ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -12

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -12

20వ శతాబ్ది సాహిత్యం -4

01914నుంచి 1945వరకు

సామాజిక విమర్శకులు

స్కాట్ ఫిట్జరాల్డ్ 1920లో రాసిన ‘’దిస్ సైడాఫ్ పారడైజ్ ‘’లో మొదటిప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో  అనేకులలో పెరిగిన నిరాశా నిస్పృహ ,నైతిక పతనం వర్ణించాడు .1925లో రాసిన ‘’ది గ్రేట్ గాస్బి’’నవలలో అమెరికా ప్రజలకిచ్చిన వాగ్దానాలు వాటిని నెరవేర్చలేక చేతులెత్తేసిన వైనం ,అమెరికన్ల కలలను నెరవేర్చటం లో పాలకుల వైఫల్యం చక్కగా వివరించాడు .తాగుడుకు బానిసలవటం వివాహాలువిచ్చిత్తి చెందటం వివరించాడు .1930లో  ఆ భావాలతో రాసిన నేకకథలు వ్యాసాలూ ,1934లో రాసిన తన ప్రతిస్టాత్మకనవల ‘’టెండర్ ఇన్ ది నైట్ ‘’లలో ఇవన్నీ ప్రత్యక్షం చేశాడు .సింక్లైర్ లేవిస్ అలాకాకుండా మంచి సాంఘిక విమర్శకుడైనకవిగా 1920లో రాసిన ‘’మెయిన్ స్ట్రీట్ ‘’లో ‘’విలేజ్ వైరస్ ‘’పై తీవ్రంగా దాడి చేశాడు .సాధారణ వ్యాపారస్తులవిషయం ‘’బాబ్బిట్ -1922,మెటీరియలిస్టిక్ సైంటిస్ట్ లపై ‘యారో స్మిత్ -1925,జాతి విద్వేషం పై ‘’కింగ్స్ బ్లడ్ రాయల్ ‘’-1947 లలో వాడివ్యంగ్య వైభవంతో దులిపిపారేశాడు .వీటిలో బాబ్బిట్ నవల మహా గొప్పదిగా ,21వ శతాబ్దానికి ప్రేరణగా నిలిచింది .ఇలాంటి డాక్యు మెంటేషన్ నే సెటైర్ తో దట్టించి జేమ్స్ టి.ఫార్రెల్ నేచురలిస్టిక్ భావజాలంతో ‘’స్టడ్స్ లో,అమెరికన్  ట్రయాలజి’’1932-35లో రాశాడు .దీనిలో 1920 లో చికాగో పరిసరాలలో దిగువ మధ్యతరగతి కుటుంబాల పెరుగుదల చక్కగా వర్ణించాడు.

 హార్లెం రినైసేన్స్ కాలం లో కధలు నవలలో రాడికల్ ఐడెంటిటిలోని ఐరనీ, మధ్యతరగతి నల్లజాతి వారి  దయనీయగాధలను ‘’నెల్లా లార్సన్ ‘’క్విక్లాండ్ -1928,పాసింగ్ -1929లో ,ఇన్ ది వేస్  ఆఫ్ వైట్ ఫోక్స్-1934 లో లాంగ్ స్టన్ హగ్స్ అద్భుతంగా చిత్రించారు .జీన్ టూమర్ రా సిన’’క్రేన్ ‘’-1923,రాచార్డ్ రైట్ రాసిన ‘’అంకుల్ టామ్స్ చిల్డ్రె  న్ ‘’-1938,నేటివ్ సన్-1940,బ్లాక్ బాయ్ -1945లో వర్ణించాడు .ఇవన్నీ నిప్పులతో మండే కణకణలాడే సాంఘిక నిరసనలే .వీరి రచనలలో డాస్టో వ్ స్కియన్ తీవ్రత ఉంది అమెరికన్ బ్లాక్స్ ల దయనీయ  స్థితి ఉంది .ఆంధ్రో పాలజిలో జానపదాల్లో  శిక్షణపొందిన జోరా నీలే హర్స్ట్ సన్’’దెయిర్ ఐస్ వర్ వాచింగ్ గాడ్ ‘’1937 తన బలీయైన ఫెమినిస్టిక్ నవల రాసి ,తాను పుట్టి పెరిగిన బ్లాక్ ఫ్లారిడా టౌన్ గురించి సంపూర్ణంగా కళ్ళకు కట్టినట్లు చూపించింది  .

  చాలామందిరచయితలు ప్రోలెటేరేనియన్ అంటే పేద శ్రామిక వర్గ నవలలలో  ధనిక వర్గాల పీడనం పై  రాశారు .ముఖ్యంగా నార్త్ కరోలినాలో గాస్టోనియలో టెక్స్ టైల్ వర్కర్ల స్ట్రైక్ పా విపరీతంగా రాశారు .ఫీల్డింగ్ బర్క్స్ ‘’కాల్ హోం  ది హార్ట్  ‘’గ్రేస్ లంప్కిన్ ‘’టు మేక్ మై బ్రెడ్ ‘’1932,రాశారు .శ్రామిక నవలలుగా జాక్ కాన్రాయ్ ‘’ది డిసెన్ హెరిటేడ్’’-1933,రాబర్ట్ కాంట్ వెల్’’ది లాండ్ ఆఫ్ ప్లెంటి’’-1934,ఆల్బర్ట్ హాల్పర్’’యూనియన్ స్వేర్ ‘’—1933,ది ఫౌండ్రి-1934,ది చూట్-1937,లు పైవానికి అద్దంపట్టేవి .డిప్రెషన్ కాలం నాటి ‘’బాటం డాగ్స్’’ అంటే దిగువ స్థాయి వారి గురించి కొందరురాశారు .వీరిలో ఎడ్వర్డ్ ఆండర్సన్’’హంగ్రీ మెన్’’  టాం క్రోమర్స్-వైటింగ్ ఫర్ నధింగ్-1935రాసినవిఉన్నాయి .  అప్పుడే పుట్టిన ఫెమినిజం రాడికల్ ఉద్యమం రాజకీయ భావాలున్న మహిళలకు ప్రేరణగా నిలిచి టిల్లర్ ఓస్లెం ,మెరిడలే స్క్వెయిర్,జోసెఫైన్ హీర్బెస్ట్ మొదలైనవారు రాశారు .

 నిరసన రచయితగా ప్రఖ్యాతి పొందిన డాన్ డోస్ పాస్సోస్ ప్రపంచయుద్ధానికి వ్యతిరేకంగా మొట్టమొదటి నవల ‘’త్రీ సోల్జర్స్ ‘’-1921లో రాశాడు .ఆధునిక సాంఘిక ,ఆర్ధిక విధానాలపై ‘’మాన్ హట్టన్ ట్రాన్స్ ఫర్’’-1925,యు.ఎస్.ఎ.ట్రయాలజి-ది42న్డ్అండ్ పారలల్ -1919,దిబిగ్ మనీ -1930-36,రాశాడు .కెమెరా ఐ ,న్యూస్ రీల్ ,మొదలైన వర్ణనాత్మక సృజనాలు అనేక వింత పాత్రలతో సంఘ౦పై దాడి చేశాడు .నథానియాల్ వెస్ట్-మిస్  లోన్లీ హార్ట్స్ 1933,కూల్ మిలియన్  ‘’-1934, ది డే ఆఫ్ ది లోకస్ట్ ,-1939,లో బ్లాక్ కామెడితో అదో జగత్ సహోదరుల దయనీయ ,అమానుష క్రూర దీన గాధలను చిత్రించారు .మాస్ కల్చర్ ,పాప్యులర్ ఫాంటసి తో రచయిత వెస్ట్ అమెరికా కలలుకన్నవన్నీ కల్లలైన  అత్యంత విషాదాన్నిడిప్రెషన్ కాలం లో సంఘం పై దాడిగా రాశాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-8-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.