గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
265-భాస్వతి కర్త -శతానంద (1099
భాస్వతి అనే ఖగోళ శాస్త్ర గ్రంధాన్ని సంస్కృతం లో రాసిన ఒరిస్సా రచయిత శతానంద 1099 కాలం వాడు ,ఆయన ఖగోళ ళశాస్త్ర నిధిగా గుర్తింపుపొందారు .భాస్వతి పై అనేక వ్యాఖ్యానాలు రాయబడ్డాయి అంటే అతని గొప్పతనం ఏమిటో తెలుస్తుంది .గ్రంధం చివరి శ్లోకం లో తన గురించి చెప్పుకొన్నాడు .తాను పూరి వాసినని ,తండ్రి శంకర ,తల్లి సరస్వతి అని చెప్పాడు .తన రచన 1099 లో పూర్తయిందన్నాడు .గ్రంధం మొదటి శ్లోకం లో తాను మురారి అంటే విష్ణు పదభక్తుడనని ,ఈ గ్రంధం విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని రాస్తున్నానని తెల్పాడు . శతానంద భాస్వతి తోపాటు శతానంద రత్నమాల ,శతానంద శని గ్రహ కూడా రాశాడు .శనిగ్రహ అనేది స్మృతికావ్యం
266-భాగవత భావార్థ దీపిక కర్త -శ్రీధర స్వామి (1400 )
ఒరిస్సా లోని పూరీ జగన్నాధ క్షేత్ర గోవర్ధన మఠ మహంతు శ్రీ శ్రీధర స్వామి క్రీశ 1400 కాలంవారు భాగవత పురాణానికి ‘’భాగవత భావార్థ దీపిక’’అనే సంస్కృత వ్యాఖ్యానం రాశారు . అది దేశమంతా బహుళ ప్రచారం లో ఉంది .ఇందులో అద్వైతాన్ని భాగవత భావోద్రేకాలు అనుసంధానం చేస్తూ రాశారు .వీరు మూడవ లేక నాల్గవ నరసింహ దేవరాజు కాలం లో ఉ0డిఉంటారు(1307-1414 )
267-అభినవ గీత గోవింద కర్తలు -కవి చంద్ర రాయి దివాకర మిశ్ర ముక్తాదేవి దంపతులు (1409
ఒరిస్సాకు చెందిన కవి చంద్రరాయ్ అతని అర్ధాంగి ముక్తాబాయి సంయుక్తం గా ‘’అభినవ గీత గోవిందం ‘’రచించారు .దివాకరుని తండ్రి వైదీశ్వర . ఈ కావ్యాన్ని గజపతి పురుషోత్తముడికి అంకితమిచ్చాడని అంటారుకాని నిజం కాదన్నారు ఇతని మరోరచన ‘’భరతమాత మహాకావ్యం ‘’.ఇందులో ఉన్నదాన్ని బట్టి ఈకవి కృష్ణదేవరాయల(1409-1530 ) ఆస్థానకవి అని తండ్రి ,సోదరులు కూడా గొప్పకవులని తెలుస్తోంది ..
268-భక్తి భాగవత మహాకావ్య కర్త -కవి డిండిమ జీవ దేవాచార్య (1478-1550 )
1478 లో ఒరిస్సాలో జన్మించి 1550 లో మరణించిన కవి డిండిమ దేవాచార్య ‘’భక్తి భాగవత మహాకావ్యం ‘’రాశాడు .ఇతనిది వత్స గోత్రం. ఉపోద్ఘాతం లో ఒరిస్సా చక్రవర్తుల విషయాలను సంక్షిప్తంగా చోడ గంగ దేవ నుంచి పురుషోత్తమ దేవ వరకు రాశాడు .ఇతని భక్తి వైవన్ కావ్యం ప్రబోధ చంద్రోదయం లాంటి అన్యార్థ రచన .ఉషావతి నాటకం కూడా రాశాడు .యుధిష్టురుని యాగాశ్వం ను కట్టేసి వెంట వెళ్లిన అర్జునునికి తో యుద్ధం చేసి శ్రీకృష్ణ ,నారదుల సమక్షం లో పెళ్లి చేసుకొన్నఉషావతి కథ .జీవ దేవాచార్య రాజగురు త్రిలోచనాచార్య రత్నావళి లకుమారుడు .
ఈ ఇద్దరుకవులు గజపతి పురుషోత్తమ గజపతి ప్రతాప రుద్రుల ఆస్థాన కవులు .ఈకాలం లో ఒరిస్సాలో సంస్కృతం విరగ బూసింది .
జీవ దేవుని కుమారుడు జయదేవాచార్య పీయూష లహరి వైష్ణవ మతము అనే రెండు సంస్కృత నాటకాలు మధురంగా రాశాడు .ఈకాలం లోనే ధర్మ శాస్త్రాలపై రెండు అద్భుత గ్రంధాలు ‘’సరస్వతీ విలాసం ‘’ప్రతిపా అల0తం ‘’లను లాలా లక్ష్మీధర భట్టు ,రామకృష్ణ భట్టు రాశారు
269- జగన్నాధ వల్లభ నాటక కర్త -రాయ రామానంద
రాయ రామానంద గజపతి ప్రతాపరుద్ర దేవుని ఆస్థాన ఉన్నతాధికారి ఈయన జగన్నాధ వల్లభ అనే 5 అంకాల నాటకాన్ని అద్భుతంగా రాశాడు ..ఈకవి కృష్ణ లీలల పై ‘గోవింద వల్లభ ‘’నాటకమూ రాశాడు
రాయరామానంద మేనకోడలు మాధవి దాసీ చైతన్యమహా ప్రభు శిష్యురాలు ‘’పురుషోత్తమ దేవ’’సంస్కృత నాటకం రాసింది .ప్రతాపరుద్రుని కుమార్తె తుక్కాదేవి శ్రీ కృష్ణ దేవరాయలు పెళ్లాడింది .ఈమె ఎన్నో శ్లోకాలు రాసినట్లు జగన్నాధ మిశ్రుని ‘’రస కల్ప ద్రుమమ్ ‘’లో కనిపిస్తుంది .
270-కో సలానంద మహా కావ్య కర్త -గంగాధర మిశ్ర (1620)
17 వశతాబ్ది పూర్వార్ధ కవి గంగాధర మిశ్ర కోసలానంద మహాకావ్యం రాశాడు ఇందులో 21 కాండలు ,1200 శ్లోకాలున్నాయి . బలంగీర్ సోనేపట్ ,సంబల్పూర్ పాలకులైన చౌహాన్ రాజుల సంక్షిప్త చరిత్ర ఈ కావ్యం
271-ప్రబోధ చంద్రిక కర్త -వైజాల దేవ రాజు (18 వ శతాబ్దం )
చౌహాన్ రాజు వైజాల దేవుడు ప్రబోధ చంద్రిక అనే వ్యాకరణ గ్రంధం రాశాడు .కావ్య విశేషాలనుబట్టి వైజాల దేవుడు విక్రమాదిత్య మహా రాజు ,దేవేరి చంద్రావతిలకుమారుడు .ఇతనికొడుకు హీరాధరుడు .ఇతనికోసమే దీన్ని రాశాడు.
272-గీత ప్రకాశ సంగీత శాస్త్ర కర్త -కృష్ణదాస బోధ జేన మహాపాత్ర ( 1559
ఒరిస్సా కవి కృష్ణదాస బోధజేన మహాపాత్ర సంగీతంశాస్త్రం లో లోతులు ముట్టినవాడు ఒరిస్సా సంగీత విద్వాంసులకు ఆయన ఎంతగానో పరిచయమున్నవాడు .తన సంగీత జ్ఞానాన్ని ‘’గీత ప్రకాశం ‘’లో నింపి గొప్ప సంగీత శాస్త్రాన్ని రచించాడు .యితడు గజపతి ముకుంద దేవుని ఆస్థాన కవి . గజపతి ఈకవిని అక్బర్ దర్బార్ కు సంధి ప్రయత్నం కోసం పంపాడు .కవి మంచి స్నేహాన్ని కుదిర్చాడు .ఈకవి గురించి అక్బర్ ఆస్థానకవి అబుల్ ఫజల్ గొప్పగా పొగిడాడు ..మహా పాత్ర భారత దేశం లోని కవులలో సంగీతజ్ఞులలో సాటిలేనివాడు .అతని గీత ప్రకాశం లో అనేక రాగాల గురించి చాలా సోదాహరణంగా సంస్కృత కావ్యాలనుంచిసంస్కృత హిందీ ఒరియా భాషలలోని అనేక సంగీత గ్రంధాల నుంచి తానూ రాసిన వాటి నుంచి ఉదాహరించి వివరించాడు .అంటే ఆయన బహుభాషా పాండిత్యం తెలుస్తోంది ..
273- దశ గ్రీవ వధ మహాకావ్య కర్త -మార్కండేయ కవి చక్రవర్తి
మార్కండేయ కవి చక్రవర్తి ముకుంద దేవుని సమకాలికుడు .యితడు దశగ్రీవ వధ మహాకావ్యం ,ప్రాకృత సర్వస్వము రాశాడు .వీనిలో తన రాజు ముకున్దదేవుని ఘనంగా పొగిడాడు .ప్రకృత సర్వస్వము ను సాకల్య ,భరత,కొహల వరరుచి మొదలైన వారి గ్రంధాలను పరిశీలించి రాశానని చెప్పాడు .ఈ గ్రంధం పూరీలోని వీర ప్రతాపపురిలో రాయబడిందని తెలుస్తోంది .కవి కాశ్యపగోత్రికుడు తండ్రి మంగళ దేవుడని ఆనాటికవులలో మార్కండేయ కవి చక్రవర్తిగా గుర్తింపు పొందాడని ,రామాయణ కథనంతటిని దశగ్రీవ వధ మహాకావ్యం లో ని 20 సర్గలలో నిక్షిప్తం చేశాడని సరళ సుందరమైన రచన అని ,‘’విలాస వతి ‘’అనే శతకాన్ని కూడా రాశాడని తెలుస్తోంది . సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-6-17-కాంప్-షార్లెట్-అమెరికా
