హాస్యానందం
1-ఒక చిత్రకారుడు సుందర స్త్రీని త్రిభంగిమలో చిత్రించి మురిసిపోయి తన డాక్టర్ స్నేహితుడికి చూపిస్తే ‘’అపెండి సైటిస్ ‘’అన్నాట్ట .
2-కలెక్టర్ గారి భార్యను అత్తయ్యగారూ అంటావు ఎలా వచ్చింది ఆ వరుస ?
రెండోవాడు –నేను తాసిల్దార్ గారి భార్యను అక్కగారూ అని పిలుస్తా ..తాసీల్దార్ భార్య అక్క అయితే ,కలెక్టర్ గారి భార్య అత్తేగా ??అన్నాడు
3-ఒక అమాయకం భార్య భర్తకు ఉత్తరం రాసి చివర్లో ‘’మీకు అందకపోతే వెంటనే తెలియ జేస్తే , ,ఈవిషయాలన్నీ మళ్ళీ రాస్తాను ‘’అని రాసింది
4-చెట్టుకింద కొందరు సైనికులు వచ్చే పోయే వారిని ఆటపట్టిస్తున్నారు .ఇద్దరు కుర్రాళ్ళు ఒకగాడిదను నడిపించుకొని వస్తుంటే సైనికులు ‘’గాడిద అంటే అంత ప్రేమా మీకు ?’’అని హేళన చేశారు .ఆ కుర్రకారు ‘’దానికోకారణం ఉంది గురూలూ .దాన్ని వదిలేస్తే సైన్యం లో చేరిపోతుందని మా భయం ‘’అని రిపార్టీ ఇచ్చారు .
5-ప్లీడర్ దొరసామి మంచిహాస్యగాడు .ఒక సారి గుంటూరు వీధుల్లో నడుస్తుంటే ,ఒకప్లీడర్ గారిల్లు కనిపించి బయట బోర్డు మీద ఆయన పేరు చూసి,,లోపలి వెళ్లి ఆపేరుతో పిల్చాడు. ఇంటావిడ ‘’ఇంట్లో లేరండీ ప్లీడర్ గారు ‘’అంది .ఎక్కడికి వెళ్ళారని అడిగితె బెజవాడ వెళ్ళారని రెండు రోజులదాకా రారని చెప్పింది .దీన్ని హాస్యం తో కాష్ చేసుకోవాలని అనిపించి బెజవాడ వెళ్లి ఆప్లీడర్ కి ఒక ఉత్తరం రాస్తూ ‘’ప్రియా !మీరు నా దగ్గర ఒక్క రోజే ఉన్నారు .ఆ ఒక్కరోజే జీవతానికి సరిపడ ఆనందాన్నిచ్చారు .మళ్ళీ ఎప్పుడు వస్తారు ?మీ ప్రియురాలు ‘’శశి ‘’అని రాశాడు దొరసామి .ఆ ఉత్తరం ప్లీడర్ గారి భార్య చూసి ఆమె చేసేహన్గామా మనం ఊహించుకోవాల్సిందే .
6-ఒక సోషల్ మాస్టారు క్లాసులో అలేగ్జా౦డర్ జైత్రయాత్ర గురించి గంభీరంగా పాఠం చెప్పి చివరికి ‘’చివరికి అతడు ఏం చేశాడంటే ?అని అర్దోక్తిగా ఆపి సస్పెన్స్ సృష్టించాడు .అందరూ నోరు వెళ్ళబెట్టి గురువుగారు తర్వాత చెప్పేదాన్ని గురించి కుతూహలంగా ఎదురు చూస్తున్నారు .మాస్టారు ‘’అంతటి చక్రవర్తీ ఎవరికీ చెప్పకుండా ఢామ్మని చచ్చాడు ‘’అని ముగించాడు .
7-ఒక మంగలి ఒకాయనకు క్షవరం చేస్తుంటే గాట్లు పడి రక్తం కారుతుంటే బాధ మాన్పించటానికి ‘’బాబూ ఇదివరకు ఎప్పుడైనా మా షాపుకు వచ్చారా ??అని మాటల్లోకి దించాడు
ఆ ‘’క్షవరితుడు’’ ‘’లేదు ఆ చెయ్యి యుద్ధంలో తెగింది ‘’అని చెప్పాడు .ఇందులో మ౦గలి అసమర్ధత కనిపిస్తుంది .
8-ఒక ఊళ్ళో భూకంపాలు వస్తుంటే ఒకడు పిల్లలను స్నేహితుడింటికి పంపాడు .నాలుగు రోజుల తర్వాత ఆ తండ్రికిటేలిగ్రాం పంపిస్తూ ‘’నీ పిల్లల్ని నీ దగ్గరకే పంపిస్తున్నాను .భూ కంపాలను మా వూరు నుంచి తరిమేస్తున్నాను ‘’అని రాశాడు .ఎంతో అప్రియమైన సంగతిని అత్యంత సుకుమారంగా చెప్పాడన్నమాట
9-ఒకడు నాకు ఎపెంది సైటిస్ రెండు సార్లు తీశారు .వాడికి తెలీదు అది ఒకసారి తీస్తే మళ్ళీ రాదనీ.
10-ఒకడు న వజ్రాలు అరిగి పోయాయి అన్నాట్ట ,వజ్రాలు అరగటం జరగదని వాడికి తెలియదు .
శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-21-ఉయ్యూరు
