గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 251-మహా మృత్యుంజయ మంత్ర భాష్య కర్త-స్వామి స్వరూపానంద (1960

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

251-మహా మృత్యుంజయ మంత్ర భాష్య కర్త-స్వామి స్వరూపానంద (1960

స్వామి స్వరూపానంద దక్షిణ భారత దేశ చిన్మయ విశ్వ విద్యాలయ పీఠం ట్రస్ట్ అంటే యూనివర్సిటీ ఫార్  సాంస్క్రిట్ అండ్ ఇండిక్ ట్రెడిషన్  కు చైర్మన్ .దీనికి పూర్వం స్వామి -ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ,మిడిలీస్ట్ ,ఫారీస్ట్,ఆఫ్రికాలలోని చిన్మయ మిషన్ కు రీజినల్ హెడ్ గా ఉండేవారు ..ప్రస్తుతం కోయంబత్తూర్ లోని చిన్మయ ఇంటర్ నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ డైరెక్టర్ ..స్వామి తేజోమయానంద ఆశీస్సులతో ఇప్పుడు వరల్డ్ వైడ్ చిన్మయ మిషన్ అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు  .

 ఇండియాలో బాగా వాణిజ్య వ్యాపార కేంద్రమైన బొంబాయి నగరం లో జన్మించిన స్వరూపానంద చిన్నప్పటినుండి భౌతిక జీవితంపై కంటే ఆధ్యాత్మిక జీవితం పై ఆసక్తి పెంచుకొన్నారు.  నాయనమ్మ బోధించే భారత రామాయణ కధలు మహర్షుల జీవితాలు ఆయనపై బాగా ప్రేరణ కలిగించాయి  .స్వామి చిన్మయానంద బోధలు ఆకర్షించాయి .  .జీవిత పరమార్ధం అర్ధమై 1984 లో  హాంగ్ కాంగ్ లోని స్వ0త వ్యాపార  సంస్థ ను ,ఇంటిని వదిలేసి స్వామి చిన్మయానంద  స్వామి తేజోమయానంద ల వద్ద  బొంబాయిలో సాందీపని ఆశ్రమం లో శిక్షణ పొందారు .. 1992 లో సన్యాసం దీక్ష పొంది వేలాది ప్రజల హృదయం లో స్థానం పొందారు  .అన్నిమతాల సారాన్ని గ్రహించి మత ఐక్యత కోసం కృషి చేశారు . స్వీయ వ్యక్తిత్వ వికాస సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.

  మహా మృత్యుంజయ మంత్రానికి అద్భుత భాష్యం రాశారు  .సంకట మోచన్ ,ఇక్  ఓంకార్లకు రాసిన వ్యాఖ్య బాగా పేరు తెచ్చింది .సమకాలీన జీవిత శైలిపై ‘’సింప్లిసిటీ ఇన్ మెడిటేషన్ ,స్టార్మ్ టు పెర్ఫార్మ్ ,అవతార్, మేనేజింగ్ ది మేనేజర్ జర్నీ ఇంటు  హెల్త్ ఆంగ్లగ్రంధాలు రాశారు .సీనియర్ కార్పొరేట్ ఎక్సి క్యూటివ్ లకు ‘’హోలిస్టిక్ మేనేజ్ మెంట్ ‘’సెమినార్ లు నిర్వహించటం లో స్వామి మంచి సమర్ధత చాటారు .లండన్ బిజినెస్ స్కూల్ ఫోర్డ్ మొదలైన సంస్థలలోఆహ్వానం పై  ధార్మికప్రసంగాలెన్నో చేశారు .సెల్ఫ్ డెవలప్ మెంట్ కోర్స్ అంటే మహా ఇష్టం .దీనిని భారత దేశం లోనే కాక అనేక విదేశాలలో నిర్వహించి ప్రజల ఆలోచనా శైలి విధానాలలో గణనీయమైన మార్పులు తెచ్చారు .

242- ‘’అనుగీత ‘’  ను విని చెప్పిన -వైశంపాయనుడు (బిసి 400-200 )

మహా భారతం లో అశ్వమేధ పర్వం లో ‘’అనుగీత ‘’ఉంది అను అంటే అనుసరించినది అనిఅర్ధం  అంటే కురుక్షేత్ర సంగ్రామం లో అర్జునునికి శ్రీ  కృష్ణుడు  చెప్పినది భగవద్గీత .యుద్ధం అయ్యాక కొంతకాలానికి అర్జునుడు తాను  కృష్ణుడు చెప్పిన భగవద్గీతను మర్చిపోయానని ,మళ్ళీ ఒక సారి చెప్పమని కోరగా అది అసాధ్యమని కానీ దానికి అనుసంధానంగా కొన్ని విషయాలు చెబుతానని చెప్పిందే అనుగీత .దీనిని వైశంపాయనుడు విని లోకం లో ప్రచారం చేశాడు . ధర్మ నీతి మొదలైనవాటి గురించి అనుగీత లో పరమాత్మ  తెలియ జేస్తాడు   ఉపనిషత్తులలో ముఖ్య విషయాలన్నీ ఇందులో ఉంటాయి .భార్యా భర్తల  మధ్య ఉన్న చర్చలో మానవ శరీర నిర్మాణం జనన మరణాలు ,దేహం లోని దేవతల వివరాలున్నాయి .అధ్వర్యునికి సన్యాసికి మధ్య సంభాషణలో జంతుబలి దానిపూర్వాపరాల విశేషాలున్నాయి .గురుశిష్య స0వాదం లో అత్యున్నత మైన సత్యం గురించి వివరణ ఉంది .తర్వాత ధర్మ యుద్ధం యుద్ధనీతి అహింస మొదలైన వివరాలుంటాయి .ఉత్తమ వ్యక్తి అనుసరించాల్సిన విధానాలన్నీ అనుగీత లో పొందుపరచ  బడినాయి .ఇవికాక ఆనందం సుఖం అణకువ .జ్ఞానోదయం ,భయరాహిత్యం ,సంతృప్తి నమ్మకం ,క్షమా ధైర్యం అపకారం చేయకపోవటం ,సమానత్వం అహింస ,అక్రోధనం ,పగ ఈర్ష ,ప్రతీకారేచ్ఛ ,అసూయ మున్నగు విషయాల వివరణ ఉంది

 అనుగీత 36 భాగాలలో ఉంది .శంకరాచార్య ,విజ్ఞాన భిక్షుల దృష్టిని అనుగీత ఆకర్షన్చింది

   243-శ్రీరామ గీత చెప్పిన –శ్రీరాముడు

ఒకసారిశ్రీ  రాముని  దగ్గరకు తమ్ముడు చేరి అత్యంత వినయంగా తనకు జ్ఞాన విజ్ఞాన పూర్వక ఆత్మ విద్యను బోధించామని ప్రార్ధించాడు .వారిద్దరి సంవాదమే శ్రీరామ గీత.ఇది అద్వైత వేదాంతమే  దీనిని స్వామి శివానంద బాగా ప్రచారం చేశారు  .ఇందులోని సారాంశం తెలుసుకొందాం .

 ‘శ్రుతులు వినటం  ఉద్గ్రంధాలు చదవటం వలన  వచ్చేది జ్ఞానం.నిధిధ్యాసాదు ల వలన కలిగేది విజ్ఞానం.బ్రహ్మ విద్యను ఎవరికి పడితే వారికి చెప్పకూడదు .గురు శుశ్రూష చేసి గురు ముఖతా నేర్వాలి .ఉన్న జ్ఞానానం అంతా తెలుసుకోవాలని ఇంద్రుడు 101 సంవత్సరాలు తపస్సు చేశాడు .యముడు నాచికేతుని అనేక విధాలా పరీక్ష చేసి ఆత్మ విద్య నేర్పాడు .గురువుకు శిష్యునిపై పూర్తి నమ్మకం కుదిరితేనే బ్రహ్మ విద్య నేర్పుతాడు .శరీరమే ఆత్మ అనుకోవటం మాయ .మాయవలన ప్రపంచ సృష్టి జరుగుతుంది .శరీరం ఆత్మకాదు .ఇంద్రియజ్ఞానం ద్వారా ఆత్మ తెలియదు .మాయ విక్షేప ,ఆవరణ అని రెండురకాలు . సర్వకాల సర్వావస్థలలో ఉండేది సత్యం అదే ఆత్మ .అహంకారాదులను విసర్జించి ఇంద్రియాలను నియంత్రించి తదేక సాధన చేస్తే ఆత్మజ్ఞానం లభిస్తుంది .దానికి మించిన ఆనందమే లేదు .ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం ‘’అని రాముడు రామగీత ను తమ్ముడికి బోధించాడు .రామ గీత రెండుభాగాలలో ఉంది .శ్రీరామ హనుమల మధ్య సంభాషణే రెండవ రామ గీత .దీనిని ‘’అనుభావాద్వైతం ‘’అంటారు .తత్వ సారాయణం ‘’లో దీనిని సంపూర్ణంగా ఆవిష్కరించి చెప్పబడింది . ఇవికాక చాలా గీతాలు ఉన్నాయి మచ్చుకి కొన్ని –

సిద్ధ గీత- జనక సభ లో యోగుల జ్ఞానగానం —

మిథిలాధీశుడు రాజర్షి జనకమహా రాజు ఆస్థానం లో యోగులతోఆయన చర్చల సారాంశమే  ‘’సిద్ధ గీత ‘’  .దీని సారాంశం -చైతన్యం  అనంతంగా వ్యాప్తి చెందటం ,దీని అనుభవం స్వయం నియంత్రణ .కర్త కర్మల సంబంధ  నిషేధత్వం వలన కలుగుతుంది .యోగ వాశిష్టం ;;ఉపశాంతి ప్రకరణం ‘’లో ఉంది

– బక  గీత– ఇంద్ర -బక సంవాదం

దేవేంద్రునికి బక మహర్షికి మధ్య జరిగిన సంవాదమే ‘’బక గీత ‘’.ప్రపంచం లోని దుఃఖం లో మానవుడు అంతకాలం పడి ఉండి బాధలు అనుభవించటం దీని సారాంశం .ఇది మహాభారతం లో ఉంది .యమ గీత లో విష్ణుభక్తులు పాటించాల్సిన నియమాలుంటాయి .ఇది విష్ణుపురాణం లో ఉంది .ఉద్ధవుడికి కృష్ణుడు చెప్పింది ‘’భిక్షుగీత ;;భాగవతం లో ఉంది .దత్తాత్రేయుడు చెప్పింది జీవన్ముక్తి గీత ,వగైరా . గీతలు అనంతం మన తలరాత మార్చటానికి .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-21-6-17-కాంప్ షార్లెట్-అమెరికా


Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.