అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -8

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -8

తిరువన్నామలై తాలూకా బోర్డ్ ఆఫీస్ గుమాస్తా టివి సుబ్రహ్మణ్య అయ్యర్ దైవభక్తి పరాయణుడు నిత్యం గాయత్రి జపం చేస్తాడు .శేషాద్రి స్వామిపై పరమ భక్తీ స్వామికీ ఆయనపై అమిత వాత్సల్యం . తాలూకా బోర్డ్ ప్రెసిడెంట్ ఇంటి వాకిలి అరుగుపై కూర్చుని అయ్యరు లెక్కలు చూస్తుంతాడు. ఆయనకు కాశీ వెళ్లాలని ఉండేది .ప్రెసిడెంట్ సెలవు ఇచ్చేవాడు కాదు .బోర్డు డబ్బు నొక్కేసి సెలవు అడుగుతున్నాడనే అనుమానం కూడా .ఒకరోజు స్వామి అటుగా వస్తూ ప్రెసిడెంట్ కు వినబదేట్లు ‘’ఒరేయ్ అరుగు మీద కూర్చున్నవాడు సాధు బ్రాహ్మణుడు

వాడికి అపకారం తలబెడితే నీ ఇంట్లో పీనుగు లేస్తుంది ‘’అని వెళ్ళిపోయారు .ఆమాటలు విన్న ప్రెసిడెంట్ వణికి పోయి ఏడు రోజులు జ్వరం తో మంచం పట్టాడు .ఒకరోజు స్వామి అయ్యరు తో ‘’వీడు నీకు ఏ ఉపకారం చెయ్యడు .కొత్త ఉద్యోగం వెతుక్కో .నీకు అపకారం చేస్తే వాడింట్లో శవం లేస్తుంది ‘’అని వెళ్ళిపోయారు .కొన్ని రోజులకు అయ్యరు తిరుచినాపల్లి లో ఉద్యోగం లో స్థిరపడ్డాడు .

  తిరువన్నామలై విద్వాంసుడు భానుకవి ‘’యోగం- యోగి ‘’అనే విషయం పై మాట్లాడాలనుకొన్నారు ఆయనకు ముందు ఇద్దరు మాట్లాడాలి .ఆ సభకు అధ్యక్షుడు చిదంబరం లోని మహామహోపాధ్యాయ దండ పాణి దీక్షితులు .ఆయన భానుకవి గురించి ప్రక్కవారితో ‘ఈయనెవరో యోగం యోగి పై మాట్లాడతాట్ట ఒక్కటి చాలదా ‘’అని గుసగుస లాడాడు .ఈ మాటలు విన్న భానుకవి ధైర్యం కోల్పోయి లేచి నిలిచి మాట్లాడే ప్రయత్నం చేశాడే కానీ మాట రావటం లేదు .ఆయన పస అలాంటిది అనుకొన్నారు శ్రోతలు ఇంతలో స్వామి అక్కడికి వచ్చారు .హమ్మయ్య అనుకోని మనసులోనే స్వామి పాదాలకు నమస్కరించి ప్రసంగం ప్రారంభించి అమోఘం గా న భూతో గా మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరచాడు. ఆ విజయాన్ని స్వామికి అర్పిస్తున్నట్లు పాదాభి వందనం చేశాడు కవి .

  పరశురామయ్యర్ కూతురు ప్రసవ వేదన పడుతోందని ,దక్కెట్లు లేదనీ చివరి చూపులు చూడటానికి రమ్మని  టెలిగ్రాం వస్తే  ఆందోళన తో  దాన్ని పట్టుకొని ఇలయనార్ కోవెలలో ఉన్న స్వామి సన్నిధికి చేరగా ‘’ఫోఫో భయం లేదు మీ ఆవిడను ఏడవవద్దని చెప్పు’’అనగా మనసు కుదుటబడింది అయ్యరుకు .రెండు రోజులత ర్వాత అమ్మాయి కులాసా కబురు తెలిసింది ..

  కాంట్రాక్టర్ కృష్ణస్వామికి తిరుక్కోవిలూరులో కాంట్రాక్ట్ పని .మధురాంతకం వెళ్లి ఏదైనా పనిలో చేరాలని ఉండి,స్వామిని అడిగితె ,’’అంత దూరం అక్కర్లేదు ఇక్కడే పని చూసుకో ‘’అన్నారు .కానీ ఆ మాటలు వినక రెండుమూడు చోట్లకు తిరిగి కుదరక మళ్ళీ వచ్చేశాడు ‘’స్వానుభవం అయితే కాని తృప్తి ఉండదు ‘’అన్నారట స్వామి .ఒకసారి కాంట్రాక్ట్ విషయం లో యేవో తప్పులు చూపి అతడిని దెబ్బతీయాలని ఉద్యోగులు భావిస్తే ,అతడు వీధిలోను౦చి పోతుంటే ‘’ఫోరా ఫో .ఆగకుండా పో ‘’అన్నారు .సరైన సమయం లో వెళ్లి అధికారుల ప్రశ్నలకు సంతృప్తిగా సమాధానాలు చెప్పి కాంట్రాక్ట్ కాపాడుకొన్నాడు .

  స్వామికి దగ్గర బంధువు కృష్ణస్వామి శాస్త్రులు మురుగన్ భక్తుడు ఒకసారి స్వామి దర్శనానికి వెడితే ఒళ్ళంతా విభూతిపూసి ముఖాన కుంకం పెట్టి ‘’కాశీ రామేశ్వర యాత్రలు చేసిరా ‘’అన్నారు .చేతిలో డబ్బు లేదని అంటే ‘’అన్నీ సమకూర్తాయిలే వెళ్ళు ‘’అన్నారు .ఇంటికి వెడుతూ దారిలో తెలిసినవాడికి చెబితే యాత్ర ఖర్చు అంతా తానే భరిస్తానని వందరూపాయలు చేతిలో పెట్టాడు .భార్యతో కలిసి యాత్ర పూర్తీ చేసి వచ్చిస్వామిని దర్శించగా ‘’నీకు ఇక అంతా మంచే జరుగుతుంది సంతానం , ధన ప్రాప్తి కలుగుతుంది ‘’అన్నారు .పిల్లలూ పుట్టారు ,కొన్న లాటరీ టికెట్ కు డబ్బూ బాగా వచ్చింది .

  ఒకరోజు స్వామి వీధిలో నడుస్తూ దారిలో ఉన్న రెండు రాళ్ళను తీసి రోడ్డు ప్రక్కపడేస్తే ,ఒక కుర్రాడు ఒక రాయి తీయగా స్వామి  వాడి చెంప  చెళ్ళు మనిపిస్తేవాడు ‘’స్వామీ ఈ ఏడు నేను పాసవుతానా ?’’అని అడిగితె నవ్వి తప్పకుండా అన్నారట .వాడు చదువులో మొండి అన్నిట్లో సున్నామార్కులే .కానీ వాడి ఆర్ధిక స్థితి చూసి పరీక్షాదికారులు ప్రమోట్ చేశారు .

  ఒక సారి స్వామి వేప చెట్టు కింద ఉండగా సూర్యనారాయణ అయ్యరు ‘’మిమ్మల్ని మహనీయులు అంటారు .మీ మహిమ నాకు చూపించండిస్వామీ ‘’అని అడిగితె  కిందరాలిన వేపాకు రేమ్మను తీసి తినమన్నారు .దాన్ని నమిల్తే మహా తియ్యగా ఉందట .ఇలా స్వామి మహిమలు కోకొల్లలు .

  స్వామి వైద్యమహిమలు

 తాండ్ర గ్రామం లో కృష్ణస్వామి భార్యకు పాండురోగం .ఒళ్ళంతా వాచీ , వాంతులలో  పురుగులు పడేవి .ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేక గుర్రబ్బండీ లో స్వామి దగ్గరకు తీసుకు వెళ్ళగా ‘’చూద్దాం ‘’అని బండీ ఎక్కి  ఆమె కాళ్ళు పొట్ట గొంతు నొక్కుతూ .ముందుకు జరిగి ,సత్రం వరకు తానె బండీ తోలి ,గబుక్కున దూకి రెండు దోసిళ్ళ మన్ను బండిలోకి విసిరి ,పిడికెడు మన్ను ఆమె నోట్లో పోశారు .మరో రెండు పిడికిళ్ల మన్ను ఇచ్చి మూడురోజులు వరుసగా ఒంటికి పూసుకొమ్మన్నారు .నాల్గవరోజు ఆమె మామూలు మనిషి అయింది .

  తిరువన్నామలై క్రిమినల్ ప్లీడర్  చ౦గల్వరాయుడు కొంతకాలానికి సన్యాసం తీసుకొన్నాడు ఆయన స్నేహితుడు శివ చిదంబరం పిళ్ళై కూతురికి టైఫాయిడ్ .వైద్యులు పెదవి విరిస్తే రాయుడికి చెప్పుకోగా ,ఇద్దరూకలిసి గుడిలో ఉన్న స్వామి దగ్గరకు వెళ్ళగా ‘’నాకు చెబితే లాభం లేదు ఆ విగ్రహానికి విన్నవించుకో ‘’అనగా రాయుడు ద్రావిడ భాషలోని వెంబా వృత్తం లో పద్యాలు మూడుసార్లు పఠించి,హారతి ఇచ్చి స్వామి దగ్గరకు రాగా ‘’పోపో సాయంత్రం లోపు నయమౌతుంది ‘’అనగా ,ఆసాయంత్రమే ఆమెకు సన్నిపాతం తగ్గిపోయింది .

  పిళ్ళై రెండవ కూతురికి వాంతులు విపరీతంగా అవుతుంటే స్వామి దగ్గరకు వస్తే ఉసిరికాయ మిరపకాయ కలిపి వాడితే తగ్గుతు౦దనగా  మూడేళ్ళ పసిపాపకు ఇదెలా సాధ్యం అని అడిగితె భస్మం చేసి ఇమ్మంటే ,ఇస్తే వెంటనే తగ్గిపోయింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.