వీక్షకులు
- 981,033 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (308)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (838)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: July 6, 2012
అలేగ్సాండర్ నాటి గ్రీకు సమాజం
అలేగ్సాండర్ నాటి గ్రీకు సమాజం ఆకాలం లోగ్రీకుల ఇళ్ళు చిన్నవి గా ఉండేవి .కాల్చని మట్టి ఇటుకలతో ఇల్లు నిర్మించే వారు .మధ్యధరా ప్రాంతపు ఎండ ప్రతి ఫలించటానికి వీలుగా తెల్ల రంగు వేసే వారు . కిటికీలు పైన ఎత్తులో ఉండేవి .పేదలకు ఒకటి లేక రెండు గదులున్న ఇల్లున్దేవి . ధనికుల ఇళ్లలోఆడ వారికి ,మగ వారికి వేరు వేరు గా గదులున్దేవి .ఇంటి మధ్య ఖ్ఖాలీ ప్రదేశానికి చుట్టూ గదులున్దేవి .భోజనం సాధారణ భోజనమే .చాలాతాజా గా ,రుచి కరమైన వాటినే తినే వారు . వేడి ప్రాంతం కనుక పళ్ళు ,కూరగాయలు బాగా పండేవి .గోధుమ ,బార్లీ చేపలు సమృద్ధి గాలభించేవి .మాంసం తినటం తక్కువే . మేక పాలు తాగే వారు .పెరుగు ,వెన్న అన్నిటికీ మేక పాలే .ఆలివ్ ,ఆలివ్ నూనె వాడకం బాగాఉండేది .భోజనం లో ద్రాక్ష సారా తప్పని సరి . బానిసలు ఎక్కువ .యుద్ధాలలో పట్టు బడ్డ వారు ,వారి తార తరాల సంతానం ,బానిసలే .ఆట ,పాటధనిక ,పేద భేదం నాలుగవశతాబ్దానికి పెరిగింది . అన్ని పనులు బానిసలే చేసే వారు .ప్రతి ఇంట్లో వాళ్ళు తప్పని సరి .ధనిక పేదల భేదం నాల్గవ శతాబ్దం నాటికిపెరరిగింది.ఆడ వాళ్ల కు హక్కులు తక్కువే .మగ వాళ్ళ అధీనం లోనే ఆడబ్రతుకు ఉండేది . ఆమె ఇంటికే పరిమితం .వీధి లో తిరగటం నేరం .స్పార్టా లో మాత్రంస్త్రీలకు స్వాతంత్రం ఉండేది . అందుకే ఇక్కడి మహిళలు బలాధ్యమైన ,ఆరోగ్య వంత మైన పిల్లల్ని కనే వారు .ఆడవారు క్రీడలలో పాల్గొనేవారు . బాక్సింగ్ కూడా చేసే వారు .మగ పిల్లలు బడి కి వెళ్ళే వారు . ఆడ పిల్ల లకు ఇంట్లోనే చదువు .స్పార్టా లో ఆడ పిల్లలు బడికి వెళ్లిచదివే వారు .మగ వాళ్ళ తో పాటు అన్నిటికీ వారికి సమాన ప్రాధాన్యత ఉండేది . గ్రీకు దేశం లో కళల పట్ల ఆరాధన ఎక్కువ . నాటక శాలల్లో బహిరంగ ప్రదర్శనలు ప్రత్యక్షం గా జరిగేవి .కామెడీల ప్రదర్సనలు ఎక్కువ.అరిస్తోఫీనాస్ రాసిన కామెడీలు ,యూరిపిదాస్,సోఫోక్లాస్ రాసిన ట్రాజెడీలు ప్రదర్శిస్తే జనం బాగా చూసి ఆనందించే వారు .. కవిత్వంఅంటే మాంచి సరదా .700b.c.కాలం వాడిన అంధ కవి హోమర్ గొప్ప కవి . ఆయన రాసిన ఇలియడ్ ,ఒడిస్సీ లు 1200b.c.నాటిట్రోజన్ వార్ ఆ తర్వాతి కధలు .ఆ కాలం లో చాలా మంది విద్యా వేత్త లకు హోమర్ కావ్యాలు కన్తస్తం . క్రీడలు గ్రీకులోనే పుట్టి పెరిగాయి .ఒలింపిక్ ఆటలకు కేంద్రం .ఆటల్లో మత భావాలను చొప్పించే వారు .దేవత లను ఆరాధించటం గ్రీకుసంప్ర దాయం .చాంపియన్ క్రీడా కారులకు ప్రత్యెక సత్కారం చేసే వారు .అదొక ”క్లాసికల్ పీరియడ్ ”గా గుర్తింపు పొందింది . ఇన్నీ ఉన్నా గ్రీకులకు ఆనందం కరువే .ఎప్పుడూ యుద్ధాలే .ఆ కాలం లో పర్షియా అనే ఆసియా రాజ్యం (ఇవాల్టి ఇరాన్ )అయోనియాభాగాన్ని ఆక్ర మించింది .ఇది ఏజియన్ సముద్ర తూర్పు తీరం . ఇదే ఇవాల్టి ట ర్కి .దీనిలో ఎన్నో గ్రీకు వలస దేశాలున్నాయి .ఇవిపర్షియా పై499 b.c.లో తిరుగు బాటు చేశాయి .ఏథెన్స్ లాంటి సిటి స్టేట్స్ సమర్ధించాయి .డేరియస్ 1 అనే పర్షియా రాజు వీటిని అణచివేశాడు . అంతటి తో ఆగ కుండా నావల మీద bay of marathan అనే ఏథెన్స్ దగ్గర ప్రాంతానికి దండెత్తి వచ్చాడు .ఎతియన్లకు,పర్శియన్లకు భీకర యుద్ధం జరిగింది .గ్రీకుల రణ కౌశలం పర్శియన్లను దెబ్బ తీసింది .ఓడియన్ ఒడి పోయి సముద్రం గుండాస్వదేశానికి పారి పోయాడు . . 480b.c. లో మళ్ళీ అతని కొడుకు xerxes వచ్చి ,మీద పడ్డాడు . తెర్మో పైల్ అనే ఇరుకు ప్రాంతం లో యుద్ధం జరిగింది .స్పార్తాన్సైనికులుమొదటి రోజు యుద్ధం లో పర్షియన్ల అంతు చూశారు . ఒక గ్రీసు మోస గాడు పర్శియన్లకు వేరే మార్గం చూపించాడు . పర్షియన్లుగెలిచారు అయినా ఎక్కువ మంది చచ్చారు .ఏథెన్స్ చేరి ఆ మహా నగరాన్ని కాల్చి బూడిద చేశారు .అప్పటికే ఏథెన్స్ వాసులు పారిపోయారు . కనుక జన నష్టం జరగ లేదు తర్వాత సాలమిస్ వద్ద నెల రోజులనౌకా యుద్ధం లో ఏ అనుభవం లేని పర్షియన్లు చావు దెబ్బతిన్నారు . ఈత రాక సముద్రం లో మునిగి పోయారు .వంద లాది పర్షియన్ సైన్యాన్ని ఊచ కోత కోసేశారు .మరుసటి ఏడాది యుద్ధం లోపర్శియన్లను పూర్తిగా ఓడించేశారు . … Continue reading
ముగ్గురు మహాను భావులు
ముగ్గురు మహాను భావులు విల్ డ్యురాంట్ అనే గొప్ప రచయిత ను తనకు నచ్చిన పది మంది మేధావులను ,పది మంది కవులను ,పది మంది తత్వ వేత్తలను చెప్ప మంటే ఆయన చైనా తాత్వికుడు కన్ఫ్యూజియాస్ ను ,అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ ను ,జర్మనీ ఫిలాసఫర్ ఇమాన్యుల్ కాంట్ ను పేర్కొన్నాడు … Continue reading