర్ణయాలు చెయ్యడాన్ని ఆస్వాదించింది. [11] 1942 లో, మాస్కరీన్ క్విట్ ఇండియా ఉద్యమంలో చేరింది. రెండు సంవత్సరాల తరువాత ట్రావెన్‌కోర్ స్టేట్ కాంగ్రెసు పార్టీకి కార్యదర్శిగా ఎన్నికైంది. 1946 ఫిబ్రవరి 21 న మాస్కరీన్‌ బొంబాయిలో చేసిన ప్రసంగం గురించి ఆమెకు మహాత్మాగాంధీ ఇలా రాసాడు, “అలా కాకపోయినా సరే, మీ నాలుకపై మీకు నియంత్రణ లేదని నాకు తెలుసు. మాట్లాడటానికి నిలబడినప్పుడు, మీకు ఏది తోస్తే అది అనేస్తారని తెలుసు. ఆ వార్తాపత్రిక నివేదిక సరైనదే అయితే ఈ ప్రసంగం కూడా దానికి ఒక నమూనాయే. నేను భాయ్ థాను పిళ్లైకి ఆ నివేదిక పంపాను. మీరు దానిని చదవండి. ఇలాంటి విచక్షణారహితమైన మాటలు మీకు గానీ, ట్రావెన్‌కూరులోని పేద ప్రజలకు గానీ మేలు చేయవు. అంతేకాకుండా, మీ చర్య ద్వారా మీరు మొత్తం స్త్రీ జాతినే సిగ్గుపడేలా చేసారు.” ప్రభుత్వంలో మంత్రి పదవి నుండి మాస్కరీన్‌ను తప్పించాలని ఆశిస్తూ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌లో సహోద్యోగికి రాసాడు కూడా. [11]

పార్లమెంటరీ కెరీర్

1946 లో, భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఏర్పరచిన 299 మంది సభ్యుల రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన 15 మంది మహిళలలో మాస్కరీన్ ఒకరు. [11] హిందూ కోడ్ బిల్లును పరిశీలించే అసెంబ్లీ ఎంపిక కమిటీలో ఆమె పనిచేసింది. [12] [13] భారత స్వాతంత్ర్య చట్టం 1947 ను బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించాక, ఆగష్టు 15 న, ఈ రాజ్యాంగ సభే పార్లమెంటుగా మారింది. [14] 1948 లో ఆమె ట్రావెన్‌కోర్-కొచ్చిన్ శాసనసభకు తిరిగి ఎన్నికైంది. ఆ స్థానంలో ఆమె 1952 వరకు పనిచేసింది. [1] 1949 లో, పరూర్ టికె నారాయణ పిళ్లై మంత్రిత్వ శాఖలో ఆమెను ఆరోగ్యం, విద్యుత్ శాఖల మంత్రిగా నియమించారు, స్వాతంత్య్రానంతరం రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి మహిళ ఆమె. [15] [16]

మాస్కరీన్, 1951 భారత సార్వత్రిక ఎన్నికల్లో తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా మొదటి లోక్‌సభకు ఎన్నికైంది. [17] ఆమె కేరళ నుండి ఎన్నికైన మొట్ట మొదటి మహిళా ఎంపీ. ఆ ఎన్నికలలో పార్లమెంటుకు ఎన్నికైన 10 మంది మహిళల్లో ఒకరు. [18] [19] 1957 రెండవ సార్వత్రిక ఎన్నికలలో, ఆమె తిరువనంతపురంలో ఎస్ ఈశ్వరన్ చేతిలో ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ఆమె నాల్గవ స్థానంలో నిలిచింది. అక్కడ పోటీచేసినవారిలో ట్రావెన్‌కోర్ కాంగ్రెస్‌లో తన పాత సహోద్యోగి పట్టం థాను పిళ్లై కూడా ఉన్నాడు. [20]

మరణం

ఆనీ మాస్కరీన్ 1963 లో మరణించింది. ఆమె సమాధి తిరువనంతపురంలోని పట్టూర్ స్మశానవాటికలో ఉంది. [21]

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-29-4-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బాల బ్రహ్మ చారి ,సహజ కవి శ్రీ వెలగల సుబ్బారెడ్డి గారి  ‘’శ్రీ రామచంద్ర శతకం ‘’

బాల బ్రహ్మ చారి ,సహజ కవి శ్రీ వెలగల సుబ్బారెడ్డి గారి  ‘’శ్రీ రామచంద్ర శతకం ‘’

బాల బ్రహ్మ చారి ,సహజ కవి శ్రీ వెలగల సుబ్బారెడ్డి గారి  ‘’శ్రీ రామచంద్ర శతకం ‘’ రచించి శ్రీ వేణు గోపాల భక్త లీలా లహరీ గ్రంథనిలయం తరఫున షష్టమ పుష్పంగా సమర్పించారు .దీన్ని మగటూరు నివాసి శ్రీ జినపనేని వెంకటరామరాజు ,ఈ సూర్యనారాయణ రాజు పరిష్కరించగా ,ఆరవిల్లి గ్రామవాసిని కీశే వెలగల వీరేడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి వెలగల వెంకమ్మ గారి ద్రవ్య సాయంతో ప.గొ.జి.నరసాపురం సీతారామా ముద్రాక్షర శాలలో 1930లో ప్రచురించారు .వెల-రెండు అణాలు .

కృతజ్ఞతలు అంటూ కవిగారు పద్యాలలో వెంకమ్మగారి దాన దయా దాత్రుత్వాలను ప్రశంసించారు .సూరమాంబ పెద్ద తటాకం త్రవ్విస్తే ,బంగారు రధాన్ని ఏర్పాటు చేశారు రంగరాణి .భార్తపేరుమీద దేవాలయాలు కట్టించి ,చిర యశస్సుపొందారు వెంకమ్మ గారు .చెల్లమాంబ బీదల పెళ్ళిళ్ళు చేయిస్తే ,అసహాయులకు అన్నవస్త్రాలు అందించారు బంగారంబ .అలాటివంశంలోని వెంకమ్మగారు శ్రీ రామ చంద్ర శతక ముద్రణకు సాయం చేశారు .భర్త వీరేడ్డి దానదయాధర్మగుణాలను కాపాడారు .ఆమెకు రామ చంద్రమూర్తి దీర్ఘాయురారోగ్యాలు ప్రసాదించాలని మార్టేరు పంచకం నుంచి కవి వెలగల సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు .సీసపద్య శతకం .సుబ్బరాడ్వరదా హరీ సుర నుతేంద్ర  -రమ్యగుణ సాంద్ర మార్టేరు రామ చంద్ర ‘’అనేది శతకం మకుటం .

మొదటి సీసపద్యం –‘’శ్రీ రామావర సుర సేవితా సుర హర కరుణాలవాల శ్రీ –గానలోల సాకేతపురవాస ,సత్య వాక్పరిపూర్ణ పురహరాసుర హర

పూర్ణ నిపుణ తాటకి సంహార ,దానవాంతక మేటి సీతామనోహర –శ్రీ రమేశ అహల్యా రక్షణాయాశ్రిత పాలనా సద్గుణ జాల శ్రీ సారసాక్ష

గీ-తాపస స్తోత్ర ధరణీశ ధర్మ శీల-పు౦డరీకాక్ష రఘురామపూర్ణ చంద్ర –సుబ్బరాడ్వరదా హరీ  సురనుతేంద్ర –రమ్య గుణ సాంద్ర మార్టేరు రామ చంద్ర ‘’

 రెండవ పద్యంలో తనకు యతి ప్రాసలు తెలీవని ,సీసాలలో రాస్తున్నానని ,నిఘంటు పరిచయం నాస్తి ,పంచకావ్య,నీతిశాస్త్ర  వాసనా లేదని ,స్వామికృపతో మొదలుపెట్టానని ,అన్నిటికీ ఆయనదే భారమనీ గడుసుగా చెప్పారు .రామమహిమలు ఎవరూ  వర్ణించలేరనీ , సర్వ రోగాలు  హరించి సంసార బంధాలను తెగగోడుతుందని ,దరిద్రం తొలగి శ్రేయ  భద్రత రామనామ ఇస్తుందని మోక్షమార్గం చూపిస్తుందనీ చెప్పారు .రామ చంద్ర జపం అంటే అరచేతిలో మోక్షం ఉన్నట్లే .పాండవుల్ని వెన్నంటి కాపాడిన కృష్ణమూర్తివి ఉత్తర గర్భాన్ని రక్షించావు ,ధ్రువుడికి ఉన్నతోన్నత పదం ప్రసాదించావు ,ద్రౌపదిని నిండు సభలో కాపాడావు .రాక్షసుల ఆగడాలవలన యజ్ఞయాగాదులకు ఆపద కలిగి ప్రార్ధిస్తే రాముడివైపుట్టి దుష్ట రాక్షస సంహారం చేశావు .ఇంద్రుడు కోపంతో రాళ్లవర్షం కురిపిస్తే గో,గోపాలురను కాపాడిన దయా సముద్రుడవు .తండ్రి పెట్టిన అన్ని యమ నరక బాధల్ని తట్టుకోనేట్లు గా ప్రహ్లాదుని కాపాడి స్తంభంలో నృహరిగా అవతరించి హిరణ్యకశిపు ప్రాణాలు హరీ మనిపించావు .శరణు అన్నవాడిని కాపాడావు .పుంభావ మొహాన  రూపంతో రాముడిగా ఉన్నప్పుడు నీ పరిష్వంగ సుఖం కోరిన తాపసులు మొదలైనవారికి  కృష్ణావతారంలో ఆకోర్కే తీర్చావు .

   గొల్ల ఇళ్ళల్లో పాలువెన్న దొంగిలించి తిని,ఆగమాగం చేసి .ఏమీ తెలీని నంగనాచిలా అమ్మకూచిలా యశోదను నమ్మించి ‘’బాపురే పదునాలుగు భాండాలు నోటిలో చూపించి ధన్య ను చేశావు .నిన్ను తప్ప ఎవర్నీ ఏదీ కోరలేదు నాపై ఉపేక్ష మాని ఆదుకొని కాపాడి మోక్షమివ్వు .’’నారద తుంబుర నంది వాహనులను నువ్వు రక్షించటం నిజమైతే ద్రౌపది దంతీన్ద్రుడు అంటే గజేంద్రుడు లను కాపాడినవాడివైతే అర్జున అహల్య ,అ౦బరీషాదులను రక్షించటమే నిజమైతే,ఉద్ధవ అక్రూరాది భక్త వరదుడవే నీవైతే వెంటనే వచ్చి నన్ను రక్షించు .ధర్మం నిల్పి అధర్మం బాపి అవతార పరమార్ధం చూపి ,సక్కుబాయి మీరాబాయి వంటి భక్త శిఖా మణులను కాచినట్లు నన్ను కూడా కాపాడు నువ్వే నాకు దిక్కు ఏడుగడ,ప్రాపు అని నూరవ పద్యం చెప్పి ,నూట ఒకటవ పద్యంలో పూర్తిగా భక్తిరంగరించి నైవేద్యం పెట్టారుకవి –

‘’శ్రీరామ జయరామ సీతామనోహరా-మారుతాత్మజ సేవ్య మంగళంబు –దశరదాత్మజ దుష్టదానవ సంహార మాత పిత్రులసేవ్య మంగళంబు

సాకేత పురవాస సాధు రక్షణ ,దుష్ట మదనాశనా నీకు మంగళంబు –అహల్యా రక్షణా యాశ్రితపాలనా మాధవా నీ కిదే మంగళం

గీ.-మదన జనకుండ నీకిదే మంగళంబు –మహి సుజన పాల,నీ కతి మంగళంబు –

సుబ్బరాడ్వరదా హరీ సుర నుతేంద్ర –రమ్య గుణ సాంద్ర మార్టేరు రామ చంద్ర ‘’అంటూ మంగళం తొ ముగించారు .

చివరగా ‘’సంసార సర్ప దష్టానాం  జంతూనామ వివెకి నాం –శ్రీరామ పాదాబ్జం –స్మరణం పర మౌషధం  -శ్రీ రామ చంద్ర శతకం సంపూర్ణం –శ్రీ వేణుగోపాల స్వామి పర బ్రాహ్మణా ర్పణమస్తు  ‘’‘’అని శ్లోకంతో పరి సమాప్తి చేశారు  .మరోశ్లోకం లో –గుణ దోషౌబుధౌ గృష్ణ    -నిందుక్ష్యేళావివేశ్వరః –శిరసా శ్లాఘతే పూర్వం –పర కంఠే నియచ్చతి ‘’అని స్వస్తి పలికారు .

ఈశతకాన్ని ‘’1922-23 న్యాయ దీపిక ,1929-30 రెడ్డి రాణి పత్రికల నుంచి పునర్ముద్రితం అని పేర్కొన్నారు .అనుబంధంగా ‘’కవి వైరాగ్యం’’అనే సీసపద్య శతమాల ను జత చేశారు .శ్రీ వెలగల సుబ్బారెడ్డి కవిగారు –శ్రీ రంగనాధ నామ సంకీర్తనలు ,ప్రహ్లాద చరిత్ర హరికధ ,మదన గోపాల శతకం ,ధ్రువ చరిత్ర హరికధ ,కృష్ణలీలలు అనే దసరా పద్యాలు ,ముకుంద శతకం,జయదేవ చరిత్ర హరికధ ,సుబ్బరాడ్గాన రామాయణం ,గజదొంగ వైరాగ్యం అనే ప్రహసనం ,శ్రీ నమ్మాళ్వార్ చరిత్ర ,ప్రచ్చన్న క్షత్రియ (కమ్మ రెడ్డి కాపు,వెలమ )కుల ప్రబోధం ,పంచమ అనే ఆది ఆంధ్ర కుల ప్రబోధం ,భారత మాత స్తవం,వైకు౦ఠ ఏకాదశి వ్రాత ప్రశంస ,పరమార్ధ ప్రబోధం ,పుష్య శుద్ధ ఏకాదశి మహాత్మ్యం ,శార్దూల వృత్త వింశతి పద్యమాల ,నాలుగు భాగాలుగా కీర్తనలు రచించారు .ఇవన్నీ వెలలేని గ్రంధాలే .భక్తి మకరందాలే .కవిగారి ఇంటిపేరును అంటే ‘’వెలగల ‘’ను రుజువు చేసేవే .చక్కని ధార,మంచి ఎత్తుగడ ,భక్తీ జ్ఞాన వైరాగ్య త్రివేణీ సంగమంగా ఈ శతకాన్ని తీర్చి దిద్దారు .మహా మహా కవుల స్థాయికి తీసిపోని వైదుష్యం కనిపిస్తుంది .కానీ మన వాళ్ళు ఎవరూ ఎక్కడా ఈ కవి ఈ శతకం  గురించి ఉదాహరించిన దాఖలాలు లేవు .అఖండ గోదావరీ ప్రవాహ సదృశం గా కవిత్వం పరిగెత్తింది అందులో మునిగి తేలి తన్మయులమై శ్రీ రామ చంద్ర దర్శన సౌభాగ్యమే కాదు మొక్షాన్నీ పొందగలం .ఇలాంటి గొప్ప శతకాన్నీ .దాన్ని తీర్చి దిద్దిన కవిని పరి చయటం  నా మహాద్భాగ్య౦గా  భావిస్తున్నాను .  

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-28-4-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాo త సౌరభం.63వ భాగం శ్రీ శంకరాద్వైతం.28.4.23

అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాo త సౌరభం.63వ భాగం శ్రీ శంకరాద్వైతం.28.4.23

Posted in ఫేస్బుక్ | Leave a comment

డా. సాగిరాజు వారి తిక్కన ద్రోణ పర్వము.3వ భాగం.28.4.23

డా. సాగిరాజు వారి తిక్కన ద్రోణ పర్వము.3వ భాగం.28.4.23

Posted in ఫేస్బుక్ | Leave a comment

కేరళలో అనేక సత్యాగ్రహాలు నిర్వహించి మాతృభూమి, లోకమాన్య పత్రికల స్థాపనకు సహకరించిన స్వాతంత్ర్య సమర యోధుడు –కరూర్ నీలకంఠన్ నంబూద్రిపాద్

కేరళలో అనేక సత్యాగ్రహాలు నిర్వహించి మాతృభూమి, లోకమాన్య పత్రికల స్థాపనకు సహకరించిన స్వాతంత్ర్య సమర యోధుడు –కరూర్ నీలకంఠన్ నంబూద్రిపాద్

కురూర్ నీలకంఠన్ నంబూద్రిపాద్, స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మా గాంధీ శిష్యుడు. అతను క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం , గురువాయూర్ సత్యాగ్రహం, వైకోం సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నాడు.

రాజకీయ జీవితం

కురూర్ నీలకంఠన్ నంబూద్రిపాద్ 1896లో త్రిసూర్ జిల్లాలోని అదాత్ కురుర్ మనలో జన్మించాడు. కొచ్చిన్ రాజ్యం , త్రిసూర్ జిల్లాలో భారత జాతీయ కాంగ్రెస్ ను ఏర్పాటు చేసిన మొదటి కొద్దిమంది నాయకులలో అతను ఒకడు. 1920లో కోళికోడ్ లో మహాత్మా గాంధీనికలిసి భారత స్వాతంత్ర్యోద్యమం లో చేరడానికి అనుమతి కోరాడు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మొదటిసారి త్రిసూర్ వచ్చినప్పుడు కురూర్ ఆతిథ్యం ఇచాడు.

త్రిసూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడు (1922-32) , కేరళ ఖాదీ బోర్డు కార్యదర్శి. కురూర్ మాతృభూమి దినపత్రిక వ్యవస్థాపకుల్లో ఒకడు. 1959 ఆగష్టు 15న కురూర్ కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎరావక్కాడ్ లో ఒక బృందం దాడి చేసింది. పౌరులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కన్నూర్ లోని సెంట్రల్ జైలులో జరిగిన లాఠీఛార్జ్ లో కురూర్ కుడి చెవిని కోల్పోయాడు. [3]

లోకమానయన్

పి.డబ్ల్యు.సెబాస్టియన్ తో నంబూద్రిపాద్ భారత స్వాతంత్ర్యోద్యమానికి మరింత చైతన్యాన్ని కలిగించడానికి త్రిసూర్ నగరంలో లోకమానయన్ వార్తా ప్రారంభించింది.దాని ఎడిటర్-ఇన్-చీఫ్ గా నంబూద్రిపాడ్ ప్రింటర్, ప్రచురణకర్తగా సెబాస్టియన్ పనిచేసారు. .2-త్యాగశీలతకు ‘’తుమ్హారా త్యాగ్ తుమ్హారా భూషణ్ హోగా ‘’అంటూ గాంధీ ప్రశంసలు పొందిన కేరళ స్వాతంత్ర్య సమరయోధురాలు –కౌముది టీచర్

ముది టీచర్ (1917 జూలై 16, వయక్కర – 2009 ఆగస్టు 4) గాంధేయవాది, కేరళలోని కన్నూర్కు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధురాలు. 1934 జనవరి 14న మహాత్మా గాంధీ కేరళ రాష్ట్రం లోని వయక్కరకు వచ్చినప్పుడు అతని పిలుపు మేరకు తన ఆభరణాలను స్వచ్ఛందంగా స్వాతంత్ర్యోద్యమం కోసం విరాళంగా యిచ్చింది. మహాత్మా గాంధీ ఆమె త్యాగాన్ని గుర్తించి యంగ్ ఇండియాలో “కౌముది పరిత్యాగం” అనే వ్యాసం రాసాడు. ఆమె 2009 ఆగస్టు 4న మరణించింది.[1]

ప్రారంభ జీవితం
కౌముది టీచర్, స్వాతంత్ర్య పోరాటం కోసం 1934 లో మహాత్మాగాంధీకి తన బంగారు ఆభరణాలను త్యజించిన స్వచ్ఛందమైన గాంధేయవాది .

కౌముది 1917 మే 17న వటక్కర లోని రాజకుటుంబానికి చెందిన ఎ.కె.రామార్మ రాజా, దేవకీ కెట్టిలమ్మ లకు జన్మించింది.[2] ఆమె తరువాత భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆసక్తి చూపడం మొదలుపెట్టింది. 1934 లో హరిజనుల కోసం ఆమె తన ఆభారణాలు త్యజించిన తర్వాత ఆభరణాలు ధరించనని ప్రతిజ్ఞ చేసింది.

జీవిత విశేషాలు
మెట్రిక్యులేషన్ తర్వాత, ఆమె హిందీని అభ్యసించి మలబార్ జిల్లా లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మొదటి హిందీ టీచర్‌గా నియమితులరాలైంది. ఆమె వినోభా భావే శిష్యురాలిగా భూధాన్ ఉద్యమంతో కూడా సంబంధం కలిగి ఉంది.

ఆమె 1972 లో హిందీ ఉపాధ్యాయినిగా ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ పొందింది. తరువాత ఆమె తిరువనంతపురంలోని వినోభా భావే ఆశ్రమంలో పనిచేసింది. ఆమెకు సేవాగ్రామ్, పౌనార్ ఆశ్రమాలను తరచుగా సందర్శించేది.[3] తరువాత ఆమె ఖాదీ ప్రచారానికి, హిందీ బోధించడానికి తన కాలాన్ని వినియోగించింది. ఆమె ఆభరణాలు ధరించకూడదని నిర్ణయించుకుంది.[2] కౌముది టీచర్ యొక్క వీరోచిత త్యాగం పాఠ్య పుస్తకాలలో కూడా చేర్చబడింది. ఆమె అవివాహితురాలిగా ఉండిపోయింది. ఆమెను వివిధ గాంధేయ సంస్థలు సత్కరించాయి.

కౌముది పరిత్యాగం
హరిజన సహాయ సమితి నిధుల సేకరణకు సంబంధించి గాంధీ 1934 జనవరి 14 న వటకర సందర్శనలో ఉన్నారు. విరాళం కోసం గాంధీ చేసిన విజ్ఞప్తికి సమాధానమిస్తూ, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కౌముది టీచర్ తన బంగారు ఆభరణాలను అతనికి ఇచ్చింది. ఆ సమయంలో ఆమె వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఆమె త్యాగం, ‘కౌముది పరిత్యాగం, ‘ అనే పేరుతో రాసిన వ్యాసంలో మహాత్మా గాంధీ ఆమె త్యగాన్ని ప్రశంసించాడు. అది యండ్ ఇండియా పత్రికలో ప్రచురించబడింది. తరువాత అది అన్ని భాషలలోకి అనువదించబడింది.[4] తరువాత అది పాఠశాల సిలబస్‌లో భాగం చేయబడింది.

గాంధీ యంగ్ ఇండియా పత్రికలో రాసిన వ్యాసంలో “కౌముది టీచర్ పరిత్యాగం” చేసిన రోజు జరిగిన సంఘటనల గురించి పేర్కొన్నాడు. బడగరలో గాంధీ తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత, హరిజన సహాయ నిధికి నిధుల సేకరణ కోసం ఆభరణాలను విరాళంగా ఇవ్వవలసినదిగా సమావేశానికి హాజరైన మహిళలకు హేతుబద్ధమైన విజ్ఞప్తి చేశాడు. ప్రసంగం తరువాత కౌముది తన చేతికి ఉన్న ఒక బంగరు గాజును తీసి గాంధీకి ఆటోగ్రాఫ్ ఇస్తారా అని అడిగింది. అతను ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి సిద్ధమౌతున్నప్పుడు ఆమె మరొక బంగారు గాజు తీసింది. ఇప్పుడు ఆమె రెండు చేతులలో రెండు గాజులు ఉన్నాయి. దీనిని చూసిన గాంధీ, “మీరు నాకు రెండూ ఇవ్వనవసరం లేదు, నేను మీకు ఒక గాజు కోసం మాత్రమే ఆటోగ్రాఫ్ ఇస్తాను” అని చెప్పాడు. ఆమె తన బంగారు నెక్లెస్‌ని తీసివేయడం ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చింది, ఆమె తన పొడవాటి జుట్టులో చిక్కుకున్న నక్లెస్ ను వేరుచేయడానికి కష్టపడుతూ దానిని తీసి అందించింది. ఆ సంభలో పురుషులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరైనప్పుడు ఆమె అలా చేసింది. ఆభరణాలను దానం చేయడానికి తన తల్లిదండ్రుల అనుమతి ఉందా అని గాంధీ అడిగినప్పుడు, ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆమె చెవిపోగులు కూడా ఇవ్వడంతో ముందుకు సాగింది. ఆమె తండ్రి కూడా ఆమెలాగే ఉదారంగా ఉంటారని, వాస్తవానికి అతను కూడా సమావేశంలో పాల్గొన్నాడనీ, గాంధీ వేలం వేసే పిలుపు మేరకు వేలం వేయడంలో కూడా సాయం చేస్తున్నాడని గాంధీ తరువాత పేర్కొన్నాడు. గాంధీ ఆమె కోసం “తుమ్హారా త్యాగ్ తుమ్హార భూషణ హోగా” అని రాస్తూ ఒక ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు.[5] అతను ఆమెకు ఆటోగ్రాఫ్‌ని అందజేయడంతో, “మీరు విస్మరించిన ఆభరణాల కంటే మీ పరిత్యాగం నిజమైన ఆభరణం” అనే వ్యాఖ్యను రాసాడు.[4]

మరణం, వారసత్వం
కౌముది టీచర్ ఆరోగ్యం సరిగా లేనందున 92 సంవత్సరాల వయసులో 2009 ఆగస్టు 4 న కన్నూర్‌లో మరణించింది. వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలతో పోరాడిన ఆమె కడచిరాలోని తన సోదరుడి నివాసంలో మరణించింది.[1] అంత్యక్రియల రోజున, ఆమెకు నివాళులు అర్పించడానికి చాలా మంది వచ్చారు. 92 ఏళ్ల గాంధేయవాది మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లే ముందు పోలీసు సిబ్బంది కూడా తుపాకీ వందనం చేశారు. వేడుకను గమనించినప్పుడు, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సుధీర్ బాబు కూడా ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ తరపున పుష్పగుచ్ఛం ఉంచాడు.[6]

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-4-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యోధుడు ,పండితుడు ,మోప్లా శాంతి స్థాపకుడు ,’’అల్ అమీన్ ‘’పత్రికా సంపాదకుడు,భారత్ విభజనకు వ్యతిరేకి –మహమ్మద్ అబ్దుల్ రహీం

1vuయోధుడు ,పండితుడు ,మోప్లా శాంతి స్థాపకుడు ,’’అల్ అమీన్ ‘’పత్రికా సంపాదకుడు,భారత్ విభజనకు వ్యతిరేకి –మహమ్మద్ అబ్దుల్ రహీం

మహమ్మద్ అబ్దుర్ రహిమాన్ సాహిబ్ (1898 – 23 ఏప్రిల్ 1945) ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు , ముస్లిం నాయకుడు, [1] పండితుడు, [2] మరియు కేరళకు చెందిన రాజకీయ నాయకుడు . [3] [4] [5] అతను 1939లో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (మలబార్) అధ్యక్షుడిగా పనిచేశాడు .

ప్రారంభ జీవితం మరియు విద్య

సాహిబ్ భారతదేశంలోని కొచ్చిన్ రాజ్యంలో 1898 లో త్రిసూర్ జిల్లా కొడంగల్లూర్‌లోని అజికోడ్‌లో జన్మించాడు . అతను వెనియంబాడి మరియు కాలికట్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు . అతను మద్రాసు మరియు అలీఘర్‌లలో కళాశాలలో చదివాడు, కాని మలబార్‌లో సహాయ నిరాకరణ ఉద్యమం మరియు ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొనడానికి అలీఘర్ విశ్వవిద్యాలయంలో తన చదువును నిలిపివేశాడు . [6]

పోరాటాలు మరియు జైలు శిక్షలు

1921 నాటి మోప్లా అల్లర్లను అనుసరించి, సాహిబ్ అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి కృషి చేశాడు, అయితే బ్రిటీష్ అధికారులు 1921 అక్టోబర్‌లో అరెస్టు చేసి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. 1930 నాటి ఉప్పు సత్యాగ్రహంలో అతను కాలికట్ బీచ్‌లో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు పాల్గొన్నందుకు , అతనిపై లాఠీచార్జి మరియు తొమ్మిది నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది మరియు కన్నూర్ సెంట్రల్ జైలులో ఉంచబడింది. [7]

ఎడిటర్

మహ్మద్ అబ్దుర్ రహిమాన్ మలయాళ దినపత్రిక అల్ అమీన్ [8] కి సంపాదకుడు మరియు ప్రచురణకర్త, ఇది 1924-1939 సమయంలో కాలికట్ నుండి ప్రచురించబడింది . మలబార్ ముస్లింలలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేయడం మరియు జాతీయవాదాన్ని పెంపొందించడం ఈ పత్రిక లక్ష్యం. అయితే సమాజంలోని సంప్రదాయవాదులు అతని ప్రగతిశీల అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ, దాని ప్రచురణకు పదేపదే అంతరాయం కలిగించడానికి వలస అధికారులతో కుట్ర పన్నారు. చివరకు 1939లో బ్రిటిష్ అధికారులు ఈ పత్రికను మూసివేశారు. ఒక స్థానిక పురాణం ప్రకారం, అతని యొక్క అనామక ఆరాధకుడు కాగితం మూసివేయబడిన తర్వాత దానిని పునఃప్రారంభించటానికి అతనికి విలువైన ఆభరణాలను అందించాడు, కానీ అతను దానిని తిరస్కరించాడు. [6] [9]

రాజకీయాలు

సాహిబ్ 1931 నుండి 1934 వరకు కాలికట్ మునిసిపల్ కౌన్సిల్ మరియు 1932 నుండి మలబార్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ సభ్యుడు. అతను 1937లో మలప్పురం నియోజకవర్గం నుండి మద్రాస్ ప్రెసిడెన్సీకి ఎన్నికయ్యాడు. అతను కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడయ్యాడు మరియు సభ్యుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) 1939లో. మహ్మద్ అబ్దుర్ రహిమాన్ ఆల్-ఇండియా ముస్లిం లీగ్ యొక్క రెండు-దేశాల సిద్ధాంతాన్ని ఎప్పుడూ వ్యతిరేకించేవాడు మరియు అతను కేరళలోని జాతీయవాద ముస్లింల నాయకుడు. [10] [11] అతని చివరి రోజులు సమావేశాలు ఏర్పాటు చేయడం మరియు ముస్లింలలో అవగాహన కల్పించడం కోసం గడిపారుభారతదేశ విభజనకు వ్యతిరేకంగా ఇందుకోసం మలబార్‌లో ముస్లిం లీగ్ పార్టీ నుంచి చాలా నష్టపోయాడు.

రెండవ ప్రపంచ యుద్ధం

అబ్దుర్ రహిమాన్ సాహిబ్ 1940 నుండి 1945 వరకు బ్రిటిష్ రాజ్ చేత జైలులో ఉన్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కాలికట్‌కు తిరిగి వచ్చి కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. అతను 23 నవంబర్ 1945న 47 సంవత్సరాల వయసులో చెన్నమంగల్లూరు సమీపంలోని పొట్టశేరి గ్రామంలో (ప్రస్తుత కోజికోడ్ జిల్లాలో ) కొడియాత్తూరులో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత మరణించాడు [6] అతను తీవ్రమైన గుండెపోటుతో మరణించాడని వైద్య రికార్డులు చెబుతున్నాయి , అయితే ఇంకా కొంతమంది అతను విషం తాగాడని నమ్ముతారు. కేరళ ప్రభుత్వం ఎరియాడ్‌లోని సాహిబ్ ఇంటిని నస్రుల్ ఇస్లామ్‌గా రక్షించడానికి స్వాధీనం చేసుకుంది .

2-కేరళ తోలి యూదు న్యాయవాది ,కొచ్చిన్ సంస్థాన శాసన మండలి సభ్యుడు ,’’యూదు గాంధీ ‘’-అబ్రహాం బరాక్ సేలం

అబ్రహం బరాక్ సేలం (1882-1967) ఒక భారతీయ జాతీయవాది, జియోనిస్ట్, న్యాయవాది, రాజకీయవేత్త. ఇరవయ్యవ శతాబ్దంలో కొచ్చిన్ కు చెందిన యూదు ప్రముఖులలో ఒకరు. మేషుచ్రారిమ్ వారసుడు. కొచ్చిన్ యూదుల్లో న్యాయవాది అయిన తొట్టతొలి వ్యక్తి. అతను ఎర్నాకుళంలో ప్రాక్టీస్ చేసాడు. చివరికి అతను తన ప్రజలపై యూదుల పట్ల చూపుతున్న వివక్షపై అతడు సత్యాగ్రహ పద్ధతిలో పోరాడాడు. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో, భారతీయ జాతీయ ఉద్యమాల్లో పాల్గొన్నాడు, తరువాత అతను జియోనిజం వైపు ఆకర్షితుడయ్యాడు. 1930 వ దశకంలో పాలస్తీనాను సందర్శించిన తరువాత, 1955 నాటికి చాలా మంది కొచ్చిన్ యూదులు ఇజ్రాయెల్‌కు వలస వెళ్ళేందుకు తోడ్పడ్డాడు. తాను మాత్రం శేష జీవితమంతా కొచ్చి లోనే గడిపాడు.

తొలి జీవితం

సేలం 1882 లో కొచ్చిన్ ( కొచ్చిన్ రాజ్యం ) లో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. కొచ్చి అప్పుడు బ్రిటిష్ భారతదేశంలో ఒక సంస్థానంగా ఉండేది. అతని కుటుంబాన్ని మేషుచ్రారిమ్‌గా పరిగణిస్తారు. యజమానులే స్వచ్ఛందంగా విడుదల చేసిన బానిసలని ఆ హీబ్రూ పదానికి అర్థం. కొన్నిసార్లు తటస్థంగా వాడినప్పటికీ, కొన్నిసార్లు అవమానకరమైన ఉద్దేశ్యంతో వినియోగిస్తారు. స్పెయిన్ నుండి యూదులు బహిష్కరించబడిన తరువాత 16 వ శతాబ్దం నుండి ఈ పరదేశి [విదేశీ] యూదులు కొచ్చిన్ వచ్చారు. మెషుచ్రారిమ్‌ లంటూ కొచ్చి యూదు సమాజంలో వారిపై వివక్ష చూపారు. కొచ్చిన్ లోని పరదేశి సినగాగ్‌లో (యూదు దేవాలయం) వారిని తక్కువ స్థాయి వ్యక్తులుగా చూసారు. వారి మధ్య సాంస్కృతిక వ్యత్యాసాల కారణంగా ఈ పరదేశి (“శ్వేత జాతి”), యూదులు, స్థానిక మలబారి యూదులు శతాబ్దాలుగా తమ మధ్య గల జాతి భేదాలను కొనసాగించాయి. ఇవి చారిత్రికంగా శరీరపు రంగులో గల తేడాతో ముడిపడి ఉన్నాయి.

తల్లి సంరక్షణలో పెరిగిన సేలం, ఎర్నాకుళంలోని మహారాజా కళాశాలలో చదివాడు. చెన్నైలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ సంపాదించాడు. అతడు, మేషుచ్రారిమ్‌లలో మొట్ట మొదటి యూనివర్సిటీ గ్రాడ్యుయేటు. [1] చెన్నైలో ఉన్నప్పుడే న్యాయశాస్త్ర పట్టా కూడా సంపాదించాడు. కొచ్చిన్ యూదుల్లో అతడు మొట్ట మొదటి న్యాయవాది. [2] అతను ఎర్నాకుళంలోని కొచ్చిన్ చీఫ్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసాడు.

క్రియాశీలత

మలబారి యూదులకు ఏడు ప్రార్థనా స్థలాలు ఉన్నాయి; శ్వేతజాతి యూదులకు పరదేసి సినగాగ్ అనే ఒక సినగాగ్ ఉంది. అపవిత్రులని భావించే వారికి అందులో నిషేధం ఉంది. సమకాలీన చరిత్రకారుడు ఎడ్నా ఫెర్నాండెజ్ దీనిని “శ్వేత స్వచ్ఛతకు కంచుకోట” అని అన్నాడు. [3] శ్వేత జాతి యూదులు తమ సామాజిక సమూహం లోని వ్యక్తులనే పెళ్ళి (ఎండోగామస్ ) చేసుకునేవారు. వాళ్ళు మెషుచర్రిం లను, మలబారీ యూదులనూ చేసుకునేవారు కాదు. మలబారీ యూదులు కూడా ఇలాగే ఇతర సమూహాల వక్తులను పెళ్ళి చేసుకునేవారు కాదు. మేషుచ్రారిమ్‌లు సినగాగ్ వెనుక గాని, బయట గానీ కూర్చోవలసి వచ్చేది. ఇది, ఆ కాలంలో దిగువ కులాల పట్ల భారతీయ వివక్షను పోలి ఉండేది. ఇదే వివక్ష కొన్నిసార్లు భారతదేశంలోని క్రైస్తవ చర్చిలలో కూడా ఉండేది.

సేలం కొంతకాలం పాటు సినగాగ్‌ను బహిష్కరించి ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. అతను సత్యాగ్రహాన్ని (లేదా అహింసాత్మక నిరసన) సమాజంలోని వివక్షను ఎదుర్కోవడానికి సాధనంగా ఉపయోగించాడు. ఈ కారణంగా కొంతమంది అతడిని “యూదు గాంధీ ” అని అన్నారు. [4] 1930 ల మధ్య నాటికి, పాత నిషేధాలు చాలావరకు అంతరించాయని మాండెల్‌బామ్ రాసాడు. ఇది భారతీయ సమాజంలో వస్తున్న విస్తృతమైన మార్పులను ప్రతిబింబిస్తుంది. [5]

సేలం 1925 నుండి 1931 వరకూ, మళ్లీ 1939 నుండి 1945 వరకూ కొచ్చిన్ సంస్థానంలో శాసన మండలిలో పనిచేశారు. కేరళలో ప్రారంభమైన కార్మిక సంఘ ఉద్యమానికి అతడు మద్దతుగా నిలిచాడు. అతడు చురుకైన భారతీయ జాతీయవాది, 1929 చివరలో అతను భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సెషన్‌కు హాజరయ్యాడు. బ్రిటిషు వారి నుండి పూర్తి స్వాతంత్ర్యం సాధించాలని ఆ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. [2]

1933 లో పాలస్తీనాను సందర్శించిన తర్వాత, సేలం జియోనిస్ట్ వాదానికి ఆకర్షితుడయ్యాడు. భారత స్వాతంత్ర్యం తరువాత, అతను కొచ్చిన్ యూదులలో ఇజ్రాయెల్‌కు వలస పోవడాన్ని (అలియా) ప్రోత్సహించాడు. 1953 లో అతను, వలస వెళ్లాలనుకునే భారతీయ యూదుల తరపున చర్చలు జరపడానికి ఇజ్రాయెల్‌ సందర్శించాడు. ఇది కొచ్చిన్ యూదుల మధ్య విభేదాలను తగ్గించడానికి కూడా సహాయపడింది. [6] వలస వెళ్ళిన తర్వాత వారందరూ ఇజ్రాయెల్‌లో విదేశీయులుగా పరిగణించబడ్డారు. అక్కడి సమాజంలో కలిసిపోవడానికి అనేకమంది ఇబ్బంది పడ్డారు.

1955 నాటికి కొచ్చిన్ లోని పురాతన యూదు సమాజంలో ఎక్కువమంది ఇజ్రాయెల్‌కు వెళ్లినప్పటికీ (తెల్లజాతి యూదుల్లో అనేక మంది ఉత్తర అమెరికా, ఇంగ్లాండ్ వెళ్ళారు), సేలం మాత్రం 1967 లో మరణించే వరకు కొచ్చిన్‌లోనే నివసించాడు. అతడిని కొచ్చిన్‌లోని జ్యూ టౌన్‌లోని శ్వేతజాతి యూదుల స్మశానవాటికలో ఖననం చేశారు.

గౌరవాలు

· కొచ్చిలోని శ్వేత యూదుల శ్మశానవాటిక పక్కనే ఉన్న రహదారికి సేలం పేరు పెట్టారు. [2]

· మేషుచ్రారిమ్‌లపై వివక్షకు వ్యతిరేకంగా సేలం జరిపిన పోరాటంపై నాథన్ కట్జ్, ఎల్లెన్ గోల్డ్‌బెర్గ్ లు “జెవిష్ అపార్థైడ్ అండ్ ఎ జెవిష్ గాంధీ” పేరిట పుస్తకం రాసారు. [7]

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-4-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

డా. సాగిరాజు గారి తిక్కన ద్రోణ పర్వము.2వ భాగం.27.4.23.

డా. సాగిరాజు గారి తిక్కన ద్రోణ పర్వము.2వ భాగం.27.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.62వ భాగం.శ్రీ శంకరాద్వైతం.27.4.23.

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.62వ భాగం.శ్రీ శంకరాద్వైతం.27.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

కేరళ కాంగ్రెస్ నిర్మాణాత్మక కార్య దర్శి స్వాతంత్ర్య సమర యోధుడు ,’’ఎలంతూర్ గాంధీ సర్వోదయ నాయకుడు —కే.కుమార్

కేరళ కాంగ్రెస్ నిర్మాణాత్మక కార్య దర్శి స్వాతంత్ర్య సమర యోధుడు ,’’ఎలంతూర్ గాంధీ సర్వోదయ నాయకుడు —కే.కుమార్

కె. కుమార్ (1894–1973) భారత స్వాతంత్ర్య పూర్వ యుగంలో భారతీయ వక్త, సంస్కర్త మరియు రచయిత. గాంధీ సందేశాన్ని మరియు జాతీయ ఉద్యమ స్ఫూర్తిని పూర్వపు ట్రావెన్‌కోర్ రాష్ట్రానికి అందించిన తొలి సామాజిక-రాజకీయ నాయకులలో ఆయన ఒకరు . [3] [4] [5] [6] [7] [8] [9] ప్రతిభావంతుడైన అనువాదకుడు, అతను తన కేరళ పర్యటనల సమయంలో గాంధీతో కలిసి ప్రయాణించాడు , అతని ఆంగ్ల ప్రసంగాలను మలయాళంలో వివరించాడు. నెహ్రూ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా ఉన్నారు . కుమార్‌జీ ట్రావెన్‌కోర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు మరియు గాంధీజీ ట్రావెన్‌కోర్ పర్యటనకు ఒకటి కంటే ఎక్కువసార్లు బాధ్యత వహించారు. అతను AICC లో పనిచేశాడు (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ) మరియు AICC (CWC లేదా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ), TC-PCC/ KPCC ( కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ) యొక్క వర్కింగ్ కమిటీలో స్వాతంత్ర్య ఉద్యమం యొక్క కీలకమైన సంవత్సరాల్లో దాని నిర్మాణాత్మక కార్యవర్గానికి నాయకత్వం వహిస్తుంది. అతను ట్రావెన్‌కోర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు [10] (దీనిని ట్రావెన్‌కోర్ కుమార్, ఎలంతూర్ కుమార్‌జీ; కుమార్‌జీ, ఎలంతూర్ గాంధీ మరియు కుజికల కుమార్ అని కూడా పిలుస్తారు) [11] [12] [13] [14] [15] [ 16]

ప్రారంభ జీవితం

“కుమారన్” లేదా సంక్షిప్తంగా “కుమార్”, ఇది K. కుమార్ యొక్క ఇంటి పేరు (పూర్తి పేరు: K. కుమారన్ నాయర్). ‘కె’ అంటే అతని మేనమామ ‘కృష్ణన్ నాయర్’. మాతృవంశం అనేది కేరళ సంప్రదాయం మరియు పిల్లల మొదటి పేరుకు మామగారి పేరును ‘పాట్రనిమిక్’గా జతచేయడం ఆచారం. కె కుమార్ కేరళలోని పాతానంతిట్ట జిల్లా (పాత క్విలాన్/కొల్లాం జిల్లా) లోని ఎలంతూర్ గ్రామంలో సాంప్రదాయ నాయర్ కుటుంబానికి చెందిన పెద్ద కుమారుడు ., (కడువినల్-తజాయమన్నిల్ తరవాడ్). అతని తండ్రి, శ్రీ కె. పద్మనాభన్ నాయర్, ఒక శక్తివంతమైన సామాజిక వ్యక్తి, అతను ట్రావెన్‌కోర్ సంస్థానంలో గొప్ప హోదా కలిగిన రెవెన్యూ అధికారి. హైకోర్టు న్యాయమూర్తిగా మారిన అనుభవజ్ఞుడైన స్వాతంత్ర్య కార్యకర్త చంగనస్సేరి పరమేశ్వరన్ పిళ్లై (1877-1940), [17] మరియు ఉపాధ్యాయుడిగా మారిన న్యాయవాదులు మరియు న్యాయమూర్తులు శంకరవేలిల్ పరమేశ్వరన్ పిళ్లై మరియు వైకోమ్ నారాయణ పిళ్లైలకు సన్నిహిత మిత్రుడు, అతను సమతూక దృక్పథాన్ని పంచుకున్నాడు. బ్రిటీష్ నడిచే ప్రిన్స్లీ స్టేట్ చుట్టూ ఉన్న సామాజిక-రాజకీయ వాస్తవాలు. అతని తల్లి కుంజు పెన్నమ్మ. ‘కుమార’కు సన్నిహిత మిత్రులు మరియు సహచరులు ‘కుమార్’, ‘కుమార్జీ’ లేదా తర్వాత ‘బాపు’ అని పిలిచేవారు. అతను మన్నతు పద్మనాభ పిళ్లైకి సమకాలీనుడు మరియు నాయర్ సర్వీస్ సొసైటీని ఏర్పాటు చేయడంలో అతనికి సహాయం చేశాడు.రిమోట్‌గా కూడా సెక్టారియన్‌గా ఉండకుండా ఒక వాస్తవికత. మన్నతు పద్మనాభన్ కూడా కుమార్ రాజకీయ ప్రచారాలలో పాల్గొనడం ద్వారా అతనికి సహాయం చేసారు. K. కుమార్‌కు సంబంధించిన అనేక ప్రారంభ సూచనలు కేవలం “కుమార్” లేదా “కుమార్‌జీ”గా కనిపించవచ్చు మరియు అరుదుగా ‘కుమారన్’ లేదా ‘కె. కుమారన్ నాయర్’. [18] [19]

చిన్న కుమార్ హరిజన కార్మికుల పిల్లలతో ఇంటికి వచ్చేవాడని, వారికి ఇంటి బయట స్నానం చేయించి, కుటుంబ వంటగదిలో తినిపించేవాడని చెబుతారు. ఇది అన్ని నిబంధనలకు, సామాజిక సంప్రదాయాలకు విరుద్ధం! అవి ఇప్పటికీ కులం మరియు ర్యాంక్ ఆధారిత వివక్ష మరియు ‘తీండాల్’ 20 [21] పరాకాష్టలో ఉన్న రోజులు.సామాజిక ధర్మంగా బహిరంగంగా నిలబెట్టారు. బాలుడిగా ఉన్నప్పుడే కుమార్ యొక్క సమతౌల్య దృక్పథం, అతని సంప్రదాయానికి కట్టుబడి ఉన్న తల్లిపై రూపాంతరం చెందింది. తన కొడుకు ఇంటికి తీసుకువచ్చిన పిల్లలకు ఆహారం పెట్టే పనిని ఆమె వెంటనే చేపట్టింది. అయితే, ఆమె తన కొడుకు ముందు చెరువులో స్నానం చేసి, ఇంట్లోకి ప్రవేశించే ముందు కొత్త బట్టలు మార్చుకోవాలని ఆమె పట్టుబట్టింది….. ఆమెను మార్చడానికి కుటుంబంలోని పండిత సంప్రదాయం కూడా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అణగారిన వారిపై దృక్పథం.

కుమార్ తన ప్రారంభ విద్యను కేరళలోని క్విలాన్ జిల్లాలోని పరవూర్ ఇంగ్లీష్ స్కూల్ మరియు మన్నార్ నాయర్ సొసైటీ హై స్కూల్‌లో చదివాడు. తర్వాత, అతను ఇంటర్మీడియట్ విద్య కోసం మధురై అమెరికన్ కాలేజీ [2] కి మరియు తరువాత ఉన్నత చదువుల కోసం మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్లాడు. అతను ఒక ప్రకాశవంతమైన విద్యార్థి మరియు విశ్వవిద్యాలయ విద్యను పొందిన రాష్ట్రంలోని తొలి విద్యార్థులలో ఒకడు. దేశభక్తి మరియు సహాయ నిరాకరణ కోసం గాంధీ పిలుపు [22] ఆ రోజుల్లో అతనిని మరింత మెరుగ్గా తీసుకుంది మరియు అతను ‘సామాజిక పునర్నిర్మాణం’ కోసం గాంధేయ పనిలో మునిగిపోయాడు, అది అతని తదుపరి చదువులను ప్రభావితం చేసింది. అతను తన ప్రారంభ నిశ్చితార్థానికి ప్రధానంగా ఉత్తర భారతదేశాన్ని ఎంచుకున్నాడు. [23] [24]

సామాజిక రాజకీయ ప్రమేయం యొక్క ఆరంభాలు

K. కుమార్ 1912లో భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యుడు అయ్యారు. [25] ఆ రోజుల్లో INCకి పరిమిత సభ్యులు మాత్రమే ఉన్నారు. గాంధీజీ ప్రేరణతో, అతను తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలో ఉన్నత చదువులు [26] విడిచిపెట్టాడు మరియు త్రివేండ్రం నుండి కాంగ్రెస్‌కు కేరళలోని అతి కొద్ది మంది పూర్తికాల కార్యకర్తలలో ఒకరిగా సేవ చేశాడు. [27] [28] [29] [30] అతను ఆ రోజుల్లో త్రివేండ్రంలో నివసించాడు. [31] [32] V. అచ్యుత మీనన్, పూర్తి సమయం కాంగ్రెస్ పనిలో ఉన్న మరొక అనుభవజ్ఞుడు. (కుమార్‌జీ వలె, అచ్యుత మీనన్‌ను కూడా ప్రజలు మరియు చరిత్రకారులు మరచిపోయారు). కుమార్జీ ప్రసంగాలు రాష్ట్రంలోని మేధావులు మరియు సామాన్యులలో అలలు సృష్టించాయి’ [33] [29] [34] [35][36] డాక్టర్ జి. రామచంద్రన్ [3] [4] , [5] ఖాదీ కమీషన్ మాజీ ఛైర్మన్ మరియు గాంధీగ్రామ్ రూరల్ యూనివర్శిటీ వ్యవస్థాపక వైస్-ఛాన్సలర్ఇలా అన్నారు: “రాజకీయ స్వేచ్ఛ కోసం ఆందోళనలు జరుగుతున్న ఈ ప్రాంతంలో, ఇంతకు మించి మరొక స్వరం వినిపించలేదు. కుమార్జీ కంటే అనర్గళంగా మరియు కదిలేవాడు. రాజకీయాల్లో మరియు నిర్మాణాత్మక పనిలో నేను అతనిని అన్నయ్యలా చూసుకున్నాను.” మాజీ మంత్రి KA దామోదర మీనన్ [6] 25 డిసెంబర్ 2019న వేబ్యాక్ మెషిన్‌లో ఆర్కైవ్ చేయబడింది [7] అతను కె.కుమార్ మరియు పాలియాత్ ప్రసంగాలు వినడానికి “త్రివేండ్రం బీచ్”కి వెళ్ళేటటువంటి తన రూపాంతరం, ప్రారంభ రోజుల గురించి చెప్పాడు. కుంజున్ని అచ్చన్. [37] [38]”కుమార్జీ స్టార్ స్పీకర్ లేకుండా” ఆ రోజుల్లో “త్రివేండ్రంలో రాజకీయ సమావేశం జరగలేదు”. [39] [40]

ఇరవైలలో, కుమార్జీ ‘ స్వదేశాభిమాని ‘ [41] [42] [14] ) ( వక్కం మౌలవి స్థాపించిన వార్తాపత్రిక మరియు బహిష్కరించబడిన స్వదేశాభిమాని రామకృష్ణ పిళ్లై ద్వారా 1910 వరకు నిర్వహించబడింది మరియు సవరించబడింది ), ఉత్తేజపరిచే ప్రయత్నంలో భాగంగా. రాజకీయ దృశ్యం మరియు కేరళలో జాతీయ ఉద్యమానికి నాంది పలికింది. రామకృష్ణ పిళ్లై తర్వాత పత్రికకు పబ్లిషర్ మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ కూడా అయ్యాడు. [43] [30] [42]ఇది సాహసోపేతమైన చర్య, ఇది దాదాపు ప్రభుత్వాన్ని స్తంభింపజేసింది. అయితే, ప్రభుత్వం తెలివిగా వెంటనే స్పందించకూడదని లేదా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. కె. నారాయణ కురుక్కల్ (“పరప్పురం” మరియు “ఉదయభాను” నవలల రచయిత) మరియు బారిస్టర్ ఎ.కె.పిళ్లై కుమార్‌కి అతని ప్రయత్నాలలో సహాయం చేసారు. కురుక్కల్ స్వదేశాభిమాని రామకృష్ణ పిళ్లై సహోద్యోగి మరియు స్నేహితుడు. నారాయణ కురుక్కల్‌తో పాటు, ఆర్. నారాయణ పనిక్కర్, ప్రముఖ రాజకీయ విమర్శకుడు రామన్ మీనన్, స్వదేశాభిమాని రామకృష్ణ పిళ్లై భార్య బి. కళ్యాణి అమ్మ [8] మరియు ఇతర ప్రముఖ రచయిత్రులు ఈ పత్రికకు నిత్యం వ్యాసాలు అందించారు. కుమార్ కూడా సంపాదకీయాలు, వ్యాసాలు రాసేవాడు. K. నారాయణ కురుక్కల్ మరియు బారిస్టర్ AK పిళ్లై °(గమనిక 2 చూడండి) కుమార్‌కు సహాయం చేసారు [44]త్రివేండ్రంలోని థైకాడ్‌లోని ప్రస్తుత DPI ఆఫీస్ (కేరళ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ కార్యాలయం)లో ప్రధాన కార్యాలయం ఉన్న పేపర్‌ను సవరించడానికి. రచయిత మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ శిష్యుడైన కె.సి. పిళ్లై ఆ సమయంలో విద్యార్థిగా ఉన్నారు °(గమనిక 1 చూడండి) , బ్యాక్ ఎండ్ ఆఫీసు-డ్యూటీలలో కుమార్జీకి సహాయం చేయడానికి వార్తాపత్రిక-కార్యాలయానికి వెళ్లేవారు. ఈ పేపర్ కలకత్తా నుండి రామానంద ఛటర్జీచే ప్రచురించబడిన ” మోడరన్ రివ్యూ ” తరహాలో నడుస్తుంది మరియు కుమార్ స్వయంగా వ్రాసిన సాధారణ సంపాదకీయాలతో పాటు బరువైన కథనాలను కలిగి ఉండేది. కుమార్ నాయకత్వంలో ఉన్నంత కాలం “స్వదేశాభిమాని” అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రచురణగా నిలిచిందని కె.సి.పిళ్లై °(గమనిక 1 చూడండి) మరియు ఏవూరు ఎస్.గోపాలన్ నాయర్ అభిప్రాయపడ్డారు. [45] [46]1932 నాటికి ‘స్వదేశాభిమాని’ సంపాదకత్వం AK పిళ్లైకి [47] చేరినట్లు కనిపిస్తోంది. ఆ కాలంలోని కనీసం రెండు ఇతర ప్రభావవంతమైన జాతీయవాద పత్రికలలో – AK పిళ్లై నిర్వహించే ‘స్వరత్’లో కె.కుమార్ ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నారు °( గమనిక 2) తాను మరియు అమ్సీ సోదరులు నిర్వహించే ‘మహాత్మ’ చూడండి. [48] [49] స్వదేశాభిమాని రామకృష్ణ పిళ్లై యొక్క పని కుమార్జీపై తీవ్ర ప్రభావం చూపింది. అతను ఉప్పు చట్టాన్ని [50] [51] [52] ఉల్లంఘించడానికి తన ప్రధాన వేదికలలో ఒకటిగా కన్ననూర్‌ను ఎంచుకున్నాడు మరియు త్రివేండ్రం రాజధాని నగరంలో స్వదేశాభిమాని రామకృష్ణ పిళ్లై విగ్రహాన్ని ప్రతిష్టించడంలో మరియు బహిష్కరణకు సంబంధించిన వార్షిక స్మారకోత్సవాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడు. రావడానికి చాలా కాలం ఉంది [53] [14]

స్వాతంత్ర్య పోరాటంలో

స్వాతంత్ర్య పోరాటంలో, కుమార్‌జీ ట్రావెన్‌కోర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు మరియు గాంధీజీ యొక్క ట్రావాకోర్ పర్యటనకు కూడా ఒకటి కంటే ఎక్కువసార్లు బాధ్యత వహించారు. అతను AICC మరియు TC-PCC/KPCC యొక్క వర్కింగ్ కమిటీలో దాని నిర్మాణాత్మక వర్క్ కమిటీకి నాయకత్వం వహించే కీలకమైన స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేశాడు. [54] [55] [14] [16] [56]

గమనిక: బ్రిటీష్ వారి మద్రాస్ ప్రావిన్స్‌లో భాగమైన మలబార్‌లో మొదట్లో ఏర్పడిన ప్రదేశ్ కాంగ్రెస్, ట్రావెన్‌కోర్ సంస్థానంలో స్థానికంగా అంతగా గుర్తింపు పొందలేదు. అవసరాన్ని బట్టి 1930లో కె. కుమార్ (కుజిక్కల కుమార్), జి రామన్ మీనన్ మరియు విఆర్ నాను నేతృత్వంలో “ట్రావెన్‌కోర్ స్టేట్ కాంగ్రెస్” ఏర్పడిందని పట్టం థాను పిళ్లై చెప్పారు. అయితే, ఉన్న పరిస్థితులలో, అది 1936 నాటికి నిష్క్రియంగా మారింది. [57] [58] 1938లో పట్టం థాను పిళ్లై ఆధ్వర్యంలో ట్రావెన్‌కోర్ స్టేట్ కాంగ్రెస్ కొత్త లక్ష్యాలతో పునర్నిర్మించబడింది. కొత్తగా ఏర్పాటైన పార్టీ పాత్ర తన అభిరుచికి అనుగుణంగా లేనందున, కుమార్ దాని నుండి నిష్క్రియంగా ఉండటానికే ప్రాధాన్యతనిచ్చాడు.

మహాత్మా గాంధీతో పాటు, కుమార్‌జీకి రాజాజీ, పండిట్ నెహ్రూ, CRDలు మరియు ఇతర ప్రముఖ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్వర్గీయ శ్రీ కురూర్ నీలకంఠన్ నంపూతిరిపాడు (మాజీ ఎమ్మెల్యే మరియు అనుభవజ్ఞుడైన గాంధేయవాది) ఇలా గమనించారు: “భారత స్వాతంత్ర్యం కోసం ఆచరణాత్మకంగా అన్ని ఆందోళనలలో చురుకుగా పాల్గొన్న మన స్వాతంత్ర్య సమరయోధులలో కుమార్జీ అత్యంత శ్రమించే వ్యక్తి” [59] [60] [61 ] [ 9 ] . [62] [46] వీటిలో చాలా ముఖ్యమైనవి ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించడం (కోళికోడ్, టెల్లిచెరి మరియు కన్నార్, [63] [64] [65] [66] [67] [68 ] [69] [70] [ 71] [72] [73] అలెప్పీలో శాసనోల్లంఘన లేదా విదేశీ వస్త్ర బహిష్కరణ మరియు పికెటింగ్[25] మరియు ఇతర ప్రాంతాలు [74] [75] [76] మరియు ఆలయ ప్రవేశ ఉద్యమం మరియు ‘అంటరానితనం’ నిర్మూలన, [77] [78] [79] [80] వైకోమ్ సత్యాగ్రహం, [74] [75] [76] ప్రముఖ పాత్ర పోషించారు . 81] [82] [14] [16] [83] [84] [70] నాగ్‌పూర్ ఫ్లాగ్ సత్యాగ్రహ” [10] వేబ్యాక్ మెషిన్ మరియు ఇతర ముఖ్యమైన సామాజిక ఐక్యత కదలికలవద్ద 9 ఆగస్టు 2016న ఆర్కైవ్ చేయబడింది . [85] [86] ఇవి అతనికి కనీసం 21 నెలల జైలు శిక్ష [87] 9 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది [88] [89] [90][91] -. [92] అలెప్పీ మరియు త్రివేండ్రంలో ఒక సంవత్సరం పాటు జరిగిన ఆందోళనలు గాంధేయ భావజాలం మరియు ఖాదీకి సామూహిక మార్పిడులకు దారితీశాయి. స్వదేశీ ఉద్యమం మరియు అలెప్పిలో విదేశీ వస్త్ర బహిష్కరణకు అతని నాయకత్వం అనేక మంది ప్రముఖ, విద్యావంతులైన మహిళలను ముందంజలోకి రావడానికి మరియు జాతీయ ఉద్యమానికి బలమైన మద్దతును అందించడానికి ప్రేరేపించింది. ట్రావెన్‌కోర్ చివరి దివాన్ మరియు కుమార్‌జీ క్లాస్‌మేట్ PGN ఉన్నితాన్ భార్య మరియు ప్రభుత్వ ప్లీడర్ అయిన PG గోవిద పిళ్లై కుమార్తె, [93] స్వదేశాభిమాని TK మాధవన్ మరియు M. కార్త్యాయనీ అమ్మల భార్య పాత్రలుప్రత్యేకంగా ప్రస్తావించదగినవి. [94] [95] [96]

ఖాదీ, హరిజన సంక్షేమం, సర్వోదయ & మత సామరస్యం

ముప్ఫైల చివరి నాటికి, కుమార్జీ తన దృష్టిని హరిజన సంక్షేమం, సర్వోదయ, విద్య మరియు ఖాదీ వైపు మళ్లించాడు [97] [98] అతను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చాడు మరియు హరిజన మరియు సర్వోదయ పాఠశాలలతో సహా అనేక పాఠశాలలను (96 నుండి 110 వరకు చెప్పబడింది) స్థాపించాడు. వీటిలో కొన్ని అరవైలలో మరియు డెబ్బైల ప్రారంభంలో మనుగడలో ఉన్నాయి. కాలక్రమేణా, అతను ఈ సంస్థల నిర్వహణను ప్రధాన ఉపాధ్యాయుడికి లేదా అణగారిన తరగతికి చెందిన విద్యావంతుడికి అప్పగించాడు. అతను హరిజనుల కోసం “కుంబజా ప్రవర్తి పల్లికుడం” పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించాడు, అది తరువాత ప్రస్తుత ప్రభుత్వ VHSS ఎలంతూర్‌కు జీవనాధారంగా మారింది. [99]అంతేకాకుండా, అతను ఖాదీని జీవిత-మిషన్‌గా ప్రమోట్ చేయడం కొనసాగించాడు. ఖాదీ కమిషన్ మాజీ ఛైర్మన్ గాంధేయవాది డాక్టర్. జి. రామచంద్రన్ ఇలా చెప్పినప్పుడు నొక్కిచెప్పారు: “అతని (కుమార్‌జీ) ద్వంద్వ అభిరుచి ఖాదీ మరియు నిషేధాన్ని కలిగి ఉంది… వాస్తవానికి కుమార్‌జీ ఖాదీ మరియు ఖాదీ కుమార్‌జీ… అతనికి తప్పక ట్రావెన్‌కోర్‌లో అందరికంటే ఎక్కువ, మన వేలాది మంది ప్రజల జీవితాల్లోకి వచ్చిన ఖాదీ యొక్క తిరుగులేని ఆకర్షణ”…. [ 100] జి. రామచంద్రన్ తన బహిరంగ ప్రసంగాల ద్వారా కుమార్‌జీకి ఆకర్షితుడయ్యాడు మరియు అతనితో కలిసి జీవించడానికి మరియు పని చేయడానికి ప్రయత్నించాడు. ఖాదీ పనులు చేపట్టేందుకు త్రివేండ్రంలో. ఇరవయ్యో దశకంలో త్రివేండ్రంలో కుమార్‌జీతో కలిసి ఖాదర్‌ని ఇంటింటికీ హ్యాక్ చేయడానికి వెళ్లినట్లు అతను గుర్తుచేసుకున్నాడు.

ఉపేక్షలో మసకబారడం

ఇరవయ్యో దశకం చివరలో తీసుకున్న చర్యలు తాను కలలుగన్నట్లుగా అన్ని సంఘాలను ఏకం చేయడానికి తగినంతగా ఉపయోగపడలేదు, [101] K. కుమార్ మత సామరస్యం కోసం తన ప్రయత్నాలను పునరుద్ధరించాడు. K. కేలప్పన్‌తో , K. కుమార్ కుల స్థితిని సూచించే అతని పేరులోని ప్రత్యయాన్ని తొలగించిన మొదటి వ్యక్తి అయ్యాడు. [102] కాలక్రమేణా, కుమార్ “ప్రతి సంఘం విశ్వసించే ఒక శక్తివంతమైన మత వ్యతిరేక శక్తి” అయ్యాడు. [103] [104] ఏది ఏమైనప్పటికీ, రాజకీయ దురభిమానం మరియు తారుమారు వ్యూహాలు (స్వాతంత్ర్యం తర్వాత ట్రావెన్‌కోర్‌లో జరిగిన ఎన్నికల సమయంలో) ట్రావెన్‌కోర్ యొక్క లౌకిక భావాలను నిర్దాక్షిణ్యంగా దెబ్బతీశాయి, సంవత్సరాల తరబడి కష్టపడి నిర్మించారు మరియు కుమార్‌జీని అతని సైద్ధాంతిక దృఢత్వానికి బలిపశువుగా మార్చారు. వ్యతిరేకంగా చరిత్రాత్మక ఎన్నికల్లో పోటీ చేశారుTM వర్గీస్ [105] స్వతంత్ర అభ్యర్థిగా భావజాలంతో వివాహం చేసుకున్నారు మరియు పెద్ద డబ్బుతో ఆధారితమైన మతపరమైన కార్డును పోషించిన ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ, పట్టోం థాను పిళ్లై అతనిని [106] పట్టం థాను పిళ్లైలోకి చేర్చడానికి TM వర్గీస్ మద్దతుతో తన శాయశక్తులా కృషి చేశారని చెప్పబడింది.హోం మంత్రిగా మంత్రిత్వ శాఖ. సైద్ధాంతిక కారణాలతో కుమార్జీ ప్రతిపాదనను తిరస్కరించారు. స్వతంత్ర భారతదేశం అతనిని గుర్తించడంలో మరియు అతని అసాధారణ లక్షణాలను ఉపయోగించుకోవడంలో విఫలమైంది, కానీ అతను మంచి సంఖ్యలో ప్రజా పురుషులు మరియు రాజకీయ నాయకులకు మార్గదర్శకత్వం మరియు మలచడం కొనసాగించాడు. అంతేకాకుండా స్థానికంగా జరిగే అభివృద్ధి పనుల్లో భారీ స్థాయిలో చురుగ్గా వ్యవహరించారు. ఆయన స్థాపనలో చొరవ తీసుకున్న “సమాజ విందులు”, “తొప్పిప్పల అజిటటైయోన్”, అఖిల తిరువితంకూరు పరాయర్ మహాసభ మరియు కురవర్ మహా సభ వంటి ఉద్యమాల ద్వారా ప్రజలపై పరివర్తన ప్రభావాన్ని చూపగలిగారు. [107] [108] [109] గమనిక: వర్కాల SK రాఘవన్ భిన్నం మరియు PC ఆదిచన్ భిన్నం ఎలంతూర్‌లో కలుసుకుని 1937లో ట్రావెన్‌కోర్ కురవర్ మహాసభను స్థాపించారు, అయితే తర్వాత, అది మళ్లీ విడిపోయినట్లు కనిపిస్తోంది [109 ]

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-27-4-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా. సాగిరాజు గారి తిక్కన ద్రోణ పర్వము. 1వ భాగం.26.4.23.

డా. సాగిరాజు గారి తిక్కన ద్రోణ పర్వము. 1వ భాగం.26.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.60వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం చివరిభాగం.26.4.23.

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.60వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం చివరిభాగం.26.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

అయిదు సార్లు రాజ్యసభకు ఎన్నికై ,ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి ,మహిళా విముక్తి పోరాటం చేసిన –లక్ష్మి ఎస్.మీనన్

అయిదు సార్లు రాజ్యసభకు ఎన్నికై ,ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి ,మహిళా విముక్తి పోరాటం చేసిన –లక్ష్మి ఎస్.మీనన్

.లక్ష్మీ ఎన్ మెమన్ భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు , రాజకీయ నాయకురాలు మరియు సంఘ సంస్కర్త. ఆమె 1962 నుండి 1966 వరకు కేరళ రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు.

త్రివేండ్రం నుండి వచ్చిన ఆమె తల్లిదండ్రులు రామవర్మ తంపన్ మరియు మాధవికుట్టి అమ్మ. ఆమె VK నందన్ మీనన్‌ను వివాహం చేసుకుంది, అతను ట్రావెన్‌కోర్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కి డైరెక్టర్‌గా మారాడు.

ఇంగ్లండ్‌లో అధికారిక విద్యను అభ్యసిస్తున్నప్పుడు, లక్ష్మీ ఎన్ మీనన్ సోవియట్ యూనియన్ పదవ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి విద్యార్థి బృందంలో భాగంగా మాస్కోకు వెళ్లారు.

ఆమె అక్కడ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను కలుసుకుంది, మరియు ఈ ఎన్‌కౌంటర్ ఆమెను రాజకీయాలను కొనసాగించడానికి ప్రేరేపించింది. స్వాతంత్ర్య పోరాటంలో లక్ష్మీ ఎన్ మీనన్ అగ్రగామిగా నిలిచారు.

ఆమె ఐదుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు మరియు 1957 నుండి 1962 వరకు డిప్యూటీ మేనేజర్‌గా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేశారు.

1962లో చైనా భారత్‌పై దాడి చేసినప్పుడు, లక్ష్మీ ఎన్. మీనన్ అనే రోవింగ్ అంబాసిడర్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

లక్ష్మి ఎన్ మీనన్ ఐక్యరాజ్యసమితిలో భారతీయ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ మరియు వివిధ UN ఫోరమ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

ఆమె 1978లో UN హ్యూమన్ రైట్స్ కమీషన్‌కు దేశం యొక్క ప్రతినిధిగా నియమితులయ్యారు. ఆమె అనుభవం ఉన్న తెలివైన మనస్సు మరియు త్వరలోనే సామాజిక క్రియాశీలత మరియు నిగ్రహానికి న్యాయవాదిగా మారింది.

అవగాహన కల్పించేందుకు మారుమూల గ్రామాలను సందర్శించి జాతీయ గీతాలాపన చేయడంలో పేరుగాంచింది .

మద్యం మరియు మాదకద్రవ్యాల వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు, మీనన్ మహిళల హక్కులు మరియు సమానత్వం కోసం కూడా వాదించారు.

గాంధేయ ఆలోచనలు మరియు ఖాదీ దుస్తులతో ప్రభావితమైన మీనన్ మహిళలకు సాధికారత కల్పించాలని మరియు లింగ పాత్రలకు సమానత్వాన్ని తీసుకురావాలని కోరుకున్నారు.

ఆమె మహిళలకు విద్యను సమర్థించింది మరియు మహిళల విముక్తికి విద్య ఉత్తమ మార్గమని నమ్మింది.

2-‘’ట్రావెన్కూర్ ఝాన్సి రాణి’’ ,క్విట్ ఇండియా ఉద్యమనాయకురాలు ,శాసన సభ్యురాలు -అక్కమ్మ చెరియన్

ట్రావెన్‌కోర్‌కు చెందిన అక్కమ్మ చెరియన్ లేదా అచ్చమ్మ చెరియన్, ట్రావెన్‌కోర్ ఝాన్సీ రాణిగా విస్తృతంగా గుర్తింపు పొందారు.

ఆమె కేరళకు చెందిన సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధురాలు. అక్కమ్మ చెరియన్ ట్రావెన్‌కోర్‌లోని కంజిరాపల్లిలో క్రిస్టైన్ తల్లిదండ్రులు తొమ్మన్ చెరియన్ మరియు అన్నమ్మ కరిప్పపరంబిల్‌లకు జన్మించారు.

ఆమె చదువు కోసం కంజిరాపల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మరియు చంగనాచెరిలోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో చదివింది.

ఆమె ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కళాశాల నుండి చరిత్రలో BA పట్టభద్రురాలైంది. 1931లో తన చదువు ముగించిన తర్వాత, ఆమె ఎడక్కరలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ప్రారంభించింది, ఆ తర్వాత ఆమె ప్రధానోపాధ్యాయుని స్థాయికి ఎదిగింది.

ట్రావెన్‌కోర్ స్టేట్ కాంగ్రెస్ ఫిబ్రవరి 1938లో స్థాపించబడింది మరియు ఇది విన్న అక్కమ్మ చెరియన్ విముక్తి కోసం పోరాటంలో చేరడానికి తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు.

అదే సంవత్సరంలో కొంతకాలం, శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిర్వహించినందుకు స్టేట్ కాంగ్రెస్ నిషేధించబడింది.

రాష్ట్ర కాంగ్రెస్ నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అక్కమ్మ చెరియన్ నేతృత్వంలో తంపనూర్ నుంచి మహారాజా చితిర తిరునాళ్ బలరామ వర్మ కొవ్డియార్ ప్యాలెస్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు.

దాదాపు 20,000 మంది గుంపుపై కాల్పులు జరపాలని బ్రిటిష్ పోలీసు చీఫ్ తన అధికారులను ఆదేశించారు. “నేను నాయకుడిని; ఇతరులను చంపే ముందు నన్ను కాల్చివేయండి, ”అచ్చమ్మ చెరియన్ అరిచాడు. ఆమె మాటలు పోలీసులు వెనక్కి తగ్గేలా చేశాయి.

ఈ సంఘటన గాంధీని “ది ఝాన్సీ రాణి ఆఫ్ ట్రావెన్‌కోర్” అని పిలవడానికి ప్రేరేపించింది. 1939లో, నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు ఆమె అరెస్టు చేయబడింది మరియు దోషిగా నిర్ధారించబడింది.

నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, స్టేట్ కాంగ్రెస్ తన ప్రారంభ వార్షిక సమావేశాన్ని 1932 డిసెంబర్ 22 మరియు 23 తేదీల్లో వట్టియూర్కావులో ఏర్పాటు చేసింది.

దాదాపు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అక్కమ్మ మరియు ఆమె సోదరి రోసమ్మ పున్నోస్‌ను బంధించి జైలులో పెట్టారు.

జైలు అధికారుల నుండి ఆమె మాటలతో దుర్భాషలాడడంతో వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడింది. జైలు నుండి విడుదలైన తర్వాత, అక్కమ్మ రాష్ట్ర కాంగ్రెస్‌లో క్రియాశీల సభ్యురాలుగా మారింది, చివరికి తాత్కాలిక అధ్యక్షురాలిగా పనిచేసింది.

ఆమె 1942లో ఆమోదించబడిన క్విట్ ఇండియా తీర్మానానికి బలమైన మద్దతుదారు. ఆగస్టు 8, 1942న భారత జాతీయ కాంగ్రెస్‌లో జరిగిన చారిత్రాత్మక బొంబాయి సమావేశంలో ఆమె అధ్యక్ష ప్రసంగంలో క్విట్ ఇండియా తీర్మానం ఓటు వేయడాన్ని ఆమె ప్రశంసించారు. ఆమెను అరెస్టు చేసి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు.

స్వాతంత్ర్యం తరువాత, అక్కమ్మ చెరియన్ ట్రావెన్‌కోర్ శాసనసభలో ప్రతినిధిగా ఎన్నికయ్యారు.

1951లో అక్కమ్మ ట్రావెన్‌కోర్ కొచ్చిన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు కూడా అయిన స్వాతంత్ర్య సమరయోధుడు వివి వర్కీని వివాహం చేసుకుంది.

వారికి ఇంజనీర్ అయిన జార్జ్ V. వర్కీ అనే కుమారుడు ఉన్నాడు. 1950వ దశకం ప్రారంభంలో, అచ్చమ్మ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి, మువట్టుపుజ లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేసి విఫలమయ్యారు.

1967లో, ఆమె ట్రావెన్‌కోర్‌లోని తన సొంత అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైంది.

1970వ దశకంలో, ఆమె క్రియాశీల రాజకీయాల నుండి రిటైర్ అయ్యారు మరియు స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ అడ్వైజరీ బోర్డులో తన ప్రజా జీవితానికి సేవలందించారు.

అక్కమ్మ మే 5, 1982న మరణించింది. ఆమె గౌరవార్థం తిరువనంతపురంలోని వెల్లయంబలంలో ఒక విగ్రహాన్ని నిర్మించారు.

శ్రీబాల కె. మీనన్ ఆమె జీవితంపై డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. అక్కమ్మ చెరియన్ జైలులో ఉన్నప్పటికీ సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగించింది.

జీవితం: ఒరు సమరం పేరుతో అక్కమ్మ రాసిన ఆత్మకథ. ఈ ఆత్మకథ ఆమె జీవిత పోరాటాలతో పాటు భారత స్వాతంత్ర్య ఉద్యమంపై వెలుగునిచ్చే స్ఫూర్తిదాయకమైన పఠనం.

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేరళ శాసన సభ కు ఎన్నికైన మొదటిస్త్రీ ,మొదటి ప్రోటెం స్పీకర్ ,ప్లాంటేషన్ కార్పోరేషన్ చైర్ పర్సన్ -రోసమ్మ పన్నూస్

కేరళ శాసన సభ కు ఎన్నికైన మొదటిస్త్రీ ,మొదటి ప్రోటెం స్పీకర్ ,ప్లాంటేషన్ కార్పోరేషన్ చైర్ పర్సన్ -రోసమ్మ పన్నూస్

సమ్మ పన్నూస్ ( 1913 మే 12 – 2013 డిసెంబరు 28) భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ వేత్త, న్యాయవాది. ఆమె కేరళ శాసనసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి వ్యక్తి . భారతదేశంలో కోర్టు ఉత్తర్వుల ద్వారా తన స్థానాన్ని కోల్పోయిన మొదటి ఎమ్మెల్యే, ఆమె 1958 లో అసెంబ్లీకి జరిగిన మొట్టమొదటి ఉప ఎన్నికలలో ఎన్నికైన మొదటి వ్యక్తి . రోసమ్మ పన్నూస్ కేరళ శాసనసభ మొదటి ప్రో టెమ్ స్పీకర్. [1]

ప్రారంభ జీవిత౦

రోసమ్మ 1913 మే 12న ట్రావెన్ కోర్ లోని కంజిరప్పల్లిలో ఒక క్యాథలిక్ కుటుంబానికి చెందిన కంజిరపల్లి కరిప్పరంబిల్ తోమ్మన్ చెరియన్, పాయిప్పడు పున్నక్కుడి అన్నమ్మ లకు నాల్గవ సంతానంగా జన్మించింది. [2]

ఆమె మద్రాసు లా కళాశాల నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీని పొందింది. [3]

కెరీర్

ఆమె తన అక్క అక్కమ్మ చెరియన్ చే ప్రభావితమై 1938లో ట్రావెన్ కోర్ స్టేట్ కాంగ్రెస్ లో చేరడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. [4] అక్కమ్మ చెరియన్ కూడా స్వాతంత్ర్య సమరయోధురాలు. సోదరీమణులిద్దరూ 1939లో బ్రిటిష్ వారిచే పూజాపురలోని సెంట్రల్ జైలులో ఖైదు చేయబడ్డారు. రోసమ్మ మూడు సంవత్సరాల తరువాత జైలు నుండి విడుదలచేయబడింది. [4]

రాజకీయం

రోసమ్మ 1946 లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకుడు పి.టి. పన్నూస్ ను వివాహం చేసుకుంది. రోసమ్మ కుటుంబం భారత జాతీయ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. ఇద్దరూ పోప్ నుండి ఒక ప్రత్యేక సమ్మతి లేఖతో కొచ్చిన్ లోని ఒక చర్చిలో వివాహం చేసుకున్నారు.

రోసమ్మ 1948లో సిపిఐలో చేరారు. 1957లో కేరళ రాష్ట్రంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దేవికులం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె భర్త 1952 సార్వత్రిక ఎన్నికలలో లోక్ సభకు ఎన్నికయ్యాడు, 1957 సార్వత్రిక ఎన్నికలలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రోసమ్మ అసెంబ్లీ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వ్యక్తి . [3] ఆమె అసెంబ్లీ మొదటి ప్రో టెమ్ స్పీకర్ అయ్యారు. అయితే కోర్టు జోక్యం తరువాత రోసమ్మ తన స్థానాన్ని కోల్పోయింది, కానీ 1958లో అసెంబ్లీకి జరిగిన మొట్టమొదటి ఉప ఎన్నికలలో తన స్థానాన్నితిరిగి పొందింది.

1964లో పార్టీ చీలిక కారణంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఆవిర్భవించినప్పుడు రోసమ్మ సిపిఐతోనే ఉన్నారు. ఆమె 1982 అసెంబ్లీ ఎన్నికల్లో అలెపీ నియోజకవర్గం నుండి విజయవంతంగా పోటీ చేసింది. 1987 ఎన్నికలలో రోసమ్మ అదే నియోజకవర్గం నుండి రెండవసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. [5]

పదవులు

ఆమె కేరళ మహిళా సంఘం (1969-83) అధ్యక్షురాలిగా, ప్లాంటేషన్ కార్పొరేషన్ (1964-69) చైర్ పర్సన్ గా, హౌసింగ్ బోర్డు (1975-78) అధిపతిగా, 10 సంవత్సరాలు రబ్బర్ బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఆమె 1993 నుండి 1998 వరకు కేరళ మహిళా కమిషన్ కు చైర్ పర్సన్ గా ఉన్నారు. [3]

మరణం

రోసమ్మ తన కుమారుడు థామస్ పన్నూస్ తో నివసిస్తున్న ఒమన్ లోని సలాలాలో 2013 డిసెంబరు 28న మరణించింది. ఆమె మృతదేహాన్ని తిరువల్లాయ్ సమీపం లోగల పామలలోని ఆమె ఇంటికి తీసుకువచ్చారు, అంత్యక్రియలు 2013 డిసెంబరు 30 న తిరువల్లాయ్ సమీపంలోని వారిక్కాడ్ లోని సెహియోన్ మార్ తోమా చర్చిలో జరిగాయి. [4]

2-కేరళ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ,స్వాతంత్ర్య పోరాటం లో సర్వస్వాన్ని త్యజించిన త్యాగమూర్తి ,హరిజన సంక్షేమం ,ఖాదీ వ్యాప్తి కోసం కృషిచేసిన –చునంగత్ కుంజి కావమ్మ

చునంగత్ కుంజికావమ్మ (1894-1974) కేరళకు చెందిన రాజకీయవేత్త. 1938లో ఆమె కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది. అప్పుడు EMS నంబూద్రిపాద్ (తరువాతి కాలంలో కేరళ రాష్ట్రానికి మొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి అయ్యారు) కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.

జీవిత విశేషాలు
చునంగత్ కుంజికావమ్మ పాలక్కాడ్ జిల్లా, ఒట్టపాలెంలోని చునంగత్‌లో ప్రముఖ నాయర్ కుటుంబానికి చెందిన వ్యక్తి. కుంజికావమ్మ 1894 మార్చిలో చునంగత్ అమ్ముణ్ణి అమ్మ, ధర్మోత్ పణిక్కర్ దంపతులకు ఐదవ సంతానంగా జన్మించింది. చునంగత్ యూపీ స్కూల్ నుంచి 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది. 1911లో ఆమె ప్రగతిశీల ఆలోచనాపరుడైన మతిలకత్ వెల్లితోడియిల్ మాధవ మీనన్‌ను పెళ్ళి చేసుకుంది. తరువాత మహాత్మా గాంధీకి అనుచరురాలు అయింది. ఆమెకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆమె బాగా చదివేది. జాతీయ ఉద్యమం లోని గొప్ప నాయకుల రచనలు చదివి భారతదేశాన్ని విదేశీయులు ఆక్రమించవడం గురించి చాలా అర్థం చేసుకుంది. తన మాతృభూమి స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటంలో తలదూర్చడానికి ఆమె తన కుటుంబ వారసత్వంగా వచ్చిన అన్ని భౌతిక సౌకర్యాలను వదులుకోవాలని నిర్ణయించుకుంది.

ఆమె 1930 ల చివరలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రాంతీయ నాయకురాలిగా పావు శతాబ్దం పాటు ఆమె ముందుండి పోరాడింది.

కుంజికావమ్మ స్వాతంత్ర్యోద్యమానికి విరాళాలు అందించింది. ఒకసారి మహాత్మా గాంధీ కేరళ సందర్శించినప్పుడు ఆమె తన కొడుకు మెడలో ఉన్న బంగారు గొలుసును అతడి చేత మహాత్ముడి మెడలో వేయించింది. మరో సందర్భంలో గాంధీజీ జాతీయ మేల్కొలుపుపై ప్రసంగించినప్పుడు, ఆమె తన బంగారు ఆభరణాలను జాతీయ నిధికి విరాళంగా ఇచ్చింది. గాంధీజీ వెంటనే వాటిని హరిజన సంక్షేమ నిధి కోసం వేలం వేశాడు. గాంధీజీ సలహా మేరకు ఆమె కూడా ఆ రోజు నుంచి ఖాదీ ధరించడం ప్రారంభించింది.

మలబార్ ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి రాజకీయ సమావేశం 1921లో ఒట్టపాలెంలో జరిగినప్పుడు, కాంగ్రెస్ మహిళా విభాగాన్ని సమీకరించడం ద్వారా ఆమె తన ఆర్గనైజింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇది ఆమె క్రియాశీల రాజకీయ జీవితానికి నాంది. తరువాత ఆమె కాంగ్రెసు పార్టీకి పూర్తికాల కార్యకర్తగా మారింది. కాంగ్రెస్ ఆదర్శాల గురించి ప్రజలకు తెలిపేందుకు అనేక సమావేశాలను నిర్వహించింది. రాష్ట్ర సదస్సులతో పాటు కాంగ్రెస్ అఖిల భారత సదస్సులలో పాల్గొని తన ప్రాంతంలోని మహిళలను స్వాతంత్ర్య ఉద్యమంలో చేరేలా ప్రోత్సహించింది.

1930, 1932 లలో ఆమె జైలు శిక్ష అనుభవించింది. 1932లో, ఆమె విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ ఒక గొప్ప ప్రదర్శనకు నాయకత్వం వహించింది. ఆమెను అరెస్టు చేసి మూడేళ్లపాటు కన్నూర్ జైలులో ఉంచారు. విడుదలైన తర్వాత ఆమె స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా కొనసాగింది. మళ్లీ అరెస్టై, కుట్టిమాలు అమ్మ, సమువాల్ ఆరోన్, ఆషెర్ వంటి ఇతర గొప్ప మహిళా నాయకులతో పాటు వెల్లూరు జైలులో తదుపరి రెండు సంవత్సరాలు గడిపింది.

1940లో ఆమె భర్త మాధవ మీనన్ మరణించాడు. ఇది కుంజికావమ్మను ఛిన్నాభిన్నం చేసింది. స్వాతంత్ర్యం వచ్చే వరకు తగ్గిన సామర్థ్యంతో కొనసాగినప్పటికీ, ఆమె కాంగ్రెసు కార్యకలాపాల నుండి నెమ్మదిగా వైదొలగడం ప్రారంభించింది. తరువాత ఆమె హరిజనుల సంక్షేమం, ఖాదీ వ్యాప్తి కోసం సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంది. కుంజికావమ్మ తన స్వగ్రామమైన చునంగత్‌లో ఉన్నత పాఠశాల, కస్తూర్బా స్మారక కేంద్రం నిర్మాణానికి సహాయం చేసింది. ఆచార్య వినోబా భావే నేతృత్వంలోని భూదాన్ ఉద్యమానికి తన 8 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చింది.

స్వాతంత్ర్య పోరాటంలో ఆమె పోషించిన పాత్రకు గుర్తింపుగా 1972లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు తామ్ర పత్ర పురస్కారాన్ని అందించింది. జాతీయ ఉద్యమంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఆనాటి కేరళ ప్రభుత్వం వైనాడ్ జిల్లాలో ఆమెకు భూమిని కేటాయించబోగా ఆమె తిరస్కరించింది. తన జీవితంలో చివరి సంవత్సరాలను కుమార్తె వద్ద గడిపింది. 80 ఏళ్ల వయసులో 1974 ఆగస్టు 21న కుంజికావమ్మ మరణించింది.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.19వ చివరి భాగం.25.4.23.

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.19వ చివరి భాగం.25.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.59.వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.25.4.23.

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.59.వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.25.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

మలబార్ రెబిలియన్నాయకడు –ఆలి ముసలియార్

మలబార్ రెబిలియన్ నాయకడు –ఆలి ముసలియార్

1861-1922 మధ్య జీవించిన ఆలి ముసలియార్ కేరళ మలబార్ రెబెలియన్ నాయకుడు ,స్వాతంత్ర్య సమరయోధుడు .1907 నుంచి తిరునంగాడి మసీదు కు ఇమాం గా ఉన్నాడు .బ్రిటీష ప్రభుత్వం పై ఎదురుతిరిగినందున అరెస్ట్ అయి ఉరి తీయబడ్ వరకు ఇమాం గా ఉన్నాడు .మలబార్ ఖిలాఫత్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్నాడు .

  మలబార్ ఎరనాడ్ తాలూకా నెల్లికున్నట్టు దేశం లో పుట్టాడు .తండ్రి కున్హిమోతిన్ మోల్లా .తల్లి కోటక్కై అమ్మ .తల్లి రాడికల్ ఇస్లామిక్ తెగకు చెందింది .ఆలి తాత మూసా మాలప్పురం అమరవీరులలో ఒకరు .ముసలియార్ ఖోరాన్ ,మలయాళం లు క్షుణ్ణంగా నేర్చి ,పొన్ని దేశి లో పై  చదువులు  పదేళ్లు చదివి ఖురాన్, మత విషయాలలో నిష్ణాతుడయ్యాడు .

  ఆతర్వాత మక్కాలో హరాం లో ఉన్నత విద్య నేర్చాడు .జీవితకాలమంతా అనేకమంది ముస్లిం విద్యా వేత్తల నుంచి శిక్షణ పొందాడు .ఏడు ఏళ్లు మక్కాలో గడిపి ,లక్షదీవులలోని కవరాట్టి లో ముఖ్య కాజి అయ్యాడు .1907లో కేరళలోని తిరునంగాడి మసీదుకు చీఫ్ అయ్యాడు .తర్వాత ఖాలిఫత్ అనే ఖిలాఫత్ ఉద్యమ నాయకుడై,22-8-1921లో జమాత్ మసీదు కు ఖాలిఫ్ అమీర్ అయ్యాడు .జియా టాక్సెస్ అన్నిటిని ఖిలాఫత్ ముస్లిం ప్రభుత్వానికి చేరేట్లు చర్యలు చేబట్టాడు .

  ప్రజానాయకుడిగా గుర్తింపు పొంది ,ఇస్లామిక్ ఖలిపత్ మీటింగులు భారీగా నిర్వహించాడు .జీహాద్ ను వ్యాప్తి చేశాడు .భారత దేశ స్వాతంత్ర్యం త్వరలోనే వస్తుందని ,కనుక జీహాద్ ను బలపరుస్తూ కాలనీ ప్రభుత్వాన్ని వ్యత్రేకించమని తీవ్ర ప్రచారం చేశాడు .ఖలీఫత్ వాలంటీర్లను జీహాద్ కోసం శిక్షణ ఇప్పించాడు .ఈ పవిత్ర మత యుద్ధం లో వారంతా ప్రాణాలు త్యజించటానికి సిద్ధం కావాలని బోధించాడు .యూని ఫారం లో ,ఆయుధాలతో వారంతా స్థానికంగా పెరేడ్ చేసేట్లు పురిగొల్పాడు.తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా దాన్ని తీర్చి దిద్దాడు .ఖలీఫాత్ యూనిఫారం కత్తులు ,ఎర్ర జెండాలతో ఆ సైన్యం ‘’అల్లాహో అక్బర్ ‘’అంటూ నినదించింది .వీధులలో పోలీసులను వెంబడించారు .తర్వాత వీరికి ఇతరులకు భేదాలేర్పడటంతో, స్థానికపాలన నిర్వహించటం కష్టం కావటంతో  పోలీసులు దాన్ని చక్కగా ఉపయోగించుకొని ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం చేశారు .

     1921-22  మధ్య జరిగిన ఈ తిరుగుబాటు ఆలిముసలియార్ మొదలైన ముస్లిం నాయకుల అరెస్ట్ తొ మోప్లా లో బ్రిటీష వారు మోప్పురం  మసీదును నాశనం చేశారనే పుకారుతో మోప్లా జీహాదీ గ్రూపులు 15వేలనుంచి  30వేలదాకా రోడ్లపైకి రావటంతో కాలనీ సైనికులు అనేకులు చంపబడ్డారు .హిందూ కుటుంబాల ఆస్తికి ,స్త్రీల రక్షణకు దిక్కులేకుండా పోయింది .దక్షిణ మలబార్ లోని ప్రభుత్వ కార్యాలయాలు రైలు బ్రిడ్జిలకు  ,రహదార్లకు తీవ్ర నష్టం కలిగింది .ప్రభుత్వం వెంటనే మేల్కొని తిరుగుబాటు దారులను అణచి వేయటంలో విజయం సాధించగా  వాళ్ళు గెరిల్లా యుద్ధాలు చేస్తూ భయపెట్టగా, అదనపు బలగాన్ని సంపాదించి కాలనీ ప్రభుత్వం వీధుల్లో కవాతు నిర్వహిస్తూ వారికి సింహస్వప్నం గా నిలిచింది .క్రమంగా 1922 ఫిబ్రవరికి తిరుగుబాటు అంతమొందింది .ఆలి ముసలియార్ తోపాటు ఒక డజన్ మంది జీహాద్ నాయకులను అరెస్ట్ చేసి విచారించి ప్రభుత్వం మరణశిక్ష విధించింది . .ఆలి ముసలియార్ ను కోయమబత్తూరు జైలులో 17-2-1922 న ఉరి తీశారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-23-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.18వ భాగం. 24.4.23.

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.18వ భాగం. 24.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.58వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.24.4.23.

రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.58వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.24.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

కేరళ గాంధి -కేలప్పన్

కేరళ గాంధి -కేలప్పన్

కోలపల్లి కేలప్పన్ 24-8-1889 న జన్మించి 7-10-1971న 82వ ఏట మరణించారు .భారత స్వాతంత్ర్య పోరాటం లో చురుకైన పాత్రపోషించిన విద్యావేత్త జర్నలిస్ట్ కేలప్పన్.కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనాయకులు అవటంతో అందరూ ‘’కేరళ గాంధీ ‘’అని గౌరవంగా సంబోధించేవారు .దేశం స్వాతంత్ర్యం పొందాక గాంధీ సేవా సంస్థలలో ముఖ్య పదవులు చేబట్టి సేవలందించారు .నాయర్ సర్విస్ సొసైటి కి సంస్థాపక సభ్యులు ,ప్రెసిడెంట్ కూడా .కేరళ క్షేత్ర సంరక్షణ సమితి అంటే దేవాలయ సంరక్షణ  ఉద్యమ సారధి .

 కేరళలోని కాలికట్ లోని కోయిలాండి లో ఉన్న ముచుకున్నూరు గ్రామం లో కననార్ నాయర్ ,కుంజమ్మ అమ్మ దంపతులకు  జన్మించిన కేలప్పన్  ,కాలికట్ ,మద్రాస్ లలో చదివి ,మద్రాస్ యూనివర్సిటి నుంచి డిగ్రీ పొంది ,చన్నగానేస్వరి లోని  సెయింట్ బెర్చ్ మానస్ హై స్కూల్ లో టీచర్ గా పని చేశారు .నాయర్ సర్విస్ సొసైటీ స్థాపించి ,ప్రెసిడెంట్ అయి ,ఆ సొసైటీ నిర్వహించే స్కూల్ ప్రిన్సిపాల్ అయ్యారు .

  ఒకవైపు సాంఘిక సంస్కరణలకు పోరాడుతూ మరోప్రక్క బ్రిటీష వారిపై భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించారు .అస్పృశ్యతా నివారణకు ,కులాదార వివక్ష పై పోరాటం చేశారు .తమ పేరు చివర ఉండే కుల సంబంధ మైన పదాన్ని తొలగి౦చు కోవటానికి ప్రయత్నించిన ప్రధములలో కే.కుమార్ తోపాటు కేలప్పన్ కూడా ఉన్నారు .అప్పటినుంచి ప్రజలు ఆయనను ‘’కేరళ గాంధి ‘’అని గౌరవించటం ప్రారంభించారు .

  కేరళలోని అన్ని కులాల మధ్య సామరస్యం ,ఐక్యత సాధించటానికి కేలప్పన్ విశేష కృషి చేశారు .1932లో వైకోం సత్యాగ్రహాన్ని,గురువాయూర్ సత్యాగ్రహాన్ని నిర్వహించటం లో కీలక పాత్ర పోషించారు.మహాత్మా గాంధి తిరువాన్కూర్ సందర్శించి దేవాలయ ప్రవేశ ప్రకటన పై సంతకం చేసిన రెండవ వ్యక్తిగా ,సాంఘిక అసమానత రూపు మాపే ఉద్యమ నిర్మాతగా గాంధీని పూర్తిగా నమ్మిన అనుయాయిగా కేలప్పన్ పేరు పొందారు . వైకోం  సత్యాగ్రహ అగ్రనాయకులలో ఒకరైన ట్రావెంకూర్ కు చెందిన కే కుమార్  ఆ రిజల్యూషన్ ను అందజేసిన వారుగా ప్రసిద్ధిపొందగా,ఆతర్వాత దాన్ని ప్రజలు ,చరిత్రకారులు మర్చే పోయారు .

  ఇండియా స్వాతంత్ర్యం పొందాక కేలప్పన్ కాంగ్రెస్ పార్టి కి రాజీనామా చేసి  ‘’కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టి’’  లో చేరి ,పొన్నాని లోక సభా స్థానానికి పోటీ చేసి 1952లో ఎన్నికై లోక సభ సభ్యుడయ్యారు .అయిదేళ్ళతర్వాత రాజకీయాలు వదిలేసి సర్వోదయ ఉద్యమం లో చేరారు .మాతృభూమి పత్రిక స్థాపనలో సహకరించి సంపాదకులుగా కొంతకాలం పని చేశారు .భాషా ప్రాతిపదిక రాష్ట్రం గా కేరళ ఏర్పడటానికి కృషి చేశారు .కేరళ సర్వోదయ సంస్థ ,కేరళ గాంధీ స్మారక నిది ,కాలికట్ గాంధీ పీస్ ఫౌ౦డేషన్ వంటి అనేక సంస్థలలో గౌరవ స్థానం లో పని చేశారు .కేరళలో ముస్లిం మెజారిటి ఉన్న మలం పురం జిల్లా ఏర్పడటాన్ని, అది మరోపాకిస్తాన్ కు దారితీస్తుందనే అభిప్రాయంతో వ్యతిరేకించారు కేలప్పన్ .  తాళి టెంపుల్ మువ్ మెంట్ లో ముఖ్య పాత్ర పోషించారు .అది సాకారం ఆయె సమయంలో దాన్ని చూడకుండానే ఆయన 7-10-1971న మరణించారు .ఆయన భావి౦చినట్లే మనప్పురం లో ముస్లిం మసీద్ ప్రక్కనే తాళి దేవాలయం నిర్మించారు .1990లో భారత ప్రభుత్వం ‘’కేరళ గాంధి కేలప్పన్’’గౌరవార్ధం ఆయన పేరిట పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-23-4-23-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు. 17వ భాగం. 23.4.23.

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు. 17వ భాగం. 23.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.57వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.23..4.23.

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.57వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.23..4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

దక్షిణాఫ్రికా నుంచి గాంధీని పిలిపించినవాడు ,అసలైన భారతీయుడిగా జీవిస్తూ ,గాంధీ ,టాగూర్ ల కు అత్యంత సన్నిహితుడు –దీనబంధు -సి.ఎఫ్ .ఆండ్రూస్

దక్షిణాఫ్రికా నుంచి గాంధీని పిలిపించినవాడు ,అసలైన భారతీయుడిగా జీవిస్తూ ,గాంధీ ,టాగూర్ ల కు అత్యంత సన్నిహితుడు –దీనబంధు -సి.ఎఫ్ .ఆండ్రూస్

చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ 12-2-1871 న యునై టేడ్ కింగ్డం లోని ఉత్తర ఐర్లాండ్ లోని బ్లూనేల్ న్యు కాజిల్ అపాన్ లో పుట్టాడు . తండ్రి జాన్ ఎడ్విన్ ఆండ్రూస్ బర్మింగ్ హాం లోని కేధలిక్ అపో స్టేలిక్ చర్చికి ఎంజెల్ అంటే బిషప్.14మంది సంతానం లో ఒకడు . తండ్రి అతని స్నేహితుదివలన మోసపోయి ఆర్ధికంగా కుంగిపోయి కుటుంబ పోషణకు బాగా ఇబ్బంది పడ్డాడు .బర్మింగ్ హాం లోకింగ్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదివిన ఆండ్రూస్ ,తర్వాత కేంబ్రిడ్జ్ పెంట్రోక్ కాలేజిలోక్లాసిక్స్ చదివి ,చర్చ ఆఫ్ ఇంగ్లాండ్ ఆర్డినేషన్ పొందాడు .1896లో డీకన్ అయి సౌత్ లండన్ పెంట్రోక్ కాలేజి మిషన్ లో చేరాడు .ఒక ఏడాది తర్వాత పూజారి అయి ,కేంబ్రిడ్జ్ లోని వెస్ట్ కాట్ హౌస్ దియోలాజికల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ అయ్యాడు . ,విద్యావేత్త ,సంఘ సంస్కర్త ,భారత స్వాతంత్ర్యం కోసం పాటుపడిన వాడు .రవీంద్రునికి ,మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడు .పౌరహక్కులకోసం దక్షిణాఫ్రికాలో సఫల పోరాటం పోరాటం చేసిన గాంధీని భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయటానికి ఒప్పించి పిలిపించాడు .గాంధీ ఈయనను క్రీస్తు కు అత్యంత నమ్మకమైన ‘’అపోస్టల్ ‘’అని గౌరవంగా పిలిచేవాడు .భారత స్వాతంత్రోద్యమానికి చేసిన కృషికి ఆయనను ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్ కాలేజి విద్యార్ధులు ‘’దీనబంధు ‘’అనీ ,పేదల పెన్నిధి అని గౌరవంగా సంబోధించేవారు .

ఆండ్రూస్ విశ్వవిద్యాలయం నుండి క్రిస్టియన్ సోషల్ యూనియన్‌లో నిమగ్నమై ఉన్నాడు మరియు సువార్త పట్ల నిబద్ధత మరియు న్యాయం పట్ల నిబద్ధత మధ్య సంబంధాన్ని అన్వేషించడానికి ఆసక్తిని కలిగి ఉన్నాడు , దీని ద్వారా అతను బ్రిటిష్ సామ్రాజ్యం అంతటా , ముఖ్యంగా భారతదేశంలో న్యాయం కోసం పోరాటాలకు ఆకర్షితుడయ్యాడు .

1904లో అతను ఢిల్లీలోని కేంబ్రిడ్జ్ మిషన్‌లో చేరాడు మరియు సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో తత్వశాస్త్రం బోధించడానికి అక్కడికి చేరుకున్నాడు , అక్కడ అతను తన భారతీయ సహచరులు మరియు విద్యార్థులతో సన్నిహితంగా మెలిగాడు. కొంతమంది బ్రిటీష్ అధికారులు మరియు పౌరులు భారతీయుల పట్ల జాత్యహంకార ప్రవర్తన మరియు వ్యవహారశైలితో విసిగిపోయిన అతను భారతీయ రాజకీయ ఆకాంక్షలకు మద్దతు ఇచ్చాడు మరియు 1906లో సివిల్ అండ్ మిలిటరీ గెజిట్‌లో ఈ భావాలను వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాశాడు . ఆండ్రూస్ త్వరలోనే భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నాడు మరియు మద్రాసులో 1913 పత్తి కార్మికుల సమ్మెను పరిష్కరించడంలో సహాయం చేశాడు .

దక్షిణాఫ్రికాలో గాంధీతో

అతని ఒప్పించడం, తెలివితేటలు మరియు నైతిక నిజాయితీకి పేరుగాంచిన ఆయనను భారతీయ సీనియర్ రాజకీయ నాయకుడు గోపాల్ కృష్ణ గోఖలే దక్షిణాఫ్రికా సందర్శించి అక్కడి భారతీయ సమాజానికి ప్రభుత్వంతో రాజకీయ వివాదాలను పరిష్కరించుకోవడానికి సహాయం చేయవలసిందిగా కోరారు . జనవరి 1914లో వచ్చిన అతను, 44 ఏళ్ల గుజరాతీ న్యాయవాది మోహన్‌దాస్ గాంధీని కలిశాడు, అతను జాతి వివక్షత మరియు వారి పౌర హక్కులను ఉల్లంఘించే పోలీసు చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ సమాజం యొక్క ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్నాడు . ఆండ్రూస్ క్రైస్తవ విలువలపై గాంధీకి ఉన్న జ్ఞానం మరియు అహింసా ( అహింస ) భావనను సమర్థించడంతో బాగా ఆకట్టుకున్నాడు – గాంధీ ఈ అంశాల నుండి ప్రేరణతో మిళితం చేయబడింది.క్రైస్తవ అరాచకవాదం .

జనరల్ జాన్ స్మట్స్‌తో జరిపిన చర్చలలో ఆండ్రూస్ గాంధీకి సహాయకుడిగా పనిచేశాడు మరియు వారి పరస్పర చర్యల యొక్క కొన్ని సూక్ష్మ వివరాలను ఖరారు చేసే బాధ్యతను కలిగి ఉన్నాడు. [2]

అనేక మంది భారతీయ కాంగ్రెస్ నాయకులు మరియు సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుసిల్ కుమార్ రుద్ర సలహాను అనుసరించి , ఆండ్రూస్ 1915లో గాంధీని తనతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చేలా ఒప్పించడంలో కీలకపాత్ర పోషించాడు.

ఠాగూర్ మరియు నారాయణ గురు

1918లో ఆండ్రూస్ మొదటి ప్రపంచ యుద్ధం కోసం పోరాట యోధులను నియమించడానికి గాంధీ చేసిన ప్రయత్నాలతో విభేదించాడు , ఇది అహింసపై వారి అభిప్రాయాలకు విరుద్ధంగా ఉందని నమ్మాడు. గాంధీ యొక్క రిక్రూట్‌మెంట్ ప్రచారం గురించి మహాత్మా గాంధీ యొక్క ఆలోచనలలో ఆండ్రూస్ ఇలా వ్రాశారు: “వ్యక్తిగతంగా నేను ఇతర అంశాలలో అతని స్వంత ప్రవర్తనతో దీనిని ఎన్నడూ పునరుద్దరించలేకపోయాను, మరియు నేను బాధాకరమైన అసమ్మతిని కనుగొన్న అంశాలలో ఇది ఒకటి.” [3]

ఆండ్రూస్ 1925 మరియు 1927లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు .

ఆండ్రూస్ క్రైస్తవులు మరియు హిందువుల మధ్య సంభాషణను అభివృద్ధి చేశాడు . కవి మరియు తత్వవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్‌తో సంభాషణలో అతను శాంతినికేతన్‌లో చాలా సమయం గడిపాడు . ‘బహిష్కృతుల అంటరానితనాన్ని’ నిషేధించాలనే ఉద్యమానికి ఆయన మద్దతు కూడా ఇచ్చారు. 1919 లో అతను ప్రసిద్ధ వైకోమ్ సత్యాగ్రహంలో చేరాడు మరియు 1933 లో దళితుల డిమాండ్లను రూపొందించడంలో BR అంబేద్కర్‌కు సహాయం చేశాడు .

అతను మరియు అగాథా హారిసన్ గాంధీ UK పర్యటనకు ఏర్పాట్లు చేశారు. [4] అతను లండన్‌లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు గాంధీతో కలిసి వెళ్లాడు , భారత స్వయంప్రతిపత్తి మరియు అధికార వికేంద్రీకరణ విషయాలపై బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు జరపడంలో అతనికి సహాయం చేశాడు .

ఫిజీలో

క్రైస్తవ మిషనరీలు JW బర్టన్ , హన్నా డడ్లీ మరియు R. పైపర్ [ ఎవరు? ] మరియు ఫిజీలో భారతీయ ఒప్పంద కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు తిరిగి వచ్చిన ఒప్పంద కార్మికుడు తోటారామ్ సనాధ్య , సెప్టెంబర్ 1915లో భారత ప్రభుత్వం ఆండ్రూస్ మరియు విలియం W. పియర్సన్‌లను పంపింది.విచారణలు చేయడానికి. ఇద్దరూ అనేక తోటలను సందర్శించారు మరియు ఒప్పంద కార్మికులు, పర్యవేక్షకులు మరియు ప్రభుత్వ అధికారులను ఇంటర్వ్యూ చేశారు మరియు భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు తిరిగి వచ్చిన కార్మికులను కూడా ఇంటర్వ్యూ చేశారు. వారి “రిపోర్ట్ ఆన్ ఇండెంచర్డ్ లేబర్ ఇన్ ఫిజీ”లో ఆండ్రూస్ మరియు పియర్సన్ ఒప్పంద వ్యవస్థ యొక్క దుష్ప్రభావాలను ఎత్తి చూపారు; ఇది బ్రిటీష్ కాలనీలకు భారతీయ కార్మికుల మరింత రవాణా ముగింపుకు దారితీసింది . 1917లో ఆండ్రూస్ ఫిజీకి రెండవసారి సందర్శించాడు మరియు అతను కొన్ని మెరుగుదలలను నివేదించినప్పటికీ, ఒప్పంద కార్మికుల నైతిక అధోకరణం గురించి ఇప్పటికీ భయపడిపోయాడు. అతను ఒప్పందాన్ని వెంటనే ముగించాలని పిలుపునిచ్చారు; మరియు భారతీయ ఒప్పంద కార్మిక వ్యవస్థ 1920లో అధికారికంగా రద్దు చేయబడింది.

1936లో, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నప్పుడు, ఆండ్రూస్ ఫిజీకి ఆహ్వానించబడ్డారు మరియు మళ్లీ సందర్శించారు. మాజీ ఒప్పంద కార్మికులు మరియు వారి వారసులు కొత్త రకమైన బానిసత్వాన్ని అధిగమించడానికి సహాయం చేయాలని కోరుకున్నారు , దీని ద్వారా వారు తమ జీవితంలోని అన్ని అంశాలను నియంత్రించే కలోనియల్ షుగర్ రిఫైనింగ్ కంపెనీకి కట్టుబడి ఉన్నారు. అయితే, ఆండ్రూస్ తన చివరి పర్యటన నుండి పరిస్థితులలో మెరుగుదలలతో సంతోషించాడు మరియు ఫిజీ భారతీయులను “ఫిజి ఫిజియన్లకు చెందినదని మరియు వారు అక్కడ అతిథులుగా ఉన్నారని గుర్తుంచుకోండి” అని కోరారు.

తరువాత జీవితం

ఈ సమయంలో గాంధీ ఆండ్రూస్‌తో వాదించారు, తనలాంటి సానుభూతిగల బ్రిటన్‌లు స్వాతంత్ర్య పోరాటాన్ని భారతీయులకు వదిలివేయడం ఉత్తమం. కాబట్టి 1935 నుండి ఆండ్రూస్ బ్రిటన్‌లో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు, రాడికల్ శిష్యత్వానికి క్రీస్తు పిలుపు గురించి దేశవ్యాప్తంగా ఉన్న యువకులకు బోధించాడు . ఆండ్రూస్‌కు గాంధీ యొక్క ఆప్యాయతతో కూడిన మారుపేరు క్రీస్తు యొక్క నమ్మకమైన అపోస్టల్ , అతని పేరు “CFA” యొక్క మొదటి అక్షరాల ఆధారంగా. అతను గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ప్రసిద్ధి చెందాడు మరియు గాంధీని తన మొదటి పేరు మోహన్ అని పిలిచే ఏకైక ప్రధాన వ్యక్తి కావచ్చు. [5]

చార్లీ ఆండ్రూస్ 5 ఏప్రిల్ 1940న కలకత్తా సందర్శన సమయంలో మరణించాడు మరియు కలకత్తాలోని లోయర్ సర్క్యులర్ రోడ్ స్మశానవాటికలోని ‘క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్’లో ఖననం చేయబడ్డాడు . [6] [7]

సంస్మరణ

అతను భారతదేశంలో విస్తృతంగా స్మరించబడతాడు మరియు గౌరవించబడ్డాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలోని రెండు అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలలు , దీనబంధు ఆండ్రూస్ కళాశాల , మరియు దీనబంధు ఇన్‌స్టిట్యూషన్ మరియు దక్షిణ కోల్‌కతాలోని సలీంపూర్ ప్రాంతంలో ఉన్న ఒక ఉన్నత పాఠశాల అతని పేరును స్మరించుకుంటాయి. దీనబంధు ఆండ్రూస్ కళాశాల పూర్వపు తూర్పు పాకిస్తాన్ , ప్రస్తుతం బంగ్లాదేశ్ నుండి స్థానభ్రంశం చెందిన వారి పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో స్థాపించబడింది . [8] దక్షిణ భారతదేశంలో కూడా, ఆసుపత్రులకు దీనబంధు అని పేరు పెట్టడం ద్వారా అతను జ్ఞాపకం చేసుకున్నాడు. అలాంటిది కేరళలోని పాలక్కాడ్‌లోని తాచంపరలోని దీనబంధు హాస్పిటల్ .

1948లో, కాట్పాడిలో పాస్టర్ అయిన జోసెఫ్ జాన్ , గాంధీలు మరియు CF ఆండ్రూస్ ఆలోచనల నుండి ఎంతగానో స్ఫూర్తి పొంది, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మారుమూల ప్రాంతంలోని పేద మరియు కులరహితులకు సేవ చేయడానికి తన మంత్రిత్వ శాఖను విడిచిపెట్టి ఒక గ్రామం / రూరల్ లైఫ్ సెంటర్‌ను స్థాపించారు. , అతను దీనబంధుపురం అని పిలిచాడు.

1982లో రిచర్డ్ అటెన్‌బరో రూపొందించిన గాంధీ చిత్రంలో బ్రిటిష్ నటుడు ఇయాన్ చార్లెసన్ పోషించిన పాత్రలో ఆండ్రూస్ ప్రధాన పాత్ర పోషించారు . అతను ఫిబ్రవరి 12 న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఎపిస్కోపల్ చర్చి యొక్క ప్రార్ధనా క్యాలెండర్లో తక్కువ విందుతో సత్కరించబడ్డాడు . [9] [10]

1971లో, భారతదేశం ఆండ్రూస్ జన్మ శతాబ్దికి గుర్తుగా స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

ప్రచురణలు

· హకీమ్ అజ్మల్ ఖాన్ అతని జీవితం మరియు కెరీర్ యొక్క స్కెచ్. మద్రాసు: జిఎ నటేశన్. (1922)

· ది రిలేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ టు ది కాన్ఫ్లిక్ట్ బిట్ క్యాపిటల్ అండ్ లేబర్ (1896)

· భారతదేశంలో పునరుజ్జీవనం: దాని మిషనరీ కోణం (1912)

· నాన్-కో-ఆపరేషన్ . మద్రాస్: గణేష్ & కో. 1920. మూలం నుండి 30 నవంబర్ 2013 న ఆర్కైవు చేసారు.

· క్రైస్ట్ అండ్ లేబర్ (1923)

· మహాత్మా గాంధీ హిజ్ లైఫ్ అండ్ వర్క్స్ (1930) స్టార్‌లైట్ పాత్స్ పబ్లిషింగ్ (2007) ద్వారా అరుణ్ గాంధీ ముందుమాటతో తిరిగి ప్రచురించబడింది

· నేను క్రీస్తుకు రుణపడి ఉంటాను (1932)

· ది సెర్మన్ ఆన్ దమౌంట్

1903లో సొసైటీ ఫర్ ది ప్రొపగేషన్ ఆఫ్ ది గోస్పెల్ (SPG) ఢిల్లీలోని కేంబ్రిడ్జ్ బ్రదర్‌హుడ్ సభ్యునిగా నియమించబడ్డాడు. మార్చి 1904లో, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో టీచింగ్ అసైన్‌మెంట్ తీసుకోవడానికి ఆండ్రూస్ భారతదేశానికి వచ్చారు. ఆండ్రూస్ మరియు భారతీయ విద్యావేత్త గోపాల్ కృష్ణ గోఖలేస్నేహితులుగా మారారు మరియు ఒప్పంద కార్మిక వ్యవస్థ యొక్క తప్పులు మరియు దక్షిణాఫ్రికాలో భారతీయుల బాధలను ఆండ్రూస్‌కు మొదట పరిచయం చేసింది గోఖలే . ఆండ్రూస్ 1913 చివరిలో మహాత్మా MK గాంధీకి అతని అహింసాత్మక ప్రతిఘటన ఉద్యమం లేదా సత్యాగ్రహంలో సహాయం చేయడానికి దక్షిణాఫ్రికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు . అతను డర్బన్‌కు చేరుకున్నప్పుడు గాంధీ అతన్ని కలుసుకున్నాడు, ఆ తర్వాత ఆండ్రూస్ వంగి అతని పాదాలను తాకాడు. ఈ సందర్భంగా, ఆండ్రూస్ తరువాత ఇలా వ్రాశాడు, “మన హృదయాలు ఒకరినొకరు చూసిన మొదటి క్షణం నుండి కలుసుకున్నాయి మరియు అప్పటి నుండి వారు ప్రేమ యొక్క బలమైన బంధాల ద్వారా ఐక్యంగా ఉన్నారు.”

ఆండ్రూస్ స్నేహితుల్లో మరొకరు రవీంద్రనాథ్ ఠాగూర్ . సాంఘిక సంస్కరణల పట్ల ఠాగూర్ యొక్క లోతైన శ్రద్ధకు ఆండ్రూస్ ఆకర్షితుడయ్యాడు మరియు చివరికి ఆండ్రూస్ ఠాగూర్ యొక్క ప్రయోగాత్మక పాఠశాల అయిన శాంతినికేతన్‌ను కలకత్తా (కోల్‌కతా) సమీపంలోని “శాంతి నివాసం”గా మార్చాడు. ఆండ్రూస్ చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ నుండి ఎప్పటికీ బయలుదేరనప్పటికీ , అతను బ్రదర్‌హుడ్ ఆఫ్ కేంబ్రిడ్జ్ మిషన్‌కు రాజీనామా చేశాడు. ఆండ్రూస్ తన స్వంత ఆధ్యాత్మిక యాత్రలో, క్రీస్తు యొక్క కారణం దోపిడీకి గురైన కార్మికులు, తిరస్కరించబడిన బహిష్కృతులు మరియు పని మరియు రొట్టెల కోసం కష్టపడే వారికి కారణమని నమ్మాడు.

జూలై 1914లో దక్షిణాఫ్రికాను విడిచిపెట్టిన తర్వాత, ఆండ్రూస్ ఫిజీ, జపాన్, కెన్యా మరియు సిలోన్ ( శ్రీలంక ) సహా అనేక దేశాలకు ప్రయాణించారు, ఎక్కువగా భారతీయ కార్మికుల తరపున. 1920వ దశకంలో, అతను ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవహారాలతో సన్నిహితంగా పాలుపంచుకున్నాడు, 1925లో అతను అధ్యక్షుడయ్యాడు. 1930ల ప్రారంభంలో, లండన్‌లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సన్నాహాల్లో గాంధీకి ఆండ్రూస్ సహకరించాడు. కానీ 1935లో కేంబ్రిడ్జ్ నుండి మొదటిసారిగా ప్రకటించబడిన సయోధ్య మంత్రి గురించి ఆండ్రూస్ యొక్క ఆలోచన ప్రత్యేకమైనది. ఆండ్రూస్ ఎక్కడికి వెళ్లినా సయోధ్య మంత్రిగా విస్తృతంగా అంగీకరించబడ్డాడు. మతపరమైన వర్ణపటంలో చాలా మంది ఆండ్రూస్ చేత ప్రభావితమయ్యారు. అతను కలకత్తాలో మరణించినప్పుడు, 4 ఏప్రిల్ 1940 న, అతని స్నేహితుడు మహాత్మా గాంధీ అతని పక్కన ఉండటానికి భారతదేశం అంతటా ప్రయాణించారు.

CF ఆండ్రూస్ మహాత్మా గాంధీపై మూడు పుస్తకాలతో సహా అనేక రచనల రచయిత. అతని రచనలలో ది అప్రెషన్ ఆఫ్ ది పూర్ (1921); ది ఇండియన్ ప్రాబ్లమ్ (1922); ది రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ఇండియా (1938); మరియు ది ట్రూ ఇండియా: ఎ ప్లీ ఫర్ అండర్స్టాండింగ్ (1939).

మాతృభూమి సంపాదకుడు వైకోం సత్యాగ్రహి ,ఆకలక దేశ భక్తుడు కేరళ నాయకుడు కెపి కేశవ మీనన్ ఆండ్రూస్ తో అత్యంత సన్నిహితంగా మేలిగినవాడు ఆండ్రూస్ ను దైవంగా భావించాడు ఆయన మాటలలోనే ‘’ఒక సారి చూస్తె మరువలేనంతటి గొప్ప సంస్కార సంపన్నుడు ఆండ్రూస్ .భారతీయ సంప్రదాయం ప్రకారం పంచ కట్టుకొని ,తెల్లటి పొడవైన చొక్కా వేసుకొని ,నల్లటి పొడవైన గడ్డం తో చేతులు జోడించి ,శాంతం ,ప్రేమ ప్రతి బి౦బిస్తుండగా మందహాసంతో మనల్ని సమీపించే ,ఆ దివ్య రూపాన్ని చూస్తె శరీరం గగుర్పొడుస్తుంది .ఆయన హృదయంలో కళంకం అన్న మాటకే స్థానం లేదు. ఎక్కడెక్కడ ప్రజలు బాధ పడుతున్నారో ,,ఎక్కడ అజ్ఞానం బానిసత్వపు చీకట్లు అలుముకున్నాయో ,,అక్కడ దయామయుడు ఆండ్రూస్ ప్రత్యక్షమయ్యేవాడు .పుట్టుకతో ఆంగ్లేయుడే అయినా ,భారత దేశాన్ని మాతృభూమిగా స్వీకరించాడు .భారత లో అనేక ప్రాంతాలు ,దక్షిణాఫ్రికా శ్రీలంక ,మలయా,మారిషస్ మొదలైన దేశాలు సంచరించి ,భారతీయుల కష్టాలను తెలుసుకొని ,వారికి చేతనైనంత సాయం చేసేవాడు .కట్టుకొనే బట్టలగురించి తినే తిండి ,దారిఖర్చులు గురించి ఆయనకు ధ్యాసే ఉండేదికాదు.అవన్నీ భగవంతుడే ఏర్పాటు చేస్తాడని ,సేవ చేయటమే మన కర్తవ్యం అని భావించే కరుణామూర్తి ఆయన .

రవీంద్రుని శాంతినికేతన్ లోనే ఆండ్రూస్ ఉండేవారు .విశ్వ భారతిలో ఉపాధ్యాయుడు ఆయన .గాంధీకి ఆరోగ్యం బాగా లేదని తెలిస్తే ఆఘమేఘాలమీద వెళ్లి సేవ చేసే వాడు .టాగూర్ ఆరోగ్య విషయంలోనూ ఇలానే పని చేసేవాడు .మలబార్ ఉద్యమం అయ్యాక వచ్చి ఒకవారం ఉండి అన్నిరకాల అభిప్రాయాలున్న వారినీ కలిసి అభిప్రాయాలు తెలుసుకొని కలకత్తా వెళ్లారు .దారి ఖర్చులకు డబ్బులున్నాయా అని కేశవ మీనన్ అడిగితె చేతిలో రెండు రూపాయలున్నట్లు చెప్పారు .నిదినుంచి రెండువందలు తీసి ఆయనకిచ్చారు మీనన్ .ఆసాయంత్రం ఇద్దరూకలిసి శరణార్ది శిబిరాలు చూడటానికి గుర్రబ్బండి లో వెళ్లారు .దారిలో ‘డబ్బు జాగ్రత్త చేసుకోన్నారా ?’’అని మీనన్ అడిగితె గతుక్కుమని ఆండ్రూస్ ‘’అక్కడే బల్లమీద ఉంచాను పాపం పనివాడు చూస్తె ఇబ్బంది పడతాడు ‘వెంటనే ఇంటికి వెడదాం’’ అన్నారు .ఇంటికి వెళ్లి చూస్తేదబ్బు అలాగే ఉంది.దాన్ని పెట్టేలోపెట్టి తాళం వేసి బయల్దేరారిద్దరూ .స్వార్ధ రహితంగా ఇంతగా ఇతరులపట్ల ప్రేమ చూపే మనిషి ఈయనకాక ఎవరైనా ఉంటాడా అంటే ఉండడు.అలా ఉండే అరుదైన వ్యక్తిత్వం సి ఎఫ్ ఆండ్రూస్ ది మాత్రమె అంటారు కేశవ మీనన్ .

దీన బంధు ఆండ్రూస్ 5-4-1940 న 79 ఏళ్ళ వయసులో పంచత్వం పొందిన త్యాగి పుణ్యమూర్తి, సేవా తీర్ధుడు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-22-4-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.16వ b

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.16వ b

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.56 వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.22.4.23.

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.56 వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.22.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు -408

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు -408

408-రామ సక్కనోడు ,స్టువర్ట్ పురం దొంగలు దర్శకత్వ ఫేం తెలుగు ఫిలిం అసోసియేషన్ ప్రెసిడెంట్ –సాగర్

సాగర్ గా పిలవబడే విద్యాసాగర్ రెడ్డి (1952 మార్చి 1 – 2023 ఫిబ్రవరి 2) ఒక తెలుగు సినిమా దర్శకుడు. పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు దర్శకత్వం వహించిన రామసక్కనోడు చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి.[1]. ఇతడు దాదాపు 30 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. శ్రీను వైట్ల లాంటి ఇతడి చాలా మంది శిష్యులు విజయవంతమైన దర్శకులుగా పేరుతెచ్చుకున్నారు. ఇతడు తెలుగు ఫిలిం అసోసియేషన్ కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరింఛాడు

బాల్యము – విద్యాభ్యాసము
వీరిది మంగళగిరి వద్ద నిడమర్రు అనే గ్రామం. నాన్న నాగిరెడ్డి ఊరికి మున్సబుగా పనిచేస్తుండే వారు. ఇతడు 1952 మార్చి 1 న పుట్టాడు. వీరికి విజయవాడలో గవర్నర్ పేటలో ఆస్తులు వుండేవి అప్పట్లో, మద్రాసులో చదువులు బావుంటాయన్న వుద్దేశంతో అమ్మ, అమ్మమ్మా, ఇతడూ, అన్నయ్యా, చెల్లెళ్ళూ, తమ్ముళ్ళనీ తీసుకుని మద్రాసులో కాపురం పెట్టారు. మద్రాసులో తేనాంపేటలో వుంటూ ఇతడు కేసరి హైస్కూల్లో చదువుకుంటూ వుండేవాడు. పాఠశాలలో ఉండగా బయట కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొంటూ వుండేవాడు. అప్పట్లో తెలుగు వాళ్ళకీ, తమిళ పిల్లలకీ పెద్దగా పడేది కాదు. పైగా ఆంధ్రా నుంచీ వచ్చే తెలుగు వాళ్ళని లోకల్స్ బాగా ఏడిపించడానికి ప్రయత్నించేవాళ్ళు. అలాంటి వాటిని వ్యతిరేకిసూ అక్కడికి వచ్చిన తెలుగు పిల్లలకి భరోసాగా వుండేవాళ్ళు. అల్లు అరవింద్ అప్పట్లో వీరికి సీనియర్. ఇంకా చాలా మంది సినిమా వాళ్ళ పిల్లలు వీరి స్కూల్లోనే చదువుకుంటూ వుండేవాళ్ళు.

సినీరంగ ప్రవేశము
1969 మే నెలలో ఎస్సెల్సీ పాసయ్యాడు. ఐతే తరువాత చదువుల మీద అంత ఆసక్తి చూపించలేదు. అలా ఖాళీగా తిరుగుతున్న ఇతడిని ఎక్కడైనా సెటిల్ చెయ్యాలని వీరి కుటుంబానికి సన్నిహితుడైన ఒక పెద్ద మనిషి’ ని అమ్మ ఓ రోజు అడిగిందట. బాబూ..నువ్వేదో సినిమాల్లో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావట గదా. మా సాగర్ ఖాళీ గా వున్నాడు. వాడికి నీతోబాటు ఎక్కడైనా చిన్న అవకాశం ఇప్పించరాదూ అని. దానికతను అమ్మా, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో చేరాలంటే చాలా మంచి గుణాలు ఉండాలి. సహనం, ఓర్చు, అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉండాలి. మీవాడిలా దూకుడు స్వభావం వున్నవాళ్ళు అక్కడ ఇమడలేరు . అని ఇతడి గురించి ఒక ఉచిత సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళాడట.

మొదటి సినిమా
ఆ రోజు రాత్రి ఇతడు ఇంటికి తిరిగివచ్చాక అమ్మని చూస్తే ఎందుకో చాలా దిగులుగా వున్నట్లనిపించి అడిగాడు అమ్మా ఏం జరిగింది..ఎందుకలా డల్ గా వున్నావు అని. ఇంతకాలం నీగురించి తెలీని విషయాలు చాలా తెలుసుకున్నానురా.. అంటూ జరిగిన విషయం చెప్పి నీకు అవకాశం రాలేదన్న బాధకంటే నిన్ను అతను నానా మాటలు అన్నందుకు చాలా బాధ వేసింది అంది. ఆ మాటలు ఇతడిలో పట్టుదల పెంచాయి. ఇతడిని ఎందుకూ పనికిరానన్న పెద్ద మనిషి పనిచేసే సినీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లోనే చేరిమంచి పేరు తెచ్చుకుని ఆ పెద్ద మనిషికి గుణపాఠం నేర్చాలి అనుకున్నాడు. ఇతడికున్న పరిచయాలతో అప్పట్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మధు పిక్చర్స్ మల్లికార్జునరావు తమ్ముడు శ్రీహరి గారి వద్ద ఇంటిగౌరవం అనే సినిమాకి ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో సహాయకుడిగా చేరాడు.సరిగ్గా చెప్పాలంటే చలన చిత్ర రంగంలో ఇతడి మొట్టమొదటి సినిమా ఇంటిగౌరవం ఔతుంది. పట్టుదలతో చేరాడు కాబట్టి రోజుకి దాదాపు 18 గంటలు కష్టపడి పనిచేసేవాడు. అక్కడే ఎడిటింగ్ రూమ్ ఇన్-ఛార్జ్గా కూడా ఇతడినే ఉండమనడంతో కేవలం శ్రీహరి సినిమాలే కాకుండా అక్కడ ఎడిటింగ్ జరిగే అన్ని సినిమాలకీ సహాయకుడిగా వుంటూ అన్ని మెలకువలూ నేర్చుకుంటున్నాడు అనుకుంటున్న సమయంలో ఒక ఆటంకం ఎదురైంది. ఒకప్పుడు ఇతడిని ఎందుకూ పనికిరానన్న పెద్ద మనిషే మళ్ళీ ఇతడి గురువు గారి వద్దకు వచ్చాడు. ఇతడికీ, ఇతడి గురువు గారికీ మధ్య రెండు మెట్లు ఉన్నాయి. మధ్యలో ఇతడు వచ్చి చేరి మంచి పేరు తెచ్చుకుంటున్న సాగర్ ని ఎలా అణగదొక్కాలా అని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సాగర్ లో రోషం పెరిగింది. స్కూలు సమయంలోనే ఎన్నో పోలిటిక్స్ లో తిరిగిన వాడిని, చివరికి వీడి పోలిటిక్స్ కి బలికావడమా..అనిపించి ఆ పనికి ఉద్వాసన చెప్పేశాడు. ఆ విధంగా ఇతడి మొదటి చలన చిత్ర రంగప్రవేశం 18 నెలల తర్వాత తాత్కాలికంగా ఆగిపోయింది..!

మళ్ళీ రోడుమీద పడ్డాడు. ఇంటి వద్ద నుంచీ డబ్బులు వస్తాయి, అమ్మా వాళ్ళంతా మద్రాసులోనే ఉన్నారు కాబట్టి దేనికీ ఇబ్బంది అంటు ఏమీ లేదు. అలా వుండగా..అప్పటి ప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారి అబ్బాయి ఇతడికి మిత్రుడు. ఒకసారి కనబడి సాగర్.ఏం చేస్తున్నావు? అని అడిగాడు. విషయం చెప్పాడు. ఖాళీ గా ఎందుకూ నాన్నగారు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందులో దర్శాకత్వ శాఖలో చేరు అని సలహా ఇచ్చి ఇతడిని డైరెక్టర్ వద్దకి తీసుకెళ్ళాడు. సినిమా పేరు ముహమ్మద్ బిన్ తుగ్లక్ . దర్శకుడు బి.వి.ప్రసాద్ . అప్పటికే సాగర్ వాళ్ళ అన్నయ్య బి.హెచ్. రెడ్డి బి.వి.ప్రసాద్ వద్ద అమ్మకోసం అనే సినిమాకి సహాయకుడిగా పనిచేసి ఉన్నాడు కాబట్టి సాగర్ కి ఆయన వద్ద సహాయకుడిగా పనిచేసే అవకాశం తేలికగానే దొరికింది. ఒక విధంగా చెప్పాలంటే దర్శకత్వ శాఖలో సాగర్ మొదటి సినిమా ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్.[1]

ఆ విధంగా దర్శకత్వ శాఖలో ఇతడి ప్రస్థానం మొదలైంది. వీరి గురువుగారు బి.వి.ప్రసాద్ గారి వద్దనే నీడలేని ఆడది మొదలుకొని చాలా సినిమాలకి సహాయకుడిగా చేసూ సహాయ దర్శకుడు స్థాయికి చేరుకున్నాడు. వారి వద్ద ఇతడు సహాయ దర్శకుడుగా చేసిన చివరి సినిమా నాయుడుగారి అబ్బాయి అలానే ఎ. కోదండరామిరెడ్డి వద్ద కిరాయి కోటిగాడు ఇతడు సహాయ దర్శకుడుగా చేసిన చివరి సినిమా. ఈ విధంగా 12–13 ఏళ్ళు గడిచాయి. ఇన్ని సంవత్సరాల్లో చాలా సార్లు చాలామంది మిత్రులు ఇతడితో సినిమాలు తీయాలని ఇతడి వద్దకి వచ్చారు కానీ సాగరే వాళ్ళని ఇంకా నాకు సొంతంగా డైరెక్షన్ చేసే మెచ్యూరిటీ రాలేదు. సేఫ్ గా వుండడానికి వేరే పెద్ద డైరెక్టర్ తో తీయండి ” అని రికమెండ్ చేసే వేరే వాళ్ళతో డైరెక్ట్ చేయించి మొత్తం ప్రోజెక్ట్ లో సహాయం చేస్తుండేవాడు.

1980 మొదట్లో కృష్ణగారితో ఎక్కువ సినిమాలకి చేస్తున్నప్పుడే నేనూ డైరెక్షన్ చెయ్యగలనన్న నమ్మకం కలిగాక నటశేఖర సవాల్ అనే కథ సిద్దం చేసుకుని కృష్ణగారిని కలవడం జరిగింది. కిరాయి కోటిగాడు హిట్ తర్వాత ఆయన చాలా బిజీ అవడంతో కొంతకాలం ఆగమని చెప్పారు. ఇంతలో విజయనిర్మల గారి వద్ద సహాయకుడిగా వుండే విఠల్ వచ్చి సాగర్ .నువ్వు కృష్ణగారితో సినిమాకి ప్రయత్నిస్తున్నావని తెలిసింది. ఆయన ఇంకా డేట్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ లోగా నరేష్ హీరోగా నాకో సినిమా చేసిపెట్టు అని అడిగాడు. ఆ విధంగా మొదలైంది ఇతడి దర్శకత్వంలో మొదటిసినిమా రాకాసిలోయ. విజయ నరేష్, విజయశాంతి, రాజేష్, ముచ్చర్ల అరుణ, రంగనాథ్, దీప. మొదటిది ఎలాంటి సినిమా తీయాలి అనుకున్నప్పుడు కమ్మర్షియల్ గా సేఫ్ కావాలంటే యూక్షన్ సినిమానే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. ఐతే యూక్షన్ తో బాటు, సాహసం కూడా తోడైతే బావుటుందని రాకాసి లోయ సినిమా ఎన్నుకోవడం జరిగింది.

ఈ రాకాసి లోయ కథ వెనుక ఒక చిన్న తమాషా ఉంది. వీరు స్కూలు రోజుల్లో చదువుకునేప్పుడు చందమామలో చదివిన సీరియల్ పేరు రాకాసిలోయ.సినిమా, దర్శకత్వం ఇలాంటివే మీ తెలీని రోజుల్లోనే స్కూలు పిల్లలం అంతా కల్సి అరే ఎప్పటికైనా మనం పెద్ద వాళ్ళమయ్యాక ఈ సీరియల్ ని సినిమాగా తియ్యాలి రా. అనుకునే వాళ్ళు. ఐతే చిన్నవయసులో వీరికో అనుమానం వచ్చింది.మరి రాకాసిలోయ సినిమా తియ్యాలంటే చందమామ బొమ్మల్లో వున్న దృఢకాయులైన రాక్షసులు కావాలి కదా, మరి వాళ్ళని వెదికి తెచ్చినా వాళ్ళని ఎలా మచ్చిక చేసుకుని యూక్షన్ చేయించాలో అని అనుమానం వస్తే మాలో ఒకడు. ఒరేయ్ .మనం విజయా గార్డెన్ మొత్తం అద్దెకి తీసుకుని పైన మొత్తం రూఫ్ వేయించేద్దాం. ఈ రాకాసిలోయ రాక్షసుల్ని అందులో పెట్టి పైనుంచీ హెలికాప్టర్స్ తో ఆహారం వేయిద్దాం. కెమేరాలు కూడా పైనుంచీ లోనికి పంపించి చిత్రీకరణ చెయ్యాలి. అన్నాడు. అలా వుండేవి చిన్నతనంలో వీరి ఆలోచనలు.

ఐతే ఈ రాకాసిలోయకీ చిన్నప్పటి చందమామ రాకాసిలోయ కథకీ సంబధం లేదు. సినిమా విజయవతంగా పూర్తె 1983 లో విడుదలై వాణిజ్యపరంగా విజయాన్ని నమోదు చేసుకుంది. అదీ దర్శకుడిగా ఇతడి మొదటిసినిమా అనుభవం. తరువాత వెంటనే సుమన్ తల్వార్, భాను చందర్ కాంబినేషన్ తో ‘డాకు ‘ అనే సినిమా తీశాడు. ఒక ఆంగ్లసినిమా స్ఫూర్తిగా తీసిన ఆ సినిమా కూడా విజయవంతమైనది . అప్పుడు ఒక పొరబాటు చేశాడు. ఇతడే నిర్మాతగా కూడా మారి నరేష్ మనోచిత్రల కాంబినేషన్ తో 1986 లో మా వారి గోల అనే కామెడీ సినిమా తీశాడు. ఘోరంగా విఫలమైన ఆ సినిమా ఇతడికి పెద్ద సెట్ బాక్ నిర్మాతని కూడా ఇతడే అవడం వల్ల తరువాత చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా ఫెయిలైతే నిర్మాత బాధలు ఎలా వుంటాయో అప్పుడు తెలిసింది. సినిమా ఫెయిలైతే దర్శకుడు కష్టపడి ఎలాగైనా మరో ఛాన్స్ తెచ్చుకోవచ్చు కానీ, నిర్మాత దెబ్బతింటే కోలుకోవడం చాలా కష్టం అని స్వయంగా తెలుసుకున్నాక ఇంక నేను సినిమాలు ఎలానూ తియ్యలేను, కాకుంటే డైరెక్షన్ చేసి మరొకర్ని ఇరుకున పెట్టడం మంచిది కాదని ఒక నిర్ణయానికి వచ్చి అస్త సన్యాసం చేశాను.!

అలా మూడేళ్ళు గడిచాక జయసింహా రెడ్డి అని చాలా మంచి మిత్రుడూ, ఇతడి శ్రేయోభిలాషీ, ఒకసారి కల్సి సాగర్.నువ్వు యాక్షన్ సినిమాలు తీసి సక్సెస్ అయ్యావు, అనవసరంగా కామెడీ తీసి చేతులు కాల్చుకున్నావు. మళ్ళీ యాక్షన్ ఎందుకు టై చెయ్యకూడదూ..” అని ఇతడిలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశాడు. ఆ ప్రోద్భలంతో 1989 ప్రాంతాల్లో భానుచందర్ తో స్టూవర్టుపురం దొంగలు అనే సినిమా తీశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇతడి సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటి సినిమా ఈ సూవర్ట్ పురం దొంగలు .ఈ చిత్రం 1990 జనవరి 9న రిలీజైంది. అంతకు వారం ముందే చిరంజీవి స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ విడుదలైంది. ఆ సమయంలో అటూ ఇటూగా అదే టైటిల్ తో వున్న వీరి చిన్న సినిమా రిలీజ్ చెయ్యడం సాహసమే కానీ అనూహ్యంగా వీరి సినిమా ఘన విజయం సాధించింది, అప్పట్లో ఒక పేపర్ వాళ్ళు 4. దొంగల్ని చూసి పారిపోయిన పోలీసులు అని రాసింది కూడా. ఈ విధంగా 1990 లో సెకండ్ ఇన్నింగ్స్ లో లభించిన సూవర్ట్పురం దొంగలు విజయం తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తరువాత ఇతడు తీసిన సినిమాలన్నీ అసభ్యతకి తావు లేకుండా కుటుంబ కథా చిత్రాలుగా పేరు తెచ్చుకోవడం౦ ఇతడికెంతో తృప్తినిచ్చింది. అలానే ఇతని వద్ద శిష్యరికం చేసి ఈ తరంలో ఘన విజయాలు సాధిస్తున్న యువ దర్శకుల్ని గమనించినప్పుడు కూడా ఇతడికి ఎంతో ఆనందంగా వుంటుంది[1]

దర్శకత్వం వహించిన చిత్రాలు
· ఖైదీ బ్రదర్స్ (2002)

· యాక్షన్ నెం.1 (2002)

· అన్వేషణ (2002)

· అమ్మదొంగ (1995)

· రామసక్కనోడు (1999)

· ఓసి నా మరదలా (1997)

· స్టూవర్టుపురం దొంగలు (1991) – సూపర్ హిట్

· డాకు

· రాకాసి లోయ (మొదటి చిత్రం)

మరణం
సాగర్‌ అనారోగ్యంతో బాధపడుతూ 2023 ఫిబ్రవరి 2న చెన్నైలోని తన నివాసంలో మరణించాడు.[2]

409-కవి ,నాటక సినీ స్క్రిప్ట్, డైలాగ్ పాటల రచయిత ,నిర్మాత ,దర్శకుడు –వీటూరి

వీటూరి నాటకాల రచయిత. ఇతని పూర్తిపేరు వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి. “కల్పన” అనే నాటకము ద్వారా నాటక రంగానికి పరిచయమయ్యాడు.ఇంటి పేరుతో నాటక రచయితగా, పద్య రచయితగా ప్రసిద్ధుడు. తాత, తండ్రుల దగ్గర్నుంచి వారసత్వంగా పుచ్చుకున్న భాషా సాంగత్యంతో ఆయన ఛందస్సు, వ్యాకరణాన్ని అభ్యసించి, గ్రంథాలు చదివి, తానుగా పద్యాలు రాయడం ఆరంభించారు. తన పద్యాల్ని పత్రికలకు పంపడం, కవి సమ్మేళనాల్లో వినిపించడం చేసేవారు. పౌరాణికాలతో ఆగకుండా, సాంఘిక నాటకాలు కూడా రాశారు. తను రాసిన పురాణ నాటకాలకు తనే, హార్మోనీ వాయించేవారని అనేవారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పాఠశాలల్లో తెలుగు బోధించేవారు.

బాల్యం
ఇతడు 1934,జనవరి 3వ తేదీన జన్మించాడు. ఇతని జన్మస్థలం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామం[1]. తన 12వ ఏట నుండే కవితలు రాయడం మొదలుపెట్టాడు వీటూరి. భీమిలిలో ఉపాధ్యాయశిక్షణ పూర్తిచేసి కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. స్వయంకృషితో తెలుగు భాషపై ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవాడు. ఈ ఉత్సాహమే అతనిచేత నాటకాలు రాయించింది. పగ, కరుణాశ్రమం, కల్పన, ఆరాధన, చంద్రిక మొదలైన నాటకాలు రాశాడు వీటూరి. ఆయనే సొంతంగా నాటక సంస్థను స్థాపించి చాలా నాటకాలు వేశాడు. ఆ సమయంలోనే విజయనగరంలో జరిగిన సన్మానసభలో వీటూరిని ‘తరుణ కవి’ అని బిరుదునిచ్చి సత్కరించారు. వీటూరి పేరుతోనే కాకుండా జ్యోతిర్మయి, జ్యోతికుమార్ అనే మారుపేర్లతో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ మొదలైన పత్రికల్లో కథలు రాశాడు.

సినీ రచయితగా
సినిమాలపై ఆసక్తి ఉండటంతో 1958

Posted in సినిమా | Tagged | Leave a comment

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.14వ భాగం.21.4.23.

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.14వ భాగం.21.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు -407

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు -407

407-అల్లూరి సీతారామ రాజు ,పాపం పసివాడు దర్శక ఫేం –ఓరుగంటి రామ చంద్ర రావు

వి. రామచంద్రరావు (1926 – 1974) భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.

జననం – విద్యాభ్యాసం
రామచంద్రరావు 1926, మార్చి 13న తూర్పు గోదావరి జిల్లా, లక్ష్మీ పోలవరంలో జన్మించాడు. కాకినాడ, చెన్నైలలో చదవుకున్నాడు.[1]

సినిరంగ ప్రస్థానం
తాపీ చాణక్య సూచనమేరకు సినీరంగానికి వచ్చిన రామచంద్రరావు రోజులు మారాయి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఘట్టమనేని కృష్ణ కథానాయకుడిగా నటించిన మరపురాని కథ చిత్రంతో దర్శకుడిగా మారాడు. అప్పటినుండి కృష్ణతో అనుబంధం ఏర్పడింది. తను దర్శకత్వం వహించిన 17 చిత్రాలలో 11 చిత్రాలు కృష్ణ హీరోగా తీసినవి. వీరిద్దరి కలయికలో వచ్చిన అల్లూరి సీతారామరాజు చిత్రం ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా భారీ విజయాన్ని సాధించింది. రామచంద్రరావు దర్శకత్వంలో ఎడారిలో తప్పిపోయిన బాలుని కథతో వచ్చిన పాపం పసివాడు చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక విలక్షణ చిత్రంగా నిలిచింది.[2] ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హెలికాప్టరు ద్వారా కరపత్రాలను పంచారు. రామచంద్రరావు నిర్మించిన భద్రం కొడుకో చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది.[3]

చిత్రాల జాబితా
· దర్శకుడిగా:

  1. పెన్నుం పొన్నుం (1974)
  2. అల్లురి సీతారామరాజు (1974)
  3. దేవుడు చేసిన మనుషులు (1973)
  4. గంగ మంగ (1973)
  5. అబ్బాయిగారు – అమ్మాయిగారు (1972)
  6. అమ్మమాట (1972)[4]
  7. పాపం పసివాడు (1972)
  8. పగబట్టిన పడుచు (1971)
  9. అసాధ్యుడు (1968)[5]
  10. నేనంటే నేనే (1968)
  11. మరపురాని కథ

· రచయితగా:

  1. దేవుడు చేసిన మనుషులు (స్క్రీన్ ప్లే)

మరణం
అల్లూరి సీతారామరాజు చిత్రీకరణ మధ్యలోనే 1974, ఫిబ్రవరి 14న రాయవేలు ఆసుపత్రిలో రామచంద్రారావు (47) గుండెపోటుతో మరణించాడు. ఆయన చివరి కోరిక మేరకు మిగతా చిత్రాన్ని పూర్తిచేసిన కృష్ణ, చిత్ర టైటిల్స్ లో దర్శకుడిగా రామచంద్రారావు పేరునే వేశాడు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-4-23-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.14వ భాగం.20.4.23.

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.14వ భాగం.20.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం .54వ భాగం .శ్రీ శంకర పూర్వ అద్వైతం.20.4.23.

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం .54వ భాగం .శ్రీ శంకర పూర్వ అద్వైతం.20.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

మద్రాస్ స్త్రీసేవా మందిర్ లో మానవత్వం పూయించిన శ్రీ మతి అన్నాప్రగడ చన్న ఘంటమ్మ

మద్రాస్ స్త్రీ సేవా మందిర్ లో మానవత్వం పూయించిన శ్రీ మతి అన్నాప్రగడ చన్న ఘంటమ్మ

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రావు బహదూర్ కల్లి చిట్టబ్బాయి నాయుడు శ్రీమతి వత్సమణి దంపతులకు చన్న ఘంటమ్మ 17-11-1913 న పుట్టింది.ఆమెకు అన్న తమ్ముడు చెల్లెలు ఉన్నారు .స్త్రీవిద్య కు ఆదరం లేని ఆ రోజుల్లో ఆమె తల్లి ఈమెకు  మిషనరీల సాయంతో ఇంగ్లీష్ ,కుట్లు అల్లికలు నేర్పించింది .వయోలిన్ కూడా బాగా వాయించే నేర్పు అలవడింది .కానీ ఎనిమిదవ ఏటనే కన్న తల్లిని కోల్పోయిన అభాగ్యురాలు .

  తండ్రి స్వగ్రామం అయిన పూళ్ళ పంచాయితీ అధ్యక్షుడుగా చాలాకాలం పని చేసి గ్రామానికి లైట్లు రోడ్డు స్టేషన్ ,పోస్టాఫీస్ సౌకర్యాలు కల్పించాడు .స్వంతఖర్చులతో మాధ్యమిక స్కూల్ స్థాపించి సగం ఖర్చు భరించి 20ఏళ్ళు నిర్వహించిన త్యాగశీలి .అక్కడ స్త్రీలు ఘోషా పద్ధతిలోనే ఉంటారు .తలెత్తకుండా ఆస్కూల్ కు వెళ్లి క్లాస్ లో కూర్చుని చదువుకొన్నది .హైస్కూల్ చదువుకోసం రాజమండ్రి వెళ్ళింది ..హాస్టల్ సౌకర్యం లేకపోవటంతో స్త్రీల  ట్రెయినింగ్  కాలేజి హాస్టల్ లో ఉండేది . తన ఈడు పిల్లలు అక్కడ లేకపోవటంతో నవ్వుకు ఆటాపాటలకు దూరం అవాల్సి వచ్చింది .ఘోషా ఉండటంతో జంకు పోలేదు .అందుకని గంభీర విషయాలు ఆలోచించటం ,మనన చింతన బాగా అలవాటయ్యింది .వీరేశలింగం గారి శరణాలయాలు విద్యాలయాలు ఆమె స్మృతి పధం లో మెదిలేవి .శ్రీమతి ముత్తు లక్ష్మీ రెడ్డి చెల్లెలు శ్రీమతి నల్లముత్తు అమ్మాళ్ హైస్కూల్ సూపరింటెండెంట్ గా ఉండేది .విదేశాలు తిరిగి వచ్చిన ఆమె పిల్లలలో ఎన్నెన్నో నూతన భావాలు ప్రవేశపెట్టటానికి ఉత్సాహ పడి అమలు చేసింది . ఆమె ఆలోచనలు సంఘ సేవ సంస్కారం సేవా బాధ్యతా క్రమశిక్షణ అందరికి ఆదర్శంగా ఉండేవి .ఇతరుల కష్టాలలో పాలు పంచు కోవటం మానవుల ఉత్కృష్ట ధర్మం అని నిరంతరం బోధించేది .ఈ విశిష్ట లక్షణాలన్నీ చన్న ఘంటమ్మ మనసులో బాగా నాటుకు పోయాయి .

  ఒక రోజున అమ్మాళ్ విద్యార్ధినులకు బాగా నచ్చిన అమ్మాయిని రహస్య వోటింగ్ ద్వారా ఎన్నుకోమని చెబితే ,అందరు చెన్న ఘంటమ్మనే ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఆమెకు చన్నమ్మాళ్ రాజగోపాలన్ రజత పతకం ప్రదానం చేశారు .కోస్తా జిల్లాలలో ఇంగ్లీష్ లో అత్యధిక మార్కులు పొంది రికార్డ్ స్థాపించి బహుమతి అందుకొన్నది .కాలేజీ చదువుకు మద్రాస్ వెళ్లి ,ఇంటర్ చదివి తెలుగు సాహిత్యం లో బొబ్బిలి రాజా ప్రైజ్ పొందింది .ఫస్ట్ క్లాస్ లో  బిఏ .పాసైంది . ఎం ఏ ఫిజిక్స్ చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకొన్నది .కాలేజిలో మళ్ళీ నల్లముత్తు అమ్మాళ్ సాహచర్యం తో ‘’అవ్వై హోమ్ శరణాలయాలు ,అనాధాశ్రమాలు,వితంతు శరణాలయాలు గురించి చేబుతూఉంటే మంత్రోప దేశం పొందిన అనుభూతి పొందేది ఘంటమ్మ .   1937 చన్న ఘంటమ్మకు మద్రాస్ వాస్తవ్యుడు అన్నాప్రగడ వెంకట కృష్ణారావు తో వివాహం జరిగింది .ఆయన భౌతిక శాస్త్రవేత్త. ఫిజిక్స్ పరికరాలు తయారు చేసేవాడు .వీటి నిర్మాణంలో వర్క్ షాప్ లో భర్తకు ఆమె సహాయ సహకారాలు అందించేది .అప్పటికే ఎల్.టి.శిక్షణ కూడా పొంది ఉండటంతో నాలుగేళ్ళు స్కూల్ టీచర్ గా పని చేసింది .కానీ ఎందుకో చాలా చప్పగా ఉందనిపించింది .దుర్గాబాయిదేశాముఖ్ వీరింటి ప్రక్కనే ఉండేది .అందువలన ఆమెతో ఆంధ్ర మహిళా సభతో సన్నిహిత సంబంధ మేర్పడింది .సేవాభావ బీజాలు ఇదివరకేఉన్నందున అవి మొలకలెత్తటం ప్రారంభించాయి . దుర్గాబాయి కోరికపై మహిళా సభలో స్త్రీలను బెనారస్ మెట్రిక్ పరీక్షలకు తయారు చేయటానికి మొట్టమొదటి టీచర్ గా సంతోషంగా ఒప్పుకున్నది ఘంటమ్మ .ఈమె నైపుణ్యాన్ని అంకితభావాన్ని కనిపెట్టిన దుర్గాబాయి ఆమెపై అనేక గొప్ప బాధ్యతలు పెట్టటం ప్రారంభించింది .ఆంధ్ర మహిళా పత్రిక మహిళా ప్రెస్ ,పారిశ్రామిక శాఖ ,కుటుంబ నియంత్రణ శిక్షణ విభాగానికి చైర్మన్ ,నర్సింగ్ హోమ్ అడ్మిని స్ట్రెషన్ కార్యదర్శి గానేకాక మొత్తం మహిళాసభకు శ్రీమతి జమునాబాయ్ తోపాటుజాయంట్ కార్య దర్శి బాధ్యతలుకూడా సర్వ సమర్ధంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకొని  ఘంటమ్మ ‘’చెన్న ‘’మంచి మహిళ అని ప్రసిద్ధి చెందింది .అందరికి తలలో నాలుకగా మెలగింది .వీటన్ని నిర్వహణకు కావాల్సిన ఆదాయం కోసం ఆమె నిరంతరం ఆలోచించేది .ఇన్ని సమర్ధతలున్న ఆమెను దుర్గాబాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ సమితికి ప్రధమ చైర్మన్ గా 1954 నియమింప జేయగా 1959 వరకు పనిచేసి విస్తృతంగా పర్యటించి ,అనేక స్వచ్చంద సేవా సంస్థలు స్థాపించింది .1960లో ఈబాధ్యతలన్నీ వదిలేసి తానె స్వయంగా ఆర్తులకోసం పని చేయాలని నిశ్చయించుకొన్నది .

  అద్డంకి సుందరమ్మ ,శ్రీ శర్మ దంపతులు మొదలైనవారుకలిసి ‘’స్త్రీ సేవా మందిర్ ‘’స్థాపించి వయోజనులైన స్త్రీలకూ జీవనోపాధి కల్పించటానికి కృషి చేశారు .వృత్తి విద్యలు నేర్పారు .సుందరమ్మ అధ్యక్షులు చన్న ఘంటమ్మఉపాధ్యక్షులుగా తీర్చి దిద్దారు .1960లో నిర్వహణ బాధ్యతలు తీసుకొని ,ఆధునికతకు స్థానం కల్పించి మహిళస్వయంగా తన కాళ్ళ  పై తాను  నిలబడే అన్ని రకాల సదుపాయాలూ కల్పించింది .పరిశ్రమలు సంక్షిప్త విద్యావిధానం ,కుట్టు అల్లికల క్లాసులు క్రెష్,బాలవాడి కిండర్ గార్టన్ స్కూళ్ళు,మాధ్యమిక ఉన్నత విద్యాలయాలు ,పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, కామర్స్ శిక్షణాలయం వంటివి ఎన్నెన్నో చేర్చింది .రేడియో మెకానిక్స్ ,ఇన్స్ట్రు మెంటల్ మెకానిక్స్ ,ప్రెసిషన్ వర్క్స్ వంటి అనేక నూతన విధానాలు ప్రవేశపెట్టింది .అశోక నగర్ ,సాలిగ్రాం విరుగం బాకం వంటి చోట్ల బ్రహ్మాండమైన స్వంత భవనాలు కట్టించింది .నాలుగు అంతస్తుల ‘’ఉడ్ అండ్ న్యూట్రి షన్ ‘’స్థాపించి పోషక ఆహార విజ్ఞానం బాలికలకు యువతకు కల్గిస్తున్నారు .సమగ్రమైన జ్ఞానంతో వయసుకు పరిస్థితికి సమయానికి తగినట్లు పరిశుభ్ర ఆహార పదార్ధాలు తయారు చేసి నిలవ చేసి అందిస్తున్నారు .సమగ్రమైన ఆరోగ్య సూత్రాలతో నైతిక విలువలతో విద్యాబోధన జరిపిస్తున్నారు .ఈ స్త్రీ మందిర్ నీడన చదువో జీవనోపాధో ,వృత్తో, ఉద్యోగమో ఆశ్రయమో సంరక్షణో పొందేవారి సంఖ్య నాలుగు వేలపైనే ఉంటారు పోలియో వ్యాధితో నేలమీద  దేకే జానకిరాం ఈ మందిరంలోనే నడకనేర్చి ,చదివిఉద్యోగం చేసింది . .ఇదంతా శ్రీమతి అన్నాప్రగడ చన్న ఘంటమ్మ ఆలోచన, కృషి ఫలితమే .మహిళాలోకం ఆమెకు సదా కృతజ్ఞత తో ఉంటుంది .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్-19-4-23- ఉయ్యూరు        

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.13వ భాగం.19.4.23.

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.13వ భాగం.19.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.53వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.19.4.23.

శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.53వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.19.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

దృశ్య కావ్యం తీయబోయి దిష్టి కార్యం చేసిన రు(గు)ణ శేఖర్ ?

దృశ్య కావ్యం తీయబోయి దిష్టి కార్యం చేసిన రు(గు)ణ శేఖర్ ?
జర్మనీ పండితుడు ,తత్వవేత్త కవి ,నాటకరచయిత ,విమర్శక విశ్లేషకుడు ,ఆసాహిత్యానికి మార్గ దర్శి గోథే- పూర్తిపేరు జోహన్ వుల్ఫ్ గాంగ్ గోథే కాలిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలం నాటకం చదివి ,తన్మయం చెంది ,పరవశంతో నాట్యం చేస్తూ ‘’దివి భువులను ఏకం చేసిన మహోత్కృష్ట నాటకం ‘’అని ప్రశంసా వర్షం కురిపించాడు .ఆ నాటకం అంతా ఒక ఎత్తు అయితే ,అందులో నాలుగవ అంకం, మరీ అందులో శ్లోక చతుష్టయం నభూతో నభవిష్యతి అంటారు .అలాంటి నాటకాన్ని దృశ్య కావ్యంగా మలచే ప్రయత్నం చేసినట్లున్నాడు దర్శకుడు గుణ శేఖర్ .బాలరామాయణం నిజంగా అలానే తీశాడు .సొగసు చూడతరమా సాంఘిక దృశ్య కావ్యమే .మరీమరీ చూడాలనిపించేదే .చిరుతో తీసిన సినిమా హిట్ అయినా అది మణిశర్మ మ్యూజిక్ కు, వేటూరి పాటలకు దక్కిన గౌరవం . మహేష్ సినిమా కంటెంట్ నాకు బాగా నచ్చింది .మిగిలిన సినిమాలు నేను చూసిన జాడ లేదు .
ఇప్పుడు ఈ శాకుంతలం .శా– అంటూ సాగదీయటం లోనే కొంత దెబ్బతిందేమో .నిజంగా నేను ఈ సినిమా చూడలేదు ఈక్షణం వరకు .చూద్దామని అమెజాన్ లో ప్రయత్నించినా నాకు కనిపించలేదు .మా అమెజాన్ లోనేనా ?మీ వాటిల్లో కూడానా ?అంటే పూర్వం ఒక జోక్ చెప్పుకొనే వారు ‘’బావగారూ మా రేడియోలో చెప్పారు మీరేడియోలో కూడా చెప్పారా’’ ?అని బావగారికబుర్లలో అనుకోనేవారట.అంత చూడని వాడికి నీకెందుకు ఆసినిమాపై అంతటి ఉత్కంత ?అంటారేమో ?అందరూ నెగటివ్ భాష్యం చెప్పిన వారే .చూస్తె పాజిటివ్ గా నాలుగులైన్లు బరుకుదామని ఆశ .అందుకు అవకాశం లేకుండా పోయి౦దికదా అని దుగ్ధ .కనుక నిన్నా ఇవాళ కొన్ని సీన్లు చూశానుఅక్కడక్కడ .వాటి వలన ఏర్పడిన భావ పరంపరే ఇది .శాంతం పాపం .
ఒక దేశం తన కుమారుడి పేరు మీద పిలువబడే తల్లి కి ఎంతటి మహోత్కృష్ట గౌరవం దక్కాలి ?అంటే శకుంతలకు .కానీ ఆపాత్రకు ఎన్నుకొన్న ఆమె తీరు ,నటన స్థాయి ఎంత ఉదాత్తంగా ఉండాలి ?కనిపిస్తే చేతులెత్తి నమస్కరించేట్లు ఉండాలి .కానీ ఇక్కడ అంతా ఉల్టా సీదా .గోడకు వేసిన సున్నంలా ,ఒంట్లో నరాలు కండరాలు నమిలేయబడిన బొమ్మలా ,సిమెంట్ తో చేసిన కరెంట్ స్తంబానికి గుడ్డ పేలికలు చుట్టినట్లుంది .చనులచుట్టూ పూల తోరణమేమిట్రా బాబూ .కళ్ళు మూసుకోవాలని పించటం దారుణం .కణ్వ ముని ఆశ్రమం పవిత్రతకు ,ప్రశాంతతకు నిలయం .ఆ వాతావరణం ఉందా ?గ్రాఫిక్స్ వాడకం ఎక్కువైంది కనుక ఆశ్రమ జంతుగమనానికి వాడటం అసంబద్ధం .ఆశ్రమం లో ప్రతి చెట్టూ మొక్క తీగ శకుంతల పెంపకం లోనివే . వాటితో ఆమె సంబంధం చిరస్మరణీయం .అదికూడా ఉన్నట్లు అనిపించలేదు .మాటలు ,పాటలు హృదయానికి హత్తుకోవాలి .అసలే మణి శర్మ . డ్రమ్ములమోతలో హార్ట్ బీట్ పెంచుతాడు .మెలోడీ చేస్తే కరిగిపోతాం .బహుశా ఆ ఛాయలూ కనిపించలా .
గుణ శేఖర్ బుర్రనిండా భావాలే .వరుడు సినిమా తీస్తున్నప్పుడు రామోజీ లో చూశాం .అయిదు నిమిషాలలో చెప్పాల్సింది అరగంట లాగిస్తాడు.నిర్మాతకు నిండా బొక్క .దానయ్య అలానే దెబ్బతిన్నాడు .ఇందులో తనడబ్బేదో తాను పెట్టుకొని –ఆనందం తీర్చుకొన్నాడు ముతక సామెత లో చెప్పినట్లు .ఇంతలో’’ దిల్ ‘’కరాబై, బలగం తో డబ్బు బలిసిన రాజు ,శేఖర్ నెత్తిన పాలుపోసి,పూర్తి ‘’రుణ శేఖర్ ‘’కావటాన్నితప్పించి,తాను మునిగిపోయాడు . కాలం, జనం, ఆలోచన అన్నీ గాలికి వదిలేసి ఇలా సినిమా వండితే పండదు .మండుతుంది.హీరోయిన్ కేజీల బంగారాన్నీ ,భరత బుడత ను చూడాలనుకొంటే చూడండి తప్పు లేదు . .ఇంతకంటే ఎక్కువ రాయటం మంచిది కాదు పైగా పూర్తిగా చూడకుండా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-23-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.52వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.18.4.23.

శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.52వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.18.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.12వ భాగం .18.4.23.

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.12వ భాగం .18.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

నైజీరియా ఆర్ధిక మంత్రిగా ,ప్రపంచ బ్యాంక్ లో 20 ఏళ్ళు పని చేసిన మహిళ -నకోజి ఒక౦జొ ఇవేలా

నైజీరియా ఆర్ధిక మంత్రిగా ,ప్రపంచ బ్యాంక్ లో 20 ఏళ్ళు పని చేసిన మహిళ -నకోజి ఒక౦జొ ఇవేలా

ప్రపమచ వాణిజ్య సంస్థను మొట్టమొదటి సారిగా నిర్వహించిన నైజీరియా నల్లజాతి మహిళా రత్నం నకోజి ఒక౦జొ ఇవేలా.నల్లజాతి స్త్రీలలో గ్లోబల్ ,నేషనల్ పవర్ పొందిన అరుదైన మహిళ ఆమె .రెండుసార్లు నైజీరియా ఆర్ధిక మంత్రిగా వరల్డ్ బ్యాంక్ లో 20ఏళ్లకు పైగా సేవ లందించిన అరుదైన గౌరవం పొందింది .బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ ‘’ది వాక్సిన్ అలయెన్స్ ‘’లో పని చేసిన సామర్ధ్యం ఆమెది . నకోజి ఒక౦జొ ప్రపంచ విశిష్ట పదవి పొందిన  మొట్టమొదటి మహిళ మాత్రమేకాక మొదటి ఆఫ్రికన్ కూడా అవటం మరింత విశేషం .ఆ అత్యున్నత పదవి స్వీకరిస్తూ ఆమె హుందాగా అత్యంత వినయంగా ‘’ఈ రోజు WTOసభ్యులు చరిత్ర సృష్టించారు .73ఏళ్ళ GATT మరియు WTO చరిత్రలో మీరు మొట్ట మొదటిసారిగా ఒక మహిళ,అందులోనూ ఒక ఆఫ్రికన్ కు  డైరెక్టర్ జనరల్ పదవి కట్టబెట్టి చరిత్ర సృష్టించారు .ఇది అసాధారణ ,ధనాత్మక నిర్ణయం .నాపై  మీరు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞురాలిని.ఒకమహిళకు అందునా ఒక ఆఫ్రికన్ కు ఈ పదవి ఇచ్చినందుకు కాదు ,నా జ్ఞానాన్ని అనుభవాన్ని గుర్తించి మరీ ఈ పదవి అందజేసినందుకు కృతజ్ఞతలు .అంతేకాదు నాలోని శక్తిసామర్ధ్యాలను ధైర్యాన్ని గుర్తించి ,మీతో కలిసి పని చేయగలనని నమ్మి ,భవిషత్తుకు  మన సంస్థ ఇస్తున్న భారోసాలో పాలు పంచుకోనేట్లు చేసినందుకు సంతృప్తిగా ఉంది’’అని వివేకం ఉట్టిపడేలా మాట్లాడి అందరి నమ్మకాన్నీ అందుకొన్నది .

13-6-1954 న నైజీరియాలోని అగ్వాషి ఉకువు లో నకోజి ఒక౦జొ  పుట్టింది.తల్లితండ్రులు –చుకూవ ఒకన్జో ,కామీన్ ఒకన్జో .మాసా చూసేట్స్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో చదివింది .ఇకంబా ఇవేలా నుపెళ్ళాడింది .నైజీరియా ప్రభుత్వంలో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ బడ్జెట్ అండ్ నేషనల్ ప్లానింగ్ గా2003 2006 ,2011-2015 వరకు మొత్తం ఏడేళ్ళు సేవలు అందించింది.2006లో కొద్దికాలం ఫారిన్ మినిస్టర్ గా సేవచేసి ఆపదవి పొందిన మొట్ట మొదటి మహిళగా రికార్డ్ సృష్టించింది .1-3-2021న WTO కు ఏడవ గవర్నర్ జనరల్ అయింది .ఆ అత్యున్నత పదవి చేబట్టిన మొదటి మహిళగా ,మొదటి ఆఫ్రికన్ గా గుర్తింపబడిది .ఆమె సేవలు 31-8-2025కు ముగుస్తాయి .గ్లోబల్ ఫైనాన్షి యల్ ఎక్స్పెర్ట్ గా ,ఎకనమిస్ట్ గా ,  ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ ప్రొఫెషనల్ గా గుర్తింపు పొంది ,30ఏళ్ళు ఆసియా ఆఫ్రికా యూరప్ లాటిన్ అమెరికా ,నార్త్ అమెరికాలలో పని చేసింది .ఆఫ్రికన్ యూనియన్ స్పెషల్ ఎన్వాయ్ (ప్రతినిధి )గా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటానికి విశేష కృషి చేసింది .అనేక రాయబారాలలో ,ఇచ్చి పుచ్చుకోవటాలలో గొప్ప చొరవ చూపింది . She is a firm believer in the power of trade to lift developing countries out of poverty and assist them to achieve robust economic growth and sustainable development. As Finance Minister, she was involved in trade negotiations with other West African countries and contributed to the overhaul of Nigeria’s trade policy enabling it to enhance its competitiveness.

 వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ పదవికి నైజీరియా తరఫున పోటీ చేసిన మొట్ట మొదటి మహిళకూడా ఆమె.  Dr Okonjo-Iweala was responsible for leading reform that enhanced transparency of government accounts and strengthened institutions against corruption, including the implementation of the GIFMS (Government Integrated Financial Management System), the IPPMS (Integrated Personnel and Payroll Management System), and the TSA (Treasury Single Accounts).

 ప్రపంచ ప్రసిద్ధ చెందినవందమంది మహిళలో ఒకరుగా ఆమె పేరుపొందింది .మిక్కిలి ప్రభావ శాలి అయిన మహిళగా ,అవినీతిపై పోరాడిన యాభై మంది మహిళలో శిఖరాగ్రాన నిలిచింది .అమెరికన్ అకాడెమి అఫ్ అచీవ్ మెంట్ ఆమెకు ‘’గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ ‘’ను 2022లో అందజేసింది .ఇలాంటి అవార్డ్ లు కోకొల్లలుగా ఆమె ప్రతిభా సామర్ధ్యాలకు దక్కాయి .నల్లజాతి మరో వజ్రం నకోజి ఒక౦జొ ఇవేలా.

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-23-ఉయ్యూరు 

Posted in సమీక్ష | Leave a comment

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.11వ భాగం 17.4.23.

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.11వ భాగం 17.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం .51వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.17.4.23.

శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం .51వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం.17.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.10.వ భాగం.16.4.23.

మన పురాణ ఇతిహాసాల పై లోహియా ప్రసరింప చేసిన కొత్త వెలుగు.10.వ భాగం.16.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభ వానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.50వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం .16.4.23.

శ్రీ అనుభ వానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.50వ భాగం.శ్రీ శంకర పూర్వ అద్వైతం .16.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment