గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
213-న్యాయ సూత్ర కర్త -గౌతమ మహర్షి (క్రీపూ. 600 )
అక్షపాద గౌతముడు అని పిలువబడే గౌతమమహర్షి ‘’న్యాయ సూత్రాలు ‘’రచించాడు .అందువల్ల వీటిని ‘’గౌతమ న్యాయ సూత్రాలు ‘’అంటారు .ఇందులో 5 విభాగాలలో 528 సూత్రాలున్నాయి .జ్ఞాన మీమాంస ,ఆథి భౌతిక ,కారణం నిబంధనలు మొదలైన వాటిపై చెప్పిన సుత్రాలివి .వీటిలో వేద సంబంధ క్రతుక్రమాలేవీ లేవు .మొదటి భాగం లో ఉపోద్ఘాతం ,16 రకాల జ్ఞాన వివరాలు రెండవ భాగం లో ప్రమాణ ,మూడవదానిలో ప్రమేయం ,మిగతా రెండిటిలో వీటి గురించి తెలుసుకొనే విపులమైన వివరాలు ఉంటాయి .న్యాయ సంప్రదాయానికి ఇదే ఆధార భూతమైన గ్రంధం .న్యాయ సూత్రాలతో తర్క విద్య ,వాద విద్య లపై విస్తృత చర్చ ఉంది .వైశేషిక జ్ఞనమీమాంస ,ఆధి భౌతిక విషయాలపై సమగ్ర వివరాలున్నాయి .. ఈ న్యాయ సూత్రాలపై తరువాతకాలం లో అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి అందులో వాత్సాయనుడు క్రీశ 450-500 లోను ,6 7 -శతాబ్దాలలో ఉద్యోతడు రాసిన న్యాయ వార్తిక ,9 వ శతాబ్దం లో వాచస్పతి రాసిన తాత్పర్య టీకా ,10 వ శతాబ్దం లో ఉదయు ని’’తాత్పర్య పరిశుద్ధి ,జయంతుని న్యాయ మంజరి ప్రసిద్ధమైనవి
ఈ న్యాయ సూత్రాలలో ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద ప్రమాణాలపై విస్తృత చర్చ ఉంది .మొదటి భాగం లో సరైన చర్చా విధానానికి -ప్రతిజ్ఞ (ప్రతిపాదన ),హేతు (కారణం )ఉదాహరణ,ఉపనయ (అనువర్తనం -అప్లికేషన్ ),నిగమన(నిర్ధారణ ) ఉండాలని చెప్పాడు .ఇవికాక అనుమానం, దోషాలు ,హేత్వాభాస సూత్రాలు కారణ సూత్రాలు,వ్యతిరేక సూత్రాల వివరణ ఉంది
పూర్వపు న్యా సూత్రాలతో ఈశ్వరుడు సృష్టికర్త అని ఆయన వరాలు ఆశీస్సులు అందిస్తాడని చెప్పాయి
సిద్ధాంతం -ఈశ్వరః కారణం పురుషకర్మ ఫల్య దర్శనాత్
పూర్వ పక్షం -న ,పురుష కర్మ భావే ఫేలా నిష్ఫ0 తే
సిద్ధాంత సూత్రహ్ -తత్కారితత్వా దహేతుహు
గౌతమ న్యాయ సూత్రాలు వేదాంత తత్వ శాస్త్రానికి దారి చూపాయి
గౌతమ న్యాయ సూత్రాల అంతిమ ధ్యేయం మోక్షం పొందటమే -దానికి అనుసరించాల్సిన సోపానాలు -ప్రమాణ ,ప్రమేయ,సంశయ ,ప్రయోజన దృష్టాంత ,సిద్ధాంత ,అవయవ ,తర్క ,నిర్ణయం వాద ,జల్ప, వితండ , హేత్వాభాస ,చల ,జాతి , నిగ్రహస్థానాలు
214- హనుమంతుని ద్వారా వెలువడిన -హనుమద్ గీత
శ్రీరామ పట్టాభి షేకం అయినతరువాత ఒక మంచిరోజున అందరు కొలువై ఉండగా రాముడు సీతాదేవిని తన అవతార రహస్యం హనుమంతునికి బోధించామని కోరాడు ఆమె చెప్పినదే హానుమద్ గీత .హనుమ ద్వారా అది లోకం లో ప్రచారమైనది .సీతాదేవి హనుమంతుని చూసి ఆత ను శివ స్వరూపుడని ఆయన తమ దంపతులకు చేసిన మహోపకారం మరువ లేనిదని మెచ్చుకొంటూ రాముని అనుమతితో శ్రీరామ తత్వాన్ని బోధించింది ‘’శ్రీరాముడు సర్వకాల సర్వావస్థలలో ఉండేవాడు ,అవినాశి నేను యోగమాయ ను. ఆయనను వదిలి ఎప్పుడూ ఉండను .నా ఉనికి ఆయనను ఎల్లప్పుడూ సేవించటానికే .మా ఇద్దరి ప్రేమ సార్వకాలికం ‘’అని చెప్పగానే హనుమ ఆనంద బాష్పాలు రాలుస్తూ గద్గద స్వరం తో లంకలో సీతకు జరిగిన అవమానాన్ని ఆమె అగ్ని ప్రవేశం చేసిన సంగతి గుర్తుచేసుకొని ఉద్వేగం తో ‘తల్లీ !ఈ సా రి నువ్వు అగ్ని ప్రవేశం చేయాల్సివస్తే నేను తట్టుకోలేను నీ తోపాటు నేను కూడా నిప్పుల్లో దూకుతా ‘’అన్నాడు .హనుమ ను ఓదారుస్తూ రాముడు ‘’సీతాదేవి ప్రకృ తి .ఆమె మూర్తీభవించిన పవిత్రత .నిన్ను వదిలి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లదు .నువ్వు ఎప్పటికీ మా కుటుంబ సభ్యుడవే ‘’అని అనునయించి జీవిత చక్ర భ్రమణం పుట్టుక చావు ,గుణాలు బంధాలు ,మిధ్యా ప్రపంచం ,మాయ కమ్మి మనుషులు తాము పరమేశ్వర స్వరూపులని మరచి పోవటం ఆత్మ జ్ఞాని కి ఇవన్నీ తెలుస్తాయని ,రామాయణం మానవులను ఉత్తమ మార్గాలలో నడవటానికి తోడ్పడుతుందని హనుమ చిరంజీవి అని ప్రతిదీ బ్రహ్మమని గ్రహించాలని ఎక్కడ రామనామ స్మరణ వినిపిస్తే అక్కడ హనుమ ప్రత్యక్ష మై ఆన0దం తో పులకిస్తాడని తెలియ జేశాడు .సితారాములు చెప్పిన ఈ మహోన్నత విషయాలను విన్న హనుమ అంతరంగం ప్రేమ మయమైంది .
మర్నాటి సభలో హనుమ ‘’నా జీవితం ధన్యమైంది. శ్రీసీతా రామ సేవలో నేను తరిస్తాను .చిత్త చాంచల్యమే అన్ని దుఃఖాలకు మూలం . సత్య జ్ఞానమనంతం బ్రహ్మ .సర్వం బ్రహ్మమయమని భావించినవానికి లభించేది మోక్షమే ‘’అన్నాడు .ఈ మాటలు అంటూ ఉండగానే హనుమ శిరసుపై అపూర్వ దివ్య తేజస్సు అవతరించింది కళ్ళు ఒళ్ళు పులకించి ఆనంద బాష్పవాలు రాలుతున్నాయి .హృదయమంతా సీతారాములు నిండి పోయారు .హనుమంతుని ఆత్మ జ్ఞానానికి దివ్యానుభూతికి కొలువు కూటం లోని ప్రతి ఒక్కరూ పులకించి ఆయన దివ్య తేజస్సుకు మురిసి పుష్ప వృష్టి కురిపించి అభినందించారు .హనుమంతుడు ప్రేమ, భక్తి ,ఆరాధన నిండిన నిస్వార్ధ సేవకుడు .ప్రేమ సత్య ధర్మాలను మనసా వాచా కర్మ ణా అనుష్టించిన పవిత్ర మూర్తి .సదా అప్రమత్తుడై స్వామికార్యాని తననుఁ నమ్మినవారిని కాపాడటానికి సంసిద్ధమై ఉంటాడు .హనుమ. సీతారాముల పవిత్ర ప్రేమను ,వానరుడైనా హనుమకు మోక్షమార్గాన్ని ఉపదేశించి చిరంజీకిని చేసిన ఘన చరిత్రను తెలియ జేస్తుంది
215-ఋగ్భాష్య మనుసూత్రాది గ్రంథ కర్త -దేవలుడు
దేవలుడు దేవతలకు మనుష్యులకు చక్కని వస్త్రాలు నేసేవాడే కాక దీనికోసం అనేక అవతారాలెత్తినవాడు .అంతేకాదు ఆమోదనగరం రాజధానిగా రాజ్యపాలన చేసిన మహా రాజు .వేదాంతాన్ని ధర్మాన్ని బోధించినవాడు .అనేక గ్రంధాలు రచించినవాడు దేవలుడు .దేవల అవతారమే కాక విద్యాధరమొదలైన అవతారములు దాల్చినవాడు .
దేవలుని విద్యాధర అవతారం లో రచించిన గ్రంథ పరంపర -ఋగ్వేద భాష్య ,మనుసుత్ర సంధ్యాభాష్య ,మనుస్మృతి ,దేవలోపనిధి దేవరాజ ఛందస్ ,దేవల -జెమినివద ,వర్ణాశ్రమ మహోదధి ,బ్రహ్మ సూత్రం నిఘంటు ,మనుజ్ఞాన శిక్షా మణి
మూడవది అయినపుష్పదంతుని అవతారం లో -శివ మహిమ్న స్తోత్రం ,మేరు చరిత్ర వేదాంత కుష్ ,బ్రహ్మోపదేశ సిద్ధాంత ,దేవీ భాగవత దేవ రత్నాకర , దేవ రాజా శేఖర ,ఉత్తర మీమాంస ,సుజన దీపికా రాశాడు
నాలుగవది అయిన భేతాళ అవతారం లో-చతుస్సాశాస్త్ర సూత్రం ,ధనుష్ శాస్త్ర ,భేతాళ పంచతంత్ర ,భేతాళాఖ్యాన ,భూ సూక్త ,స్మర శాస్త్ర మల్లసాధన నిర్ణయం ,మల్ల భైరవ నిర్ణయం ,మహా భైరవ సూక్త ,మంత్రం శాస్త్రం .
అయిదవదైన వరరుచి అవతారం లో -ప్రక్తిర ప్రత్యక్ష సూత్రం తత్వ నిఘంటు ,కథా గణిత శాస్త్ర ,చంద్ర సిద్ధాంత సూర్య సిద్ధాంత ,త్రిలింగ దత్తమీమాంస ,శృతి షట్ సూత్రం నిర్ణయం ,కౌముది శబ్ద శాస్త్ర ,వాస్తవ్యు నిర్ణయం ,భగ శాస్త్ర ,,యోని తంత్ర ,ఛంధోజ్ఞానం ,సంధి సూత్రం ,కారణ న్యాయ బోధిని ,నర పింగళిశాస్త్ర ,లక్షణ శాస్త్ర ,స్వర శాస్త్ర ,వేదాగమలాయుర్వేద,ఏతద్వింశతి శాస్త్ర0
ఆరవదైన దేవ శాలి అవతారం లో – పరమాన్య వధ ,సుజ్ఞాన దీపికా ,జ్ఞాన మంజరి ,సుజ్ఞాన రత్నమాల ,సద్వాద జ్ఞాన మంజరి ,పంచ శిఖా నిర్ణయం ,దేవా కల్ప తి మదర్పణ ,ఊర్వాపరా ప్రయోగ ,దేవ రహస్య ,సత్కర్మ జ్ఞాన ప్రబోధక0
ఏడవదైన దేవ దాస అవతారం లో వచనాలు రాశాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-17-కాంప్-షార్లెట్- అమెరికా
