కాశీ ఖండం –28 వారణాసి మహిమ

          కాశీ ఖండం –28

                    వారణాసి  మహిమ

అగసత్యు నికి కుమారస్వామి వారణాసి మహిమ ను వివరిస్తున్నాడు .ఇక్కడ ప్రయత్న,అప్రయత్న మరణం సంభ వీస్తే ముక్తియే . .ఈ మణి కర్ణిక లోకి గంగ చేరింది .ఇది శ్రీ విష్ణువుకు చక్ర పుష్కరిణి .పరబ్రహ్మ నివాస క్షేత్రం భగీరధుడు రాజర్షి బాగీరధిని భూమి పైకి తెచ్చి తన పితా మహు లందరికి ఉత్తమ లోకాలను కల్గించాడు .ఇక్కడ బంగారం ఉద్భ వించింది .చక్ర పుష్కరిణి మణి శ్రవణం అనే పేరు తొ పిలువా బడుతుంది .మణి కర్ణిక లో గంగ చేరిన దగ్గర్నుంచి ఇది దేవతలకు నిత్య ఆవాసం అయింది .ఇక్కడ జ్ఞానం తొ పని లేదు .గంగా స్నానం విశ్వనాధ దర్శనమే ముక్తి నిస్తుంది .యముడు మొదలైన వారు కూడా ఇక్కడి వారినేమీ చేయలేరు .అన్ని విఘ్నాలను పోగొట్టే వరుణా నది ఉంది..కాశీ కి దక్షిణం గా అసి నదికి ఉత్తరం గా వరుణా నదిని దేవతలు నిల్పి మోక్ష నిక్షేపం గా కాపాడు తున్నారు .

        ఈ క్షేత్రం లో పడమరన వినాయకుడున్నాడు .ఈయన విశ్వనాదునికి రక్షకుడు .వినాయకుని అను మతి లేని వారికి ప్రవేశం లేదు .పూర్వం దక్షిణ సముద్ర తీరాన సేతు బంధనం దగ్గర మాత్రు భక్తీ కల ధనుంజయుడు అనే వాడుండే వాడు .సన్మార్గం లో ధనం సంపాదించే వాడు .అర్ధులను సంతోష పెట్టె వాడు .వినయ సంపన్నుడు .విష్ణు పూజా దురంధరుడు గుణ సంపన్నుడు .సదాచార సంపన్నుడు .తల్లి ని విశేషం గా పూజించి సేవించే వాడు .శివ యోగి బోధ వల్ల అతనికి జ్ఞానం కలిగింది .తల్లి చని పోయింది ఆమె అస్తికలను భద్రం గా ఒక పెట్టె లోరాగి  పెట్టి పూజలు చేసి కావడిలో దాన్ని కాశీ కి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు .ఇతరు లెవ్వరు పెట్టె ను ముట్టుకో కుండా జాగ్రత్త పడ్డాడు .దారిలోఒక అరణ్యం లో  జ్వరం వచ్చి బాధ పడ్డాడు .కూలి వాడిని ఏర్పాటు చేసుకొని అతని తొ పెట్టె మోయించాడు .

               కాశీ కి చేరాడు .మోసే వాడినే  కాపలా ఉంచి కావలసినవి కొనుక్కో వటానికి బజారు వెళ్లాడు .ఆ రాగి పెట్టె లో డబ్బు ఉంటుందని వాడు ఆశ పడ్డాడు .దాన్ని ఎత్తుకు పోయాడు .ధనుంజయుడు తిరిగి వచ్చి తెలుసుకొని బాధ పడ్డాడు .గంగా స్నానం విశ్వ నాద దర్శనం లేకుండా ఆ మోత గాడి ఇంటికి వెళ్లాడు .వాడు ఆ పెట్టె ను దారిలోనే బద్దలు కొట్టి అందులో అస్తికలే ఉన్నందున అక్కడ పారేసి పారి పోయాడు ఇంటికి వెళ్లి అతని భార్యను నిజం చెప్పమని ధనుంజయుడు కోరాడు ఆమె ఇంట్లో దాగి ఉన్న భర్తకు ఈ సంగతి చెప్పింది .ధనుంజయుడు అతడిని తీసుకొని ఆ ప్రదేశానికి చేరాడు .ఆ చోటును అంత పెద్ద అరణ్యం లో కని పెట్ట లేక హతాశుడై ఇంటికి తిరిగి వెళ్లి పోయాడు .

          అందరికి చెప్పి ,వారు చెప్పిన ప్రకారం గయ కు వెళ్లి తల్లి శ్రాద్ధం  పెట్టాడు .ప్రయాగ లో త్రివేణీ సంగమ స్నానం చేశాడు .తరువాత కాశీ కి వచ్చి తల్లి అస్తికలను గంగలో కలిపితే విశ్వేశ్వరా నుగ్రహం లేక పోవటం వల్ల నెట్టి వేయ  బడ్డాయి .శ్మ అంటే శవం .శాన అంటే శయ నించేది .అంటే శవం శయనించేది కనుక కాశి కి మహా శ్మశానం అని పేరొచ్చింది .అంటే ప్రళయ కాలం లో సమస్త భూత జాలం శవం పై ఈ మహా క్షేత్రం లో శయనిస్తుంది అని అర్ధం .కనుకనే మహా శ్మశానం అయింది .ప్రళయ కాలం లో ఈశ్వరుడు ప్రతి నిత్యం కాశీ పట్నం లో త్రిశూలం పై ఉంచి రక్షిస్తూ ఉంటాడు .అందుకే కాశీ కి ప్రళయ భయం లేదు .కాశి కలి కాల వర్జిత మైనది .దీనిని కాశి ,అని ,వార ణాసి అని ,రుద్రా వాసమని ,మహాశ్మశానమని ,ఆనంద కాననం ,దేవీ పురమని అంటారు .

            సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –13-12-12-ఉయ్యూరు 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

2 Responses to కాశీ ఖండం –28 వారణాసి మహిమ

  1. anrd's avatar anrd says:

    చక్కటి విషయాలను తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి.

    Like

  2. చక్కటి విషయాలను తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.