గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
436-మధురవాణి (17వ శతాబ్దికి పూర్వం )
17వ శతాబ్ది హరికవి రాసిన ‘’సుభాషిత హారావళి ‘’లో మధురవాణి శ్లోకం ఉదాహరి౦ప బడింది .కనుక ఆమెకాలం 17 వ శతాబ్దం పూర్వం అయిఉండాలి .1614లో త౦జావూరుపాలకుడు రఘునాధనాయకుని ఆస్థానకవి ,ఆయన రాసిన ‘’ఆంద్ర రామాయణం ‘’ను సంస్క్రుతీకరించిన మధురవాణి ఈమె అవునో కాదో తెలీదు.సంస్కృత సాహిత్యం లో అన్ని శాఖలపై ఆధిపత్యం ఉన్నట్లు కనిపిస్తుంది .కాలిదాస కుమార సంభవం హర్షుని నైషధం లను సంస్కృతం లో రాయటమేకాక స్వయంగా చంపు రాసిన ప్రతిభ మధురవాణి ది..ఉదాహరింపబడిన శ్లోకం లో భర్తను ఆరాదించని భార్య తర్వాత తప్పు తెలుసుకొని పశ్చాత్తాపత్తపపడటం ఉంది .స్త్రీ సహజ మనోభావాలను అర్ధవంతమైన కవిత్వం లో బంధించింది .
కులటోక్తి-‘’ఆకా రేణ శశీ గిరా పరభ్రుతః పారావత శ్చుం వనే –హంసక్షం క్రమనణే సమం దయితయా రత్యాం విమర్డే గజః
ఇత్యం భర్తరి మే సస్తయువాని శ్లాఘ్యై ర్గుణైః కించన –న్యూనం నాస్తి పరం వివాహిత ఇతి స్యాన్నేక దోషో యది ‘’
437-మదిరేక్షిణి
సుభాషిత సార సముచ్చయం లో మదిరేక్షిణి ప్రకృతి వర్ణన శ్లోకం ఉటంకి౦చ బడింది .ఇది వసంత శోభను తెలిపే శ్లోకం మిగిలిన అయిదు రుతువులపైనా రాసే ఉంటుంది .వికసిత తామరలు నీటిపైభాగానికి చేరటం సంరంభంగా భ్రమరాలు తేనెకోసం వాలటం కనిపిస్తుంది .కాలభారిణి లేక మాలభారిణి అనే అరుదైన వృత్తం లో రాసిన శ్లోకం ఇది .
వసంత సంధి –‘’అనుభూత చరేషు దీర్దికాణా ముపకంఠేషు గతగతైక తానాః
మధుపాః కథయంతి పద్మినీనా౦ సలిలే రంతరితాని కోరకాణి’’
438-మారులా (13వ శతాబ్దికి పూర్వం )
13వ శతాబ్దికి చెందిన కల్హణుని’’సూక్తి ముక్తావళి ‘’లో ఒకటి ,14వ శతాబ్దికి చెందిన ‘’సారంగధర పధ్ధతి ‘’లో మరొకటి మారులా రాసిన శ్లోకాలున్నాయి .కనుకకాలం 13శతాబ్దికి పూర్వం .ప్రేమగురించి రాసినవే ఈరెండూ .మొదటిదానిలో విరహంతో బాధపడే ప్రేయసి తలిదండ్రులకు తెలీకుండా ఒంటరిగా కూచుని ప్రియుడి ఎడబాటుకు విలపిస్తూ కడవలకొద్దీ కన్నీరు కారుస్తుంది .రాత్రివేళ పడుకున్న పక్కాంతా కన్నీటితో తడిసి ముద్ద అయిపోతుంది .కాని ఇంట్లో వాళ్ళు గుర్తించకుండా మర్నాడు ఉదయ౦ పక్కబట్టలను ను ఎండలో ఆరబెడుతుంది .రెండవ శ్లోకం లో ప్రేయసీ ప్రియులు మళ్ళీ కలిశాక ,ఆమె బక్క చిక్కి శాల్యావసిస్తాయై ,నీరసపడి అతనిపై శ్రద్ధ చూపలేకపోతుంది అతడు గమనించి ,అర్ధం చేసుకోగా ఆమె అతడి ఎదపై వాలి మళ్ళీ ఆనంద బాష్పాలు రాల్చి అతడి వస్త్రాలను తడిపేస్తుంది .కనుక మారులా గొప్ప భావుకత ఉన్న కవయిత్రి అనిపిస్తుంది .ధనద దేవ కవి ఈమె కవిత్వాన్ని మనసార మెచ్చుకున్నాడు .సంస్కృతం లో ఈ రెండు ప్రేమ శ్లోకాలను అత్యున్నత విలువకలవిగా విశ్లేషకులు భావించారు .విషాదాన్ని అద్భుతంగా పలికించే మందాక్రాంత వృత్తం లో వీటిని రాసి తన కవితా పటిమ చాటింది .
విరహిణీంప్రతి సఖ్యు క్తిః-‘’గోపయంతీ విరహ జనిత దుఖమగ్రేగురూణాం-కిం త్వం ముగ్ధే నయన విస్తృతం బాష్పపూరం రుణతాసి
నక్తం నక్తం నయన సలిలేరేషఆర్డ్రీ కృతస్తే-శయ్యోపాన్తః కథయంతి దశామాతపే శోష్యమాణః’’
విహరిణా౦ ప్రలాపః –‘’కృశా కేనాసి త్వం ప్రకృతిరియమంగస్య ననుమే-మలాధూమ్రా కస్మత్ గురుజన గృహే పాచకతయా
స్మరస్యస్మాన్ కంచిన్నహి నహి నహీ త్యేవమగమత్ –స్మరోత్కంపాం బాల మమ హృది నిపత్య ప్రరూదితా ‘’
439-మోరిక
మోరిక రాసిన నాలుగు శ్లోకాలు సూక్తి ముక్తావళి, సారంగధర పధ్ధతి సుభాషితావలి మొదలైనవాటిలో దొరికాయి .ఇవికూడా ఎడబాటు ,సందేశం,ప్రేమను చెప్పుకోవటం , కలయికలో ఆనందం అనే నాలుగు దశలలో ఉన్న ప్రేమగీతాలే . మారులా లాగా మోరిక కూడా అత్యున్నత ప్రమాణ కవిత్వమే రాసింది .ఈమెనూ ధనద దేవుడు మెచ్చుకున్నాడు .
వియోగిని అవస్త –‘’లిఖతిన గణయతి రేఖాం నిర్భార బాష్పా౦బు ధౌత గండతటా
అవధి దివసావసాన0 మా భూదితిశంకితా బాలా ‘’
శృంగార పధ్ధతి –‘’యామీత్యాధ్యవసాయ ఏవ హృదయేబంధాతునామాస్పదం –వక్తుం ప్రాణసమా సమాక్షమ ఘ్రుణేత్ధం కధంపార్యతే
ఉక్తం నామ తథాపి నిర్భర గలద్ బాష్పం ప్రియాయా ముఖం – హృస్ట్వాపి ప్రవ సంత్యహో ధనలవ ప్రాప్తి స్పృహా మాద్రుశం ‘’
440-నాగమ్మ
దక్షిణభారత దేశానికి చెందిన నాగమ్మ సూర్య స్తుతిశ్లోకం సారంగధర పద్ధతిలో ఉన్నది .అంతకు మించి వివరాలు తెలీవు .,
‘’శుక తుండచ్ఛవి సవిత్రు శ్చండరుచః పుండరీక వన బంధోః-మండల ముదితం వందే కుండల మాఖండ లాశాయాః’’
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-19-ఉయ్యూరు
—
