అలెగ్జాండ్రియా గ్రంధాలయం
కొందరు కొన్ని పనుల కోసం కారణ జన్ములు గా పు డతారేమో నని పిస్తుంది .వారి వల్ల నే ఆ కార్యాలు పూర్తీ అయి ,లోకో పకారకమ్ అవుతాయి .అలాంటి వారిలో Demetrius Phalerius ఒకడు .క్రీ.పూ.350-360 మధ్య ఫేలేరిం లో జన్మించాడు .తండ్రి, కానేన్ అనే వాడి బానిస .ఏధెన్స్ కు చేరాడు .అరిస్టాటిల్ ఆఫ్ స్తాజీరియ -లైసియం లో చదువు కున్నాడు .తియోఫ్రోతాస్ కు సహాధ్యాయి .317లో” దేస్పాట్ ఆఫ్ ది సిటీ ”అనే పదవిని పొందాడు .జనాభా సేకరణ ,చట్టాల రూప కల్పనా ,రాజ్యాంగ నిర్ణయాల లో సహకరించాడు .ఆనాటి వేదాంతులకు స్నేహితుడు అయాడు .అతను అందరికి తలలో నాలుక గా ఉండే వాడు .అతనికి ఎంత గొప్ప పేరు వచ్చిందో తెలియ జేయటానికి ఒక చిన్న ఉదాహరణ -దేమేత్రియాస్ విగ్రహాలను మూడు వందలు నెల కొల్పి అతని సేవలను ప్రజలు ప్రస్తు తించారు .307 b.c. లో ఇదే పేరు గల దేమోత్రేస్ పోలియార్సిస్ అనే వాడు ఇతనిని ఉద్యోగం నుంచి బర్త్ రఫ్ చేసి ,ఏథెన్స్ ను వశ పరచు కొన్నాడు .
ఏదో కాస్త కనిక రించి తేబ్స్కు వెళ్ళటానికి మాత్రం పాస్ ఇచ్చాడు .అక్కడికి చేరి గ్రీకు తొలి కవి ,అందకవి అయిన హోమర్ గురించి చది వాడు .ఎన్నో విషయాల మీద పుస్తకాలు రాశాడు .మళ్ళీ ఏధెన్స్ వెళ్ళే వీలు లేదని తెలుసు కొని ,అలెగ్జాండ్రియా చేరాడు .ఇది క్రీ.పూ.331లో నైల్ నది డెల్టా కు పడమర ఉన్న అలెగ్జాండర్ పేర వెలసిన పట్టణం .దీన్ని ర్హోడేస్ కు చెందిన”దినోకేరేస్”అనే ఆర్కిటెక్ట్ నిర్మించిన అతి సుందర నగరం .ఇందులో మాసిదోనియాన్ చార్మిస్ లను ఏర్పాటు చేశారు .గుర్రం పైన ఉన్న యోధుడి చేతి లో కాగడా ఉండటం దీని చిహ్నం .ఇందులో అయిదు జిల్లాలున్నాయి . గ్రీకు లిపి లో మొదటి అయిదు అక్షరాల పేర్లు వాటికి పెట్టాడు .దీనిని Alegjaander the king born of god founded it ” గా భావిస్తారు .
దేమ్మేత్రియాస్ టా లమి రాజ దర్బారు లో ఉద్యోగం పొందాడు .అప్పుడు ఈజిప్ట్ రాజు మొదటి టాలమి.ఇతను 307 b.c.లో పుట్టాడు .ఇతడు అలెగ్జాండర్ సైనికాధి కారుల్లో ఒకడు .ఇతనికి ”సోటర్”అంటే రక్షకుడు అని బిరుదు ఉంది .ఎనభై ఏడేళ్ళు జీవించాడు .దేమేత్రియాస్ రాజును రాజ్యం ,రాజ్య పాలన ,శిక్షా స్మృతి మొదలైన పరిపాలనా సంబంధించిన విషయాల పై పుస్తకాలను చదవమని చెప్పేవాడు .”స్నేహితులే వరు చెప్పలేనివి పుస్తకాల లో ఉంటాయి ”అని హితవు చెప్పాడు .రాజకీయ కళ(art of politics )మీద పుస్తకాన్ని ptolemy అనే పేరా తానే రాశాడు .రాజును ఒక మ్యూజియం ఏర్పాటు చేయమని కోరాడు .అది రాజ ప్రాసాదం లో భాగం గా ,ఈజిప్ట్ సంస్కృతికి విలసనం గా ,గ్రీకులకు ఇష్టమైనదిగా ,టాలమీ గౌరవ చిహ్నం గా నెలకొల్పాలని వివ రించాడు .
టాలమీ రాజు కు ఈ సూచన బాగా నచ్చింది .వెంటనే అమలు జరపటానికి పూను కొన్నాడు .దేమేత్రియాస్ సలహాలను పాటిస్తూ అత్యంత వైభవో పెత మైన గ్రంధాలయం తయారు చేయించాడు .మొత్తం బాధ్యత అంతా దేమేత్రియాస్ మీద నే పెట్టి ఆర్ధిక విషయాలు తాను చూస్తూ ,ఏ లోటూ రాకుండా వెన్నంటి నిలిచాడు రాజు .ఇద్దరి సుందర స్వప్నం సాకారం అయింది .letter from Aristotle to Philocrates వరకు అంటే 2 b.c.వరకు అన్ని పుస్తకాలను సేకరించాడు .దీని నిర్వహణకు దేమేత్రియాస్ ఫిలోక్రేతెస్ అది కారి గా రాజు నియమించి తగిన గౌరవాన్ని కల్పించాడు .దీనినే రాజ గ్రంధాలయం (king’s library )అన్నారు .రాజసం లోను ఆకారం లోను అది నిజం గా కింగ్ అని పించుకోన్నది .పుస్తకాలు కోన టానికి ఎంత డబ్బు కావాల్సి వస్తే అంతా ఇచ్చే వాడు రాజు .ఎక్కడా లేని పుస్తకాలు ఈ గ్రంధాలయ రాజం లో ఉండాలన్న తపన .”if possible all books in the world ”అలెగ్జాండ్రియా గ్రంధాలయం లో ప్రపంచం లోని అన్ని గ్రంధాలు ఉండాలని రాజు గారి భావం .అప్పటికే అయిదు లక్షల పుస్తకాలను సేకరించాడు దేమేత్రియాస్ .పుస్తకాలకు ప్రతులు రాయటానికి ఎన్నో టెక్నిక్ లను అతడు వాడాడు .రాజు టా లమి కి యూదులు అంటే జూస్ తో సత్సంబందాలున్దేవి. ఆ మత గురువు లతో సంప్రదించి అనువాదకులను పంపించే ఏర్పాటు చేయించాడు .72 మంది వచ్చి ,72రోజులు పని చేసి జ్యూ ల మత గ్రంధం torah లో genesis నుండి malachu వరకు అనువాదం చేశారు .వారందరికి వసతి భోజన సౌకర్యాలు కల్పించారు .వాటిని పాపిరాస్ పై కాపీలు గా రాయించారు .వారందరికి విలువైన బహు మతులిచ్చి సగౌరవం గా వీడ్కోలు చెప్పారు .దీని పర్య వేక్షణ అంతా దేమేత్రియాస్ డే .దీనినే the cage of the muses ” అన్నాడాయన .ఇతర దేశాస్తులేవరైనా అలెగ్జాండ్రియ వస్తే వాళ్ళ దగ్గరున్న పుస్తకాలను అప్పగించి ,వాటి నకలు రాసుకొన్న తరు వాతే తీసుకొని వెల్ల నిచ్చే వారు .అలా అనంత అక్షర సంపద అక్కడ నిక్షిప్తమయింది .సరస్వతీ మహా సామ్రాజ్యానికి తాలమి మహా రాజు అయితే దేమేత్రియాస్ ప్రధాని .
ప్రాచ్య దేశాలలో గ్రంధాలన్నీ దేవాలయాలలో ఉండేవని మనకు తెలిసిన విషయమే .అందుకనే వీరు ఇక్కడ దీన్ని ”గ్రంధాలయం ”అన్నారు గౌరవ సూచకం గా (place of learning -a temple ).అలెగ్జాండ్రియా గ్రంధాలయానికి మొదటి డైరెక్టర్ దేమేత్రియాస్ కాదు .zinodotus of Ephesus -(325-260 b.c.)ఈయన హోమర్ ,హీసాయిడ్ గ్రంధాలను ఎడిట్ చేయించాడు .ఇతనే హోమర్ గ్రంధాన్ని ఇరవై నలుగు విభాగాలుగా చేశాడు .అందులో life of homer ఒక భాగం .హోమేర్ గురించి సమస్త వివరాలు ఇందులో ఉన్నాయి .
తరువాత అపోలోనియాస్ జోడియాస్ (295 B.C.)అధికారిగా ఉన్నాడు .హోమర్ కవి గ్రంధాల లోని వ్యాకరణ దోషాలను పరిష్కరింప జేశాడు మూడవ .తాలమీకి గురువు అయినా ,రాజు ఇతన్ని తప్పించి , ERESTHONES( 276-195 B.C.( కు బాధ్యతలు అప్పగించాడు . ఇతను సైన్స్ ఫిలాసఫీ చదివిన వాడు .భూమి పరిధి 2,52 ,000 STAADRIYA లేక 29,000 మైళ్ళు అని చెప్పాడు .ఇవాల్టి లెక్క ప్రకారం 24,900మైళ్ళు .
ఈతనితర్వాత CALIMACHUS(310-240)ముఖ్య గ్రందాలయాది కారి అయాడు .THE LEXICAN OF SUDA ”ను 800 పాపిరాస్ రోల్స్ పై రాయించాడు .BIBLIOGRAPHIC STUDY మీద బాగా కృషి చేసిన విద్యా వంతుడు .120 పుస్తకాలలో THE LIST OF PERSONS EMINENT IN EVERY BRANCH OF LEARNING TO GETHER WITH A TEXT OF WRITERS ”అనే బృహత్ ప్రణాళికను పూర్తీ చేసి ఎంతో విలువైన సమాచారాన్ని పొందు పరచిన ఘనుడీయన .ఇతని తర్వాతా ARISTOPHANES OF BYJANTINE డైరెక్టర్ అయాడు .
ఇంత మంది మహాను భావులు కంటికి రెప్ప లాగా కాపాడి నిర్మించి ,పెంచి పెద్దది గా చేసిన సర్వ మాన వాలికీ ఉపయోగ కారక మైన ఈ బృహత్ గ్రంధాలయం 48 B.C.లో ఈజిప్షియన్ దండ యాత్ర లో తగలబడి ధ్వంసమయింది . .సుమారు నలభై వేల అత్యంత విలువైన గ్రంధాలు మండి మసి అయాయి . సేనేకా అనే మహా వేదాంతి నీరో చక్ర వర్తి గురువు ఈ విషయాన్ని ధ్రువ పరచాడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-7-12.–కాంప్-అమెరికా

