గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3- 48-లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యాపీఠ సంస్థాపకుడు –మండన మిశ్ర (1929 -2001)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3-

48-లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యాపీఠ సంస్థాపకుడు –మండన మిశ్ర (1929 -2001)  

మండన మిశ్ర అంటే ఆది శంకరాచార్యుల శిష్యుడు కాదు ఆధునిక భారతం లో  సంస్కృతానికి విశేష వ్యాప్తి తచ్చిన రాజస్థాన్ సంస్కృత మహా విద్వాంసుడు .7-6-1929 న రాజస్థాన్ లో జయపూర్ కు 50కి .మీ దూరం లో ఉన్న అనూతియా అనే చిన్న గ్రామం లో జన్మింఛి ,తన సంస్కృత భాషా సేవా వ్యాప్తితో దాన్ని ప్రపంచ ప్రసిద్ధం చేసిన మహనీయుడు.తండ్రి హిందూ పండితుడు .తల్లి సామాన్య గృహిణి . ఏడుగురు సంతానం లో మిశ్రాపెద్దవాడు .శ్రీమతి భారతి మిశ్ర ను వివాహమాడి,ఒక కుమార్తె ముగ్గురు కుమారులకు తండ్రి అయ్యాడు కుమార్తె ఈ  మధ్యనే చనిపోయింది .పెద్దకుమారుడు భాస్కర మిశ్ర  లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విశ్వ విద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ .

  ప్రాధమిక విద్య స్వగ్రామం లో చదివి ,ఉన్నత విద్య పట్టాభి రామశాస్త్రి  అనే గొప్ప విద్వాంసుని వద్ద అమర్సార్ లోనేర్చాడు .ఈ గురు శిష్య సంబంధం ఆదర్శమై ప్రాపంచ వ్యాప్తి ప్రసిద్ధి చెందింది .సంస్కృత భాషా వ్యాప్తికి అంకిత భావం తో   విశేష సేవ,కృషి  చేసిన ఏకైక వైస్ చాన్సలర్ గా దాదాపు అందరు భారత ప్రధానమంత్రులు ,రాష్ట్రపతులు మిశ్రాను గుర్తించి  అభినందించి ,అమిత గౌరవం చూపారు .మండన మిశ్ర నేతృత్వం లో ఒక బృందం అమెరికాకు వెళ్లి అక్కడ సంస్కృత విద్యావ్యాప్తికి బీజారోపణచేసి ,ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది .

  జైపూర్ లోని మహా రాజా సంస్కృత  కాలేజి లో లెక్చరర్ గా జీవితం ప్రారంభించిన మిశ్రా ,సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .పండిత మదనమోహనా మాలవ్యా స్థాపించిన సంస్కృత అసోసియేషన్ కు అనుబంధంగా ఏర్పడిన ‘’అఖిలభారత సంస్కృత సాహిత్య సంస్థ ‘’కు డా మండన మిశ్ర 1956 లో మంత్రిగా ,1959 లో మినిస్టర్ –ఇన్ చీఫ్ గా ఎన్నుకోబడ్డాడు .అప్పుడే అఖిలభారతీయ సంస్కృత సాహిత్య సంస్థకు సరైన దీటైన నాయకుడు అవసరమయ్యాడు .తన శక్తి యుక్తులు ధారపోసి ,సంస్థ శాఖలను అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేసి వ్యాప్తి చేశాడు .శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి మండన మిశ్ర లోని అకు౦ఠిత దీక్షను గుర్తించి  ,రాజస్థాన్ ప్రభుత్వం నుంచి ఆయన సేవలను తీసుకొని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యా పీఠం కు శాశ్వత డైరెక్టర్ ను చేశాడు .

  మిశ్రా ఆలోచనలతో ‘’ప్రపంచ సంస్కృతశతాబ్ది ఉత్సవాలు ‘’రూపు దిద్దుకొని ,భారతదేశం లో సంస్కృతానికి ఒక కొత్త యుగాన్ని సాధించాడు .ఇది ఫలవంతమై ,మిశ్రా చొరవ కృషి వలన 1961 లో కలకత్తా లోచారిత్రాత్మకంగా ‘’అఖిల భారతీయ సంస్కృత సాహిత్య సంస్థ ‘’ఏర్పడి భారత ప్రధమ రాష్ట్రపతి డా .రాజేంద్ర ప్రసాద్ అమృత హస్తాలమీదుగాప్రారంభోత్సవం జరుప బడింది .ఈ సభ దిగ్విజయంగా జరిగి ఢిల్లీ లో ‘’సంస్కృత విద్యా పీఠం ‘’ఏర్పాటు కు మరొక చారిత్రాత్మ తీర్మానం చేయబడింది.డా రాజేంద్ర ప్రసాద్ గారి పూనిక, సలహా ,అత్యున్నత విద్యావేత్తలైన పంజాబ్ గవర్నర్ శ్రీ నరహరి విష్ణు ,భారత ప్రభుత్వ హోం శాఖ స్టేట్ మినిస్టర్ శ్రీ బలవంత నాగేష్ దత్తా ,ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ శాంతి ప్రసాద్ మొదలైనవారు రాజస్థాన్ ప్రభుత్వం తో సంప్రదించి డా మండన మిశ్రా సేవలను ఢిల్లీ లో స్థాపించే సంస్కృత విద్యా పీఠానికి అవసరమని నొక్కి చెప్పి ఒప్పించి ,1962 లో ఢిల్లీ సంస్కృత విద్యా పీఠాన్ని మిశ్రా ఆధ్వర్యం ఏర్పాటు చేశారు .

   ఆ కాలం లో సంస్కృత విద్యా బోధనకు నిధులు పెద్దగా ఉండేవికావు .కేంద్ర ప్రభుత్వం సంస్కృత విద్యా సంస్థల కు ఏడాదికి కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే అందజేసేది .అది ఏమూలకూ చాలేది కాదని గ్రహించిడా మిశ్రా,ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి 95శాత౦ ఆర్ధిక సహాయాన్ని అన్ని సంస్కృత విద్యా సంస్థలకు అందజేసేట్లు కృషి చేసి సంస్థలకు ఆర్ధిక పరి పుష్టి కలిగించాడు .దీని ఫలితం గా ఇప్పుడు ఆ సంస్థలకు లక్షలాది కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూరుతున్నాయి .దేశం లోని అన్ని సంస్కృత సంస్థలను ఆర్ధికంగా బలోపేతం చేసి సంస్కృత విద్యా వ్యాప్తికి డా మిశ్రా చేసిన అనితర సాధ్య కృషి ఇది .

   అదృష్ట వశాత్తు ఆనాటి ప్రధాన మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి  అఖిల భారతీయ  సంస్కృత సాహిత్య సంస్థకు చైర్మన్ గా ఉండటానికి అంగీకరింఛి డా మిశ్రా నుమినిస్టర్ –ఇన్ –చీఫ్ గా ఎన్నిక చేశారు .రాజస్థాన్ ప్రభుత్వం అనుమతి సుదీర్ఘ సంస్కృత సేవ దేశం లోని విద్యావేత్తలందరి సహకారం వలన ముఖ్యంగా ప్రధాని శాస్త్రి గారి ప్రేరణ వలన ఈ బాధ్యతను స్వీకరించి మిశ్రా సమర్ధంగా  అంకిత భావం తో జీవితకాలమంతా పని చేసి  గొప్ప విజయాలు సాధించి దేశమంతటా సంస్కృత విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేసి అందరి మెప్పూ పొందాడు . లాల్ బహదూర్  ఆకస్మిక మరణం తో ప్రధాని అయిన ఇందిరాగాంధీ ,డా సంపూర్ణానంద్ సలహాతో డా .మిశ్రా ఈ  సంస్థపేరును శాస్త్రి గారి గౌరవార్ధం ’’ లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యా పీఠం ‘’గా మార్చి భారత ప్రభుత్వానికి అప్పగించాడు .ఈ సంస్థకు సంస్థాపక డైరెక్టర్ గా మిశ్రా ఉండిపోయాడు .మిశ్రా అవిశ్రాంత కృషి, దీక్షా, దక్షత వలన ఈసంస్థ 1989  లో డీమ్డ్ యూని వర్సిటి అయింది .23-6-1989న భారత ప్రభుత్వం డా మిశ్రా ను డీమ్డ్ యూని వర్సిటి మొట్టమొదటి వైస్ చాన్సలర్ పదవిలో నియమించి గౌరవించింది . అయిదేళ్ళుమొదటి వైస్ చాన్సలర్  పని చేసి మిశ్రా  1994 లో రిటైర్ అయ్యాడు ..ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మిశ్రా అమోఘ వ్యక్తిత్వానికి తగినట్లు 1-1-1996 న  వారణాసిలోని  డా.సంపూర్ణానంద్ సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సలర్ పదవి నిచ్చి గౌరవించింది.ఇక్కడ పని చేసిన మూడేళ్ళ కాలం ఆ విశ్వ విద్యాలయానికి స్వర్ణ యుగమే అయింది .అన్ని పరీక్షలను  నిర్దుష్ట కాలం లో నిర్వహించటం,తరగతులను క్రమం తప్పకుండా జరపటం, 115 గ్రంధాలను ప్రచురించటం,సరస్వతి దేవి ఆలయాన్ని నిర్మించటం ,మహా వైభవోపేతంగా దానిని ప్రారంభించటం ,ఇద్దరు రాష్ట్ర పతులు డా.శ్రీ శంకర దయాళ్ శర్మ ,శ్రీ కె ఆర్ .నారాయణన్ లను ముఖ్య అతిధులుగా ఆహ్వానించి , రెండు  ప్రముఖ సభలను పెద్ద ఎత్తున నిర్వహించటం,  డా మురళీ మనోహర్ జోషీ పాల్గొనటం ఆవిశ్వ విద్యాలయ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టాలుగా నిలిచి పోయేట్లు చేసి, డా మిశ్రా  చైతన్య స్పూర్తికి దర్పణంగానిలిచాయి .   

  డా.మిశ్రా వారణాసి లో’’ శ్రీ పట్టాభిరామ శాస్త్రి వేద మీమాంస రిసెర్చ్ సెంటర్ ‘’నుతన గురువు ,ప్రముఖ సంస్కృత మీమా౦సాచార్య శ్రీ పట్టాభిరామాచార్య గౌరవార్ధం  అధునాతన వసతి సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన భవనం లో స్థాపించి అందరి ప్రశంసలను అందుకొన్నాడు . ఈ సెంటర్ కు డా .మిశ్రానుఫౌండర్ చైర్మన్ గా  శ్రీ కంచి శంకరాచార్య నియమించి గౌరవించారు.20 00 సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం డా.మిశ్రా కు  పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసి సత్కరించింది  .  డా.మిశ్రా రాజస్థాన్ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ గా పని చేస్తూ 15-11-2001 న 72 వ ఏట మరణించాడు  .కేంద్ర ప్రభుత్వం కనీసం పద్మ విభూషణ్ అయినా అందజేసి ఉంటె ఆయన సేవలకు తగిన గౌరవం ఇచ్చినట్లుగా ఉండేది .

Inline image 1

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-1-17 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.