తిక్కన భారతం –17 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –5

 తిక్కన భారతం –17
యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –5
భీమ ,ఆశ్వతామ ల  యుద్ధ రీతి లోని భేదం చూశాం .ఇప్పుడు అర్జునుని యుద్ధం తీరు చూద్దాం .భీముడిని యుద్ధరంగం లో అనవసరం గా నినదించాడు కర్ణుడు .అప్పుడు కిరీటి ”ఎందుకు మా అన్నను ఊరికే తిడ తావు ?అతడు విజ్రుమ్భిస్తే సిగ్గు లేకుండా పారి పోతే ,నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా ?తప్పున్న మాత్రం తో ఇంత గర్వమా ?సాత్యకి నిన్ను గెలవడా ?గెలుపు ,ఓటమి యుద్ధం లో మామూలే .అంత మాత్రం చేత ఇలా నోరు పారేసుకోవటం వివేకుల లక్షణం కాదు .దీని తో హీనం గా ప్రవర్తించి  నీ కులం ,గుణం అందరికి తెలియ బరచు కొన్నావు .”అని గడ్డి పెట్టాడు .”అభి మన్యుని చిత్ర వధ చేశావు .నీ కళ్ళ ఎదుట   నీ కొడుకు వృష సేనుడిని చంపు తాను చూడు ”అని సవాలు విసిరి మరీ చంపాడు .ఈ వదా  విధానం లో పాం డవ మధ్యముని ప్రశాంతత ,ఆత్మ విశ్వాసం ,స్థైర్యం ,నిగ్రహం మనకు గోచ రిస్తాయి .క్షత్రియోచిత మైన ఆత్మ    నిగ్రహాన్ని పాటించాడు .బ్రాహ్మణుడు అయినా ఆవేశం పూని ఉన్మాదం తో ప్రవర్తించాడు గురు పుత్రుడు అశ్వ తామ .”భ్రుకుటి స్పూర్జిత ఫాలభాగు డై,కర్ణ కుమారుని కోదండం ,బా హు దండం ,తలా ఒకే సారి బాణం తో ఎగర గొట్టాడు ఫల్గుణుడు .దుర్యోధనుడు కర్ణుడు చూస్తుండగానే ఇంత పనీ చేశాడు .అదీ పౌరుషం, మగటిమ . అశ్వతామ  చివరకు ”బ్రహ్మ శిరోనామ కాస్త్రం ”ప్రయోగించాడు .వ్యా సాది మహర్షులు వచ్చి ఉప సంహరించ మన్నా వినలేదు .పరీక్షిత్తు ను నొప్పించెంత వరకు వెళ్లాడు .అయినా భీమార్జున్లు అతన్ని ప్రాణాలతో వదిలి పెట్టారు .క్షమించి పంపించేశారు .తమ గుణాన్ని చాటుకున్నారు .
కర్ణుడు మొదలైన వారంతా అభి మన్యుని చేతి లో ఒడి పోయారు .మళ్ళీ మళ్ళీ వచ్చి సాహసం తో యుద్ధం చేశారు కాని అధర్మ యుద్ధం చెయ్య లేదు .ఆవేశం తో ద్రోణుడే అభి మాన్యుని చావుకు కారణమయ్యాడు .అందుకే ధర్మ రాజు ”ఆ ద్రోహికి నిన్న ,ఇవాళ తోడ్పడిన ద్రోణుని తెగటా ర్చాలి ”అన్నాడు .అయితే ద్రోనున్ని ద్రుష్టద్యుమ్నుడు చంప గానే అర్జునినికి కోపం వచ్చింది .ధర్మ రాజు ను నినదించాడు కూడా .అప్పుడాయన పాంచాలి పరాభవాన్ని గుర్తుకు తెచ్చాడు .అభి మన్యు వాదా విధానం చెప్పి ”ఇట్టి ధర్మ పరుడైన ,కలశ సంభావుతోడ సరి వచ్చు టుచితంబె ?”అని ప్రశ్నించాడు .ఈ విధం గా యుద్ధ రంగం లో భిన్న వ్యక్తుల విభిన్న మనో ప్రవృత్తిని ఆవిష్కరించాడు తిక్కన . యుద్ధ రంగం ఒక నాటక రంగమైంది .దీనికి అనుగున మైన సరళ భాష ను ప్రయోగించాడు .ఆత్రాల స్వభావం ,మానసిక భావావేశాలు ,భావ సాంద్రత అనీ అభి వ్యక్తం చేశాడు .సమయోచిత రాసా విష్కరణ చేసి నిండుదనం చేకూరుస్తాడు .
భీష్మ పితా మహున్ని చంప టానికి ధర్మ రాజాదులు విధి విధానాన్ని ఆలోచిస్తున్నారు .ధర్మ రాజు ”అకటా ,తండ్రి సచ్చి నంత నుండియు ,మము -నరసి ,ప్రాచి నత్తి యనుగు దాత ,–జమ్పమది దలంచు తెంపు సూ చితే ,రాజ ధర్మ మింత క్రూర కర్మ మగునే ?”అని వ్యాకుల పడ్డాడు తండ్రి పోయిన తర్వాత అన్నీ తానే అయి తమను పెంచి పేద్ద చేసిన పితామహుని చంపాలంటే మనసు ఒప్పటం లేదట .రాజ ధర్మం బంధువులను ఎవరినీ లెక్క చెయ్యదు కదా అని బాధ పడుతున్నాడు .భీష్ముని చేరి ఆయన మరణ విధానాన్ని ఆయన తో నే చెప్పించు కొన్నారు .పితామహుడు తన మరణ విధానాన్ని తెలియ జేసి ,”అది తన ఆజ్న గా పాటించ” మని ఆదేశించాడు .అలా అయితేనే ధర్మజుడు అంగీఅరిస్తాడని భావం .అప్పుడు అర్జుని మనో వేదనా లలిత సుందరం గా ఉంటుంది –”గురుని ,కృత ప్రజ్నుని ,ధ -ర్మ రతు ,వయో వృద్దు ,లోక మాన్యు ,దయాళున్ –సుర తటినీ సుతు ,వంచన –బురుషోత్తమ ,చంప బుద్ధి పుట్టదు నాకున్ ”అని విల విల లాడి పోయాడు .వంచన చేసి చంపాల్సి వస్తోందే కురు వంశ సూర్యుడిని అని మహా వేదన చెందాడు .ఈ పద్యం లో ప్రతి శబ్దాన్ని అర్ధ వంతం గా ప్రయోగించాడు తిక్కన .తమకు భీష్ముడు -గురుడు ,ప్రజ్ఞా ప్రాభవ ఖని ,ప్రతిజ్ఞా పాలన కు జీవితం అంకితం చేసిన వాడు ,ధర్మ విషయం లో వేలెత్తి చూప లేని వాడు ,ఇదంతా కాదు అసలు వయస్సు లో అందర్ని మించి జ్ఞానం తో కూడా వృద్ధుడైన వాడు ,లోకం అందరి తోను మాన్యుడు అని పించుకొన్న వాడు ,దయా స్వరూపుడు ,గంగా నదీ కుమారుడు ,అయిన భీష్ముడిని వంచన తో ఎలా చంప మంతావయ్యా పురుషోత్తముడు అనే పేరున్న ఓ కృష్ణ పరమాత్మా !”అని ఆవేదన చెందాడు .ఆయన గునాలన్నిటినీ వరుస క్రమం లో ప్రయోగించాడు .ప్రయోగించిన ప్రతి మాట ”భీష్ముని చంప రాదు ”అని సూచించే మాటే .ఆయన తనను వ్యక్తీ గతం గా ఎంతో ఆదరించాడు .అందుకే ఈ వేదన .”నన్ను ,బాంసు కేళి నున్న ,నర్మిలి ఎత్తి –మేని దూలి తనదు మేను వొరయ –ప్రీతీ కౌగిలించి ,మా తండ్రి గుణము,ళ  –గ్గించి కన్ను నీరు నించు నతడు ”
తన చిన్నతనం ఒళ్లంతా మట్టి కొట్టు కొని ఉన్న తనను ఎట్టు కొని ఆ మాట్టి తన ఒలంతా అంటించుకొని నాకు బుద్ధులు చెప్పి నా తండ్రి గుణాలను జ్ఞప్తికి తెచ్చి ,తాను ఏడిచే ఆ పితమహున్ని నేను ఎలా చంపను ?అని దుఃఖించాడు .అంతే కాదు ధర్మ పరత్వం ,మొదలైన సహజ గుణాలను తెలియ జెసేఎ పద్యం ఒక రసధుని .–”అక్కట తండ్రి లేని మము నేమ్మాయి బెంచిన తాత ,నిమ్మెయిం –ద్రోక్కేనగా డతండు సముదీర్ణ భుజా బల శౌర్య శాలియై –ఇక్కడి సేన జక్కడిచె ,నేనియు జూతును గాక ,ధర్మ ముం –దక్కుట  కోర్వ జాలుదునె ధర్మ రాజు ,తమ్ములు క్రూర కర్ములే ”అని కన్నీరు మున్నీరు అయాడు .
శిఖండి ని అడ్డం గా పెట్టు కొని ,అర్జునుడు భీష్ముని తో యుద్ధం చేస్తుంటే ,ద్రోణా చార్యుని మనసులో చెప్పా లేని కలవరం చేల రేగింది .అనర్ధం గోచ రించింది .ఆయన పరిస్థితి –”తడ బడే దివ్య బాణములతంత్రము ,మంత్రము దప్పెడుం  గడున్ –వడ కెదు జాప దండము ,మనంబును నాకు ,వశంబు గాడు ,వీ –ద్వాదియేడు ,జేయ్వులంగాముగమంత్రం తప్పుతోంది ,తంత్రం తడ బడు తోంది .డంక ,దోరంగేడు నేటి భంగి ,,గ –వ్వడి ,తన పూన్కి దీర్చుట ద్రువంబని ,బుద్ధి జనించే బుత్రకా ”ద్రోణుని చేతులు కాళ్ళు ఒంకి పోతున్నాయి బాణం పట్టు తప్పు తోంది శరీరం తడ బడు తోంది .ఇవన్ని గమనిస్తుంటే ఆయనకే ఆశ్చర్యం వేస్తోంది .అర్జునుడు భీష్మ పితా మహున్ని చంపి తీరుతాడు అనే మనో నిశ్చయానికి ద్రోణా చార్యుడు వచ్చే శాడు .అర్జునుని పరాక్రమం అలా ఉంది .తన వశం తప్పి పోతోంది .శిఖండి ముందున్నాడు .కనుక సుర నాదే తనయుడు సుర లోకం చేరటం ఖాయం అను కొన్నాడు .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –26-7-12-కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.