పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -4

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -4

చిత్రకారుడైన వీర్రాజు గారి మదిలో ఆ కళ’’రేఖలతో రేరంగులతో రేకులు తొడిగి రంగులతో పువ్వై మరిమళించింది’’  రాజమండ్రి పరిసరాలు స్పూర్తినిచ్చాయి ఎన్నో సార్లు ఈ అందాల్ని తన చిత్రాల్లో ఓంపుకున్నారు .రేఖల్లోఒదగదీసుకొన్నారు .అక్షరాల్లో విస్తరించారు .అందుకే తన రచనల్లో ప్రకృతి పరుచుకొని ఉంటుంది .ఇంటర్ పరీక్ష లెక్కల్లో పోయింది .ఇంట్లో వాళ్ళు ఏమీ అనక పోయినా మనసులో బాధ కెలక వేసింది .అడ్డమైన ప్రతివాడి  దగ్గరా ,అభిమానం చంపుకొని తలొంచుకొని అడ్డ దిడ్డ ప్రశ్నలకు జవాబులిస్తూ గడిపి ఉద్యోగం రాక స్వశక్తితో బి ఏ చదవాలని చేరారు .పరీక్ష ఒక సారి తప్పితే స్కాలర్షిప్ రాదనీ తెలుసుకొని ఒళ్ళు దగ్గరేట్టుకొని శ్రద్ధగా చదివారు .తండ్రి తల తాకట్టు పెట్టి తోలి తరం ఫీజు కట్టారు .మళ్ళీ ఎప్పుడూ వారి సాయం కోసం అర్రులు చాచలేదు .

అప్పుడప్పుడు వేసిన చిత్రాలకు ,బరికిన కధలకు డబ్బులోస్తే వాటితోనే గడిపారు ‘’’డబ్బున్న మిత్రుడు బసవ రాజు ‘’కు చిత్రాన్ని అమ్మి ఆయనిచ్చిన ‘’పచ్చనోటు ‘’తో కాలేజి ,వెల్ఫేర్ ఫండ్ నుంచి ఒక టరం ఫీజు డబ్బులు ముట్టాక ఇబ్బంది లేకుండా పోయింది తనపై తనకు నమ్మకం వచ్చింది .’’సంతోషం గుండెల్లోంచి ముఖం లోకి తన్ను కొచ్చింది ‘’ట.’’చరిత్ర గత కాలానికి ఆల్బం అయితే రాజకీయం వర్తమానానికి అద్దం’’అన్నారు .తన్ను అంటి పెట్టుకొని కనిపెట్టుకొన్న స్నేహితునికి ‘’కదక్ మిత్ర ‘’అని పేరుపెట్టి కాలేజీ రోజులు అతనితోనే గడిపారు .కాలేజీ లో సీనియర్ ‘’కనక ప్రవాసి ‘’అంటే శ్రీపాద వారి సాహిత్యాన్ని కూలం కషం గా అధ్యయనం చేసి ఎన్నో విషయాలు రాసినవాడు .తరుణ సాహితీ సభ ఏర్పాటు చేసి శీలా వారికి ఆహ్వానం పంపాడు .అదే ఆయనకోచ్చిన మొదటిదీ ,ఆఖరిదీ .’’జీవితం లోను ,సాహిత్యం లోను  నాకన్నా ముందుపుట్టిన రంది సోమరాజు ‘’తెలుగు స్వతంత్రలో దూసుకు పోతున్నాడు .’’సహ రచయితగా గుర్తించి ,-సాదరం గా ఆహ్వానించి –స్నేహహస్తం తో నావేళ్ళనే పెనవేసుకొన్నాడు ‘’అని కృతజ్ఞత తెల్పి ఆప్తుడైనారు .ఇంతకీరంది సోమరాజు ఎవరు –అని ప్రశ్నించుకొని సమాధానం మనకోసం చెప్పారు వీర్రాజుగారు ‘’రాజమండ్రిని రాజ మహేంద్ర వరం అని పిలవాలనే ఉద్యమాలతో –పాతకాలపు సాహిత్య వాతావరణం జీవనది గోదారిలా –సజావుగా సాగిపోతుంటే –ఆధునిక సాహిత్యం ఇంకా –కుంటి నడకలు నడుస్తుంటే –తొలిరోజుల్లో బొగ్గుల కుంపటి లా భగ్గున మండి –ఆ తర్వాత నివురు గప్పిన కదా సాహిత్యం –శ్రీపాద నుంచి అందుకొనే కొత్త తరం కోసం –దిక్కులు చూస్తున్నప్పుడు –కధను పట్టుకున్న మలితరం కధకుల్లో –రంది సోమరాజు ముఖ్యుడు ‘’అని ఆయన కదా నేపధ్యాన్ని వివరించారు .సోమరాజు అంటే అభిమానమే కాదు గౌరవంతో కూడిన ‘’రంధి’’కూడా ఏర్పడింది .ఒక బ్రాహ్మణుడు చనిపోయిన తమ్ముడి కోసం వీర్రాజు గారి పుస్తకం అచ్చేసి అంకితం ఇద్దామని అనుకోని ఇంటికి పిలిపిస్తే వెళ్లి సమర్పిస్తే భోం చేయమని అడిగితె సరేనని ‘’వీధి అరుగు మీద  విస్తరేసి వడ్డించి తినమంటే –నేను చేసిన పొరపాటు తెలిసేదికాదు ‘’అహం ఆత్మ గౌరవాలు దెబ్బతిని కొన్ని మార్పులు చేసి ఇస్తానని బొంకి   స్క్రిప్ట్ తీసుకొని ‘’మళ్ళీ తిరిగి వెడితే ఒట్టు ‘’.ఇలాంటివి మరో రెండు సార్లూ ఎదుర్కోవాల్సి వచ్చింది యెంత జాగ్రత్తగా ఉన్నా .’’మోటు దేరిన హృదయానికి –సున్నితత్వం ఇంకా  మిగిలి ఉంటుందా ?’’అని ప్రశ్నించారు .

బుచ్చి బాబు రాసిన ‘’అరకు లోయలో కూలిన శిఖరం ‘’కద చదివి ‘’అడవి గుండెల్లో దూరి-గుండె గుబుర్లోకి చూసి –గుబురు పొదల్లోకి నడిచి –దారుల్లేని అడవి నేలను –పాదాలతో తట్టి –చూపులతో చుట్టి –అడవి అందాన్ని మోపులకెత్తు కొని రావాలి ‘’అని ఆరాట పడ్డారు .దీన్ని గ్రహించిన మిత్రుడు తన ఊరికి ఆహ్వానిస్తే వెళ్లి ఆ సోయగాలను స్వయం గా అనుభవించి గుండెలో పదిలం గా భద్రపరచుకొన్నారు .బుచ్చిబాబు రచనా ప్రభావం అంతటిది .ఈ అనుభవం తో ‘’అస్తిపంజరం ‘’కద రూపు దిద్దుకోన్నది .తర్వాత సీరియస్ గా ‘’సమాధి ‘’ ,ముగ్గురు వ్యక్తుల విచిత్ర ప్రవర్తనకు అద్దం పట్టే ‘’విచిత్ర త్రయం ‘’కధలు రాశారు .మిత్రుడు ప్రకాశ రావు ‘’సమాధి ‘’ని లేపి సాహిత్యం లో నిలబెట్టాడు .అది అరడజను కధలకు జన్మనిచ్చింది .పత్రికలో మెచ్చుకోళ్ళు లభించాయి. ప్రతిఏడాది సాహిత్య సమీక్ష చేసి కొత్త వరవడి సృష్టించిన శ్రీ వాత్సవ ఘనం గా శ్లాఘించాడు .’’అనుకోని ప్రోత్సాహం –అన్ని కోణాల్లోనూ వర్షించింది ‘’

మాదేటి రాజాజీ అనే కొత్త మిత్రుడు పరిచయం అయాడు .ఇంతకీ రాజాజీ ఎవరు?’’వరదా వెంకటా రత్నం గారి శిష్య రికం తో –చెయ్యి తిరిగి –బొంబాయి జే జే స్కూల్ ఆఫ్ఆర్ట్స్ లో శిక్షణ పొంది –వచ్చిన ఉద్యోగాన్ని బేఖాతర్ చేసి –ఆర్టిస్ట్ డిప్లమా తో స్వస్థలం రాజ మండ్రి కి తిరిగొచ్చిన హీరో ‘’ ‘’డబ్బు సంపాదనకు దూరం గా నిలిచి –కళని అమ్మకానికి పెట్టక –కీర్తి ప్రతిష్టలకు దగ్గరి దారిపట్టక –నిరంతర విద్యార్ధిగా ఉన్నవాడు –చిత్ర కళ కే అంకితమైన అరుదైన వ్యక్తీ ‘’అని ఆరాధనా భావం ప్రకటించారు .ఆప్తుల్లో ఆప్తుడైనాడు’’ వీరాజీకి రాజాజీ ‘’.కాలేజీ లో సీనియర్ బసవ రాజు ‘సాహి త్యాభి రుచిన సెంటులా పూసుకొని –కళాభి రుచిని పౌడర్లా పూసుకొని –ఖరీదైన పెంటాక్స్ కెమెరా తో కాలేజీ కాంపౌండ్ ‘’లో తిరిగేవాడు ‘’ఘాటైన స్నేహ పరిమళాలు వెదజల్లేవాడు ‘’ఇదంతా పైకే ,కనిపించినప్పుడే అని అర్ధమైపోయింది వీరాజీకి .’’కనిపించినప్పుడు ఆప్యాయం గ అభిమానం తో ముంచేసి ఉక్కిరి బిక్కిరి చేసి –ఆ తర్వాత పూర్తిగా మరిచిపోయే వ్యక్తీ ‘’’’అది స్నేహం గా పరిగణించడం ఎలా ని బాధ పడ్డారు .కాలేజీ అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలలో నటుడు గా కూడా వీర్రాజు పాల్గొన్నారు .’’జీవితం లో కాస్తయినా నటించటం చేత నైతే –రంగ స్థలం మీద కొంతైనా రాణించే వాడిని ‘’అని నిజం ఒప్పుకొన్నారు .ఆఫీసర్ పాత్ర పోషించి డైలాగు చెప్పటం రాక అప్ప చెప్పేసి రసాభాస కాకుండా కాపాడుకోన్నానని  చెప్పారు .’’గతస్మృతులు ‘’చిత్రానికి ప్రధమ బహుమతిపొందారు. ప్రిన్సిపాల్ స్వయంగా పిలిచికాఫీ ఇచ్చి అభినందించారు .’’సమాధి ‘’కదాభిమాని గా వినుకొండ నాగ రాజు పరిచయమైనారు .అతని వలన ‘’బంగోరె ‘’పరిచయం కలిగింది .’’కాలేజి మేగజైన్ కోసం కవిత రాయక తప్ప లేదు’’.స్వతంత్ర పత్రిక పుణ్యమా అని ఆధునిక కవిత్వం పై అవగాహన కలిగింది .’’అసమర్ధుని ఆత్మకధ ‘’గేయం రాశారు .’’గతాన్నంతా తవ్వి గుట్టగా వేసి కొండలాంటి ఆ మేటను చూసి –నాగుండె గడియారం ముళ్ళు –వంద మైళ్ళ వేగం తో పరుగెత్తుతుంటే ‘’రాశానని అవే పంక్తుల్ని రాసి చెప్పారు .ఫినిషింగ్ టచ్ గా ‘’ ఈ విశాల పృధివిలో –నే కోరినదేమీ లేదు –నన్నూ నాఆశల్నీ కప్పెట్టే –ఆరడుగుల నేల తప్ప’’ అని ముగించారు దాన్ని .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ –  7-2-15- ఉయ్యూరు

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.