భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -10
మేయో సతి ‘రాసిన ’మదర్ ఇండియా ‘’లో భారతీయులను అనేక విధాల కించపరచింది .స్వపరిపాలనకు ఇండియన్లు పనికి రారు అని రాసింది .విదేశీయులే కాక మనవాళ్ళలో మహారాజ ధీరజ్ విజయ చంద్ మెహతాబ్ అమెరికా వెళ్లి ఇండియన్ల స్వాతంత్ర ఆశలు మంచివి కావని ప్రసంగాలు చేశాడు .జాతీయ శక్తులు తృణప్రాయం గా భావించాడు .విఠల్ భాయ్ పట్టుదల వదలని విక్రమాదిత్యునిలా భారత జాతీయత స్వరూపస్వభావాల గురించి అమెరికన్ లమనసులో ఘాటంగా నాటగలిగాడు .న్యుయార్క్ లో ‘’స్టేట్ హౌస్ ‘’శిఖరాలు ఆకాశం అందుకొన్నట్లు ఉండి’’సిటి ఆఫ్ స్కై స్క్రేపర్స్ ‘’అని పిలువబడింది .అక్కడ పటేల్ ను పై అంతస్తుకు తీసుకు వెళ్లి ,న్యూయార్కంతా చూపించగా ‘’ఇవన్నీ అద్భుతాలే కానీ నా దేశానికి వెళ్లి పూరి గుడిసెలో ఉంటూ నా దేశ స్వాతంత్రానికి కృషి చేసి మాతృ దేశ సేవ చేయాలని ఉంది ‘’అన్నాడు .అమెరికాలోనే కాదు ఎక్కడకు వెళ్ళినా పటేల్ ‘’బ్రిటిష్ వాడు స్వేచ్చాప్రియుడు .స్వాతంత్రం వాడి జన్మ హక్కు .కాని ఆసియావాసులకు స్వతంత్రం అక్కర్లేదని వాడి మూర్ఖ భావం ‘’అని కుండ బద్దలు కొట్టాడు .
విఠల్ భాయ్ కి అమెరికాలో ఒకసారి రేడియో ప్రసంగం చేసే అవకాశం వచ్చింది .అందులో –‘’అమెరికన్ ల స్నేహం సహాయం మాకు కావాలి .అమెరికా స్వతంత్ర దేశంకనుక బానిస దేశాలకు అండగా నిలిచి స్వాతంత్రం పొందటానికి సహాయపడాలి .అమెరికా ప్రభావం గొప్పది.పీడిత జాతుల అభ్యుదయానికి తోడ్పడాలి .అమెరికా జాతిపిత జార్జి వాషింగ్టన్ ఇక్కడే పుట్టాడు .వ్యక్తి స్వాతంత్ర్యంపక్షపాతి, బానిసత్వ నిర్మూలన చేసిన అబ్రహాం లింకన్ ఈ పుణ్య దేశవాసి .మీకూ బ్రిటిష్ వారికీ రక్త సంబంధం ఉంది. బ్రిటన్ లో సామ్రాజ్యత్వం జీర్ణించుకు పోయింది .దాన్ని మీరు హర్షించరు అని తెలుసు .వాళ్ళతో పోరాటం చేసే మీరు స్వాతంత్ర్యం పొందారు .అప్పటినుంచే మీ జాతీయ జీవనం మొదలైంది .ఆ దేశం పై మీకున్న అభిమానం కంటే ,మీ స్వాతంత్ర్య ప్రియత్వం గొప్పది .వారి విధానం ప్రపంచానికి శాపం .అది అంటు జాడ్యం. దాని బారినపడి, నా దేశం మహా క్షోభ పడుతోంది .ప్రపంచార్ధిక సంక్షోభానికి దాని విధానమే కారణం .మీ రెండు దేశాల ఐక్యతకు అట్టావా సమావేశం జరిగింది .అది యుద్ధ కౌన్సిల్ సమావేశంగా మారింది .అట్టావాలోనే యుద్ధం ప్రత్యక్షమైంది .
‘’మా నేత పరిశ్రమ, నౌకాపరిశ్రమాలు మూలపడ్డాయి .ఇప్పుడు మాది పూర్తిగా వ్యావసాయక దేశం అయింది .మంచి వ్యవసాయ పనిముట్లు మాకు లేవు .ఏడాదికి 20డాలర్ల ఫలసాయం కూడా రాని లక్షలాది ఎకరాల భూమి మాకుంది .బ్రిటిష్ డొమినియన్ లోకూడా మాకు అవమానమే జరిగింది .ప్రపచ దృష్టిలో మేమిప్పుడు ‘’అస్ప్రుశ్యులం ‘’. పౌరహక్కులు లేవుమాకు .ఆస్తి సంపాదించలేము .వలస దేశాలలోకి మమ్మల్ని తోలుకు వెళ్లి అక్కడ ఇళ్ళుకట్టటానికి ,వ్యవసాయానికి వాడుకొని పనులు అవగానే పంపించేస్తారు .బ్రిటిష్ డొమినియన్ లో భారతీయులకంటే ఇతర దేశీయులకే హక్కులు ఎక్కువగా ఉన్నాయి .మా గోడు వినే నాధుడే లేదు .జెనీవా ,అట్టావా,లండన్ రౌండ్ టేబుల్ సమావేశాలలో భారతీయ ప్రతినిధి ఉండడు.బ్రిటిష్ తాబెదారులే వెళ్లి బ్రిటిష్ వారికి అనుకూలంగా చిలకపలుకులు పలికి వస్తారు అంతే.మా దేశానికి వచ్చి మా కిటికీ లోంచి చూస్తె ,ప్రధాన ద్రవ్యాల ధరలు ఎందుకు తగ్గాయో తెలుస్తుంది .ఇండియా చూస్తె ,ఆసియా చూసినట్లే .సామ్రాజ్యవిధానం దరిద్రం తోపాటు వినాశనాన్ని మృత్యువును కూడా తెచ్చింది ‘’.
‘’ఒకప్పుడు మా దేశం మహా సౌభాగ్యవంతం .బ్రిటిష్ వాళ్ళు కాలుపెట్టినదగ్గర్నుంచి మాకు వచ్చిన ధననష్టం 30వేల మిలియన్ల డాలర్లు .మేము ఈర్ష్యతో పోరాటం చేయటం లెదు.ఆత్మగౌరవ౦, ,ఆత్మ వికాసం కోసం చేస్తున్నాం .మాస్వాతంత్ర్యం ప్రపంచ శాంతి భద్రతా లకు రక్షణ .’’అంటూ అవకాశం దొరికినప్పుడల్లా అమెరికన్ లకు భారత దేశాస్వాతంత్రావస్యకత ను గురించి డంకా బజాయించి చెబుతూనే ఉన్నాడు అమెరికాలో పటేల్ భాయ్ .ఇండియాకు స్వతంత్రం లేక పొతే ప్రపంచ శాంతి కూడా ఉండదని ఉద్ఘోషించాడు విఠల్ భాయ్ .
చికాగోలో ఐరిష్ అమెరికన్ ల సమావేశం లో మాట్లాడుతూ విఠల్ భాయ్ –‘’ప్రపంచ శాంతికి కృషి చేసే అవకాశం అమెరికాకే ఉంది .దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి .మొదటి ప్రపంచయుద్ధం తర్వాత బ్రిటన్ లక్ష చదరపు మైళ్ళ భూభాగాన్ని కొత్తగా సంపాదించింది .తన తప్పు తెలుసుకోకుండా, అమెరికాను ‘’షైలాక్ ‘’అంటోంది .ఇతర రాజ్యాలాక్రమణ ఆదేశాలమంచికే అని శ్రీరంగ నీతులు చెబుతోంది .ఐర్లాండ్ ,ఈజిప్ట్ ఆఫ్రికాలను కబళించింది .’’డీవేలార్’’మాత్రం బ్రిటన్ కు పంటికింద పచ్చి వక్కై కూర్చున్నాడు.భూమి శిస్తు తనకు ఐర్లాండ్ బాకీ ఉందని బ్రిటన్ గోలచేస్తోంది .’’బాగానే ఉంది ఒక నిష్పాక్ష విచారణ సంఘం ఏర్పరచి తేల్చండి ‘’అని డివేలార్ కోరాడు.దీన్ని తేల్చటానికి అమెరికా పూనుకోవాలి .నేను ఐర్లాండ్ లో పది రోజులు ఉండి డివేలరా,లేమాస్ ,కెల్లీ వంటి ప్రముఖులతో మాట్లాడాను .ఐర్లాండ్ లో మీరు చాలా అభి వృద్ధి సాధించారు .గవర్నర్ జనరల్ లేడు కనుక కప్పం కట్టక్కరలేదు .ఇంకో 18నెలలో మీకు బ్రిటన్ తో సంబంధం పూర్తిగా తెగిపోతుంది .ఐర్లాండ్ పూర్తిస్వతంత్ర దేశం అవుతుంది .తప్పదు .మేముమాత్రం ఇంకా బానిసబతుకులే బతుకుతున్నాం .రాబోయే ఎన్నికలలో ప్రజలంతా డీవేలేరా కు పూర్తి మద్దతు కూడ గట్టి ,ఐర్లాండ్ కు స్వాతంత్ర్యం సాధించు కొండి.
‘’అన్ని దేశాల వారూఆయుధ విసర్జన చేస్తేనే ప్రపంచశాంతి కలుగుతుంది .సామ్రాజ్య వాదం ఉంటె శాంతి చేకూరదు .పీడితులు శాశ్వతం గా పాలిత జాతికి లొంగి ఉండరు .వారు తిరగబడ కుండా ఉండటానికి వాళ్లకు ఆయుధాలే శరణ్యం కదా .ఎప్పటికైనా ట్రపోలి ,సిరియా ఫిలిప్పీన్స్ ,ఈజిప్ట్ ,మంచూరియాలు పాలకులతో పోరాటం చేస్తారు స్వతంత్రం సాధిస్తారు .ప్రపంచ శాంతి కావాలంటే బ్రిటన్ వంటి సామ్రాజ్య దేశాలు అమెరికా జపాన్ ఫ్రాన్స్ లు తప్పక ఆయుధ విసర్జన చేయాల్సిందే .ప్రపంచ వర్తకం పై గుత్తాధిపత్యం కోసం బ్రిటన్ పట్టుబట్టినంతకాలం ఇది జరగటం కష్టం .శత్రురాజ్య నౌకా సైన్యం తగ్గించాలని బ్రిటన్ కోరిక .85,000మైళ్ళ తీర రేఖను రక్షించు కోవటానికి దానికి సైన్యం కావాలని పట్టు బడుతోంది .అది ఆయుధ విసర్జనకు సిద్ధంగా లేదు .వాషింగ్టన్ సంధి పత్రం పై సంతకం పెడుతూ బ్రిటన్ ‘’బ్రిటిష్ సామ్రాజ్యానికి ముప్పు రాకూడదు .మా సామ్రాజ్యం లోఒక్క అంగుళం నేల పోయినా ఈ సంధి కి తిలోదకాలే ‘’ అని చెప్పిన మాట గుర్తుందా ?150ఏళ్లనుంచి బ్రిటన్ మమల్ని పాలిస్తోంది .దారుణ శాసనాలు తెచ్చారు .వారి అనుమతిలేకపోతే తుపాకి కూడా పట్టుకో రాదు .అంటే మా అందరితో బ్రిటన్ ‘’ఆయుధ విసర్జన చేయించింది అన్నమాట’’ .ఇండియాలో ఎప్పుడూ 60వేలమందిబ్రిటిష్ సైనికులు ఉండాల్సిందే.మాడబ్బు అంతా బ్రిటిష్ అధికారుల జీతాలపాలే .వైస్రాయ్ కి నెలకు 5వేల డాలర్లు .ఇది జీతం మాత్రమె దీనితోపాటు నాతం వగైరాలు ఎంతోచెప్పలేం .పెద్ద ఉద్యోగాలన్నీ వాళ్ళకే ధారాదత్తం .భారత దేశ సగటు మనిషి ఆదాయం రోజుకు 5 సెంట్లు మాత్రమె .దీని ఫలితం ఏమిటో మీరే ఊహించండి .300మిలియన్ల భారతీయులకు సంవత్సరం లో 8నెలలు పని ఉండదు.ఎప్పుడూ 10మిలియన్ల జనానికి నిరుద్యోగమే .రైతులపై పన్ను బాగా వేస్తున్నారు .87శాతం ప్రజలు వైద్య సౌకర్యాలు లేక చనిపోతున్నారు .సంవత్సరం కూడా నిండని శిశుమరణాలు 80శాతం .ఇండియాలో 40మిలియన్ల ప్రజలకు ఒంటిపూట భోజనమే .మీ రంతా నా పైనా, నా భారత ప్రజలపైనా చూపిన శ్రద్ధా విషయానికి కృతజ్ఞుడను ‘’అని ముగించి ,భారత దేశ యదార్ధ స్థితిని ప్రపంచ యవనికపై ఆవిష్కరించాడుమహా దేశభక్త విఠల్భాయ్ పటేల్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-11-21-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,459 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

