వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -48

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -48

మల్లినాథుని గ్రంథ విమర్శనా సరళి-2 (చివరిభాగం )
మల్లినాథుని ”నాశా విరో క ”పాఠం చాలా సవ్యమైనదే అనిపిస్తుంది .మరోపాఠం లో ”నాశా వీరేకా ”ఉంది దీన్ని అశ్లీలార్ధమ్ వచ్చే పద మని సూరి తిరస్కరించాడు .కొన్ని చోట్ల తానూ తిరస్కరించిన సందర్భాలలో వ్యాఖ్యాతల పేర్లు చెప్పాడు ..కొన్ని సందర్భాలలో మల్లినాథుని పాఠం చాలా భిన్నంగా కనిపిస్తుంది -”దీప తుల్యహః ప్రబంధోజ్యం శబ్ద లక్షణాచ క్షుషామ్ -హస్తామర్ష ఇవాంధానం భవేద్ వ్యాకరణావృతే ””హస్తామర్ష ”బదులు మల్లినాథుడు ”హస్తాదర్శ ”ను ఆమోదించాడు గుడ్డివారికి చేతిలో అద్దమున్నా నిష్ప్రయోజనమే .అలాగే కావ్యం ఒక దీపం వ్యాకరణం మాత్రమే చూసేవారి దృష్టిలో .
రఘు వంశం లో రాముడు పరశురాముని -”గ్రహణా శాస్త్రం యది సర్గ ఏషతే ”అన్నాడు.అంటే నాతొ యుద్ధం చేయాలని నిశ్చయించుకొంటే ఆయుధం ధరించు అని అర్ధం .మరొక పాఠం లో ”సర్గ ”కు బదులు ”గర్వ ”అని ఉంది గర్వ అనే పదాన్ని అంగీకరిస్తే రాముడు కావాలనే పరశురాముడినిగర్విష్టి అన్నట్లు భావించటం జరుగుతుంది ఇక్కడ అలాంటి సందర్భం లేదు .పరశురాముడు తనతో యుద్ధ చేయాలని నిశ్చయించుకొంటే తానూ యుద్ధం చేస్తానన్నాడు రాముడు .కనుక పోరాటారంభానికి కారణం రాముడుకాదు .ఈ విషయ0 ”సర్గ ”అనే పదం లో అంతర్గత భావం గా తెలియ బడింది .
భట్ట కావ్యం లో -”సుకృతం ప్రియకారీ త్వం కం రహస్యు ప తిష్ఠసే -పుణ్య కృచ్వా దుకారస్తే కింకర సురతేషు కః ”లో కింకర అనే పదం వ్యుత్పత్తి విషయం లో అభిప్రాయం భేదాలున్నాయి .జయమంగళుడు పాణిని సూత్రం ప్రకారం ”దివా విభా ”టి అనేది చేరుతుంది ధాతువుకు ”అక్” వచ్చి చేరుతుంది అన్నాడు.-”కిమ్ యంత ద్ బహుషు క్రణో జ్విధానం ఇతి సత్సస్త్రీ విషయే ద్రష్టవ్యం ”. కానీ మల్లినాథుని ప్రకారం ”కి మ్యత్తా ద్బహుషు ”అనేది సూత్రానికి మినహాయింపు అన్నాడు కనుక దివా విభా లు కింకర లోచివరి అచ్చును సమర్ధిస్తాయి .జయమంగళుడు కింకర శబ్దం తప్ ప్రత్యామ్యాతో అంతమై దాని స్త్రీలింగానికి యోగ్యమవుతుంది .అందుకని అక్ అనేది ఆదేశంగా వస్తుంది ”అంటాడు -”యంతు ఆడినైవ ట ప్రత్యయహ్ -ఆజ్వివిధానం స్త్రీ మాత్ర విషయం ఇతి జయమంగళాకర వ్యాఖ్యానం తదృ త్తావచ్ ప్రత్యయాంత త్వాభి వ్యకార్త్యర్ధం కింకరా యత్కరీతి ట బంతో దాహరణా దర్శనాద భ్రాతమి చ్యు పేక్షయం ”
మల్లినాథునికి శిశుపాల వధ కావ్యం లో అనేక అవాస్తవిక శ్లోకాలు కనిపించాయి .ఆ 34 శ్లోకాలకు మల్లినాథుడు వ్యాఖ్య రాయలేదు .వాటికి వల్లభ దేవుని వ్యాఖ్యానమే పుస్తకం లో చేరింది .ఈ శ్లోకాల వాస్తవికతపై మల్లినాథునికి వల్లభదేవునికి భేదాభిప్రాయం ఉన్నది .ఈ కావ్యంలో 15 వ సర్గ లో శిశుపాలుడు శ్రీకృష్ణుని దూషించటం ఉంది .మొదటి 27 శ్లోకాలు శ్రీ కృష్ణుని బాల్య క్రీడలున్నాయి .వీటిని శిశు పాలుడు ఆక్షేపించాడు మల్లినాథుడు న్యాయబద్హం కావు అని చెప్పిన వాటికి రెండురకాల భావాలున్నాయి .మొదటి దానిప్రకారం కృష్ణునిపై ఆక్షేపణలుగా అనిపిస్తాయి మరో భావం లో శ్రీ కృష్ణుని నిర్గుణత్వానికి ప్రతీకగా కనిపిస్తాయి.కనుక వాటిలో నిందా స్తుతి లు ఉన్నాయన్నమాట .అంతగొప్పగా పదాల అమెరికా వాటిల్లో ఉంది .ఇవి ఎందుకు అవాస్తవికాలో మల్లినాథుడు కారణాలు చెప్పలేదు .శ్రీ కృష్ణుని అలౌకికత్వానికి ,ఆయన మహిమకు ఈ ద్వంద్వార్ధాలు అలంకారాలు కావని ముఖ్య కధకు శోభించవని మల్లినాథుడు భావించి ఉండవచ్చు అన్నాడు లాల్యే పండితుడు . సందర్భానికి ఇవి తగవు అని భావించి ఉండచ్చు .శ్రీకృష్ణ కీర్తి స్తవానికి ఈ పదాడంబరం మాటల సర్కస్ శోభనివ్వదని ”భావం అబాస పాలు(భావాభాస ) అవుతుందని
సూరి భావించాడు అంటాడు లాల్యే .. నిజంగానే ఈ శ్లోకాల చేర్పు ముఖ్యంగా ద్వంద్వార్థ పదాల ఆడంబరంకావ్యం లోని ముఖ్య ఇతి వృత్తానికి అనునాదం గా ఉండక ఎబ్బెట్టుగా ఉందని అదీకాక శిశుపాలుడి దూషణలకు అంతరార్ధాలు ఉండటం కావ్యమర్యాద కాదని మల్లినాథ మనీష అందుకే అంగీకరించలేదని డా పిజి లాల్యే నిర్మొహమాటంగా చెప్పాడు .
దీనితో మల్లినాథునిగ్రంథ విమర్శనా సరళి పూర్తయింది.తర్వాత మల్లినాథుని వ్యాఖ్యాన విధాన పధ్ధతి గురించి తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.