గొల్లపూడి కధామారుతం –17
పరకీయ -3 (చివరి భాగం )
విజయ వాడ వచ్చి జనన మరణ ఆఫీసుకు వెళ్లి అయిదేళ్ళ క్రితం పుట్టిన శిశు వివ రాలు తెలుసుకొన్నాడు రచయిత ..వసంతకు ఆడ పిల్ల పుట్టి చని పోయిందని రికార్డులు చెప్పాయి .ఎంతో రిలీఫ్ పొందాడు .తన పాత అనుభవానికి యే నిదర్శనమూ లేదన్న తృప్తి అతన్ని సంతృప్తి పరచిందట .’’భోరున ఏడవ లేక పోయానే ‘’అను కొన్నాట్ట .’’ఆ ఇద్దరు కుర్రాళ్ళలో ఎవరు ?’’అన్నది వెతుక్కోవటం లో ప్రేమ తొ కూడిన ఆత్రుత కంటే ,పాత అనుభవానికి ఇంత గట్టి నిదర్శనం మిగి లిందన్న భీతి ఎక్కువ గా ఉందేమో /’’అంటాడు రచయిత చివరగా .
ఇలా పర కీయ లో పర కాయ ప్రవేశం చేసి ,ఆమె అంత రంగాన్ని ఫోటో స్టాట్ తీసి చూపిస్తాడు .తన పాపానికి ప్రాయశ్చిత్తం గా వసంత ను పెళ్లి చేసుకోవాల్సింది పోయి ,పిరికి మందును నూరి పోస్తే ,ఆవిడ మాత్రం ప్రపంచాన్ని ఏది రించే ధీమా తొ ,అతని పై విద్వేషం లేకుండా ఒక రక మైన సాను భూతి తొ ప్రవర్తించింది వసంత .పరిస్తితులను తనకను కూలం గ మార్చుకోంది .అతను మాత్రం తన పాపాలకు ఆన వాలు మాత్రం వెతుక్కోన్నాడు .అక్కడా ఆమె ముందు ఓడిపోయాడు .బహుశా పుట్టిన పాప చని పోవటానికి ఇతని un balanced and un preparedness కారణం కావచ్చు . ఆ పాపాన్ని అంతటి తొ కడిగేసుకొని ఆమె ముందడుగు వేసింది .మద్రాస్ లో మోసపోయినా ,ఇతని కి మోసానికీ బలి అయినా ,ఆమె లో జీవించాలనే భావం చెక్కు చెదర లేదు .మొండితనం ,పరిస్తితులను అనుకూలం గా మార్చుకొనే తెలివి, స్తైర్యం ఆమెకు అబ్బాయి .అందుకే బలరాం తొ హాయిగా బతుకు తోంది .పండంటి ఇద్దరు పిల్లలు కూడా .ఇతను చేసిన పాపానికి భార్యకు పిల్లలు కూడా కలగ లేదన్న సత్యమూ మనకు గోచరిస్తుంది .చేసుకొన్నా వారికి చేసుకోన్నంత .ఆమె విషయం లో నమ్మకం ఆమె ను బలి గోన్నా ,దాన్ని మొక్క వోని ధైర్యం తొ ఎదుర్కొని నిలిచింది .అదే ఆమె ప్రత్యేకత a bold fighting natural spirit , ఓటమిని ఎదుర్కొంటున్నా ,అంతిమ విజయం కోసం నిరంతరం పోరాడే పటిమ కలది వసంత .నిత్య వసంతం గా కని పిస్తుంది .
‘’ఊహల్ని సాహిత్యానికి అను వదించటం మాత్రం అలవరచు కొన్న గొంగళీ పురుగు దశ ‘’లో తాను ఈ కధ రాశాను అంటాడు మారుతీ రావు .నిజమే .ఏదైనా రూప విక్రియ చెందా లంటే గొంగళిపురుగు దశ అవసరమే .ఆ దశ లోనే దొరికిన్దల్లా తింటుంది .అంటే ‘’మేస్తుంది ‘’.నేమరేసు కొటుంది .చక్కని గూడు అల్లుకొని హాయిగా నిదరోతుంది .భవిష్యత్తుకు కావాల్సిన రంగుల రెక్కలూ ,ఎదగ వలసిన చివరి దశా అందుకోనేందుకు ముందు దశే ఇది.భవిష్యత్తు కు కావాల్సిన సమస్తం ఈ దశ లోనే నిలువ చేసుకొంటుంది .సమయం రాగానే హాయిగా గూడు చీల్చుకొని అనంతా కాశం లోకి రివ్వున యెగిరి పోతుంది .ఆ రెక్కల ఆకర్షణ లో అంతా దిగ్భ్రమ చెందుతారు .ముందు జీవితం అంటే గూడు దశ లేనిది సీతా కొక చిలుక లేదు .అలాగే గొల్ల పూడి కూడా తాను భవిష్యత్తు లో ఓ గొప్ప కధకుని గా మార్పు చెందటానికి కావలసిన దంతా నమిలి .మింగి జీర్నించు కొన్నాడు సరిగ్గా నలభై మూడేళ్ళ క్రితం .అతనిలో ఊహలూ భావాలు కధా కధన విధానం అంతా పరి పక్వమవ టానికి కావాల్సిన సమస్త హంగులు కలిగి ఉన్న దశ అది .ఆ తర్వాత ఇంకా మంచి కధలు రాసి రచయిత గా ,విమర్శకుడిగా ,సినీ రచయితగా విశాల విశ్వం లో వినూత్నం గా ఎగిరే స్తితికి చేరుకొన్నాడు .తన పూర్వ కోశస్త స్తితిని మర్చి పోని కృతజ్ఞత ఉంది అతని మాటల్లో నని పిస్తుంది .
భవిష్యత్ ప్రణాళిక లన్ని ఆ సుప్త స్తితి లో మననం చేసుకొంటూ ,ప్రణాళిక సిద్ధం చేసుకొంటూ ఊహల్ని అల్లు కుంటూ ,కాబోయే రంగుల దశను కలల్లో చూస్తూ గడిపి ఉంటాడు .ఆ నిరంతర మననం ,నిరీక్ష ,ఓపిక ,ఒక గిరి గీసుకొన్న జీవితం ,అన్ని shades of opinions ను సేకరించి ,తనది అయిన విశేష వ్యక్తిత్వం ఏర్పరచుకొన్న వైనం మారుతీ రావు ను ఈనాడు ఇంతటి మహోన్నత స్తితికి తెచ్చింది most perfect dialogue రచయితగా ,most success ful writer గా జీవిత సత్యాలను కాచి వడ పోసిన వాడిగా ,కొత్త మాటల్ని కొత్త ప్రయోగాల్ని ,కొత్త రుచుల్ని ,తన రచనలోచూపించి monotony నుంచి వేరు చేయ గలిగిన రచయిత గా ఎదిగాడు .అదీ అతని back ground.అందుకే ఈకదను గొంగళి పురుగు దశ లో రాశానని సత్యాన్ని చెప్పాడు .అదీ రచయితకు ఉండాల్సిన నిజాయితీ .నిబద్ధత కూడా ఇంకా యేర్పడ లేదన్న చింత కూడా ధ్వనిస్తుంది .ఏమైనా గొల్ల పూడి ఒక’’ వినూత్న కదా చిత్ర కారుడు‘’.భాషకు ఏదో తెలీని అందాలను కూర్చ గల సమర్ధుడు .ఊహల్ని ఉన్నత స్తాయికి తీసుకొని వెళ్ళ గలిగే నేర్పరి ఆహా ! అని పించే రచయిత .అతనిలో విస్తృత పరిశీలనా శక్తి ,నిశిత మైన చూపు నాకు కని పిస్తుంది .ఆ కధలనుఅతనే అంత బాగా చెప్పగలడుఅని పిస్తుంది .ఓ తిలక్ ,ఓ మధు రాన్తకం ,ఓ అమరేంద్ర ,ఓ బుచ్చిబాబు ,ఓ విశ్వ నాద ,ఓ మల్లాది ,ఓ గోపీ చంద్ అతనిలో తొంగి చూస్తూంటారు ..వీరిలో ఎవరూ అతను కాదు .ఎవరూ అతని లోంచి దాటి పోరు .ఓ విలక్షణ మైన ప్రత్యేకత కలిగిన నూత్న ప్రయోగ కర్త ,ప్రయోక్త గొల్ల పూడి అందుకే అతని కధలు అంత బాగా వస్తాయి అలరించి మురిపిస్తాయ్ .పదే పదే చది విస్తాయి .చెక్కిన శిల్పమే ప్రతి మాటా .ఇంతకీ పరకీయ అంటే ?ఇతరులకు చెందినది అని అర్ధం .తనదికానిది అని ధ్వని .
మరో కధ తొ మళ్ళీ కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13-12-12-ఉయ్యూరు

