నాద యోగం -2
పశ్య౦తి నాదం
నాదం లో రెండవ దశ –తక్కువ ఫ్రీక్వెన్సీ ,పరా నాదం కంటే మరింత మోటు తనం ఉన్న నాదాన్ని పశ్యంతి అంటారు . మధ్యమ౦ కంటే మరింత సూక్ష్మ౦గా ఉండి, చూడగాలిగినదై విన వీలు లేనిదానినే పశ్యన్తి నాదం అంటారు .పశ్యంతి అంటే సంస్కృతం లో చూడగలిగినది లేక ఊహించ గలిగినది అని అర్ధం .పురాతన గ్రంధాలలో శబ్దం అనుభవైక వేద్యం అంటే తెలియ దగినది అని ఉన్నది .శబ్దాన్ని ఎలా చూడగలం ?మనం ఎప్పుడైనా కలలో శబ్దం విన్నామా ?.ఈ ప్రత్యేక పరిమాణం కల శబ్దాన్నే, కలలో వినబడే శబ్దాన్నే పశ్యంతి అన్నారు .నిజంగా ఇది మానసిక శబ్దం .ఇది చేతన ,పాక్షిక అచేతన స్థితులలో వినిపించనిది .అది ఉప చేతన(సబ్ కాన్షస్ ) శబ్దం .అది మన మానసిక నాణ్యత కు చెందినదే కాని పంచేంద్రియ నాణ్యత లకు అంటే నాలుక ,గొంతు ,నోరు ల నాణ్యతలకు అందనిది .
మనం రామ రామ అంటూ ఉంటె అది వైఖరి నాదం .మనం మన కళ్ళు ,నోరు లను మూసుకొని ఆనామాన్ని మానసికంగా ఉచ్చరిస్తే అది మానసికంగా రంగు ,రూపాలను అంతరిక లోచనం తో దర్శించటమే పశ్యంతి నాదం .బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా వినగలిగిన శబ్దమే పశ్య౦తి .బయటి శబ్దాలన్నీ అంతరించి పోయి , ,పూర్వానుభవ శబ్దాలకంటే వినబడే భిన్నమైన ఒక కొత్త వింత నాదమే పశ్యంతి .
మధ్యమ నాదం
పరా ,పశ్యంతిల కంటే తక్కువ ఫ్రీక్వెన్సీలు కలిగి ,వైఖరి శబ్దం కంటే మరింత సూక్ష్మమైనది మధ్యమ నాదం .వైఖరి శబ్దం మిక్కిలి సూక్ష్మ అభివ్యక్త ధ్వని . ,కానీ మద్యం వైఖరికంటే మరింత సూక్ష్మమైన నాదం .గుసగుసశాబ్దంగా వినిపించేది మధ్యమ శబ్దం .అది వినికిడి ప్రభావం చూపలేదు .మధ్యమ శబ్దం లో అతి తక్కువ కంపనాలు కలిగి గుస గుస శబ్దమే వినిపిస్తుంది .రెండు వస్తువుల ఘర్షణ వలన శబ్దోత్పత్తి జరుగుతుంది .కాని మద్యం లో ఏ రెండు వస్తువుల తీవ్ర రాపిడి వలనకూడా వినబడేటంత శబ్దం జనించదు. ఠక్ ఠక్ఆనేట్లు శబ్దం పుట్టించితే దాన్ని స్థూల శబ్దం అంటారు .మధ్యమ అంటే మధ్యగా ఉన్నశబ్దం . .రెండిటికి మధ్య గా ఉన్నదే లేక మధ్యలో ఉన్నదే మధ్యమ౦ .మధ్యమ శబ్దమే గుసగుసలుగా వినిపిస్తుంది .
వైఖరి నాదం
నాలుగవ నాద దశనే వైఖరి అంటారు .వైఖరి శబ్దం వినిపిస్తుంది ,ఉత్పత్తి అవుతుంది కూడా .మనం మాట్లాడే భాష అంతా వైఖరి యే..రెండు వస్తువుల ఘర్షణ వలన వైఖరి శబ్దోత్పత్తి జరుగుతుంది .వీటి ఫ్రీక్వెన్సీలు ఒక నిర్దుష్ట పరిమితిలో ఉంటాయి .
మొత్తం మీద మనకు తెలిసింది ఏమిటి అంటే –పరా అంటే ఆత్మ నాదం .మధ్యమ అంటే స్వర అవయవాలసూక్ష్మమైన నాణ్యత .వైఖరి కూడాభౌతిక అవయవాల వలన ఏర్పడిన సూక్ష్మ శబ్దమే .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-24-3-16-ఉయ్యూరు

