తాడిమళ్ళ రాజగోపాల శతకం
1913లో కాకినాడ శ్రీ వెంకటేశ్వర విద్యాసాగర ముద్రాక్షర శాలలో శ్రీ మంగు వెంకట రంగనాథ రావు గారివలన తాడిమళ్ళ రాజగోపాల శతకం ముద్రింపబడింది .వెల బేడ అంటే రెండు అణాలు . ‘’ శ్రీ తాడిమళ్ళ వాస –రాజగోపాల నీ పూజ తేజమయ్య’’అనేది మకుటం .
‘’శ్రీ కృష్ణు నెవ్వరు సేవింపు చుందురో వైకుంఠ పురమున వారు ఘనులు –కమలనాభుని చిత్తకమల౦బులొ నున్న వసుధలో మెలగెడు వాడు రాజు –ధనము మెండుగ గూర్చిధన్యులెందరు నైన స్వామి భక్తులతో సాటి రారు వారు –హరినామ కీర్తన లతి భక్తి జేసిన వారి దుష్కర్మముల్వదలి పోను –కలియుగంబున౦ దొనర్చు నఘ౦బులెల్ల –బాసి పోగాక వెంబడి బడియు రావు –కల్లగాదయ్య శ్రీ తాడిమళ్ళ వాస –రాజగోపాల నీ పూజ తేజమయ్య ‘’ అంటూ పద్యం తో శతకం ప్రారంభించాడు కవి .
గోపికలు గోపాలునిపై ప్రేమతో మసలుతున్నారు .’’ఎన్ని సోగసులుగలిగిన నేమి ఫలము –కలికి కృష్ణుడు వచ్చుట గాదె సొమ్ము ‘’అంటోంది రాధ .తనమన్మథ బాధను చెలులకు చెప్పి నల్లనయ్యను తనదగ్గరకు వచ్చేట్లు చేయమని ఒక చెలికత్తె కు చెప్పింది –‘’సొరిది కృష్ణుని దేవమ్మ సుందరాంగి ‘’.కృష్ణయ్యను తనకు కూర్చితే ‘’గుండ్లపేరు ,నాబన్న సరాలు ,పౌజులకమ్మలు ,ముత్యాలసరాలు మొదలైనవి కానుకగా ఇస్తానన్నది రాధ .’’పగతుడై మదను౦డు బాణములు సంధించి చురుచురుక్కున నేయ’’ జూస్తున్నాడట.వాటిని తప్పించుకోవటం తన తరం కావటం లేదట .’’వెడ విలుకాడు ‘’తన వెంట నంటి వేధిస్తున్నాడట .’’గడియ గడియకు వేష గాడ౦చు తెలియక ‘’వెర్రిగొల్లని కి ఏల వెలది నైతి ‘’అని బాధపడింది .మనసంతా రుక్మిణీ పతిని చూసి విసిగిపోయింది వేగంగా రమ్మని చెప్పమన్నది
‘’పడతిరో నాదు కౌగిలి పంజరముయన్ –జేర్చి’’ పుణ్యం కట్టుకో మన్నది .’’శేషాహిపై పడుకొంటాను అనే గర్వంతో ఉన్నాడు కాని గొల్లభామల ఇళ్ళల్లో దొంగచాటుగా తిరుగుతాడు అలాంటి వారు ఆయనతోపడుకోవటం చెల్లుతుందా చెప్పు అంటోంది. ‘’గొల్ల వానికి రాజకూతురు నియ్య మాతల్లి దండ్రులకు ధర్మం అవుతుందా ?’’పసులకాపరికీలాగు బడతి జేసి గూర్చే గద దైవంబు కుటిల బుద్ధి ‘’అని దైవాన్నీ నిందించింది ఆ దైవమె తన భర్త అని మరచిపోయి . నిందా గర్భం గా కృష్ణుని నిజాన్ని ఎండగడుతోంది –‘’తన తల్లి గుణములు దక్కించి చూచినా పుత్రుల గని చంపు పుణ్యశాలి –తన అక్క అయిదుగురికి భార్య అయిన గరిత-అన్నేమో దున్నుకు బతికెడి దుక్కి ముచ్చు’’అని ఇంటి గుట్టుకాస్తా బయట పెట్టింది .
రాధ చెలికత్తె తో ‘’పున్నమినాటి చంద్రునిగా సొగసుగా ఉన్నాననీ ,జిగివన్నె బంగారు చీర కట్టాననీ .బంగారు ఆభరణాలు రత్నాలతో మెరిసిపోతున్నాననీ ,అన్ని వేళలలో ఆయన్నే దైవంగా కొలిచేదానిననీ ,రాకపోతే ఒక్క నిమిషం కూడా బతక లేననీ ‘’దీనంగా మొరపెట్టుకొన్నది విరహిణి రాధ ..తన అధరామృతాన్ని తాగితాగి ఆన౦దించిన వాడికి తాను ఇప్పుడు విషం అయ్యానా అని దేప్పింది .
కృష్ణుని ఆనవాలు కూడా చెప్పింది అడగకుండానే చెలికి –‘’వేణువు దన చేత బూనువాడు –రహినొప్పుశంఖ చక్ర౦బులు గలవాడు ,శ్రీ వత్స లా౦ఛన మున్నవాడు,కస్తూరి తిలకం, చెవులకు రత్నకు౦డలాలున్నవాడు ,కమనీయ జీమూత కాంతి వాడు స్త్రీలతో నవ్వుతూ తిరిగేవాడు..వెన్నెలలో తన దగ్గర కూర్చున్నా ఒక్క ముద్దు కూడా ఇవ్వలేదట .గంధం పూస్తాను అంటే వద్దనేవాడు ,నోరారా తన్ను ఎప్పుడూ పిలిచినా పాపాన పోలేదట కొంటె కన్నయ్య .కర్పూర తాంబూలం ప్రేమగా చుట్టినోట్లో పెడితే మొత్తం తినేవాడే కాని కొరికి సగం తనకు ఎప్పుడూ పెట్టలేదట .సిగ్గులేకుండా చెట్టెక్కి ఆడవారు జలక్రీడలాడుతుంటే కొంటె చూపులు చూసి వలువలు ఎత్తుకుపోయినవాడట .దిసి మొలలతో బయటికి వస్తే చీరలిస్తానని మొండికేసినవాడట.ఇలాంటి కొంటె కోణ౦గిని ‘’మా తలిదండ్రుల మాట లాలింపక కుటిల బుద్ధిని గూడి, కోలుపోతి-వేగిర పడి నేను వేడుకొంటినిగాని, సవతి పోరు ఉంటుందని జడియ నైతి ‘’అని రోట్లో తలపెట్టి రోకటి పోటుల బాధ భరించినట్లు రాధ తన బాధ వెళ్ళబోసింది .ఇదంతా ఆమెకు కన్నయ్యపై ఉన్న ఆరాధనాభావమే. ఆపనులన్నీ ఆమెకు చాలా ప్రీతికరమైనవే లోకం మెచ్చేవే ఆయన్ను భగవంతునిగా ఆరాధించిన చేష్టలే అవి.
చివరికి ఆపద మొక్కులు మొక్కి౦ది రాధ –‘’దశరధ నందన ధాత్రీశ ,యచ్యుత దైతేయ హర మీకు దండమయ్య –గౌతమా౦గన శాప కలుషంబు బాపిన ధర్మాత్మ హరి మీకు దండమయ్య –వర నర వందన వారిధి బంధన దశ కంఠ సంహార దండమయ్య ‘’అని రాముడిని ,తర్వాత కృష్ణుడిని స్తుతించి ,’’చల్లగా వర్ధిల్లు సరస సద్గుణమణీ సౌభాగ్యమే నీకు సత్యభామ,నీవు కోరిన కోర్కెలు నిత్యముగను సఫలమాయెను ‘’అని మెచ్చి , క్షేమ సమాచారాలు అడిగి.మళ్ళీ మనసు కన్నయ్యపైకి మళ్లి ‘’ఏమిరా కృష్ణ ఎంత గర్వమురా పిలిచినపలుకవు పిరికి తనమా ??’’అని వాయించి కన్నయ్య చేసిన దొంగాటలన్నీ మళ్ళీ ఏకరువు పెట్టి ఉతికి జాడించి ఆరేసి అవతార పురుషుని లీలా విశేషాలు వివరించింది .
‘’ఆదికాలమునాడే అవతార మెట్టిన మత్ష్యావతారమహిమ ,చెప్పి అది హేయమైన అవతారమని దెప్పి ,కుటిలబుద్ధితో కూర్మావతార తాబేలు అవటం తప్పుకాదా ,పంది అవతారం ఎలా ఎత్తావయ్యా అని ఈసడించి ,నరుడు –సింహగా ,మరుగుజ్జు వాడిగా పుట్టటం ‘’వేషధారికి నౌ బ్రహ్మ వెర్రియగుచు ,అర్జునునికోసం కృష్ణావతారం ,అర్జున రధానికి కపి ధ్వజంగా హనుమంతుని పెట్టి పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని చంపించి అర్జునునికాపాడి,ద్రౌపదిని నిండుసభలో కాపాడి న పరమాత్మను నిండారా స్తుతించి ,పదేళ్ళ వయసులో గోవర్ధన గిరి ఎత్తి ,ఇంద్రుడు రాళ్ళవాన కురిపిస్తే గో,గోపాలరులన్దర్నీ ఆ గొడుగు కింద చేర్చి రక్షించి న బాలగోపాల లీలలు వర్ణించింది .రామావతారం లో సీతాపహరణం రావణాది రాక్షస సంహారం ,మళ్ళీ కృష్ణావతారాదిగాధలు చెప్పి చివరికి తనను ఆదుకోమని బతిమాలింది .
‘’జలధర దేహాయ శంఖు చక్ర గదాధరాయ మానిత భర్గాయతే నమోస్తు –పాలిత సుజనాయ భావజ జనకాయ ,దీనార్తిహరణాయ తే నమోస్తు –సామజ వరదాయ శాసిత దనుజాయ ,దేవకీ తనయాయ తే నమోస్తు –‘’అని ప్రణామము లొనరించియతని మదిని –గనికరము దోచునట్టుల గారవించి-తరుణ మిది యని తెలిసి –శ్రీ తాడిమళ్ళరాజగోపాలు దోడ్తేరె రమణు లార’’అని ముగిస్తూ కూడా రాధ హృదయబాధను తీర్చమని ఆర్తిగా కోరింది .
కమనీయ పద్య రచన ,సుమదురభావ జాలం ,మనోజ్ఞ శైలి,ఆకర్షించే కథా సంవిధానం ,విషయవివరణలో పట్టు తో శతకం బాగా రాణించింది ..తాడిమళ్ళ ఎక్కడ ఉన్నదో తెలియదు .ఆలయ చరిత్ర వివరంకూడా లేదు . ఒకసగటు మధ్యతరగతి స్త్రీ హృదయం ఆవిష్కరించి నట్లున్నది .తన పొరబాట్లు ,తెలిసీ తెనియని తనం ,సాటి వారిలో పలచన అయిపోతాననే భయం ,ధూర్త గోపాలుడే అయినా తనమనసు నిండా నిండిఉన్న తేజోమూర్తిగా ,ఆరాధనాభావం ఉన్న రాధను కవి మనోహరంగా మన ముందు నిలిపాడు భేష్ అనిపించాడు .రాజగోపాలస్వామి మహిమా లేదు ..’’రాధనురా ప్రభూ నిరపరాధనురా –అనురాగ భావనా రాదన మగ్న మానసనురా-కరుణి౦చరా’,కరుణి౦చరా ’అని కరుణశ్రీ పద్యాలు గుర్తుకు వస్తాయి . ఈ రాజగోపాల శతకం, కవి గురించి మనవారెవ్వరూ గుర్తించినట్లు లేదు . పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .
మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -19-11-21-ఉయ్యూరు ..
,
వీక్షకులు
- 1,107,559 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

