గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )-2
ఇప్పుడు వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కావ్యం లోరాణీ దేవకుమారిక కవితా ప్రాభవం చూద్దాం
మొదటి ప్రకరణ లోని వంశ వర్ణన –
1-‘’శివంసాంబ మహం వందే విద్యా విభవ సిద్ధయే-జగత్ సూతిహరం శంభు సురాసుర సమర్చితం ‘’
2-గుజ్జద్ భ్రమద్భ్రమరరాజ విరాజితాస్యాం-స్తంబే రామాననమహం నిరతాం నమామి
యత్ పాదపంకజపరాగ పవిత్రతానాం-ప్రత్యూష సమయైవ ప్రధమం ప్రయాన్తి ‘’
3-శారదా వస్తూ శరదంబుజ –స్వాననా మామ ముఖామ్బుజీ సదా
యత్ కృపాయుతకటాక్ష భాగయతో-భాగ్యలోపమయమేతి మానవః ‘’
4-‘’స భూయాద్ ఏకలింగేశో జగతో భూతయేవిభుః-యస్య ప్రసాదాత్ కుర్వన్తి రాజ్యం రాణాభువఃస్థిరం ‘’
5-‘’యదేకలింగం సమభూత్ పృధివ్యాం-తేనేక లింగో త్యభిదాభ్య ధాయి ‘’
చతుర్దశీ మాఘ భవాహికృష్ణా –తస్తాం సముద్రభూతిరాభూక్త్వస్య ‘’
6-‘’తదా సునీనాం ప్రవరస్త పస్వీ –హారేతనామ శివభక్త ఆసీత్
స ఏకలింగం విధివత్ సపర్యా -విధోరతోషిష్ట శివేషు నిష్టః
కావ్యం లో చివరి రెండు శ్లోకాలు –
‘’హరిశ్చ౦ద్ర నామాహి జన్మాభ్యభాగోత్ –ఇదం వైద్యనాదాస్టకంభక్తియుక్తః
ప్రభాతే పరేత్ స్తోత్రఏతన్నరోయోస్పనేవా భ్సితార్ధం ససిద్ధం లభేత్
‘’ఇతి దేవకుమారికా నామ రాజ మాతృహుత వైద్యనాధప్రసాద ప్రశస్తి ప్రతిష్టాప్రకరణం పంచాస్వం ‘’-సమాప్తేయం ప్రశస్తిః’’
468-సంతానగోపాల కావ్యకర్త –లక్ష్మీ రాజ్ఞి(19వ శతాబ్దం )
ఉత్తర మలబార్ పాలకులు కటత్తన్నత్తు రాజుల ఏకావలట్టుశాఖకు చెందిన లక్ష్మీ రాజ్ఞి సంతాన గోపాలకావ్యం రాసింది .45ఏళ్ళక్రితం రాసి 21ఏళ్ళక్రితం చనిపోయింది .19వ శతాబ్దం లో ఉన్నది .ఈమె ఇతరరచనలు అలభ్యం .రాజారవి వర్మపై ఉన్న అభిమానం తో అనారోగ్యం పాలబడినా రాసింది .ఇది మూడు సర్గల 130శ్లోకాలకావ్యం .భాగవతం ఆధారంగా రాసింది .
కధ-ఒక బ్రాహ్మణుడి8మంది సంతానం చనిపోతే చివరికి శ్రీ కృష్ణుని దర్శించి రెండుసార్లు మొరపెట్టుకొన్నా లాభం లేక9వ సంతానమూ నష్టమైతే , దారిలో అర్జునుడు కనిపించి వివరం తెలుసుకొని పదవ సంతానాన్ని ఎలాగైనా రక్షిస్తానని ,అలాచేయలేకపోతే అగ్నికి ఆహుతౌతానని అభయమిచ్చి,పదవ శిశువు ప్రసవానికి ఇంటిచుట్టూ బాణాలతో కోటకట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నప్పటికీ శిశువుజన్మించటం వెంటనే చావటం జరిగిపోగా, సంతాన శోకంతో ఉన్న బ్రాహ్మణుడు తిట్టని తిట్టకుండా క్షోభపెడితే అవమానం తో అర్జునుడు అగ్నికి ఆహుతయ్యే ప్రయత్నం చేయగా కృష్ణుడు ప్రత్యక్షమై నివారించి ,తామిద్దరం ఆ శిశువును వెతికి తెద్దామని బయల్దేరారు .
రెండవ సర్గ లో కృష్ణార్జునులు శ్రీహరి దర్శనం కోసం బయల్దేరి లోకాలోక పర్వతం దాటి హరిని దర్శించగా విషయం తెలిసి తనలోకం లో,తన దర్శన౦చేసినందున పునర్జన్మ ఉండదని చెప్పి శిశువులను తెచ్చి అప్పగిస్తాడు .మూడవ సర్గ లో బ్రాహ్మణుడు తాను కోల్పోయిన పది మంది సంతానం శ్రీ కృష్ణార్జున సాయంతో తిరిగి పొందినందుకు మిక్కిలి సంతోషించి అర్జునునికి ఆశీర్వాదం కృష్ణపరమాత్మకు నమస్కారం స్తోత్రం చేసి కృతజ్ఞత వెల్ల డించుకోవటం తో కావ్యం పూర్తవుతుంది .
కవయిత్రి లక్ష్మీ రాజ్ఞి మాతృహృదయమున్న మహిళ కనుక కురుక్షేత్ర సంగ్రామం లో కృష్ణార్జునులవలన నరసంహారం విపరీతంగా జరిగిందని దానికి తగిన ప్రాయశ్చిత్తం పొందాలని ,కురుక్షేత్ర విజయగర్వం ఎక్కువకాలం నిలవదనీ ,అందుకే కృష్ణార్జునులు హరిలోక సందర్శన చేశారని చెప్పింది .లక్ష్మి కవిత్వం సరళ సుందరం .మూడవ సర్గ ను యమకం తో యమహాగా రాసింది .ఆమెకు పౌరాణిక అనుభవం పుష్టిగా ఉంది .వసంత తిలక మాలిని ఉపేంద్రవజ్ర ఉపజాతి పుష్పితాగ్ర ,ద్రుత విలంబిత పృథ్వి,శిఖరిణి వృత్తాలను సందర్భోచితంగా ప్రయోగించింది .
సంతానగోపాలం లో లక్ష్మీ కవిత్వ విలసనం చూద్దాం –
మొదటిసర్గ ప్రారంభ శ్లోకాలు –
‘’ఆసీ చ్చూయా విజిత నిర్జర రాజాపుర్యా౦ –కయితుపురా ద్విజ కిల కృష్ణా పుర్యాం
సోయం స్వధర్మనిరతః సహధర్మపత్న్యా –రేమే సుఖం హరి పదాంబుజదత్తచిత్తః ‘’
చవరి శ్లోకం –‘’త్యజ విజయ విషాదం సంప్రతం సర్వమేవ –ప్రియ సఖ తరసా యాన్చితంసాధయిష్యే
ఇతి సుమధుర వాచాసాన్త్వయిత్వా తమేనం –కరతలమవలంబా ప్రస్తుతో వాసుదేవః ‘’
చివరిదైన మూడవ సర్గ ప్రారంభ శ్లోకం –
‘’అధ తదా హరి లోకవిలోకనా –తుదితతత్వ ధియామ ధనున్జయః
కృతహరి స్తుతి రంత మదోయిగద్-ద్విజగృహే లఖహే పురాముదం’’’
చివరిశ్లోకం –
‘’రోగా౦త రవివర్మ కుమారకస్య –జాతాదరేణ మనమా వచసి ప్రకామం
మౌఖ్యం సమప్యం విగ గాత్య కృతం మయేతత్-కావ్యం ముదా బుధవరాఃపరిశోధయన్తు
ఇతి తృతీయః సర్గః-సమాప్తం చేదం కావ్యం ‘’
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-6-19-ఉయ్యూరు

