యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -27
శిష్యుడిని కృతార్దుడిని చేశాకే ఏదైనా గ్రహించాలి అని చెప్పి వేరే గురువేదైనా చెప్పాడా అని అడిగాడు .వృష్ణుని కొడుకు బర్కుడు నేత్రాలే బ్రహ్మ అన్నాడని చెప్పగా .మహర్షి నేత్రానికి నేత్రమే శరీరం. ఆకాశమే ఆశ్రయం .నేత్ర స్వరూప బ్రహ్మాన్ని సత్యంగా ఉపాసన చేయాలి కన్ను చూసిందే సత్యం కనుక అదే పరబ్రహ్మ .నేత్రబ్రహ్మనుపాసిస్తే అతడిని వదలదు .అతనితో సకలభూతాలు స్నేహం చేస్తాయి .ఈలోకంలో దేవుడిగా పూజింపబడి చనిపోయాక దేవత లో కలిసిపోతాడు .రాజు మళ్ళీ వేయి వృషభాలిస్తానన్నాడు .పాతమాటే మళ్ళీ చెప్పగా రాజు భరద్వాజ పుత్రుడు గర్ద భీతుడు శ్రోత్రమే బ్రహ్మమన్నాడని చెప్పగా మహర్షి ‘’శ్రోత్ర బ్రహ్మానికి శ్రోత్రమే శరీరం ,ఆకాశమే ఆశ్రయం .దీన్ని అనంతం అని ఉపాసించాలి .అనంతం అంటే దిక్కులే .శ్రోత్రం శ్రవణ బ్రహ్మోపాసకుడిని విడువదు .అందరి మైత్రి లభించి ఈ లోకం లోదేవుడిగా పూజ్యతపొంది మృతి చెందాక దేవతలో ఐక్యమౌతాడు .సంతృప్తి చెందినరాజు మళ్ళీ వెయ్యి ఎద్దులిస్తాననగా ,ఇంకెవరైనా ఏదైనా చెబితే వివారించమన్నాడు .జాబాలి అనే ఆమె పుత్రుడు సత్యకాముడు మనస్సు బ్రహ్మని చెప్పాడన్నాడు రాజు .మహర్షి ‘’మనో బ్రహ్మకు శరీరమే స్థానం .ఆకాశమే ఆశ్రయం. మనోబ్రహ్మాన్ని ఆనంద స్వరూపంగా భావించి ఉపాసి౦చాలి .ఆనందత అంటే మనస్సే.మనస్సు చేతనే స్త్రీని పొంది ప్రతి రూపమైన పుత్రుడిని పొందుతున్నాడు .ఆపుత్రుడే ఆనందానికి హేతువౌతున్నాడు .కనుక మనస్సు పరబ్రహ్మం .దీన్ని ఉపాసిస్తే మనసు విడిచిపోదు .ఈలోకంలో పూజ్యత దక్కి పరలోకం లో దేవత లో కలిసిపోతాడు .మళ్ళీ వెయ్యి వృషభాల కానుక రాజు ప్రకటించగా ,ఇదివరకటిమాటేచెప్పగా రాజు శాకల్యుడు హృదయమే బ్రహ్మ అని చెప్పాడనగా యాజ్ఞవల్క్యుడు ‘శరీరమే హృదయ౦ ఆకాశమే ఆశ్రయం .దాన్ని స్థితి అని భావి౦చి ఉపాసి౦చాలి .స్థితత అంటే హృదయమే .హృదయమే పరబ్రహ్మ హృదయోపాసకుని హృదయం విడిచి పెట్టదు .అతనితో సర్వభూతాలు మైత్రి తో ఉంటాయి ఈలోకం లో పూజనీయుడై మరణించాక దేవతలో ఐక్యమౌతాడు ‘’అని చెప్పగా మళ్ళీఏనుగుల్లాంటి వెయ్యి వృషభాలు కానుక గా ప్రకటించగా తనతండ్రి చెప్పిన మాట జ్ఞాపకం చేసి దానం గ్రహించలేదు యాజ్ఞవల్క్య మహర్షి ‘’.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-19-ఉయ్యూరు

