ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్
1878లో జన్మించి 1957లో మరణించిన వలత్తోళ్ నారాయణ మీనన్ మలయాళకవిత్వానికి కొత్త రీతులు చూపిన ప్రముఖులలో ఒకడు .సంప్రదాయబద్ధమైన చదువు చదివి ,సంస్కృతం లో నిష్ణాతుడై వాల్మీకి రామాయణం, ఋగ్వేదం లను మలయాళభాశషలోకి అనువదించిన ప్రజ్ఞాశాలి .బధిరత్వం బాధించినా ,సాహిత్య సేవలో ,కథాకళీ నృత్యాన్ని పునరుద్ధరించటం లోనూ జీవితాన్ని ధారపోసిన త్యాగి .’’కళామండపం’’ స్థాపించి తన బృందం తో శాంతినికేతన్ ,రష్యా, చైనా ,ఫ్రాన్స్ లలో పర్యటించినవాడు .మహాత్మా గాంధీని గురువుగా భావించాడు .బ్రిటిష్ ప్రభుత్వ బహుమతిని తిరస్కరించిన స్వాతంత్ర్యాభి మాని..తనమాతృభాషను సుసంపన్నంచేసి దానికి చేయగలిగినంత సేవా చేసిన కాల్పనిక స్రష్ట అయిన సరస్వతీ మూర్తి .కేంద్ర సాహిత్య అకాడెమి సభ్యుడిగా సేవలందించాడు .1955లో ‘’పద్మ భూషణ్ ‘’అయ్యాడు .ఈ సాహితీ మూర్తి జీవిత చరిత్రను ఆంగ్లం లో బి .హృదయకుమారి రాస్తే, శ్రీ అవసరాల రామ కృష్ణా రావు తెలుగు సేత చేస్తే ,ముఖ చిత్రరచన ప్రముఖ దర్శకుడు సత్య జిత్ రే చేయగా , కేంద్ర సాహిత్య అకాడెమి 1977లో ప్రచురించింది. వెల రూ-2-50.
మళయాళ సాహిత్య పునరుజ్జీవనకర్తలు ,పాతకొత్తల మేలుకలయికతోక్రొత్త మెరుగులు తీర్చిన కవిత్రయం కుమారన్ ఆశాన్ ,వలత్తోళ్ రాయణ మీనన్ ,ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్ లు .వీరికవితలల్తో మలయాళకవిత్వం ఆధునిక మార్గం పట్టింది .ఈ ముగ్గురూ 1870ప్రాంతకవులే .’’వల్లత్తోళ్’’గా సుప్రసిద్ధుడైన నారాయణ మీనన్ 16-10-1878న మళయాళ బ్రాహ్మణ కుటుంబం లో దామోదరన్ ఎలాతూర్,కుట్టిప్పరమ్మ దంపతులకు ఉత్తర కేరళలోని పొన్నై తాలూకా చేన్నెర అనే పల్లెటూరిలో జన్మించాడు .ఇది వేట్టాడునాడ్ అనే స్వతంత్ర రాజ్యం లో భాగం .మళయాళ కవితా పితామహుడు తుంజతు ఎలుతప్పన్ ఇక్కడే పుట్టాడు .మలయాళం లో ప్రాథమిక విద్య పూర్తి చేసి ,ఆయుర్వేద వైద్యుడైన మేనమామ రాముణ్ణి మీనన్ వద్ద సంస్కృతం నేర్చి ,కావ్యనాటకాలు పూర్తి చేసి ,కైకలుంగార రామ వారియర్ అనే మహా సంస్కృత విద్వాంసుని వద్దమేనమామ ప్రోత్సాహం తో చేరి నిష్ణాతుడయ్యాడు. మేనల్లుడికి మేనమామ అప్పటికే ‘’అష్టాంగా హృదయం ‘’అనే భారతీయ ఆయుర్వేద మహా గ్రంథాన్ని బోధించేశాడు .కవిత్వం లో ప్రవేశం కలిగిన అతడితో శ్లోకాలు రాయించి ప్రోత్సహించాడు .ఇతని తండ్రికి కథాకేళి ఊపిరి,శ్వాస ,అన్న౦ ,నీరు .ఎక్కడ ప్రదర్శన జరిగినా తప్పకుండా వెళ్లి చూసేవాడు .ఈ ప్రభావం కొడుకుమీదకూడా బాగానే పడింది కవిత్వం తో బాటు .
13వ ఏట నే సునాయాసంగా సంస్కృత ,మళయాళ కవితలు రాసేవాడు .తల్లి చనిపోయినప్పుడు రాసిన విషాద గీతికలలో అతని పాండిత్యం ప్రస్ఫుటంగా కనిపించింది .20వ ఏట’’రుతువిలాసం ‘’ కాళిదాసుని కవితకు మళయాళఅనుసరణగా రాశాడు .ఇందులోకొన్ని పత్రికలలో అచ్చయ్యాయి .సాహితీ ప్రముఖుల ప్రశంసలు అందుకొన్నాడు ఈయువకవి .మహాపండితుడు పునస్సేరి నంపి నీలకంఠ శర్మ ,సమూరితి రాజ వంశానికి చెందిన ఎట్టన్ త౦పు రాన్ అనే కవిపోషకుడూ వలాత్తోళ్ ను మెచ్చుకొన్నారు .త౦పురాన్ సారధ్యం వహించే సాహితీసదస్సులలో ఉత్సాహంగా మనయువకవి పాల్గొనే వాడు .
ఆకాలం లో కేరళ భాగ్య సీమకాదు.రాజకీయ స్వేచ్చ తక్కువ .కానీ సంస్కృతం మాత్రం సంప్రదాయ బద్ధంగా జోరుగా వర్ధిల్లింది .ఎక్కడ చూసినా ,కవిపండితులే కనపడే వారు .రాజ్యాలు సంపదాతగ్గినా పాండిత్యాన్ని మాత్రం పోషించారు. రాజులు కూడా రసజ్ఞత కనిపెట్టగల దిట్టలు .సమర్దుడైనకవికి మంచి ప్రోత్సాహం లభించేది .పాఠకులు,శ్రోతలకూ తక్కువేమీ లేదు .ఈ వాతావరణం లో మనకవి నిలదొక్కుకొన్నాడు ప్రతిభా సామర్ధ్యం తో .
చిన్ననాటి నుంచి పరస్పరం ప్రేమించుకొన్న మేనమామ కూతురు మాధవి నే 23వఏట పెళ్ళాడిహాయిగా కాపురం చేశాడు .అప్పటికే చాలాపద్యాలు రాశాడు వైద్య గ్రంథ అనువాదాలు, దైవ ప్రార్ధనలు ,పురాణగాథలపై వర్ణణాత్మక పద్యాలురాశాడు .వైద్యం నేర్చినా వైద్యుడిగా ఉండిపోవాలనుకోలేదు .సాహిత్యానికే అంకితం అవ్వాలనుకొన్నాడు .మరి జీవనో పాధి ఎట్లా ?అదృష్టం తలుపు తట్టి తిరుచూరులో ‘’కేరళ కల్ప ద్రుమం ‘’అనేముద్రణాలయం లో నెలకు 30రూపాయల జీతం మీద మేనేజరు గా చేరాడు .మంచి ఉద్యోగం, ఆదాయమూ ఆకర్షణీయమే ,తీరుబడీ ఎక్కువే .పండాలం రాజు నడిపే ‘’కవన కౌమిది ‘’సాహిత్య పత్రిక ఆఫీసు అనుకోకుండా కల్పద్రుమం కి మారింది .ఆపత్రికకు బాగా సహాయపడ్డాడు మనకవి .తన రచనలూ అందులో పడే అవకాశమూ కలిగింది ..ఆ వూళ్ళో మిత్ర బృందమూ బాగా పెరిగింది .కున్జికుట్టన్ త౦పురాన్ , కుందూరు నారాయణ మీనన్ ,నాడువతు మోహనసంపూరితి,వాలియా రామన్ ఎలియాత్తి వంటి కవిపండితుల ఇళ్ళు సాహిత్య గోష్టులతో నిత్యకళ్యాణం ,పచ్చతోరణంగా ఉండేవి .వీరందర్నీ తన సహజ హాస్యం, కవితా స్పర్శతో తనవాళ్ళ ను చేసుకొన్నాడు .ప్రతి సాహితీ సభలో ఎలుత్తోళ్ ప్రసంగం ఉండి తీరాల్సిందే .అతని ఉపన్యాసం కోసం సాహితీ మూర్తులు ఎదురు చూసేవారు .అంతటి ప్రముఖుడయ్యాడు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-21-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,557 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

