విశ్వావిర్భావం

  విశ్వావిర్భావం 
స్పేస్ టైం లో వ్రేలాడ దీయ బడిన స్పైరల్ గెలాక్సీ పై అంటించిన పోస్టర్ లో ”మీరు ఇక్కడ ఉన్నారు ”అని వ్రాసి ఉందట .విశ్వావిర్భావానికి బిగ్ బాంగ్ సిద్ధాంతం ఆధారం గా భావిస్తారు .దాన్ని పూర్తిగా నమ్మక పోయినా దానిని మించిన సిద్ధాంతం వచ్చినా దాన్ని వదలలేక పోతున్నారు .నక్షత్రాలకు ముందే మూలకాలు ఏర్పడి ఉండవచ్చు .అప్పుడు న్యూట్రాన్ గాస్ వేడిగా వ్రేలాడుతున్నట్లున్దేడిత .కొన్ని న్యూట్రాన్లు ప్రోటాన్లు ,ఎలేక్త్రాన్లు గా మారాయటఅప్పుడు హైడ్రోజెన్ బ్లాక్స్ ఎర్పడ్డాయత .ఒక మూలక పదార్ధం yelm. ఉండేది .ఇది గ్రీకు పదం -దీని అరధం -ప్రాచీన పదార్ధం .
సుమారు పది హేను బిలియన్ల సంవత్స రాల క్రిందట పదార్ధము ,శక్తీ అంతా కూడా కొద్ది ప్రదేశం లో కీన్ద్రీక రించి ఉండేది ఆ ప్రదేశం క్రమం గా వేగం గా విస్తా రించటం ప్రారంభించింది ..ఉష్ణోగ్రత వంద మిలియన్లరెట్లు పది పోయింది .ప్రాధమిక కణం క్వార్కులు శక్తి సముద్రం లో స్వేచ్చగా సంచ రించేవి ..మళ్ళీ వెయ్యి మిలియన్ల రెట్లు పెరిగిన తర్వాతా కొలువ దాగిన పరిమాణం లో పదార్ధం సోలార్ సిస్టం ఏర్పడింది .అప్పుడు క్వాకర్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు గా స్తిర పడ్డాయి .మళ్ళీ వెయ్యి రెట్లు విశ్వం పెరిగిన తర్వాతా ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిసి అనువు లోని న్యూక్లియస్ లు గా మారాయి .వీఎతి లోనే ఇవాల్టి ఈలియం ,ద్యుతీరిం ఉన్నాయి .ఇదంతా వ్యాకోచం చెందినా మొదటి నిమిషం లో నే జరిగింది .అయినా అప్పటికి ఉష్ణోగ్రతలు ఇంకా విప రీతం గానే ఉన్నాయి .తటస్థ అణువులు అత్యధికం గాఏర్పడ్డాయి .ఇలా విశ్వం వ్యాపిస్తూ మూడు లక్షల సంవత్సరాలు గది పిండి .అప్పుడు మన విశ్వం ఇప్పుడున్న దానికంటే వెయ్యి రెట్లు చిన్నది గా ఉండేది .న్యూట్రాన్ అణువులు కలిసి వాయు మేఘాలుగా ,ఏర్పడి ,ఆ తర్వాతా నక్షత్రాలుగా మారాయి .అప్పటికి మన విశ్వం ఇప్పుడున్న స్తితి కి ఐదో వంతు మాత్రమె వ్యాపించింది .అప్పుడు నక్షత్రాలు కలిసి సమూహాలై యువ గెలాక్సీ లు గా తయారైనాయి .
ఇప్పుడున దానిలో విశ్వం సగమే ఉన్న కాలం లో నక్షత్రాలలో న్యూక్లియర్ రియాక్షన్లు ప్రారంభ మైనాయి .అతి భారమైన మూలకాలు ఏర్పడివాటితి గ్రహాలూ ఏర్పడ్డాయి .మన సోర్య మండలం చాలా తక్కువ వయసు కలిగి ఉంది .ఇది ఏర్పడి సుమారు అయిదు బిలియన్ల సంవత్స రాలు అయి ఉంటుంది .అప్పుడు విశ్వం ఆకారం ఇప్పుడున్న దానిలో రెండు వంతులు మాత్రమె ఉంది .కాలం గడిచిన కొద్దీ గెలాక్సీ లలోని వాయువులను నక్షత్రాలు పూర్తిగా స్వాహా చేసే శాయి .దానితో నక్షత్రాల వృద్ధి క్రమంగా తగ్గి పోయింది ..ఇంకో పది హేను బిలియన్ ఏళ్లకు నక్షత్రం అని పిలువా బడే మన సూర్య గోళం లాంటివి కూడా అరుదు ఆయె ఆవ కాశం ఉంది .అప్పుడు మన విశ్వం నివాస యోగ్యం కాకుండా పోతుంది .నందో రాజా భవిష్యతి .మన వరకు మనకేమీ భయం లేదు .
విస్తరించాక ముందు వ్శ్వం ఎలా ఉండేది ?చివరి నక్షత్రం అందులోని న్యూక్లియర్ ఇంధనం అయి పోయిఅదృశ్యమైతే  ఏమి జరుగు తుందో ఎవరూ చెప్పలేరు .ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన రిలేటి విటి ణి వివరిస్తూ ద్రవ్య రాశి శక్తి స్పేస్ మరియు కాలానికి ఉన్న సంబంధాన్ని వివ రించాడు .అంతరిక్షం లో పదార్ధం అంతా ఒకే తీరుగా వ్యాపించి ఉంటుందని చెప్పాడు .ఆయన విశ్వం ఎప్పుడూ నిలకడ గానే ఉంటుందని ,మార్పు చెందదని , గట్టిగా చెప్పాడు .హబుల్ శాస్త్ర వేత్త మన నుంచి గెలాక్సీ కదలిక ,దాని దూరం మీద ఆధార పది ఉంటుందన్నాడు .విశ్వం వ్యాప్తి చెంది నపుడు పదార్ధ సాంద్రత తగ్గుతుంది .ఆయన కానీ పించే గెలాక్సీల సంఖ్యను లెక్క పెట్టాడు .గెలాక్సీ మన నుంచి దూరం అయి నప్పుడువాటి లోనుంచి వచ్చే ఉద్గార శక్తి వల్ల తరంగ దైర్ఘ్యాలు పెరుగుతాయి .అప్పుడు రేసేషాన్  వేలాసిటి పెరిగి యెర్ర పడ తాయి .దీన్ని ”రెడ్ షిఫ్ట్ ”అంటారు .
ఇన్ఫ్లేషన్ సిద్ధాంతం ప్రకారం విశ్వం మండే అగ్ని గోళం గా ఉంది ,అందులోంచి అగ్ని కణాలు వెలువడి నట్లు అన్నీ ఏర్పడ్డాయి .ఎలిమెంటరి పార్టికల్ అనే సిద్ధాంతం ప్రకారం ఒకే ధ్రువం గల ఆయస్కాన్తాళ లాంటి చాలా భారం ఉన్న పార్టికల్స్ ఉండేవి .వీటిని మోనో పోల్స్ అంటారు .వీటి భారం ప్రోటాన్ భారానికి  1.016 రెట్లు .బిగ్ బాంగ్ ప్రకారం ఇవి విశ్వావిర్భావకాలం లో మొదట ఏర్పడ్డాయి .క్వాంటం మెకానిక్స్ వచ్చి అన్ని లెక్కలను మార్చింది .ఆ సిద్ధాంతం ప్రకారం ఖాళీ ప్రదేశం అంటే ఏమీ లేకుండా ఉన్న ప్రదేశం కాదు .ఆ శూన్యం లో అతి కొద్ది క్వాంటం మార్పులు ఉంటాయి .వాటిని తరంగాలు అన వచ్చు .విశ్వం వంపు తిరిగి ఉంది .
ఆ ఒంపు ధనాత్మకం అయితే రేఖా గణితం గోలా కారం గా ఉంటుంది .అదే రుణాత్మకం అయితే జామెట్రీ పరవాలయం అంటే హైపర్ బొల గా ఉంటుంది .చిన్న చిన్న దోరాలకు యూక్లిడ్ ప్లేన్ జామెట్రీ పని చేస్తుంది కాని వీటికి పనికి రాదు .గోలా కార విశ్వం లో అంటే భూమి మీద లాగా ఉంటె-సమాంతర రేఖలు కలుసు కొంటాయి .త్రిభుజం లోని మూడు కొనాల మొత్తం540  డిగ్రీలు ఉంటుంది అంటే మూడు రెట్లు .వృత్తం చుట్టూ కొలత  2 pai r  కంటే తక్కువ గా ఉంటుంది .కారణం స్పేస్ లోని వంపు మళ్ళీ తిరిగి వచ్చి కలుస్తుంది కనుక .దానితో గోలా కార విశ్వం స్తిరం గా ఉంటుంది .పర వలయ విశ్వం లో సమాంతర రేఖలు విడి పోతాయి .త్రిభుజం లోని మూడు కొనాల మొత్తం 180డిగ్రీల కంటే తక్కువ గా ఉంటుంది .వృత్త పరిధి 2 pai r కంటే ఎక్కువ ఉంటుంది .అలాన్తివిశ్వం అనంతం గా ఉంటుంది .ఇదంతా కంగారు గ ఉంది కదూ.అందుకే జార్జి ఆర్వెల్ అనే మేధావి to see what is in front of one’s nose requires a constant trouble ” అని తమాషా గా అన్నాడు .అది తమాషా కే అన్నా నిజమే .ఇవాళ ఉన్న సిద్ధాంతం రేపు నిజం కావటం లేదు .బూరలు బద్దలు కొట్టు కొంటున్న శాస్త్ర వేత్తలకు ఇది వివ రించాలంటే శాస్త్ర పర్జ్ఞానం చాలదని ఉద్ది తో కాక మనస్సు తో ఆలోచిస్తే సమాధానం లభిస్తుందని ఊరట చెందుతున్నారు .అయినా మనకొచ్చిన భయం లేదు .ఎన్నో బిలియన్ ఏళ్లకు కదా మార్పు !
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –28-7-12-. కాంప్–అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.