డిం .టిం.ప్ర.జ.-3
డింగిరి –గురూ !ఆయనెవరో ద్వారక పీఠాదిపతి షిర్డీ సాయిబాబా పై విరుచుకు పడ్డాడు ?
టింగిరి –నిజమే .ఆయనే స్వరూపానంద స్వామి .సాయిబాబా దేవుడుకాదు ,అవతారమూకాడు గుళ్ళూ, గోపురాలు కట్ట వద్దు ,పూజించ వద్దు అన్నాడు .
డిం –కారణం ఏమిటి స్వామీ?
టిం –ఏమీలేదు నాయనా !ప్రజలు పట్టించుకోకపోతే తాను ఉన్నానని తెలియ జెప్పటానికే ఈ ఆక్రోశం .మీడియా లో కనిపిస్తే మళ్ళీ ‘’డిగ్గీ రాజా’’ లాంటివారు వచ్చి పాదాలను ఆశ్రయిస్తారనే ఆరాటం .గ్లామర్ తగ్గినప్పుడల్లా ఆయనకు ఇదొక వినోదం .గిల్లి జోకొట్టటం .
డిం –ఆయన మాటల్లో నిజం లేదాగురూ!
టిం –అది నమ్మకం మీద ఆధార పడిదఉంటుంది .అసలు సాయిబాబా ఒక కారణ జన్ముడు అని నమ్మే వారి సంఖ్య బహుళం గా ఉంటె సముద్రం లో కాకి రెట్టలా ఈ వ్యాఖ్యానాలు వ్యర్ధం .ఆకాశం మీద ఉమ్మేస్తే వచ్చి మీద పడేది మన మొహం మీదే కదా శిష్యా !.ప్రతి వాడిలోను దైవాంశ ఉందని మన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు సిద్ధ యోగి పుంగవులు ఘోషిస్తుంటే దానినేమాత్రం అర్ధం చేసుకో కుండా ఈ ప్రేలాపన అహంకారాన్ని ,అజ్ఞానాన్ని తెలియ జేస్తుంది .ఇదొక ప్రచార ఆర్భాటమే .
డిం –‘’నగరం’’ లో అ గాస్ భీభత్సం ఏమిటి గురూ?
టిం –అనుకోకుండా వచ్చేవి ఉపద్రవాలు .ఇది మానవ తప్పిదం .గాస్ ను యెంత జాగ్రత్త గా ఉపయోగించుకోవాలో తెలియ జేసే ఉదంతం ఇది .హెచ్చరికలు చేసినా పై అధికారులు చలించక పోవటం బాధ్యతా రాహిత్యమే .ఆఘ మేఘాల మీద ముఖ్య మంత్రి బాబు వచ్చి పరామర్శించి ఓదార్చి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసి ,కేంద్రాన్ని ఒప్పించి పాతిక లక్షల నష్ట పరిహారం ఇప్పించే ఏర్పాటు చేశాడు ఇలాంటి సందర్భాలలో చంద్ర బాబు యెంత వేగం గా స్పందిస్తాడో తెలియ జేస్తుంది .అందుకే అంతనమ్మకం ఆయన పైన .
డిం –సరిపోతుందా ?
టిం –ప్రాణాలను తిరిగి తెచ్చి ఇవ్వలేరు కాని బాధిత కుటుంబానికి .పరిహారం ఉద్యోగం చదువు కూడా ఏర్పాటు చేయటం కొంతలో కొంత నయం .
డిం –ఇవాళ జగన్ వచ్చి చూసి వెళ్ళాడు ?
టిం –మానవత్వమున్న ఏ వ్యక్తీ అయినా ఇలా స్పందించాల్సిందే .కాని వచ్చి చూసి వెళ్ళాడు .కోటి ఇమ్మని నీతి చెప్పాడు .కాని తన పాపం సోమ్ములోంచి కొంత ఇచ్చి ఒదార్చితే బాగుండేది .పని లేనప్పుడు ఓదారుస్తా ఓదారుస్తా అని వెళ్లి జనాన్ని కావ లించుకొని ముద్దేట్టుకొని హడావిడి చేసిన వాడు ఇలా ఉత్త చేతులతో వెడితే బాగా లేదని పించదా ఎవరి కైనా ?
డిం –బ్లాక్ మనీ మార్చుకోటానికే కిరణ్ బి జెపి చెప్పులు తోడుక్కుం టుక్కుం టున్నాడని డొక్కా అంటున్నాడు ?
టిం –నిజమే .ఎవరికి ఏ జత నచ్చితే ఆ చెప్పులేసుకొంటారు .ఇది సహజం .ఎన్నికల ముందు డొక్కా ఎన్ని ఊపులూపాడు దేనిలో చేరాలో తెలీక ?ఎక్కడా ఇమడలేక అక్కడే చతికిల పడ్డాడుకాని .కాంగ్రెస్ వాళ్లకు బ్లాక్ మనీ లేదని డొక్కా అభిప్రాయమా ?త్వరలోనే స్విస్ లో దాచిన నల్ల కుబేరుల డబ్బు చిట్టా విప్పుతోంది కేంద్రం .అప్పటిదాకా ఆగి ఆ ఆ మాట అని ఉంటె బాగుండేది
డిం –పి వి జయంతి ని ఘనం గా నిర్వహించాడు కేసి ఆర్ ?
టిం –చాలా మంచిపనే చేశాడు .అలాగే హైదరాబాద్ లో ఒక ఘనమైన స్మ్రుతి చిహ్నం ,ధిల్లీ లో ఒక ఘాట్ ఏర్పాటు చేయిస్తే ఇంకా ఘనం గా ఉంటుంది .కొత్త జిల్లాకు ఆయన పేరు పెడతాననటం ఒక చిన్న అడుగే కాని ఆయన గౌరవానికి తగినదికాదు .భారత రత్న ఇప్పించాలి కేసి ఆర్ .అప్పుడే ఆయనకు జరిగిన అవమానానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకొన్నట్లు అవుతుంది. దీనికి ఆంద్ర ప్రభుత్వమూ మద్దతు పలకాలి .ఇచ్చినా ఇవ్వక పోయినా ఆయనకు వోరి గేదేమీ లేదు .మనకే ఆ గర్వం శోభ నిస్తుంది అంతే .
డిం –అబ్బో గురూగారికి పెద్దాయన మీద ఇంత ఇది ఉందా ?
టిం –బడుద్దాయిలం కనుక మనం ఇంతకాలం ఊరు కున్నాం .ఇంకో రాష్ట్రం వాళ్ళయితే ఆయనకు అవమానం చేసిన వారి భరతం పట్టి ఆయనకు గౌరవం చేకూర్చే వారు .
డిం –కంచే దూకే వాళ్లకు త్వరలో తానూ సి ఏం అవుతానని జగన్ ఊర దించాడట ?
టిం –ఎంతకాలం కాపు కాస్తాడు ?ఒట్టిపోయిన గొడ్డును పిండితే ఏమొస్తుంది తన్నులు తప్ప ?అందుకే తమ్ముళ్ళు తెలుగు అన్న దగ్గరే సేఫ్టి అని గోడదూకటానికి రెడీ అయితే ఇలా ఓదారుస్తు మభ్య పెడుత్రున్నాదేమో ?
డిం –గురూ !చాలా ఆవేశం లో ఉన్నావ్. వస్తా
టిం –సరే శిష్యా
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-6-14 –ఉయ్యూరు
