జ్ఞానదుడు మహర్షి నారదుడు -19

 జ్ఞానదుడు మహర్షి నారదుడు -19

  విదేహ రాజు కు హరి అనే ముని ఇలా వివరించాడు ‘’సర్వ భూత మయుడైన సరసిజాక్షు –డాతడే ,తన యాత్మ యందుండు ననేడు వాడు –శంఖ చక్ర ధరుమ్డంచు జానెడు వాడు –భక్తీ భావాభి రతుండు  వో భాగవతుండు ‘’

‘’వర్ణాశ్రమ ధర్మంబుల –నిర్ణయ కర్మల జెడక నిఖిల జగత్సం

  పూర్ణుడు హరి యను నాతడే –వర్ణింపగ భాగవతుడు వసుధాధీశా !’’

విదేహుని సందేహం తీరింది ..కాని హరి నామ స్మరణం ,ఆ కదామృతత సేవనం కావాలని పించి మళ్ళీ అడిగాడు

‘’గజరాజ వరదు గుణములు –త్రిజత్పావనములగుట దేట డంగా

సుజన మనో రంజనముగా –విజితేన్ద్రియ వినగనాకు వేడుక పుట్టెన్ ‘’.

అప్పుడు ‘’అంత రిక్షుడు’’ అనే మౌని వర్యుడు

‘’పరమ బ్రహ్మ మనంగా –బర తత్వమనంగా బరమ దమనగను నీ

శ్వరుడన ,గ్రుష్ణు దన జగ –ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్ ‘’

అవ్యక్త నిర్గుణ పర బ్రహ్మం లో తనకు విపర్యయం గా జన్మించిన జ్ఞానమే ‘’మాయ’’.ఆ మాయ చేతనే ఆయన ఈ జగత్తును నిర్మిస్తాడు .ఆయన మాత్రం నిశ్చిమ్తుడే .మాయ కూడా ఆత్మ లో లీన మవుతుంది .పంచ భూతాదిక జీవులను సృష్టించేది ఆ మాయయే .లయిన్చేదీ  అదే ‘’అన్నాడు మహర్షి .మరి ఆ మాయను దాటే ఉపాయం చెప్పమన్నాడు రాజు

‘’ప్రబుధుడు ‘’అనే మహర్షి ‘’శరీరమే నిత్యం అనుకోని జీవులు దుఖం లో మునిగి పోతారు .తాని తాము తెలుసుకోరు.విరక్తి మార్గం అవలంబించరు .సద్గురువును పొంది భూతదయ ,హరికదామృత పానం ,బ్రహ్మ చర్య ,సాదు సంగమమం ,సజ్జన మైత్రి ,వినయ ,శుచిత్వ ,క్షమా ,మౌనం ,వేదార్ధ వివేచనం ,అహింస ,ద్వంద్వ విసర్జనం చేసి ఈశ్వరుని సర్వ గతుని గా భావించాలీ .గ్రుహారామ క్షేత్ర కళత్ర పుత్రా విత్తాదులను శ్రీ హరికి అర్పణ చేయాలి .పరమాత్మను తప్ప దేనినీ చూడ రాదు .’’అని వివరించాడు .

‘’హరిదాసుల మిత్రత్వము –మురరిపు కద లేన్నికోనుచు మోదము తోడన్

భారితాశ్రు పులకితుండై –పురుషుడు హరి మాయ గెల్చు భూప వరేన్యా ‘’

ఇందరు ఇన్ని రకాలుఆ చెప్పినా రాజు గారి కి మనశ్శాంతి లభించలేదు .’’పరమాత్మ ప్రభావం ‘’గురించి చెప్పమని అడిగాడు .అప్పుడు ‘’పిప్పలాయనుడు ‘’అనే మహర్షి ఇలా చెప్పాడు

‘’పరమాత్మకు వృద్ధి క్షయాలు ఉండవు .హరి భక్తీ చేత సుజ్ఞాని భాగవత్సదనం చేరుకొంటాడు .’’అని చెప్పాడు

‘’ఏ కర్మలు చేస్తే హరిని చేర గలమో ‘’వివరించమని మళ్ళీ రాజుగారి అభ్యర్ధనం .’’విర్హోత్రుడు’’ అనే ముని ‘’కర్మలన్నీ బంధనాలే .మోక్షానికి నారాయణ భజనమే పరమ పావనమైనది .ఫలితం ఆశించకుండా హరినిస్మరించాలి .షోడశోప చారాలతో ,ధూప దీప నైవేద్యాలతో సాష్టాంగ నమస్కారం చేస్తుంటే హరిని చేరగలరు ‘’అన్నాడు

‘’అసలు ఈశ్వరుడు ఏయే కర్మల్ని చేశాడు ?’’వాటి వివరం చెప్పమని రాజు ప్రశ్నించాడు

‘’ద్రమీలుడు ‘’అనే ముని పుంగవుడు –‘

‘’తారల నెన్నగ వచ్చును –భూరేణువుల లెక్క వెట్టబోలును ,ధాత్రిన్

 నారాయణ గుణ కదనము –లారయ వర్ణింప లేరు పరబ్రహ్మాదుల్ ‘’అని తేల్చి చెప్పి ధర్ముడు అనే వాడు దక్షుని పుత్రిక ను పెళ్ళాడి బదరికా వనం లో నారాయణ ఋషిని కన్నాడు .ఆయన తపస్సు చేస్తూ ఉండగా మన్మధుడిని పంపాడు బలభేది .చలించలేదీయన .వారందరూ స్తుతిస్తే మూడు కోట్ల మంది స్త్రీలను తన శరీరం నుండి పుట్టించాడు .ఊరువుల నుండి ఊర్వశి జన్మించి దేవలోకం చేరింది .ఈ కద విన్న వారంతా ముక్తులే .ఆ తర్వాతమత్స ,కూర్మ వరాహ ,నారసింహ ,వామన ,రామ రఘురామ కృష్ణ బుద్ధ కల్క్యాది అవతారాలు ధరించాడు అని ఆ కధలన్నీ సవివరం గా తెలియ జేశాడు .

      రాజు ‘’హరిపూజ చేయక పోతే ఏమవుతుంది ?’’అని ప్రశ్నించాడు .’’చమసుడు ‘’అనే మహర్షి ‘’హరి నుతింపక స్త్రీలోలుడైన వాడు నరకం చేరుతాడు .ముక్తి మార్గం అప్రత్యక్షం అని భావించేవాడు దుర్గతి చెందుతాడు .’’అన్నాడు .రాజు‘’ఏ యుగంబున నే రీతి వర్తించు –నెట్టి రూపాదు నేవ్విధమున—మును నుతింప బడెను –ముని దేవ గణంబుచే విష్ణు డవ్యయుండు విశ్వ విభుడు ‘’అని ప్రశ్నించాడు .దీనికి ‘’కరభాజన ముని ‘’‘’చాలా అవతారాలలో జన్మించి రాక్షస సంహారం చేశాడు హరి కృత యుగం లో శుక్ల వర్ణుడై ,చతుర్బాహుడై జటా వల్కల క్రిష్ణాజినోత్తరీయ జప మాలికా దండ కమండల దరుడై నిర్మల ధ్యాన గరిస్టులైన పురుష శ్రేష్టం చేత హంసుడు ,సుపర్ణుడు ,వైకుమ్తుడు ,ధర్ముడు ,అమలుడు ,యోగీశ్వరుడు ,ఈశ్వరుడు ,పురుషుడు ,అవ్యక్తుడు పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రసిద్ధి చెందాడు .

       త్రేతా యుగం లోపృశ్ని గర్భ ,సర్వతో దేవ ,ఉరుక్రమ ,వృషాకపి ,జయంత పేర్లతో స్తుతింప బడ్డాడు . రక్త వర్ణం తో నాలుగు చేతులతో హిరణ్య కేశుడు ,వేద త్రయ స్వరూపుడు సృక్ ,సృవాది ఉప లక్షణ శోభితుడు అయి విష్ణు ,యజ్న , లోపృశ్ని గర్భ ,సర్వతో దేవా ,ఉరుక్రమ ,వృషాకపి ,జయంత పేర్లతో స్తుతింప బడ్డాడు.

           ద్వాపరయుగం లో రెండు చేతులతో శ్రీ వత్స కౌస్తుభ వనమాలికా విరాజ మానుడై జనార్దన ,వాసుదేవ ,సంకర్షణ ,ప్రద్యుమ్న ,అనిరుద్ధ ,నారాయణ ,విశ్వ రూప ,సర్వ భూతాత్మక నామాలతో పిలువా బడ్డాడు .

    కలియుగం లో కృష్ణ వర్ణం తో కృష్ణ నామం తో భక్త సంరక్షణార్ధం యజ్న సంకీర్తనల చేత ప్రస్తుతింప బాడుతాడు .హరి రామ ,నారాయణ ,నృసింహ ,కంసారి శాలినోదర ‘’పేర్లతో మునుల చే స్తుతింప బాదుతాడు అంతే కాదు –

‘’ద్రావిడ దేశంబు నందుల దామ్ర పర్ని–సహ్యజక్రుత మాలాది సకల నదుల

కేవ్వడేనిని ,భక్తీ తో నేగి యచట –బొదిలి తర్పణ మొగి జేయ ,పుణ్య మొదవు ‘’అని’’ రుభ కుమారులైన ‘’మునులు‘’విష్ణు ధ్యాన కదా సుదారసాను భావం ‘’అంతటిని విదేహ మహా రాజు కు విశదీకరించారు అని నారద మహర్షి వసుదేవునికి వివరం గా చెప్పాడు .

‘’కమలాక్షు పద భక్తి కధనముల్ ,వాసుదేవ విని యఘంబుల బాసి వెలసితీవు

 భువన ప్రసిద్దిగా బొలుపొందు సత్కీర్తి కైవల్య లక్ష్మి యు గలుగు మీద

నారాయనుమ్డు నీ నందనుమ్డను మోహ మెదలించి ,విష్ణు గా నెరిగి కొలువు

మతడు ,నీ తనయుడై యవతరించుట జేసి సిధించే దేహ సంశుద్ధి నీకు

సరస సల్లాప సౌహార్ద సౌస్తావమున –బావనంబైతి ,శిశుపాల ,పౌండ్ర ,నరక

ముర ,జరా సంద ,యవనులు ముదము తోడ –వాసుదేవుని జేరిరి వైరిలయ్యు ‘’

‘’దుస్ట జన నిగ్రహంబును –శిస్ట ప్రతి పాదనంబు సేయన ,హరి దా

సృష్టి నవతారమొందేను –స్రష్ట ముఖానిక దివిజ సంఘము వొగడన్ ‘’

లోక రక్షా ణార్ధమే శ్రీ కృష్ణుడు అవతరించాడు ‘’అని నారద మహర్షి చెప్పగానే ,విస్మిత చిత్తుడై దేవకీ వసుదేవులు శ్రీ కృష్ణుని పరమాత్మ గా భావించారు .ఇదే దేవారహస్యం ఈ రహస్యాన్ని ఆ దేవ దేవునే గర్భాన మోసి కన్న తలిదంద్రులైన దేవకీ వసుదేవులకు ఎరుక కల్గించి వ్యామోహ దూరుల్ని చేసిన వాడు మహర్షి నారదుడు .

               సశేషం

    మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ –24-3-13- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.