రు౦గోళేశ్వర దేవాలయం –లద్దిగం

రు౦గోళేశ్వర దేవాలయం –లద్దిగం

చిత్తూరు జిల్లా పుంగనూరు కు నాలుగు కిలో మీటర్ల దూరం లో లద్దిగం గ్రామం లో ఒకే ఒక ప్రాకారం తో ఒకే ఒక ముఖ్యమైన ద్వారం ,చిన్న గోపురం తో ఇరుంగోళేశ్వర స్వామి దేవాలయం ఉన్నది .గర్భాగుడి లో  లింగం ,దానికినైరుతిలో ఒకటి ,  ఆగ్నేయంలో మరొకటి  మంటపాలున్నాయి .తూర్పుముఖ ద్వారం .

 గుడి వివరాలు తెలిపే శాసనాలున్నాయి .ఒకశాసనం చోళ రాజు  రాజరాజ దేవుడి 9వ ఏడు పాలనలో వేయించిందని భూరి దానం స్వామికి సమర్పించాడని ,వాడ పులినాదుకు చెందిన కోయరూర్ లోని ఇరున్గులేశ్వర ముదైయ నయనార్ దని తెలియ జేయబడింది .రెండవ శాసనం 14వ శతాబ్ది ఉత్తమ చోళ రాజు స్వామికి సమర్పించిన నిధి వివరాలు ఉన్నాయి మూడవ శాసనం విక్రమ చోళరాజు 9వ ఏటి పరిపాలనలో వేసిన దానిప్రకారం దేవాలయం ఉత్తమ చోళపురం లో ఉన్నది .నాలుగవ శాసనం రాజకేసరివర్మరాజు అనే కులోత్తుంగ చోళ దేవుడు తన 16వ ఏడుపాలనలో వేయించింది .దానిలో రణపతికొండ చోలమండలం లో పాలినాడు గ్రామాన్ని స్వామికి దానం చేసినట్లుంది .ఉత్తమ చోళపురం అనే కోరయ్యూర్ లో అరవాలన్ గంగైకొండ చోళుడు అనే ఇరున్గోలన్ నిర్మించినట్లు ఉంది .అయిదవ శాసనం కులోత్తుంగ చోళ దేవ రాజు 20వ ఏడు పాలనలో వేసింది .దనిలో దీపారాధనకు వలసిన ద్రవ్యం స్వామికి ఇచ్చిన వివరాలున్నాయి .

  దేవాలయ ద్వారం పై పద్మాలు లతలు,గజలక్ష్మి  చెక్కబడినాయి .ద్వారం పై భూతమాల ,దానిపై ముడుచుకొన్న కపోతం నాలుగు సింహలలాటాలు  ఉంటాయి .విమానం పై గల దానిపై ఇంద్రుడు .ఉత్తరాన వీరాసనం లో కూర్చున్న  బ్రహ్మ ,దక్షిణాన  వీరాసనం లో మౌన వ్యాఖ్యాన దక్షిణా మూర్తి ఒకపాదం అపస్మార పురుష రూపంగా ఉంటాడు .మంటపాలు స్తంభాలపై ఉంటాయి .మంటపానికి పడమర అమ్మవారి విగ్రహం నిలబడి పై చేతులలో పద్మాలతో ,కింది చేతులు అభయ ,వర ముద్ర లతో ఉంటుంది . గర్భాలయం  లో స్వామి ఉంటాడు .ఎదురుగా నంది మండపం లో నంది ఉంటాడు .గర్భాలయ౦ పై భూతమాల దానిపై కపాలం సింహ లలాటాలతో చెక్కబడి ఉంటాయి  .కప్పు చుట్టూ చిన్న చిన్న సింహాలు ఉన్నాయి .బ్రహ్మ దేవుడు కిరీట మకుటం తో ,మకరకుండలాలు రెండు గ్రైవేయకాలతో ,చేన్నవీర ఉదరబంధ ,యన్జోపవీత౦లతో పెద్ద గుండ్రని వలయం లో హారం మోకాళ్ళ దాకా తాకుతూ  ఉంటాడు .పడమర ద్వారా కొస్టం పై విష్ణుమూర్తి నిలబడి శంఖ చక్ర గద కిరీట మకుట ,మకర కుండలాలు ,మూడు గ్రైవేయకాలు ,యజ్ఞోపవీతం ,ఉదరబంధం,సింహలలాటాది హార  అలంకార శోభతో  కనిపిస్తాడు .దక్షిణ గోడ కొస్టం పై ఇరువైపులా జడలతో దక్షిణామూర్తి అక్షమాల తో పైరెండు చేతులలో అగ్నితో ,కింద చేతులలో అక్షమాలతో దర్శనమిస్తాడు .మకర చక్ర కుండలాలు  ఉంటాయి .ఈయనకు ఇరువైపులా కిందవైపు  గడ్డాలు పెరిగిన మహర్షులు ఇద్దరు  ఉంటారు .దీనిపై కొస్టం వింతగా ఉంటుంది .

  అంతరాలయం ఉత్తర గోడపై గణపతి ఉంటాడు .ఉత్తరాగోడ ఖాళీ గా ఉంటుంది .దీనికి దగ్గరలో చిన్న దక్షిణామూర్తి ఉంటాడు .గర్భాలయ విమానంపై గల శిఖర రాతికలశం మాత్రమె ఉంటాయి .దక్షిణాన దక్షిణామూర్తి పడమర యోగ నరసింహమూర్తి ,ఉత్తరాన బ్రహ్మ ,విష్ణువులు ఉంటారు .

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్-16-8-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.