సరస భారతి చే సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
పుష్యబహుళ పంచమి 25-1-2019 శుక్రవారం సంగీత సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా సరసభారతి 136వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సాయంత్రం 6-30 గంటలకు శ్రీ త్యాగరాజ స్వామి కి అష్టోత్తర పూజ ,అనంతరం సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో స్థానికి గాయనీ గాయకులు శ్రీ మతి విజయ ,(మ్యూజిక్ టీచర్ )శ్రీమతి గూడ మాధవి ,కుమారుడు ,శ్రీమతి పోపూరి పద్మజ ,శ్రీమతి వేమూరి సదాశివ, కుమారుడు మొదలగు వారిచే ”త్యాగరాజ పంచ రత్న కృతులు ”గానం నిర్వహింపబడుతాయి .సంగీత ,సాహిత్యాభిమానులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసినదిగా మనవి -గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-19-ఉయ్యూరు

