గీర్వాణ కవులకవితా గీర్వాణం -3
189-అశ్వినీ దేవతలపై స్త్రోత్రం రచించిన –ఘోష ( బి సి 1500-1200 )
కక్ష వంతుని కుమార్తె ,దీర్ఘ త ముని మనుమరాలుఘోష తండ్రి ,తాతా ఋగ్వేదం లో రెండు మంత్రాలను దర్శించినట్లు ఉన్నది .ఘోషకు చర్మ వ్యాధి సోకి శరీరం రంగు మారిపోవటం వలన వివాహం చేసుకోకుండా తండ్రి ఇంటనే ఉండి పోయింది . తాను కూడా తన ఆరోగ్యం కోసం ఆరోగ్య ప్రదాతలైన అశ్వినీ దేవతలను స్థిర చిత్తం తో ప్రార్ధించింది .వారు ఆమెకు ‘’మధు విద్య ‘’బోధించారు .దీన్ని రహస్యంగా అనుష్టించి అశ్వినీ దేవతల అనుగ్రహం తో శరీరారోగ్యం సౌందర్యము గొప్ప జ్ఞానము పొందింది .అప్పుడు వివాహం చేసుకొని ,’’శుష్ట్య ’’ అనే కుమారుని కన్నది .ఇతను కూడా ఋగ్వేదం లో ఒక మంత్రాన్ని దర్శించాడు .
ఋగ్వేదం లోని 10 వ మండలం లో ఒక్కొక్క దానిలో 14 మంత్రాలున్న39 ,40 అనే రెండు సూక్తాలను చెప్పింది . .మొదటి అనువాకం అశ్వినీ దేవతలను స్తుతిస్తూ చెప్పింది రెండవదానిలో తనకు ఆరోగ్యం కలగాలని శరీరం కాంతివంతమై అందం రావాలని వివాహం చేసుకోవాలనే కోరికలను తెలియ జేసింది .ఆమెకున్న మంత్ర శాస్త్ర ప్రావీణ్యతను గుర్తించి ఘోష ను ‘’మంత్ర వాదిని’’అన్నారు ఆమెకు బ్రహ్మవాదిని అనే పేరు కూడా ఉన్నది .
190-పంచ దశి కర్త -లోపాముద్ర (బిసి 2600-1950)
కౌషితకి అని వరప్రద అని లోపాముద్రకు పేర్లున్నాయి అగస్త్యమహర్షి భార్య లోపాముద్ర .ఋగ్వేదం లో చాలామంత్రాలు ఆమె దర్శించినట్లు ఉన్నది .ఆమెను ‘’ఋషికి ‘’అంటారు శాక్త సంప్రదాయం లో ‘’వేదాంత పంచ దశి ‘’ రచించింది .ఆమె గురించి మహాభారతం లోను గిరిధర రామాయణం లోనూ ఉంది .అగస్త్యమహర్షి ఒక కుమార్తెను సృష్టించి విదర్భ రాజుకు ఇచ్చాడు .ఆమెకు మంచి విద్య నేర్పించి పెంచిపెద్దదాన్ని చేశారు .ఆమెకు యుక్త వయసురాగానే మహర్షి ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని రాజును కోరాడు .వివాహం తర్వాత రాజ ప్రాసాదం వదిలి దంపతులు దూరంగా వెళ్లి ఆమె సహాయం తో ఆయన చాలాకాలం తీవ్ర తపస్సు చేశాడు .తనను పట్టించుకోకుండా ఆయన తపస్సులో మునిగిపోవటం తో ఆమె వ్యధ చెంది రెండుమంత్రాల అనువాకం చెప్పింది ఆమె మనసు గ్రహించిన మహర్షి తన సర్వ శక్తి యుక్తులతో ఆమెకు సర్వ విధాలా సౌకర్యం సంతృప్తి కలిగించాడు .ఈ దంపతులకు ‘’ద్రి దశ్యు ‘’అనే కుమారుడు జన్మించాడు ఇతనుఁ గొప్ప కవిగా ప్రసిద్ధుడయ్యాడు .ప్రసిద్ధ పతివ్రతలలో లోపాముద్ర కూడా ఒకరు . జంతువులూ వృక్షాలు తమ అందాలను అంటే’’ ముద్ర’’లను ఇతరులకు త్యాగం చేసి తమకు ఏమీ మిగలకుండా చేసుకొని’’ లోపా ‘’ గా మిగలాటమే లోపాముద్ర తత్త్వం .విష్ణు మూర్తి అవతారమైన హయగ్రీవుని నుండిఅగస్త్య మహర్షి గ్రహించిన లలితా సహస్ర నామాలను లోపాముద్ర భర్త తో కలిసి విస్తృతంగా ప్రచారం చేసింది
లోపాముద్ర దర్శించిన ఋగ్వేద మంత్రాలు -1-’’పరు వీరహం పురదః శాస్త్ర మణాదేష వస్తో ఋషస్లో జరయన్తి -మీనాతి శరియం జరీనా తనూనమష్యు ను పత్నీ ర్వుషణో జగమ్యుహః ‘’ భావం -ఎన్నో షరతులు గడిచిపోతున్నాయి శరీరం ముసలిదైపోతోంది .అందం మందగిస్తోంది .తెలివిగలవాళ్ళు పెళ్లాలను చేరాలి .
2-’’ఏ చిదధి పూర్వం రత సాప అసన్ సాకం దేవీబీ రవద న్నతాని -చే చిదవస్తు ర్నహ్యాన్త మాషు హ్ సమూ ను పత్నీ ర్వర్షాభి ర్జగమ్యుహ్ ‘’ భావం -సత్యారాధన చేసిన పూర్వీకులు దేవునితో సత్యాన్ని చర్చించారు కానీ వారు చివరికి చేరలేకపోయారు .భార్యలు ఇప్పుడు భర్తలతో సమాగమించాల్సిన సమయ మేర్పడింది
191-27 గురు ఋషికలు( బిసి 2600-1950)
,గోధా గోషా విశ్వవరాపలోపనిషత్ -బ్రహ్మజయా , జుహు ఉర్నామ ,అగస్త్యస్య స్వసాదితిహ్ -ఇంద్రాణి ఇంద్ర మతా చ సరమా రోమా షోర్వషి -లోపాముద్రా చ నాద్యశ్చ ,యామి ,నారీచ శాశ్వతి -శ్రీ ర్లక్షా సర్పరాజ్ జి వాక్ శ్రద్ధా మేధా చ దక్షిణా -రతి సూర్య చ సావిత్రి బ్రహ్మవాదిన్య యిరితః ‘’
అనే 27 గురు మహిళలు వేద కాలపు విద్యాధికులు . విద్యా వేత్తలు వీరంతా పురుషులతో సరిసమానంగా అన్ని చర్చలలోనూ ,విద్యా సంగీత నాట్య కార్యక్రమాలలోను పాల్గొన్నారని లాత్యాయనుడు తెలియ జేశాడు .వీరందరిని’’ఋషికలు’’అని వేదకాలం లో గౌరవంగా సంబోధించేవారు ..
192- పాణిని చెప్పిన స్త్రీ విద్యా వేత్తలు -(_బిసి 400 )
వేదం లో కథా శాఖకు చెందిన మహిళా విద్యార్థినులను పాణిని ‘’కథి ‘’అన్నాడు.ఋగ్వేద మంత్రాధ్యయనం లో నిష్ణాతులైన మహిళా విద్యార్థులను పాణిని ‘’భహ్వి రుచి ‘’అన్నాడు .మీమాంస శాస్త్ర ఉపాధ్యాయినులను ‘’ఉపాధ్యాయి ‘’అని విద్యార్థినులను ‘’ఛాత్రి ‘’అనీ అన్నాడు .పాణిని అష్టాధ్యాయికి భట్టోజీ దీక్షితులు రాసిన ‘’సిద్ధాంత కౌముది ‘’వ్యాఖ్యానం లో గృహిణులుగా మాత్రమే కాకుండా సంస్కృత విద్యను బోధించిన వారిని’’ ఉపాధ్యాయి ‘’ అన్నాడు ‘ వీరందరూ వేదవిద్య నేర్చి ఇతరులకు బోధించినవారే
193-ఋషికలు ఋగ్వేదం లో దర్శించిన మంత్రాలు (బిసి 2600-1950)
1-అదితి -4,18
2-అదితి ర్దా క్షాయణి -10,72
3-ఆపాలాత్రే యి -8,91
4 -ఇంద్రాణి -10,86
5-ఊర్వశి -10,85
6-గోదా -10,134
7-ఘోషా కక్షవతి -10,39,10,40
8-జుహుర్బ్రహ్మ జయ -10 109
9-త్వష్ట ,గర్భ కర్త -10 ,184
10-దక్షిణా ప్రజాపత్యా – 10,107
11-యామీ -10 ,154
12-యామీ వైవస్వతి -10,10
13-రాత్రి భారద్వాజి -10,27
14-లోపాముద్ర -1,171\
15 -వసుక్రపత్ని -10,28
16-వాగామ్భర్ని -10,125
17-విశ్వవర ఆత్రేయి -5,28
18-శాశ్వత్యాంగీరసీ -8,1
19-శ్రద్ధా కామాయని -10,151
20-శచీ పౌలోమి -10,159
21-సర్ప రాజ్ఞి -10 189
22-శిఖాతానివవారి -9,86
23-సూర్య సావిత్రి -10,85
24-రోమాషా -1,126
25-సరమా దేవ షూనీ -10,108
26-శిఖండిన్యప్సరశు -9,104
27-కాశ్యపన జాన్త శర్నఘా -10,142
28-సుదీతీరా0గీరస -8,71
29-ఇంద్ర మాతరో -10 153
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా
