తేటగీతి వీరభద్రేశ్వర శతకం
పగోజి కొప్పర్రు పద్య శతకకవి ,కడిమెళ్ళ వారి పుష్కల ఆశీస్సులున్న మధురకవి ,పండితుడు ,సరసభారతికి ఆప్తుడు ,మిత్రుడు శ్రీ మంకు శ్రీను తాజాగా ‘’రాసిన వీర భద్ర శతకాన్నే నేను ‘’తేట గీతి వీరభద్ర శతకం’’ అన్నాను అంతే .శివ కుటుంబం లోని వారిపై ఇప్పటికే రామలింగేశ్వర శతకం , రాజరాజేశ్వరిత్రిశతి వినాయక ,మయూరశతకాలు రాసేసి ఇప్పుడీ శతకం రాశారు .వీరభద్రోత్పత్తి ,దక్షయయజ్ఞ ధ్వంసం ,.పార్వతీ కల్యాణం ,కిరాతార్జునీయం శివభక్తుల చరిత్రల తో అల్లిన శతకం కనుక నేను పెట్టిన పేరు అతుకుతుంది .
వీరభద్రుని రౌద్ర భీభత్స భయానక హింసరచన ధ్వంస రచన ఇందులో బాగానే వర్ణించాడు కవి .‘’వీర భద్ర భీభత్స సంహార శీలి –వగు భవన్మహత్వము కొనియాడ దలచి –సంతరించితి నీ పైని శతకమొకటి ‘’అని వినయంగా చెప్పుకొన్నాడు .శతక మకుటం ‘’విశ్వ కళ్యాణ నిర్నిద్ర వీరభద్ర ‘’.ఉమా దేవి ‘’హిమగిరి వాసు ,సుందరాంగు –అహి విభూషణాది మధ్యంత రహితు –అభవు చిన్మయు నవ్యక్తుడైన శివుని ‘’చూసింది .అతనికి ‘’గాలి మేతరులెహారాలు’’. మంచి మాట .’’సిరిని కాదని శివుని మైసిరిని ,ఆయన విభూతినే ‘’కోరింది.ఆమె ‘’కాల కంధర సతి ,సుగుణాలవల్లి .
‘’మరుని విరితూపులకు విరామమ్ము లేదు-హరుని చిలిపి చైదములకు నడ్డు లేదు –ఉమ సరాగ సంపత్తికి నుపమ లేదు ‘’అలా సాగింది వ్యవహారం .ని౦ డుజాబిల్లి నేస్తం పండు వెన్నెల బంధువు ,ప్రణయ సంస్పర్శ వారికి బంధమయింది .ఉమా కల్యాణం అయింది .అల్లుడు అంటే మామ దక్షుడికి చులకన .అందుకే ‘’అజ్ఞుడౌ దక్షునకు శివుడు అల్లుడయ్యాడు’’ అన్నాడు కవి .యజ్ఞ స్వామిశివుని పిలవకుండా మామ యజ్ఞం ప్రారంభించాడు .’’తావిలేని పూవు ,శశిలేని రాత్రి లా ఆ యాగం ఉందట .కూతురికీ ఆహ్వానం లేదు .కానీ ఆగలేక పిలవని పేరంటానికి విభుడు వద్దన్నా వెళ్లి అవమానం పాలై ‘’దక్ష పుత్రి సతీ దేవి తనువు వీడింది ‘’.వార్త తెలిసిన’’ ఉగ్రుడుగ్రుడై తాండవం’’చేశాడు .ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నాడు –
‘’అది ప్రళయ కాల భీభత్సమది ,మహోగ్ర –నృత్య కేళీవిలాస వేణీకలాప –మదిప్రియ సతీ వియోగ ధర్మాగ్రహంబు ‘’గా భయం పుట్టిస్తోంది .కరుణ శ్రీ తన విజయశ్రీ కావ్యం లో ‘’అది యొక వీర భారత కులాంగన కంటి కవోష్ణ బాష్పబిం –దువులు ధరిత్రిపై గురియు దుర్భర దుస్సహ దుర్దినమ్ముల-య్యవి పది మందిలో ఒక మహా సతి పైట చెరంగు పట్టి ధ –ర్మువు దిగద్రావి రక్కసి ప్రభుత్వము లాగిన దుర్ముహూర్తముల్ ‘’ అనే పద్యం ఎందుకో నాకకు ఈ సందర్భంగా స్పురించింది .అది పాంచాలీ సతి పరాభవం .చివరికి కౌరవ హననానికి దారి తీస్తే ,ఇక్కడ శివుని సతి పొందిన అవమానం దక్ష వినాశనానికి దారి తీసింది .
లయకాలుడుశివ జటాజూటం నుంచి దక్షాధ్వర హంస రచనకు వీరభద్రుడు ఉద్భవించాడు .నీలదేహం వెయ్యి చేతులు,కపాలమాల దుర్నిరీక్షణ౦గా భీకరాకృతి తో భార్య భద్రకాళి తో కాలభైరవాదులతో శివాజ్ఞతో బయల్దేరిరాగా దిక్పతులు దిక్కులేక తలవంచారు .దక్షుని తలతె౦చేశాడు .విధ్వంస రచన పూర్తి చేయగా –
‘’గళములో సర్పమాడంగ ‘’కదిలి శివుడు వచ్చి’’సతిని ఎత్తుకొని జగాలు సంచలింప ‘’తాండవం చేసే ముక్కంటిని చూడటానికి ముక్కోటి దేవతలకు తరం కాలేదు .చక్రి వచ్చి చక్రం తోఆమే దేహాన్ని ఖండించగా అవి పడిన చోట్ల శక్తి క్షేత్రాలేర్పడ్డాయి .తనకు అప్పగించిన పని’’’’పట్టిస’’ ఆయుధం తో పూర్తీ చేసి వైరి కంఠ విలు౦ఠ న౦ చేశాడు .
తరువాత సతీదేవి పార్వతీ దేవిగా పుట్టటం శివుడి తపస్సు కు సాయం చేయటానికి తండ్రి హిమవంతుడు ఆమెను నియోగించటం .భావజును పూవు టమ్ములు భవునిపై ప్రయోగించగా మూడోకంటికి భస్మమవటం .పార్వతి శివుని భర్తగా పొందటానికి తీవ్ర శివ తపస్సు చేయటం ‘’ఆకులైనా తినకుండా అపర్ణ గా ఉండటం ,శివ పరీక్షకు ఆమె నిలబడటం శివ పార్వతీ కల్యాణం జరగటం ,వారిద్దరి శృంగారం కుమారస్వామి జననం ,అతడి తారకాసుర సంహారం మొదలైన విషయాలన్నీ రాసి,శాంభరీ భిల్ల, అర్జున పోరాటం పాశుపతాస్త్రం పశుపతి పార్దునికివ్వటం ,శివ భక్తులైన చిరుతొండనంబి, భక్త శిరియాళ తిరువెంగానాంచి మొదలైన కధలు వర్ణించి శివుని హాలాహాల భక్షణం ,శ్రీకాళహస్తి మహాత్మ్యం ,మార్కండేయుని కావటం మొదలైనవన్నీ పద్య తోరణంగా చెప్పారు కవి .తర్వాత నేటి సామాజిక సమస్యలు ఏకరువుపెట్టారు .
దొంగ రాముడు సినిమాలో ‘’వీరభద్రయ్య ‘’ను అంటూ మీసాలు మెలేసే రేలంగి దొంగలు పడ్డాక మీసాలు దించి ‘’వట్టి బద్రయ్య ‘’ నే అనటం గుర్తుండే ఉంటుంది .ఆంద్ర దేశం లో పోలవరం దగ్గర పట్టిస గ్రామం లో దక్ష సంహారం చేసిన వీరభద్రస్వామి అక్కడి గోదావరి నీటిలో తన ఆయుధం పట్టిసను కడిగి రక్తపు మరకలు కడిగేశాడనే ఐతిహ్యం ,.అందుకే ఆగ్రామం పట్టిస ఆ సీమ పట్టి సీమ అయి ఇవాళ కృష్ణా డెల్టాకు ఎత్తిపోతల ద్వారాతాగు సాగు నీరు లభిస్తున్నాయి .లేకపోతె కృష్ణా జిల్లా ఎడారి అయ్యేది .ఇదికూడా రాస్తే భేషుగ్గా ఉండేది అక్కడే గోదావరి మధ్యలో చిన్న కొండపై శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ౦ ఉందనీ కవి గారు మర్చిపోయినట్లున్నారు .ఆస్వామి తిరునాళ్ళు కూడా మహోత్స వంగా జరుపుతారు .ఇవి రాయకపోవటం లోపం అనను, అనలేనుకానీ పరిపూర్ణం కాదని చెప్పగలను .అందుకే దీన్ని వీరభద్రేశ్వర శతకం అన్నాను
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-21-ఉయ్యూరు
వీక్షకులు
- 1,119,894 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
- విలియం షేక్స్పియర్ జూలియస్ సీజర్లో, మార్క్ ఆంటోనీఅంత్యక్రియల ప్రసంగం (చట్టం 3, దృశ్యం 2) వాక్చాతుర్యంలో ఒక మాస్టర్ క్లాస్. అతను కుట్రదారులకుమద్దతుగా కనిపించడం ద్వారా ప్రారంభించి, రోమన్ సమూహాన్ని ప్రతీకార అల్లర్లకుప్రేరేపించడం ద్వారా ముగించాడు.A.I. ద్వారా పొందిన అనువాదం
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.20 వ భాగం.3.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,719)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
