యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -31
జనకుడు మహా మేధావి అని గ్రహించి యాజ్ఞవల్క్యుడు ‘’పరమానంద స్వరూపమైన ఆత్మ స్వప్నం లో రమి౦చి చరించి ,పుణ్య పాపాలు చూసి ,తిరిగి బుద్ధాంతం చేత ప్రతి స్థానం పొందుతుంది .స్వప్నాంతం అంటే స్వప్న స్థానం బుద్ధాంతం అంటే జాగ్రత స్థానం .శరీరం ఊర్ధ్వ శ్వాసం వలన శరీరమైన ఆత్మ ప్రాజ్ఞాత్మచే అధిస్టించ బడి ధ్వని చేస్తూ ,వేరే దేహాన్ని పొందుతుంది .ప్రాజ్ఞాత్మ అంటే స్వయం జ్యోతి అయిన పరమాత్మ .ముసలితనం రోగాదుల చేత కృశించినపుడు జీవుడు అవయవాలు వదిలి వేరే శరీరం లోకి చేరుతాడు .కర్మఫలం తెలిసిన బ్రహ్మ స్వరూపుడైన జీవాత్మ కోసం పైలోకం లో ఎదురు చూస్తుంటారు .ఊర్ధ్వ శ్వాస లో మరణిస్తే సకల ప్రాణాలు ఆత్మను పొందుతాయి ‘’అనగానే జనకుడు ‘’ఏకాలం లో దేహాన్ని విడుస్తాడో చెప్పండి ‘’అని అడిగాడు .యాజ్ఞవల్క్యుడు ‘’మరణకాలం లో స్వయం ప్రకాశాత్మ మోహా మొహాలు లేనిదైనా, మోహం ఉన్నది అవుతుంది .వాగింద్రియాలు ఆత్మనుపొంది ,హృదయాకాశం లో ప్రవేశిస్తాయి .చాక్షుసు అంటే సూర్యాంశ స్వభావం కల పురుషుడు మరణకాలం లో అధిష్టాన దేవత అయిన అగ్ని మొదలైనవాటిని వాక్కు మొదలైనవి పొందగా విముఖుడై పరావర్తనం చెందినవాడు అవుతాడు .పురుషుడు ఇంద్రియ సముదాయం తో ఎకీ ఏకీభ వి౦చినపుడు చూడడు, వినడు, వాసన, రుచి కూడా చూడడు పలకడు స్పృశించడు అని ప్రాజ్ఞులు చెప్పారు ఇలా అన్ని ఇంద్రియాలు పరమపదం పొంది ,విజ్ఞానమయమైన ఆత్మతో కలిస్తే ,హృదయ రంధ్రం యొక్క ,జీవన నిర్గమ స్థానమైన నాడీద్వారం ప్రకాశిస్తుంది .అప్పుడు ఆత్మ బయటికి కన్ను ,శిరస్సు వగైరా లనుండి బయటకు వెడుతుంది .ఇలా విజ్ఞానమయ ఆత్మ లేచిపోయినపుడు ప్రాణాలు దాన్ని అనుసరిస్తాయి . ప్రాణాలు అంటే వాక్కు మొదలైన ఇంద్రియాలు .ఆత్మ కర్మా దీనం వలన స్వప్నం లో లాగా ,విశేషజ్ఞానం కలదై ప్రకాశించే దానినే పొందుతుంది .విద్యాకర్మలు పరలోకానికి వెళ్ళే ఆత్మను అనుసరిస్తాయి .విషయ ప్రజ్ఞ అంటే కర్మఫల రూపమైన వాసన కూడా అనుసరిస్తుంది .పూర్వ వాసనవలన మళ్ళీ పొందిన శరీరం లో ఆత్మభావన పొందుతుంది .ఉన్నదేహాన్ని వదిలి దాన్ని అచేతనం చేసి ,పిత్రియ ,గాంధర్వ ,దైవ ,ప్రాజా పత్య బ్రహ్మ లేక ఇంకేదైనా రూపం పొందుతుంది .ఇది పూర్వపు దానికంటే కొత్తగా శుభకరంగా ఉంటుంది ‘’అని చెప్పగా జనకుడు జీవుడికి బద్ధసంజ్ఞ కల ఉపాదులేవి ?అని అడిగాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-3-19-ఉయ్యూరు

