అమెరికా ఊసులు –9

అమెరికా ఊసులు –9
అమెరికా లో పౌరుడు శక్తిని ఇతర దేశాల సామాన్య జనం వాడే
దానితో పోలిస్తే 115రెట్లు వాడుతున్నాడు .అమెరికా జనాభా  ప్రపంచ జనాభా లో
అయిదు శాతం .అయినా వాళ్ళు వాడేది ప్రపంచ శక్తి లో ఇరవైఅయిదు శాతం .
.ఇందులో ఎలేక్త్రిసిటి ని అమెరికా లో మనిషి ఒక్కడు 12924కిలో వాట్ అవర్స్
ఖర్చు చేస్తున్నాడు .ఆయిల్ వాడకమూ ఎక్కువే .ప్రపంచం లోని మోటారు కార్లను
ఒక వరుసగాఒక దాని వెనుక ఒకటి  పెడితే ,అది భూమి చుట్టూ కొలతకు 120రెట్లు
ఉంటుందట .అమెరికా లో పన్నెండు వందల మందికి వెయ్యి కార్లున్నాయి .ఇండియా
లో వెయ్యి మందికి ఎడే ఉన్నాయి .అందుకని ఇతర ఇధనాల పై దృష్టి పెట్టారు
.బయోదీజేల్ ఇథనాల్ ఉత్పత్తి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది
దాకా పెంచు కొన్నారు .ఆల్కహాల్ వాడకమూ పెరిగింది .ఒక జోక్ గుర్తొస్తోంది
-ఒక తాగు బోతూ లివర్ మార్పిడి కైనా సిద్ధమవుతాడు కాని సారాయి తాగటం
మానడు.
యు.యెన్.సర్వ్ ప్రకారం ఆహార ధాన్యాల అధిక ధరల వల్ల102 మిలియన్ల
జనం ఆకలితో  .2009నాటికి అలమటించారు .ఇంకో తమాషా ఏమిటి అంటే అమెరికా లోని
ఆహార పదార్ధాలలో నలభై శాతాన్ని పార బోస్తున్నారట .మరి అమెరికా లోని ఆహారం
లేని ఇళ్ళుఇప్పటికే ఎనిమిది మిలియన్లు ట .యాభై ఏళ్ళ లో ప్రపంచ
జనాభాఆరున్నర బిలియన్లకు చేరిందట .2010 లెక్కల ప్రకారం ప్రపంచ ఆహార
ధాన్యాల ధరలు ఎన్నడూ లేనంత ఎక్కువ ట .అలానే కొంత  కాలం పెరుగు తూనే
ఉంటాయట వ్యవ సాయ భూములు తరిగి పోతున్నాయి .అందుకని స్వీయ రక్షణ లో దేశాలు
పడి పోయాయి .ఇతర దేశాల్లో భూమిని కొని, లేక లీజు కు తీసుకొని వ్యవ సాయం
చేయిస్తూ ఉత్పత్తిని పెంచు కొంటున్నాయి .
ప్రపంచ జనాబహా లో ఇరవై శాతం ఉన్న చైనా కు ఉన్న సాగు భూమి
తొమ్మిది శాతమే .అందుకని చైనా ప్రభుత్వం  2.8.మిలియన్ హెక్టార్ల భూమిని
కాంగో దేశం లో కొని ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు .మోజంబిక్ లో నాలుగు
వందల మిలియన్ల డాలర్ల తో వరి పండిస్తున్నారు .దక్షిణ కొరియా
690,000ఎక్తార్లను కొని ఆహార ధాన్యాలను పండిస్తోంది .ఇండియా రెండు
బిలియన్ల డాలర్లతో ఇథియోపియా లో చెరుకు ,తేయాకు ,మిగిలిన పంటలు
పండిస్తోంది .పంజాబ్ రైతులు సూడాన్ లో భూములు కొని సాగు చేస్తున్నారు
.ఇండియన్లు ఆఫ్రికా ,లాటిన్ అమెరికా లలో భూములు కొని పంటలు
పండిస్తున్నారు .బ్రజిల్ ముప్ఫై మిలియన్లు ,అర్జెంటిన ముప్పహి రెండు
మిలియన్లు ,హెక్టార్ల భూమిని భారత్ కు ఇవ్వ టానికి సిద్ధ పడ్డాయి
.బంగ్లాదేశ్ ఉగాండా లో భూమి ని లీజు కు తీసుకొని సాగు చేస్తోంది .
ప్రపంచ నీటి జంతువుల శాతం తగ్గి పోతోంది .ప్రసిద్ధ చేప
జాతులన్నీ అంత రించాయి వలేసి పట్టటం వల్ల .గ్లోబల్ వార్మింగ్ తో
సముద్రాలన్నీ ఉప్పొంగి భూములను కబలించేస్తాయి .సముద్ర తీర భూములన్నీ
అంతరిస్తాయి .క నుక శాస్త్ర వేత్తలు ”రెండో గ్రీన్ రివల్యూషన్ ”రావాలి
అంటున్నారు .కొత్త అధికోత్పత్తి నిచ్చే వంగడాల సృష్టి జరగాలి అప్పుడే
అదిసా ద్యం .క్రిమి సంహారాలు సమర్ధ వంతం గా పని చేయాలి .ఆధునిక వ్యవ సాయ
పద్ధతులను అవలంబించాలి .సాంకేతిక ప్రగతి వ్యవ సాయానికి తోడ్పడాలి
.అప్పుడే ప్రపంచం అన్న దాత గా పేరు నిలుపు కొంటుంది .”మనిషి కడుపు
నిండితే పేద ధనిక తేడా ఉండదు ”అన్నాడు ఈరిపిదియాస్ .”మనం సమస్య సుడి
గుండం లో ఉండి దాటగల సమర్ధత ఉన్నా నిద్ర లో నడుస్తున్నామేమో -మనం తలచు
కొంటె ,ప్రపంచం లో  ప్రతి వారి నోటికి అన్నం అందించ గలం .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –20-7-12.–కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.