ప్రపంచ దేశాల సారస్వతం     203-అమెరికాదేశ సాహిత్యం -16

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -16

20వ శతాబ్ది సాహిత్యం -8

01914నుంచి 1945వరకు

సాహిత్య విమర్శ -2

నైతిక –సౌ౦దర్యా రాధక విమర్శకులు

విల్సన్ ,బర్క్  లు కౌలీ లాగా మోర్టాన్ డిజేబెల్ ,న్యూటన్ అర్విన్ ,ఎఫ్ ఓమత్తీసన్ లు నైతిక సౌన్దర్యవాదుల ,సాంఘిక విమర్శకుల మధ్య సమతుల్యం సాధించే ప్రయత్నం చేశారు .విశ్లేషణ తోపాటు సృజనను అంచనాకట్టే ఉద్దేశ్యం ఉన్నవారు .రచయిత ఎలారాశాడు రచనను సాంఘిక నైతిక చట్రాలలో దేనిలో పెట్టచ్చు అనిఆలోచించారు .వీరిపై ఇలియర్ ప్రభావం కనిపిస్తుంది .దిసేక్రేడ్ వుడ్ -1920,దియూజ్ ఆఫ్ పోయెట్రి అండ్ దియూజ్ ఆఫ్ క్రిటిసిజం -1933లలో ఇలియట్ సాహిత్య భాషను గురించి చెప్పినా , సంస్కృతీ సాధారణీకరణ పై విస్తృతంగా విమర్శించాడు,నిర్ణయాలు ప్రకటించాడు .ఆయన ఎక్కువగా కవిత్వం చదివే వారిపై గొప్ప ప్రభావం చూపాడు .అలా ప్రభావితులైనవారిలోఇంగ్లాండ్ కు చెందిన ఐ.ఎ.రిచర్డ్స్ ,విలియం ఏమ్ప్సన్ ,ఎఫ్ ఆర్ లీవిస్ ,అమెరికాలోని న్యు క్రిటిసిజం సమర్ధించే వారు ఉన్నారు .వీరు కవులేకాక కల్చరల్ కన్జర్వేటివ్స్ గా ముద్ర ఉన్నవారు .ఇలియట్ తోపాటు సాహిత్య చరిత్రను తిరగరాసి ,రొమాంటిక్ శైలినీ ,అర్ధం కాని ఆధునికకవిత్వాన్నీ ,సాహిత్య నిర్మాణాన్నీ తీవ్రంగా విమర్శించారు.ఆర్ పి బ్లాక్ మూర్  ‘’దిడబుల్ ఏజెంట్ -1935,అల్లెన్ టాటే-రియాక్షనరి ఎస్సేస్ ఆన్ పోయెట్రి అండ్ ఐడియాస్ – 1936,ఆన్ కౌవే రామ్సన్ –ది వరల్డ్స్ బాడీ -1938,యోవార్ వింటర్ –మాలేస్ కర్స్ -1938,క్లీనత్ బ్రూక్స్ –ది వెల్ wrought అర్ లలో  ఈ ధోరణి కన్పిస్తుంది .తర్వాత వీళ్ళు సాంఘిక విషయాలను వదిలి రాసినందుకూ విమర్శకు గుఅరైయ్యారు .ఐతే సాహిత్యాన్ని అర్ధం చేసుకొని అభినందించటానికి ఈ న్యు క్రిటిక్స్ బాగానే తోడ్పడ్డారు .

   రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత

రెండుప్రపంచ యుద్దాలమధ్యకాలాన్ని విలియం కౌలీ ‘’అమెరికన్ రెండవ వికాస రచనాకాలం –సెకండ్ ఫ్లవరింగ్ ‘’అన్నాడు .నిజంగా అమెరికన్ సాహిత్యం కొత్త పరిపూర్ణత్వం 1920లోనూ 1930లోనూ పొందింది .మహామహా గొప్పరచయితల రచనలన్నీ 1945తర్వాత ముద్రణ పొందాయి .ఫాక్నర్ హెమింగ్వే అన్నేపోర్టర్ చిర్మస్మరణీయ ఫిక్షన్ సృష్టించారు .ఇవి వారి యుద్ధ పూర్వక రచనల స్థాయి నాణ్యతలతో సరితూగక పోయినా .ఇలియట్ వాలెస్ ,మూర్ ,కమ్మింగ్స్ ,కార్లోస్ ,గ్వెండోలిన్ బ్రూక్స్ ముఖ్యమైన కవిత్వాలను రాశారు .నాటక రచయిత యూజీన్ ఓ నీల్ –లాంగ్ దేశ జర్నీ ఇంటూ నైట్ ‘’నాటక౦ 1956లో ఆయన చనిపోయాక ప్రచురితమైంది .రెండవ ప్రపంచయుద్ధం ముందూ తర్వాత కూడా రాబర్ట్ పెన్ వారన్ ప్రభావ శీలా ఫిక్షన్ ,పోయెట్రి  విమర్శ ప్రచురించాడు .ఇతడి ‘’ఆల్ ది కింగ్స్ మెన్ ‘’అమెరికన్ గోప్పనవలలలో ఒకటిగా గుర్తి౦పు పొంది 1947లో పులిట్జర్ ప్రైజ్ పొందింది .మేరీ మెకార్దే సోషల్ సెటైర్ తో బాగా పాప్యులర్ అయింది .1960లో మొదటి సారిగా మెరిసిన హెన్రి మిల్లర్ ఫిక్షన్ సూటిగా సెక్సువాలిటీ ని చూపి ఆకర్షించింది .యుద్ధం తర్వాతే ముఖ్యులంతా బాగా రాశారు .కాపలాకాసే తత్త్వం లో మార్పు కనబడింది .యుద్దాన౦తరకాలం కన్జర్వేటివ్ లదే అయినా,బాగా చర్చలలో నలిగిన రచయితలలో టెన్నెసీ విలియమ్స్ ,ట్రూమన్ కాపోట్ ,పాల్ బౌల్స్ జేమ్స్ బాల్డ్విన్ లున్నారు .హోమో సెక్సువల్స్ ,బై ససెక్సువల్స్  వీరిలో ఉన్నారు .డార్క్ ధీమ్స్ ,ప్రయోగాత్మక విధానాలతో అల్లెన్ గీన్స్ బెర్గ్ ,విలియం బర్రోస్ ,జాక్ కేరౌక్ వంటి  ‘’బీట్ రైటర్స్ ‘’  కు దారి చూపించారు  .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.