జన వేమన — 28 ప్రపంచమే శిక్షణా లయం

జన వేమన — 28
                                           ప్రపంచమే శిక్షణా లయం 

ఈ ప్రపంచాన్ని వదల నక్కర లేదు .జనం తో ఉంటూనే తన సంస్కారాన్ని పెంచు కోవాలి .ప్రపంచమే ఒక గొప్ప శిక్షణా లయం .అందుకే ”ఇల్లు ,నాలు విడిచి ఇనుప కచ్చలు గట్టి –వంటకంబు ,నీరు వాంఛలు డిగి –వంటి నున్న యంత వచ్చునా తత్వంబు ”అని కేక లేస్తాడు .ప్రపంచం లో సర్వ జీవులు ఒక్కటే నన్న భావం రావాలి .”ఇహము విడిచి ఫలము లింపు గలవని –మహిని బల్కు వారి మతము కల్ల –ఇహము లోన బరము నొసగుట గానరో ”అని ఇహం లోనే పరాన్ని చూడ మన్నాడు .ప్రపంచాన్ని వది లేయటం మంచిది కాదు .ప్రపంచ పరిత్యాగం మానవ సంస్కారాన్ని పెంచాడు .వారు ధరించే వన్నీ బాహ్య సన్యాస చిహ్నాలే .అందుకే ”గ్రామము ,భూములు వదలక –ప్రేమయు ,దయ ఇంత లేక భీకర మతు లై –భామల సుతులను వదలక –బాముల బడ నేల యడవి పట్టున వేమా ?”అని ప్రపంచం లోని శాంతిని వదిలి పారి పో వద్దు అన్నాడు .పకీరులుగా ,బికారులుగా ,తిరిగే వారంటే వేమనకు చీత్కారం .వాళ్ళందరూ శాపోహహతులు అంటాడు .”మది ముక్తికి నా స్పదంబు మహిలో వేమా ”అని చెబుతూ మనస్సు ముఖ్యం కాని వేషంముఖ్యం కాదు అని ఆయన అభి ప్రాయం .
                అసత్య జీవిత మార్గం 
ఆత్మా శిక్షణ కు ,జీవిత విజయ సాదా నానికీ యోగం చాలా శ్రేష్టం .అయితే మానసిక వైరాగ్యం వాళ్ళలో చాలా మందికి ఉండదు .డాంబికం గా ఉంటారు .సత్యాన్ని తెలుసు కోవాలానే కోరిక వారి లో తక్కువ మందికే ఉంటుంది .ఆత్మ సంస్కార వంతులు తక్కువే .అలాంటి వారి గురించి ”కలియుగమునను బుట్టి ,క తేర గా లేక -యొడలు బడల జేసి .యుగ్ర తపము –తమరు చేసి ఏమి ,తత్వము గ లేరు ”అని వీళ్ళను” లైట్ తీసుకొన్నాడు” .కాలు చేయి వంచి గాలి నిండా పీల్చి నేల మీద వ్రాలి కొన్ని ,నిలిచి కొన్ని ఆసనాలు వేస్తారు .లో చూపు చూడ నోల్లరు -వాచా బ్రహ్మము పలుక వద్దు ”అని హితవు చెప్పాడు .మాటలు కాదు ,చేతల్లో కనీ పించాలి అని సవాలు చేశాడు .రాజ యోగి అంటే తానే బ్రహ్మం అని తెలుసు కొన్న వాడు అన్నాడు .”శాంత మానసమున జల్లని శీతల –భాతి నున్న వాడు పరమ యోగి ”లాగా ఉన్న వాడే ముక్తిని సాధిస్తాడని వేమన అభి ప్రాయం .
                       సత్యం ఒక్కటే 
కర్మ కాండ ఆధ్యాత్మికం గా అంధ కారం లోకి నేడు తుంది .భేదాలు పెరుగు తాయి .దేవతలకు చేసే ఉపాసనతో మానవ ఐకమత్యాన్ని సాధించాలి .కర్మ చేయటం వాళ్ళ ప్రాపంచిక లాభం పొంద వచ్చు .కాని ధర్మ శాంతి సౌఖ్య సిద్ధి కలుగవు .ఆత్మా చిక్కులు విప్పిన వాడే యోగి .ఆత్మా శుద్ధి లేని ఆచారం పనికి రాదు .తీర్ధ యాత్రలు మానవ కళ్యాణ మార్గాలు కావు .హృదయం లో మార్పు రావాలి .”ఓడలు శుద్ధి చేసి ,ఆచారం యెడ యని చూడరా ”అన్నాడు .జీవితం పై ఉదాసీనత పనికి రాదు .అలా చేస్తే ,మానవుడి మీద గౌరవం పోతుంది .మానవీక్రుత సంస్కారమే మానవుని జీవితానుభవం .చెప్పటం తేలికే ఇవన్నీ .ఆచరించటం కష్టమే .ఔదార్యం మానవాభ్యుదయానికి అలంకారం .క్రూర భావాలు మాన వ వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టిస్తాయి .”ఆస పాప జాతి అన్నిటి కంటే”అన్నాడు .పాపం ఎక్కడో లేదు .తాను చేసిన కర్మ లోనే ఉంది .”చంప దగిన యట్టి శత్రువు తన చేత -జిక్కె నేని కీడు సేయ రాదు -పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు ”అని సర్వ కాలాలకు తగిన నీతి చెప్పాడు .మనశ్శాంతి అంటే ఇంద్రియా లను సంస్కరించటమే కాని అణచి వేయటం కాదు .”అన్న మధిక మైన నది దా జమ్పురా — అన్న మంట కున్న నాత్మ నొచ్చు –చంప ,నొంప బువ్వ చాలదా ”అన్నం లేక పోయినా ,ఎక్కువైనా చస్తాం .చంపటానికి వేరే కారణాలు అక్కర్లేదు .అన్నం చాలు .ప్రకృతిని తెలుసుకోక పోతే భక్తీ రాదు .పాపానికి వెర వాలి .”మరువం గా వలదు మేలు ”అని మేలు చేసిన వాడిని మరు వద్దు అన్నాడు .మరిస్తే క్రుతఘ్నతే .ధనం ఎవరి సోమ్మ్మూ కాదు .ధర్మమే మన సొమ్ము .కోకిల వనం లో హాయిగా విల సిల్లి నట్లు ప్రాజ్ఞుల పలుకులు మానసిక ఆనందాన్నిస్తాయి .
నిజ మైన గురువు మార్గ దర్శకం గా ఉండాలి .మత పుస్తకాలు చదవటం వాళ్ళ ప్రయోజనం తక్కువే .జీవిత లోతుల శోధనకు ఆది చాలదు .స్వాను భూతి కావాలి .గురువు అంటే పరమాత్మే .శిష్యుడే జీవుడు .”గురు శిష్య జీవ సంపద –గురు తరముగ గూర్చు నతడు గురు వాగు వేమా ”అని యదార్ధ గురు దర్శనం చేయించాడు .మానవుని మోక్షం అతని చేతుల్లోనే ఉంది .”సకలా కారు దానంతుడు –సకలాతమల యందు సర్వ సాక్షియు దాని –సకలమున నిర్వి కారు –దాక లంక ,స్తితిని బ్రహ్మ మన బడు వేమా ”సందేహాలు ,అనుమానాలు భగవారాధన తో తొలగి పోతాయి .భయం వదలాలి .అజ్ఞానమే భయం .భయం పోతే జ్ఞాన సూర్యోదయమే .ఈ దేహం ,దేవాలయం కావాల్సిందే .”జయమే సుమీ జీవుదనుచు చాటార వేమా ”అని ఆయన సందేశం .సంసార జీవితం లో న్తూనే ,తామ రాకు పై నీటి బొట్టు లాగా వ్యవ హరిస్తూ ,భగవంతుని తో అనుక్షణం మానసికం గా గడుపుతూ ఉండే మానవుడే సర్వ స్వతంత్రుడు .అతడే భగ వంతుడు .
సత్యం తెలిస్తే ,ఆత్మ వశమై నట్లే .సత్యం ,విజ్ఞానమే దైవం .నిన్ను నీవు తెలుసు కొంటె భగ వంతున్ని తెలుసు కొన్నట్లే .చావుకు భయ పడ రాదు .ప్రళయం రాక తప్పదు .ఆత్మ జ్ఞానమే నావ .”ధర గిరులు ,జలధులన్నియు –పరి కిమ్పంగా ప్రళయమును భస్మాక్రుతులే –సురలును ,మునులను జనగ –నెర యోధులు నుండ గలరే నేర్పున వేమా ”ఇంతటి పరిణత భావాలను వేమన విర బూయించాడు .వాటిని తన నిశిత దృష్టి తో” డాక్టర్ ఈశ్వర తోపా” పరి శీలించి మనకు అందించారు .వేమన హృదయాన్ని మానవీయ కోణం లో అందజేసిన” తోపా ”గారు మనకు చిరస్మరణీయులు .వేమన కు అక్షరాభి షేకం చేసిన పరమ భక్తులు ”తోపా ”గారు .వేమన పద్యాలు భావాలు ఆ ముత్యాలే .అక్షర సత్యాలే .సుధా సిన్దువులే .తరగని గనులే .వన్నె, వాసి చేడని రత్న మాణిక్యాలే .అచ్చ మైన ప్రగతి శీల సజీవ కవితా చైతన్య మూర్తి వేమన కవి ,యోగి.అందుకే ఆయనను ”జన వేమన ”అన్నాను .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-12–కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.