గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
441-పద్మావతి (17వ శతాబ్దికి పూర్వం )
హరిభాస్కరుని ‘’పద్యామృత తరంగిణి ‘’లో పద్మావతి రాసిన రెండు శ్లోకాలున్నాయి .హరిభాస్కర తండ్రి అప్పాజీ. తాత హరి .ముత్తాత 1676లో వృత్త రత్నాకరం వ్యాఖ్యరాసిన పురుషోత్తమ .1730లో పద్యామృతం వచ్చింది .వేణీదత్తుడు పద్యవేణిలో పద్మావతి వి 11శ్లోకాలు ఉదాహరించాడు .ఈమె గుజరాత్ కు చెందిన నాట్యకళాకారిణి .గౌరీ తోపాటు పద్మావతి కూడా ప్రతిభా సంపన్ను రాలు .పద్మావతి కవిత్వం రాజు ,పిసినారి ,దుష్టుడు లపై సాగింది .మనుష్యులు పశుపక్షాదులు ప్రకృతి పై కవితలల్లింది .తీసుకొన్న అంశాన్ని సానబెట్టి మెరుగులు తీర్చినట్లు రాసింది కనుక గొప్ప కవయిత్రిగా గుర్తింపు పొందింది. గౌరీ ,పద్మావతి లకవిత్వాలను తులనాత్మకంగా పరిశోధించారు .ఇద్దరూ సమానులే .కాని పద్మావతి శ్లేషకు పట్టాభిషేకం చేసింది .అలంకార శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసింది .జాతి మాత్రా ఛందస్సులను వాడింది .
రాజ వర్ణన –‘’హరిణ్యస్త్వరణ్యేగ్ర గణ్య౦-నృపాణా౦ యమాలోక్య లోలాక్షి గోలాః
కరే చారు చాపం గలే నీల చోలం-మృగానువ్రజంత౦ సమరం భావయంతి ‘’
కృపణ-‘’కాషే నిషణ్ణస్య చ బద్ర ముషే-ర్మిలంలుచా కార విభీషణస్య
ఆకారతః కేవలమస్తి భేదః –కృపాణకాస్యాపి దణానాకస్య ‘’
కచం –‘’కిం చారు చందన లతాకలితా భుజంగతః –కిం పత్ర పద్మ ముఖ సంవలితా ను భంగ్యః
కిం వానతేందు జిత రాకందు రుచో బిబాల్యః –కిం భాంతి గుర్జర వర ప్రమదా కచాల్యః ‘’
సింహం –‘’మన్యోసిమానమంజుల సింహ మృగేంద్ర ప్రచండ భుజదండ –యః ప్రేటదిగ్గజోద్వయ పల్ల రతో హింస నో హరిణాత్ ‘’’
ప్రభాత వేళ సంధ్యా –‘’ప్రభాత వేలా స్మరరాజపుత్రీ –నీరాజనా భాజనమర్క బింబం
ఆయాతి నీరాజితుమబ్ధి పుత్రీ – పాణౌ ’గృహీత్వాకిరతా౦సు బాలం ‘
442-ఫల్గు హస్తిని(8వ శతాబ్దికి పూర్వం )
8వ శతాబ్ది కాశ్మీరరాజు జయాపీడుని మంత్రి వామనుడి ‘’కావ్యాలంకార వృత్తి ‘’లోఫల్గు హస్తిని 2శ్లోకాలున్నాయి కనుక ఆమె అంతకు పూర్వకాలానికి చెందినదే . మొదటిశ్లోకం చంద్రోదయ వర్ణన .రెండవది వేదాన్తపరమైనది. సృష్టికర్త అందరినీ సృష్టించటం బాగానే ఉందికాని తనచేతులతో వారినే నాశనం చేయటం బాగాలేదని రాసింది .అలంకార శాస్త్ర వేత్త వామనుడే ఆమె శ్లోకాలను ఉదాహరించాడంటే ఆమె కవిత్వం లో ఏదో గొప్పతనం ఉందని అర్ధమౌతోంది.
‘చంద్రోదయం –‘’త్రినయనజటావల్లీ పుష్పం నిశావదన స్మితం –గ్రహకిసలయం సంధ్యానారీ నితంబనఖ క్షత౦
తిమిర భిదురం వ్యోమ్నః శృంగం మనోభవ కార్ముకం –ప్రతిపది నవస్యేందోర్బి౦బ౦ సుఖోదయమస్తునః ‘’
దేవ –‘’సృజతి తావదశేష గుణాకరం-పురుషరత్నమలంకరణం భువః
తదను తత్క్షణభంగికరోతి చే దహహకష్ట మపండితతావిధేః
443-రాజకన్యా
సారంగధర పధ్ధతి మొదలైన అలంకార గ్రంధాలలో రాజకన్యా శ్లోకాలు ఉదాహరణగా ఉన్నాయి .రాకుమారుడికి అతని ప్రేయసికి మధ్యజరిగిన సంభాషణ .తన తండ్రి హృదయం సింహం లాంటిదని దానికి ఏనుగు రక్తమే ఆహారమని అన్యాపదేశంగా చెప్పింది .రెండవ శ్లోకం ను సరస్వతి కంఠాభరణం ,రసగంగాధారం సాహిత్య దర్పణం పేర్కొన్నాయి .చంద్రకాంతిని చూడని కలువ జీవితం వ్యర్ధం .కలువ సౌందర్యాన్ని చూడని చంద్రుని జీవితమూ వ్యర్ధమే అంటుంది .
‘’అంగణంతడిదమున్మదద్రిప –శ్రేణి శ్రోణితవిహారిణో హరేః-
ఉల్లసత్తరూపా కేలిపల్లవాం –రల్లకీం త్యజతి కిం మతంగజః
పూర్వార్ధం తచ్చిత్తపరీక్ష కాయా రాజకన్యాయ –ఉక్తిఃఉత్తరార్ధం తదనురక్తస్యబిహ్లణస్య ‘’
444-రసవతి ప్రియంవద (16వ శతాబ్దం )
16వ శతాబ్దం లో బెంగాల్ లోని ఫరీద్ పూర్ లో రసవతి ప్రియం వద ఉన్నది .’’శ్యామ రహస్యం ‘’అనే అద్భుత భక్తికావ్యం శ్రీ కృష్ణునిపై రాసింది .కాని ఒకేఒక్క శ్లోకం లభ్యం
‘’కాలిందీ పులినేషు కేలికలనం కంసాది దైత్యద్విషం –గోపాలీభి రభిస్టుత౦ వ్రజవధూ నేత్రోత్పలైర్యర్చితం
బాహార్లంకృతమస్తకం సులలితైరంగః స్త్రిమ్భఃభజే
గోవిందం వ్రజసుందరం భవ హరం వంశీధరం శ్యామలం ‘’
445-సరస్వతి (10వ శతాబ్ది కి పూర్వం )
10వ శతాబ్ది భోజుని ‘’సరస్వతీ క౦ఠాభరణం ‘’లో పద్మావతి రాసిన రెండు శ్లోకాలున్నాయి .అనుష్టుప్ లో రాసిన మొదటిశ్లోకం లో ఉత్తమగుణసంపంనుడైన రాజు ముల్లోకాధిపతి కాదగినవాడు అన్నది .రెండవది వసంత తిలక వృత్తం లో మకరంద పేక్ష ఉన్న తుమ్మెద పుష్పాలకున్న ముళ్ళు ,మురికి దుమ్ము మొదలైన దుర్గుణాలను లెక్కచేయకుండా ఒక్క మకరందాన్ని మాత్రమె ఆస్వాదించి తన ‘’మేజేస్టి’’కాపాడుకొంటు౦ది .అలాగే ఉత్తములు ఉన్నతులు ఇతరులలోని లోపాలను ఎంచకు౦డా,వారిలోని మంచినే గ్రహిస్తారు అని చెప్పింది .రాజస్తుతి-‘’దేవ త్వమేవ పాతాలమాశానం త్వం నిబంధనం –త్వం చామర మరుద్భ్రమిరేకో లోకత్రయాత్మకః
కేతకీ –భ్రమర ‘’పత్రాణి కంటకసహస్ర దురాసదాని –వార్తాపి నాస్తి మధునే రాజస్యన్ధకారః
ఆమోదమాత్ర రసికేన మధువ్రతేన -నాలోకితాని తవ కేతకి దూషణాని’’
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-6-19-ఉయ్యూరు
