తిక్కన భారతం -2 భారతాన్ని పరబ్రహ్మ రూపం గా భావించాడు తిక్కన .తాను ,ఆ తత్వాన్ని లోక కళ్యాణం కోసం ప్రచారం చేయాలని ,ఆంధ్రీకరణ కు పూనుకొన్నాడు .అదొక యజ్ఞం గా భావించి చేస్తేనే సత్ఫలితం కలుగు టుంది .అందుకే ముందుగా వైదిక యజ్న కర్మ దీక్షితుడు అయాడు.యజ్న రూపమైన ఈశ్వరుని నిష్టగా చిత్తాన్ని వశీకరణం చేసుకొని ,ప్రతిష్టించు కొన్నాడు .సోమయాజి అయ్యాడు కనుక ఈ వాజ్మయంయజ్నం సులభ మైంది .ఉత్కృష్ట సాధనమూ అయింది .చిత్త శాంతి లభించింది .కవిత్వ దీక్ష తీసుకొన్నాడు .వాజ్మయ యజ్న రూప మైనయోగ దీక్ష ను పొందాడు .భారత రచన ప్రారంభించారు .ఆతని ధ్యేయం ఆముష్మిక ఫలం ,జన్మ రాహిత్యం తపమునకు,విద్యకు ను ,జానూ స్తానమైన -జనన రహితుని యజ్ఞాత్ము శౌరి ,వాజ్మి యాధ్వరార్చితు జేసితి ణా జనార్ద–నుండు మద్భాజనమున బ్రీతుండు గాత” అని భీష్ముని చేత అనిపించినా ,అవి తిక్కన గారి మాటలే .విద్యా ,తపస్సుల జన్మ స్టాన మైన వాడూ ,జ్చావు పుట్టుకలు లేనివాడు,యజ్ఞమూర్తి ,అయిన పరబ్రహ్మం వాజ్మయ రూప యజ్ఞం తో తిక్కన పూజించాడు .దీనితో భగవంతుడు ప్రీతి చెందుతాడని నమ్మకం . ” శరణా గతుండ భక్తుడ -బరమ పదవి గోరేద ను శుభంబుగా నన్నున్ –బరికించి ఏది మేల -య్యిరవు దొరకోనంగా దలపవే కమలాక్షా”అని విశిష్ట జ్ఞానం తో ప్రార్ధిస్తాడు .భగవంతుని ప్రీతికై భక్తీ శ్రద్ధలతో సత్కర్మలు చేసి ,ఫలా పేక్ష లేకుండా ,జీవితాన్ని ఈశ్వరార్పణం చేసినఆదర్శ కర్మ యోగి తిక్కన .”ఏది మేలో అది చేయించు ”అన్న ప్రార్ధన -సర్వ సమర్పణా భావమే .వ్యాసుడు రాసిన గీతా తత్వాన్నివాచ్యం చేయకుండా ,ఆచరణ రూపం గా ,ఇలా బహిరంగ పరచాడు .అందుకే తిక్కన ఆదర్శ ప్రాయుడైనాడు .తిక్కనకు యోగం ,తపస్సు,యజ్ఞం అభిమాన విషయాలు .నిర్మల అంతఃకరణ సాధ్య మైన బ్రహ్మ జ్ఞానమే తిక్కన ధ్యేయం . ” యోగులకు యోగ బలమున -రాగంబు మొహమ్బును జిరస్నేహము,గామమముగ్రోధము గుణా–యోగము వరుస బెడ బాప నున్నతియొలయున్ ”అని యోగా వాసిష్టత ను చాటాడు .యోగం పొందిన వాడి ఆనందం వర్ణనా తీతం .అంటూ – ” యోగ నిరూదుండుడు సంగ -త్యాగా నందైక రతున్దతనికి ,జనన సంయోగము ,మృతి ,దైన్యమ్బును -భోగా భోగ సుఖ దుఃఖములులేవధిఅని చెప్పిస్తాడు .చాలా చోట్ల తపో యజ్ఞాల విశిష్టతను పాత్రల చేత చెప్పిస్తాడు .పరమేశ్వరుని ”యజ్ఞాత్మక రూప ,నిశ్చలా వ్యయరూపా ”అని సంబోదిస్తాడు .జనులందరికీ దానం ,తపం ,వృద్ధ సేవ అహింస నియతమైన పనులు అంటాడు .”యమ నియమ వికాసీ,వ్యాస చేతో నివాసీ అనీ ,యమ నియమ వికాసీ జ్ఞాన గేహ ప్రదీప ,దమ శమ కలితానంద ప్రకాశ స్వరూపా”అని పరమేశ్వరునిసంబోధించి ,తన జితెన్ద్రియత్వాన్ని తెలియ జేస్తాడు తిక్కన . ” ధర్మాధర్మ విదూర నీతి పర ,విద్వచ్చిత్త,యోగీ””అపగత కామ రోష హృదయాంతర ఖేలన కల్య ” వంటివి రాయటం వల్ల ఈద్వంద్వాలను దాటితే తప్ప ,మానసిక శాంతి లభించదని ,దాని వల్ల మాత్రమె పరబ్రహ్మ స్వరూప సిద్ధి కల్గుతుందని తెలియ జేస్తున్నాడు.”సకల నిగమ వేద్యా ,”,”వివృత నిగమ శాఖావిశ్రుతాగ్రైక వేద్యా ”,”ఉపనిషదగమ్యా,యోగ భావ్యైక రమ్యా ”అని రాయటం వల్ల వేద,ఉపనిషత్తు లలోని వేదాంత భావన ల మీద … Continue reading
వీక్షకులు
- 980,469 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
- అరుణ మంత్రార్థం. 10వ భాగం.3.2.23.
- కళా తపస్వికి శ్రద్ధాంజలి
- సుప్రకాశ శతకం
- అక్షర ప్రభాకరుడు’’ కూర్చిన వినూత్న’’ అక్షర స్వరం ‘’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.24 వ భాగం.2.2.23.
- అరుణ మంత్రార్థం. 9వ భాగం.2.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,924)
- సమీక్ష (1,279)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (306)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (360)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు