రాణి మృగావతి రాకుమారి మల్లినాథ

రాణి మృగావతి   రాకుమారి మల్లినాథ

రాజ్యాలేలే మహారాణులు జీవితాలు అశాశ్వతమనుకొని ధర్మానికి సంఘానికి కట్టుబడి మానవ సేవే  మాధవ సేవగా భావించి సర్వం త్యజించి జైన సన్యాసినులై కీర్తి కెక్కినవారిలో రాణి  మృగావతి , రాకుమారి  మల్లినాథ చిరస్మరణీయలు .

              రాణి  మృగావతి

శతానిక రాజు భార్య అపురూప సౌందర్యవతి అయిన రాణి  మృగావతి  .ఆమె జీవితం పవిత్రతకు , వీరత్వానికి ప్రతీకగా చరిత్రలో నిలిచింది ..ఆమె ముగ్ధ మోహన సౌందార్యానికి ఆకర్షితుడైన ఉజ్జయిని రాజు ప్రద్యోతుడు ఆమెను పొందటం కోసం శతానికుడు రాజ్యమేలుతున్న కౌశా0బి   పై దాడి చేశాడు . యుద్ధం ప్రారంభమైన కొద్దీ కాలానికే రాజు శతానికుడు జబ్బుపడి మరణించాడు ..మేధావి అయిన రాణి మృగావతి తెలివిగా రాజుకు తీవ్రమైన జబ్బు చేసిందని  ప్రజలకు తెలియ జెసి తానే  సైన్యాన్ని నడిపి యుద్ధం చేసి శత్రు సైన్యాన్ని తరిమేసింది .అప్పుడు మాత్రమే తనభర్త శతానిక మహా రాజు మరణించాడని ప్రజలకు ప్రకటించింది ..సైన్యం అలసిపోయి నందున ,శత్రుసైన్యం అపరిమితంగా ఉన్నందున తాను ప్రద్యోయుడుతో వెళ్లి పోవటానికి సిద్ధమేనని ,కానీ తన రాజ్యం చుట్టూ రక్షణ కోసం పటిష్టమైన గోడ నిర్మించి ,తమకుమారుడు ఉదయనుని రాజు ను చేయాలని షరతు పెట్టింది . వీటికి ప్రద్యోతుడు అంగీకరించగానే రాణి మృగావతి జైన తీర్ధంకరుడైన మహా వీరుని సన్ని  ధానం చేరి,,తానుప్రద్యోతుడు అంగీకరిస్తే  జైన సన్యాసిని గా ఉంటానని తెలియ జేసింది  ..ప్రద్యోతుడు మహావీరుని అసామాన్య కారుణ్య ప్రబోధానికి లొంగిపోయి ,తాను  చేసిన తప్పులకు  పశ్చా త్తాప పడి తాను కూడా జైన భిక్షువుగా మారిపోతానని నిర్ణయం ప్రకటించాడు ..మృగావతి సన్యాసిని అవటానికి తనకు అభ్యంతరం లేదని తెలిపాడు .అంతేకాక తన రాణులలో చాలామందిని జైనసన్యాసినులుగా మారటానికి అంగీకరించాడు ..వీరందరూ మహా వీరుని చేత సన్యాసం దీక్ష ఇప్పించబడి చరితార్ధులయ్యారు .

            రాణి మల్లినాథ

రాకుమారి మల్లినాథ 19 వ జైన తీర్ధంకరురాలయ్యింది ..స్వే తాంబర జైన సంప్రదాయానికి చెందిన మిథిల రాజు’’ కుంభ’’ కుమార్తె మల్లినాథ .. బహు అందగత్తె కావటం వలన రాజులందరూ ఆమెనే వివాహం చేసుకోవాలని ఉవ్విళ్ళూరేవారు ..తండ్రి వారందరిని తిరస్కరించాడు .వారందరికీ అది కోపకారణమై మిధిలపై సామూహక దండ  యాత్ర చేశారు.  మిథిల రాజు ఓటమికి దగ్గరౌతున్న సమయం లో రాకుమారి మల్లినాథ   తెలివిగా ,ఆ రాజులనందరిని తన మందిరానికి రమ్మని ఆహ్వానించవలసినదిగా తండ్రికి చెప్పింది .వారందరూ అక్కడికి చేరారు …అక్కడ అపురూప సౌందర్య రాశి అయిన మల్లినాథ రాకుమారి నిలుచుని ఉండటం  చూసి , అప్రతిభులైపోయారు .మరి కొంత సేపటికి మరొక ద్వారం ద్వారా అంతటి లావణ్య రాశి మరొకరు కనిపించింది ..అవాక్కయిన వారి భ్రమన్తి తొలగించటానికి మల్లినాథ  వాళ్ళు మొదట చూసింది తన రూపం లో ఉన్న బంగారు విగ్రహమేనని చెప్పి దాని పైనున్న మూత  తీసింది.వెంటనే గబ్బు కంపు ఆహాలంతా వ్యాపించి అందరూ భరించలేక ముక్కులు మూసుకున్నారు ..ఆ విగ్రహం బోలుగా ఉండి  అనేక రకాల ఆహార పదార్ధాలతో నింపబడి చాలాకాలం గా మూత పెట్ట బడింది ..అప్పుడు రాకుమారి మల్లినాథ వారితో ‘’నా బాహ్య సౌందర్యం లోపల అంతే  కుళ్ళు ,చెత్త నింపబడి ఉందని ,తానూ సర్వాన్నీ త్యజించి జైన సన్యాసినిగా మార బోతున్నానని తెలియ జెప్పింది ..ఈ విషయం విన్న రాజులందరూ పశ్చా త్తాపం ప్రకటించి ,క్షమించమని కోరి ,భౌతిక సుఖాలు తుచ్చమైనవని గ్రహించి ,ధ్యానం తపస్సులో శాశ్వత సుఖం ఆనందం మోక్షం ఉన్నాయని గ్రహించి ,రాజ్యాలకు వెళ్లి వారసులను నియమించి రాకుమారి మల్లినాథ అడుగుజాడలలో నడిచి జైన సన్యాసులై జీవితం గడిపారు

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.