త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4 మను చరిత్రలోని ప్రవరాఖ్యుని శీలం ,రైనాల్డ్స్ నవలలోని లండన్ నగర బీదల వర్ణన హనుమంతరావు గారిని బాగా ఆకర్షించాయి .స్వామి వివేకానంద మలబారు హరిజనుల గురించి వ్యాసాలూ కదిలించి వేశాయి .విక్టర్ హ్యూగో రాసిన లే మిజరబుల్స్ అంటే బీదలపాట్లు ,లియోటాల్ష్టాయ్ రచనలు బాగా సంస్కరించాయి రావు గారిని .’’అప్ ఫ్రం స్లేవరి ‘’పుస్తకం చదివాక అమెరికా వెళ్లాలనిపించింది . .ఒకా నీగ్రో తన జాతిని ఉద్ధరించిన కథ ఇది .తాను కష్టపడి చదివివిద్యావంతుడై 1200 ఎకరాలభూమికొని ‘టస్కజీ ఇన్ ష్టిట్యూట్ స్థాపించి ,అనేక వృత్తి విద్యలు నేర్పి తనజాతిని ఉద్ధరించిన యదార్ధ గాధ ..’’వాట్ దెన్ మస్ట్ డు’’చదివాక సేవాధర్మం తో జీవితం ధన్యం చేసుకోవాలని పించింది .మంగిపూడి వెంకటేశ్వర శర్మగారి ‘’నిరుద్ధ భారతం ‘’చదివాక హరిజనోద్ధరణకోసం ఒక సంస్థ స్థాపించాలని కోరిక కలిగింది . నండూరి శేషాచార్లు పరమమిత్రులై సోదరునిలా రావు గారిని చూసుకోనేవారు .ఆయనతో మాట్లాడటానికి 1913లో మద్రాస్ వెళ్లి ,ఆయన మద్రాస్ మెడికల్ కాలేజిలో చదువు తుండగా కొన్నాళ్ళు ఉన్నారు ,అక్కడ దేశోద్ధారక కాశీ నాధుని నాగేశ్వరావు గారు గులాబీ రంగు రఫ్ కాగితం మీద ఆంద్ర పత్రిక వారపత్రిక పెద్ద సైజులో బొంబాయి ను౦చి ప్రచురించేవారు .దాన్ని మద్రాస్ లో దినపత్రికగా తెస్తున్నారన్న వార్త తెల్సి ,ఆయన మద్రాస్ వస్తే అపరభగవంతుడుగా ధన్వంతరిగా భావింపబడే పండిత దీవి గోపాలా చార్యుల వారింట్లో ఉంటారని తెలిసి ఆయుర్వేద కాలేజిలో పంతులుగార్నికలిసి తాను దేశాభిమాని పత్రికలో పని చేశానని చెప్పగా పత్రిక మద్రాస్ లో ప్రచురించే సమయం లో వచ్చి కలవమని చెప్పారు .1914లో పత్రిక మద్రాస్ లో ముద్రణ ప్రారంభించగా తెలిసి పంతులు గారిని కలవగా ,ఈయన తెనుగుసేతకు సంతృప్తి చెంది ,నెలకు 30 రూపాయల జీతం తో ఉద్యోగం ఇచ్చారు .కొద్దికాలం శ్రద్ధగా పని చేశారు .అద్దె ఇంట్లో పత్రిక వెలువడేది .తర్వాతతంబు చెట్టి వీధిలో బిల్డింగ్ ను వాయిదాలమీద ఆచార్యుల వారి పలుకు బడితో కొన్నారు .పత్రిక బాగా క్లిక్ అయింది .అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది .అప్పుడు శ్రీకోట౦ రాజు పున్నయ్య ,శ్రీ అవటపల్లి నారాయణ రావు గార్లు సబ్ ఎడిటర్లు .ట్రిప్లి కేన్ లో నెలకు పది రూపాయల బాడిగ తో ఒకగదిలో ఉంటూ రోజూ ఆఫీసుకు వెళ్ళివచ్చేవారు .పని వత్తిడి వలన జబ్బు చేసిసెలవుపెట్టి మంగళగిరి వెళ్ళారు . అమెరికా సుప్రసిద్ధ ప్రకృతి చికిత్సానిపుణుడురాసిన ‘’ది సుపర్బ్ వైటాలిటి ‘’పుస్తకం అమెరికా నుంచి తెప్పించి పూర్తిగా చదివి అందులో ఉన్నప్రకారం చేస్తే ఆరోగ్యం కుదుటబడింది .రోజూ పానకాలస్వామి గుడిమెట్లు ఎక్కగలిగినంత ఎక్కి స్వచ్చమైన గాలి పీలుస్తూ ,ఆతర్వాత పూర్తీ మెట్లు ఎక్కే బలం పొందారు .ఇంట్లో చల్లని నీటితో తొట్టి స్నానం చేసి ,గోధుమ రొట్టె కూరలు పండ్లు ఆవుపాలు తీసుకొంటూ బలం పున్జుకొన్నారు .సాయంకాలం తాడేపల్లి రోడ్డులో రెండు మైళ్ళు నడిఛి వచ్చి మళ్ళీ తోట్టిస్నానం చేసి భోజనం చేసేవారు రెండు నెలలో పూర్తీ ఆరోగ్యం పొందారు . సశేషం మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -24-12-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.