’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-23

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-23

మొహ౦జ దారో- హరప్పా

1922లో మొహంజదారో హరప్పా ల త్రవ్వకాలను గురించిచదివిన రామచంద్ర వాటిని చూడాలని లాహోర్ నుంచి స్నేహితుడితో రైలులో రోహ్రీ లో దిగి అక్కడ సి౦ధు నదిపై ఉన్న రైలు వంతెన బెజవాడ కృష్ణ  రాజమండ్రి గోదారి రైలు వంతెనలకన్నా పెద్దదిగా ఉన్నా ,భయంకరంగా కనిపించింది హైదరాబాద్ లోని సింద్ దగ్గర స్నానఘట్టం లో స్నానం చేశారు .ఎవరైనా ఇక్కడే స్నానం చేయాలట .అక్కడ ‘’ముష్టిగ్రాహ్య స్తనులు ,వ్యామగ్రాహ్య స్తనుల’’వరకు ఆడవాళ్ళు తువ్వాళ్ళు కట్టుకొని స్నానం చేయటం చూసి ఆశ్చర్యపోయారు .ఇక్కడ  అంతే కంగారు పడక పవిత్ర సింధు స్నానం చేయమని చెప్పాడు మిత్రుడు

  స్నానం తర్వాత మొహ౦జొ దారో బస్సులో బయల్దేరారు కరాచీ తర్వాత హైదరాబాద్ సింద్ పెద్ద పట్నం .రోహ్రీజంక్షన్ దగ్గరే సుక్కూరు జలపాతం .కనిపించింది .ఇక్కడ మొహంజొదారోశిధిలాలను  వీళ్ళు’’ మొ-ఎన్-జో-దడో ‘’అంటారు .అంటే ‘’మృతుల దిబ్బ’’ అని అర్ధం ఇప్పటి పాకిస్తాన్ సింధు రాష్ట్రంలో లార్ కానా జిల్లా లార్ కానా పట్టణానికి పది మైళ్ళ దక్షిణాన ,దాదాపు యాభై మైళ్ళు పశ్చిమాన సింధు నది గట్టున ఉన్నది .ఇది  సింధు రాష్ట్ర రాజధాని కరాచీకి 320 మైళ్ళ ఉత్తరాన ఉంది . సింధు  నది గట్టు న  కొన్ని శిధిలాలున్నాయి .వీటిని పాత దిబ్బలు అనుకోని పురాతత్వ డైరెక్టర్ సర్ జాన్ మార్షల్1921-27కాలం లో మూడుమైళ్ళ వైశాల్యం లో త్రవ్వించాడు .వరుసగా ఏడెనిమిది దిబ్బలు .వీటిలో పెద్దవి దాదాపు ఏడు ఫర్లాంగులు ,చిన్నవి సుమారు రెండు ఫర్లాంగులు పొడవు ఉన్నాయి.సర్ జాన్ ఈ త్రవ్వకాల విశేషాలు వస్తువుల చిత్రాలతో సహా మూడు గ్రంధాలలో నిక్షిప్తం చేశారు .1927-31కాలం లో జే హెచ్ మాక్యే మరికొన్ని త్రవ్వకాలు జరిపించి పరిశోధనలు చేయించాడు .ఈ త్రవ్వకాలలో పెద్దపెద్ద ఇటుకలతో   కట్టిన గోడలు వాటికి ఆసరగాఉన్న గోడలు యజ్ఞ శాలలు కలప ,ధాన్యం భద్రపరచే కొట్లు,తీర్చి దిద్దిన వీధులు ,ఇళ్ళల్లోకి గాలీ వెలుతురూ బాగా వచ్చే ఏర్పాట్లు ,స్నానాగారాలు మరుగు దొడ్లు ,డ్రైనేజ్ కాలువలు బయట పడ్డాయి. సింధునది వరదలనుంచి పట్టణాన్ని కాపాడుకోవటానికి కోటలాంటి గోడ కట్టి ఉంటారు .వ్యవస్థిత నాగరకత కల ప్రజలు ఇక్కడ నివసించేవారని అర్ధమౌతోంది

   ఇక్కడ 2వేల మట్టి ముద్రికలు ,వాటిపై మేకలు ,ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఏనుగులు మొసళ్ళు ,దుప్పులు ,పెద్దపులులు జంతు రూపాలున్నాయి .ఒక ముద్రిక మీద ఎద్దు కొమ్ము లకిరీటం పెట్టుకొని  ,సింహాసనం మీద కూర్చున్న యోగి,ఆయన చుట్టూ క్రూర జంతువులు మూగిన  రూపం ఉంది .ఈముద్రికలనే నాణాలుగా వాడే వారని భావిస్తున్నారు.రకరకాల నగలతో మట్టి స్త్రీల విగ్రహాలు ,గొడ్డళ్ళు కత్తులు మొదలైన పదునైన కత్తులవంటి రేకులు ,స్పటి కాలు నీలాలు వంటి పూసల దండలు బంగారు గొలుసులు మొదలైన వెన్నో లభించాయి .ఇంటి సామగ్రి ,చిత్రాలున్న కొమ్ములు ,నల్లసిరా చిత్రాలు ,ఒక కొమ్మకింద వ్యక్తీ ,కొమ్మపై వేరొక పక్షి రూపాలు దొరికాయి .ఇవన్నీ మ్యూజియం లో భద్రపరచారు .రేపు హరప్పా దర్శిద్దాం .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-8-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.