బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  – సూపర్ స్టార్ పైడి జయరాజ్

 బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  – సూపర్ స్టార్  పైడి జయరాజ్

ఈ తరం వారికి గుర్తు ఉండక పోవచ్చు కాని ,పాతతరం వారికీ జై రాజ్ లేక జయరాజ్ నటన బాగా గుర్తుండే ఉంటుంది .నటుడుగా ,నిర్మాత ,దర్శకుడుగా  హిందీ సినిమాలను కొన్నేళ్ళు శాసించిన  జైరాజ్ తెలుగు వాడని అసలు ఎవరికీ తెలియదు. ఆయనకూడా ఎప్పుడూ చెప్పుకోలేదు కూడా .అలాంటి విలక్షణ హిందీ హీరో అసలుపేరు పైడి పాటి  జయరాజ నాయుడు  .బాలీవుడ్ లో పైడి జైరాజ్ .వెడల్పైన ముఖం ,కాంతివంతమైన కళ్ళు, చక్కని నటన ఆజానుబాహు స్పురద్రూపం  , మంచి వాచకం జైరాజ్ ను హిందీ చిత్రసీమ అందలం ఎక్కించింది .

28-9-1909 లో తెలంగాణా కరీం నగర్ లో జైరాజ్ జన్మించాడు .సరోజినీ నాయుడుకు  మేనల్లుడు  .ఇతని అన్నలు సుందరరాజ నాయుడు ,దీన దయాళ్ నాయడు .

   నిజాం కాలేజిలో డిగ్రీ చదివి,అప్పటికే  తెలుగు నాటకాలలో  నటించి ప్రతిభ చాటాడు .సినిమాలో నటించాలన్న కోరికఉండేది .ఆ రోజుల్లో సినిమా వ్యాపారం లాభ సాటికాదు అని అందరి అభిప్రాయం . ఆతను తన కోరికను పెద్దలకు చెప్పగా వాళ్ళు వెళ్ళవద్దని  ఆంక్ష విధించారు.తన నిశ్చయాన్ని మార్చు కోకుండా  జయరాజ్ వారికి చెప్పకుండా  1929 లోఇంట్లోంచి పారిపోయి  బొంబాయి  చేరాడు .అప్పటికి తెలుగు సినీ పరిశ్రమ ఇంకా తప్పటడుగులు వేస్తోంది .అప్పటికే బొంబాయి లో ఏడాదికి 200 సినిమాలు రిలీజ్ అయ్యేవి .సంపన్న కుటుంబాలకు చెందినవారికి మాత్రమే అప్పుడు అక్కడ సినీ వేషాలు దక్కేవి .ఇంట్లో వాళ్ళు ఇతని సాహసానికి మెచ్చక   దాదాపు పాతిక ఏళ్ళు అతని గురించి పట్టించుకోలేదు .ఉత్తర ప్రత్యుత్తరాలే లేవు .ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాడు .చిన్న చిన్న కూలి పనులు చేశాడు .అన్నిటినీ మనో ధైర్యం తో  తట్టుకొని  నిలబడ్డాడు .తన ధ్యేయాన్ని నేరవేర్చుకున్నాడు .తొలితరం బాలీ వుడ్ నటుడుగా తెలంగాణా తెలుగు బిడ్డ విజయపతాకాన్ని ఎగర వేసి సూపర్ స్టార్ అయ్యాడు .

బొంబాయిలో డూప్లికేట్ స్టంట్ మాస్టర్ గా ముందు పని చేశాడు  .సెట్ లను అమర్చేవాడు .కెమెరా వాళ్లకు సహాయం చేసేవాడు  .  కాలం కలిసోచ్చి శారదా ఫిలిం కంపెనీ లో చేరి  అదే ఏడాది మూకీ చిత్రం ‘’స్టార్ కింగ్ యూత్ ‘’లో 19 వ ఏటనే  మొట్టమొదటగా నటించిన అదృష్ట వంతుడు జైరాజ్ .వెంటవెంటనే 11 సైలెంట్ సినిమాలలో నటించాడు. అందులో ‘’ట్రయాంగిల్ ఆఫ్ లవ్ ‘,మాతృభూమి ,ఆల్ ఫర్ లవర్ ,మహాసాగర్ మోతి,ఫ్లైట్ ఇంటూ డెత్ ,మై హీరో మొదలైనవి ఉన్నాయి .

  తెలుగు నాటకానుభవం, మంచి ఆకర్షణతో ఉన్న పర్సనాలిటి  జైరాజ్ కు బాగా తోడ్పడి ,అతనిని ఏ మాత్రం సంకోచించకుండా కత్తి వీరులైన ధీరోదాత్త రాజపుత్ర వీరుల ,రాజుల పాత్రలకు ఎంపిక చేసి నటింప జేశారు .1957 లో ‘’అమర్ సింగ్ రాధోడ్’’1859 లో ‘’పృథ్వి చౌహాన్ ‘’1960 లో ‘’మహారాణా ప్రతాప్ ‘’మొదలైన చిత్రాలలో హీరో వేషం వేసి అసలు వారంతా జైరాజ్ లాగానే ఉండేవారా అన్న౦తగా నటించి మెప్పించాడు .ఇవన్నీ సూపర్ హిట్ సాధించాయి .19 47 లో ‘’షాజహాన్ ‘’పాత్రలో గాంభీర్యం ఒలికించాడు .1959 లో ‘’టిప్పు సుల్తాన్ ‘’,1962 లో ‘’హైదరాలి ‘’సినిమాలలో లీడ్ రోల్స్ పోషించి  సెభాష్ జైరాజ్ అని పించుకున్నాడు .ఇంతటి వైవిధ్య పాత్రలలో నటించి తనకు సాటిలేరని పించుకొన్నాడు

   1947 నాటి ‘’సస్సి పున్నా ‘’,1956 ‘’హాతిం తాయ్ ‘’1963 ‘’చంద్రశేఖర ఆజాద్ ‘’1964 లో ‘’ దుర్గా దాస్ ‘’చిత్రాలు ఆయన కీర్తి కిరీటం లో కలికితు రాళ్ళు . ఆపాత్రలకోసమే ఆయన పుట్టాడా అన్నంత సహజం గా నటించాడు కాదు జీవించాడు .చారిత్రాత్మక, జానపద ,సాంఘిక హీరో పాత్రలలో తనకు సాటి లేరని పించాడు .

   ఆ తరం మేటి నటి’’ సురయా ‘’ తో 6 సినిమాలలో19 40 నుండి దశాబ్దం పాటు 1950 వరకు  నటించాడు .అందులో 1943 లోని ‘’హుమారిబాత్ ‘’1949 ‘’శింగార్ ‘’,అదే ఏడాది లో ’’అమర్ కహాని ‘’1951నాటి ‘’రాజపుట్ ‘’ ,1952లో రేషం’’చిత్రాలలో  సురయా ప్రక్కన హీరో గా నటించారు .ఆ రోజుల్లో ఆ ఇద్దర్నీ ‘’వెండితెర వేల్పులు ‘’గా భావించేవారు .1952 లోనే వచ్చిన  ’’లాల్ కున్వార్ ‘’లో సురయా తో  సెకండ్  హీరో గా చేశాడు .ఇంతటి నటనానుభవం ఉందికదా అని ‘’ ప్రసిద్ధ ఆంగ్లకవి టెన్నిసన్ రాసిన ఒక కవిత ఆధారం గా నటుడు భారత్ భూషణ్ హీరో గా ‘’  సాగర్ ‘’సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు .అట్టర్ ఫ్లాప్ అయి మళ్ళీ నిర్మాణం జోలికి పోకుండా బుద్ధిగా ఉన్నాడు . అతని నట జీవితంపై ఈ ఫైల్యూర్ ప్రభావం పడలేదు .హీరో గా దూసుకు పోతూనే ఉన్నాడు ,జైత్రయాత్ర సాగిస్తూనే ఉన్నాడు జయ రాజ్ .

  ఢిల్లీ కి  చెందిన పంజాబీ అమ్మాయి సావిత్రి ని కుటుంబ పెద్దలు కుదర్చగా పెళ్లి చేసుకొన్నాడు  .ఈ సంబంధాన్ని నాటి సాటిలేని మేటినటుడు పృధ్వీ రాజకపూర్ తండ్రి ఇరువైపులవారినీ సంప్రదించి కుదిర్చాడు .పృధ్వీ రాజ్ కపూర్ జైరాజ్ కు మంచి మిత్రుడు .అశోక్ కుమార్ తో సాన్నిహిత్యం బాగా ఉండేది .అంతర్జాతీయ సినీ నటులు రాబర్ట్ మోర్లీ ,జోస్ ఫెర్రెర్ లతో కలిసి పని చేసిన హీరో జైరాజ్ . అతడు అతి సునాయాసంగా చాలా భాషలు మాట్లాడే శక్తి సామర్ధ్యాలున్నవాడు .అందుకే భిన్నభాషల సినిమాలలోనూ రాణించాడు .ఇంగ్లీష్ ,ఉర్దూ లలో అమోఘ పాండిత్యం ఉండేది ఆయనకు ..మేనత్త నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు తో  మేనల్లుడు జైరాజ్ చాలా చనువుగా గౌరవంగా ఉండేవాడు ఆమెకూ అతనిపై అభిమానం జాస్తీ గా ఉండేది .జైరాజ్ సినిమా రంగం లోని చెడు పోకడలకు  చాలాదూరం గా ఉండేవాడు .భార్యను అమిత ప్రేమతో చూసేవాడు .వాళ్ళది అన్యోన్య, ఆదర్శ దాంపత్యం .ఇద్దరు కొడుకులు నలుగురు కూతుళ్ళు పుట్టారు.

1980 లో జైరాజ్ మొట్ట  మొదటిగా   ‘’దాదా సాహెబ్ ఫాల్కే ‘’అవార్డ్ పొందాడు . అంటే అక్కినేనికంటే ముందే ఫాల్కే అవార్డ్ పొందిన తెలుగు బిడ్డడు  జైరాజ్ .దురదృష్ట వశాత్తూ ఈ విషయాన్ని మనవాళ్ళు ఎవరూ అప్పుడు ప్రచారంచేయనే లేదు .తెలుగు వాడికి వచ్చిందని గర్వ పడనూ లేదు    .గుజరాతీ ,మరాఠీ ,హిందీ లలో మొత్తం  350 కి పైగా సినిమాలలో నటించాడు .హిందూలాల్ యాజ్ఞిక్ ‘’ది ప్రిజనర్ ఆఫ్ జెండా ‘’లో అతనికి మొదటి అవకాశం ఇచ్చాడు .ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేకపోయింది .ఇందులో మాధురి హీరోయిన్ .ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవటం తో   యాజ్ఞిక్ మరినాలుగు సినిమాలలో అవకాశమిచ్చాడు ..అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి హీరో గా రికార్డ్ సృష్టించాడు జై రాజ్ .1930 లో అతని పారితోషికం వంద రూపాయలు .అతని సినిమాలో పైన పేర్కొన్నవికాక  సూపర్ హిట్లు  సాధించి సూపర్ స్టార్ ను చేసిన సినిమాలలో ‘’షికారి ,మజ్దూర్ ,స్వామి ,పన్నా ,రాజ్ పుటాని,ముంతాజ్ మహల్ ,లాల్ కిలా ఉన్నాయి .స్వామి సినిమా తో దశ తిరిగి రెమ్యూనరేషన్ విపరీతంగా పెంచారు .ప్రఖ్యాత డ్రీం గర్ల్  దేవికా రాణి సరసన ‘’హమారీ బాత్ ‘’లో నటించాడు .ఇది మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయింది .మాధురి ,షకీలా  ,నటనకే భాష్యం చెప్పిన  మీనాకుమారి, శశికళ వంటి టాప్ హీరోయిన్స్ తో  కూడా నటించాడు .1950 నుండి 1960 వరకు జైరాజ్ సినీ జీవితం లో స్వర్ణ యుగం .156 చిత్రాలలో హీరోగా , 200 సినిమాలలోవిలన్ , కేరెక్టర్ యాక్టర్  కామెడీ యాక్టర్   గా చేశాడు ..జైరాజ్ 3 సినిమాలకు దర్శకత్వం వహించాడు . .అన్నీ కనకవర్షాలే కురిపించాయి .ప్రతిమా ,సాగర్ . మొహర్ సినిమాలు మూడూ  అద్భుత విజయాలు సాధించాయి . సాగర్ ,మొహర్ రెండిటిలో తన శిష్యుడు షమ్మీ కపూర్ కు హీరో గా అవకాశం ఇచ్చాడు జైరాజ్ .సోదరులు రాజ్ కపూర్ ,షమ్మీకపూర్ లు జైరాజ్ ను ‘’పాపాజీ ‘’అని గౌరవంగా సంబోధించేవారు .

 జైరాజ్ సుదీర్ఘ సినీ రంగ సేవకు 1980 లో ప్రతిష్టాత్మకమైన ‘’దాదా సాహెబ్ ఫాల్కే ‘’పురస్కారం అందుకున్నాడు ..ఫాల్కే అవార్డ్ అందుకున్న మొట్టమొదటి తెలుగు  నట దర్శక నిర్మాత జైరాజ్ గుజరాత్  మహారాష్ట్ర ప్రభుత్వాలు జైరాజ్ ను ఘనంగా సత్కరించాయి . దిలీప్ కుమార్ రెండవ సినిమా’’ప్రతిభ ‘’ కు డైరెక్టర్ జయరాజ్ అంటే మనకు ఆశ్చర్యమేస్తుంది .మధుర సంగీత సృష్టికర్త  నౌషాద్ ను వెండి తెరకు పరిచయం చేసింది జైరాజే .1913 లో దాదాసాహెబ్ ఫాల్కే మొదటి సినిమా తీసి రికార్డ్ సృష్టించాడు .జైరాజ్ బాంబే సినీ రంగ ప్రవేశం 1929 లో చేసి ఆయన పేరిట   ఉన్న అవార్డ్ ను 1980 లో పొందిన ఘనుడు జైరాజ్  .మన అక్కినేని రామారావు లు సినీ అరంగేట్రం చేయకముందే బాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన  వాడు జైరాజ్ .ఇంత గోప్పతెలుగు నటుడిని  మనవాళ్ళు మరచి పోయి అతని ఆనవాళ్ళు లేకుండా చేయటాని ప్రయత్నించినట్లు కనిపిస్తోందని సినీ విమర్శకులు అంటారు .తెలుగు సినీ చరిత్ర పుస్తకం లో అగ్రస్థానాన ఉండాల్సిన వాడిని ఇంతగా విస్మరించిన జాతి మనది .ఆయన శిలా విగ్రహం, ఆయన పేరిట పారితోషికం కూడా ఇవ్వని గొప్పమనసు మనది .  సినీకళాకారుల సంక్షేమం కోసం, మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన మానవతా మూర్తి జైరాజ్ .జాతీయ విపత్తులలో సర్వం కోల్పోయినవారి సహాయార్ధం సంగీత కచేరీలు నిర్వహించి అందజేసేవాడు

.జైరాజ్ చని పోవటానికి ఏడాది ముందే భార్య సావిత్రి  కేన్సర్ తో చనిపోయింది..  ఆమె మరణం అతని ఆరోగ్యం పై బాగా ప్రభావం చూపింది .తట్టుకోలేక పోయాడు .ఆతర్వాత అతని మరణం దాకా  తండ్రి బాగోగులు కూతురు గీత చూసుకొనేది .భార్యపై మమకారం ,బెంగ లతో జైరాజ్ 11-8-2000 న 91 వ ఏట మరణించాడు .అతని మనవడు అంటే ఈకూతురి కొడుకు ‘’రాజన్ షాహి’’ టి.వి. ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా మంచి పేరు పొందాడు .ఇతనొక్కడే జై రాజ్ కుటుంబానికి మిగిలిన ఏకైక వారసుడు .మిగిలిన వారంతా చనిపోయారు .

20 18 లో తెలంగాణా ప్రభుత్వం ‘’లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్ ‘’అనే డాక్యుమెంటరి ఫిలిం నిర్మించి ఈతరానికి పరిచయం చేసి,అతని శత జయంతిని ఘనంగా నిర్వహించి ఋణం తీర్చుకొన్నది .

కొసమెరుపు –హీరో,విలన్ ,కేరక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాలలో నటించి నిర్మాత దర్శకుడిగా ప్రాభవం పొందిన జైరాజ్ యెంత సంపాదించాడో, .డబ్బుతో ఎన్నో బంగళాలు  ఇళ్ళూ, స్థలాలుకొన్నాడో ,  బ్యాంకుల్లో  యెంత డబ్బు మూలుగుతోందో ఆయనకే తెలియదు .అంతటి సంపన్నుడు .ఆ తరం లో కుబేరుడే .’’మనీ మేనేజ్’’ మెంట్ పై అసలు దృష్టి పెట్టలేదు సంపాదించింది పధ్ధతి ప్రకారం కొడుకులకు, వారసులకు ఇవ్వ లేకపోయాడు .దీనితో కొడుకు  లిద్దరిదీ ఇస్టా రాజ్యమై పోయింది .అందినంత బొక్కేశారు.వ్యసనాలకు బానిసలై  ఉన్నదిఅంతా ఊడ్చేశారు .చివరికి మిగిలిన ఒకే ఒక్క ఇల్లు ను కూడా కొడుకు కోడలు ఆక్రమించి ఆయన్ను ఒక చీకటి గదికే పరిమితం చేసి,మానవత్వం మరచి ప్రవర్తించారు .అతనికి కట్టుకోవటానికి సరైన బట్టలే ఉండేవి కావట .తిండీ తిప్పల సంగతి ,ఆరోగ్యం విషయం అస్సలు పట్టించు కోకుండా గాలికి వదిలేశారు ఒకప్పటి ఆసూపర్ స్టార్ జైరాజ్ ను.తప్పని సరి పరిస్థితులలో గత్య౦తరం లేక కూతురు గీత కు ఫోన్ చేస్తే ఆమె వచ్చి ,ఇక్కడి పరిస్తి  స్థితులకు బిక్క చచ్చి తండ్రి దీనావస్థ కు పరిష్కారం గా అన్నావదినలను ఇంటినుంచి గెంటేసి  ఇంటిని స్వాదీనంచేసుకొని  ,విషయాలను  చక్క దిద్ది  తండ్రి బాగోగులు చూస్తూ ఊరట కల్గించి ,తండ్రి తరఫున వాళ్ళపై కోర్ట్ లో కేసు వేసింది.ఒక రోజు కోర్టు లో జైరాజ్ జడ్జి గారితో ‘’నన్ను నా ఇంట్లో ప్రశాంతంగా మరణించే అవకాశం కల్పించండి ప్లీజ్ ‘’అని దీనంగా వేడుకొన్నాడు .కోర్టు అన్నికోణాల్లో పరిశీలించి జైరాజ్ కు న్యాయం కలిగించి ,ఆ ఇల్లు  ఆయన కే చెందుతుందని తీర్పు ఇచ్చింది .ఎంతటి హీరోకు ఎంతటి పరిస్థితి ?దైవ లీలలు చిత్రాలే కానీ మనం కూడా మన విషయాలలో జాగ్రత్తగా ఉండక పొతే ఇలాంటి పరిస్థితులే వస్తాయిఅని అందరూ గుర్తించాలి .అతని జీవితం అందరికీ అన్ని విధాలా గుణ పాఠం  .

  మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-18 –ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆచార్యులకే ఆచార్యుడైన ప్రకృతి జన్యు  రసాయన శాస్త్రవేత్త –ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు

ఆచార్యులకే ఆచార్యుడైన ప్రకృతి జన్యు  రసాయన శాస్త్రవేత్త –ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు

12-2-1916 పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు గ్రామం లో శ్రీ లక్కరాజు రామచంద్ర రావు జన్మించారు .తండ్రి శ్రీ వెంకట రామయ్య .ఆంద్ర విశ్వ విద్యాలయం లో చదివి బి .ఎస్ .సి .ఆనర్స్ ,ఎం .ఎస్. సి. పాసైనారు .1939 లో ఇక్కడే రసాయనిక శాస్త్ర డిమాన్ స్ట్రేటర్ గా  ఉద్యోగం ప్రారంభించారు .1943 లో మైక్రో అనలిస్ట్ గా పదోన్నతిపొందారు .1946లో డి .ఎస్. సి .డిగ్రీ పొంది లెక్చరర్ అయి యూని వర్సిటీలోనే రిటైరయ్యారు  .

కొన్ని మొక్కలలో వర్ణ ద్రవ్యాల రసాయనిక పరిశీలనం ( కెమికల్ ఇన్వెస్టి గేషన్ ఆఫ్ సం ప్లాంట్ కలరింగ్ మాటర్స్)  పై పరిశోధనలు చేశారు .ఈ పరిశోధనలలో చాలా ప్లావోన్ లను ,ప్లావనోవ్ లను గుర్తించారు .ఇవి మొక్కలలో సాఫ్ట్ ఆక్సిడైజేషన్ పొందుతున్నట్లు కనుగొన్నారు .ఆల్కలైన్ పొటాషియం పెర్ సల్ఫేట్ ద్రావణం లో ప్లావోన్ లను కొద్దిగా వేడి చేయటం తో అనేక ప్లావోనోల్ కాంపౌండ్స్ తయారు చేయవచ్చునని నిర్ధారణకు వచ్చారు .సీమ బంతిపూల (టాజిక్టస్ పాట్యుల)నుంచి వేరు చేసిన ప్లావోనోల్ పాట్యు లెటాన్ యొక్క అణు నిర్మాణం ను నిర్ధారించటానికి చేసిన పరిశోధనలే ఇవన్నీ .ఈ పూలలో పాట్యులెటిన్ యొక్క 7 గ్లైకో సైడ్ గా పాట్యు లెటిన్ ను శాస్త్రజ్ఞులు గుర్తించారు .దీనితో ఆంధ్రా యూని వర్సిటి లో ఆర్గానిక్  కెమిస్ట్రి లో విస్తృత పరిశోధనలు అవకాశం కలిగింది .

రావు గారు ఈయూని  వర్సిటి లో 1953-నుంచి పదేళ్ళు 1963 వరకు రీడర్ గా ఉన్న కాలం లోనే ఈ పరిశోధనలు ఊపందుకున్నాయి .ఎనలిటికల్ ,ఇంజనీరింగ్ ,ఆర్గానిక్ ,ఫిజికల్ ,న్యూక్లియర్ కెమిస్ట్రి శాఖలను రావు గారే అభి వృద్ధి చేశారు .ఎంతో మంది పరిశోధక విద్యార్ధులకు స్పూర్తిగా నిలిచి ,అత్యుత్తమ స్థాయి పరిశోధనలకు మార్గ దర్శకం చేసి వారిని తీర్చి దిద్దిన ఆచార్యులుగా ఘనకీర్తి పొందారు రామచంద్ర  రావు  గారు .1968 నుంచి 78 వరకు దశాబ్దకాలం రసాయనశాఖ అధిపతిగా ఉన్నారు .తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజి ప్రిన్సిపాల్ గా సేవలందించి రిటైరయ్యారు . వీరి పర్య వేక్షణలో 14 మంది పరిశోధనలు చేసి డాక్టరేట్ పొంది ఆయన కీర్తిని ద్విగుణీకృతం చేశారు .రావు గారు రాసిన 175 పరిశోధనా పత్రాలు జాతీయ ,అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ లో వెలువడి ఆయన సామర్ధ్యానికి ప్రతీకలుగా నిలిచాయి .విదేశీ యూనివర్సిటీలు వారికి గౌరవ పదవులిచ్చి గౌరవించాయి .చాల దేశాల  లో పర్యటించి అక్కడి యూని వర్సిటీలలో  తన పరిశోధనలపై ప్రసంగించి  విద్యార్ధి, అధ్యాపకులకు ప్రేరణ, స్పూర్తి కలిగించారు .

1977 లో కృష్ణా జిల్లా నూజి వీడులోని ఆంద్ర యూనివర్సిటి పోస్ట్ గ్రాడ్యుయేట్  సెంటర్ కు రావు గారు స్పెషల్ ఆఫీసర్ గా నియమి౦ప బడ్డారు .తర్వాత ఎమిరిటస్ ప్రొఫెసర్ గా ఉన్నారు .ఇక్కడ కూడా పరిశోధక విద్యార్ధులకు అండ దండగా ఉండి వారికి మార్గ  దర్శనం  చేశారు  ..వారి ‘’ఎక్ ట్రా మ్యూరల్ రిసర్చ్ కమిటీ సభ్యులుగా ఉంటూ ,విజ్ఞాన శాస్త్ర విషయాలు సామాన్యులకు సరళభాషలో అందించటానికి గొప్ప కృషి చేశారు .ప్రకృతి జన్యు రసాయనిక పరిశోధనలో నలభై ఏళ్ళు పని చేసి పండిపోయిన ఆచార్యులు రావు గారు .వారి పరిశోధనా ఫలితాలు అమూల్యమైనవిగా గుర్తింపు పొందాయి .సువిఖ్యాతులైన ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు గారిని ‘’ఆచార్యులకే ఆచార్యులు’’ అని కీర్తించారు .డా.సి. వి. రామన్ శిష్యరికం ,డా సూరి భగవంతం సాన్నిహిత్యం రావు గారికి రసాయనిక శాస్త్రం లో నూతన ఆవిష్కరణలకు ఎంతగానో తోడ్పడ్డాయి .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రోకలి బ0డ పురుగుల బహు  సంతానం 

మా దొడ్లో వర్షాకాలం లో రోకలి  బండ పురుగులు ఎక్కువ .అవి ఒకే సారి చాలా పిల్లలను ప్రసవిస్తాయి  పది నిమిషాల తర్వాత  అవన్నీకలిసి సామూహికంగా  గున గున నడుచు కొంటూ వెళ్లి పోతాయి .ఎక్కడికి పోతాయో తెలీదు .ఇవాళ మా అదొడ్లో అలాంటి రెండు రోకలి  బండ పురుగులు  ఇప్పుడే కన్న వాటి  సంతానం   నా కెమెరాకు చిక్కాయి . చూడండి – దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హైదరాబాద్ ఇ .సి. ఎల్ .నిర్మాణ శాస్త్రవేత్త డా ఏ. ఎస్. రావు

హైదరాబాద్ ఇ .సి. ఎల్ .నిర్మాణ శాస్త్రవేత్త డా ఏ. ఎస్. రావు

ఇ.సి .ఎల్. అంటే ఎలెక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా .హైదరాబద్ లో దీని నిర్మాణ రూప శిల్పి డా.ఏ ఎస్ రావు అని అందరూపిలిచే  డా శ్రీ అయ్యగారి సాంబశివరావు గారు.ఆయన కృషికి,సేవకు  కృతజ్ఞతగా వెలసినదే  హైదరాబాద్ లోని ఏ. ఎస్.  రావు నగర్.

రావు గారు 20-9-1914 న పశ్చిమ గోదావరిజిల్లా మోగల్లు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ అయ్యగారి వెంకటాచలం

బెనారస్ హిందూ యూనివర్సిటిలో బి. ఎస్. సి.  ,ఎం. ఎస్. సి .1937 నుండి చదివి ఉత్తీర్ణులై,1947 లో  అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర స్టాన్ ఫోర్డ్  యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ చదివి డిగ్రీ పొందారు ఇండియా వచ్చి 1940- నుంచి ఎనిమిదేళ్ళు బెనారస్ హిందూ యూని వర్సిటి లెక్చరర్ గా పని చేశారు .తర్వాత బొంబాయిలోని టాటా ఇన్ స్టి ట్యూట్  ఆఫ్ ఫ౦డమెంటల్ రిసెర్చ్ లో రీడర్ గా 1948నుంచి 54 వరకు ఆరేళ్ళు చేశారు .ట్రా౦బే.లోని అటామిక్ ఎనర్జి ఎస్టాబ్లిష్ మెంట్ కు 1954 లో డైరెక్టర్ అయ్యారు .తర్వాత భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్కు 1967 లో  డైరెక్టర్ అయ్యారు  .ఆతర్వాత హైదరాబాద్ ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా 1967 నుండి 1978 వరకు 11 ఏళ్ళు పనిచేసి సంస్థ అభి వృద్ధికి యెనలేని కృషి చేశారు .

ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ,ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ సంస్థల ఫెలోషిప్ అందుకుని పరిశోధనలు చేసిన   సమర్ధులు రావు గారు .ఆయన టాటా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్  ఫండమెంటల్ రిసెర్చ్  లో అయిదేళ్ళు  తీవ్ర పరిశోధనలు చేసి హై ఆల్టిట్యూడ్ ల వద్ద కాస్మిక్ కిరణాల అత్యధిక కొలతలను కనిపెట్టారు .ట్రా౦బేలోని రెండు రియాక్టర్ లైన ‘’ అప్సర ,జర్లినా’’ నిర్మాణం ,డిజైనింగ్ ,పర్య వేక్షణ చేసి అవి సమర్ధవంతంగా పని చేయటానికి శక్తి యుక్తులను ధారపోసిన వారు సైంటిస్ట్ రావు గారు .వాటి నియంత్రణ విధానాల రూప శిల్పిగా మంచిపేరు సంపాదించుకొన్నారు .న్యూక్లియర్ విస్ఫోటనాల ప్రభావం వలన పర్యావరణ౦  అణు దార్మికతతో  కాలుష్యం కాకుండా దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయించిన ఘనత ఆయనదే .వీటిలో 1600 కు పైగా ఇంజనీర్లు ,సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు .

డా హోమీ జే భాభాకు అణు శక్తిని మానవ సంక్షేమ సౌభాగ్యాలకు విని యోగించాలనే ప్రగాఢ మైన కోరిక ఉండేది .దీన్ని అమలు చేయటానికి ఒక ప్రణాళిక రచించి , అందుకోసం ఒకకమిటీ ఏర్పాటు చేసి మనదేశం  లోనూ ఇతరదేశాలలోను ఉన్న శాస్త్ర వేత్తలను, ఇంజనీర్లను ప్రావీణ్యం ప్రాతిపదిక పై ఎంపిక చేసి సభ్యులను చేశారు .ఆ కమిటీకి ఎంపికైన తొలి భారతీయ శాస్త్ర వేత్త శ్రీ ఏ .ఎస్. రావు గారు .1955 లో సృష్టించిన ‘’అప్సరస ‘’న్యూక్లియర్ రియాక్టర్ డిజైన్ చేసిన కీర్తి రావు గారిదే .భాభా ,నెహ్రూ లతో రావు గారికి అత్యంత సాన్ని హిత్యం ఉండేది .అందువలన డజనుకు పైగా నోబెల్ ప్రైజు అందుకున్న శాస్త్ర వేత్తలతో రావు గారికి పరిచయభాగ్యం కలిగింది .

1955 లో జెనీవాలో’జరిగిన ’ ఆటం ఫర్ పీస్ ‘’(శాంతికోసం అణువు ) అనే  అంతర్జాతీయ సదస్సు లో రావు గారు పాల్గొని ప్రపంచ శాంతిని న్యూక్లియర్ శక్తి తో  సాధించవచ్చునని సందిగ్ధ రహితంగా స్పష్టంగా సూటిగా చెప్పి ప్రశంసల౦దుకొన్నారు .సర్ సి. వి. రామన్ స్వయంగా ‘’అప్సర ‘’రియాక్టర్ ను చూసి ,పరీక్షించి రావు గారి వెన్నుతట్టి ప్రశంసలతో ,అభినందనలతో ముంచెత్తారు .రావు గారు అణుఇంధన (న్యూక్లియర్ ఫ్యుయల్ )విభాగం లో డైరెక్టర్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ సలహాదారుగా మానవ విలువలకు ,శాంతి పరిరక్షణకు సేవలు అందించి, సైంటిస్ట్ వృత్తికి సార్ధకత తెచ్చారు .’’అణు మహర్షి ‘’గా అంతర్జాతీయ కీర్తి పొందిన ‘’అణుశాస్త్ర’’ వేత్త రావు గారు .

బెంగుళూరు భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ బోర్డ్ కు డైరెక్టర్ గా 1958 నుండి 64 వరకు ఆరేళ్ళు మహత్తర సేవ చేశారు .హైదరాబాద్ ఇ.సి .ఎల్. కు మేనేజింగ్ డైరెక్టర్ 1967-6 8 లో పని చేసి ,రిటైరయ్యారు .తర్వాత కూడా కేరళ రాష్ట్ర డెవలప్ మెంట్ కార్పోరేషన్ బోర్డ్ డైరెక్టర్ గా నియమింపబడి అక్కడా తన నిరుపమ కౌశలాన్ని ప్రదర్శించారు .ఎందరెందరో దిగ్దంతులవంటి వారితో అత్యంత సాన్నిహిత్యం ,పరిచయాలు ఉన్నా ఎన్నడూ తన స్వీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోని’’ సై౦టిస్ట్ ఋషి ‘’రావు గారు .బహు నిరాడంబర జీవితం గడిపిన మాననీయులాయన .

తనకున్న విజ్ఞానం, విచక్షణ ,కృషి ,లక్ష్య శుద్ధి,ముందు చూపు , అంకిత భావాలతో వేలాది మంది శాస్త్ర సాంకేతిక వేత్తలకు ఉపాధి కలిగించి ,భారత దేశ పురోగతికి తోడ్పడిన అణకువకల ‘’అణుశాస్త్ర వేత్త ‘’.

రావు గారి పరిశోధనలకు, సేవలకు ఎన్నెన్నో అవార్డులు రివార్డ్ లు అందు కున్నారు .ఆయనకు జాతీయ ఎలెక్ట్రానిక్ కమీషన్ లో గౌరవ సభ్యత్వమిచ్చి గౌరవించారు .పద్మ శ్రీ ని 1960 లో,1972 లో పద్మ భూషణ్ పురస్కారాలు భారత ప్రభుత్వం అందజేసింది .1965 లో శాంతి స్వరూప్ భట్నగర్ ప్రైజ్ పొందారు . ఆంద్ర విశ్వ విద్యాలయం  గౌరవ డి. ఎస్. సి.ప్రదానం చేసి సత్కరించింది   .1976 లో ఫిక్కి అవార్డ్ ,1977 లో ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అవార్డ్ ,నేషనల్ డిజైన్ అవార్డ్ పొందారు .

టెక్నాలజీ దిగుమతి లేకుండా స్వావలంబన విధానం తో భారత దేశం అభి వృద్ధి చెందాలని రావు గారి సంకల్పం .తన పరిశోధనలద్వారా వైద్య ,పారిశ్రామిక ,వ్యవసాయ రంగాలకు అనన్య సాధ్యమైన కృషి చేశారు .అణుశక్తిని ఔషధ ,వ్యవసాయ రంగాలలో ఉపయోగించటానికి ఆచరణాత్మక కృషి చేసిన మొట్టమొదటి శాస్త్ర వేత్త రావు గారు .హైదరాబాద్ లో ఎలెక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 1-4-1967 లో స్థాపించిన దూర దృష్టి ఉన్న  సైంటిస్ట్ ఆయన  .స్థానికంగానే టెక్నాలజీ రూపకల్పన చేసి తయారు చేయటానికే దీన్ని ఏర్పాటు చేసి 1978 వరకు దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలందించి, విస్తృత పరచి దాన్ని ప్రజోపకారంగా మలచిన ప్రజ్ఞ ఆయనది .కంప్యూటర్లు, వాటి విడిభాగాలను ఇక్కడే తయారు చేయించారు .ఇ సి. ఐ .ఎల్. ను పూర్తి  స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో తయారు చేసే సంస్థగా మారటానికి ,ప్రపంచం లోనే ప్రఖ్యాత సంస్థగా ఎదగటానికి  రూపు రేఖలు తీర్చి దిద్దిన శాస్త్ర సాంకేతిక శిల్పిరావూ జీ .ఆయన కృషి ఫలితమే దేశం లోని భాభా అణుపరిశోధన కేంద్రం లోని హెల్త్ ఫిజిక్స్ డివిజన్ ,రియాక్టర్ కంట్రోల్ డివిజన్ ,డిపార్ట్ మెంట్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ లు ఏర్పడి విస్తృత సేవలందిస్తున్నాయి .

రావు గారి ప్రతిభా సామర్ధ్యాలను తెలియజేస్తూ ‘’ద మాన్ విత్ ఎ విజన్’’గ్రంథం ఆయన పేరుమీదనే 1999 లో వెలువడింది  .’’ప్రతి సూక్ష విషయాన్నీఒక విశ్వ విద్యాలయం లాగా ఆలోచించే దార్శనికుడైన మేధావి సైంటిస్ట్ ‘’అంటారు ఆయనను .భారత దేశ సాంకేతిక స్వావలంబనకు ఆద్యులైన ఎ.ఎస్ .రావు అనబడే  డా.శ్రీ అయ్యగారి సాంబశివరావు గారు తెలుగు వారు అవటం మనకు గర్వకారణం ,అదృష్టం కూడా .రావు గారు 31-10- 2003 న హైదరాబాద్ లో 89 వ ఏట మరణించారు .ఇ.సి.ఎల్. దగ్గరున్న కాలనీకి డా ఏ .ఎస్. రావు నగర్ అనే పేరు ఆయన జీవించి ఉన్నప్పుడే పెట్టి ప్రాతస్మరణీయుని చేశారు .

హైదరాబాద్ ఇసి ఎల్ లో ఎందరెందరో శాస్త్ర సాంకేతికనిపుణులు పని చేశారు .వేద గణిత౦ లో స్పెషలిస్ట్ డా .శ్రీ రేమెళ్ళ అవధాని గారు ఇందులో పని చేశారు .ఇక్కడే సంస్కృత౦, తెలుగులను కంప్యూటర్ లో వాడే విధానాన్ని తమ బృందమే ఆవిష్క రించిందని శ్రీ  అవధాని తెలియ జేశారు .నాకు మోపిదేవి హై స్కూల్ లో శిష్యుడు ,నాకు అత్యంత ఆత్మీయ ఆదర్శ ప్రధానోపాధ్యాయులు శ్రీ పసుమర్తి సీతారామ  శర్మగారి తమ్ముడు చి పసుమర్తి భగవంతం ఇక్కడే పని చేస్తున్నట్లు పది నెలల క్రితం ఫోన్ లో మాట్లాడుతూ చెప్పాడు .రావు గారి వటవృక్షం నీడన ఎందరో మేదావులున్నారని అర్ధమవుతోంది .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 




Land Line : 08676-232797

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు  తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ

విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు  తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ

భారత దేశ రక్షణ శాఖ సలహాదారుగా ,ప్రధాని నెహ్రూకు శాస్త్రీయ అంతరంగిక  సలహాదారుగా ఉన్న ఆంధ్రా శాస్త్ర వేత్త సూరి భగవంతం గారి గురించి మనలో చాలామందికి తెలియదు అంటే ఆశ్చర్యమేమీ లేదు .ఆయన సత్యసాయి బాబావారి  ఆంతరంగిక  శిష్యుడు అంటే ఎక్కువ మందికి తెలుసు .’’ఆచట పుట్టిన చివురు కొమ్మైన చేవ ‘’అన్నట్లు ఆయన కుమారుడు సూరి బాలకృష్ణ భూ భౌతిక శాస్త్ర వేత్త అంటే అస్సలు ఎవరికీ తెలిసి ఉండదన్నది యదార్ధం .ఇద్దరూ కృష్ణా  జిల్లావారవటం జిల్లాకు, మనకు గర్వకారణం .

                  శ్రీ సూరిభగవంతం

  భగవంతం గారు ప్రముఖ సైంటిస్ట్ ,భారతరత్న నోబెల్ పురస్కార లెనిన్ పీస్ ప్రైజ్  గ్రహీత ,సి .వి .రామన్ శిష్యులు .శాస్త్రీయ దృక్పధం, ప్రయోగ నైపుణ్యాలే ఆయనను రామన్ కు సన్నిహితుని చేశాయి .మద్రాస్ యూ ని వర్సిటి నుంచి ఎం .ఎస్ .సి.  పొంది ,అందులోనే భౌతిక శాస్త్ర లెక్చర గాచేరి  ప్రొఫెసర్ గా,డిపార్ట్ మెంట్ అధిపతిగా చకచకా 28 ఏళ్ళ వయసుకే ఎదిగారు  .అదే యూని వర్సిటి ఆయనకు డి.ఎస్ సి,ప్రదానం చేసింది .1948 వరకు ఇక్కడే పని చేశారు .1948- 49 లో లండన్ లో’’ ఇండియన్ సైంటిఫిక్ లైజాన్ ఆఫీసర్ ‘’అయ్యారు అంటే సైంటిఫిక్ అడ్వైజర్ అన్నమాట .బ్రిటన్ ,యూరప్ దేశాలు రష్యాలలో పర్యటించి  యూని వర్సిటీలలో ఉపన్యాసాలిచ్చారు .అప్పటి లండన్ హై కమిషనర్ వి.కె. కృష్ణమీనన్ తో పరిచయం పెంచుకొని ,ఇండియా  వచ్చి , ఉస్మానియా యూని వర్సిటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్,  లాబ్ డైరెక్టర్ , వైస్ చాన్సలర్ అయ్యారు .

 1957 లో బెంగుళూర్ ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ అయి ,నాలుగేళ్ళు పనిచేశాక  ఈయన ప్రతిభ గుర్తించి మీనన్ ఈయన్ను కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ సైంటిఫిక్ అడ్వైజర్ బాధ్యత అప్పగించాడు  , ఈ పదవిలో ఉంటూనే డిఫెన్స్ రి సెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ కు డైరెక్టర్ జనరల్ గా కూడా వ్యవహరించారు .దేశ రక్షణ వ్యవస్థకు దీన్ని అత్యంత  శక్తివంతమైనదిగా తీర్చి దిద్దారు .అప్పుడే భారతదేశం మిస్సైల్స్ ,ఏయిరో ఇంజెన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, టాంకులు అనబడే కా౦బట్ వెహికల్స్,  ఎలెక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్ ,హై ఎక్స్ప్లోజివ్స్ ,అండర్ వాటర్ మెషిన్స్ మొదలైనవి 9 ఏళ్ళ కాలపరిమితిలో అందుబాటులోకి తెచ్చారు .వీటి అభి వృద్ధికి విశాఖ, లే ,తేజ్ పూర్ మొదలైన చోట్ల లాబ్స్ ఏర్పాటు చేయించారు.డి. ఆర్. డి. వో. అభి వృద్ధి అంతా భగవంతం గారి కృషియే .రక్షణ సామగ్రిని దేశీయంగా నిర్మించి విదేశీ దిగుమతులపై ఆధార పడకుండా చేసిన అసలైన సైంటిఫిక్  సలహాదారు ఆయన .ఒకరకంగా భారత రక్షణ వ్యవస్థకు భగవంతుని వంటి వారు భగవంతం గారు .ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ భౌతిక శాస్త్ర విభాగానికి 1946 లో అధ్యక్షులయ్యారు .రామన్ ఎఫెక్ట్ పై అనేక కోణాలలో అధ్యయనం చేసిన సైంటిస్ట్ భగవంతం మూడు ఉద్గ్రంధాలు రాశారు .అందులో లొ1961 లో వచ్చిన ‘’క్రిస్టల్  సెమెట్రి అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ‘’కు మంచి పేరుంది .ఇదికాక గ్రూప్ దీరీ ,రామన్ ఎఫెక్ట్ గ్రంధాలు కూడా అత్యంత ప్రామాణికమైనవే .రామన్ ఎఫెక్ట్ పై ప్రామాణికత, సాధికారత ఉన్నవారు భగవంతం .300లకు పైగా పరిశోధనా పత్రాలు రాసిన మేధావి .ఆయన రచనలు పలు భాషలలోకి అనువాదం పొందాయి .అనేక సైంటిఫిక్ , ప్రొఫెషనల్ సంస్థలకు ఫెలో గా ఎన్నికయ్యారు .తెలుగు ,సంస్క్రుతాలలోనూ  ఆయన పాండిత్యం అమోఘం మంచి వక్త .హాస్యం ,చతురత కలబోసి మాట్లాడే నైపుణ్యం ఆయనది . సూరి భగవంతం గారు 6-2-1989 న 80 వ ఏట మరణించారు ఆయన జననం 14-10-1909 కృష్ణాజిల్లా గుడివాడలో .

                  శ్రీ సూరి బాలకృష్ణ

శ్రీ సూరి భగవంతం గారబ్బాయి శ్రీ సూరి బాలకృష్ణ గుంటూరులో 3-8-1941 జన్మించారు .19 53 లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి ఏం ఎస్ సి .సాధించారు .19 55లో ఉస్మానియా యూని వర్సిటి నుండి పి హెచ్ డి అందుకున్నారు .195 2 నుంచే భూ విజ్ఞానం  భూ భౌతిక శాస్త్రాలలో విశేష పరిశోధనలు చేశారు .భూజల అన్వేశానపి గొప్ప కృషి సల్పిన శాస్త్ర వేత్త బాలకృష్ణ .ఉస్మానియా యూని వర్సిటిలో 19 53 లో రిసెర్చ్ స్కాలర్ గా చేరి ,జియాలజీ అధిపతి అయి 19 61 నుండి 64 వరకు పని చేశారు .ఇదే విభాగానికి రీడర్ గా 19 5 7 నుండి నాలుగేళ్ళు పని చేసి ,19 6 2 లో హెడ్ 19 64 లో గౌరవ ప్రొఫెసర్ ,19 6 5 లో అసిస్టెంట్  డైరెక్టర్  అయ్యారు  .ప్రతి శాఖలోనూ తన ప్రతిభను చాటారు

  హైదరాబాద్ లోని నేషనల్ జియో ఫిజికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్కు అసిస్టెంట్ డైరెక్టర్ గా యాక్టింగ్ డైరెక్టర్ గా 19 7 9 నుంచి 81 వరకు సేవలందించారు .ఇండియన్ జియో ఫిజికల్యూనియాన్ కు కార్య దర్శి గా ఉంటూ ఫెలోషిప్ అందుకున్నారు .ఆంద్ర ప్రదేశ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఫిలోశిప్ కూడా పొందారు .జియలాజికల్  సొసైటీ ఆఫ్ ఇండియా కు ఫౌండర్ ఫెలో శ్రీ బాలకృష్ణ ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షునిగా కూడా పని చేశారు

  న్యు  ఢిల్లీ లోని నేషనల్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో రిసెర్చ్ ఫెలో గా 1954 లో  చేరారు .1956-5 7 కాలం లో హార్వర్డ్ యూని వర్సిటి లో పోస్ట్ గ్రాడ్యుయల్  రిసెర్చ్ ఫెలో గా  గుర్తింపు పొందారు .జపాన్ ప్రాభుత్వ గౌరవ పురస్కారం తో పాటు ,జపాన్ జియోలాజికల్ సొసైటీ ఫెలోషిప్ నూ అందుకున్న  జియాలజీ ఘనాపాఠీ బాలకృష్ణ .

  పర్వతాలు, శిలల స్థితి స్థాపకత్వం (ఎలాస్టిసిటి )మీదా ,భూ సంబంధ లక్షణాలున్న వాటి అనుబందాలపైనా పరిశోధించి సాధికారిక పత్రాలు రాశారు .అనేక దేశాలు పర్యటించి ఉపన్యాసాలిచ్చి ,అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని విలువైన 125 ప్రామాణిక పరిశోధనా పత్రాలు సమర్పించారు ..భూ ప్రకంపనాలు, భూ కంపాలు, భూ అయస్కాంత క్షేత్రాలు ,గురుత్వాకర్షణ క్షేత్రాలు ,వాటి పని తీరు లపై సునిశిత పరిశోధన చేసిన పరిశోధనా  పరమేష్టి ఆయన  . భూ విజ్నానశాస్త్రం లో సాటిలేని విజ్ఞాన ఖనిగా ,పాలనా దక్షునిగా ,క్రమ శిక్షణగల నాయకునిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన మేధావి సైంటిస్ట్ శ్రీ సూరి రామకృష్ణ తండ్రి భగవంతం గారికి  తగ్గ తనయుడు అనిపించారు .

 బాలకృష్ణ గారి శాస్త్రీయ కృషికి 1967 లో కృష్ణన్ గోల్డ్ మెడల్ ,1979 లో ఆంధ్రప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ అవార్డ్ పొందారు .హైదరాబాద్ లో ఉప్పల్ రోడ్డు లో ఉన్న యెన్. జి .ఆర్. ఐ ..సంస్థలో స్థిరపడ్డారు బాలకృష్ణ .ఆయనకు ఇప్పుడు 77 ఏళ్ళ వయసు .అంతకు మించి వివరాలు తెలియలేదు .గూగుల్ లో అసలు ఆయన  గురించే లేకపోవటం దురదృష్టం  .

విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు  తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ    

 అని నిన్న రాసిన వ్యాసం లో శ్రీ సూరి బాలకృష్ణ గారి చివరి రోజులు గురించి తెలియక రాయలేదని చెప్పాను .ఈ ఉదయం వారి బంధువులు హైదరాబాద్ వాసి  శ్రీ సూరి ఆంగీరస శర్మ గారికి ఫోన్ చేసి వివరాలు అడిగాను . బాలకృష్ణ గారు భగవంతం గారు జీవించి ఉండగానే మరణించారని చెప్పారు .భగవంతం గారికి నలుగురు కుమారులు ,ఒక కుమార్తె అనీ ,ప్రస్తుతం తనకు తెలిసిన దాన్ని బట్టి రెండవ కుమారుడు శ్రీ రామకృష్ణ శర్మ గారు ఒక్కరే జీవించిఉన్నారని ,మిగిలిన వారంతా గతించారని తెలిపారు .ఆంగీరస శర్మ గారికి ధన్యవాదాలు తెలియ జేస్తూ -దుర్గాప్రసాద్

   ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12

3-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు -2

  అనేకమార్గాలలో సంపాదన చేశారు .స్మార్తం లోనేకాక శ్రౌతం లోనూ చేయి తిరిగినవారు .సాధారణంగా ఏదో ఒక దానిలోనే ప్రావీణ్యం ఉంటుంది .రెంటినీ సునాయాసంగా నిర్వహించి సవ్యసాచి అయ్యారు.బాబళ్ళ శాస్త్రి కుటుంబానికి తరతరాలుగా బులుసువారే గృహ పురోహితులు .ఇప్పుడూ అంతే .15 ఏళ్ళకే స్మార్తం లో ప్రవేశించి మూడేళ్ళ తర్వాత పరీక్ష పాసై ,విజ్రుమ్భించారు .అపరకర్మలు  చేయి౦చేవారుకాదు.. వేదపాఠశాలలో14 ఏళ్ళు వేదం బోధి౦చారు .అందులో వేదపరీక్షాదికారిగానూ ఉన్నారు .జీవితకాలం లో 60 శ్రౌత కార్యక్రమాలు ,6 పౌండరీకాలు చేయించినట్లు గుర్తు చేసుకున్నారు .దీనికి ఉద్గాతగా ఉండేవారు .1960 కాలం కోనసీమ అంతా బులుసువారి వేద ధ్వనులతో పులకించిపోయింది .50 వ ఏట 1965మాఘమాసం  లో అగ్నిస్టోమాన్ని ఆధానాగ్నితో  శ్రీరామపురం దేవాలయ ప్రాంగణం లో చేశారు .నాలుగేళ్ల తర్వాత 1969 లో పుట్టినవూరు వ్యాఘ్రేశ్వరం లో ‘’సర్వ ప్రస్త అగ్ని చయనం ‘’చేసి చయనులు అయ్యారు .అదే ఏడాది ఆయన పొరుగునున్న దువ్వూరి యాజులు గారు పొండరీకం చేసి పౌ౦డరీక చయనులయ్యారు .దీనికి బాబళ్ళశాస్త్రిగారు చయనులుగారికి తోడ్పడ్డారు .

  వితరణ శీలురైన డొక్కా వారు వీరికి ఒక ఇల్లు ఎకరం పొలం ఇచ్చి శ్రీరామపురానికి ఆహ్వానించారు .కానీ కూతురి పెళ్లి ఖర్చులకు కట్న కానుకలకు పిత్రార్జితమేకాక దీనినీ అమ్మేయాల్సి వచ్చింది .61 ఏళ్ళ వయసులో టిటిడి వారి పారాయణ స్కీం లో చేరి పుట్టిన ఊరిలోని దేవాలయం లో చేసేవారు .78 వ ఏట  రిటైరయి ,పెన్షన్ పొందారు .ఆర్ధిక భారం వలన వేద సభలకు వెళ్లి సంభావన పుచ్చుకోనేవారు .కేంద్ర ప్రభుత్వం అగ్ని స్టోమం చేసినవారికి గౌరవ వేతనం ఇచ్చేది .ఆ విషయం వీరికి  ఇతర ఆహతాగ్నిలు చెప్పనే లేదు. అది దూరమైపోయింది .

  ఎన్నో సంస్థలు ,వ్యక్తులు బులుసు వారిని ఆహ్వానించి సన్మానించాయి .హైదరాబాద్ లో భారతప్రధాని పి.వి. నరసింహారావు గారి చేతులమీదుగా సన్మానం అందుకొని ఆశ్చర్యపోయారు .ఎవ్వరూ ఆయన సాధించిన విజయాలను చెప్పలేదు .ఈ గౌరవ పురస్కారాన్నీ ప్రచారం చేయలేదు .80 ఏళ్ళ వయసులో క్రిక్కిరిసిన బస్సుల్లో పడి 20 గంటలు  ప్రయాణం చేయాల్సి వచ్చింది..ఇది మనకు ‘’స్వర్ణకమలం ‘’సినిమాలో వృద్ధ వేదపండితుడు పడిన బాధ గుర్తుకు తెస్తుంది .ఆనాడు ఇచ్చిన  గౌరవ భ్రుతి 35.13 డాలర్లు మాత్రమే .కానీ దీనికే పరమ సంతోషం పొందారు .నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టి రామారావు కూడా బులుసువారిని సత్కరించారు .

 బులుసు చయనులుగారు యవ్వనం లో బహు అందంగా ఉండేవారు .ఇతర దేశీయులను ఆప్యాయంగా ఆహ్వాని౦చేవారాయన .1996 ఫిబ్రవరి లో 81 వ ఏట  భార్య సుబ్బలక్ష్మిగారితో కలిసి చేసిన  అగ్రయనం ,ఏదో ఒక కారణం తో 1995 చలికాలం లో చేయలేకపోయిన అగ్ని కార్యానికి ప్రాయశ్చిత్త విధీ చేశారు .వేదాంతి మాత్రం కాదు .బాబళ్ళ,లంకా ,దువ్వూరి మాత్రం వేదా౦తులే . మృత్యు దేవత ఆయనకు హెచ్చరిక ఇవ్వకుండానే మీద పడింది .కూతురు అల్లుడు ఇంటికి వస్తారని సైకిల్ మీద సరుకులు తెచ్చి ఇంట్లో దించు తుండగా అధిక శ్రమతో హార్ట్ ఎటాక్ వచ్చింది .అందరికీ తెలిసే లోపే ఆయనను  మృత్యువు  కబళించింది .ఆయన అంత్య క్రియలు అగ్రహారం వెలుపల బ్రహ్మ మేధం ,పునర్ధహన, లోష్ట చయనాలతో పూర్తయ్యాయి .

 చయనులు గారి భార్య ‘’14 వ ఏట కాపురానికి వచ్చాను .మొదట్లో ఆయన అంటే భయం గా ఉండేది .ఇద్దరం కలిసి 32 ఏళ్ళు  అగ్ని హోత్రం చేసి నన్ను సోమిదేవమ్మ ను  చేశారు’’అని గుర్తుకు తెచ్చుకున్నారు  .తర్వాత కూతురు దగ్గరకు రాజమండ్రి చేరి, దశావతార స్తోత్రం, విష్ణు ,లలితా  సహస్రనామ స్తోత్రం బిగ్గరగా చదువుకుంటూ గడిపారు .భర్త చనిపోయాక చాలాకాలం దాకా తనకు అక్షర జ్ఞానం లేదంటారు .ఆడవారి చదువును భర్త ప్రోత్సహి౦చ లేదన్నారు .ఇతర సోమి దేవమ్మల కూతుళ్ళు తల్లులకు దగ్గరగా ఉంటె ,సోమిదేవమ్మ సుబ్బలక్ష్మిగారి కూతుళ్ళు మాత్రం దూర దూరంగా కోనసీమ అంతా వ్యాపించి ఉన్నారు .

  బులుసు చయనులు గారి వంశం మగపిల్లలు లేకుండా ఆగిపోయింది .చయనులుగారి మొదటిభార్యకుమారుడు రామమూర్తి మాతామహుల ఇంటపెరిగి ,స్మార్తం నేర్చాడు అతనికొడుకు కూడాస్మార్తం లో ఉద్దండుడు. వీరివలన బులుసు వంశం కొనసాగింది .బులుసు చయనులుగారు  శ్రీరామపురాగ్రహారం లో చనిపోయిన ముగ్గురు ఆహితాగ్నులలో రెండవ వారు .

 సశేషం

ప్రస్తుతం ఈ ధారావాహికకు’’ విరామం’’ ఇచ్చి, మళ్ళీ కొన్ని రోజులకు కోనసీమలో ప్రవేశిద్దాం –

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11

3-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు

శ్రీరామపురం అగ్రహారం లో మూడవ ఆహితాగ్ని బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు .1915 లో జన్మించి 82 ఏళ్ళు జీవించి 1997 లో మరణించారు .భార్య సుబ్బలక్ష్మి సోమిదేవమ్మ .ముప్పై ఏళ్ళు ఇక్కడే సోమి దేవమ్మగా ఉండి,చయనులు గారి మరణా నంతరం  రాజమండ్రి కూతురు వద్దకు చేరారు .చయనులగారి మరణం తో ఇంట్లో అగ్ని హోత్రాలన్నీ తీసేశారుఅప్పటికే . వైదికులైన గౌతమస గోత్రానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు .ఒకరు బులుసు వ్యాఘ్రేశ్వర సోమయాజులుగారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వ్యాఘ్రేశ్వరం లోనే ఉంటె ,రెండవవారైన ఈ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులుగారు శ్రీ రామ పురాగ్రహార వాసి .అగ్ని చయనం చేసి చయనులయ్యారు .ఈయననే అందరూ’’ బులుసు చయనులు గారు’’ అని సంబోధిస్తారు .శ్రీరామపురం లో రావి చయనులు అనే స్మార్త బ్రాహ్మణుడు ఉన్నారుకాని ఆయన ఆహితాగ్నీ కాదు ,అగ్ని చయనమూ చేయలేదు .

బులుసు చయనులుగారు గారి పూర్వీకులంతా  గణపతి ఆరాధకులు .ఒకసారి ఆయనపూర్వీకుని ముసలితనం లో గణేశుడు ప్రత్యక్షమైనాడని అందరూ చెప్పుకొనే వారు .వీరిలో మూడుతరాలవారు వేదపండితులు అవుతారని తర్వాత తరం వారుకూడా ప్రముఖ వేదపండితులే అవుతారని వినాయకుడు అప్పుడు ఆయనకు వరమిచ్చారట . మన చయనులుగారు చివరి మూడవ తరం వారు .

ముగ్గురన్నదమ్ములలో ఈయనకే వేదం అబ్బింది .అదే వయసున్న రెండు చింతల వెంకటా   చలు  తండ్రి గారి వద్ద బ్రహ్మ చారిగా   వేదాభ్యాసానికి చయనులు గారు చేరారు . రెండు చింతల వెంకటాచలు తర్వాత రెండు చింతల యాజులు గా శ్రౌత స్మార్తాలలో ఎదురు లేని వాడి గా  ప్రసిద్ధి చెందాడు .30 క్రతువులు చేసి వేదం లోనూ  భారత దేశం లోనే సాటిలేని వాడనిపించారు .ఆయన వేదం గానం చేస్తుంటే మహామహా  వేదపండితులు ఆశ్చర్యం తో నోరు వెళ్ళబెట్టి చూసేవారట .అంతటి గొప్పవారు  రెండు  చింతలవారు .ఎక్కువ కాలం  కాశీ లోనే గడిపేవారు .అప్పుడప్పుడు విజయవాడ లోని స్వగృహానికి వచ్చి వెళ్ళేవారు .కోనసీమలో వేదం, శ్రౌతాల పరిస్థితి తెలుసుకొనేవారు .   1936 లో భార్య లక్ష్మీ కాంతతో కలిసి మొదటి యజ్ఞం ,అగ్ని స్టోమం చేశారు .1980 లో కాశీ లోనే చివరి యజ్ఞం చేశారు .50 ఏళ్ళకు పైగా అగ్ని హోత్రాన్ని ఆరాధించి 1987 లో వారణాసిలోనే మరణించారు రెండు చింతల యాజులు గారు .

బులుసు చయనులు గారు ,రెండు చింతల చయనులుగారు కలిసి 82 పన్నాలు పూర్తి  చేసి వేదపండితులని పించుకున్నారు .ఇద్దరూ వివాహాలు చేసుకొని జీవిత సౌఖ్యం అనుభవించారు .కాని వ్యాఘ్రేశ్వరుల భార్య రామ సూర్యకాంత గారు 24 వ ఏట టైఫాయిడ్ జ్వరం తో 1945 లో చనిపోయారు..కర్మ కాండ పదవ రోజున మూసివాయనం అంటే చేటలు ,గాజులు  రాజమండ్రి నుంచి వచ్చి వ్యాఘ్రేశ్వరం లో  ఇప్పించారు .ఈ యువ దంపతుల కుమారుడు రామ మూర్తి వయసు కేవలం 6 .రెండు చింతల యాజులు బులుసువారిని తాను చేయబోయే పౌ౦డరీక యాగానికి నికి ఋత్విక్కుగా నియమించాలనుకున్నాడు కాని ‘’అపత్నీకుడు ‘’ఋత్విక్కు కాకూడదు అనే నియమం ఉండటం వలన ఆయన కు కన్యను ఇచ్చి అయిదు రోజుల వివాహం చేయాలి .తన మిత్రునికి ఈ విషయం లో సాయం చేయాలని గంగలకుర్రులో తన 14 ఏళ్ళ కూతురు సుబ్బ లక్ష్మి ని 30 ఏళ్ళ యువకుడు ,భార్య లేనివాడు ,  వేదపండితుడైన బులుసు వారికిచ్చి పెళ్లి చేయటానికి ఆమె తండ్రి  అంగీకరించాడు.8 నెలలతర్వాత వీరి వివాహం జరిగింది .మళ్ళీ ఇప్పుడు బులుసువారు శ్రౌతకర్మలు చేయటానికి పూర్తిగా అర్హులయ్యారు. ‘

సుబ్బలక్ష్మి వ్యాఘ్రేశ్వరులకు ముగ్గురు  ఆడపిల్లలు,తర్వాత ఒక కొడుకు ,మళ్ళీ కూతురు    కలిగారు .చయనులుగారి మొదటి భార్య సంతానం రామమూర్తి వ్యాఘ్రేశ్వరం లో  అమ్మమ్మ గారింట్లో పెరిగాడు .తర్వాత శ్రీరామ పురం తండ్రి వద్దకు వచ్చాడు.బులుసు ,రెండు చింతల కుటుంబాలు  పెళ్ళిళ్ళతో బంధువులూ అయ్యారు .రెండు చింతలవారి అబ్బాయి  సత్యనారాయణ  కు బులుసువారి మూడవ కుమార్తెతో వివాహం చేసి మూడవ సారి గా మళ్ళీ బంధువులవ్వాలనుకొన్నారు . .కట్నకానుకలు లేవు కాని అల్లుడికి  బులుసువారు విద్యా గురువులై వేదం నేర్పారు .అతనికి 15 ,ఆమెకు 10 వయసులో ఇద్దరికీ విజయవాడలో వివాహం చేశారు . బులుసు ఛయనుల గారి ఫోటో జత చేశాను చూడండి

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ జాలయ్య గారి జాబు

శ్రీ జాలయ్య గారి జాబు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సహృదయులు రమ్య సాహితీ సమితి -తణుకు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఏం ఆర్ వి సత్యనారాయణ మూర్తిగారి స్పందన

సహృదయులు రమ్య సాహితీ సమితి -తణుకు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఏం ఆర్ వి సత్యనారాయణ మూర్తిగారి స్పందన

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10

2-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు  గారు -3

శ్రీ దువ్వూరి సోమయాజులు గారి మూడవ కుమారుడు శ్రీ వెంకట సూర్య ప్రకాశ అవధాని

19 53లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజ మండ్రివద్ద పాత రైల్వే బ్రిడ్జి ని తాకు తూ 65 అడుగుల ఎత్తున నీరు వచ్చి తీర ప్రాంతాలను అతలాకుతలం చేసి ,  కపిళేశ్వరప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది .పంటలన్నీ పాడైపోయాయి .కానీ యాజులు గారి ‘’పంట పండింది’’ వారింట మూడవకుమారుడు వెంకటసూర్య ప్రకాశ అవధాని అన్మించటం తో .సర్వేశ్వర పుట్టిన దశాబ్దానికి ఈ పుత్రోదయం .ఎనిమిదవ ఏట ఉపనయన సంస్కారం పొంది తండ్రి వద్ద వేదం 8 ఏళ్ళు నేర్చి పూర్తి  చేశాడు .ఉదయం 5 కే లేచి ,స్నాన సంధ్యలు  చేసి ,తండ్రిగారి అగ్ని హోత్రం పూర్తయ్యాక  వేదాభ్యాసం ప్రారంభించి మధ్యాహ్నం 12 వరకు కొనసాగేది .20 వ ఏట వేదం శ్రౌతాలలో గోదావరి మండల పరిషత్ వద్ద వ్యాఘ్రేశ్వరం లో 19 73  లో  పరీక్ష నిచ్చిఅవధాని అయ్యాడు .కనక దుర్గ అనే గుళ్ళపల్లి వారి అమ్మాయిని ఇరగవరం లో 19 70 కే  పెళ్ళాడాడు .అప్పుడామెకు 12 ,అతడికి 17 .16 వ ఏడు దాకాబడి చదువు లేదు .అక్షరం ముక్క అబ్బకపోతే లాభం లేదని శ్రీరామ పురం నుంచి ముక్కామలకు నడిచి వెళ్లి చదివాడు .తండ్రి అడుగు జాడలలో అప్పటిదాకా ఉన్నా, తర్వాత తెలుగు లేక సంస్కృత పండితుడి ఉద్యోగం లో చేరాలనిపించి ,మొద్దె కూరు లోని కాలేజిలో చేరి 1976 లో లోకోర్సు పూర్తి  చేశాడు .ట్రెయిన్ లో ప్రయాణం చేస్తూ వరంగల్ లో అయిదునెలల కోర్సు చేశాడు .అప్పటికే పండితుల సంఖ్య ఎక్కువైందున ఉద్యోగం రావటం కష్టమైంది .శ్రీరామపురం లోనే రావి చయనులుగారి దగ్గర  కావ్యాలు నేర్చాడు .వీటికి అయిన ఖర్చులకు అప్పు చేసీ, సభలో వచ్చే పారితోషికాలతో తీర్చాడు .వ్యాఘ్రేశ్వరం ,రాజమండ్రి ,గుంటూరు విజయవాడ వేదసభలకు వెళ్లి తన ప్రావీణ్య ప్రదర్శన తో నగదు పారితోషికాలు పొందాడు.

 1982 లో శ్రీరామపురం వదిలి రాజమండ్రిలో శ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి వద్ద అయిదేళ్ళు మీమాంస శాస్త్రం అధ్యయనం చేశాడు .సుదూర ప్రాంతాలైన హైదరాబాద్ ,సిరిసిల్ల లకు సంభావన కోసం వెళ్ళేవాడు .ఊళ్ళో ఏదో ఒక కర్మకాండ చేయిస్తూ ధనం పొందేవాడు. .సంస్కార విదానాలన్నీ తండ్రి యాజులు గారి వద్దనే నేర్చాడు .ఒక సారి హైదరాబాద్ కుఒక బ్రాహ్మణ కుటుంబం లో  పెళ్లి చేయించటానికి వెడితే ,అక్కడ ఏ అగ్ని హోత్రి భార్యా అన్నం వండి పెట్టకపోయేసరికి అవాక్కై  అల్పాహారం తో గడిపాడు .ఇప్పటిదాకా తండ్రిగారి నిత్య ఇష్టి,ఇతర ఆహితాగ్నిలకు అధ్వర్యుగా ఉన్నాడు .నిత్యం ముక్కామల దేవాలయం లో  రాజమండ్రి సత్య నారాయణ స్వామి దేవాలయం లో టిటిడి తరఫున నియమింపబడి  వేదపారాయణ చేసేవాడు  .

  నలుగురు పుత్రులకు తల్లిదండ్రులైన  అవధాని, భార్య 1988 జనవరి లోపెద్ద కొడుకు వేదం తాతగారు యాజులు గారి వద్దనేర్చిన  ఫణి యజ్ఞేశ్వర యాజుల  పెళ్లి చేశారు. ఆడపిల్లలు లేనందువల్ల కట్నాల బాద లేదు.గుళ్ళపల్లి వారమ్మాయి లక్ష్మి ,ఫణి భార్య .పిల్లలు అక్కరకు వచ్చారు.కనుక మళ్ళీ శ్రీరామపురం చేరి తండ్రి గారివద్ద వేదంతో కాలక్షేపం చేయాలని 1987 లో నిశ్చయించాడు.టిటిడి ఉద్యోగం చేస్తూ, వేద పారాయణ కొనసాగించాడు .అగ్ని ఆరాధన ,ఇష్టి ,అగ్ని స్టోమం చేశాడు .తండ్రి గారి పద్ధతినే అనుసరించాడు .తండ్రి తరానికి ,తనతరానికి ఉన్న దూరం, తేడా గమనించాడు .’’నాచుట్టూ ఉన్నసమాజం గురించి కూడా నేను ఆలోచించాలి వారికోసం పని చేయాలి .ఆదర్శ  వైదిక జీవితం గడపాలి  .నా అవసరాలను తగ్గించుకోవాలి ‘’అని తాను  నిర్ణ యించుకొన్నట్లు  అవధాని చెప్పాడు .

  అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది .పదేళ్ళ ఆతర్వాత అవధాని ఇంకా రాజమండ్రిలోనే ఉండగా దువ్వూరి కుటుంబానికి చెందిన ఒక సంపన్న దాత శ్రీరామ పురం లో  చుట్టూ గోడలు ఉన్న ఒక అందమైన  ఇంటిని  దానిలో ఒక పాఠశాల పెట్టటానికి శృంగేరి పీఠానికి అందజేశాడు .ఉద్దేశ్యం బాగానే ఉంది కాని అక్కడ పని చేయటానికి ఉపాధ్యాయుడేవరూ ముందుకు రాలేదు .అప్పుడు దాన్ని సూర్య ప్రకాశావ దానికే  ఇచ్చిఅక్కడే ఉండిపోమ్మనీ తన కొడుకులకు ,తమ్ముడికొడుకులకు వేదం నేర్పుతూ ఉండమని కోరగా వచ్చి చేరాడు .

   శ్రీ దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర యాజులు  -అన్నిటా ప్రధమం

వైదిక –లౌకిక జీవితానికి సమన్వయము సాధించినవాడు సూర్య ప్రకాశ అవధాని పెద్దకుమారుడు ఫణి యజ్ఞేశ్వర యాజులు .1974 లో జన్మించి శ్రీరామపురం లోనే తాతగారు యాజులుగారి వద్ద ఆయన ముసలి గుడ్డి తనపు రోజుల్లో వేదం నేర్చి,ఇంటర్ చదివి ,ఇంగ్లిష్ నేర్చిమాట్లాడగలిగిన మొట్టమొదటి వేదపండితుడుగా రికార్డ్ సాధించాడు .బి.కాం. చదివి ,మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఆర్ట్స్ సాధించి కర్నాటక స్టేట్ బాంక్ లో ఉద్యోగం పొందాలనుకున్నాడు  .కాని మళ్ళీ వేదం లోకి వచ్చి ,క్రమ౦ లోను  శ్రీరామపురం లో సామవేదం వెంకట రమణగారి వద్ద నేర్చిన ఘనం లోను పరీక్ష ఇచ్చి ,విజయవాడలో శ్రీ విష్ణుభొట్ల లక్ష్మీ నారాయణ ఘనపాఠి గారి వద్ద  రైల్ లో వచ్చి వారానికి మూడు రోజులు  ఘనం నేర్చి  ,1999 లో ‘’ఘన ‘’లో ఘనంగా సర్టిఫికేట్ సాధించాడు .25 వ ఏట మీమా౦స పై మనసుపడి తండ్రి తో సమానమై శ్రౌత విద్యలో మరీ ముందుకు వెళ్ళాడు

  14 వయసులో 10 ఏళ్ళ మేనమామ గొల్లపల్లి వెంకట రామ సూర్యనారాయణ గారి  కూతురు  లక్ష్మిని పెళ్ళాడి  ఇద్దరు మగపిల్లలు సూర్య ప్రకాశ పవన కుమార శర్మ,శ్యామ సుందర శ్రీరామ శర్మలను  జన్మనిచ్చి , కుటుంబ నియంత్రణ పాటించాడు .పెద్దాడు 8 వ ఏటనే తైత్తిరీయం తండ్రి వద్ద మొదలుపెట్టి నేర్చాడు .తండ్రిలాగే ఇంగ్లిష్ లో ఆసక్తి కలిగి ఇంగ్లిష్ మీడియం లో చేరి చదువుతూ కూడా రోజుకుకనీసం  అయిదు గంటలు వేదాధ్యయనం చేసేవాడు.ప్రాధమిక విద్య ఆంగ్ల మాధ్యమలో చదివిన ఏకైక వేద పండితుడు అనిపించాడు .

  చాలాదేవాలయాలనుంచి వేద పారాయణకు ఫణి  ఆహ్వానాలు పొందాడు .అమెరికాలోని న్యు జెర్సీ దేవాలయం లో ఋత్విక్ గా ఆహ్వానమూ వచ్చింది .’’తాత గారు ఇలాంటి వాటికి ఆశపడ వద్దు అన్నారు .కనుక ఇప్పుడేకాడు మరెప్పుడూ అమెరికావంటి ఇతర దేశాలకు వెళ్ళను ‘’  అని ఖచ్చితంగా చెప్పాడు .2000 ఫిబ్రవరిలో రాజమండ్రిలో అయిదుగదుల ఫ్లాట్ కట్టుకొని గృహ ప్రవేశం చేశాడు .2009 లో తిరుపతి వేంకటేశ్వర యూని వర్సిటిలో అధ్యాపక ఉద్యోగం అందుకొని శృంగేరి పీఠం బదివదిలేసి ,కృష్ణ యజుర్వేదం లో అసిస్టెంట్ ప్రొఫెసర్  తర్వాత ప్రొఫెసర్ అయ్యాడు  , ఆ ప్రాంతం లో వేద పండితుడు యూని వర్సిటి ప్రొఫెసర్ అయిన మొట్టమొదటి వ్యక్తి ఫణి . ,కంచి పీఠం ఫణిని ఆహ్వానించి ,సన్మానించి ‘’వేద భాష్య రత్న ‘’బిరుదుతో సత్కరించింది .’’నా జీవితం లో ఇదొక గొప్ప మలుపు. తాతగారు యాజులుగారు ‘’దీనినే కొనసాగించు ‘’అన్నారు .అంతే ఇక వేదం –లౌకికం లమధ్య ఊగిసలాడలేదు నేను’’ అన్నాడు ఫణి 1998 లో  .16 ఏళ్ళ తర్వాత వేద ప్రవీణులైన దువ్వూరి కుటుంబం కొత్త అర్హత, విలువ సాధించింది ఫణి వలన .కాని దువ్వూరి శ్రౌతం  బలహీనమైన దారానికి వ్రేలాడుతూ  ఉండిపోయింది .

2014 లో డయాబెటిస్ వలన సూర్య ప్రకాశ ,కనక దుర్గలు బాధపడి 2007 లో చేద్దామనుకొన్న ఆదాన ,అగ్ని స్ట మాలతో చేయాలనుకున్న ‘’వైశ్వ దేవం చేయలేక పోయారు .వారసత్వాన్ని కాపాడాలనుకున్న  శ్రీ దువ్వూరి సీతారామ శాస్త్రి

అన్న ఫణి లాగానే తమ్ముడు సీతారామ శాస్త్రి అధ్వర్యుగా తాత యాజులుగారి వద్ద ప్రారంభించాడు .తైత్తిరీయం ముందుకు సాగలేదు .మాతామహుడు గొల్లపల్లి వారి వద్ద కూడా ఇలాగే జరిగింది .బలవంతం గా భట్టీయం వేస్తె  గొంతు నెప్పి వచ్చేది.తాను వేదవారసత్వాన్ని కాపాడుదామనుకొన్నా పరిస్తితులు సహకరించన౦దుకు బాధ పడ్డాడు .టెక్నికల్ కోర్సు చేసి ,అమెరికా వెళ్లి పుష్కలంగా డాలర్లుసంపాదించి  అన్న ఫణి, ఫణి కొడుకులు వేద,శ్రోతాల  వారసత్వాన్ని నిలబెట్టటానికి సాయ పడుదామని అతని కోరిక.తనకు వేదవిద్య అబ్బదని గ్రహించి ,తన మన్సులోని ఆశయం సాధించటానికి అప్పటి 65వేల ప్రవాస భారతీయులతో పాటు అమెరికా కు కనెక్టికట్ లోని హాఫర్డ్  కు విమానం లో వెళ్ళాడు .ఆంద్ర ప్రదేశ నే అంతవరకూ దాటని వాడు దేశాలు ఖండాలు దాటాడు .సత్యం కంప్యూటర్స్ కు చెందిన’’సిగ్నా ఇన్సూరెన్స్ కంపెనీ ‘’లో చేరి ,తర్వాత భార్య గౌరి శ్యామల ,కొడుకు కార్తికేయ ,కూతురు ప్రణతి లను కూడా అమెరికా తెచ్చుకున్నాడు .ఇతని కజిన్ యజ్ఞేశ్వర యాజులు అంటే యాజులుగారిపెద్దబ్బాయి సర్వేశ్వర కొడుకు అంటే మనవడు    కూడా విస్కాన్సిస్ లోని మిల్వాకీ కి వచ్చాడు . యాజులుగారి మూడవ మనవడు హైదరాబాద్ లో వాల్యు లాబ్ ఉద్యోగి  గిరిజా శంకర్ కూడా అమెరికాకు యెగిరి పోయె  ప్రయత్నం లో ఉన్నాడు .అమెరికాలోని హిందూ దేవాలయాల పూజారులకోసం ,హైటెక్ కార్పోరేషన్ల అవసరాలు  అప్పుడు వరాలయ్యాయి .అందరి దృష్టీ భారత దేశం పైనే ఉంది అప్పుడు .ఒకప్పుడు సీమాంతర ప్రయాణానికి ఒప్పుకోని సనాతనులు ఇప్పుడు మనవళ్ళను పంపటానికి ముందుకొచ్చారు .

  సూర్య ప్రకాశ అవధాని నలుగురు కుమారులు అంటే యాజులుగారి మనవళ్ళుగొల్లపల్లి కుటుంబం వారి పిల్లలనే పెళ్లి చేసుకున్నారు .సత్సంతానమూ పొందారు .అందులో ఒకరు ఘనాపాఠీ మాత్రమె కాక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ..మరొకరు అమెరికాలో అయిదేళ్ళ ఉద్యోగం లో చేరాడు .ఇంకొకరు కూడా వెళ్ళటానికి సిద్ధం .యాజులు గారు శ్రీరామ పురం లో పంచాయతన దేవాలయం లో అధర్వ వేదం పారాయణ చేస్తుంటే దేవతలే దిగి వచ్చి ఆసక్తిగా వినేట్లు ఉండేది. ఆస్వరం ఆ సాధనా  ముచ్చటగా పరమ పవిత్రంగా  ఉండేదని పెద్దల ఉవాచ .ఒక సారి ఒక  అమెరికన్ వచ్చి ఆయన ఇంటర్వ్యు తీసుకుంటుండగా యాజులు గారు ఆతనితో ‘’మీరు అమెరికా వెళ్ళాక, అక్కడివాళ్ళతో నాకు అమెరికా లో ఉద్యోగం ఇప్పించని సిఫార్సు చేయ౦డి’’అని చమత్కరించారట  .

  దీనితో దువ్వూరి వారి చరిత్ర పూర్తి  .మరో ఆహితాగ్ని గారిని ఈసారి పలకరిద్దాం .

శ్రీ సూర్య ప్రకాశం అవధాని గారి ఫోటో జత చేశాను చూడండి

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -9

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -9

2-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు  గారు -2

1922 లోశ్రీమతి సూర్య గారిని వివాహమాడిన దువ్వూరి యాజులుగారు 67 ఏళ్ళ వైవాహిక జీవిత సౌఖ్యం అనుభవవించి 10 మంది సంతానం పొందారు .వైవాహిక జీవితం పై పూర్తి  నమ్మకం,గౌరవం కలవారాయన .వివాహం లో పరమార్ధం ,శ్రర్ధ ,బ్రహ్మ లోకం ఉన్నాయని అంటారు .వివాహ వేడుక దంపతులకే కాక బంధు మిత్ర అభిమానులకూ ఆన౦ద  దాయకం కన్నుల పండుగ  .పెళ్లి చూపులలో మొదలైన చూపులు అయిదు రోజుల వివాహం లో ఎన్నో సార్లు భార్యను భర్త చూస్తాడు .ఆ చూపుల్లో ఆమె అంద చందాలనుకాక , ఆమె అంతస్సౌన్దర్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు .అప్పుడే అది నిజమైన చూపు అవుతుంది .ఆమెకు 7 ఆయనకు 14 ఏళ్ళ వయసులో వివాహమైంది .యాజులుగారి తండ్రి, మేనమామ సంబంధం ఖాయం చేశారు. గౌతమి గోదావరిపై అన్ని వసతులు, రోడ్డు, పడవ ప్రయాణ సౌకర్యం ఉన్న  నేదునూరు కు చెందిన దూరపు బంధువు ఆమె .‘’ఆ అయిదు రోజుల పెళ్లి మరువరాని అనుభవం ‘’అంటారు ఆయన .మామగారు వంట చేసేవాడు అత్తగారుకాదు. మిఠాయిలు వండేవాడు.అవి ఎంతో పవిత్రమైన రోజులు .ఆయనకు కట్నంగా 116 వెండి రూపాయలిచ్చారు .ఆయన బామ్మర్ది వాటిని అన్గోస్త్రం లో మూటకట్టి మోసుకు వచ్చాడు .అప్పుడు ఒక రూపాయి అంటే రెండున్నర తులాల వెండి ..పెళ్లి కొడుక్కి పట్టు పంచలు ఆడపడుచుకు తలా13 రూపాయలు ఇచ్చారు .పెళ్లి కుమాతె నగలకోసం యాజులుగారు 200 రూపాయలు ఖర్చు చేసి వడ్డాణ౦ , ,నెక్లెస్ ,గాజులు చేయించారు .

యాజులుగారు భార్యకు తానే గురువై మంత్రార్ధాలు వివరిస్తూ  విధులకు ఎలా తోడ్పడాలో బోధించారు .అందులో ఆడవారికోసం చాలా ప్రత్యేక మంత్రాలున్నాయి .వీటిని భట్టీయం వేయాల్సిందే .పెళ్లి అయిన 16 ఏళ్ళకు యజ్ఞానికి ముహూర్తం ఏర్పాటు చేసుకున్నారు .ఆమెకు అగ్ని స్టోమ మంత్రాలు నేర్పారు .ఆమె చనిపోయిన నాలు గేళ్ళ తర్వాత సోమి దేవమ్మ గా ,ఆమె అంత్యేస్టికి పునర్ధహనం చేశారు .ఆహితాగ్ని భార్యకు ఇలాచేయటం సంప్రదాయం .ఆమె తనలాగా సోమపానం చేయక పోయినా దాని ప్రభావం ఆమెకు లభించాయి అని యాజులు గారు వివరించారు .ఆమె చనిపోయే దాక భర్త వదిలేసిన భోజనం అంటే ‘’ఉచ్చిస్టం ‘’తినేది .ఈ నియమాన్ని జీవితా౦త౦ పాటించిన సాధ్వి .

24 ఏళ్ళకే విద్యపూర్తి  చేసిన యజులుగారు మొదట కొడుకును తర్వాత కుమార్తెకు తండ్రి అయ్యారు ‘’నాభార్య 14 కాన్పులు కన్నది .అన్నీ ఇంట్లోనే .ఎరుకలసాని వచ్చి 4 రూపాయలకే పురుడు పోసేది  .ఆకాలం లో మందులు , సాధారణమైనవి ,చవక, తేలికగా దొరికేవి .నలుగురు పిల్లలు చిన్నతనం లోనే చనిపోయారు .’’బహు సంతానానికి తండ్రి గా గర్వపడే వాడిని.ఒక సారి హైదరాబాద్ లో  నా సంతానం సంగతి తెలిసిన ఒక స్త్రీ అమాంతంగా నాపాదాలను స్పృశించి కళ్ళకు అద్దుకుని నమస్కారం చేసింది .అగ్రహారాలలో ఉండేవారికి  కనీసం 20 మంది మనవాళ్ళు మనవ రాళ్ళు ఉండటం  ఆనాడు సహజం, సమంజసం .నాకు 40 మంది ఉండటం నా అదృష్టం ‘’అని చెప్పారు .

తేలికగానే అయిదుగురు ఆడపిల్లల వివాహాలు చేశారు వరకట్నం ను ఆక్షేపించే వారిని లెక్క చేసేవారు కాదాయన .1940 -50 దశకం లో డెల్టా ప్రాంతమంతా ఆయన పేరు మారు మోగేది .1990 నాటికి పరిస్థితులు చాలామారిపోయాయని ,పెళ్ళిళ్ళు కుదర్చటం కష్టమై పోతోందని బాధ పడ్డారు .విలువలు పతనమయ్యాయని అన్నారు .వేదం ,యజ్నయాగాది క్రతువులపై  జనం లో ఆసక్తి తగ్గిందని వ్యధ చెందారు .తన కుటుంబంలోనే మనవరాళ్ళ పెళ్ళిళ్ళు   చేయటం తనకు ఆశక్యంగా ఉందని కారణం కట్నకానుకలు విపరీతంగా పెరగటమే నని అన్నారు .

1936 లో యాజులుగారబ్బాయి సర్వేశ్వర సోమయాజులు ఆహితాగ్ని అవుతాడని ఆశించారు .19 ఏళ్ళప్పుడే తండ్రివద్ద  వేదం పూర్తి చేసి ,పెళ్లి చేసుకొని ,గొర్తి వారి వద్ద చేరి  ఘన పాఠీ అవుదామనుకొంటే ఈశ్వరానుగ్రహం వేరుగా ఉండి ,శివ పురాణం పై ఆసక్తిపెరిగి ,తరచుగా కాశీవెళ్లి   గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేస్తూ,కోన సీమలో శుభార్యాలలో సంభావన తీసుకొంటూ శతరుద్రీయం సాధించి వేద పండితుడై జీవనం గడపాల్సి వచ్చింది .దీనిపై అతన్ని కదిలిస్తే ‘’యోగం దైవం ఈశ్వర ఈశ్వర ‘’అనేవాడు శివారాధనమే ముక్తి నిస్తుందని నమ్మాడు .యాజులు గారు 25 ఏళ్ళు ఈకొడుకు పేరు ఎక్కడా ఎత్తలేదు .సర్వేశ్వర ఇద్దరు కొడుకులు వేదం నేర్వలేదు. కాని ఒకమ్మాయిని మాత్రం వేద పండితుడికిచ్చి పెళ్లి చేశాడు .వీళ్ళ కొడుకు ఇరగవరం వెళ్లి ముత్తాత గుళ్ళపల్లి సీతారామ శాస్త్రి గారి వద్ద  అధ్యయనం చేశాడు..

‘’ నేదు నూరు ఋషి’’గా ప్రసిద్ధులైన లంకా వారు సర్వేశ్వరను ఆపస్తంభ సూత్రాలు బోధించమని కోరినా వినలేదు .దువ్వూరి కుటుంబలో ఎగుడు దిగుడులు  వచ్చి శ్రౌతమార్గం గాడి తప్పింది .సర్వేశ్వర శివ భక్తుడు అనిపించుకున్నా పౌరాణికుడు,వేదపండితుడు ఘనాపాఠీ కాకపోయినా తిరుపతి దేవస్థానం ఆయనకు వృద్ధాప్యపు పెన్షన్ 1994,లో అందజేసింది. ఆయన  వేదవిధి  –హిందూ మత౦   మధ్య క్రాస్ రోడ్ పై ఉండిపోయాడు .20 07 లో అకస్మాత్తుగా అయన నిత్యాగ్ని హోత్రునిగా  అగ్ని స్టోమం చేయాలని అనుకొన్నాడు .అదే సమయం లో చిన్నతమ్ముడు సూర్య ప్రకాశ అవధాని ,భార్య కనకదుర్గ అదే నిర్ణయానికి వచ్చారు .కానీ ఈ ఇద్దరూ’’ వైశ్వ దేవం’’ దాటి ముందుకు పోలేకపోయారు .యాజులుగారి రెండు నాలుగు అయిదవ కుమారులు వేదమార్గం వదిలి లౌకికం లో ఉన్నారు .

యాజులు గారి అంతిమ యాత్ర

1 996 డిసెంబర్  .ఒక  రోజు యాజులు గారి భార్య  సూర్య ఆవూళ్ళో సామవేదం వారింట్లో జరిగిన పెళ్ళికి వెళ్లి రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరి భర్తకు,ప్రోదున్నే లేచ్చి కాలకృత్యాలతర్వాత తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేసి నవరాత్రుల సందర్భం గా ప్రత్యేక ప్రసాదం వ౦డాలనుకొన్నది  . ఇంతలో గోడకు ఆనుకొని ఆమె  పడి పోయారు .అప్పుడాయన అగ్ని హోత్రం చేస్తున్నారు .వెంటనేబయటికి వచ్చి ,అప్పటికే ఆమె ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతున్నాయని గ్రహించి ఆ సమయం లో చదవాల్సిన కర్మ మంత్రాలు చదివారు .అవి తైత్తిరీయ ఉపనిషత్ మంత్రాలు .ఈమెకు ప్రాయశ్చిత్త కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు .దంపతులిద్దరూ అప్పటికే దీపావళి నాడు అగ్రయనం చేసి ఉన్నారు .పునిస్త్రీ మరణం పొందినదుకు కాలవదగ్గర మూసివాయనం జరిపారు .పత్నిగాబ్రహ్మమేధం చేశారు .అప్పటికే కళ్ళు కనిపించని ,51 ఏళ్ళుగా ఇష్టి,సోమయాగం చేసిన ఆయన ఆమె చితివడ్డ  నిశ్చేస్టంగా  మౌనంగా ఉన్నారు ‘’అగ్నిని ఆమె తనతో తీసుకు వెళ్ళింది .నాకు వంటింటి అగ్గిపుల్లలే మిగిలాయి ‘’అని విచారించారు .62 ఏళ్ళ నిండు దాంపత్యం విచ్చిన్నమైంది .అగ్నికి ఆమె పార్ధివ దేహం ఆహుతైంది .ఆమెఅస్తులకూ పునర్దహనం చేశారు .

చాలాకాలం క్రితం  అగ్ని స్టోమం చేసి, ఆయన ఒక సారి గోదావరి జిల్లా లో జరిగిన వేద సభకు శ్రావణ మాసం లో వెళ్ళారు .అప్పుడు ఒక ముసలాయన ‘’నువ్వేనా యజ్ఞం చేసిన వాడివి ?’’అని అడిగాడు .’’నేనే ‘’అన్నారు .’’చాలా డబ్బు అనవసరంగా ప్రయోజనం లేకుండా ఖర్చు చేశావు ‘’అనగానే యాజులుగారు నివ్వెరపోగా ఆయన ‘’భయపడకు .నీకు 80ఏళ్ళు దాటాక నీఅగ్ని హోత్రాన్ని నీ భార్య  తీసుకు వెడుతుంది ‘’అన్నాడు .పెద్దాయన ఆనాడే నిజం చెప్పాడు అనుకున్నారిప్పుడు .తన నాయనమ్మగారు కూడా తాతగారి కంటే ముందే చనిపోయారు .ఆమె అత్తగారూ ,తండ్రిగారి పెద్దన్న భార్యా అలాగే పోయారు .

భార్య మరణం తర్వాత యాజులు గారు రాత్రి పూట భోజనం చేయకుండా మధ్యాహ్నం  ఫలహారం మాత్రమే చేసేవారు  .చివరికాలం లో 86 వ ఏట ఒకరోజు ఆయన తనతల్లిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు .ఒక రోజు తననుఆమె  ఒక వింత ప్రశ్న అడిగిందట ‘’ఒరే నాయనా !దేవుడు నన్ను మరచి పోయాడేమోరా ? ఎవరైనా ఆయనకు జ్ఞాపకం చేస్తే బాగుండు ‘’అని .ఇప్పుడు ఆ మాటలు  ఆయన తలచుకున్నారు .2005 జులై 30 న శ్రీరామ పురం లో ఆయన పేరిట ఏర్పాటు చేసిన వార్షిక వేద సభ జరిపిన నాలుగు నెలలకు  యాజులుగారు తుది శ్వాస విడిచారు .పదేల్ల క్రితం భార్య సూర్య అంత్యక్రియలు జరిపిన చోటే యాజులు గారివీ జరిపారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-18 –ఉయ్యూరు

 

 

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -8

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -8

2-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు  గారు

బాబళ్ళ శాస్త్రి గారి కుటుంబం శ్రీరామ పురం చేరేనాటికి శ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక యాజులుగారు అప్పటికే 17 ఏళ్ళనుంచి రోజు రెండు సార్లు అగ్ని హోత్రాన్ని చేస్తున్నారు . .వీరిని ‘దువ్వూరి యాజులుగారు’’ అనే అందరూ పిలిచేవారు .రెండుకుటుంబాలు ప్రక్కప్రక్కనే ఉండేవి.,చివరి ఏడేళ్ళు నూతన  గృహం లో అగ్ని హోత్రం చేశారు .1915 లో కపిళేశ్వరపురం లో జన్మించిన  ఆయన ఆత్రేయస గోత్రీకులు .ఉదార హృదయులు .వీరి కుటుంబం లో నాలుగు తరాలవారు వేదం లో సర్టిఫికేట్ పొందినవారు .ఈయన మూడవ కొడుకు 27 ఏళ్ళకే వేదపండితుడయ్యాడు .మూడవ కొడుకు కొడుకు అంటే యాజులుగారి మనవడు ఘనాపాఠి.

  యాజులుగారు నాలుగేళ్ళు తండ్రి వద్దనే వేదం అభ్యసించారు .మరో అయిదేళ్ళు ముక్కామలలో బాబళ్ళశాస్త్రి గారి తండ్రి చిన్న సుబ్రహ్మణ్య సోమయాజులు గారి వద్ద  నేర్చారు .పరీక్ష ఇచ్చాక ,పెద్దక్క గారి భర్తవద్ద అంటే బావగారి వద్ద కోరుమిల్లి ,తణుకు వ్యాఘ్రేశ్వరాలలో చదివారు .శ్రౌతం తో మిగిలిన విషయాలనూ 24 వయేట 1939 కి పూర్తి  చేశారు .అప్పటికే పెళ్లి అయి ఒక కొడుకు,కూతురు  కలిగారు .శ్రౌతం నేరుస్తూ వేద పాఠాలు బోధించారు .’’నేను చదువుకో లేదు సంతకం చేయటం కూడా రాదు ‘’అని ఆరోజులను జ్ఞాపకం చేసుకొన్నారు .తర్వాతే రాయటం చదవటం అలవాటైంది .బడికి వెళ్ళనే లేదు .వేదం  తప్పమరే వ్యాపకం లేదు .తమతాతగారు ‘’ వైదికోగ్రవాది’’(మిలిటెంట్ వైదిక్ )అని చెప్పేవారు

  స్వస్తి వాచకం ,ఋగ్వేదం 1-8 9  క్రమ ఘన జట లు తప్పులు లేకుండా వల్లి౦చి నందుకు  పారితోషికాలు పొందారు .తప్పులు లేకుండా స్వస్తి చెప్పిన వారిని  ‘’వీరుని ‘’గా  భావించేవారట .అంటే హీరో అన్నమాట .సామూహిక స్వస్తి అంటే ఆయనకు చాలా ఇష్టం. అలా చేయటం లో ఎంతో ఉత్తేజం కలుగుతుందన్నారు. ఒకసారి శ్రీరామ పురం నుండి తమ బృందం భార్యలతో సహా హైదరాబాద్ వెళ్లి 27 రోజులు స్వస్తి చెప్పారు. అది అద్భుతమైన కాలం అని గుర్తు చేసుకొన్నారు. వేదం నేర్వటానికి తరచు ఊరు వదలి వెళ్ళాల్సి రావటం తో   తన పోరుగువారైన లంకా వారిలాగా వ్యవసాయం పై దృష్టి పెట్ట లేక పోయానని బాధ పడ్డారు . లంకావారు యాభై ఏళ్ళు వ్యవసాయం చేశారని చెప్పారు .

   ఆహితాగ్ని మనవడు, ఆహితాగ్ని కుమారుడు ఆహితాగ్ని అయిన తమ్ముడికి అన్న ,ఆహితాగ్ని బాబళ్ళ శాస్త్రి గారి ఆహితాగ్ని తండ్రిగారి  శిష్యుడు అయిన యాజులుగారు ‘’నా జీవితమంతా  శ్రౌతం లోనే గడిచింది .అది తప్ప నాకు వేరే ఏమీ తెలీదు ‘’అని చెప్పారు .ఇది పూర్తి సత్యం కాదు .ఎందుకంటె ముసలితనం లో కళ్ళు కనబడకపోయినా ,ఇతరుల సాయం తో నదికి వెళ్లి నిత్య స్నానం చేసేవారు .86 ఏళ్ళ వయసులో కూడా మనవడు కిరణ్ కు  వేదం నేర్పేవారు .ఈ వయసులోకంటి చూపు లేని వారెవ్వరూ  అలా బోధించినవారు లేరు .  జీవితం లో 1-ప్రధాన 2-మధ్య ౩- ముసలితనం అనే మూడు దశలుంటాయి .33 ఏళ్ళ వయసులోఅంటే మధ్య వయసు ప్రారంభం లో  యజ్ఞం చేయాలి .61వ ఏట కదలలేని స్తితి వస్తుంది .ఈ వయసులో కాళ్ళు చేతులు మనం చెప్పినట్లు వినవుకనుక కర్మకాండ కు ఇబ్బందికలుగుతుంది .బాబళ్ళశాస్త్రి గారు  అగ్ని హోత్రం ప్రారంభించే సమయానికి యాజులుగారు 30 వ ఏటనే 1945 నాటికి అగ్ని స్టోమం చేసి ఆహితాగ్నిలలో కూడా  ముందున్నారు  .  ఒక దశాబ్దం తర్వాత  ఆయన మేనల్లుడు  మిత్రనారాయణ అగ్ని హోత్రం ప్రారంభించి 22 వ ఏటనే యజ్ఞం చేసి  యాజులుగారి రికార్డ్ ను అధిగమించాడు .

   యాజులుగారి ఆధానం, అగ్ని హోత్రం కపిళేశ్వర పురం లోనే జరిగాయి .అన్నగారు చేస్తుంటే చూసి నేర్చుకున్నారు .నాలుగేళ్ల తర్వాత 1949 లో అక్కడే  అగ్ని చయనం,శ్రౌతం నిర్వహించారు  .ఇప్పుడూ పెద్దన్నగారిని ముందు చేయించి తాను చేశారు . చయనం,40 రోజుల అగ్ని చయన౦ ను పౌ౦డరీకం అంటారు. వీటిని చేయిస్తున్నప్పుడు తానే ఎందుకు పౌండ రీకం చేయకూడదు అనే ఆలోచనకలిగింది .శాస్త్రాలు తిరగేసి కావలసిన సమాచారం సేకరించారు .పౌ౦డరీకం లో ఉన్న మహా వ్రతం లో ‘’అంతర వేది’’పై   వేదం చదివిన బ్రహ్మచారి బ్రహ్మ చర్య దీక్ష చేబట్టలటానికి పుంశ్చలి అంటే వేశ్యతో సంభోగం చేయిస్తారు దీనివలన అతనిలో బ్రహ్మాండమైన వీర్య వృద్ధి జరుగుతుందని నమ్మకం .చాలా తెలివిగా దీన్ని నిర్వహించారు యాజులు గారు .

  వ్యాఘ్రేశ్వరం లోనిఆహితాగ్ని  బులుసు కామేశ్వర ,సత్యవతి దంపతులు తమ అగ్ని హోత్రాన్ని ఫోటోలు తీయటానికి ఆనందంగా ఒప్పుకున్నారు   .యాజులుగారి కి మనవడు సీతారామ శాస్త్రి  ఈ విషయం చెప్పగా దిగ్భ్రాంతి చెందారట .’’అగ్ని హోత్రాన్ని ఇతరులకు చూపించటం అంటే కన్నతల్లి వస్త్రాలను ఊడదీయటమే’’అన్నారట యాజులు .తన అగ్నిహోత్రం పవిత్రం రహస్యం అనే వారట .భార్య సూర్యసోమిదేవమ్మ గారినీ ఎవరికీ కనిపించ నిచ్చేవారుకారు .

 దువ్వూరి దంపతుల ఫోటో జత చేశాను చూడండి

   సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-18 –ఉయ్యూరు   ,

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

29-7-18 ఆదివారం ఉదయం మా ఇంట్లో స్వర్గీయ ఆర్ .ఎస్ .కే.మూర్తి గారి కోడలు డా .శ్రీమతి తుమ్మలపల్లి వాణీ కుమారి గారు

29-7-18 ఆదివారం ఉదయం మా ఇంట్లో స్వర్గీయ ఆర్ .ఎస్ .కే.మూర్తి గారి కోడలు డా .శ్రీమతి తుమ్మలపల్లి వాణీ కుమారి గారు

https://photos.google.com/share/AF1QipOruneWiC_SdGKtEHzjngrhI7-EZ-984wXfooTK8jpzsWKB6zGeA9KA9xv0h64zTQ?key=QTBHRFVTR01HcHZqaHJWT0wwYXRGWkZpNGlwamVR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -7

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -7

గురువుగా ఋత్విక్కు గా .తితిదే ఆస్థాన పండితునిగా దక్షిణ స్వీకరించని , అర్హులు కాని   వారితో సోమరసం తాగని   బాబళ్ల శాస్త్రి గారు  ఆనాటి వైదిక ఉన్నత బ్రాహ్మణులలో అరుదైన వ్యక్తి .ఆయన౦త వారు ఆయనే .ఆయన తర్వాత వేరెవరూ లేరు అన్నారు వారి ప్రక్కింటి సామవేదం వారు .1993 జూన్ 1  లో  తుంటి ఎముకకు గాయమైనప్పటినుంచి  మంచం పై దర్భ  పరచుకొని పడుకునే వారు .ప్రక్క మంచం పై కేన్సర్ వ్యాధితో చావు బతుకులమధ్య ఉన్న ఒక్కగానొక్క కుమారుడు బుల్లెబ్బాయి  పడుకోనేవాడు .శాస్త్రి గారి చేయి ఎప్పుడూ ఆప్యాయంగా అతని మీదనే ఉంచేవారు  .కుమారుడికంటే తన ‘’అంత్యేస్టి’’ము౦దు జరిగితే బాగుండుననికోరుకొనేవారు .ఇలా జరిగితే తండ్రి శ్రార్ధం కొడుకు పెట్టే అవకాశం ఉంటుందని వారి భావన. కొడుకు చేతులమీదుగా చనిపోయానన్న సంతృప్తి మిగులుతుందని ఆశ .భగవంతుడు శాస్త్రిగారి కోరిక నెరవేర్చాడు .శాస్త్రిగారు 1993 ఆగస్ట్ 6 న ఉత్తమలోకాలకు వెడితే, 64 ఏళ్ళ కొడుకు ఆరు నెలల తర్వాత1994 జనవరి 1 న చనిపోయాడు .

ఆహితాగ్ని అయిన శాస్త్రిగారు మరణించారు కనుక వారికి ‘’బ్రహ్మ మేధ’’అంతిమ సంస్కారం జరగాలి .ఇది మూడుగంటలు త్రేతాగ్నులతో ఇతర దహన కృత్యాలతో పాటు ,ఎముకలను  మళ్ళీ  దహనం చేసి ,సోమ యాజులకు చేసే ప్రక్రియగా చేశారు .దీన్ని ‘’పునర్దహనం ‘’అంటారు .దీన్ని ‘’లోష్ట చితి ‘’   పై నిర్వహిస్తారు .శ్రీరామపురం ,నేదునూరు ,వ్యాఘ్రేశ్వర యువ ఆహితాగ్ని లు చూసిన మొదటి ‘’బ్రహ్మ మేధం ‘’.తర్వాత కాలం లో చాలామందికి జరిపారు .దువ్వూరి యాజులుగారి భార్య సూర్య గారికి ,పుల్లెలవారి భార్య కామేశ్వరిగారికీ,బులుసు చయనులు గారికి ,లంకావారికి ఇలాగే చేశారు .ఆహితాగ్ని మరణిస్తే మరణించిన క్షణం నుంచి ‘’అశౌచం ‘’అంటే’’ మైల’’ పాటించరు .బ్రహ్మ మేధం జరినప్పటినుంచి మైల పాటిస్తారు .తాను చనిపొతే పూనాలో ఉన్న తన ప్రియ శిష్యుడు ఆధ్యాత్మిక కుమారుడు   చిర్రావూరి  రామం వచ్చేదాకా అంత్యక్రియలు చేయవద్దనీ చావు మంచంలో ఉండగానే ఆదేశించారు శాస్త్రి గారు .టెలిగ్రా౦ అందుకొని రైల్లోపడి రాజమండ్రి వచ్చి టాక్సీలో  రోజున్నరతర్వాత  శ్రీరాంపురం చేరాడురామం . .చిక్కిశల్యమైన శాస్త్రిగారి పార్ధివ దేహాన్ని అగ్ని హోత్రం గదికి వెలుపల మంచు గడ్డలపై ఉంచారు .శాస్త్రీయంగా ,న్యాయబద్ధంగా ఆయన అప్పటికి ఇంకా చనిపోనట్లే లెక్క .

రామం రాగానే మిగిలినవారితోకలిసి శాస్త్రిగారి మండుతున్న  ‘’ఆరణి’’ చితులను బయటికి తీసి ,గార్హపత్యాగ్ని లో కలిపి ,ఆహవనీయ ,దక్షినణాగ్నిలో కూడా కలిపి  మూడిటిలోను మహాజ్వాల వచ్చేట్లు చేశారు .చివరి ఇష్టి ఇంటిలోనే నిర్వహించి ,ఆయన, భార్యా   చివరి రోజులలో చేయలేకపోయిన అగ్నిహోత్రం ఇష్టి ,అగ్రయనాలకు ప్రాయశ్చిత్త హోమాలు చేసి ఈ సమిధలను మూడు  కుండల లో గార్హపత్య ,ఆహవనీయ ,దక్షిణాగ్ని లుగా  సేకరించారు నాలుగవ కుండ గృహగ్ని ఔపసనాగ్ని లను మూడువైపులా తాళ్ళతో కట్టి ఇంటిబయటకు చేర్చి,కొడుకు బుల్లెబ్బాయి కి ఆసరాగా ఉంటూ ,భార్య సుందరి గారికి కడసారి చూపు కల్పించి , బుల్లెబ్బాయి  బతికి  ఉన్నాడు కనుక మనవడు మనవడు ప్రసాద్ అంత్యక్రియలలో పాల్గొన రాదుకనుక అతన్ని ఇంటివద్దనే ఉండిపొమ్మని ,స్మశానానికి పార్ధివ దేహాన్ని చేర్చి ,త్రేతాగ్నులను ఆయన దేహం పై ఉంచి ,ఆహవనీయాగ్నిని ఆయన శిరసు క్రింద ఉంచి ,దక్షిణాగ్ని ని, ఛాతీపై కుడివైపున ,గార్హ పత్యాగ్ని ని కుడి తొడవద్దఉంచి కట్టెపుల్లలను కప్పి యధా విధిగా దహనక్రియ పూర్తి  చేశారు .మూడుగంటలలో  ఆయన దేహం తాను ఇంతకాలం ఆరాధించిన  అగ్నికి ఆహుతై, ఆయన పవిత్రాగ్ని దేవునిలో  చేరిపోయారు.

బ్రహ్మ మేధ ,పునర్ దహన ,లోష్ట చితి విషయాలు  స్థానిక లౌకిక అపర కర్మలు చేయించేవారికి అవగాహన ఉండనివి .ఒకవేళ ఉన్నా వాటిని నిర్దుష్టంగా చేయించే సాహసం చేయలేరు .శాస్త్రిగారి అపరకర్మ అంటే దహనం తర్వాత రోజు నుంచి 12 వ రోజు వరకు నిర్వర్తించాల్సిన వాటిని అమలాపురం లోని ఆకొండి సూర్యనారాయణ గారిని పిలిపించి యధా విధిగా చేయించారు .13 వ రోజు ఆస్తి సంచయనం ,పునర్ దహనం ,లోష్ట చితి ఏర్పాటు లను చిర్రావూరి రామం గారు అనే  బాబళ్ళ శాస్త్రి గారి ముఖ్య శిష్యుడు ,ఆయనకు ఆధ్యాత్మిక కుమారుడు ,దువ్వూరి  యాజులు ,బులుసు చయనులు గారి సాయం తో పితృ మేధ సూత్రాలతో  చేశారు .ఇవి అందరికి అందుబాటులో లేనివి కనుక పుస్తకమే శరణ్యం .ఆయన చితాభస్మాన్ని భద్ర పరచి గంగలో కలపాల్సిన పనే లేదు,కారణం ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన కౌశికీనది సమీపం లోనే ఉ౦దికనుక . సపిండీకరణ జరిగిన రెండు వారాల తర్వాత ఇంట్లో ఉన్న ఆయతన మట్టి హోమ గుండాలను చిద్రం చేశారు .అయన ప్రేతాత్మ పితృ రూపం పొందింది .నెలమాసికాలు పెట్టారు .కొడుకు బుల్లెబ్బాయి నాలుగు పెట్టాడు .నాల్గవది పెట్టె రోజు ఉదయమే ఆయన చనిపోయాడు .శాస్త్రి గారి భార్యను వోదార్చటం ఎవరి తరమూకాలేదు .అసలే చెవుడు .ఇప్పుడు కొడుకు మరణం తో ,తాను గుడ్డి దాన్నీ అయ్యానని   రోదించింది .ఆమె కూడా జులై లో చనిపోయింది .విధవ అయిన కోడలు సావిత్రి రెండు తరాలు కళ్ళముందే అదృశ్యమవటం జీర్ణించు కోలేకపోయింది .

ఊరిజనం శాస్త్రి గారింటికి  ముహూర్తాలకోసం,ధర్మసందేహాలు తీర్చుకోవటానికి రావటం పరిపాటి  .  ఇప్పుడు మనవడు యజ్ఞేశ్వర ప్రసాద్ ఆ పని చేస్తున్నాడు .ఇతడు తాతగారి వద్ద ఎనభై రెండుపన్నాల  తైత్తిరీయం 19 వ ఏటికే నేర్చాడు .తర్వాత లౌకిక విద్యానేర్చి సైన్స్ గ్రాడ్యుయేట్ అయ్యాడు  .దగ్గర ఊరిలో టీచర్ గా పని చేశాడు .పాలకొల్లు పిల్ల లక్ష్మీ నరస కాంత ను వివాహమాడి వరుసగా అందమైన ముగ్గురు ఆడపిల్లలు రేఖ ,మాధురి ,కల్యాణి లకు  తండ్రి అయ్యాడు.దురదృస్టవశాత్తు  ఇక ఆమెకు సంతానం కలగదని డాక్టర్లు చెప్పారు .దీనితో’’ బ్రహ్మీ భూత ‘’బాబళ్ళ శాస్త్రిగారి వంశం ఆగిపోవటం విచారకరం .ప్రసాద్ సైన్స్ లెక్కలు  సోషల్  ,తెలుగు లను చక్కగా బోధించేవాడు .తెలుగు తప్ప ఆ విద్యలను హూణ విద్యలని ఆకాలం లో అనేవారు .అతడు అమలాపురం లోని గోదావరి మండల వేద పరిషత్ కు కార్యదర్శి .యవ్వనం లో ఋత్విక్కుగా బాగా రాణించాడు .తన పూర్వీకుల శ్రౌతం తమకు అచ్చిరాలేదని భావించాడు .

తన తాతగారు తన తండ్రికంటే పూర్తి అధికారి  తనను తీర్చి దిద్దింది ఆయనే అనేవాడు ప్రసాద్ .తాతగారి సలహా ఆనాడు దైవాజ్న గా భావించేవారు .స్మార్తం లో ప్రతి సూక్ష్మ విషయం తాతగారికి తెలుసునని కాని ఎన్నడూ దాన్ని కర్మకాండలకు వాడలేదని అన్నాడు .తమ ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నీ తరతరాలుగా ఇంటి పురోహితుడు,గా ఉన్న   అగ్రహారం లోని ఆహితాగ్ని బులుసు చయనులు గారే చేసేవారని అన్నారు.వేద సభలకు ,పెళ్లిళ్లకు ఉపనయనాలకు వచ్చే ఆహితాగ్ని బ్రాహ్మణులకు ఆహితాగ్ని అవసరం ఉందని గ్రహించి శాస్త్రి గారు ,అర్ధాంగి సుందరిగారు 1970 నుండి 1990 వరకు ఇరవై ఏళ్ళు శ్రావణ ,భాద్రపద మాసాలలో ముక్కామలకు వెళ్లి నలభై రోజులు ఉండి ఆమె చేతిమీదుగా వంట చేయించి ఆహితాగ్ని వేదపండితులకు భోజనాలు పెట్టేవారు .దీన్ని శాస్త్రిగారు ‘’ప్రసాదం ‘’అనేవారు .19 80 లో ఒక విదేశీ ఇక్కడికి విషయాలు తెలుసుకోనాలనే ఆసక్తితో  వస్తే, అతనితో శాస్త్రిగారు ‘’మీరు మాలో ఒకరు .మీరు ఇక్కడి వారికంటేమా సంప్రదాయాలు, ఆచారాలు తెలుసుకోవటానికి మిక్కిలి ఉత్సాహం ,ఆసక్తి చూపిస్తున్న సహృదయులు .ఏదో పూర్వ జన్మ వశాత్తు మీరు ఆదేశం లో పుట్టారు .కాని మీరు మా దేశానికి, మా ప్రాంతానికి ,మా సంప్రదాయానికి చెందిన వారే ‘’అని మనస్పూర్తిగా ఆహ్వానించిన గొప్పసంస్కారి శాస్త్రి గారు .

చిర్రావూరి రామం శాస్త్రిగారి అంతేవాసి, ఆత్మీయ సుపుత్రుని వంటి వారు  అందుకే శాస్త్రి గారు తన అన్త్యేస్టి ఈయన వచ్చాకనే జరగాలని కోరారు .గురువుగారికి ఇస్టిలో చాలా ఏళ్ళు సహాయకులుగా ఉన్నారు .కలిసి వేదం ,మీమాంస,వ్యాకరణం  తర్కం నేర్చారు .ఆయన రాజమండ్రిలో ప్రభుత్వ ఓరిఎంటల్  కాలేజిలో సంసృతం బోధించారు .శాస్త్రిగారి మరణ సమయం లోనూ వారు  ఉద్యోగం  చేస్తూనే ఉన్నారు  .పూనా యూనివర్సిటి లో బోధన   చేసినా , నచ్చక వదిలేశారు .వేదాలలో ప్రాచీన విజ్ఞానం ఉందని అంటారు .ఆయనకు ‘’సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ ది సైన్సెస్ అఫ్ ఎన్శేంట్ ఇండియా’’ స్థాపించాలని ఉండేది .దీనిద్వారా కుష్టు ,ల్యూకో డేర్మా ,చెవుడు ,పాముకాటు ,జ్వరం ,గుండె జబ్బు ,క్షయ ,తెల్లజుట్టు మొదలైన వాటి నివారణకు మందులు కనిపెట్టాలని ఆయన ఆలోచన .భోపాల్ గాస్ దుర్ఘటనలో కంటి చూపు కోల్పోయిన వారికి కంటి చూపు తెప్పించటానికి ,వేదపండితులచే అక్కడ హోమాలు చేయించారు .

బాబళ్ళ శాస్త్రిగారి మరణం శ్రీరామపురం,నేదునూరు ,వ్యాఘ్రేశ్వరం లలోని   నలుగురు ఆహితాగ్నులపై ప్రభావం చూపించింది .భావి తరాలను ప్రభావితం చేసే శాస్త్రి గారు లేకపోవటం పెద్ద లోటే అని ఆ అగాధాన్ని పూడ్చలేమని అనుకున్నారు .శాస్త్రిగారి నిజాయితీ ,సమర్ధత ,ముందుచూపు ,సద్యో స్పందన  నిజాన్ని గుర్తించే నైజం ఇతరులెవ్వరిలోను లేనివి, రానివి, రాలేనివికూడా .ఒకసారి శాస్త్రి గారు ఏదో గ్రంధం తిరగేస్తున్న దువ్వూరి యాజులు గారిని చూసి ఏం చేస్తున్నారు ?అని అడిగితె ఆయన ‘’గ్రంధం తిరగేస్తున్నా ‘’అనగానే ‘’ఎందుకా శ్రమ ?మీరే ఒక ఉద్గ్రంధం కదా ‘’అన్నారట .అదీ ఆ మనీషి  గొప్పతనం .

మరో ఆహితాగ్ని గురించి తర్వాత తెలుసుకొందాం .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ – 28-7-18 –ఉయ్యూరు

 

.

 

 

 

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -6

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -6

1962 లో శాస్త్రిగారికి శ్రీరాం పురం లో ఒక ఇళ్లస్థలం ఏర్పాటు చేయబడగా కుటుంబాన్ని ముక్కామల నుంచి ఇక్కడికి మార్చారు .ఆయన మనసులో సప్తగోదావరి ఎప్పుడూ మసలుతూ ఉండేది .కౌశికుడైన విశ్వామిత్రుని వరం గా తలుస్తూ ఉండేవారు ,స్థలం ఇచ్చినవారు ఇల్లు కట్టుకోవటానికి ధనమూ అందజేయటం తో కట్టుకొని అందులో అగ్ని హోత్ర గదినీ ఏర్పాటు చేసుకున్నారు .దాత  15 బస్తాలు పండే ఒక ఎకరం పల్లం భూమిని కూడా ఇచ్చాడు .నిత్యాగ్ని హోత్రులు, ఆహితాగ్ని అవటం, వేద పండితులకు నిరంతరం ఆ దంపతులు అతిధ్యమిస్తూ ఉండటం వలన దాత వీరికి రోడ్డు ప్రక్కనే ఉన్న స్థలం ఇచ్చి అతిధి అభ్యాగతులెవరు ఊళ్లోకి వచ్చినా తెలుసుకొనే వీలు కల్పించాడు .ఏ ఆహితాగ్ని అయినా  వేరొక ఆహితాగ్ని ఇంట్లో ఆయన భార్య చేతి వంటతింటాడు .ఆమె  ఇచ్చిన ఉదకం పుచ్చుకొంటాడు .అది విధానం .అందుకని ముక్కామల ,సీతారామపురం ,వ్యాఘ్రేశ్వరాలలో వేదసభలు జరిగినప్పుడల్లా వీరంతా శాస్త్రి గారింటికి వచ్చి ఆతిధ్యం పొంది వెళ్ళేవారు .తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులను వేదం విద్యను  అమితంగా పోషించింది .వారికి నెలవారీ వేతనం ,స్తైఫ౦డ్ ,పెన్షన్ ,గౌరవ భ్రుతి వగైరాలను కలిపించి వారి జీవితాలలో వెలుగులు నింపింది .ఈ దేవస్థానం చాలాసార్లు శాస్త్రిగారిని వచ్చి వేదపారాయణ చేయమని  కనీసం గౌరవ భ్రుతి స్వీకరించమని కోరింది .’’ఆహితాగ్ని వేదాన్ని అమ్ముకోడు ‘అని చెప్పి సున్నితంగా తిరస్కరించేవారాయన .వేద విక్రయం మహా పాపం అని భావించేవారు .కనుక వారెప్పుడూ దాన గ్రహీతగా లేరు .ఎప్పుడూ ‘’అపరిగ్రాహీత ‘’గానే ఉండి పోయారు .తిరుపతి దేవస్తానం పట్టువదలని విక్రమార్కుడి లా వెంటపడుతూనే ఉంది .ఆయన ఇక ఒప్పుకోరు అని గ్రహించి ఆయనను పెన్షన్ ప్లాన్ లో చేర్చి , ఉద్యోగం లేని ఆయన కుమారుడికి   బహుమానంగా అందజేసింది .వేద పరీక్షలకు శాస్త్రిగారిని పరీక్షాదికారిగా ఆహ్వానించినా తన విది సంతృప్తికరంగాచేసేవారే కాని దానికిచ్చే భ్రుతిని ఎన్నడూ స్వీకరించని నిస్టా గరిస్టులాయన.తప్పని సరై కనీసం శాలువా అయినా కప్పే భాగ్యం కలిగించమని వేడితే   ‘’సరే ఇది దత్తాత్రేయునికి సమర్పణ ‘’అని నవ్వేవారు .తర్వాత దాన్ని వేరొకరికి కప్పి సంతృప్తి పడేవారు .14 వ శతాబ్ది కి చెందిన అద్వైత మత ప్రచారకులు ‘’పంచదశి ‘’వంటి వేదాంత గ్రంథ కర్త విజయనగర సామ్రాజ్య స్థాపనా చారులు  శ్రీ   విద్యారణ్య స్వామి  దేవాలయం కౌశికనదీ తీరం లో ,తమ ఇంటికి అతి సమీపం లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని జపతపాలకు అక్కడ అందరికి వసతిగా ఉంటుందని  శాస్త్రి గారు భావించి ,చివరకు విద్యారణ్యులవారి గురించి జనాలకు పెద్దగా తెలియదని విరమించుకున్నారు .కాని అత్రి మహర్షి కుమారుడు దత్తాత్రేయ స్వామి బహుజన హితుడు అని భావించి ,ఆయన త్రిమూర్తి స్వరూపుడు అవటం తో మొగ్గు చూపారు .కొందరు దత్తాత్రేయుడు వేదం చెప్పిన దేవత కాడు అనగా బోసినవ్వుతో ‘’విష్ణువు గార్హపత్యాగ్నిలో ,శివుడు దక్షిణాగ్ని లో ,బ్రహ్మ ఆహవనీయాగ్నిగా ఉన్నారు ‘’అని బదులు చెప్పారు .ఇంతటి గొప్ప ఆహితాగ్ని ,విశిష్ట వేదపండితులైన శాస్త్రిగారి ‘’అగ్ని హోత్రం గది ‘ని స్థానికు లెవ్వరూ  చూడనే లేదు చూసే అవకాశమూ దొరికేదికాదు . 1987 లో ఒక ఉత్సాహవంతుడైన దాత ముందుకు రావటం తో చిన్న దత్తాత్రేయ దేవాలయాన్ని శాస్త్రి గారు విధి విధానంగా  నిర్మించి తనకోరిక తీర్చుకున్నారు .దీని చుట్టూ రావి, మర్రి ,వేప ,మేడి వంటి పవిత్ర వృక్షాలు పెంచటానికి స్థలం సేకరించాలనీ  అనుకున్నారు .ఈ వృక్షాలను ,దత్తాత్రేయస్వామిని దర్శించే ప్రజలకు మనో భీస్టి కలుగుతుందని అభిప్రాయ పడ్డాడు .

బాబళ్ల శాస్త్రి గారు ముక్కు సూటి మనిషి .స్వేచ్చాజీవి .సంభాషణలో తన విద్యాగర్వంప్రదర్శించరు .చాలా నిక్కచ్చిగా అభిప్రాయాలు చెప్పటం ఆయన నైజం .బహు విద్యలలో ఆరితేరిన పండితులు కూడా, బ్రహ్మ చెవుడు తో బాధపడుతున్న శాస్త్రి గారి వద్దకు వచ్చి సందేహ నివృత్తి చేసుకొనేవారు .పంచములు కూడా వారి దర్శనం చేసుకొని తరించేవాళ్ళు .అందుకే స్థానికులు వారిని ‘’మహా పురుషుడు ‘’అన్నారు .ఇలాంటి వారిని ఆంగ్లం లో ‘’క్రాకర్ బారల్ ఫిలాసఫర్స్ ‘’అంటారు . మహాపండితులైనా ,అక్షరం ముక్క రాని వారైనా ఆయనను ఏదైనా దిగితే తక్షణ సమాధానం చెప్పే సంస్కారి .పరులకోసమే తప్ప తనకోసం జీవించని ఉత్తమ పురుషులు శాస్త్రి గారు .

శ్రీరామ పురం లో’’ శాస్త్రిగారి అరుగు’’ వేదపండితులతో, వారి మధ్యఅనేక విషయాలపై  చర్చలతో హోరెత్తి పోయేది .ఒక్కోసారి ఆయన అధ్యాపనానికి ఇబ్బందీ కలిగేది .అదొక మినీ సభా ప్రాంగణ౦ గా  భాసిం చేది . ఆయన దీనికి సాక్షీభూతంగా ఉంటూ ,ఉద్రేకాలకు వారు లోనుకాకుండా చూస్తూ ,అర్ధవంతమైన సమతుల్యమైన చర్చలుగా మార్చేసేవారు .ఘర్షణ వాతావరణాన్ని నివారించి ప్రశా౦తత కల్గించటం ఆయన నేర్పు .శాస్త్రిగారి అరుగు గురించి విన్నవారికి కృష్ణ శాస్త్రిగారు రచినన ‘’మా అరుగు ‘’గు ర్తుకు రావటం సహజం . శాస్త్రాలలో నిష్ణాతులే అయినా ,కాలానికంటే ముందే ఉండే ఆలోచనా పరులాయన .దేశం లో విస్తరించిన బహు  సంస్కృతుల వ్యాప్తిని చూసినవారు .కనుక సహనానికి ప్రతీకగా ఉండేవారు .

శాస్త్రిగారిలో పవిత్రత ,విలువలు ప్రత్యక్షాలు .అప్పటికే అదృశ్యమైన సువర్ణ యుగానికి ఆయన వెలకట్టలేని వారధి .ఆయన క్రోధినామ సంవత్సర మార్గ శిర శుద్ధ చవితి నాడు జన్మిచి ,దుందుభి నామ సంవత్సర జ్యేష్ట శుద్ధ౦లొసు౦దరిగారిని వివాహమాడి నట్లు ప్రసంగవశాత్తు  తరచుగా చెప్పేవారు.  19 వశతాబ్దం లో తమ తండ్రి ,గురువులు నడచిన మార్గాన్నే శాశ్వతం చేసే ప్రయత్నం తాను చేశాను అనేవారు .ధర్మవిషయం  లో, కర్మకాండ విషయం లో ఆయన చాలా నిక్కచ్చి .ఆధునికతను దీనిలో ప్రవేశించటానికి అంగీకరించని వ్యక్తిత్వం ఆయనది .సాధారణ శ్రౌత విధులకు కట్టుబడే ఉండాలని ,సూత్రప్రాయంగా అంగీకరించేవారు .ఒక్కసారి మాత్రమే లంకా వారి యజ్ఞం లో తన మాట, మార్గం నుంచి కొంచెం ప్రక్కకు జరగాల్సి వచ్చిందని బాధ పడ్డారు. లంకావారి అగ్ని స్టోమం లో చిన్న సదస్యం పాత్ర అంటే 17 వ పురోహితుడిగా,  బ్రహ్మకు సహాయకుడిగా ఉండాల్సి వచ్చిందట .

తమ ‘’అపరిగ్రహత్వం ‘’,అనే స్వచ్చంద నియమం వలన  కర్మ కాండ లకు  వెళ్ళేవారు కాదు .వేదవిద్యాభ్యసనం చేసిన ఏ శిష్యుని నుంచీ ఆయన ఒక్క దమ్మిడీ కూడా దక్షిణగా పుచ్చుకోలేదు .రుత్విజులకిచ్చే దక్షిణ  స్వీకరించే వారు కాదు .ఇలా పుచ్చుకుంటే వేద విక్రయం అని వారి గట్టి నమ్మకం .భూమిఎవరైనా దానం ఇస్తే తీసుకోవటానికి, శ్రౌత క్రియలకు దక్షిణ తీసుకోవటానికి తేడా ఉందంటారు .ఋత్విక్కు గా ఉండటానికి కూడా పెద్దగా ఇష్టపడే వారు కాదు .సరైన శిక్షణ లేని వారితో ,సరైన సంబారాలు లేకుండా చేస్తే దాని ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది అంటారు .సంప్రదాయంగా వస్తున్నా వేదం విద్యాభ్యాసం లో కొన్ని తప్పులు జరుగుతాయనీ  ,పరీక్షా విధానం సరళతరం చేస్తున్నారని ,గురు ముఖ విద్య కంటే పుస్తకాలతో నేర్చుకోవటం ఆయన అంగీకరించలేదు .దీని వలన క్రియలో పొరబాట్లు జరిగి ,క్రియలకు తగిన మంత్రాలు చెప్పకపోవటం జరిగి చేసే వాడికీ చేయి౦చేవాడికి మాత్రమేకాకుండా విశ్వానికి కూడా అనర్ధం జరుగుతుంది అనేవారు .అందుకే రుత్విజ  శిక్షణ పాసైనవారితో కలిసి పని చేయటం ఇష్టం ఉండేదికాదు  .వారిలో పరిపూర్ణత ఉంటుందనటం తనకు తెలీని విషయం అనేవారు .చాలా సార్లు సోమభక్షణ లోని ప్రమాదాలపై   ఆయన హెచ్చరించేవారు .కాలం లో ఎన్నోమార్పులోస్తున్నాయి .భమిడి పాటి వంశం లోనే అగ్నిస్టో  మానికి  18 మంది ఋత్విజులు,సర్వతోముఖానికి తగినంత మంది  తయారయ్యారని సంతోషంగా చెప్పేవారు .

ఒకప్పుడు నాలుగు గైదు రోజులు చెసేఉపనయన౦  ఇవాళ కొన్ని గంటల తంతు తో సరిపుచ్చటం ఆయనకు నచ్చని విషయం .అలాంటివాడు ఏ విధంగా బ్రాహ్మణుడు అనిపించుకొంటాడని ప్రశ్నిస్తారు .తన ఆహితాగ్నిగురువు బులుసు సోమయాజులు గారు అని గర్వంగా శాస్త్రిగారు చెప్పుకొంటారు .’’అభిచారం’’ ఎలా చేయాలో ఆయనే దగ్గరుండి నేర్పారని కృతజ్ఞత తెలియ జేస్తారు .నిత్యాగ్ని హోత్ర విధానం లో తనకు ఎన్నో అద్భుత దృశ్యాలు కనపడినాయన్నారు . .ఒక సారి అగ్ని హోత్ర సమయంలో ఒక అద్భుత తేజస్సు హోమం నుండి బయటికి వచ్చి తన కళ్ళ ముందు దర్శనమిచ్చిందని ఇదొక శుభ సూచనగా తాను భావించానని ,తన కోడలు ప్రసవించి మగపిల్లాడికి జన్మ నిచ్చిందని ఆనందంగా చెప్పారు .మరో సారి ఆహవనీయాగ్ని పూజ చేస్తుంటే ఒక చతుర్భుజ పురుషుడు కనిపించాడని ,దీని ఫలితం ఏమిటి అని ఆలోచించగా ,రెండవ మనవడుకూడా త్వరలోనే రాబోతున్నాడని తెలిసిందని ఆ’’వేదపండు’’అయిన ఆహితాగ్నిబాబళ్ళ శాస్త్రిగారనే  బ్రహ్మశ్రీ భమిడిపాటి యజ్నేశ్వర సోమయాజులు గారు చెప్పారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-18 –ఉయ్యూరు     .

 

 

 

 

 

 

 

 

 



— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5

బాబళ్ళ శాస్త్రి గారు 82 పన్నాలు పూర్తి  చేయగానే,తనకు సంక్రమించిన’’ గంగలకుర్రు పొలాలపై  అజమాయిషీ చేస్తూ ,  ,కొద్దిమందికి వేదపాఠాలు చెబుతూ ,తాను తైత్తిరీయ శాఖపై సాధించిన పట్టు ను నిలబెట్టుకొంటూ మరింత ముందుకు సాగారు .వేదం ,శ్రౌతం ,ధర్మ శాస్త్రం, మీమాంస , జ్యోతిషం,వేదాంతం, వ్యాకరణం మొదలైన వాటిపై లోతైన అవగాహన సాధించి తన జ్ఞాన  తృష్ణ తీర్చుకున్నారు .అనునిత్యం వీటిని స్పృశిస్తూ అవగాహన పెంచుకున్నారు .వార్ధక్యం లో కూడా ,చెవుడు వచ్చినా కళ్ళు సరిగ్గా  కనిపించక పోయినా ,రోజూ ఏదో ఒక తాటాకు గ్రంధాన్ని కంటి సులోచానాలకు  రెండుమూడు అంగుళాల దూరం లో ఉంచుకుని పరిశీలించేవారు .అంతటి విజ్ఞాన తృష్ణ ఉండేది .

  తమ తండ్రిగారు తన జీవితం లో ఆర్దికబాధలకు గురికాకుండా ఆర్దికసౌకర్యం కలిగించినందుకు కృతజ్ఞతలు చెప్పుకొనేవారు .తండ్రిగారితో తన అనుబంధం చాలా గొప్పదని అనేవారు .తన చదువు నిరాటంకంగా సాగాలని తండ్రి కోరేవారు .ప్రతి విషయం పై ఆయనే శ్రద్ధ చూపేవారు .తనకే రకమైన ఇబ్బంది కలిగించలేదు .యవ్వనమంతా ఉయ్యాలలో ఊగుతూ సుఖ సంతోషాలతో గడిపారు .తండ్రిగారి కంటే తక్కువ మంది విద్యార్ధులను చేర్చుకొని వారిపై పూర్తీ అంకితభావం తో బోధించేవారు .గ్రంథ పఠన కాలం లోకూడా నలుగురు విద్యార్ధులు ఇంట్లో ఉండేవారు .తన మనవడు ప్రసాద్ కు  కూడా 82 పన్నాలు 19 71 నుండి 19 80 వరకు తొమ్మిదేళ్ళు క్షుణ్ణంగా నేర్పిన గురూత్తములాయన .పరీక్షలకు కట్టకపోయినా ప్రసాద్ 1986 లో దగ్గర స్కూల్ లో స్కూల్ మాస్టర్ అయ్యాడు.తాతగారితో నిత్యం పొలాలకు వెళ్లివచ్చేవాడు    .అతని సహాధ్యాయులు చిర్రావూరి రామం ,శ్రీపాద మాణిక్య ,,ప్రభల కృష్ణమూర్తి ,సామవేదం నారాయణ .వీరిలో ఎవరో ఒకరు ప్రసాద్ వెంట తాతగారితో వెళ్ళేవారు .వీరుకాక ఆయనవద్ద నేర్చిన వారు కోనసీమలో చాలామంది వేదపండితులైనారు.పొలాల గట్లమీదో, కొబ్బరి చెట్ల నీడనో కూర్చుని వీరు అధ్యయనం సాగిస్తూ కన్పించేవారు  .వీరిని శాస్త్రిగారు పర్యవేక్షిస్తూ ఉండేవారు .మధ్యాహ్న సమయానికి ఇంటికి చేరి ఉదయ పాఠాలను సమీక్షి౦చుకోనేవారు .నాగలిపట్టి భూమిని దున్నగలిగే  శాస్త్రిగారు ముసలితనం లో పర్యవేక్షణకే పరిమితమయ్యారు .

  వేదపరీక్షలను నిర్దుష్టంగా కఠినంగా జరిపేవారు  శాస్త్రి గారు .అందుకే మనవడు ప్రసాద్ పరిషత్ పరీక్షలకు హాజరవ లేదు .శాస్త్రి గారు ,మరికొందరు సహాధ్యాయులైన వేదపండితులు కలిసి తాము కొంత ధనం వేసుకుని, కొంత వితరణ శీలురవద్ద సేకరించి ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు .దీనితో వేదం సంస్కృతం ,శ్రౌతం స్మార్తం ,అపరం ,ఆగమం ,మీమాంస ,వ్యాకరణం మొదలైన విషయాలపై అమలాపురం ,రాజమండ్రి ,మొదలైన చోట్ల లో సభలు జరిపి పరీక్ష లు నిర్వహించి ఉత్తీర్నులైనవారికి పురస్కారాలు అందించారు .1987 వైశాఖమాసం లో వ్యాఘ్రేశ్వర గ్రామం  ముందుకు వచ్చి వీటికి పూర్తి  సహకారం అందించి ,ఆతిధ్యమిచ్చింది .30 మంది వేదం లో ,నలుగురు స్మార్తం లో ,ఒకరు  ఆగమం లో  పరీక్షనిచ్చారు. వీరంతా పది నుంచి పన్నెండేళ్ళు కస్టపడి విద్యనేర్చినవారే .రెండు  రోజుల పాటు వివిధ శాస్త్రాలలో , ,వేదపారాయణ  లో పరీక్షలు నిర్వహించి ,రెండవ రోజు సాయంత్రం ఉత్తీర్ణు లైనవారినీ, ,నిష్ణాతులైన గురువులను ఘనంగా సన్మానించి చిరస్మరణీయం చేశారు .ఉత్తీర్ణులైన విద్యార్ధులకు 150 నుంచి 200 రూపాయలవరకు ప్రోత్సాహక నగదు పారితోషికాలను అందజేశారు .

  శాస్త్రిగారికి నడి వయస్సు  నాటికి కుటుంబం లో శ్రౌతం ఉత్కృష్ట స్థితిపొంది ,ఆహితాగ్నులు పెరిగి తానుస్వయంగా ఏదీ చేసుకోవాల్సిన అవసరం కలగలేదు .ఆయనకు ఎన్నో చోట్లనుండి ఆహ్వానాలు వచ్చాయి .కాని వెళ్ళటానికి ఇష్టపడలేదు .’’వెళ్ళే ధైర్యం నాకు లేకపోయింది ‘’అని నవ్వుతూ చెప్పేవారు .1959 లో 55 వ ఏడు వచ్చేదాకా నిత్యాగ్ని హోత్రానికి ఆధానం చేసేవారు.ఆరునెలల తర్వాత’’అగ్ని స్టోమం ‘’ మొదటి సోమ క్రతువు  చేశారు .దీనినే కోనసీమలో యజ్ఞం అంటారు .దగ్గరలో నేదునూరు గ్రామవాసి ,ఆయన స్నేహితుడు ,వేదం లో విశేషమైన ప్రాభవం ఉన్న  లంకా వెంకటరామ శాస్త్రిగారు అధ్వర్యు గా వ్యవహరించారు .లంకావారు కొద్ది రోజుల్లో అగ్ని స్టోమం పూర్తి  చేసే ఏర్పాట్లలో ఉన్నారు .శాస్త్రిగారి యజ్ఞం అందరిలో గొప్ప ఉత్సాహం కలిగించి శ్రౌతానికి మహోన్నత దశ అయింది .ఇలా అయిదేళ్ళు  గడిపారు..ఆయన గౌరవం విపరీత౦ గాపెరిగి కుటుంబం లో అగ్రహారాలలో కోససీమ అంతా ఆయనకు బ్రహ్మ రధం పట్టింది .’’నా పూర్వీకులు చేసిన దానినే నేనూ కొనసాగిస్తున్నాను అన్న సంతృప్తి నాది ‘’అనే వారాయన .అగ్ని స్టోమం తర్వాత ‘’శ్రావణ పశు ‘’ నిర్వహించారు .1960 లో భాద్ర పదమాసం లో ‘’అరుణ కేతుక ‘’చేశారు .ఇందులోఅగ్ని హోత్రం లో ప్రతీకాత్మక ఇటుకలు ,  నీటి నైవేద్యం ఉంటాయి,శాస్త్రిగారి పెంపుడు తాబేలు దీనికి సహకరి౦చి౦ది . దీనికి 12 రోజులు మదూకరం ఎత్తాలి .ఎప్పుడో బ్రహ్మ చర్యం లో చేసింది ఇప్పుడు మళ్ళీ చేయటం అన్నమాట .చాతుర్మాస్య ఆహుతులను సమర్పించాలి .కొత్తపంట చేతికి వచ్చే సమయం లో ‘’అగ్రయనం ‘’చేయాలి .ఇలా శాస్త్రి గారు అర్ధా౦గి  సుందరి దంపతులు 1990 లో ఆయన 87 వ ఏడు ,ఆమెకు 81 వచ్చేదాకా చేశారు . .1991 లో ఇద్దరూ చెవిటి వారు ఆవటం తోదీన్ని మొట్టమొదటి సారి గా వదిలేశారు.యధావిధిగా నిత్యాగ్ని హోత్రం ఇష్టి చేశారు .

 శాస్త్రిగారి ప్రత్యేకత దీర్ఘకాలం నిర్వహించే నక్షత్ర ,లేక పవిత్ర హోమాలలో కనిపిస్తుంది .సాధారణంగా  గ్రహశాంతి  కోసం నవగ్రహ పూజలుచేసి , దానాలు ఇస్తూ ఉంటారు .శ్రీరామ పురానికి నడక దూరం లోనే శనీశ్వర దేవాలయం మందపల్లి లో ఉంది .హిందువులతోపాటు ముస్లిం లు, క్రిస్తియన్లు కూడా ఈ దేవాలయం దర్శించి శనిబాద నివృత్తి చేసుకొంటారు .శాస్త్రిగారు ఏనాడూ మందపల్లి వెళ్లనూ లేదు లేక మరో చోటనైనా నవగ్రహ పూజ చేయలేదు .శాస్త్రిగారు నలభై రోజుల నక్షత్ర ఇష్టి మాత్రం చేసేవారు .1960 వరకు ఇవి నిరాటంకంగా సాగాయి .అది ఆయన శక్తి పరవళ్ళు తొక్కిన కాలం .ఆయనకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి .చయనం లో యజమాని  దీక్ష తీసుకోకుండా యజ్నవాటిక ఇటుకలు తాకరాదు.తాకితే చేతికి గ్లోవ్స్ లేకుండా ఎలక్ట్రీషియన్  విద్యుత్ప్రవహించే తీగలను ముట్టుకొంటే ఎలా షాక్ తగిలి చస్తాడో అలా అగ్ని దేవుడు దహిస్తాడు అని నమ్మకం .సోమాన్ని అగ్నిలో వ్రేల్చి సోమయాజి అయితే జీవితాన్ని  సరైన మార్గం లోఅంటే  గాడిలో బండి నడిచినట్లు హాయిగా గడపగలడు.

 సశేషం

 గురుపౌర్ణమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4

కోనసీమలో ఉచ్చస్థితి లో ,స్వర్ణ యుగం గా ఉన్న శ్రౌత కార్యక్రమాలు 1980 నాటికి  ప్రాభవం కోల్పోయాయి .కాని దెందుకూరి ,విష్ణు భొట్ల ,వంటి కొన్ని కుటుంబాలు మాత్రమే శ్రౌతాన్ని కొనసాగిస్తున్నాయి .1940లో శ్రీ డొక్కా రామయ్య అనే ధనిక వితరణ శీలి అయిన బ్రాహ్మణుడు వేద పండితులకు శ్రీరామ పురం అగ్రహారాన్ని ఇచ్చిఉండటానికి  ఏర్పాటు చేశాడు .అప్పుడు 14 మాత్రమే బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి .ఈశ్వర ,రాధాకృష్ణ ,సూర్య ,అంబిక ,విఘ్నేశ్వరులతో కూడిన ఒక పంచాయతన దేవాలయం ఉండేది ,ఒకే ఒక్క మట్టి ముఖ్యవీది,ఒక చిన్న బడి ,పోస్టాఫీసు ,సుబ్రహ్మణ్య దత్తాత్రేయ మందిరాలు ఉండేవి .కుగ్రామమే అయినా ,వైదిక బ్రాహ్మణులు లౌకిక బ్రాహ్మణులతో కలిసి భోజనం చేసేవారుకాదు .కనుక వేరు వేరుగా వైదిక ,లౌకిక బ్రాహ్మణులు నివసించేవారు   .ఆహితాగ్ని లు ఆహితాగ్నిలు కాని వారింట భోజనం చేసేవారుకాదు  వారి ఆడవారు వండినా తినే వారుకాదు .  దీనికి దగ్గరలో  ప్రధాన రహ దారికి బహుదూరం లో కామేశ్వరి అగ్రహారంలో  కొద్దిమ౦ది బ్రాహ్మణులుండేవారు .వేద విధానం ఉచ్చస్థితిలో ఉన్నాకూడా  ,త్రేతాగ్నులను అర్చిస్తున్న ఆహిఆగ్నులు, వేదపండితులుతమపిల్లలకు నేర్పుకొంటూ ఈరెండు అగ్రహారాలలో ఉండేవారు .ఈ రెండూ అమలాపురం కాలువకు చెరి ఒకవైపున ఉండేవి .శ్రీరామ పురానికి మైలున్నరదూరం లోఉన్న  వ్యాఘ్రేశ్వరం  ఒకప్పటి అగ్రహారం .ఇక్కడ ముగ్గురు ఆహితాగ్నులు ఉండేవారు .అంటే అతి సమీపం లో ఉన్న ఈ గ్రామాలలో మొత్తం మీద ఏడుగురు ఆహితాగ్ని లుండేవారు .గోదావరి నదిపై ఉన్న ఇరగవరం బ్రాహ్మణపల్లెలో వేదపండితులు ఎక్కువ .

  బ్రహ్మశ్రీ భమిడిపాటి యజ్ఞేశ్వర సోమయాజి

 కోన సీమలోని లోని శ్రీరామపురం అగ్రహార వాసి బ్రాహ్మశ్రీ భమిడిపాటి యజ్ఞేశ్వర సోమయాజి గారు .వీరిని అందరూ ‘’బాబళ్ళశాస్త్రి గారు ‘’అని పిలుస్తారు .వీరింట్లో మిగిలిన ఆహి తాగ్నిల ఇళ్ళల్లో లాగానే కుక్కలు ,పిల్లులు కనిపించవు .అదొక నియమం వారికి .శ్రౌత కర్మల సందర్భం లో ఇంట్లో కూర్మం అంటే తాబేలు  తిరగాలి .అప్పుడు దాన్ని అతిజాగ్రత్తగా కాపాడుకొంటారు .

 భమిడిపాటి యజ్ఞేశ్వర సోమయాజి గారు శ్రీ వత్స గోత్రీకులు .1930 లో జన్మించారు .దాదాపు ఇరవై వ శతబ్దం అంతా జీవించారు .బయట అరుగు పై కూర్చుని అందరితో సంభాషించేవారు .తొంభైవ పడికి దగ్గర పడుతున్న కొన్ని నెలలవరకు ఈ వ్యాసంగం సాగింది .భారత దేశం లో 19 ,20 శతాబ్దాలలోని ఆహితగ్ని లలో ఉత్కృష్టమైన వారు గా గణన కెక్కిన మహాను భావులాయన .ఆయన కుటుంబం లో మూల పురుషులు  18 వ శతాబ్దికి చెందిన భమిడిపాటి బ్రహ్మీకృత ఆచార్యులు .వివాహమాడి సంతానం పొందకుండానే  సన్యసించిన వారాయన .అదొక గొప్ప విషయంగా ఆనాడు చెప్పుకునేవారు .తండ్రి తరఫు వారిలో వీరభద్ర సోమయాజి ,అచ్యుతరామ సోమయాజులు ,యజ్ఞేశ్వర సోమయాజులు చిన సుబ్రహ్మణ్య సోమయాజి ,ముఖ్యులు . వీరిలో చిన సుబ్రహ్మణ్య సోమయాజులుగారే  బాబళ్ళ సోమయాజులగారి తండ్రిగారు .తల్లిగారు ఆకెళ్ళ వేద కుటుంబానికి చెందిన కామేశ్వరి .ఈ అయిదవతరం వారు ఆరవతరానికి జన్మ నిచ్చి ఆరుగురు కుమారులను కన్నారు. ఈ ఆరుగురూ ఆహితాగ్నులే .ఇందులో అయిదుగురు సోమయాజులయ్యారు .ఆరవ ఆయన కూడా అయ్యేవారు కాని అగ్ని స్టోమమ దశలో చనిపోయారు .

   బాబళ్ళ గారి ఒకే ఒక కుమారుడు ‘’బుల్లెబ్బాయి ‘’అని పిలువబడే సుబ్రహ్మణ్య సోమయాజి అంతుపట్టని వ్యాధులతో ఇబ్బందిపడి వేదపండితుడు కాకుండానే మరణించి పుత్రశోకం కలిగించగా  ,ఇరవై  రోజుల ఏకైక  కుమార్తెకూడా చనిపోవటం ఆ కుటుంబానికి  ఆశినిపాతమైంది .కాని కొడుకు బుల్లెబ్బాయికి సోమశేఖర ,యజ్ఞేశ్వర ప్రసాద్ ఇద్దరు కొడుకులు .సోమశేఖర ను  బాబళ్ల గారి చిన్న తమ్ముడికి  పెంపుడిచ్చారు .యజ్ఞేశ్వర ప్రసాద్ కు ముగ్గురు అందమైన కూతుళ్ళు .మగసంతానం లేదు .అందుకని బాబళ్ళవారి వంశం ఆగిపోయింది .  ఈ ముగ్గురు కుమార్తెలే బ్రాహ్మీ భూతులవారి తొమ్మిదవ తరం వారు .

  స్కూల్ టీచర్ అయిన యజ్ఞేశ్వర ప్రసాద్ ,భార్య లక్ష్మి వీధి మొదటి ఇంట్లో ఉంటూ అతిధి అభ్యాగతులకు స్వాగతం పలికి ఆతిధ్యమిచ్చి తృప్తి పడుతున్నారు .1961 లో పుట్టిన బాబళ్ళ వారి మనవడు యజ్ఞేశ్వర వెంకట  సత్య సూర్య రామ సుబ్రహ్మణ్య సోమయాజి  ఏడవతరం సోమయాజి అవ్వాల్సినవాడు కాలేకపోయాడు .

 బాబళ్ళ వారు ముక్కామలలో జన్మించినా ,దగ్గరలోని ఇరుసుమండ గ్ర్రామం లో మేనమామలింట పెరిగారు. బాబళ్ళ వారి భార్య సుందరి ,ఆకెళ్ళ సుబ్బావదానిగారి కుమార్తె .ఆయనకంటే ఆరేళ్ళు చిన్నది .ఇరుసుమండ లో ఇద్దరూ కలిసి బడికి వెళ్ళేవారు .ఆయన కు తొమ్మిదో ఏటనే తెలుగు రాయటం చదవటం  వచ్చేశాయి .ఆమె మూడవ తరగతిలో ఉండగా ఆయనకు 18, ఆవిడకు 12 వ ఏట ఐదురోజుల వివాహం జరిగి 71 ఏళ్ళు దాంపత్య జీవితాన్ని అనుభవించిన జంట అయ్యారు .మొదట్లో ముక్కామలలో కాపురం పెట్టినా, తర్వాత శ్రీరామ పురం చేరారు .

  బాబళ్ళ గారి తండ్రి తనకొడుకులకేకాక చాలామందికి విద్యాగురువు .శ్రీరామపురం లో రెండవ ఆహితాగ్నిగా గుర్తింపు పొందినవారుకూడా .అప్పుడు ముక్కామాలలో 20 మంది వేదపండితులు  ఉండేవారు .కొందరు సమీప గ్రామాలనుండి తెరచాప పడవ లో కాలువ దాటి ,కొందరు ఫంట్ లలో లేక ఆ ఒడ్డునా, ఈ ఒడ్డునా పాతబడిన కొయ్య  స్తంభాలకు  కట్టిన తాడును ఆధారంగా వచ్చేవారు ,దువ్వూరి యాజులు అనే ఆయన కపిలేశ్వర పురం నుంచి వచ్చేవాడు.  బాబళ్ళ తండ్రి గారు వేదాన్ని వల్లిస్తూ తదేక ధ్యానం లో ఉంటె ,’’పిల్లలమైన మేము ఒంటేలి కని , రెండేళ్ళ కనీ సాకుతో నెమ్మదిగా జారుకొనే వాళ్ళం’’ అని దువ్వూరి గుర్తు చేసుకున్నారు

బాబళ్ల శాస్త్రి దంపతుల ఫోటో జతచేశాను చూడండి .

  సశేషం

  గురు పూర్ణమి  శుభా కాంక్షలతో  ..

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమం

27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమంగా ఉదయం శ్రీ సువర్చాలాంజ నేయస్వామి దేవాలయం లో వ్యాసపూజ ,విష్ణు సహస్రనామ,శ్రీ కృష్ణ, లక్ష్మీఅష్టోత్తర పూజ జరిపి ,కుమారి బిందు దత్తశ్రీ చేత భగవద్గీత పారాయణ ,ప్రవచనం చేయించి ఆన్ లైన్ లో ఆమె భగవద్గీత నేర్పుతున్నందుకు ”ఆన్ లైన్ గురువు గా ”గురుపూజోత్సవం నాడు నగదు పారితోషికం తో పాటు చిరు సత్కారం చేసిన ఫోటోలు

7-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమంగా  ఉదయం శ్రీ సువర్చాలాంజ నేయస్వామి దేవాలయం లో వ్యాసపూజ ,విష్ణు సహస్రనామ,శ్రీ కృష్ణ, లక్ష్మీఅష్టోత్తర పూజ జరిపి ,కుమారి బిందు దత్తశ్రీ చేత భగవద్గీత పారాయణ ,ప్రవచనం చేయించి ఆన్ లైన్ లో ఆమె భగవద్గీత నేర్పుతున్నందుకు ”ఆన్ లైన్ గురువు గా ”గురుపూజోత్సవం నాడు నగదు పారితోషికం తో పాటు చిరు సత్కారం చేసిన ఫోటోలు

https://photos.google.com/share/AF1QipM-vhpMXXhOjhSVtomEws2svrY86Isiuuv4oqqxkDOq6kwZClTzZUqbF349A1eoGQ?key=TnhrdWo5NGNNc21vRjhyX01vanFKWjR1LXMxMXF3

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గురు పూర్ణిమ –వ్యాసజయంతి

గురు పూర్ణిమ –వ్యాసజయంతి

 

వ్యాస అష్టోత్తర స్తోత్రం

‘’1-వేద వ్యాసో విష్ణు రూపః పరాశరార్యాస్తపోనిదిః -సత్య సందః ప్రశాంతస్య సత్య వాదీ సుతః

2-కృష్ణ ద్వైపాయనో దాంతో బాదరాయణ  సంజ్ఞితః -బ్రహ్మ సూత్ర ప్రథితవాన్ భగవాన్ జ్ఞాన భాస్కరః

3-సర్వ వేదాంత తత్వజ్ఞః సర్వేజనా వేద మూర్తిమాన్-వేద శాఖావ్యసన కృత కృత్యో మహా మునిః

4-మహా బుద్ధిర్మహాసిద్ధిర్మహా శక్తి ర్మహా ధృతిః మహా కర్మా మహా ధర్మా మహా భారత కల్పకః

5-మహా పురాణ కృజ్ఞానీ జ్ఞాన విజ్ఞాన భాజనం -చిరంజీవీ చిదాకారీ శ్చిత్త దోష నివారకః

6-వాశిష్ఠః శక్తి పౌత్రస్య శుకదేవర్గుర్గురుహః -ఆషాఢ పూర్ణిమా పూజ్యా పూర్ణ చంద్ర నిభాననః

7-విశ్వనాథ స్తుతికరో విశ్వజనో జగద్గురుః  – జితేన్ద్రియో జితక్రోధో వైరాగ్య నిరతః శుచిః

8-జైమిన్యాది సదాచార్యః సదాచార సదాస్థితః స్థితప్రజ్ఞః స్థిరమతిః సమాధి సంస్ధితారతహః

9-ప్రశాంతిదః ప్రసన్నాత్మా శంకరార్యప్రసాద కృత్ -నారాయణాత్మకః స్తవ్యః సర్వ లోక హితే  రతః

10-అఛత్రవదన బ్రహ్మ ద్విభుజ పర కేశవః -అఫాల లోచనశ్శివః పరబ్రహ్మ స్వరూపకః

11- బ్రహ్మణ్యో   బ్రహ్మణో బ్రాహ్మీ బ్రహ్మ విద్యా విశారదః -బ్రహ్మాత్మైకత విజ్ఞాతా బ్రహ్మ భూతః సుఖాత్మకః

12-వేదాంగ భాస్కరో విద్వాన్ వేద వేదాంత పారగః -ఉపాంతరతమో నామా వేదాచారో విచారవాన్.

వ్యాసునిపై కొన్ని ప్రత్యేక శ్లోకాలు

1-వేద వ్యాసః  స్వాత్మ రూపం సత్య  సంధం పరాయణం –  శాంతం జితేంద్రియ క్రోధం సా శిష్యం ప్రణమామ్యహం

2-వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌరుష మకల్మషం -పరాశరాత్మజం వ౦దే శుక తాతం తపోనిధిమ్

3-వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే -నమో వై బ్రహ్మ నిధ్యాయ వాసిష్టాయ నమోనమః

4-అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే -సదైక రూప రూపాయ విష్ణవే సర్వ జిష్ణవే

5-వ్యాస స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే -నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే

పరాశర స్తుతి

6-కరుణాతీత చిద్రూపం పరి పూర్ణ పరాయణం – పరమానంద సంతుష్టం పరాశర మొహం శ్రయే

శుక స్తుతి

7-త్రికాలాతీత చిన్మాత్ర ప్రశాంత స్వా0త సంయుతం -వికార ఘోర సంస్కృష్టం శుకం గురు మోహం శ్రయే

 

శంకరాచార్య  స్తుతి

8–శంకా   రూపేణ మచ్చిత్తం పంకీకృత మాభూద్యేయా -కింకరీ  యస్య సా మాయా శంకరాచార్య మాశ్రయే

భావం -మాయ అందర్నీ కప్పి ఆడిస్తుంది .మనసు బుద్ధిలలో కల్లోలాలు తుఫాన్లు సృష్టిస్తుంది .అలాంటి మాయను కింకరి అంటే సేవకురాలినిగా చేసుకొన్నశంకరాచార్యులు ప్రణామం .

వేద వ్యాస చరిత్ర

నేపాల్ దేశం లో తానాహుజిల్లా ‘’దమౌళీ ‘’లో వ్యాసుడు తపస్సు చేసి బ్రహ్మ సూత్రాలు పురాణాలు  వేద విభజన చేసిన గుహ ఉంది. అది గొప్ప యాత్రాస్థలం .విష్ణు మూర్తి యొక్క ‘’కాలావతారం ‘’వ్యాసుడు .చిరంజీవులలో ఒకడు .అద్వైత ఋషిపరంపరలో నాల్గవవాడు .ప్రతి యుగం లో ఒక వ్యాసుడు పుడతాడు .వ్యాసుడు అనేది ఒక అధికారం .ద్వాపరం లో కృష్ణ ద్వైపాయనుడు లేక బాదరాయణుడు వ్యాసుడయ్యాడు .వ్యాస పరంపరలో 28 వ వాడు .మొదటి ద్వాపరం లో స్వాయంభువు వ్యాసుడు అయ్యాడు .రెండవ ద్వాపరం లో ప్రజాపతి వ్యాసుడు .మూడవదానిలో శుక్రుడు వ్యాసుడు .ఆ తర్వాత వసిష్ఠుడు ,త్రివర్షుడు ,సనద్వాజుడు వగైరా 27 మంది వ్యాసులు అయ్యాక ద్వాపరం లో కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు అయ్యాడు .

విష్ణు మూర్తి నాభికమలం నుంచి బ్రహ్మ పుట్టి నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలను ప్రసరింప జేయాలనుకొన్నప్పుడు విష్ణువు మనసులో తలచుకోగానే ‘’అపాంతర తముడు ‘’జన్మించాడు .పుత్రోత్సాహం తో నారాయణ మూర్తి ‘’వ్యాసా !రా నాయనా !నా మానస పుత్రుడివిగా పుట్టి  నాకు ఆనందాన్నిచ్చావు .అన్ని మన్వంతరాలలోనూ ఇలానే జన్మించు .తర్వాత పరాశర కుమారునిగా పుట్టి ,కురురాజుల అధర్మ క్రూర హింసా దౌర్జన్యాలను అదుపు చేసి ,వేదాన్ని వ్యాపకం చెయ్యి .నీకు రాగద్వేష రహితుడైన కొడుకు పుట్టి నిన్ను మించిపోతాడు ‘’అన్నాడు .రాబోయే సూర్య సావర్ణికాలం లో వ్యాసుడు సప్తర్షులలో ఒకడు అవుతాడు . .

కృష్ణ ద్వైపాయన వ్యాస జననం

లోకోద్ధరణకోసం నారాయణుడు కొన్ని ధర్మాలు ఏర్పాటు చేశాడు. కాలక్రమంలో అవి లోపించాయి .బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని దర్శించి ధర్మ  పునరుద్ధరణ చేయమని ప్రార్ధించగా మూడవదైన ద్వాపర యుగం లో పరాశార సత్యవతి దంపతులకు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడునారాయణుడు వ్యాసభగవానుడుగా అవతరించాడు ..ఒక రోజు వ్యాసుడు సరస్వతీ నదిలో స్నానం చేసి తపోధ్యానాలు పూర్తి చేసి ఏకాంతం లో ఆసీనుడై దివ్య దృష్టితో యుగ విశేషాలను తెలుసుకున్నాడు .కాల ప్రభావాన భౌతిక భావనలు అంటే శక్తులు తగ్గుతున్నాయని గ్రహించాడు .శ్రద్ధ బలం ఆయుస్సు తగ్గి దౌర్బల్యం పెరిగి నట్లు గుర్తించాడు .అన్ని వర్ణాలవారికి ఉపయోగ పడేట్లు వైదిక కర్మలను పరీక్షించి యజ్ఞ విస్తరణకు ఒక్కటిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు .పంచమ వేదంగా మహా భారతం రచించాడు .పైలుడికి ఋగ్వేదం ,వైశంపాయుడికి యజుర్వేదం జైమినికి సామం ,సుమంతునికి అదర్వణం ఉపదేశించాడు .ఇతిహాస పురాణం అనే పంచమ వేదం భారతాన్ని రోమ హర్షుడు అనే సూతమునికి  చెప్పాడు .వీరంతా తమ శిష్యులకు బోధిస్తే వారు వారి శిష్యులకు ఉపదేశించగా అనేకశాఖలయ్యాయి .

కొంచెం బుద్ధి తక్కువ గా ఉన్నవారికి ఉపాఖ్యాన కథా రూపం గా మహాభారతం రాశాడు దీనిలో ధర్మం సంస్కృతీ మొదలైన విషయాలన్నీ చెప్పాడు వ్యాసుడు .ద్వాపరాంతం లో వచ్చే కలియుగం లోవచ్చేఅనర్దాలు,ఆపద గ్రహించటానికి భారత రచన చేశాడు .అన్ని వర్ణాలవారు జాతులవారు  లింగ వయో భేదం లేకుండా ఆచరించదగిన  ధర్మాలు  ధర్మ సూక్ష్మాలు చిన్న చిన్న కథలలో చెప్పాడు .

దీనితో తృప్తిపడక జ్ఞానులకు పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవటానికి 545 బ్రహ్మ సూత్రాలు రాశాడు. దీనికి శంకరాచార్య భాష్యం రాశారు ..అష్టాదశ అంటే 18 పురాణాలు రచించాడు. వేదానికి అంతాలైన ఉపనిషత్తులు రాశాడు.వీటిలో దశోపనిషత్తులకు శంకర భాష్యం ఉంది . అంతా బాగానే ఉంది కానీ సర్వ వ్యాపకుడైన పరమేశ్వరుడి గురించి భక్తి తాత్పర్యాలతో రాయలేక పోయానని చింతి స్తుంటే నారద ముని హితోపదేశం తో శ్రీ విష్ణు లీలామృతమైన శ్రీ మద్ భాగవతం రాశాడు ..దీన్ని పోతనామాత్యుడు మందార మకరంద తుందిలంగా తెలుగులోకి అనువదించాడు .భారతాన్ని నన్నయ తిక్కన ఎర్రనలనే కవిత్రయం అనువదించారు ..ఇవన్నీ లోక శ్రేయస్సుకోసం రాయబడినవే .భారతం హరివంశం కలిపి 1 లక్షా 25 వేలు ,పురాణాల్లో 5 లక్షల శ్లోకాలు మొత్తం 6 లక్షల 25 వేల శ్లోకాలు రాశాడు భగవాన్ వేదం వ్యాసుడు .. భారతం చివరలో వ్యాసుడు  -’’యదాహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి సతత్  క్వచిత్ ‘’ అని ఒక ప్రతిజ్ఞ చేశాడు-అంటే ‘’భారతం లో లేనిది ఎక్కడా ఉండదు -ఇందులో లేనిది ఇంకెక్కడా ఉండదు ‘’శాంతి ఆనుశాశానిక స్వర్గా రోహణ పర్వలలో 26 వేల  శ్లోకాలలో  రాజనీతి,ఆపద్ధర్మాలు ,దాన0  ధర్మం ,మోక్షప్రాప్తి,స్త్రీ ధర్మాలు విడి విడిగా చెప్పాడు .అంటే పాత్రలచేత చెప్పించాడు .భారతం లోని పాత్రలు మనమే. మన ఇళ్లల్లో జరిగే కథయే భారత కధ ..

ఇన్ని ఇన్ని రకాలుగా చెప్పినా పెడ  చెవిని పెట్టి వారిని చూసి జాలితో బాధతో వ్యధతో ‘’ఊర్ధ్వ బాహుః విరోమ్యేష నహి కశ్చిత్ శృణోతిమే -పరోపకారాయ పుణ్యాయ ,పాపాయి పర పీడనం ‘’అని చేతు  లెత్తి మొక్కాడు -అంటే‘’ఇతరులకు మేలు చేస్తే పుణ్యం -ఇతరులను బాధిస్తే పాపం  ‘’అని చేతులు పైకెత్తి నెత్తీ నోరూ మొత్తుకున్నా నా మాట ఎవరూ వినటం లేదే ‘’అని పరితపించాడు  ఆ విశాల దయార్ద్ర హృదయుడు వ్యాస భగవానుడు .

భారతం లో వ్యాస పాత్ర

భారత రచన చేయటమేకాక అందులో తానూ పాత్రధారియే వ్యాసుడు .తల్లికిచ్చిన మాటకోసం కురు వంశాన్ని నిలపటానికి పాండవ ధృతరాష్ట్ర విదురులకు జన్మ నిచ్చాడు .అవసరమైనప్పుడు రంగ ప్రవేశం చేసి ధర్మ సూక్ష్మాలు  చెప్పాడు అర్జునుడు మత్శ్య యంత్రాన్ని భేదించి ద్రౌపదిని దక్కించుకొంటే ధర్మరాజు ఆమె సోదరులందరికి భార్య  అవ్వాలంటే ద్రుపదుడు వ్యాసుడిని తలచుకొంటే వచ్చి ఆమె సామాన్య మానవ స్త్రీ కాదు అయోనిజ యాజ్ఞ సేనీ  కనుక పంచ భర్త్రుక అవటం లో తప్పు లేదని తీర్పు చెప్పాడు .వనవాసం లో పాండవులు కస్టాలు పడుతూ ప్రార్ధిస్తే ‘’మీకే కాదు కస్టాలు మీ ముందు నలమహారాజు దమయంతి ఎన్నో కష్టాలుపడి చివరికి సుఖపడ్డారని ఆ కద చెప్పి ఊరట కలిగిచాడు .అర్జుడిని శివుని మెప్పించి పాశుపతాస్త్రం సాధించమని సలహా ఇచ్చాడు .కురుపాండ బలాలను బేరీజు వేసి చెప్పమని గుడ్డిరాజు కోరితే ధర్మ0  కృష్ణ రూపం లో పాండవుల వద్ద ఉంది ధర్మం ఉన్న చోట విజయం తప్పదు అని నిష్కర్షగా చెప్పాడు ..కురుక్షేత్ర సంగ్రామం ముందు వచ్చి ‘’నువ్వు తెచ్చిన యుద్ధం యెంత అనర్ధాన్ని తెస్తోందో చాడాలని ఉంటే కళ్ళు ఇస్తానంటాడు .చేసిన తప్పు తెలుసు కనుక తాను ఆ భీభత్సాన్ని చూసి తట్టుకోలేను అంటే సూతుడికి దివ్య దృష్టి ప్రసాదించి యుద్ధాన్ని ప్రత్యక్ష ప్రసారం గా చూసి గుడ్డిరాజుకు  చెప్పించాడు  .

అశ్వత్ధామ కృష్ణార్జునులపై నారాయణాస్త్రం స౦ధించగా వారిద్దరూ  దానికి నమస్కరించగానే అది నిర్వీర్యమై పొతే ,కారణం తెలీక జుట్టు పీక్కొని వ్యాసుని స్మరిస్తే వచ్చి ‘’మీ, మీ శివ పూజా ఫలితం ఇది .వాళ్లిద్దరూ పూర్వ జన్మలో శివుడిని మట్టి లింగంగా చేసి ఆరాధిస్తే, నువ్వు విగ్రహ రూపం లో పూజించావు .  లింగా రాధన సర్వ శ్రేయస్కరం .అది వారిని కాపాడింది ‘’అని ధర్మ సూక్షం చెప్పాడు .వ్యాసునికి ఆంద్ర దేశానికీ సంబంధం ఉంది .ఏడు రోజులు కాశీలో వ్యాసునికి శిష్యులకు భోజనం దొరక్కపోతే కోపం తో కాశీని శపించాలని సంకల్పించి భిక్షా పాత్రను నేలమీద శతధా భిన్నం అయేట్లు పగలకొడితే ముదుసలి సాధ్వీరూపం లో పార్వతీదేవి వచ్చి విందుకు ఆహ్వానించి కమ్మని భోజనం పెడితే అప్పుడు శివపార్వతులు వారి వద్ద ప్రత్యక్షమవగా శివుడు కోపం తో ‘’పుణ్యరాశి కాశీ పైశాపం పెడతావా పొమ్ము నిర్భాగ్య మా యూరి పొలము విడిచి ‘’అని కాశీనుంచి గెంటేస్తే బ్రతిమాలితే, దక్షిణకాశి దాక్షారామం వెళ్లి భీమేశ్వర సేవలో తరించమని చెబితే విడవ లేక విడవ లేక ద్రాక్షారామ చేరగా అక్కడ అగస్త్య మహర్షి ఊరట కలిగిస్తాడు .బాసర సరస్వతీ ఆలయం మనకు తెలుసు.  వ్యాస బాసర అయింది

అలాగే కాశ్మీర్లో ప్రవహించే బియాస్ నది అంటే వ్యాస నది అని అర్ధం . ఇలా ప్రకృతితో మమేక మైనవాడు వ్యాసుడు .

రెండు చిలుకలు సంసార0 చేస్తుంటే ముచ్చటపడి తనకు ఒక కొడుకు కావాలనుకొని హిమాలయాలకు వెళ్లి’’శక్తిని గూర్చి  తీవ్ర తపస్సు చెస్తే ,తపోభ0 గానికి వచ్చిన ఘృతాచి అనే అప్సరస చేసిన ప్రయత్నాలు ఫలించక చిలుక రూపం లో వస్తే రేతస్కలనం జరిగి పుట్టిన కుమారుడే శుకమహర్షి .ఆయన మూతి చిలక మూతిలాగా ఉంటుందంటారు .పుట్టగానే సకలశాస్త్రాలు వచ్చేశాయి. జనకమహా రాజు  వద్ద బ్రహ్మ విద్య నేర్చాడు . పరీక్షిత్తుకు ఏడు రోజులలో మహా భారత కథ అంతా  చెప్పాడు శుకమహర్షి . నిరీహుడు నిస్సంగుడు శుకుడు . తండ్రి పరాశరుని పేర పరాశర సంహిత ఉంది .ఆంజనేయ చరిత్ర అంతా అందులో ఉంటుంది .

ఇంతటి జ్ఞానాన్ని ధర్మాలను నీతులను అక్షరరూపం గా ప్రసాదించిన భారత జాతి వ్యాసభగవానునికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు  కనీసం వ్యాస పూర్ణిమ నాడైనా ఆ గురుమహారాజు ను స్మరిద్దాం .ఇలాంటి అరుదైన అవకాశం అమెరికాలో షార్లెట్ లో సరసభారతి 104 వ సమావేశంగా వ్యాస జయంతిని తమ ఇంట్లో  జరిపించిన  రాంకీ  ఉషా ద0పతులకు ,ఆసక్తిగా వచ్చి పాల్గొన్న వారందరికీ సరసభారతి ధన్యవాదాలు తెలియ జేసింది  .ప్రతి సంవత్సరం మా అమ్మాయి శ్రీమతి  విజయ లక్ష్మి  అల్లుడు శ్రీ అవధాని శంకర జయంతి జరుపుతున్నట్లే వ్యాస జయంతి ని గురుపౌర్ణమిగా నిర్వహించాలని ఈ దంపతులను కోరుతున్నాను ‘’

అని చెప్పి ఇక్కడ భారతీయ సంస్కృతిని ఆచరిస్తూ నిలబెడుతున్న చి అడుసుమిల్లి రామకృష్ణ(రాంకీ ) కు సరసభారతి ఆనందంగా ‘’సంస్కృతీ ప్రదీపక  ‘’బిరుదు ప్రదానం చేస్తున్నానని  అనగానే అందరు హర్ష ధ్వానాలతో చప్పట్లు మోగించారు .సరసభారతి గ్రంధం ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 (రెండవ భాగం ) రాంకీ దంపతులకు మా ద0పతులం కానుకగా అంద  జేశాము . మంత్ర పుష్పం తో కార్యక్రమం పూర్తయింది .

27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాసజయంతి సందర్భంగా సరసభారతి 128 వ సమావేశంగా ఉదయం 8 గంటలకు శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం లో వ్యాస జయంతి నిర్వహిస్తోంది .వ్యాస  అష్టోత్తర పూజ ,విష్ణు సహస్రనామ పూజ నిర్వహించి ,తర్వాత భగవద్గీత ఫేం కుమారి మాది రాజు  బిందు వెంకట దత్తశ్రీ చేత భగవద్గీత పారాయణ ,ప్రవచనం చేయిస్తున్నాము .

27-7-18  శుక్రవారం వ్యాసజయంతి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3

తీరాంద్ర లో అగ్ని స్టోమం అనేక రకాల అగ్ని చయనం తో చేస్తారు .దీనినే సూక్ష్మ౦ గా ‘’చయనం ‘’అంటారు .వేలాది ఇటుకలను దీనికి వాడుతారు .అడుగున  స్యేన అంటే ఎగిరే గరుడ పక్షి ఆకారం గా చేస్తారు .దీన్ని స్యేన చితి అంటారు .అయిదు అంతస్తులలో ఇటుకలుపేర్చి ,అగ్ని హోత్రం చేయటానికి అనువుగా తయారు చేస్తారు .అగ్ని దేవుడికి ,పురుష ప్రజాపతికి హవిస్సులు సమర్పిస్తారు .శుక్ల యజుర్వేదానికి చెందిన శతపధ బ్రాహ్మణం అగ్ని చయనం పై విస్తృతంగా వివరించింది .పాశ్చాత్యులకు ఇది బాగా అర్ధమైన విషయం .చయనం చేసేవారు అగ్నిని తీసుకురావటానికి’’ ఉక్ష’’ అనే బూర్లమూకుడు లాంటి దానిని ఉపయోగిస్తారు .కానీ కోనసీమ బ్రాహ్మణ్యం తైత్తిరీయ విధానాన్నే ఉపయోగిస్తారు .అగ్ని చయనం అందర్నీ విశేషంగా ఆకర్షిస్తుంది .1975 లో కేరళ నంబూద్రి బ్రాహ్మణులు చేసిన అగ్ని చయనాన్నిఫ్రిట్స్ స్టాల్ ,రాబర్ట్ గార్డే నర్ లు రెండుభాగాల అతి పెద్ద గ్రంథంగా చిత్రాలతో సహా ముద్రించారు .దీనినే ‘’అల్టార్ ఆఫ్ ఫైర్’’ సినిమాగా కూడా తీశారు .దీన్ని’’ అతి ప్రాచీన  సజీవ సాక్షాత్కార చివరి  క్రతువు’’గా పేర్కొన్నారు .  ఆంధ్రాలోమాత్రం ఏమాత్రం మార్పులు లేకుండా అగ్ని చయనం చేస్తూనే ఉన్నారు .చయనం  చేసినవారిని గౌరవంగా చయనులు అని  సంబోధిస్తారు.

అగ్ని చయనం తర్వాత ఆంధ్రలో ‘’వాజపేయం ‘’ప్రాముఖ్యత పొందింది .17 మంది ప్రజాపతులకు హవిస్సులు అందజేసే కార్యమిది .17 రోజుల దీక్షతో చేస్తారు .ప్రతిరోజూ సుర ను బియ్యం ,లేక బార్లీ  లేకచిరు ధాన్యాలను  పులియబెట్టి తయారు చేస్తారు .దీన్నే కిణ్వన ప్రక్రియ లేక ఫెర్మెంటేషన్ అంటారు .చివరి రోజు సోమలతను  పిండి  సోమ రసం తయారు చేసి మంత్రాలను చదువుతూ ఆహుతులుగా సమర్పిస్తారు .ఒకప్పుడు నల్లమేకను బలి ఇచ్చేవారు .యజమాని, భార్య కలిసి యూప స్థంభం ఎక్కి తమకు అమరత్వం సిద్ధి౦చి౦దని ప్రకటించటం ఇందులో పరాకాష్ట . దీనికి పైమెట్టుగా’’ పౌ౦డరీక౦’’అనే క్రతువు ఉంది .ఇది 40 రోజుల దీక్షతో చేసేది.ఈ క్రతువులన్నీ ఎన్నో రోజుల ముందు ఆలోచన,,వస్తుసేకరణ ,తగిన  ప్రణాళిక లతో చేయాల్సినవి .వీటికి హోత, అధ్వర్యుడు ,ఉద్గారుడు ,బ్రాహ్మణులు కావాలి .మహావేది నిర్మాణం చేయాలి .ఎంతో డబ్బు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం .అందరికీ వారి వారి అర్హతను బట్టి దక్షిణ సమర్పించాలి .పై నలుగురిలో ప్రతి ఒక్కరికీ ముగ్గురేసి సహాయకులు కావాలి .అంటే 16 మంది ఉండాలి 17 వవారు కొన్ని ప్రత్యేక విధులు చేస్తారు .18 వ వారు సదస్యం నిర్వహిస్తారు .వీళ్ళందర్నీ యజమాని అందులో నిష్ణాతులైన వారి సలహాతో  ఎంపిక చేస్తాడు .ఇతనినే సోమప్రవాకుడు అంటారు .ఇందులో ఏమాత్రం దోషం జరిగినా తాను పాపకూపం లో పడినట్లు భావిస్తారు .

ఆహితాగ్నికి ఒకరు సహాయంగా ఉంటె చాలు. కొడుకు కాని  తమ్ముడుకాని దగ్గర బంధువుకాని పనికొస్తాడు .ఇష్టిని పాడ్యమి ,పౌర్ణమి నాడు చేస్తారు  .పంటలకాలం లో ‘’అగ్రయనం’’చేస్తారు .దీనికి యజమాని ఆధ్వర్య , హోత,బ్రాహ్మణ ,ఆగ్నీధ్ర లను ఏర్పాటు చేసుకోవాలి .ఆగ్నీధ్ర అధ్వర్యుడికి సాయం గా ఉంటాడు .అగ్రహారం లోని ఇతర ఆహితాగ్ని లను దీనికి వినియోగించుకో వచ్చు .ఆధ్వర్యుడు ,హోతా ఇద్దరు ఉంటే చాలు అని ఆపస్తంభ సూత్రాలు చెబుతున్నాయి

కోన సీమలోని శ్రీరామ పురం,ఇరగవరం ,కామేశ్వరి,వ్యాఘ్రేశ్వరం  అగ్రహారాలలో ఆహితాగ్నులు అగ్ని హోత్రం అంతటి పవిత్రులు . వీరి గురించి వరుసగా తెలుసుకొందాం .

సశేషం

27-7-18 శుక్రవారం గురుపౌర్ణమి వ్యాస జయంతి శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-18 –ఉయ్యూరు

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ వి౦ధ్య వాసిని బీజసాన్ దుర్గా దేవి ఆలయం –హోషంగాబాద్

శ్రీ వి౦ధ్య వాసిని బీజసాన్ దుర్గా దేవి ఆలయం –హోషంగాబాద్

మధ్యప్రదేశ్ లో నర్మదా పురం అనబడే హోషంగా బాద్ నర్మదానదీ తీరాన ఉన్న అందమైన పట్టణం .ఇక్కడున్న నర్మదానది ఘాట్లు చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి .ముఖ్యంగా ‘’సెతాంగి ఘాట్ ‘’అందాలొలక బోస్తూ  పెద్ద ఆకర్షణగా నిలుస్తుంది .హోషా౦గ్ షా అనే మొదటి మాల్వా రాజు పేరిట నర్మదానగర్ ను హోషంగాబాద్ గా  మార్చారు.నర్మదా నది ఒడ్డునున్న సత్సంగ భవనం లో సాదు ,సంతులు తరచుగా సమావేశమై ధర్మ చింతన చేస్తూ ప్రజలకు మార్గ దర్శనం చేస్తారు .ముఖ్యంగా తులసీ దాసు రచించిన రామ చరితమానస్,భగవద్గీత లపై చర్చలు జరుగుతాయి .దగ్గరలో పచ్ మర్హి అనే హిల్ స్టేషన్ కూడా ఉంది .ఇక్కడే సాత్పురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది .అందమైన ప్రకృతి ని అనుభవించటానికి యాత్రికులు పెద్ద సంఖ్య లో వస్తారు .

హోషంగా బాద్ కు 35 కిలోమీటర్ల దూరం లోని సల్కన్ పూర్ లో  శ్రీ దుర్గా దేవి దేవాలయం ఉంది .భోపాల్ నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు .ఇది వి౦ధ్యవాసిని బీజసాన్ దేవి యొక్క సిద్ధ పీఠం .వెయ్యిమెట్లున్న కొండపై వెలసిన మాతను దర్శించటానికి నిత్యం వేలాది  భక్త జనం వస్తారు .ఆమె కరుణ ఉంటె తమజీవితాలకు ఏ ఢోకా ఉండదని  వారి విశ్వాసం .నవరాత్రి దినాలలో సల్కాన్ పూర్ లో అమ్మవారికి బ్రహ్మాండమైన ఉత్సవాలు నిర్వహిస్తారు .లక్షలాది భక్తులు సందర్శించి ధన్యులౌతారు .

పురాణకధనం  ప్రకారం రక్తబీజ రాక్షస సంహారం చేశాక అమ్మవారు ఇక్కడికి వచ్చి విజయ దరహాసం తో కూర్చున్నది .కనుక ఆయుద్ధ అవశేషాలు ఇక్కడ గోచరిస్తాయి .’’సల్కాన్ దేవి ధాం రోప్ వే’’కూడా ఇక్కడ ఉండటం తో యాత్రికులు కొండమెట్లు ఎక్కి ఆయాసపడకుండా తేలికగా దేవాలయానికి చేరి అమ్మవారిని దర్శించుకో వచ్చు .అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటి అయిన ఈ వి౦ధ్య వాసిని బీజసాన్ దుర్గా మాత  క్షేత్రం తప్పక దర్శించి తరించాల్సినది .

 

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 


Posted in రచనలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2

               ఆహితాగ్ని దిన చర్య

శ్రౌతం నేర్చిన వారు సంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటి౦చి ఆహితాగ్నిగా ఉంటారు .త్రేతాగ్నులను అర్చిస్తారు .రోజుకు రె౦డుసార్లు వేడిపాలను అగ్నిహోత్రానికి సమర్పిస్తారు .తర్వాత  అగ్ని స్టోమం చేస్తారు .భారత, నేపాల్ దేశాలలో ఉన్న ఆహితాగ్నుల సంఖ్య 626 అయితే అందులో ఆంద్ర ప్రాంతం లోనే 200 మంది ఉన్నట్లు తెలుస్తోంది .శ్రౌత కర్మ విధానం గృహిణి తో చేసే క్లిష్ట విధానం .వీరి భాషకూడా ప్రత్యేకంగా ఉంటుంది .నిత్యకర్మలని, కామ్య కర్మలనే మాటలు వాడుతారు .నిత్యకర్మ విధిగా తాను ఆచరి౦ చాల్సినది .కామ్యకర్మ మనసులో ఉన్న కోర్కె ఫలించటానికి చేసేదిగా భావించవచ్చు .దీన్ని నైమిత్తికం అనీ అంటారు .అంటే జాతకర్మ ,అంత్యక్రియ ,ఆయుర్ వృద్ధి ,ఆరోగ్యాభి వృద్ధి లకోసం చేసేవి .వీటికి ప్రాయశ్చిత్తా లు  కూడా చేయాలి  .

  వేద విహిత కర్మలను చేసేవారిని శ్రౌత లేక యజమాని అంటారు .యజమాని అర్దాంగితో కలిసి ఉదయమే ఔపోసనాగ్నిని ఆధానం చేయాలి .దీనితో త్రేతాగ్నులను అర్చించాలి .ఇంట్లోని ప్ర త్యేక గదిలో పడమర వైపు గుండ్రని గార్హ పత్య అగ్నిఅంటే వంట చేసుకునే అగ్ని ,తూర్పున చతురస్రాకారపు ఆహవనీయ ,దక్షిణాన దక్షిణాగ్ని లను మట్టిముద్దలతో   ఏర్పాటు చేసుకొంటారు  . ఒకదానికొకటి సంబంధం ఉండేట్లు మధ్యలో వేది ఉంటుంది .వేది అంటే హోమ ద్రవ్యాలు ఉంచే ప్రదేశం .ఈ పవిత్ర అగ్ని హోత్రాలు దంపతులు ప్రత్యేకంగా సంరక్షించు కోనేవి మాత్రమె .కుటుంబం లోని వారు ,సహకరించేవారు  మాత్రమేవీటిని చూడటానికి అర్హులు .మిగిలవారెవ్వరికీ ఈ గదిలో ప్రవేశం ఉండదు .దంపతులలో ఒకరు మరణించేదాకా ఇంతే .మరణిస్తే వాటిని తొలగిస్తారు .ఆ ఇంటికి మాత్రమే ఆ అగ్ని హోత్రం ప్రత్యేకం అని భావం .అగ్ని వారికి ప్రత్యక్ష దైవం .

  ఆహితాగ్ని భార్యతో ఔపోసనాగ్ని తో  నిత్యాగ్ని హోమం చేస్తూ అంటే గార్హపత్యాగ్నిని కొలుస్తాడు.అగ్ని హోత్ర గోవును సూర్యోదయ ,సూర్యాస్తమయ వేళలో పాలు పితికి ,అగ్నికార్యం నిర్వహించి ,నైవేద్యం పెట్టగా మిగిలిన వాటిని ఉదయ ,సాయం వేళల ప్రసాదంగా కుటుంబం అంతా స్వీకరిస్తారు .అగ్ని హోత్రం లో సమిధలు వేయటమూ ఒక పవిత్ర కార్యమే .ఉదయ సాయం సంధ్యలలో సంధ్యావందనం ,అగ్ని హోత్రం  వైశ్వ దేవం చేస్తూ దేవతలందరి కి సంతుష్టి కలిగిస్తారు .సాంకేతికంగా వివాహమైన నవ దంపతులు అగ్ని హోత్రి లుగా , ఆ ఇంటి గార్హ పత్యాగ్ని ఆరాధనకు అర్హులవుతారు .గార్హ పత్యాగ్ని తో పాలను వేడి చేసి ఆహవనీయ అగ్నికి సమర్పిస్తారు .దంపతులు ఆధానం తో   త్రేతాగ్ని  అర్చన చేస్తారు . ఒక్కొక్క దంపతులు తమ జీవితకాలం లో ఇలా అనేక వేలసార్లు చేయటం జరుగుతుంది .ఉదయం సూర్య ,ప్రజాపతి లకు ,సాయంత్రం అగ్ని,ప్రజాపతి లకు హవిస్సులు సమర్పిస్తారు .15 రోజులకొకసారి ‘’దర్శ పూర్ణ మాస ‘’ను ,ఇష్టి ని నిర్వహించి దేవతలకు హవిస్సు సమర్పిస్తారు అగ్నికి సోమకు చేసేదే అగ్ని స్టోమం ,అగ్ని ఇంద్రులకూ ,అగ్నికి ,ప్రజాపతి కి ప్రత్యేకంగా కూడా చేస్తారు .బియ్యపు పిండికి నీళ్లుకలిపి గుడ్రంగా తట్టి  గార్హ పత్యాగ్ని లో ఉడికించి కూడా పురొడాశ౦ గా దేవతలకు  సమర్పిస్తారు .పాలతో పాటు ఇదీ ప్రసాదంగా భుజిస్తారు .

  ఇలా నిత్యం అగ్ని ఆధానం ,అగ్ని హోత్రం పక్షానికోసారి ఇష్టి తోపాటు మిగిలిన నిత్య కార్యాలు చేస్తారు .ఒక ఏడాది దీక్షగా త్రేతాగ్ని హోత్రం చేసిన దంపతులు ఇంట్లోనే కాక బయటకూడా శ్రౌతకర్మలు చేయటానికి అర్హులౌతారు  .బయటి దాన్ని అగ్ని క్షేత్రమని ,అక్కడి అగ్ని ని మహా వేది అనీ అంటారు .దీనికి ముందు అగ్ని స్టోమం చేసి అర్హత సాధించాలి .సోమరసం తయారు చేసి అగ్నికి ఆహుతిగా ఇవ్వాలి .పశుబలికూడా  ఉండేది కాని ఇప్పుడు అమలు లో లేదు .ముంజ లేక దర్భ తాడు భర్త నడుం చుట్టూ కట్టుకోవాలి. యోక్త్రను భార్య నడుముకు కట్టాలి .అప్పుడు అగ్నిస్టోమం చేయాలి .సోమలత దొరకటం కష్టం కనుక ఇప్పుడు వేర్వేరు లతలను  ఉపయోగిస్తున్నారు .సోమలతను గొప్ప అతిధిగా మహారాజుగా భావించి గౌరవంగా స్వాగతం పలుకుతారు .అయిదవ రోజు సవనం చేస్తారు.అంటే తీగను పిండటం చేస్తాడు అధ్వర్యుడు .సామవేదం లోని 12 సూత్రాలను ,12యజుర్వేద మంత్రాలను  స్తోత్రంగా గానం చేస్తారు . సోమరసాన్ని వడపోసి మొదట కుండలోను తర్వాత కోయ్యపాత్రలైన చమస్సులలోను పోసి అగ్నికి ఆహుతిస్తారు .తర్వాత సోమరసం త్రాగుతారు .రెండవసారికూడా ఇలానే చేస్తారు .ఇలా అగ్నిస్టోమం పూర్తయ్యాక అవ భ్రుత స్నాన విది ఉంటుంది .దీనితో పూర్తిగా దంపతులు పరమ పవిత్రులౌతారు .ఇదంతా జనన ,మరణాలకు  ప్రతీకగా భావిస్తారు.దీన్ని చేసిన దంపతులకు కొత్తపేర్లు పెడతారు .సోమాన్ని అగ్ని హోత్రానికి సమర్పించినందువలన ఆయనను సోమయాజి లేక సోమయాజులు  అనీ , ఆమెను సోమిదేవమ్మ అనీ పిలుస్తారు. మొదటినుంచీ ఉన్న పేర్లతో ఇక పిలవనే పిలవరు .

  సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రహ్మజ్ఞాన యోగి బ్రహ్మస్వామి -గబ్బిట దుర్గాప్రసాద్ -జులై -గురు సాయి స్థాన్ పత్రిక

బ్రహ్మజ్ఞాన యోగి బ్రహ్మస్వామి -జులై -గురు సాయి స్థాన్ పత్రిక

”సిద్ద యోగి పుంగవులు ”అని నేను రాసిన పుస్తకం లోని ”బ్రహ్మజ్ఞానయోగి  బ్రహ్మస్వామి ”వ్యాసం జులై నెల ”గురు సాయి స్థాన్” పత్రికలో
పునర్ముద్రితం -దుర్గాప్రసాద్
Posted in రచనలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1

అసలే అందాల సీమలు .ప్రకృతి సోయగాలకు ఆటపట్టులు .ముక్కారు పంటలకు నిలయాలు .పవిత్ర దేవాలయ క్షేత్రాలు .కొబ్బరి తోటల పరవశాలు .ఒక్కసారి చూస్తె అక్కడి నుండి రాబుద్ధి పుట్టని ఆకర్షణ విలసితాలు కోనసీమ సీమలు .మరి వీటికి తోడు పవిత్రతా కలిస్తే,వేద గానాలు పరవశి౦పజేస్తే ,వీటికి మరింత శోభ తెచ్చే నిత్యాగ్ని హోత్రాలు ప్రజ్వరిల్లు తుంటే, ఆహితాగ్నులు పవిత్రాగ్నులను కంటికి రెప్ప లాగా కాపాడుకొంటూ ఉంటె ఇక ఆ అనుభవం ,అనుభూతి మరువగలమా !  అప్పుడు అది భూలోక స్వర్గం అనటం చాలుతుందా?చాలనే చాలదు .అందుకే ‘’కోనసీమ అందాలకు వేద పవిత్ర సొబగులు,సౌరభాలు అలదినట్లు౦ టాయని అన్నాను .దీనికి కారణభూతులు అక్కడి  ఆహితాగ్నులు .ఆహితాగ్ని అంటే గృహం లో పవిత్రాగ్నిని అంటే వేద సంస్కాం ప్రకారం అగ్ని హోత్రాన్ని ఉంచుకున్నవాడు అని నిఘంటు అర్ధం .అగ్ని హోత్రాన్ని కాపాడే వాడు .ఆయననే సోమయాజి అనీ అంటారు .ఆహితాగ్నులు కోనసీమ ప్రాంతం లో ఉన్న బ్రాహ్మణ అగ్రహారాలలో ఉంటారు .వీరిని ‘’వేదం లో ఉన్నవారు ‘’అనీ పిలుస్తారు .వారు కూడా ‘’నేను వేదం లో ఉన్నాను ‘’అని చెప్పుకొంటారు .అది గౌరవం .గర్భాస్టమం  లో ఉపనయన సంస్కారం జరిగి ,త్రికాల సంధ్యావందనం ,అగ్ని కార్యం  చేస్తూ ,గురువు వద్ద ఉంటూ  82పన్నాల తైత్తిరీయ సంహిత ను ఎనిమిది నుంచి పన్నెండేళ్ళు లో నేర్చుకొంటారు .మధుకర వృత్తి నవలంబించి ,దానినే భుజిస్తాడు .తెల్లవారు ఝామున 4 గంటలకే కాలకృత్యాదులు తీర్చుకొని గురువు ఎదుట కూర్చుని  ఆయన చెప్పింది మరలా చెబుతూ అంటే ‘’సమవర్తన ‘’చేస్తూ నేరుస్తాడు .ఇదంతా బ్రహ్మ చర్యం లో  పూర్తవుతుంది .

రెండవ గృహస్థాశ్రమ౦ లోకి ప్రవేశించటానికి అగ్ని సాక్షిగా పెద్దలు కుదిర్చిన  అనుకూల వతిఅయిన కన్యను భార్యగా పొంది గృహస్తు అవుతాడు .అర్దాంగితో నిత్య౦అగ్నిని ఆరాధిస్తాడు దీనిని గార్హస్పత్యాగ్ని అంటారు .అతడికి ఇంకా చదవాలని నేర్చుకోవాలని ఉంటె అగ్రహారం లోనే చెప్పగలిగిన గురువు వద్ద చేరి నేరుస్తాడు .లేక బయటి ప్రదేశాలకు వెళ్లి నేర్చుకుంటాడు పాఠం ,పద పాఠం ,క్రమ పాఠం లలో నిష్ణాతులౌతారు ఎక్కువ మంది ఇక్కడే ఆగి పోయి పరీక్షలకు హాజరై ,సర్టిఫికెట్లు పొంది సంతృప్తి చెందుతారు .ఇంకా ముందుకు పోవాలనుకోనేవారు ఇంతకన్నా కష్టమైన ఘన పాఠం నేర్చుకుంటారు .దీన్ని సాధించిన వారిని’’ ఘన పాటి ‘’లేక’’ ఘనా పాఠి ‘’అంటారు .వీరు వేదసభల్లో ,పండిత సభలో ఉపనయన, వివాహకార్యక్రమాలో  పాల్గొని తమ విద్య ప్రదర్శించి బహుమతులు పొందుతారు .దీని పైది ‘’జటాపాఠం’’అనే మరింత క్లిష్ట ప్రక్రియ .ఎక్కువమంది దీన్ని నేర్చే ప్రయత్నం చేసినా బహు కొద్ది మందే దీని అంతు చూడగలిగి నిష్ణాతులవుతారు  .కేరళలో ‘’రధపాఠం ‘’అనే మరో ప్రక్రియ ఉంది .దీన్ని నంబూద్రి బ్రాహ్మణులు ఎక్కువగా నేరుస్తారు .కాని తీరాంద్రలేక సాగరాంధ్ర  లో అలవాటులో లేదు .

తైత్తిరీయ సంహిత ,బ్రాహ్మణాలు ఆరణ్యకాలు ,ఉపనిషత్తుల ను సంపూర్తిగా నేర్చినవారు ,మిగిలిన వేదాలను వాని శాఖలను నేరుస్తారు .ఋగ్వేదంను అదే గురువుకాని  వేరొక గురువు వద్దకానీ అభ్యసిస్తారు .ఇంకా ఉత్సాహముంటే సామ వేదాన్ని నేర్చుకుంటారు .ఇది సోమ క్రతువులకు తప్పని సరి .గాన విధానం ఇందులో ప్రత్యేకత . ఇందులో జైమినేయ ,కౌతుమ ,రనయనీయ శాఖలలో అద్వితీయులయ్యే ప్రయత్నం చేస్తారు .

వేదం లోని లోతులను  తరచటానికి ఈ ముఖీయ అధ్యయనం పెద్దగా తోడ్పడదు .అందుకని మీమాంస ,వ్యాకరణాలు  చదివి వేదార్ధ ప్రవీణులౌతారు . వివాహాది కార్యాలు చేయించటానికి స్మార్తం నేరుస్తారు.ఆపస్తంభ ధర్మ సూత్రాలను క్షుణ్ణంగా నేర్చుకొంటేనే ఇది సాధ్యమవుతుంది .మిగిలిన వాటిలో కూడా  సరి ఫికెట్లు కావాలంటే వాటినీ తరచి సాధిస్తారు .పురోహితుడు అనిపించుకుంటాడు .శ్రౌతం లో నిష్ణాతులు రుత్విజులౌతారు .గృహ్య సూత్రాలు నేర్చి నిత్యకర్మలు ఉపనయనాది కార్యాలు చేయిస్తారు. శ్రౌత సూత్రాలు నేరిస్తే యజ్ఞయాగాదులకు పనికొస్తారు .వేదం చదివి పండిత పరీక్షనిచ్చి  ఉత్తీర్ణులైన  వారిని వేదపండితులంటారు .

శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి ఋణం తీర్చుకోలేనిది

అన్నేళ్ళు కస్టపడి వేద విద్యనేర్చి పండితులైతే పొట్ట గడిచేది యెట్లా ?  వారి ఇళ్ళల్లో పొయ్యిలో పిల్లి లేచేదేట్లా .కోనసీమ లో దీనిపై ముందుగా ఆలోచించి పరిష్కార మార్గం కనిపెట్టినవారు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు .ప్రతి దేవాలయం లోనూ వేద పండితుల చేత  సామూహిక వేదపారాయణ రోజుకు కనీసం మూడు గంటలు  చేయించారు ఇలా చేసే ఏర్పాటు చేయాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .దీన్ని గమనించిన ప్రభుత్వం తిరుపతి తిరుమల దేవస్థానం కార్య ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేసింది .దేవాలయాలలో పూజారి ప్రసాదాలు మాత్రమేకాక వేద పారాయణ చేసే పండితులను నియమించింది .శ్రీశైలం, తిరుమల, బెజవాడ కనకదుర్గమ్మ మొదలైన ముఖ్య దేవాలయాలలో ఈ పధకం ముందు ప్రారంభమైంది .నాలుగువేదాలలో నిష్ణాతులైన పండితులు ఎనిమిది మందికి అవకాశాలు లభించాయి .దీనివలన అప్పుల్లో కూరుకుపోయిన బ్రాహ్మణ పండితులకు కొంచెం ఊరట కలిగింది .ప్రభుత్వం ప్రకటించిన గౌరవ వేతనం వలన పిల్లల పెళ్ళిళ్ళు చేసే వీలు కలిగింది .ఈ విధానాన్ని కోనసీమలో ప్రారంభింప జేసిన శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి చిత్రపటాన్ని ప్రతి బ్రాహ్మణ కుటుంబలో దేవుని మందిరం లో ఉంచి కృతజ్ఞత లు తెలుపు కుంటోంది.ఆయన్ను ప్రాతస్మరణీయులను చేసుకున్నారు కొనసీమవారు   .పండితులు తమ పిల్లలకు కూడా వేదం విద్యనేర్పిస్తున్నారు ,ఈ వేదపండితులకు పెన్షన్ సౌకర్యం కూడా కలిగించమనే ఆందోళనా ఉన్నది .అయితే ఆహితాగ్నులు మాత్రం ‘’వేదాన్ని పండితులు అమ్ముకుంటున్నారు .ఇది వేద విక్రయం అవుతుంది ‘’అని బాధ పడ్డారు .

భారత దేశ వేద పండితులలో ప్రధమ స్థానం లో ఉన్నవారు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు .1980 లో ఆయన 92వ ఏటకూడా ఆయన కాకినాడ స్వగృహం లో   తైత్తిరీయ సంహితలోని అగ్ని సూత్రాలు ,అశ్వమేధ యాగ మంత్రాలు స్పుటంగా ,ఉచ్చైశ్వరం తో గానం చేశారు .ఎక్కడా తొట్రుపాటు వణుకు లేవట .ఒక మహర్షి మంత్ర పఠనం లాగా ఉందని చూసినవారు ఆశ్చర్య పోయారట .కారణ  జన్ములాయన.దీనికి 74 ఏళ్ళ క్రితం అంటే ఆయన 18 వ ఏటనే ఒక క్రతువుకు అధ్వర్యులుగా ఉన్నారట .ఏమి జన్మ సుకృతం ?

గణపతి శాస్త్రి గగారు కోనసీమలో ప్రారంభించిన  సామూహిక వేదపారాయణ ప్రతివారినీ చైతన్యవంతులను చేసి, వేద విద్య వ్యాప్తి,  వేదపండితసత్కారం తమవిధి అని గుర్తించెట్లు చేసింది  .దీనితో సంక్రమణం నాడులేక నెలకోసారి కాని స్థానిక బ్రాహ్మణ సంఘాలు  వేదపండితులను ఆహ్వానించి మొదటి నలభై నాలుగు పన్నాలలో ఏదో ఒకదాన్ని వల్లించమని కోరేవారు .వారికి సంఘం తగిన పరితోషికమిచ్చి సత్కరించి పంపేది. ఈ సంస్కృతీ  ఆంద్ర దేశమంతటా విస్తరించింది . వీలైన చోట్ల వేదసభలు  శాస్త్రార్ద చర్చలు చేయించి గౌరవిస్తున్నారు  .వాటిని చూసి ఆనంద పారవశ్యం పొందని వారు ఉండరు .కంచి, ,శృంగేరి పీతాదిపతులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహిస్తున్నారు .వేదపండితులు గ్రామ ,పట్టణాలు సందర్శించి తమ విద్వత్తు ప్రదర్శించి తగిన బహుమానాలు అందుకోవటం నేడు సర్వ సాధారణమై పోయింది .ఇదంతా శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రిగారి పూనికా, వేదమాత సేవా భాగ్యమే

దేవాలయాలలో ఘనపండితుడికి నెలకు 1800 ,క్రమ పండితుడికి నెలకు 1500 రూపాయలు గౌరవ భ్రుతి  ఇస్తున్నారు .రిటైరైనవారికి కూడా నెలకు వెయ్యి రూపాయలిస్తున్నారు .వీరికి అమెరికాలో గొప్ప ఆదరణ లభిస్తోంది .కాని కేరళ పండిత  నంబూద్రి కుటుంబాలు మాత్రం అమెరికా వెళ్ళటానికి ఉత్సాహం చూపటం లేదట .ఇప్పటికీ కోనసీమ సంప్రదాయ కుటుంబీకులువేదం లో సర్టి ఫికేట్ ఉన్న కొడుకులను, మనవళ్ళను అమెరికా  పంపటానికి ఇష్టపడటం లేదట . వీరు చెప్పే సామెత ‘’దూరపుకొండలు నునుపు ‘’.వేదపండిత సర్టిఫికేట్ ఉన్నవారినే పంపటానికి ఇష్టపడక పొతే నిత్యాగ్ని హోత్రులైన ఆహితాగ్నులు బయట దేశానికి ఎలా వెడతారు ?వారికి గృహమే స్వర్గ సీమ .వీరి  విశేషాలు తర్వాత తెలుసుకొందాం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ”

సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ”

27-7-18 శుక్రవారం ఆషాఢ పౌర్ణమి గురుపౌర్ణమి వ్యాస జయంతి సందర్భం సరసభారతి 128 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో  ఉదయం 8 గంటలకు ”వ్యాస జయంతి ”నిర్వహిస్తోంది
  కార్యక్రమ వివరాలు
ఉదయం 8 గం లకు -వ్యాస స్తోత్ర పఠనం -విష్ణు సహస్రనామ అష్టోత్తర పూజ
             8-30 గం  లకు – భగవద్గీత ఫేమ్ ,భగవద్గీత గాన ప్రచారాలకు ఇటీవలే మైసూర్ లో దత్త పీఠాదిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి నుండి ”స్వర్ణ పతకం ”పొందిన కుమారి మాది రాజు వెంకట బిందు దత్తశ్రీ (బి.టెక్).చే భగవద్గీత గాన ప్రవచనం  –
 అందరికీ ఆహ్వానం -పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
  గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు ,ఆలయ ధర్మకర్త 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు     

చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు

1-కొత్త వంద రూపాయల నోటుపై స్థానం పొందిన రాణీగారి ఏడంతస్తుల దిగుడుబావి

‘’రాణీ కా వావ్’’అనే ప్రఖ్యాతమైన్న ఏడు అంతస్తుల దిగుడుబావి గుజరాత్ లోని పఠాన్ లో సరస్వతీ నదీ తీరాన ఉంది .11 వ శతాబ్దం లో 1022 –1064కాలపు సోలంకి నేలిన చాళుక్య రాజు మొదటి భీమ దేవ్ జ్ఞాపక చిహ్నంగా అంటే స్మృతి చిహ్నంగా   ఆయన భార్య రాణి  ఉదయమతి దీన్ని కట్టించింది  .ఆమె కాలం లో మిగిలిపోయిన దాన్ని కొడుకు రాజాకర్ణ పూర్తి  చేశాడు . 1304 కాలపు జైనకవి  ‘’మేరుతంగ సూరి’’ తన ‘’ప్రబంధ చింతామణి ‘’లో దీనిని ఉదాహరించాడు . సుమారు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఈ బావి సరస్వతీ నదికి వచ్చిన వరదలో మట్టిలో పూడుకు పోయి’’మిట్టీమే సోనా ‘’గా మిగిలింది .64 మీటర్ల పొడవు ,20 మీటర్ల వెడల్పు ,27 మీటర్ల లోతుగా ఉన్న ఇది చూడటానికి రాతితో నిర్మించబడిన పెద్ద కోట లా ఉంటుంది .దీనికి అన్నివైపులా ఉన్న స్తంభాలపై భారతీయ చిత్రకళ  అంటే మరు –ఘూర్జర శైలి తాండవం చేస్తుంది .ఏడు అంతస్తుల ఈ బావిలో 500శిల్పాలు ,మరో 800 కళా ఖండాలున్నాయి .వీటిపై దశావతారాలు ,సొల శృంగారం గా ఉన్న 16రకాల  అప్సరసల శిల్పాలు ‘’వావ్! ఇదేం వావ్! ‘’అని పిస్తాయి . ఇంతపెద్ద విశాలమైన ప్రత్యేకమైన కట్టడం అపూర్వం గా భావిస్తారు .ఈ బావిలో కింద చివరి మెట్టువద్ద ఉన్న గేటు నుండి  30 మీటర్ల సొరంగం కూడా మట్టిలో పూడుకు పోయింది .ఈ సొరంగం నుండి వెడితే పఠాన్ వద్ద ఉన్న సిద్ధ పూర్ కు సురక్షితంగా చేరేవారు . ఈ బావి 1980 లో పురావస్తు శాఖ త్రవ్వకాలలో మళ్ళీ వెలుగు చూసింది .యుద్దాలకాలం లో లేక ఆపదలు సంభవించినపుడు రాజా౦తః పుర స్త్రీలు  ఈ సొరంగం ద్వారా తప్పించుకొని బయటకు వెళ్ళేవారు .50 ఏళ్ళక్రితం వరకూ బావి చుట్టూ ఔషధ మొక్కలు ఉండేవి .ఇలాంటి దిగుడుబావులు మంచి నీటికోసమే కాక ఆధ్యాత్మిక చింతనకు , శిల్పకళా వైభవానికిచిహ్నాలు . 2014 యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ బావి చోటు దక్కించుకున్నది .2016 లో ‘’క్లీనెస్ట్ ఐకానిక్ ప్లేస్ ‘’గా అవార్డ్ పొందింది .అందుకే భారత ప్రభుత్వం కొత్తగా ముద్రిస్తున్నవంద రూపాయల నోటు పై స్థానం పొంది కను విందు చేస్తూ ,చారిత్రిక నిదర్శనం గా దర్శనమిస్తోంది

2-అత్యంత  సుందరమైన రాజస్థాన్ లోని చాంద్ బావోరి దిగుడుబావి

రాజస్థాన్ లో జైపూర్ కు 90 కిలోమీటర్లలో అభనేరి గ్రామం లో  చాంద్ బవోరి దిగుడు బావి అత్యంత సుందరం, విశాలమైనది .800-900 కాలపు నికుంభ వంశరాజు రాజా చంద్ర దీన్ని  నిర్మించాడు .13 అంతస్తులతో ,3,500 మెట్లతో’’ హర్షత్ మాత ‘’దేవాలయానికి ఎదురుగా ఉంటుంది .బాలీవుడ్ సినిమాల షూటింగ్ కేంద్రం గా ప్రసిద్ధమై ,ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ అయింది .

3-రాజోం కి బావోలి –ఢిల్లీ

వంద చారిత్రాత్మక కట్టడాలున్న మెహ్రౌలీ ఆర్కిలాజికల్ పార్క్ సమీపం లో రాజోం కి బావోలి దిగుడుబావి రాజుల కట్టడం కాదు కాని 1516 లో దౌలత్ ఖాన్ కు చెందిన తాపీ మేస్త్రీలు కట్టినది .అందానికి, శిల్పకళకు పెట్టిందిపేరు .

4-అగ్రసేన్ కి బావోలి-ఢిల్లీ

60 మీటర్లపోడవు,20 మీటర్ల వెడల్పు ఉన్న ఈ బావి ఢిల్లీ కన్నాట్ ప్లేస్ కు దగ్గరలో ఉంది.10 3 చిన్న రాతి మెట్లుంటాయి .ఎర్రరాయి నిర్మితం .అగ్రసేన మహారాజు మొదట దీన్ని నిర్మిస్తే ,14 వ శతాబ్ది అగర్వాల్ వంశస్తులు పునర్నిర్మించారు .

5- నగర్ సాగర్ కుండ్-బుండి

రాస్తాన్ లో బుండీదగ్గరున్న నగర్ సాగర్ కుండ్  ఎదురెదురు మెట్లతో చోగాన్ గేట్ కు దగ్గర ఉంది .వీటికి జనానా సాగర్ ,గంగా సాగర్ దిగుడు బావులని పేరుండేది .తర్వాత రెండూ కలిపి నగర్ సాగర్ కుండ్ అంటున్నారు .మహారాజా రాం సింగ్ పాలనలో 1871 లోను ,1875 లోనూ మహారాణి చంద్రభాను కుమారి నిర్మించింది

6-అదలాజ్ దిగుడుబావి –అహమ్మదాబాద్

గుజరాత్ రాష్ట్రం అహమ్మదాబాద్ కు సుమారు 20 కిలోమీటర్ల దూరం లో ‘’ఆదలాజ్ ని వావి ‘’ఉన్నది .దీనికి వెనుక విషాద గాధ ఒకటి ఉన్నది .ఈ ప్రాంతపు పాలకుడు దండైదేశ్ దీని నిర్మాణం మొదలు పెట్టగా 1499 లో ఒక ముస్లిం రాజు అతన్ని ఓడించి ,ఆ ప్రాంతాన్ని ఆక్రమించి ధ్వంసం చేశాడు .ముస్లిం రాజు కు ఓడిపోయిన హిందూ రాజు భార్యరాణి పై వ్యామోహం కలిగి కోరిక తెలియజేశాడు .ఆమె తనభర్త మొదలు పెట్టిన బావి ని ఆయన స్మృతి చిహ్నంగా పూర్తిచేస్తే అతడిని వివాహమాడతానని కబురు చేసింది . నమ్మిన ముస్లిం రాజు హిందూ ముస్లిం సంయుక్త శిల్పకళతో ఆ బావిని పూర్తిచేశాడు .బావి పూర్తి అవగానే రాణి అమాంతంగా అందులోకి దూకి మరణించింది .

7- రాణీ జీకి బావోరి –బుండి

రాజస్థాన్ బుండి లో రాణీ జీకి బావోరి అనే దిగుడుబావి గుజరాత్ లోని ప్రసిద్ధ రాణి కి వావ్ లాగా ఉంటుంది .1699 లో రాణి నాధావతి దీన్ని నిర్మించటం వలన ఆ పేరొచ్చింది .బుండీ లో దిగుడుబావులు చాలా ఉండటం చేత దాన్ని’’ దిగుడుబావుల నగరం’’ అంటారు .అక్కడి 50 బావుల్లో రాణి నాధావతి కట్టించినవే 21 ఉండటం విశేషం

8- తూర్ జి కా  ఝల్రా –రాజస్థాన్

1740 లో చారిత్రాత్మక కట్టడంగా నిర్మించబడిన తూర్ జీ కా ఝల్రా ఇటీవలికాలం లో త్రవ్వకాలలో బయట పడింది .స్వచ్చమైన జలం తో మిలమిల మెరిసే చేపలతో సుందరా తిసుందరంగా ఉంటుంది .

9-పన్నా మీనా కా బావోలి-అమేర్

రాజస్థాన్ జైపూర్-అమెర్ రోడ్డుపై అమేర్ లో పన్నా మీనాకా కుండ్ ఎనిమిది అంతస్తుల దిగుడుబావి.16 వ శతాబ్ది కట్టడం .నీటికోసమే కాకుండా,జలకాలాటలకు , ప్రశాంతంగా విశ్రాంతి గా  కూర్చోటానికి ,సమావేశాలు జరుపుకోవటానికి కూడా బాగుంటుంది.

10-లక్కుండి దిగుడుబావి- కర్నాటక

కర్ణాటకలో హంపీకి వెళ్ళే దారిలో లక్కుండి చిన్న గ్రామం .ఇది చాళుక్య దేవాలయాలకు ప్రసిద్ధి . టూరిజం డిపార్ట్ మెంట్ కు దీనిపై దృష్టి పడకపోవటం విడ్డూరం .కాని చరిత్ర ,పురావస్తు అభిమానుల పాలిటి దివ్యవరం ఇది .ఈ ప్రాంతం లో 100 దిగుడు బావులున్నాయి .దేనికదే ప్రత్యేకతతో శోభిస్తుంది .

11-సూర్యకుండ్ –మొధేరా

గుజరాత్ లో మోదేరావద్ద సూర్యకుండ్  దిగుడుబావి సూర్య దేవాలయం సమీపాన ఉంది .పుష్పావతి నది ఒడ్డున భీమదేవ మహారాజు 1026 లో నిర్మించాడు .ఇప్పుడు పురావస్తు శాఖ అధీనం లో ఉంది .రేఖాగణిత శాస్త్రానికి ఇది గొప్ప ఉదాహరణగా భావిస్తారు

12 హంపి పుష్కరిణి –కర్నాటక

చాళుక్య శిల్పకలళావైభవానికి అద్దంపట్టే దిగుడుబావి హంపీ పుష్కరిణి .  15 వశతాబ్ది కట్టడం .రోమన్ శిల్పకళ లో ఎలా నీటిని పారించే తూములు ఉండేవో  అలానే దీన్ని నింపటానికి వ్యవస్థ ఉంది .నల్లరాతికట్టడం .కళ హంగులు లేకుండా అత్యంత సాధారణంగా జ్యామితి ని దృష్టిలో పెట్టుకొని ఉదాహరణగా తీర్చి దిద్దబడిన దిగుడుబావి ఇది .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-18- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు     

   చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు

1-కొత్త వంద రూపాయల నోటుపై స్థానం పొందిన రాణీగారి ఏడంతస్తుల దిగుడుబావి

‘’రాణీ కా వావ్’’అనే ప్రఖ్యాతమైన్న ఏడు అంతస్తుల దిగుడుబావి గుజరాత్ లోని పఠాన్ లో సరస్వతీ నదీ తీరాన ఉంది .11 వ శతాబ్దం లో 1022 –1064కాలపు సోలంకి నేలిన చాళుక్య రాజు మొదటి భీమ దేవ్ జ్ఞాపక చిహ్నంగా అంటే స్మృతి చిహ్నంగా   ఆయన భార్య రాణి  ఉదయమతి దీన్ని కట్టించింది  .ఆమె కాలం లో మిగిలిపోయిన దాన్ని కొడుకు రాజాకర్ణ పూర్తి  చేశాడు . 1304 కాలపు జైనకవి  ‘’మేరుతంగ సూరి’’ తన ‘’ప్రబంధ చింతామణి ‘’లో దీనిని ఉదాహరించాడు . సుమారు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఈ బావి సరస్వతీ నదికి వచ్చిన వరదలో మట్టిలో పూడుకు పోయి’’మిట్టీమే సోనా ‘’గా మిగిలింది .64 మీటర్ల పొడవు ,20 మీటర్ల వెడల్పు ,27 మీటర్ల లోతుగా ఉన్న ఇది చూడటానికి రాతితో నిర్మించబడిన పెద్ద కోట లా ఉంటుంది .దీనికి అన్నివైపులా ఉన్న స్తంభాలపై భారతీయ చిత్రకళ  అంటే మరు –ఘూర్జర శైలి తాండవం చేస్తుంది .ఏడు అంతస్తుల ఈ బావిలో 500శిల్పాలు ,మరో 800 కళా ఖండాలున్నాయి .వీటిపై దశావతారాలు ,సొల శృంగారం గా ఉన్న 16రకాల  అప్సరసల శిల్పాలు ‘’వావ్! ఇదేం వావ్! ‘’అని పిస్తాయి . ఇంతపెద్ద విశాలమైన ప్రత్యేకమైన కట్టడం అపూర్వం గా భావిస్తారు .ఈ బావిలో కింద చివరి మెట్టువద్ద ఉన్న గేటు నుండి  30 మీటర్ల సొరంగం కూడా మట్టిలో పూడుకు పోయింది .ఈ సొరంగం నుండి వెడితే పఠాన్ వద్ద ఉన్న సిద్ధ పూర్ కు సురక్షితంగా చేరేవారు . ఈ బావి 1980 లో పురావస్తు శాఖ త్రవ్వకాలలో మళ్ళీ వెలుగు చూసింది .యుద్దాలకాలం లో లేక ఆపదలు సంభవించినపుడు రాజా౦తః పుర స్త్రీలు  ఈ సొరంగం ద్వారా తప్పించుకొని బయటకు వెళ్ళేవారు .50 ఏళ్ళక్రితం వరకూ బావి చుట్టూ ఔషధ మొక్కలు ఉండేవి .ఇలాంటి దిగుడుబావులు మంచి నీటికోసమే కాక ఆధ్యాత్మిక చింతనకు , శిల్పకళా వైభవానికిచిహ్నాలు . 2014 యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ బావి చోటు దక్కించుకున్నది .2016 లో ‘’క్లీనెస్ట్ ఐకానిక్ ప్లేస్ ‘’గా అవార్డ్ పొందింది .అందుకే భారత ప్రభుత్వం కొత్తగా ముద్రిస్తున్నవంద రూపాయల నోటు పై స్థానం పొంది కను విందు చేస్తూ ,చారిత్రిక నిదర్శనం గా దర్శనమిస్తోంది

Posted in రచనలు | Tagged | Leave a comment

గుజరాత్ దిగుడుబావుల  చరిత్ర  

గుజరాత్ దిగుడుబావుల  చరిత్ర

గుజరాత్ రాష్ట్రం సోమనాద్ ,ద్వారక వంటి పుణ్యక్షేత్రాలు, గాంధీ పటేల్ మొరార్జీ వంటి రాజకీయనాయకులకు ,జౌళి పరిశ్రమకే కాక దిగుడుబావులకూ ప్రసిద్ధి చెందింది .ఇటువంటివి 120 దాకా ఉన్నాయి .సి౦ధునాగరకత కాలానికే ఇవి బహుళ వ్యాప్తమైనాయి .దోలావీర్ మొహంజదారో లలో ఇవి కనిపించాయి .ఇవి గుజరాత్ వాయవ్య భాగాన ఉన్నాయి.ఇక్కడినుండి ఉత్తరానున్న రాజస్థాన్ కు వ్యాపించాయి .చాళుక్య ,వాఘేల వంశారాజుల పాలనలో 10 నుంచి 13 వ శతాబ్దం వరకు. ,.కాని వీటి నిర్మాణం   11 నుండి 16 వ శతాబ్దాలకుమహోత్క్రుస్ట దశకు చేరింది .13 నుండి 16 శతాబ్దం వరకు పాలించిన మహమ్మదీయులు ఈ నిర్మాణాలను యధాతధంగానే ఉంచటమేకాక ప్రోత్సహించారుకూడా.

  దిగుడుబావుల నీరు పవిత్రమైనదని అనాదికాలం నుండీ  విశ్వసిస్తున్నారు .అతి ప్రాచీనమైన దిగుడుబావి జునాగడ్ లోని ఊపర్ కోట్ గుహలలో ఉన్నాయి .ఇవి నాలుగవ శతాబ్దికి చెందినవి .నవ ఘాన్ కువో అనే బావి మెట్లు గుండ్రంగా ఉండటం ప్రత్యేకత .బహుశా ఇవి పశ్చిమ సాత్రపుల కాలం 200-400 లో  లేక మిత్రకార పాలన 600-700 కాలం లో నిర్మింపబడి ఉండవచ్చునని ఊహిస్తున్నారు .బావి ని గుజరాతీ లో’’వావి ‘’అంటారు .వకు బా కు భేదం లేదని మనకు తెలిసిందే .దీని ప్రక్కనే ఉన్న’’ ఆది కాదిని బావి ‘’10 వశతాబ్ది పూర్వార్ధం లో కట్టారని భావిస్తారు  చాళుక్యరాజులపాలనకు పూర్వమే రాజ్ కోట్ జిల్లా’’ధంక్’’లో లో దిగుడుబావులనిర్మాణ౦  జరిగి, అవే అతి పురాతనమైనవిగా గుర్తింపు పొందాయి .దీనికి దగ్గరలో అలేక్ కొండలపై’’ బొచావ్డి నెస్’’ వద్ద ఉన్న బావి పై వాటికంటే ప్రాచీనమైనది.600 ప్రాంతం లో నిర్మించబడిన ఝిలాని ,మంజుశ్రీ దిగుడుబావులు సౌరాష్ట్ర శిల్పకళతో ఉండటంవలన 7 వశతాబ్దికి చెందినవని తేల్చారు .

   చాలుక్యులపాలనలో నిర్మింపబడిన దిగుడుబావులు కళాత్మకంగా ఉన్నాయి .మొధేరా సూర్య దేవాలయానికి పడమరగా ఉన్న నీటి కుండం 11 వ శతాబ్ది ది.భూమిపైకి ఉన్నమండపం  10 వశతాబ్ది ది. 1050 లో పఠాన్ లో  ‘’రాణీగారి బావి’’ నిర్మించారు .దావడ్ లోని అంకోల్ మాత బావి , అహ్మదాబాద్ లోని భవానీమాత బావి 11 వశతాబ్ది చివరలో ఏర్పడినవి .చాళుక్యరాజు జయసింహ సిద్ధ రాజు తల్లి మినాల్ దేవి జ్ఞాపకార్ధం వీరగావ్ తటాకం ,నాదియాడ్ లో దిగుడుబావి నిర్మాణం జరిగాయి .సబర్కాంత జిల్లా బలేజ్ గ్రామం లో ఉన్న మినాల్ దిగుడుబావి 1095 లో నిర్మించారు .రాజ్ కోట్ జిల్లా విర్పూర్ లో ఉన్న మినాల్ దేవి  బావి చాళుక్య కళాత్మికంగా నిర్మించారు.అహమ్మదాబాద్ లోని అసపూరి వద్దా ,ఝింజువాడా లోని దిగుడుబావులు 12 వ శతాబ్దికి చెందినవి .సురేంద్రనగర్ జిల్లా చోబారి లోను ,ధన్దాల్ పూర్ లోని బావి జయసింహ సిద్ధరాజ్ నిర్మించాడు .12 శతాబ్దిపాలకుడు కుమారపాల కాలం లో చాలా దిగుడు బావులు నిర్మించాడు .పఠాన్ దగ్గర వాయడిబావీ ఇప్పటిదే .వద్వాన్ వద్ద ఉన్న గంగా దిగుడుబావి 1169 లో కట్టబడింది .చాళుక్యరాజుల పాలన చివరి రోజులలో రాకీయ అనిశ్చిత పరిస్థితులవలన బావుల నిర్మాణం మందగించింది.నవ్లఖా దేవాలయం దగ్గరున్న వీకియా, జీతా బావులు ,బరోడా కొండలపైఉన్న ఘూమ్లి బావి 13 వ శతాబ్ది వి .బరోడాకొండలదగ్గర  విసవాడ గ్రామం లోని జ్ఞాన బావి రెండవ భీమరాజు కాలం లో కట్టబడినవి .

  వంతాలి జునాగడ్ ల మధ్య ఉన్న రాకేంఘర్ బావి తేజపాల్ ,వాస్తుపాల్ – అనే వాఘెలాఆస్థాన మంత్రి సోదరులు కట్టించారు .వాఘేల రాజు విలాస దేవ్ 1225 లో దభోయ్ వద్ద దిగుడుబావికట్టించి  గేట్లూ,దేవాలయాలు నిర్మించాడు.దభోయ్ లోని సత్ముఖి బావి పైన దేవాలయం ఉంది .ఇవికాక 7 బావులుకూడా నిర్మించాడు .వాద్వాన్ లోని మాధవవ్ బావి 12 94 లోమహారాజ కర్ణ ఆస్థానం లోని  మాధవ ,కేశవ అనే బ్రాహ్మణులు కట్టించారు .కపాద్ వంజ్ లోని బతీష్ కోట బావి 13 వ శతాబ్ది ది.

14 వ శతాబ్దం దిగుడుబవులకుస్వ ర్ణయుగం  .మంగ్రోల్ లో   సోదాలి బావిని 1319 లో మోధా కులస్తుడు వాలి సోధాల కట్టించాడు .ఖేడ్ బ్రహ్మలోదేవాలయం దగ్గర లోని   బ్రహ్మ  దిగుడుబావి14 వ శతాబ్దికి చెందింది .1381 నాటి మధువ లోని సూదా బావి ,  దందుసార్ లోని హని ,  ధోల్కా లోని సిద్ధాంత మహాదేవ బావులు  తుఘ్లక్ పాలనలో కట్టబడినవి .అహమ్మదాబాద్ దగ్గర సంపా ,రాజ్ పురాదగ్గర  రాజ్ బా బావులు  ,1328 నాటివి . 1499 లో హరేం మహిళ మహమ్మద్ బెగడ దాదా హరీర్ బావి నిర్మించింది .లూనావాల దగ్గర కాలేశ్వరి, నీ నాల్ అనే రెండుబావులు 14 -15 శతాబ్దులలో కట్టారు .వడోదర దగ్గరున్న రెండూ 15 శతాబ్దం లో కట్టినవే .1499 లో రుడాబాయ్ అదలాజ్ బావి ,చత్రాల్ బావి నిర్మించింది

     ధ్రన్గ్ధరలోని నాగబావ , మొర్బిలోని జీవమేహతా బావులు 1525లో ఒకే శైలిలో నిర్మించ బడినాయి .1560 లో రాజా శ్రీనానాజీ భార్య చంపా రోహోఅనేదాన్నినిర్మించింది .15- 17 శాతాబ్దు లమధ్య చాలా బావులు వచ్చాయికాని చాలా సాధారణంగా నిర్మించారు .హంపూర్ ,ఇడార్ లలో వీటిని చూడచ్చు 1633 లో సి౦ధవి మాతబావి ని పఠాన్ లో కట్టారు .17 వశతాబ్దిలో రవి బావి ,1628 లో లిమ్బోయిలో చాళుక్య శైలిలో బావి కట్టారు .అహమ్మదాబాద్ లో  అమృత వాహిని బావి ని’’ L ఆకారం’’గా నిర్మించారు

 19 ,20 శతాబ్దపు బ్రిటిష్ పాలనలో దిగుడుబావినీరు ఆరోగ్యానికి మంచిదికాదని గొట్టాలు దింపి పైపులద్వారా నీటి సరఫరా చేయటం మొదలుపెట్టారు .1860 లో అహమ్మదాబాద్ లోనిఇసాన్పూర్ లోజీతాభాయి  దిగుడుబాయి నిర్మాణం పూర్తి  చేసి వ్యవసాయానికి ఉపయోగించారు .వంకనీర్ పాలెస్ దిగుడుబావిని 1930 నాటిపాలకులు తెల్లమార్బుల్ రాయితో కట్టించి అందాలు చిమ్మించి  ఆకర్షణ తెచ్చారు .చల్లని ప్రదేశం కనుక ఇది వేసవి విడిదిగా యాత్రికులను బాగా ఆకర్షిస్తుంది .

ఇదండీ గుజరాత్ దిగుడు బావుల వంశ చరిత్ర .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-18 –ఉయ్యూరు   ,

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ ,పతి ‘’శయన’’సల్లాపాలు

శ్రీ ,పతి ‘’శయన’’సల్లాపాలు

స్వామీ !

ఏమీ !

నాధా!

ఏమిటి బాధ ?

తమరు ఈ రాత్రినుంచి శయ్యాక్రా౦తు లవుతారు కదా !

అవును ఇదేమీ కొత్తకాదే.ప్రతి ఏడూ జరిగే ముచ్చటే గా !

మీకు ముచ్చటే .మాకు చెమటలు పోస్తాయి ఆ నాలుగు నెలలూ

దేనికి ?

ఎవరైనా అధికారి ఊరికి వెడితే తనబాధ్యత తన తర్వాత అధికారికి అప్పగించి వెళ్ళటం లోక రివాజు .

ఓహో అలాగా !

మరి తమరు ఏకంగా నాలుగు నెలలు నిద్రకు ఉపక్రమి౦చ బోతున్నారాయే .మధ్యలో రెండు నెలలతర్వాత కాస్త మరోపక్కకు ఒత్తిగిలి పరుంటారే కాని మెలకువ తెచ్చుకోరుకదా ఆ నాలుగు మాసాలూ పూర్తయ్యేదాకా !

అవును నిజమే ఇందులో వి౦త కాని విడ్డూరం కానీ ఏమీ లేవే!

మీకు అలా అనిపించవచ్చు .కాని లోకానికి అది తగనిదిగాఅనిపిస్తుందేమో .స్థితి కారకులే నిశ్చింతగా నిద్రిస్తుంటే లోక పాలన ఏమైపోవాలి స్వామీ ?ఎవరికైనా ఈ నాలుగు నెలలూ బాధ్యత నప్పగించి హాయిగా పడుకోండి కాదన్నది ఎవరు ?

సరే నీ ఉపాయం బాగానే ఉంది .నువ్వే సలహా చెప్పుఎవరికిస్తే బాగుంటుందో ?

నన్ను ఎందుకు ఇందులోకి లాగుతారు బాబూ ! మీ  ఏర్పాటేదో మీరే చేసుకోండి .నేనేదైనా చెబితే ఆడపెత్తనం అంటారేమో లోకులు .అయినా మనవాళ్ళలో ఎవరికైనా ఒకరికి అప్పగించండి .మీ మిత్రుడూ మా అన్నయ్య శివుడున్నాడు కదా .ఆయనకు అప్పగిస్తే ?

భలే సలహా ఇచ్చావు సాధ్వీ .పుట్టి౦టి వాళ్ళను బాగానే వెనకేసుకొచ్చావు .

ఈసోడ్డు వేస్తారని ముందే అనుకున్నా .కాని గమ్మున మీలాగా ఉండలేను కదా .శివన్నయ్య కిస్తే ఏం ?

ఏమీ లేదు కానీ అసలే భోళాశంకరుడు .ఎవరికే వరాలిచ్చి ప్రాణం మీదకు తెస్తాడేమో నని భయం  కానీ—

కానీ లేదు దమ్మిడీ లేదు ఇంకా ఆలోచన ఎందుకు  స్వామీ !ఎప్పుడో ఏదో చేశాడనిఇప్పుడు దెప్పుడా ?  అప్పుడు అలా జరగాలి కనుక జరిగి ఉండచ్చు. ఆయనది దోషం కాకపోవచ్చు కదా .

 నీమాటే నమ్ముదాం .కాని ఆయన ఎప్పుడూ లయకారుడు గానే గుర్తింపు పొందాడు .ఇప్పుడు స్థితి కారక బాధ్యత అప్పగిస్తే నేను నిద్ర లేచేసరికి జనక్షయం ?

శుభం పలకమంటే సామెత చెప్పినట్లు ఈ విపరీతమేమిటండీ.మా అన్నయ్యకు ఇవ్వాలని లేదని సూటిగా చెప్పలేక ఈ డొంక తిరుగుళ్ళు ఎందుకు  హరీ !

సిరీ !నా మనసు బాగానే అర్ధం చేసుకున్నావ్ –వేరొకరి పేరు చెప్పు ఆలోచించి .

ఇంకెవరున్నారు కమలగర్భ జనకా? మనబ్బాయి బ్రహ్మకు అప్పగించండి సంకోచం దేనికి ?

సంకోచం కాదు –ఎప్పుడూ  అడ్డగోలుగా   సృష్టించి పారెయ్యటం ,వాళ్ళు నామీద పడిఏ డవటం ! అదేగా అతడి నిర్వాకం .పాలన గురించి పట్టించుకున్న వాడుకాదు కదా –

కాలికేస్తే వేలికి , వేలికేస్తే  కాలికీ బాగానే బిగిస్త్తున్నారు –యెట్లా మీతోవేగేది ?

చంద్ర సహోదరీ ! దీనికే అంత కోపమా ?వ్యవహారాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి నిర్ణయం చేస్తేనే కదా సమన్యాయం జరిగేది ?

అవునను కోండి –మీ సంబోధనలో నాకొక సూచన కనిపించింది –చెప్పనా ?

చెప్పాలనేకదా చంద్రవదనా !

అయితే,  మా సోదరుడు మీకు బావమరది ‘’చంద్రన్న’’కు అప్పగించండి కమలదళాయతాక్షా !

భేషైన సూచన .వాడు తారా సందోహం తో   ఇరవై ఏడుగురు భార్యలతో సతమతమవుతూ ,ప్రియురాళ్ళ విరహ వేదన కలిగిస్తూ క్షోభ పెడతాడు .వాడికి దీనిమీద దృష్టి పెట్టె తీరిక ఉంటుందనుకొన్నావా ?

బాబోయ్ మదన జనకా !మీ మనసుకు నచ్చిన వాళ్లే వరో నాకెలా తెలుస్తుంది ?నేను చెప్పిన వాళ్ళను   చదరంగం లో పావుల్లాగా తీసి పారేస్తున్నారు .ఎలా మీతో ?

అవునూ ఇప్పుడే ఏదో విశేషం వాడావు ..

వాడాను నిజమే .మన మన్మధుడికి బాధ్యత ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి .

బాగానే ఉండచ్చు కానీ –

మళ్ళీ బేడా కానీ కబుర్లు వద్దు .ఏదో తేల్చండి –

వాడు అశరీరుడైతేనే లోకం లో కామాగ్ని చిచ్చు రగిలించి నిద్రలేకుండా చేస్తూ ఉంటాడు .వాడికి శరీరం ఇచ్చి బాధ్యతా చేతికి అప్పగిస్తే నీకూ నాకూ తెలీకుండా ఎందరెందరో సుందరాంగులను కోడళ్ళు గా తెచ్చి కొంప కొల్లేరు చేస్తాడని భయం   –అంతే

వీడికీ కట్టబెట్టటం ఇష్టం లేదని మొహమాటం లేకుండా డొంక తిరుగుడుగానైనా నిజం చెప్పారు . ఇక చాలు సంబడం .మీ మనసులోని మాటేమితో నాన్చకుండా  సెలవియ్యండి ప్రాణేశ్వరా !

నా అర్ధాంగీ! చివరగా నీ మనసులోని మాటగా చెప్పు. దానికే విలువనిస్తానని నీకు తెలుసుగా !అనగానే లక్ష్మీదేవి ముసిముసి నగవులతో తల ఒకింత కిందికి దించి ,కాలి వ్రేళ్ళను నేలపై రాస్తూ, సిగ్గులొలికిస్తూ, మొహం పైకేత్తకుండా –‘’మాయా మోహ జగన్నాటక సూత్రధారీ మురారీహరీ !నా మనసులో మాటతెలిసే మీరు చెప్పకుండా నాతో చెప్పిస్తున్నారుకదూ.ఆ మాత్రం కనిపెట్ట లేననుకున్నారు కామోసు కామారి మిత్రమా !అయినా సిగ్గు విడిచి నేనే చెప్పేస్తున్నాను మీరు గట్టిగా చెప్పమన్నారుకనుక .ఆర్ధిక శాఖ నా చేతుల్లోనే ఉంది .నేను దయతలిస్తేనే లోకం లో డబ్బూ హోదా వస్తాయి .ఈ రెండూ  లేకపోతె దుబ్బుకు కూడా కొరగాడు మానవుడు .మీనిద్రాసమయం లో బాధ్యత అంతా నాకే అప్పగించి నిశ్చింతగా నిద్రించండి .నాలుగు నెలలు కాదు కావాలంటే మరో నాలుగు నెలలు శయని౦చ౦డి   మహానుభావా ! మీకు అడ్డేమిటి ?మై హూనా .అయినా మీమనస్సులో ఒక సంకోచం ఉన్నట్లుంది .లక్ష్మి చంచల.ఒక్క చోట నిలవదు అని .ఆ భయమేమీ లేదు .నేను అప్పుడు సర్వం సహా చక్రవర్తిని ..ఎక్కడికీ కాలుపెట్టే అవసరం లేదు .ఇదంతా మీమనసులో ఉంచుకుని నన్ను బయట పెట్టారా ? ‘’అని మొహం పైకెత్తేసరికి శ్రీహరి యోగనిద్రలోకి జారి అరగంటయింది .ఉసూరుమని నిట్టూర్చి ‘’ఈ మాయలాడు అందర్నీ మోసం చేస్తాడనుకున్నాకానీ నన్నూ మాయ చేశాడు మాయావినోది .ఎటూ తేల్చకుండా  ఎవరికీ బాధ్యత అప్పగించకుండా హాయిగా శేషతల్పం పై క్షీరసాగరం లో యోగ నిద్రలోకి వెళ్లి పోయారు పరమాత్మ .అయినా నా వెఱ్రి కాని  .సర్వలోక రక్షకుడికి ,సర్వలోకాలు తనలోనే ఉంచుకున్నవాడికీ  నిద్ర ఏమిటి మన అమాయకత్వం కాని .ఆయనకు జాగ్రత్ స్వప్న సుషుప్తి నిద్రావస్తలు౦ టాయా ?సర్వాతీతుడు స్వామి .నాకూ కాస్త మోహం వ్యామోహం కలిగించి చూడండి ఎలా చిరునవ్వు నవ్వుతూ ఏమీతెలియని అమాయకుడిగా నిదిరిస్తున్నారో నాస్వామి .ఆయనకు ఇక నిద్రాభంగం కలగనీయను .

శయన ఏకాదశి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

విష్ణు సహస్రనామ పారాయణ

విష్ణు సహస్రనామ పారాయణ

 

23-7-18 సోమవారం సాయంత్రం తొలి ఏకాదశి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మహిళామణులచే శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ దృశ్యాలు  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

“23-7-18 సోమవారం సాయంత్రం తొలి ఏకాదశి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మహిళామణులచే శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ దృశ్యాలు

“23-7-18 సోమవారం సాయంత్రం తొలి ఏకాదశి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మహిళామణులచే శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ దృశ్యాలు

https://photos.google.com/share/AF1QipNi-6y5F6FQ5YRm4lP1XUTsG5829nudYd0IaTufjwpe20GFs4GFkgKTyo2tX5iiyQ?key=WndnZUdnN2NvZ3dia0xUMDJNVHU1eUg2RUw0M1Jn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తొలి ఏకాదశి (శయన ఏకాదశి )

తొలి ఏకాదశి (శయన ఏకాదశి )

ప్రతినెలా రెండు సార్లు ఏకాదశి వస్తుంది .కాని కొన్ని ఏకాదశి తిదులకే ప్రత్యేక గుర్తింపు ఉండి.  .అందులో మొదటిది ఆషాఢ శుద్ధ ఏకాదశి .దీనినే ప్రధమ ,లేక తొలి ఏకాదశి అంటారు .శ్రీ మహా విష్ణువు ఈ రోజు క్షీర సాగరం పై శేష తల్పం పైన యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు .అందుకని దీనికి’’ శయన ఏకాదశి’’ అనే పేరొచ్చింది .యోగ నిద్రకు ఎడమ వైపుకు తిరిగి పడుకుంటాడు .స్వామికి ఏ రకమైన భంగం రాకుండా భక్తులు మంచి నీరు మాత్రమే తాగి  కఠిన ఉపవాసం చేసి,విష్ణునామ సంకీర్తనలతో పవిత్రం గా కాలక్షేపం చేస్తారు .అందుకే దీన్ని జలఏకాదశి అనీ అంటారు .దీనికే మహా ఏకాదశి ,పద్మ ఏకాదశి ,,దేవ శయన ఏకాదశి ,దేవపోధి ఏకాదశీ అనే పేర్లుకూడా ఉన్నాయి .తమిళదేశం లో ఆషాఢ ఏకాదశిని ‘’ఆడి’’.అంటారు .మనకు  ఆషాఢ మాసం పెళ్లిళ్లకు, నవదంపతుల కాపురాలకు నిషిద్ధం. అయితే తమిళులకు ఈ మాసం అత్యంత పవిత్రమైనది .ఆడి ఉత్సవాలు రంగ రంగ వైభవంగా వాళ్ళు నిర్వహిస్తారు .ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణదిశకు వాలినట్లు కనిపిస్తాడు . రెండోది పరివర్తన ఏకాదశి .మూడవది ఉత్దాన ఏకాదశి .ఇవికాక ఇంకా భీష్మ ఏకాదశి ,వైకుంఠ ఏకాదశి ముఖ్యమైనవి .

భవిష్య పురాణం లో శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు శయన ఏకాదశి విశేషాలను చెప్పినట్లున్నది అంతకు ముందు దీనినే బ్రహ్మ ,మాంధాత చక్రవర్తి చెప్పారు .మాంధాత చక్రవర్తి పాలనలో ఒకసారి వర్షాలు కురవక పంటలు పండక ,తీవ్ర అనావృస్టి తోభయంకరమైన కరువు వచ్చింది .ఈ ప్రకృతి వైపరీత్యానికి కారణం ఏమిటో దీనికి పరిష్కార మేమిటో ,దేవతలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్ధంకాక దిగులు చెందాడు .అప్పుడు ఆంగీరస మహర్షి వచ్చి విష్ణు ప్రీతికరమైన  ‘’దేవ శయన ఏకాదశి వ్రతం ‘’శ్రద్ధగా చేయమని చెప్పాడు .మాంధాత అలానే ఈ వ్రతం చేశాడు .విపరీతంగా వర్షాలు కురిసి పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండి కరువు దూరమైంది .

ఏకాదశి నాడు ప్రత్యేకంగా  శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన పేలాలను(సేసలు ) దంచి పిండి చేసి  దానికి  బెల్లం కలిపి నైవేద్యం పెడతారు .మహారుచిగా ఉంటుంది .పూర్వం మంగలాలలో ఇసుక వేసి వేడి చేసిదానిపై వడ్లు పోసి ,కర్రతో కలియబెడుతూ వరి పేలాలు తయారు చేసేవారు  .అవి భలే రుచిగా ఉండేవి .మా అమ్మ వృద్ధాప్యం దాకా ఇలానే చేసి పేలపిండి నైవేద్యం పెట్టేది .ఇప్పుడు అంత సీను పెట్టలేక మొక్కజొన్న గింజల ను వేయించి చేసిన ‘’పాప్ కార్న్ ‘’నే ‘’పాపహరం ‘’అని భావించి  నైవేద్యం పెడుతున్నారు .ఓపికున్నవాళ్ళు వీటినే పిండి చేసి బెల్లంకలిపి నైవేద్యం పెడుతున్నారు .

మా ఉయ్యూరులో రావి చెట్టు ఎదురుగా రాచపూడి నాగరాజు అనే వైశ్య ప్రముఖుని పచారీ దుకాణం ఉంది .అతని అమ్మకాలు రికార్డ్ స్థాయిలో ఉంటాయి .ప్రతి ఏడాదీ అయ్యప్పదీక్ష తో మాల వేసి శబరిమలై వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేస్తాడు .అయ్యప్ప దీక్ష చేసే భక్తులకు కావలసిన సకల సామగ్రి అతని కొట్లో దొరుకుతుంది .అయితే అతడు ప్రతి తొలి ఏకాదశికి వారం పది రోజులముందు రావి  చెట్టుకింద  పేలాలు వేయించే పొయ్యి ఏర్పాటు చేసి తానొక్కడే ప్రతి రోజు ఉదయం 9 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు మొక్క జొన్న గింజలతో పేలాలు వేయించి పాకెట్స్ లో నింపి పాకెట్ పది రూపాయలకు అమ్ముతాడు .అమ్మకానికి ఎవరినో ఒకరిని సహాయంగా పెట్టుకుంటాడు అంతే .విసుగు విరామం లేకుండా ఇంతపని అతనొక్కడే చేయాల్సిన అవసరమో అతనికి లేనే లేదు   .ఎవరితోనైనా చేయించవచ్చు .అది పుణ్యమో పురుషార్ధమో గా భావించి ఇంతగా కష్టపడటం మాకు ఆశ్చర్యమేస్తుంది .

తొలి ఏకాదశినాడు విష్ణు సహస్రనామ పారాయణతో గృహాలకు,  దేవాలయాలకు పవిత్ర శోభ  తెస్తారు . .వైష్ణవాలయాలలో స్వామికి పవళింపు సేవ నిర్వహిస్తారు .గృహాలలో తులసికోట దగ్గర పద్మం ముగ్గు వేసి ,దీపాలు వెలిగించి పళ్ళు నైవేద్యం పెడతారు .పూర్వం  రుక్మా౦గదుడు, అంబరీషుడు ఈ వ్రతాన్ని పాటించి ప్రజలందరి చేత ఆచరి౦పజేశారు .

పండరీ పుర మహా యాత్ర

మహారాష్ట్ర దక్షిణ ప్రాంతం షోలాపూర్ జిల్లా లోని చంద్ర భాగా నదీ తీరం లో వెలసిన భక్తవరదుడు శ్రీ పాండురంగ విఠలుడు .విఠ్ అంటే ఇటుక రాయి .భక్త పుండరీకుని చూడటానికి పాండురంగస్వామి స్వయంగా  వస్తే, తాను కుటీరం లో తలిదండ్రుల పాదసేవలో ఉన్నానని,  బయట ఇటుకపై కూర్చోమని చెప్పాడు .అక్కడ వెలసిన స్వామినే పాండురంగ విఠలుడు అంటారు .ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు లక్షలాది భక్తజనం పండరీ పురానికి మహారాష్ట్ర లోని వివిధ ప్రాంతాలనుండి ఇక్కడికి పెద్ద ఊరేగింపుగా ,యాత్రగా వస్తారు .కొందరు పల్లకీలతో పాండురంగని భక్తుల చిత్రపటాలను పెట్టి ఊరేగింపుగా వస్తారు . అలందీనుండి సంత్ జ్ఞానేశ్వర్ ,నార్సీ నుండి స౦త్ నాం దేవ్ ,దేహూ  నుండి భక్త తుకారాం ,పైఠాన్ నుంచి సంత్ ఏకనాథ్,త్ర్యయంబకేశ్వర్ నుంచి సంత్ నివృత్తినాథ్,,ముక్తానగర్ నుంచి సంత్ ముక్తాబాయ్ ,సస్వద్ నుంచి సోపాన్ ,షేగాం నుంచి సంత్ గజానన్ మహారాజ్ ,చిత్రపటాలను అందంగా అలంకరించిన పల్లకీలలో ఉంచి అత్యంత భక్తి శ్రద్దలతో  ఊరేగింపుగా, సంత్ తుకారాం ,సంత్ జ్ఞానేశ్వర్ లు రచించిన అభంగాలు సుస్వరంగా భక్తి  పారవశ్య౦గా గానం చేస్తూ పండరీ పురం చేరుతారు .ఈ పవిత్ర యాత్రికులను ‘’వర్కారీలు ‘’అంటారు .ఈ యాత్రను ‘’పంధార్ పూర్ ఆషాఢీ ఏకాదశి వారి యాత్ర ‘’అంటారు .,వీరంతా చంద్రభాగా నదిలో పవిత్ర స్నానాలు చేసి , శ్రీ పాండురంగ విభుని దర్శించి  తరిస్తారు .ఆలయం లో అనుక్షణం పాండురంగ  భజనలు జరుగుతూనే ఉంటాయి .

పరివర్తన ఏకాదశి

యోగ నిద్రలోఎడమవైపుకు తిరిగి పడుకుని ఉన్న  శ్రీ మహావిష్ణువు బాద్ర పద శుద్ధ ఏకాదశి నాడు కుడి వైపుకు తిరిగి పడుకుంటాడు .అందుకనే దీనిని ‘’’పరి వర్తన ఏకాదశి ‘’లేక పార్శ్వ్య ఏకాదశి , వామన ఏకాదశి అంటారు .బలి చక్రవర్తిని ఈ రోజే విష్ణుమూర్తి వామనావతారం లో మూడడుగులు దానం అడిగి పాతాళానికి తొక్కేసిన రోజు ఇది .బలి దాన గుణానికి మెచ్చినవిష్ణువు ఆయన కోరికపై విగ్రహరూపం లో అక్కడే ఉండి పోయి ,పరివర్తన ఏకాదశినాడు ఉపవాసమున్నవారి సకల పాపాలు తొలగిస్తానని హామీ ఇచ్చాడు .

ఉత్థాన ఏకాదశి

కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాని ఏకాదశి అంటారు .ఈ రోజు విష్ణుమూర్తి నాలుగు నెలల యోగ నిద్ర చాలించి మేలుకొనే రోజు .అందుకే దీన్ని ‘’ప్రబోధిని ఏకాదశి ‘’లేక దేవూతి ఏకాదశి అంటారు .ఈ రోజు తులసీ దేవిని నల్లని సాలగ్రామ విష్ణు మూర్తికిచ్చి వివాహం చేశారని పురాణకథనం .లక్ష్మీ పూజ ,విష్ణు పూజ విధిగా నిర్వహిస్తారు .పండరిపురం లో ఈ ఏకాదశినుండి కార్తీక పౌర్ణమి వరకు అయిదు రోజుల ఉత్సవం ప్రభుత్వ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రిలేక మంత్రి చేత ప్రభుత్వ ఉత్సవంగా నిర్వహిస్తారు  .చెరుకు పంట చేతికి వచ్చేసమయం కనుక ఈ ఏకాదశినాడు పొలం లో రైతు పూజ చేసి,  చేయించిన పురోహితుడికి అయిదు చెరకుగడలు దక్షిణగా సమర్పించి  వడ్రంగి, చాకలి ,మంచినీళ్ళు మోసే వానికి  ఐదేసి గడలు కృతజ్ఞతగా ఇచ్చి,  అయిదు గడలు ఇంటికి తీసుకు వెడతాడు రైతు .   ఆ రోజే చెరుకు నరకటం ప్రారంభిస్తారు.

చాతుర్మాస్య దీక్ష

పీఠాధిపతులు, యతులు ,సన్యాసులు  ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య దీక్ష చేస్తారు .అంటే ఏదో ఒక చోటనే ఉండిపోతారు ఈ నాలుగు నెలలు .ఎక్కడికీ ప్రయాణం చేయరు .ఈ కాలం లో వేదప్రవచనాలు,దార్మిక ప్రసంగాలూ చేస్తూ ప్రజలలో భక్తిజ్ఞాన వైరాగ్యాలను బోధిస్తారు .తాము తీవ్రమైన జప తపాలలో గడుపుతారు .మాసం అంటే జ్ఞానం అనే అర్ధం కూడా ఉంది కనుక జ్ఞాన ప్రబోధమే లక్ష్యంగా ఉంటారు .నియమ నిష్టలతో శ్రద్ధగా నిర్వహించే కర్మాను స్టానమే  యజ్ఞం లేక వ్రతం అంటారు .దీన్ని గురించి ఒక విషయం ప్రచారం లో ఉంది .ఒకప్పుడు బ్రహ్మ దేవుడు నిరంతర సృస్టికార్యం వలన అలసిపోయి నిద్రించాడు  ,అప్పుడు దేవతలు ఒక యజ్ఞం చేసి అందులోంచి ఉద్భవించిన హవిస్సు ను బ్రహ్మకు ఇచ్చారు .అది ఔషధంగా పని చేసి ఆయన అలసట పోగొట్టింది .

బ్రహ్మ సృష్టి చేస్తూ ఏకం,ద్వే,త్రీణీ,చత్వారీ అంటూ నాలుగు సార్లు ఆజ్యాన్ని సమర్పించి చివరగా ఒక సమిధకూడా వేశాడు .దీని ఫలితంగా దేవతలు ,రాక్షసులు ,పితరులు ,మానవులు అనే వారిని సృష్టించి వారికి రోమాలు, మాంసము,ఎముకలు ఏర్పాటు చేశాడు .ఈ నాలుగు రకాల జీవులలో జ్ఞానాన్ని ఉద్దీపింప జేయటమే చాతుర్మాస్య దీక్ష లక్ష్యం అని తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతోంది .ఉపనిషత్తు లో చతుర్ముఖ బ్రహ్మ లక్ష్మి తో కలసి సృష్టి చేశాడని ,చతుః మా అంటే నాలుగు లక్ష్ములు అనీ కనుక నాలుగు లక్ష్ములను ముఖాలుగా చేసుకొని నాలుగు వేదాలు చెప్పాడని ,వేద విద్యనే శ్రీ విద్య అంటారని అందుకే ఈనాలుగు నెలలూ  వేదాలను పూజిస్తూ అధ్యయన, అధ్యాపనం చేయాలని చెప్పింది .ఈ దీక్షలో ఆహార నియమాలు విధిగా పాటించాలి .‘’ఆహార శుద్దే సత్వం శుద్ధిః, సత్వ శుద్ధే ధృవాన్మతిః’’ కనుక సాత్వికాహారం తింటే మనస్సు సాత్వికమై శక్తినీ ఆరోగ్యాన్ని ఆయుస్సు నూ ,సుఖ సంతోషాలను ఇస్తుంది .’’ధర్మార్ధ కామ మోక్షాణాం ఆరోగ్య మూలముత్తమం ‘’అని చరక సంహిత చెప్పింది .కనుక ఈ వ్రతం వ్యాధి నివారకమేకాక ఇహం లో సుఖ౦  ,పరం లో మోక్షం ప్రసాదిస్తుందని చెబుతోంది .ఈ వ్రత దీక్షలో ఉన్నవారు శ్రావణమాసం లో కూరగాయలు ,భాద్రపదం లో పెరుగు ,ఆశ్వయుజం లో పాలు ,పాలపదార్ధాలు ,కార్తీకంలో రెండు బద్దలున్న పప్పుతో చేసిన పదార్ధాలు  విసర్జించాలి .ఆరోగ్య రీత్యా కూడా దీనికి బలమైన శాస్త్రీయ కారణమూ ఉంది .ఋతువులు మారే సమయం కనుక వ్యాధులు ప్రబలుతాయి .ఋతువుల సంధికాలాలను  ‘’యమ ద్రంస్ట్రలు’’అంటారు .శాస్త్ర రీత్యా ఆషాఢ మాసంలో కామోద్దీపన ఎక్కువగా ఉంటుంది .కనుక నూతన దంపతులపై దీని ప్రభావం పడకుండా భార్యాభర్తలను ఈ నెలలో వేరువేరుగా ఉంచుతారు .

ఈ నాలుగు నెలలలో వినాయక చవితి వంటి ఎన్నో పండుగలు పబ్బాలు నోములు వ్రతాలు ,మహళాయపక్షం ,శరన్నవరాత్రులు ,కార్తీక మాస శివాభిషేకాలు తో భక్తి  సందడే సందడి .

రేపు 23-7-18 సోమవారం తొలి ఏకాదశి (శయన ఏకాదశి )శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-18 –ఉయ్యూరు

 


Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సాలగ్రామ స్వయంభూ క్షేత్రం  శ్రీ లక్ష్మీ అనంత  పద్మనాభ స్వామి దేవాలయం-వికారాబాద్  

సాలగ్రామ స్వయంభూ క్షేత్రం  శ్రీ లక్ష్మీ అనంత  పద్మనాభ స్వామి దేవాలయం-వికారాబాద్

               మార్కండేయ క్షేత్రం

తెలంగాణా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అనంత గిరి గుట్టపై అందమైన ప్రకృతి

 లో శ్రీలక్ష్మీ  అనంత పద్మనాభస్వామి కొలువై ఉన్నాడు .స్కంద పురాణం,  విష్ణు పురాణాల  ప్రకారం ఈ ఆలయాన్ని మార్కండేయ మహర్షి ద్వాపర యుగం లో నిర్మించాడు .అందుకే’’ మార్కండేయ క్షేత్రం’’ అనీ అంటారు.ఇక్కడి ప్రశాంత వాతావరణానికి పులకించిన మార్కండేయముని  తపోసాధనకు వచ్చాడు.అనంతగిరి పై ఉన్న ఒక గుహ ద్వారా యోగ సాధన వలన నిత్యం కాశీకి వెళ్లి గంగాస్నానం చేసి వచ్చేవాడు . ఒకసారి ద్వాదశి ఘడియలలో అనివార్య కారణాల వలన వెళ్ళలేక పోయాడు .కలలో శ్రీ మహావిష్ణువు  దర్శనమిచ్చి ,గంగానదిని ఇక్కడే ప్రవహించేట్లు చేసి ఆయన స్నానాదులకు అవకాశం కలిపించాడు . ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గంగానది ఈ పుష్కరిణి లోకి ప్రవహించి పవిత్ర పరుస్తుందని విశ్వాసం .శేషుని శీర్షభాగం తిరుపతి ,మధ్యభాగం అహోబిలం అయితే తోకభాగం అనంతగిరి అంటారు  .

ముచుకుంద వరదుడు

రాజర్షి ముచుకు౦ద మహర్షి రఘువంశంలో పుట్టిన మాంధాత కుమారుడు  .క్రూర రాక్షసులతో  దేవతల పక్షాన వెయ్యేళ్ళు పోరాడాడు .దీనికి సంతసించిన దేవేంద్రుడు ఆయనకు ఏమి వరం కావాలో కోరుకోమ౦టే  తాను వెయ్యేళ్ళు యుద్ధాలు చేసి అలసిపోయాను కనుక వెయ్యేళ్ళు నిద్రపోవటానికి అవకాశం, అనువైన చోటు కలిపించమని ,తనకు నిద్రాభంగం చేసినవారు తనకంటి మంటకు భస్మమై పోయేట్లుగా  వరం  కోరాడు  .తధాస్తు అని  అనంతగిరి గుహలో హాయిగా నిద్రపొమ్మని సలహా ఇచ్చాడు ఇంద్రుడు .    .దాని ప్రకారమే ముచుకు౦దుడు   ,ఈ అనంతగిరి గుహలోకి వచ్చి అలసట తో  నిద్ర పోయాడు . .కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకానగరం పై దండెత్తి స్వాధీనం చేసుకోగా ,వాడిని మామూలు పద్ధతిలో చంపటం కుదరదని తెలిసి  ,మాయోపాయంగానే చంపాలని నిర్ణయించి వాడికి భయపడినట్లు నటించి శ్రీ కృష్ణ బలరాములు ఉపాయంగా తప్పించుకొని ఈ అనంతగిరి కి వచ్చి ఈ  గుహలో దాగారు .ఇక్కడ ధ్యానం లో ఉన్న మార్కండేయమునితో గుహలో నిద్రిస్తున్న ముచుకు౦దుడే శ్రీ కృష్ణుడు అని వాడికి చెప్పి  లోపలి కి పంపమని చెప్పారు .వీరిద్దరినీ వెంబడించి వచ్చిన కాలయవనుడు ఈ గుహలో కి ప్రవేశించి మార్కండేయ ముని సూచనతో  ముచుకు౦ద మహర్షి నిద్రించే గుహలోకి ఆర్భాటంగా ప్రవేశించి ఆయనకు నిద్రాభంగం కలిగించగా ఆయన కంటిమంటకు కాలి బూడిదయ్యాడు  . .ముచుకుంద మహర్షి లోక కంటకుడైన కాలయవనుని నాశనం  చేసి నందుకు శ్రీకృష్ణుడు మెచ్చి ఆయన ఉగ్రత్వాన్ని ఉపసంహరించటానికి  ఆయనకు అనంత పద్మనాభ స్వామిగా దర్శనమిచ్చాడు .అంతేకాదు ముచుకు౦దమునిని శాశ్వతంగా నదీ రూపం పొంది లోకానికి ఉపకారం చేయమని వరమిచ్చాడు .అందుకే ‘’ముచుకు౦ద వరద గోవిందో హరి’’అని భజనల్లో అనటం  మనకు తెలుసు .

మరో కధనం ప్రకారం ముచుకు౦దుదు అనంత పద్మనాభస్వామి పాదాలను తన కమండల జలం తో కడిగాడని ,ఆ జలమే ఈ అనంత గిరులలో  ‘’ముచుకుందనదీ’’ రూపాన్ని పొంది ,కృష్ణానదికి ఉపనది యై  ప్రవహించిందని అంటారు .ఆ ముచుకుంద నదే ఇప్పుడు ‘’మూసీ నది ‘’గా పిలువబడుతోంది .హైదరాబాద్ లో మూసీనది కంపు మూడు మైళ్ళ నుంచే వికారం కలిగిస్తుంది .అంతటి పవిత్రనది కల్మషమై  నేడు దుర్గంధ భూయిస్టంగా  మద్రాస్ లోని ‘’ కూం రివర్ ‘’కంపుకు రెట్టింపు కంపుతో వొడలు జలదరించేట్లు చేస్తోంది .ఈ కంపు కత వదిలేసి ముందుకు పోదాం .

స్వయంభూ శిలా విగ్రహమూర్తి

ముచుకు౦దునికి దర్శనమిచ్చిన నవాడు తనపై ఉపేక్ష ఎందుకు చేశాడో అని మార్కండేయ ముని వ్యధ చెందుతుండగా , అనుగ్రహం తో ఈ అనంతగిరిలోనే అనంత పద్మనాభస్వామి మార్కండేయ మహర్షికి దర్శనం అనుగ్రహించి ఆయనను ,తన చక్రం గా మార్చుకున్నాడు .తాను స్వయంభూ  సాలగ్రామ శిలారూపం లో ఇక్కడే వెలసి భక్తుల మనోభీస్టాలను నెరవేరుస్తూ ఉంటానని మునికి అభయమిచ్చాడు . అమ్మవారు లక్ష్మీదేవి .అందుకే స్వామి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి గా ప్రసిద్ధుడు .

నిజాం కట్టిన దేవాలయం

నాలుగు వందల ఏళ్ళక్రితం నిజాం నవాబు ఇక్కడి ప్రశాంతతకు ముచ్చటపడి విశ్రాంతి తీసుకున్నాడు .స్వామి ఆయనకు కలలో కన్పించి ఇక్కడ తనకు దేవాలయం నిర్మించమని కోరగా  హైదరాబాద్ నవాబు ఆలయ నిర్మాణం చేశాడు అనంత పద్మనాభ స్వామికి .

తెలంగాణా ఊటీ అనంతగిరి

అనంతగిరిని ‘’తెలంగాణా ఊటీ ‘’అని పిలుస్తారు .అంతటి ఆహ్లాద మైన చల్లటి వాతావరణం ఇక్కడ ఉంటుంది .హైదరాబాద్ కు 75 ,వికారాబాద్ కు 5 కిలోమీటర్ల దూరం లో అనంతగిరి ఉంది .ఇక్కడి పుష్కరిణీ స్నానం అనంత ఫలదాయకం .దగ్గరలో శివాలయం ఉన్నది .పుష్కరిణి కి వెళ్ళేదారిలో మార్కండేయమహర్షి తపస్సు చేసిన తపోవనం ,దేవాలయం ఉన్నాయి .అనంతపద్మనాభాలయం గర్భగుడిలో ఎడమవైపు మార్కండేయముని కాశీకి వెళ్ళిన బిలమార్గం ఉన్నది .ఆలయం బయట అతి పెద్ద శ్రీ ఆంజనేయ విగ్రహం ,గరుడ విగ్రహాలు సుదూరం నుంచి భక్తులను ఆకర్షిస్తాయి . సాలగ్రామ స్వయంభూ శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి దర్శనం సకల విధ శ్రేయోదాయకం .

రేపు 23-7-18 సోమవారం తొలి ఏకాదశి (శయన ఏకాదశి )శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-18 –ఉయ్యూరు

 

— 

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

వ్యాసజయ0తి – సరసభారతి –

వ్యాసజయ0తి

27-7-18 శుక్రవారం ఆషాఢ పౌర్ణమి వ్యాసపౌర్ణమి  గురుపూర్ణిమ వ్యాసజయ0తి  సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉదయం 8 గం .లకు శ్రీ వ్యాసజయ0తి ని వ్యాస అష్టోత్తర పూజ విష్ణు సహస్రనామ పూజ  భగవద్గీత పారాయణ గా సరసభారతి నిర్వహిస్తోంది .భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయప్రార్ధన  .ఆరోజు సంపూర్ణ చంద్ర  గ్రహణం కనుక ఆలయం మధ్యాహ్నం 12 గంటలకు మూసి వేయబడు తుంది . మర్నాడు శనివారం ఉదయమే పునర్దర్శనం -దుర్గాప్రసాద్ 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

   జుమ్లా ఫిదా

జుమ్లా ఫిదా

‘’కన్నుకొట్టరోయ్  కౌగిలించరోయ్ ‘’అనే సినీ పాట వినే ఉంటారు అందరూ .నిన్న లోక్ సభలో ‘’నీట్ షేవెన్’’ రాహుల్ ,మోడీ జుమ్లాకు ఫిదా అయి  మాట్లాడేమాటలు  అమాంతం ఆపేసి  కాసేపు మోడీ వెచ్చని కౌగిలి ఆనందాన్ని గడ్డం గుచ్చుకున్నా  అనుభవించి ,పెద్దాయనను ‘’పప్పు ‘’చేశాను చూడండి అని కన్నుగొట్టి రెచ్చగొట్టి,సాటి ఎంపీలతో , బయటి స్టార్లతోకూడా కన్ను కొట్టించుకొని’’ లవర్ బాయ్ ‘’అనిపించి తాత నెహ్రూను ఈ విషయం లో బీటౌట్ చేసి  ఎక్కువమార్కులు, లైకులు సంపాదించాడు .  స్టాప్ స్టాపులుగా  గా ఆర్ధికమంత్రి బడ్జెట్  పేపర్ చూసి పన్నుల  దుడ్డుకర్రతో బాదినట్లు కాకుండా  గంటసేపు నాన్ స్టాప్ గా ఆంధ్రాకు జరిగిన ,జరుగుతున్న అన్యాయం ,వివక్ష లను మోడీదీ, ఆయన ప్రభుత్వానిదీ ,ఆయన పార్టీ దీ’’ అయిన జుమ్లా’’ను ఎండకట్టి ,మంచినీళ్ళు కూడా తాగకుండా అధికార పక్షాన్ని నీళ్ళు తాగించాడు పదునైన వాడి యైన సూటి అయిన ఆంగ్ల పదజాలంతో గుండెల్లో గునపాలే గుచ్చాడుగల్లా జయదేవ్ ..మనకు మళ్ళీ ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ దొరికాడనే సంతోషం ,సంతృప్తి కలిగించి తల్లి అరుణ కు, తెలుగుతల్లికి  తెలుగు దేశానికి ఋణం తీర్చుకున్నాడు .లోక్ సభలో మాట్లాడుతుంటే స్వపక్ష విపక్షాలు సైతం నివ్వెర పోయేట్లు చేసిన పార్లమెంట్ సభ్యుడు స్వర్గీయ కింజేరపు ఎర్రన్నాయుడి కుమారుడు ప్రస్తుత లోక్ సభ సభ్యుడు కింజేరపు రామ్మోహన్ నాయుడు  శ్రీకాకుళం పౌరుషాన్ని ,వంశధార వేగాన్ని తన ఆవేశ హిందీ ప్రసంగం లో దట్టించి ఎదుటిపక్షం గుండెలలో రామ్ఢోళ్ళు మోగించి ,ఆంధ్రాకు గత నాలుగేళ్ళుగా జరిగిన అన్యాయాన్ని ఏకరువుపెట్టి అధికార పక్షాన్ని నిరుత్తరులను చేసి సెభాష్ అనిపించాడు .

పాపం హో౦ మంత్రి రాజనాధుడు ప్రశ్నలకు సమాధానాలిస్తే అమిత్ షా ,మోడీలు ఎక్కడ చీవాట్లు పెట్టి టికెట్ రాకుండా చేస్తారో నని అతి జాగ్రత్త పడి,ఆకుకు అందకుండా ,పోకకు పొందదకుండా కప్పదాట్లతో ,అలనాటి రామాయణ కదా సాగరం తో హుందాను కూడామరచి బాధ్యతను విస్మరించి మోడీ కనుసన్నలలో మెలగుతూ , మనస్సంతృప్తి కలిగిస్తూ ఆంధ్రా ఏమైనా సరే మనల్ని చూసి నవ్వుకున్నా ఫర్లేదు అనుకుని ముక్కస్య ముక్కః గా మాట్లాడి బరువు దించుకున్నాడు .నిన్నటి రోజు ప్రసంగాలలో సింహభాగం లాక్కున్న ప్రధాని ,హావభావాలతో ,వెకిలి నవ్వులతో ,ఇచ్చిన మాట జోలికి పోకుండా చేస్తామన్న సాయం సంగతి చెప్పకుండా ,ఆంధ్రాకు జరిగిన అన్యాయం గూర్చి ప్రస్తావించకుండా ,ఏవేవో కాకమ్మ  కబుర్లు చెప్పి ,ఆనాడు మట్టికుండలో మట్టీ ,నీళ్ళు తెచ్చి అమరావతి లో కుమ్మరించినట్లు  ,ఇప్పుడు మసిపూసి మారేడు కాయ చేసి హాం ఫట్ అని పించి ,బాబుది యు టర్న్ అని దెప్పి ,అసలు పాపమంతా కాంగ్రెస్ దే అని నెట్టేసి ,తన వాగ్దానాలజోలికి వెళ్ళనే వెళ్ళకుండా,  మూక బలపు చప్పట్లతో  మాట్లాడి  ,మూక ఓటుతో అవిశ్వాసాన్ని నీరుగార్చి విజేత నని పించాడు .

పాపం పవన్ జనం లోకి రాలేక  పెరిగిన గడ్డం తో ట్విట్టర్ లో తిట్ల దండకం  లంకించుకున్నాడు  తెలుగు దేశంపై . లోక్ సభ సీట్లకు హంగామాగా హడావిడి గా రాజీనామా చేయించి ,తన పార్టీ వాళ్లకు వాయిస్ లేకుండా  చేసి ,వాళ్ళను ‘’భభ్రాజమానం భజగోవి౦దాలు’’గా,  ‘’రెంటికీ చెడ్డ రేవణ్ణలు ‘’గా మార్చి తన అసహనానికి ,భావి దృష్టి లేనిదానికి గొప్ప ప్రత్యక్ష ఉదాహరణగా మిగిలి పోయిన ఫ్యాన్ గుర్తాయన  ఇవేవీ పట్టించుకోకుండా ,ఓదార్పు కౌగిలింతల్లో తేలిపోతూ వీలున్నప్పుడు నాలుగు బూతులు బాబుని తిడుతూ ,కాషాయం నీడన తలదాచుకొంటూ  శిక్ష తప్పించుకోటానికి అంట కాగుతూ ,మోడీ గ్రీన్ సిగ్నలిస్తే తానే కాబోయే సి .ఎం .అని పగటికలలు కంటూ కాలక్షేపం  చేస్తున్నాడు . మాటల్లో, చేతల్లో  హావభావాలలో ,నవ్వి౦త లలో జే.సి ..పెట్టింది పేరు .ఎందుకు ఎప్పుడు  అలుగుతాడో ఆయనకే తెలీదు .అవిశ్వాసం ముందు ఇదే నాటకం ప్రదర్శించి’’దువ్వించుకొని’’ రాజీపడి ,మళ్ళీ ఇవాళ మీసం మెలేస్తున్నాడు  .నమ్ముకుంటే నట్టేట ముంచినట్టు గా ఉంటున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు .

ఇలా’’ జుమ్లా ఫిదా ‘’ నాటకం లో ఎవరిపాత్ర  వాళ్ళు పోషించి  రక్తి కట్టించారు .దీని వల్ల జరిగేదేమిటి ?అని సామాన్యుని మాన్య ప్రశ్న .దీనికెవ్వరూ సమాధానం చెప్పలేరు .’’శుష్క ప్రసంగాలు శూన్య హస్తాలు’’గా నే మిగిలింది అని ‘’ఆంధ్రా ఆం ఆద్మీ’’ గొణుగుడు.  నాలుగేళ్ల క్రితం సీనే మళ్ళీ రిపీట్ అయింది .నాడు వద్దన్నా ,తలుపులు మూసి ,చీకట్లో మెజార్టీఉందో లేదో అన్న బ్రహ్మ పదార్ధంగా, చీల్చి చి౦చిపారేస్తే కాంగ్రెస్ , ‘’మై హూనా’’అంటూ అంగలార్చి అక్కున చేర్చి ,ఊపిరాడనీయక  మట్టీ మశాన్నమే వెదజల్లిన మోడీ తానూ’’ చేయిచ్చి’’ ఎవరొచ్చినా ఇంతేభాయ్ ‘’అన్న సత్యాన్ని తెలియ జేశాడు .మోసపోవటం మనవంతు అయిపోయినట్లు చరిత్ర సాక్ష్యం చెబుతోంది .అందరూ జుమ్లా గాళ్ళే అయి మనల్ని ఫిదా చేశారు .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-18 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

1-7-18శనివారం ఆషాఢ శుద్దనవమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో అత్యంత వైభవం గా జరిగిన”శాకంభరీ పూజ ”చిత్రాలు

1-7-18శనివారం ఆషాఢ శుద్దనవమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో అత్యంత వైభవం గా జరిగిన”శాకంభరీ పూజ ”చిత్రాలు

https://photos.google.com/share/AF1QipPaUmrifwbsoD3DUX69DL-AbXUyykdC6yDY9MLDuEUUwdEhR0d38cb9d_pKvtE_Kg?key=emh1MlU3RUNzSlBBejZMYjVCMk0yNm1pWXBqMTdn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శాకంభరి పూజ ఉయ్యూరు శ్రీ సువర్చలా0జనేయ స్వామి దేవాలయం లో ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమాలు

           శాకంభరి పూజ

శాకంభరి దేవి ఎవరు ?ఆపేరుకు అర్ధమేమిటి?

శాకంభరీ దేవి పార్వతీ దేవి అవతారం .మహాకాలుని అర్ధాంగి .పచ్చదనానికి దివ్య మాత. శాకాహారమైన ప్రతి వస్తువు ఆమె దివ్య  ప్రసాదమే  .కరువు కాటకాలలో ఆది పరాశక్తి శాకంభరీ దేవిగా అవతారం దాల్చి భూమిపైకి వచ్చిఅన్నార్తులకు  శాకాహారాన్ని సమృద్ధిగా లభించేట్లు చేస్తుంది .శాకాలను భరించేది ,ధరించేది కనుక శాకంభరి అంటారు .భ్రు అనే సంస్కృత ధాతువు నుండి భరి వచ్చింది .భ్రు అంటే మోయటం,.ధరించటం ,పోషించటం అనే అర్ధాలున్నాయి .

   శాకంభరీ దేవి అవతారం ఎందుకు అవసరమైంది ?

పూర్వం దుర్గమాసురుడు అనే క్రూర రాక్షసుడు ఉండేవాడు .వీడు  హిరణ్యాక్ష వంశం వాడు .తాను వేదాలను అధీనం చేసుకొని ,దేవతలతోపాటు యజ్న హవిర్భాగం పొందాలని తలచాడు .గాలిమాత్రమే పీలుస్తూ బ్రహ్మకోసం వెయ్యేళ్ళు తీవ్ర తపస్సు చేశాడు . ఆ తపో తేజానికి లోకాలన్నీ వణికి పోయాయి .బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు .తనకు నాలుగు వేదాలు ఇవ్వమని కోరగా ఇచ్చి బ్రహ్మ అదృశ్యమయ్యాడు .

  ఆ రోజునుండి మహర్షులు వేదాలను మర్చి పోయారు .నిత్య స్నానం ,సంధ్యావందనం ,జపం, తపం అన్నీ గుంటపెట్టి గంట వాయించేశారు .కొంతకాలానికి దీన్ని భరించలేని  భూ దేవత తీవ్ర వేదనతో ఆక్రోశించింది .ఆమె ఆక్రోశానికి మునులకు జ్ఞానోదయం కలిగి తామెందుకు వైదిక కర్మలను మానేశాం  వేదాలేమైనాయి ఎక్కడున్నాయి అనే స్పృహ కలిగింది .భూమిపై అనేక కల్లోల పరిస్ధితులేర్పడ్డాయి  .మహర్షులు యజ్ఞాలు చేయకపోయేసరికి దేవతలకు హవిర్భాగాలు దొరకక చిక్కి శల్యమై పోయారు .అప్పుడే దుర్గమాసురుడు   దేవలోకం పై దాడి చేశాడు .వాడిని ఎదిరించలేకఇంద్రునితో సహా  దేవతలు పలాయనమంత్రం చిత్తగించారు .

దేవతలు సుమేరు పర్వతం చేరి అక్కడి గుహలలో కనుమల్లో ఆది పరాశక్తికోసం తపస్సు చేశారు.యజ్న యాగాదులు చేస్తే అగ్నిహోత్రం లో నెయ్యి మొదలైన పవిత్ర హోమద్రవ్యాలు వేస్తేనే  అవి సూర్యునికి చేరి తర్వాత వర్షాలకు కారణమౌతాయి .ఇవి ఆగిపోవటం తో వర్షాభావమేర్పడి  పంటలు పండక నదులు, చెరువులు, బావులు ఎండిపోయి  కరువు తాండవం చేసింది .తాగటానికి చుక్కనీరు కూడా లేని పరిస్ధితి ఏర్పడింది .ఇలా వర్షాలు లేకుండా వందేళ్ళు గడిచాయి .వేలాదిజనం పశువులూ ఆకలికి అలమటించి చనిపోయాయి .ఎక్కడ చూసినా శవాలకుప్పలే.దహనక్రియలు చేయటం కూడా కష్టమైపోయింది .భూమిపై ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేక మునీశ్వరులు కూడా ఏదో పరిష్కారం సాధించాలని హిమాలయాలకు వెళ్లి  ఆది పరాశక్తిఅనుగ్రహ౦  కోసం  నిద్రాహారాలు మానేసి తీవ్ర తపస్సు చేశారు .

              పార్వతీ దేవి శతాక్షి రూపం పొందటం

  మునులందరూ మహేశ్వరీ దేవిని మంత్రాలతో స్తోత్రాలతో ఏకకంఠంగాస్తుతించారు .మహేశ్వరి వీరి తపస్సుకుమెచ్చి పార్వతి రూపం లో ప్రత్యక్షమవ్వగా ఆమెకు జరిగిందంతా నివేదించి చూడమన్నారు  .కరువు కాటకాలను  చూసి చలించిపోయి  తన శరీరం నిండా నూరు కళ్ళు ఏర్పాటు చేసుకొని ’’శతాక్షి ‘’గా  అందరికి కనపడింది .ఆమె శరీరం దట్టమైన నీలం రంగుతో ,కనులు నీలి కలువలులాగా .కఠినమైన  విశాలమైన ఒకదానినొకటి తాకేట్లున్న  చనుగవ తో,రెండు చేతులతో కనిపించింది .అందానికే అందంగా ,సహస్ర సూర్య కాంతితో ,దయా వారాసిగా దర్శనమిచ్చింది .విశ్వంభరిఅయిన ఆమె జనుల కష్టాలను చూడలేక  కనులనుండి  ధారాపాతంగా కన్నీటిని కార్చి తన మాతృహృదయాన్ని చూపింది .దీనికి ప్రజలు, ఓషధులు  మిక్కిలి సంతసి౦చారు .ఆకన్నీరే నదులుగా ప్రవహించాయి .హిమాలయాలనుండి  మునులు సుమేరు గుహల్లోంచి దేవతలు బయటికి వచ్చి అందరూకలిసి ఆమెను అనేక విదాల స్తోత్రాలతో కీర్తించారు  .

                    శతాక్షి శాకంభరీ దేవిగా మారటం

శతాక్షీ దేవి తన శరీరాన్ని మార్చుకొని ఎనిమిది హస్తాలలోవివిధ రకాల ఆహార ధాన్యాలు ,పప్పుధాన్యాలు ,కూరగాయలు ,పళ్ళు ,వివిధ ఔషధాలతో నూ ,అందమైన ఆకుపచ్చని చీర కట్టుకొని ‘’శాకంభరీ దేవి ‘’గా దర్శనమిచ్చింది.దేవతలు మునులకు తన చేతిలోని రుచికరమైన ఆహారపదార్ధాలను తినటానికి అందజేసింది . ఆమెను బహు విధ స్తోత్రాలతో వారు మెప్పించారు .తర్వాత శాకంభారీదేవి మనుషులకురుచికరమైన  భక్ష్య పానీయాలను, జంతువులకు పచ్చగడ్డిమొదలైనవాటిని ఇచ్చింది .అప్పటినుంచి భూమిపై పంటలు సమృద్ధిగా పండాయి .ఇదంతా శాకంబరీ దేవి అనుగ్రహమే నని అందరూ భావించారు .

               దుర్గావతారం

పార్వతీదేవి  దేవి దుర్గామాసురిడికి కబురు పెట్టి వేదాలను తెచ్చి ఇమ్మని ,స్వర్గాన్నిఇంద్రునికి అప్పగించి   వదిలి పెట్టి పొమ్మని కబురు చేసింది .వాడు వినలేదు .వెయ్యి అక్షౌహిణుల సైన్యంతో వాడు పార్వతీదేవిపైకి యుద్ధానికి వచ్చాడు .దేవ ,మునులు భీతి చెందగా వారిచుట్టూ రక్షగా ఒక తేజో వలయాన్ని సృష్టించి తాను బయటనే ఉండి యుద్ధం చేసింది .తన రూపాన్ని అత్యంత భయంకర౦గా ,వివిధ మారణాయుధాలు ధరించి  సింహవాహనమెక్కి శత్రు భీకరంగా కనిపించింది .భయంకర యుద్ధం సాగింది ఇద్దరిమధ్యా .రాక్షసుల బాణాలకు సూర్యుడు కనిపించలేదు.అంతా చీకటి .ఆయుధాల పోరులో అవి అంటుకొని వెలుగులు చిమ్మాయి .భీకర భయంకర శబ్దాలతో ఒకరిమాట ఒకరికి వినబడం లేదు .

          శక్తి స్వరూపిణి  దుర్గా మాత

ఈ సమయం లో దేవి శరీరం నుంచి కాళి ,తరిణి ,త్రిపురసుందరి ,భువనేశ్వరి, భైరవి ,ఛిన్న మస్త , ధూమావతి ,భగళముఖి ,మాతంగి ,కమలాత్మిక అనే నవ శక్తులు, శైలపుత్రి ,బ్రహ్మచారిణి,చంద్ర ఘంట ,కూష్మాండ ,స్కందమాత ,మృత్యు ,శరణ్యు మొదలైన శక్తులు ఉద్భవించి వంద అక్షౌహిణుల రాక్షససైన్యాన్ని నాశనం చేశాయి .జయజయ ధ్వానాలు మిన్నుముట్టాయి.

            దుర్గమాసుర సంహారం

అప్పుడు దుర్గామాసురుడు దేవి ఎదటబడి యుద్ధం చేశాడు .పది రోజులు సాగిన సమరం లో వాడి సైన్యమంతా నాశనమైంది .పదకొండవ రోజు వాడు యెర్ర దుస్తులు, యెర్ర హారాలు వేసుకొని,  యెర్ర చందనం పూసుకొని యుద్ధానికి వచ్చాడు  .పార్వతీ దేవి వివిధ శక్తులన్నీ ఆమెలోకి తిరిగి చేరి మరింత శక్తి స్వరూపిణి అయింది  .ఆరుగంటల తీవ్ర పోరు జరిగి ,ఆమె వాడిపై 15 తీవ్ర బాణాలు సంధిస్తే వాడి నాలుగు గుర్రాలను నాలుగు ,సారధిని ఒకటి ,రెండు వాడి రెండు కళ్ళను ,రెండు వాడి బాహువులను ,జండాను ఒకటి ,వాడిగుండెను అయిదు బాణాలు చీల్చిపారేశాయి .రక్తం కక్కుకొని భూమిపై దుర్గమాసురుడు పార్వతీ దేవి పాదాల చెంత వాలిపోయి మరణించాడు  .వాడి ఆత్మశక్తి పంచభూతాలలో కలిసిపోయింది .,ముల్లోకాలు వాడి చావుకు సంతోషించి దేవి పరాక్రమాన్ని శ్లాఘించాయి .త్రిమూర్తులతో సహా దేవతలు, మునులు వచ్చి ఆమెను కీర్తి౦చగా ఆమె సంతృప్తి చెంది  నాలుగు వేదాలను మునీశ్వరులకు అందజేసి ,వారినుద్దేశించి ప్రసంగించి వేద ధర్మాన్ని వ్యాప్తి  చేయమని ,యజ్ఞయాగాదులు నిర్వహించి ప్రకృతి సమతుల్యానికి తోడ్పడమని కోరి దుర్గామాసుర సంహారం చేసిన తాను ఇకనుండి ‘’దుర్గామాత’’గా పిలువబడుతానని చెప్పి,సత్య శివ సుందరమైన ఆ దేవి అదృశ్యమైంది .

 ఎక్కడెక్కడ శాకంభరీ ఆలయాలున్నాయి ?

   రాజస్థాన్ లో ఉదయపూర్ కు 15 కిలోమీటర్ల దూరంలో శాకంభరీ దేవి దేవాలయం ఉన్నది .జార్ఖండ్ లో ‘’పాకూరు’’ వద్దా ,కలకత్తాకు 150కిలో మీటర్లలో ‘’సకారియా’’లో ,బెంగుళూర్లో  ‘’బాదామి’’ లో ,సతారా ,సహరాన్ పూర్,  కాన్పూర్ లలో కూడా ప్రాచీన శాకంభరీ మాత దేవాలయాలున్నాయి .చైత్ర శుద్ధ సప్తమి ,నవరాత్రులలో  సప్తమినాడు రాత్రివేళల్లో జాగరణ చేస్తారు .

  అందుకే ఆషాఢ మాసం లో దేవీ దేవాలయాలలో  శాకంభరీ పూజను వివిధ కాయగూరలతో చేయటం ఆనవాయితీగా వస్తోంది .ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో 21-7-18 శనివారం ఉదయం 9-30 గం.లకు స్వామివార్లకు శాకంభరీ పూజ నిర్వహిస్తున్నాము .

 శాకంభరీ పంచకం –రచన –జగద్గురువులు  శ్రీ ఆది శంకరాచార్య

1-శ్రీ వల్లభ సోదరీ ,శ్రిత జనశ్చద్వాహినీ ,శ్రీమతీ –శ్రీ క౦ఠార్ధశరీరగా ,శృతి లసన్మాణిక్య తాటంకకా

శ్రీ చక్రాంతర వాసినీ ,శృతి శిరః సిద్ధాంత మార్గ ప్రియా –శ్రీ వాణీ ,గిరిజాత్మికా ,భగవతీ ,శాకంభరీ పాతు మాం .

2-శాంతా ,శారదా చంద్ర సుందరముఖీ ,శాల్యన్న భోజ్య ప్రియా –శాకైః పాలిత విస్టపా,రాతదృశా,శాకోల్లాస ద్విగ్రహా

శ్యామాంగీ ,శరణాగతార్తి శమనీ ,శక్రాదిభిః శా౦సితా –శంకర్యాస్ట ఫలప్రదా ,భగవతీ ,శాకంభరీ పాతుమాం.

3-కంజాక్షీ ,కలశీ ,భవాది వినుతా ,కాత్యాయినీ ,కామదా –కళ్యాణీ ,కమలాలయా ,కరకృతాం భోజాసి స్వేటాభయా

కాదంవాసవ మోదినీ ,కుచలత్కాశ్మీరజా లేపనా –కస్తూరీ తిలకా౦చితా,భగవతీ శాకంభరీ పాతుమాం .

4-భాక్తానంద విధాయినీ ,భవభయ ప్రధ్వంసినీ ,భైరవీ -భర్మాలంకృతి  భాసురా ,భువన భీక్రుద్ దుర్గ ,దర్పాపహా

భ్రూభ్రున్నాయక నందినీ ,భువన సూ భాస్యత్పరః ,కోటిభా –భౌమానంద విహారిణీ ,భగవతీ ,శాకంభరీ పాతుమాం.

5-రీతామ్నాయ శిఖాస్తు,రక్త దశనా ,రాజీవ పత్రేక్షణా-రాకా రాజ కరావదాత హసితా ,రాకేందు బి౦బ స్థితా

రుద్రాణీ,రజనీ కరార్భ కలసన్మౌళీ ,రజో రూపిణీ –రక్షః,శిక్షణా దీక్షితా ,భగవతీ ,శాకంభరీ పాతుమాం.

6-శ్లోకానామిహ పంచకం పఠతియః స్తోత్రాత్మకం శర్మదం-సర్వాపత్తి వినాశకం ప్రతిదినం భక్త్యా స్త్రి సంధ్యాం నరః

ఆయుః పూర్ణ మపార మర్థ మమలాం ,కీర్తి ప్రజా మక్షయాం –శాకంభర్య ను కంపయా  స లభతే విద్యాం చ విశ్వార్ధకాం .

ఇతి శ్రీ మచ్ఛ౦కరాచార్య  విరచితం శాకంభరీ పంచకం సంపూర్ణం

మీ-  గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-8(చివరిభాగం )

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-8(చివరిభాగం )

8-ప్రతిష్టాఖండం ‘’

కస్వాది మహర్షులతో శ్రీ ఆంజనేయస్వామి ‘’ప్రతి దానికీ ఒక కారణం ఉంటుంది .ఒక్కోసారి చాలాకారణాలూ ఉండవచ్చు.పూర్వజన్మ ఫలితంగా అవి జరుగూ ఉంటాయని మనకు తెలుసు .అప్పటి దాన్యమాలి యే ఇప్పటి ‘’విశాల ‘’ .నాటి శాండిల్య మహర్షి నేటి ‘’ధర్మమేథి ‘’.అప్పటికాలనేమి నామీద పగతో ‘’మాయా పర్ణాశనుడు ‘’మాయా ధర్మమేథి’’ మరియు మాయావానరం గా పుట్టాడు .కపటవేషం లో ఉన్న కాలనేమి శిష్యుడే అసలు పర్ణాశనుడు .రామ బాణం తో చనిపోయిన మాయామృగమైన మారీచుడే నేటి కస్వమహర్షి .దండకారణ్యం లో శ్రీరాముని సేవించిన మునులే ఇక్కడి ముని శ్రేస్టులు.గా జన్మించారు .విశాలను రక్షించి,ధర్మమేథిని కిరాతకుల గుహ నుంచి తప్పించిన  వానరం నేనే. నాటి జా౦బవంతుడే  ఇప్పుడు నాతో వచ్చిన భల్లూకం .’’అని చెప్పగానే కస్వాది మహర్షులు హనుమ పాదాలపై మోకరిల్లి ‘’మా పాపాలు పోగొట్టి మమ్మల్ని రక్షించావు మహాత్మా !అయినా సంసారకూపం లో పడి గిలగిలా కొట్టుకొంటున్నాము .మా అజ్ఞానాన్ని మన్నించి నువ్వు ఇక్కడే అర్చామూర్తిగా వెలసి మా అందరికి మార్గ దర్శనం చేస్తూ ఉండు .నువ్వు అవతరించిన ఈ క్షేత్రం  నాపేరురుమీదుగా ’ ‘’కస్వపురం ‘’ లేక కసాపురంగా ప్రసిద్ధి చెందుతుంది ‘’అని ప్రార్ధించాడు .

భక్తజన సులభుడు  కనుక  స్వామి వెంటనే అంగీకరించి ‘’మహర్షులారా !ఇక్కడే కసాపురం లో అర్చారూపంగా స్వయంభు గా వెలసి మీ పాపాలు పోగొడుతూ ,మీకు మేలుకలిగిస్తూ మీ కోర్కెలు తీరుస్తాను .ప్రహ్లాదుని అంశతో వ్యాసరాయలు జన్మించి వందలాది ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్టించి దేవాలయాలు కట్టించి ఈ భూమిపై వెయ్యేళ్ళు జీవిస్తాడు .ఆయనే మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి సన్యాస దీక్షనిస్తాడు .విజయనగర సామ్రాజ్య యశో విభూషణుడు శ్రీ కృష్ణ దేవరాయల కు అక్షరాభ్యాసం చేస్తాడు .తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో తపస్సు చేస్తూ రామభక్తి ప్రబోధిస్తూ ,హైందవ ధర్మ వ్యాప్తి చేస్తూ చిరకీర్తి నార్జిస్తాడు .దేశంనాలుగు మూలలా పర్యటించి ,ఎన్నో విగ్రహాలుప్రతిస్ట చేసి , ఆలయనిర్మాణం చేస్తాడు .రాయలసీమలోని శిల్పగిరి అనే చిప్పగిరిలో నేనెక్కడో భూమిలో దాగి ఉంటె ఎండిన వేపపుల్ల చిగిర్చిన చోట నావిగ్రహాన్ని  గుర్తించమని చెప్పగా , వెతుకుతూ వేలకొద్దీవేపపుల్లలు నముల్తూ ,అక్కడ పాతి పెడుతూ  ఇక్కడికి వచ్చి ,నిట్టనిలువుగా చీలి ఉన్న పెద్ద బండరాయి వద్ద వేపపుల్ల చిగిర్చిన చోట నావిగ్రహాన్ని భూమి నుంచి బయటకు తీయించి ఆంజనేయ ఆలయాన్ని కడు వైభవంగా  బహు సుందరంగా నిర్మించి జన్మ ధన్యం చేసుకొంటాడు . చీలిన రాయి దగ్గర నిర్మించటం చేత దీనికి ‘’నెట్టికల్లు ‘’అనే పేరు కూడా వస్తుంది .పూజారులను, మంగళ వాద్యాలను ,నిత్య ధూప నైవేద్యాలకు ఏర్పరచి నిత్య శోభతో ఆలయం వర్దిల్లేట్లు చేస్తాడు  .శ్రావణమాసం లో ఈఆలయ ప్రాంగణం లో నిద్రించిన వారికి నేను స్వప్న దర్శనం కలిగించి ,వాళ్ల కోరికలు  తీరేదీ ,లేనిదీ తెలియ జెపుతాను .మిగిలిన కాలాలలో మూడు  రాత్రులు  ఇక్కడ నిద్ర చేసే వారి కలో కనిపించి వారి కోరికలను నెరవేరుస్తాను .భూత ప్రేత పిశాచాది బాధలను నివారిస్తాను .ఆది వ్యాదులన్నిటినీ పోగోడతాను .ఆలయ సమీపం లోఉన్న పుష్కరిణి లో స్నాని౦చినవారికి తాపాలన్నీ దూరం  అవుతాయి  .మనసులో కోరికలతో వచ్చేవారికి కొంగు బంగారమై ఉంటాను .పెద్ద పెద్ద చెప్పులు కుట్టించి గోపురం పైన ఉంచిన వారికి ఎన్నడూ మంచే జరుగుతుంది  . వాటిని ధరించి నేను భూమినాల్గు దిశలా తిరుగుతాను .నా ఈ కసాపుర క్షేత్ర మాహాత్మ్యాన్ని రాసిన , భక్తితో పఠించిన, ఉపన్యసించిన స్తుతించిన వారందరికీ సర్వ  శుభాలు సకల దిక్కులా దిగ్విజయం కలుగ జేస్తాను ‘’అంటూ శ్రీ ఆంజనేయస్వామి మునులకు వివరించి అంతర్ధానమయ్యాడు .

ఇప్పుడు కవిగారు చివరలో రాసిన ‘’శ్రీ కసాపురా౦జనేయ శతకం  ‘’లో మచ్చుకి మొదటి చివరిపద్యాలు –

1-సీ-శ్రీరామ పాద రాజీవ చంచద్భ్రు౦గ –బ్రహ్మ చర్య వ్రత ప్రధిత సంగ

సర్వ రాక్షస నాగ సంఘాత హర్యక్ష –లక్షణ ప్రాణద లక్ష్య దక్ష

అబ్ధి లంఘన ఘన వ్యాసంగ విఖ్యాత –స్వామి కార్యాసక్తి ధామ చేత

ధర్మజానుజ భుజాదర్ప హర క్షాత్ర –సుకవి పండిత ముని స్తోత్ర పాత్ర

పావనాకార,రణధీర ,భవ విదూర –శత సహస్రార్క తేజ ,కేసరి తనూజ

తరళ దరహాస ,శ్రీ కసాపుర నివాస –అఖిల భక్తావన ధ్యేయ ఆంజనేయ ‘’.

108-సీ-శ్రీరామ భక్తాయ ,శ్రిత జనాధారాయ –వాయుపుత్రాయ ,తుభ్యం నమోస్తు

కలిదోష హరాయ ,కరుణా సముద్రాయ –పటు శరీరాయ ,తుభ్యం నమోస్తు

సమర హంవీరాయ ,యమరారి దళితాయ-బలశోభితాయ, తుభ్యం నమోస్తు

వనచర ముఖ్యాయ ,వనజాత నేత్రాయ –పవన వేగాయ, తుభ్యం నమోస్తు

అవనిజా ప్రాణదాయ ,తుభ్యం నమోస్తు –శత సహస్రార్క తేజాయ ,కేసరి తనూజ

తరళ దరహాసాయ ,శ్రీ కసాపుర నివాసాయ –అఖిల భక్తావన ధ్యేయ ,ఆంజనేయ ‘’.

సమాప్తం

కొసమెరుపు –ఈ చివరి భాగం రాస్తుండగా ఇప్పుడే రేపల్లె నుంచి సాహితీ వాచస్పతి ఉపన్యాస చతురానన,కసాపుర క్షేత్ర మాహాత్మ్యం కవి , డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారు ఫోన్ చేసి  నేను సోమవారం వారికి పంపిన 1-షార్లెట్ సాహితీ మైత్రీబంధం ,2-వసుదైకకుటుంబం పుస్తకాలు ఇప్పుడే అందాయని,ధన్యవాదాలనీ , ,చదివి మళ్ళీ ఫోన్ చేసి చెబుతానని ,నా సాహితీ వ్యాసంగం వైవిధ్య౦గా ఉన్నదని మెచ్చారు .నేను వెంటనే వారితో ‘’మీ కృష్ణ రాయ విజయ ప్రబంధం ‘’పై తుమ్మపూడి వారి సమీక్షను అంతర్జాలంలో రాసి అందరికీ తెలియ జేశాను .మీ కసాపుర క్షేత్ర మాహాత్మ్యం చివరి ఎపిసోడ్ రాస్తుండగా మీరు ఫోన్ చేయటం నాకు మహద్భాగ్యంగా ఉంది .హనుమ మనిద్దరికీ ఇలా సాహితీ బాంధవ్యం కలిగించాడు .ధన్యోహం ‘ మాశ్రీమతి మీ  ‘’విజయా౦జ నేయం’’శ్రద్ధగా నిత్యం పఠిస్తోంది .’’ అన్నాను .వారు చాలా సంతోషిస్తూ ‘’రాయ ప్రబంధం ద్వితీయ భాగం ‘’కూడా పూర్తయింది అచ్చులో ఉంది .రాగానే మీకు తప్పక పంపుతాను ‘’అని తమ పెద్దమనసు ను ఆవిష్కరించారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-18 –ఉయ్యూరు .

 

 

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-7

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-7

7-విజయఖండం

హనుమ కస్వాదిమునులకు రామాయణ  వృత్తాంతం  చెబుతూ ‘’కాలనేమి నా రాక కోసం ద్రోణ పర్వతాశ్రమం లో ఎదురు చూస్తున్నాడు .మహర్షికదా దర్శించి పోదాం అనుకోని ఎదుట నిలచి నమస్కారభంగిమలో చాలా సేపు ఉన్నా .ఆతడు కనులు తెరవలేదు .చివరికి ధ్యాన సమాధినుండి లేచి నన్ను చూసి ,చనిపోయిన వాళ్ళను బ్రతికించే మంత్రం నా దగ్గర ఉంది .ఈ ఉద్యానం లో విహరిస్తూ హాయిగా ఫలాలను ఆరగించు ‘’అన్నాడు .అప్పుడు నేను ‘’లక్ష్మణస్వామి ప్రాణాలు అపాయం లో ఉన్నాయి ఇక్కడ విహరిస్తూ కూర్చోలేను .కానీ దాహంగా ఉంది .సరోవరం దారి చూపిస్తే దప్పిక తీర్చుకుంటా ‘’అన్నాను .నేను బోల్తాపడ్డానని నమ్మి ,కపటపు నవ్వుతో ‘’నా కమండలం లో  అమృతజలం ఉంది తాగు ‘’అన్నాడు .’’నా దాహానికి ఈ నీళ్ళు చాలవు ‘’అన్నాను .అతడు ‘’ఇది అక్షయ కమండలం .ఎంతకావాలంటే అంత నీరు వస్తుంది ‘’అన్నాడు .నేను కమండలం నీరు పవిత్రమైనది దాన్ని ఎంగిలి చేయటం భావ్యం కాదు .కొలను చూపించండి ‘’అన్నాను .దొంగముని సంతోషం తో ‘’దగ్గరలోనే దుగ్దాబ్ది అనే సరోవరం  ఉంది. ఒకప్పుడొక మహర్షి దీన్ని సృష్టించి దానిలోనే నిలబడి తపస్సు చేస్తుంటే జలజంతువులు అల్లకల్లోలం చేసి ధ్యానభంగం చేస్తుంటే ‘’మానవులు రెండుకళ్ళూ మూసుకుని చేతులు కట్టుకొని ,జంతువుల్లాగా   మౌనంగా నీళ్ళు తాగాలి ‘’అని శాసించాడు .అని నాకు చెప్పి ఒక శిష్యుడిని నా వెంట పంపాడు .నేను ఆ సరోవరం లో కళ్ళు మూసుకొని ,చేతులు వక్షస్తలానికి  ఆనించి ,జంతువులాగావంగి నీళ్ళు తాగుతుంటే ,అకస్మాత్తుగా ఒకమొసలి నా కాళ్ళు గట్టిగా పట్టేసింది .కళ్ళు తెరచి తోకతో చాచి కొట్టాను .అది వెనకడుగు వేయక మరింత గట్టిగా పట్టుకొన్నది .నా శరీరాన్ని మేరు పర్వతంలాగా పెంచి  గోళ్ళతో దాన్ని చీల్చే ప్రయత్నం చేశా .అవి దాని శరీరం లోకి చొచ్చుకు పోనేలేదు .క్రమంగా దాని బలం పెరుగుతోంది . వెంటనే రామ లక్ష్మణులను స్మరించి నమస్కరించా .శరీరాన్ని అంగుస్ట మాత్రంగా ఒక్కసారి తగ్గించేసి దాని నోట్లోంచి కడుపులో దూరి ,అక్కడ శరీరాన్ని పెంచి గోళ్ళతో నరాలు తెంచి ,ఉండగా చుట్టి దాని గొంతు లో నొక్కేశా .ఊపిరాడక రక్తం కట్టుకొని చచ్చింది .దాని దేహం నుంచి మేఘమండలం లోంచి వచ్చే బాలభాస్కరునిలాగా నేను బయటికి వచ్చాను .

‘’ఒక గండం గడచి౦ది కదా అనుకొంటే ,వెంటనే అక్కడే మెరుపుతీగలాంటి అందమైన అమ్మాయి ప్రత్యక్షమై నాకు నమస్కరించి’’మహానుభావా ! నీ ఋణం  తీర్చుకోలేనిది .నేనొక అప్సరసను .ఒక ముని ఇచ్చిన శాపానికి నక్రం గా మారాను .నీవలన శాప విమోచనం జరిగింది .నిన్ను పంపినవాడు మునికాదు.నీకు ఆటంకం కలిగించాలని రావణుడు పంపిన కాలనేమి రాక్షసుడు .వీడిని చంపి ద్రోణాద్రికి వెళ్లి అనుకున్నది సాధించు ‘’అన్నది .ఆశ్చరాభరితుడనైన నేను ఆమె ను మొసలి రూపం ఎందుకు వచ్చిందని అడిగాను .ఆమె ‘’నా పేరు దాన్యమాలి. అప్సరసను .ఒకసారి మునీంద్రులు కొందరు నా నాట్యప్రదర్శన చూడాలని అనుకోని బ్రహ్మ సభలో నేను నాట్యం చేస్తుంటే వాళ్ళు ఆనంద బాష్పాలు రాలుస్తూ బాగా ఆనందించారు .అక్కడే ఉన్న భరతముని కూడా నన్ను మెచ్చుకున్నాడు .బ్రహ్మ కూడా ఎంతో సంతోషించి ఒక దివ్య విమానం సృష్టించి నాకు బహుమతిగా ఇచ్చాడు .దానిలో లోకాలన్నీ తిరిగాను .ఒకసారి మనోజ్ఞమైన ఈ సరోవరాన్ని చూసి స్నానించి అప్పటి నుండి వీలైనప్పుడల్లా వచ్చి స్నానం చేసేదాన్ని .

ఒకసారి అలాగే వచ్చి జలకాలాటలు ఆడుతుంటే ఒకమహర్షి రాగా భక్తితో నమస్కరించా .ఆయన తాను శాండిల్యమహర్షి నని ,ఇక్కడే పది వేల ఏళ్ళు  తీవ్ర తపస్సు చేశానని ,తపస్సులో ఉన్నప్పుడు ఆయనకు నారూపం కనిపించిందని ,అప్పటినుంచి నాపై కోర్కె పెంచుకోన్నానని ,తన కోర్కె తీర్చాల్సిందే నంటూ దగ్గరకు వచ్చాడు .నేను ఆయనకు పరిపరివిధాల నచ్చ చెప్పే ప్రయత్నం చేసి వారించాను .కాని ఆముని నన్ను వదిలేట్టు లేడు అని గ్రహించి ఉపాయం తట్టి నేను రుతుమతిని .నాల్గు రోజులయ్యాక ఆయన కోర్కె తీరుస్తానని చెప్పి బయట పడ్డాను .

అక్కడినుండి గంధమాదన పర్వతం చేరి దాని సౌందర్యానికి ఆకర్షితురాలనై సంచరిస్త్తుంటే ,ఒక భయంకర రాక్షసుడు వచ్చి తాను నా సౌందర్యానికి గులాం అయ్యానని నన్ను బలాత్కారించటానికి దగ్గరకు రాగా నేను అబలను అని ,బలాత్కారం పాపహేతువు అనీ చెప్పగా వాడు ‘’పెళ్ళికాక ముందు స్త్రీలందరూ పరాయి వాళ్ళేకదా ‘’అంటూ మీదమీదకు రాగానేను శా౦డిల్యమహర్షికి రుతుస్నాతయై వస్తానని మాట ఇచ్చానని ,నేను వెళ్ళకపోతే ఆయన శపిస్తాడని చెప్పా .కాని ఆ రాక్షసుడు నామాటలను పెడచెవిని పెట్టి నా మీద పడి నాదేహాన్ని అల్లకల్లోలం చేశాడు .అంతే సద్యోగర్భం గా ఒక భీకరాకారుడు  కొడుకు గా పుట్టగా వాడికి ‘’అతికాయుడు ‘’అనే పేరు పెట్టి ,వాడిని ఆరాక్షసుడు తనవెంట తీసుకు పోయాడు.నన్ను దోచుకున్నవాడు రావణాసురుడు అని తెలిసింది . ‘’అని చెప్పింది .’’దాన్యమాలిని కి నేను’’ అతికాయుడిని లక్ష్మణుడు యుద్ధం లో చంపాడు ‘’అని చెప్పగా ఆమె వాడిని ఎప్పుడూ కొడుకుగా భావించలేదని అన్నది .సమయం చాలదు చెప్పాల్సింది ఏదైనా ఉంటె త్వరగా చెప్పమని ఆమెను కోరాను .ఆమె ‘’ఆ రాక్షసుడు వెళ్ళిపోయాక మ్రాన్పడి  కొన్ని రోజులు ఉండిపోయాను   . ఆ తర్వాత ముని దగ్గరకు వెళ్ళాలని భావించి విమానం లో అతని వద్దకు వెళ్లాను.అతడు నేను చీకటి తప్పు చేశానని నిందించి ,నాల్గు రోజులలో రుతుస్నాతగా వస్తానని చెప్పి చాలాకాలానికి వచ్చినందుకు కోపించి ఈ సరోవరం లో నక్రాకృతి పొంది ఉండిపొమ్మని శపించాడు .

అప్పుడు నేను శాండిల్య మహర్షి పాదాలపై పడి రావణుడు నాకు చేసిన దురన్యాయమంతా వివరించి చెప్పి క్షమించమని ప్రార్ధించా .మునిమనస్సు కరిగి ‘’రామ కార్యార్ధం పవన సుత హనుమానుడు ఇక్కడికి వస్తాడు .మారుతి వలన నీ శాపం తీరుతుంది ‘’అని చెప్పి’’ఒరేరావణా !నీమీద అనురాగం లేని స్త్రీని నువ్వు బలాత్కరించిన మరుక్షణం లో నీతల వేయి వ్రక్కలై నేల రాలుతుంది .రామ రావణ సంగ్రామం లో నువ్వు బంధు మిత్ర సపరివారంగా నశిస్తావు ‘’అని శపించింది  అని హనుమ కస్వాది మహర్షులకు చెప్పాడు.

కొనసాగిస్తూ మారుతి ‘’నేను ఏమీ తెలీనట్లు కపట ముని దగ్గరకు వెళ్లి నిలబడ్డాను .వాడు మాయమాటలతో ఇప్పుడు ద్రోణాద్రికి  వెళ్లి మూలికలను తీసుకొని లంకకు వెళ్ళే సమయం లేదని ,బ్రహ్మ తనకు మృత సంజీవని మంత్రమిచ్చాడని ,దాన్ని అర్హుడికి ఇవ్వాలని ఎదురు చూస్తున్నానని గురు దక్షిణ చెల్లించి మంత్రాన్ని పొందమని చెప్పాడు .నేను వెంటనే ‘’ఇదే రా గురుదక్షిణ’’ అంటూ వాడిని ముష్టి ఘాతాలతో చావబాది కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి సముద్రమధ్యం లోకి విసిరేశా .కాని వాడు రసాతలందాకా మునిగిపోయి మళ్ళీ వచ్చి నామీద పడ్డాడు .నేను భీకరంగా ఒక పిడి గుద్దు గుద్దగా వాడు మాయమయ్యాడు .ఇంతలో సుగ్రీవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి ‘’మిత్రమా!యుద్ధం లో రావణుడు చచ్చాడు ,లక్ష్మణుడు మూర్చనుంచి తేరుకున్నాడు  .శ్రీరాముడు త్వరగా నిన్ను తీసుకు రమ్మన్నాడు’’అని చెప్పాడు .ఇదివరకెన్నడూ అతడు నన్ను మిత్రమా అని సంబోధించలేదు  .ఆశ్చర్యమేసి౦ది నాకు .ఇదీ మాయలో భాగమే అని గ్రహించి ‘’నీ కాలి  వ్రేలోకటి తెగి౦ది కదా. అయిదు వ్రేళ్ళూఎలావచ్చాయి ?’’అని అడిగి తే ‘’రామానుగ్రహం వల్ల ‘’అన్నాడు వాడు. అనుమానం మరింత బలపడి ,వాడిని ఒక్కతాపు తన్నాను కాలితో .వాడు చిరునామాలేకుండా పారిపోయాడు .ఇంతలో సింహరూపం లో వచ్చి నాపై దూకాడు .నేను నాపద్ధతి ప్రకారం బొటన వ్రేలు అంత అయి దాని కడుపులో దూరి శరీరం పెంచి చీల్చేశాను .పీడావిరగడ అయి౦ద నుకొంటే కాలనేమి రూపం లో వాడు నాపై కలయబడ్డాడు .నేను శ్రీరాముని స్మరించి వాడి రెండుకాళ్ళు పట్టి వెయ్యి సార్లు గిరగిరా తిప్పి విసిరేస్తే వాడు సముద్రం లో పడ్డాడు .కాసేపు చూసి ఇక వాడు రాడని గ్రహించి ద్రోణాద్రికి వెళ్లి దాన్ని పెకలించి తీసుకొని వచ్చి సౌమిత్రిని కాపాడి రాముడికి ఊరట కలిగించాను . మిగిలినకథ మీకు తెలిసిందే .మళ్ళీ చెప్పాల్సిన పని లేదు .ఇక ఇప్పుడు మునులారా మీమీ పూర్వ జన్మ వృత్తాంతాలను మీకు వివరిస్తాను ‘’అని ఆంజనేయుడు కస్వాది మునీశ్వరులతో అన్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-6

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-6

6-రామ కథా ఖండం

కస్వాదిమహర్షులకు ప్రత్యక్షమైన ఆంజనేయస్వామి రామకథ చెప్పటం ప్రారంభించాడు .’’త్రేతాయుగం లో శ్రీరాముడు తండ్రి ఆజ్ఞతో సీతాలక్ష్మణ సమేతంగా అడవికి వెళ్ళాడు .ముగ్గురూ ముని వేషాలతో గౌతమీ తీరం లో పంచవటి లో పర్ణశాల నిర్మించుకొని కొంతకాలం గడిపి ,జనస్థానం చేరి కుటీరం లో ఉన్నారు .ఒక రోజు శూర్పణఖ వచ్చి’’ రామ చక్కని’’ తనానికి మోహపడి వాళ్ళు ఎందుకు మునివేషం లో ఇక్కడికి వచ్చారు అనీ, ఖరుడు ఇక్కడ రావణ ప్రతినిధిగా పాలిస్తున్నాడు .వాడి తమ్ముడు దూషణుడు .ఇద్దరూ మహా రణ పండితులే .మీరిక్కడ ఉన్నారని వాళ్ళిద్దరికీ తెలిస్తే మిమ్మల్ని నంజుకొని తింటారు .వాళ్ళతో స్నేహం మీకు క్షేమం ‘’అన్నది .రాముడు ఉదాసీనంగా విని దైన్యం తో ఉన్నట్లు నటించి ‘’మాకు మేలు చేశావు .పాముల కాళ్ళు పాములకే తెలుసు .వాళ్లకి ఎలా సంతోషం కలిగించాలో వివరంగా చెప్పు ‘’అన్నాడు .

పరిహాసం గా రాముడు అన్నమాటలను అమె నమ్మిశూర్పణఖ  రాముడు తనవలలో పడ్డాడని ఆతనితో పొందు సౌఖ్యం హాయిగా అనుభవించవచ్చని ఊహించింది .భయం లేదనీ తాను వాళ్లకు అండగా ఉండగా వాళ్ళేమీ చేయలేరని పలికింది .ఇంకొంచెం ముందుకు వెళ్లి ‘’నాంతటి అందకత్తె రాక్షసజాతిలో లేదు  ,నాకోసం మా వాళ్ళు  అర్రులు చాస్తూ౦ టారు .కాని నాకు నిన్ను పెళ్ళాడాలని ఉంది .ఈమెను నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేసెయ్యి .రోజుకో మహర్షిని చంపి నీకు కానుక ఇస్తా .రోజూ విప్పకల్లు తాగి సుఖాలలో తేలిపోదాం .పొట్టి కురూపి సీతతో ఇంతకాలం ఎలా కాపురం చేశావ్ ?దీన్ని మింగేసి మనకు అడ్డు లేకుండా చేస్తా ‘’అని ఆమెపైకి దూకబోయింది .సీత భయకంపితురాలవ్వగా లక్ష్మణుడు వెంటనే  ఆమె ముక్కూ చెవులూ కోసేశాడు .

అంద వికారి అయి పోయిన శూర్పణఖ ఏడుస్తూ ఖర దూషణుల దగ్గరకు పోయి విషయం చెప్పింది .వాళ్ళు  అత్యంత రౌద్రం తో సేనా సమేతంగా వచ్చి రాముని పై పడితే  నిమిషాలమీద  వారందరినీ  రాముడు నిర్జించాడు .ఈ విషయం తెలిసిన రావణుడు మారీచుని సాయంతో జనస్తానానికి వచ్చి,వాడు మాయలేడిగా మారగా సీత దాన్ని పట్టితెమ్మనగా రాముడు దాని వెంబడించి సంహరించాడు .మాయావి రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకు పోయాడు . రామ లక్ష్మణులు  వచ్చి సీత జాడ తెలియక అరణ్యమంతా గాలిస్తుంటే జటాయువు ఆమె వృత్తాంతం చెప్పి మరణిస్తే అతనికి అగ్ని సంస్కారం చేసి ,కబంధుని చంపి ఋష్యమూకపర్వతం చేరి ,మా రాజు సుగ్రీవునితో రాముడికి స్నేహం నేనే మంత్రిగా కలిగించాను .రాముడు సప్త సాలాలను భంజించి ,వాలిని చంపాడు .సుగ్రీవాజ్ఞ ప్రకారం నేను సముద్రం దాటి లంకను చేరి సీతామాతను దర్శించి అశోకవనం నాశనం చేసి ,లంక  కాల్చి పరశురామ ప్రీతికలిగించి ,సముద్రం దాటి వానరులను చేరి సీతా వృత్తాంతమంతా  చెప్పాను .

అపార వానర భల్లూక సేనతో రామ లక్ష్మణులు దక్షిణ సముద్ర తీరం చేరారు .దారి ఇమ్మని సముద్రునికోరి ఇవ్వకపోతే ప్రాయోపవేశం చేసి చివరికి బ్రహ్మాస్త్రం సంధించగా సముద్రుడు ప్రత్యక్షమై  రాముని శరణు వేడాడు .ఆ అస్త్రాన్ని రాముడు ద్రుమ కుల్యం పై ప్రయోగించాడు .నూరు యోజనాల సముద్రం పై  కపి సేన సేతువు నిర్మించి ,చివరగా  సీతను తెచ్చి అప్పగింపుమని అంగదుడిని రాయబారిగా పంపినా వాడు ఒప్పుకోకపోతే ,యుద్ధం చేసి రావణ ,కుంభకర్ణ ,ఇంద్ర జిత్తులను జయించి ,విభీషణుడికి,పట్టం కట్టి ,సీతాదేవితో అయోధ్యకు వచ్చి పట్టాభి షిక్తుడు అయిన సంగతి మీకు తెలిసిందే ‘’అన్నాడు హనుమ .

మళ్ళీ చెప్పటం ప్రారంభించి ‘’రామ రావణ యుద్ధంలో ఒక రోజు రావణుడు మయుడు ప్రసాదించిన శక్తి తో రాముడిని చంపాలని   యుద్ధానికి వచ్చాడు .దారిలో విభీషణుడు ఎదురవ్వగా  ఇద్దరూ ఘోర యుద్ధం చేశారు .అప్పుడు అన్న తమ్ముడిపై ఆ శక్తిని ప్రయోగించాడు .విషయం తెలిసిన లక్ష్మణుడు విభీషణ రక్షణార్ధం ,అతన్ని వెనక్కి నెట్టి తానె ముందు నిల్చి దశ కంఠుడితో తలపడ్డాడు .శక్తి అతని బాణాలన్నిటినీ తుత్తునియలు చేసి రామానుజుని తాకగా మూర్ఛపోయాడు .ఆ౦జ నేయాదులకోరికపై రాముడు రావణుడితో యుద్ధం చేసి వాడి పరాక్రమాన్ని నిర్వీర్యం చేశాడు .తమ్ముడు మరణించాడని భావించి దుఃఖించాడు .సుషేణుడు వచ్చి అది మూర్ఛ యేకాని .మరణం కాదని చెప్పి ఊరడించి ద్రోణాద్రిపై సంజీవకరణి, విశల్యకరణి మొదలైన వనౌషధాలున్నాయని ,సూర్యోదయానికి ముందే వాటిని తీసుకురమ్మని రాముని చేత  ఆజ్ఞాపి౦ప బడి నేను బయల్దేరాను .నన్ను ఆపటం ఎలాగా అని రావణుడు ఆలోచించి ,మారీచాశ్రమం చేరి వాడికొడుకు కాలనేమి నిమచ్చిక చేసుకొని నాపైకి పంపాడు.వాడు ద్రోణాద్రి చేరి అక్కడ ఒక తపశ్శాల నిర్మించుకొని తపస్సు చేసే నెపంతో ఉన్నాడు .’’’అనిచెప్పాడు మునులకు మారుతి .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-5

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-5

5-వ్రత ఖండం

ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న విశాల భర్త వెళ్లి చాలాకాలమైంది ,కవశ మని యజ్ఞం లో ఆయన కనిపించలేదని చాలామంది చెప్పారు .ఇల్లు వదిలి ఇన్నిరోజులు ఎప్పుడూ ఉండలేదు. దారిలో ఏదైనా ఆపత్తు జరిగిందేమో అని విచారించింది .భర్త్రు చింతనతో చిక్కి శల్యమై కస్వ మహర్షిని దర్శించి తన భర్త కోసం గాలించమని వేడింది .రెండు రొజులు ఓపిక పట్టమని ,తర్వాత వెతికిస్తానని అభయమిచ్చాడు  ,రెండవ రోజు రాత్రి ధర్మమేథి అలసి సొలసి ఆశ్రమ చేరాడు .భర్తకు సపర్యలు చేసి ,కసవముని యజ్న విశేషాలడిగింది .అతడు కామాతురుడై ఆమె ప్రశ్నలకు జవాబులీయకుండా ఆమెను కౌగిలించుకొనే ప్రయత్నం చేశాడు .బిత్తర పోయిన విశాల సంధ్యాదులు, శిష్యులకు వేదాధ్యయనం వదిలేసి వ్యామోహమేమిటి అని ప్రశ్నించింది .తనకు వినే ఓర్పులేదని , తన కోరిక  తీర్చాల్సిందే  .ఇంఐ బలవంత పెట్టాడు .ఇంతకూ పూర్వం ఎప్పుడూ ఆయన ఇలా ప్రవర్తించలేదని అనుమానం వచ్చి  ,చుట్టుప్రక్కల మునీశ్వరులను సహాయం కోసం బిగ్గరగా అరుస్తూ పిలిచింది .వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే భార్యాభర్తలమధ్య మీరెందుకు అని కసిరాడు .దీనంగా విశాల ఈ ఆపత్సమయం లో తనను ఒంటరి దాన్ని చేసి వెళ్ళవద్దని ,తనభర్త ప్రవర్తన చాలా వింతగా ఉందని ,అతడు మాయావి అయి ఉండవచ్చునని ప్రాధేయ పడింది .ఈ గలాభా అంతా విన్న కసవ ముని అక్కడకు వచ్చి భార్యాభర్తలమధ్య అన్యోన్యత ఉండాలికాని ఈ గొడవేమిటి అని విసుక్కుని ‘’అమ్మా నా ఆశ్రమానికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకో ‘’ ‘’అని హితవు చెప్పాడు .ఈ మాటలకు మాయా ధర్మమేథి ‘’నా భార్యను లాక్కెళ్ళిఅనుభవించాలని చూస్తున్నావా దొంగ మునీ ‘’అంటూ ఆయన్ను తోసేస్తే ,ఆయన నేలపై పడ్డాడు  .ఇంతలో పూర్వం విశాలను కాపాడిన వానరం ,భల్లూకంతో అకస్మాత్తుగా వచ్చివాడి రొమ్ము మీద గుద్దింది .అ దెబ్బకు మాయావి  రక్తం కక్కుకోగా వాడి కాళ్ళు పట్టుకొని దూరంగా విసిరేయగా వాడు  చచ్చాడు .

ఇప్పుడు అందరికీ ఒకటే ప్రశ్న .అసలు ధర్మమేథి ఎమైనాడు ? ఎక్కడున్నాడు ?మాయా రాక్షసులు తమను ఇప్పటికే చాలావిధాలుగా భాధించారు .ఇక ఉపేక్ష పనికి రాదు కనుక కస్వ ముని ని’’హనుమద్ర్వత౦ వెంటనే చేయమని ప్రార్ధించారు .అప్పుడాయన లేడికిలేచిందే పయనం అన్నట్లు కార్యక్రమాలు చేయరాదు .ముందూ వెనుకలు ఆలోచించాలి .దుస్ట శక్తులు విఘ్నం చేసే ప్రయత్నాలు చేస్తాయి .వాటిని తట్టుకుంటూ నిర్విఘ్నంగా ,శాస్త్రీయంగా చేద్దాం అన్నాడు. అందరూ సంతోషంతో అంగీకరించారు .

విశాలమైన  పందిళ్ళు , అవసరమైన హోమ గుండాలు ,కావాల్సిన సామగ్రి సిద్ధం  చేశారు . బ్రహ్మ స్థానం లో కస్వ ముని కూర్చుని ,  విష్వక్సేనాది పూజలు చేసి ,ఆంజనేయ మంత్రాలతో ఆహుతులనువ్రేల్చుతూ  ఏడు అహోరాత్రాలు ఆంజనేయ యజ్ఞం చేశారు .ప్రీతి చెందిన స్వామి ప్రశా౦తవదనంతో ప్రత్యక్షమవగా మహర్షులు దివ్య స్తోత్రాలతో ఆయనను ప్రసన్నంచేసుకొన్నారు .వారికి విఘ్నాలు కలిగించే పోకిరి మూకలను ఇక ఉపేక్షించనని అభయమిచ్చాడు .విశాల వచ్చి స్వామి పాదాలపై వ్రాలి భర్త విషయం రోదిస్తూ,భర్త లేకుండా తాను జీవించటం దుర్లభమని  చెప్పింది .ఉన్నట్టుండి మారుతి అదృశ్యమయాడు .ఆశ్రమం లోపలి నుంచి ధర్మమేథి అకస్మాత్తుగా  బయటకు వచ్చి కస్వముని పాదాలకు నమస్కరించి భార్యను సమాదరించి శిష్యులను వాత్సల్యంగా పలకరించాడు .తాను కిరాతుల చెరసాలలో ఉండగా  ఆ రోజు ఉదయం ఒక వానరవీరుడు  వచ్చి చెరసాలను నుగ్గు నుగ్గు చేసి ,తనను విసరి వేయగా తాను ఆశ్రమ లో వచ్చి పడ్డాను అని వివరించి  చెప్పాడు .కస్వర్షి ఇక్కడ జరిగిన హనుమద్వ్రత విశేషాలు వివరించాడు తనకు. ఇక్కడ హనుమ దర్శనం కానందుకు బాధపడి స్వామిని తనకు వెంటనే ప్రత్యక్షమై తనస్తోత్రాలను స్వీకరించమని వేడుకొని ఒక్కసారిగా అక్కడి అగ్ని గుండం లో దూకేప్రయత్నం చేయగా అందరూ కంగారు పడుతుండగా హనుమ ప్రత్యక్షమై ఆపి, ఆ రాక్షసుని వృత్తాంతం చెప్పటం మొదలుపెట్టాడు .

సశేషం

దక్షిణాయన శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-4

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-4

4-రక్షః ఖండం

కాలం గడిచి పోతోంది,చెడు సమసి పోయింది  కాని ఆంజనేయ వ్రతంమాత్రం అంతా మర్చే పోయారు .ఒక రోజుమధ్యాహ్నం  ఇద్దరు జటాధారులు ఆశ్రమం వైపు వస్తూ,ఎండ వేడి భరించలేక ,దూరం నుంచే ఆశ్రమ సౌందర్యానికి ముగ్ధులై ,ఆశ్రమం దగ్గరకొచ్చి తాము ధర్మమేథి దర్శనం కోసం వచ్చామని చెప్పగా కస్వ మహర్షి శిష్యులు ఆదరంగా ఆహ్వానించి ,ధర్మమేథి ఆశ్రమానికి తీసుకు వెడుతుండగా ఆయనే ఎదురొచ్చి స్వాగతం పలికి సకల సపర్యలు చేసి ,తాము వచ్చిన పని అడిగాడు. వాళ్ళు ‘’ మేము గౌతమీ తీరం లో ఉంటున్న కవశుడు అనే బ్రహ్మర్షి శిష్యులం .ఆయన బ్రాహ్మణ ఋషికి ,శూద్ర స్త్రీ కి జన్మించినవాడు .అయినా నిరుపమాన తపస్సంపన్నుడై బ్రహ్మర్షి అయ్యాడు .ఒకప్పుడు నైమిశం లో  మహా క్రతువు జరిగితే ఈయన అక్కడికి వెళ్ళాడు .అక్కడి మునులు ఈయన్ను చూసి పిలువకుండా వచ్చినదుకు పరిహాసం చేసి,ఆయన కాలు పెట్టిన చోటు నిలువు లోతు పాపభూయిస్టం అవుతుంది  కనుక ప్రవేశార్హుడు కాదు అని నిందించారు .కవశ మహర్షి అవమాన భారంతో కన్నీటితో వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతుండగావెంటనే నైమిశారణ్యంలో  ప్రవహించే సరస్వతీ నది పెద్ద ధ్వనితో పదిపాయలుగా చీలిపోయింది .ఒకపాయ వచ్చి ఆయన పాదాలను కడిగి పాపప్రక్షాళన చేసింది .మరోకపాయ యజ్నవాటికను ,ముని వాటికలను  ముంచేసింది .పీకల్లోతు నీటిలో మునులందరూ చెల్లా చెదురై కవసుని ప్రభావం గ్రహించారు .విప్రత్వం బ్రహ్మత్వం చేసే కర్మలవలన కలుగుతాయి కాని జన్మవల్ల కాదన్న సత్యాన్ని గ్రహించారు .ప్రాయశ్చిత్తంగా ఆయన పాదాలపై వాలి క్షమాభిక్ష అర్ధించారు .ఆయన తనను ప్రార్ధిస్తే ప్రయోజనం లేదనీ తనను పరిశుద్ధుని చేసిన సరస్వతీ నదిని ప్రార్ధించమని చెప్పి తాను ఆ నదికి అభిముఖంగా నిలిచి ఆమెను ‘’వీళ్ళు అజ్ఞానంతో చేసిన చేసిన తప్పులను కాయమని’’ కోరాడు .నది శాంతించి యధాప్రకారం గా ప్రవహించింది .ముని తన ఆశ్రమానికి బయల్దేరి చేరాడు .ఆయనే ఇప్పుడు గొప్పక్రతువు నిర్వహించ సంకల్ప౦ చేసి ధర్మమేథి ని అర్ధాంగి, శిష్యసమేతంగా రావలసినదిగా కోరారు ‘’అని విన్నవించారు శిష్యులు .తాను అలాగే వస్తానని మాట ఇచ్చి వాళ్లకు వీడ్కోలు పలికాడు .

అర్ధాంగి తో కలిసి  వెళ్ళాలి అనుకొన్నాడుకానీ కాని, అనివార్యకారణాలవల్ల ఒంటరిగా బయల్దేరాడు .దారి అంతా ముళ్ళకంపలతో భీభత్సంగా ఉంది. ముళ్ళు గీసుకొని యమబాద అనుభవించాడు  .మిట్టామధ్యాహ్నపు ఎండకు తట్టుకోలేక పోయాడు .క్రూర మృగ బాధ కు తల్లడిల్లాడు .కొంతసేపటికి దూరంగా ఒక ఆశ్రమం   కనిపిస్తే  ప్రాణం లేచి వచ్చినట్లని పించింది కాని, ఎడమ కన్ను, ఎడమభుజం అదిరి అపశకున౦ గా గోచరించింది .అయినా ముందుకే కదిలాడు .కుక్కల అరుపులు,చచ్చిన జంతువుల దుర్వాసన  వాటిని పీక్కు తినే నక్కల కుక్కలు మరింత రోతపుట్టించాయి .ఇంతలో కిరాతులగుంపు వచ్చి ఆయనే తమ పోలి తో కాపురం చేసి పారిపోయిన దొంగ సన్నాసి అని  జుట్టుపట్టుకొని తలపై కొట్టారు .ఆయన యోగదండాన్ని, కమండలాన్ని యజ్నోపవీతాన్నీ  ముక్కలు చేశారు .ఇంతలో రాకాసిలాంటి భారీ ఆకారం తో ‘’పోలి’’ అక్కడికొచ్చి ‘’ఏరాపోలిగా !ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావ్ .నానోట్లో నోరు బెట్టి కల్లు తాగకుండా ఎట్టా ఉన్నావ్ .నాతో రాత్రిళ్ళు పడక సుఖం అనుభవించి చెప్పకుండా ఏడకు జారుకున్నావ్ ‘’అంటూ నానా దుర్భాషలు ఆడింది .మహర్షి కోపంతో ఒక్క తోపు తోస్తే అది రొచ్చు గుంటలో పడింది .ఆయన కిరాతులను నానా విధాలుగా తిట్టుతుండగా పోలి లేచి వచ్చి మళ్ళీ తిట్లదండకం లంకి౦చుకొన్నది .అవాక్కయ్యాడాయన .చివరికి వాళ్ల నాయకుడి దగ్గరకు బంధించి తీసుకు వెళ్లి జరిగింది చెప్పి ఆయనకు శిక్ష వేయమని కోరారు .

నాయకుడు భయంకరాకారుడు .పోలిని జరిగిన అన్యాయం చెప్పమంటే కల్లబొల్లి ఏడ్పులతో కహానీ అల్లి చెప్పింది .ఆయన్ను అడిగితె తాను ఇంతవరకు ఆస్త్రీని చూడనే లేదని ,కస్వమహర్షి తన గురువు అని నిజాన్ని నిర్ధారించి శిక్ష వేయమని కోరాడు .అందరూ వాళ్ళిద్దరూ గూడెం లో కలిసి కాపురం చేశారని సాక్ష్యం చెప్పారు .అప్పుడా దొర న్యాయనిపుణులను పిలిచి విచారించమని ఆదేశించాడు .వాళ్ళు కూడా ఆడది పరాయి వాడిని తనభర్త అని చెప్పదని ,వచ్చినవాడు బ్రహ్మర్షి వేషం లో ఉన్న పోలిగాడేనని ,వంచకుడు కనుక శిక్ష  వేయాల్సిందేనని నని తీర్పు చెప్పారు .దొర ధర్మమేథితో  పోలిని ఏలుకొంటూ ఇక్కడే కాపురం చేస్తూ ఉండిపోమ్మన్నాడు .ధర్మమేథి తాను తన సహధర్మచారిణి విశాలకు అన్యాయం చేయలేనని ,తనను ఖండఖండాలుగా కోసినా అధర్మాన్ని అంగీకరించనని తెగేసి చెప్పగా దొర అగ్గిమీద గుగ్గిలమై ‘’ఎక్కడో కాలి ‘’అతడు మోసగాడని నమ్మి చీకటి గుహలో వంటరిగా బంధించమని శాసించగా వాళ్ళు ఈడ్చుకు పోయి అలానే బంధించారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-16-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-3

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-3

3-మాయా ఖండం( అనే మలుపుల మెరుపులు )

ఇంతలో చీకట్లు దట్టంగా వ్యాపించగా కస్వమహర్షి మునులవద్దకు రాగా పర్ణాశనుడు ఆయన కాళ్ళపై పడి తాను తాపసస్త్రీలను మాతృ మూర్తులుగా భావిస్తానని ,తానే తప్పూచేయలేదని,తనకు అనవసరంగా శాపమిచ్చారని అంటూ’’పూర్వం శ్రీ రాముడు తన ధనుస్సు కొనను  తెలీకుండా ఒక కప్పుపై ఉంచి మునులతో సంభాషిస్తుంటే  ,దాన్ని గమనించిన ఒక మహర్షి రాముడి దృష్టికి తెస్తే , వింటిని  దూరంగా విసిరేసి కప్పను ఎందుకు అరవలేదని దానిబాద తనకెట్లా తెలుస్తుందని  అడిగితే  అది ‘’ఇతరులు బాధిస్తే రక్షణకోసం నిన్ను ఆశ్రయిస్తాం .ఇప్పుడునువ్వే బాధిస్తుంటే ఇంకెవరికి చెప్పుకోను “?అని ప్రశ్నించింది ..అని చెప్పి సత్వ సంపన్నులైన మహర్షులే తనను బాధిస్తే ఎవ్వరికీ చెప్పుకోగలం  “?అని బావురుమన్నాడు .మహర్షి శిష్యుని ఊరడించి పూర్వ కర్మానుసారం ఇలా వస్తాయి ,బ్రహ్మాదులైన అనుభవించాల్సిందే .తప్పదు .మహర్షులకోపం గడ్డి మంట వంటిది .సత్యం తెలిస్తే ఊరికే ఆరిపోతుంది అని అనునయించి ,విశాలను చూసి ఆమె దీనవదన గా ఉండటానికి కారణమడిగాడు  .ఆమె అమాంతం ఆయన పాదాలపై పడి,కన్నీటితో అభిషేకించి తన గోడు వెళ్ళ బోసుకొంది..ఆయన సంసారులు తప్పు చేస్తే లోకం సహిస్తు౦ది కాని తపస్వులు చేస్తే లోకం నిందిస్తుంది అని ,ధర్మ మేథి తో తాపసులకు కోపం పనికి రాదనీ ,ఉచితానుచితాలు చూడకుండా శాపాలు ఇవ్వరాదనీ ,మనకు కనిపించేవన్నీ నిజాలు కావని హితవు చెప్పాడు .విశాలను జరిగిన విషయం చెప్పమని అడిగాడు .ఆమె చెప్పుతుండగా ఒక వింత జరిగింది .

వానర భల్లూకాలు పర్ణా శనుని  ఈడ్చుకొని వచ్చి మునుల ఎదుట పడేశాయి .అతడు అచ్చగా కస్వ శిష్యుడి పోలికలో ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది .విశాల దుఖం తో వచ్చినవాడేవడో తనకు తెలియదని ,శిష్యుని వేషం లో వచ్చిన రాక్షసుడేమో నని  అనుమానపడింది  .అప్పుడు మాయా పర్ణా శనుడు ‘’ఈ మాయలాడి మాటలు నమ్మకండి .నన్ను రోజూ ఇంటికి పిల్చి ,మునుల ఎదుటే నాశరీరం నిమిరి నన్ను రెచ్చగొట్టి ముగ్గులోకి దించి, తనకామ  తృప్తి తీర్చుకొంటుంది .ఆ రోజు కూడా నన్ను ఏటి వద్ద సిద్ధంగా ఉండమని చెప్పి వచ్చింది .అయినా ముక్కు మూసుకొని ఎప్పుడూ తపస్సు, ధ్యానం, జపం తపం అని మీరు కూర్చుంటే మీ భార్యల తాపం ఎలా తీరుతుంది ?స్త్రీలు శృంగార సౌఖ్యం కోరుకొంటారు .ఈమె భర్త ముసలివాడు .ఈమె లేత తీగ వంటిది .విశాల విషయం మీకందరికీ తెలియటం మంచిదే అయింది. రాత్రి వేళల్లో మీ ఆశ్రమాలలో ఎన్ని శృంగార గాధలు మీకు తెలియ కుండా జరుగుతున్నాయో మీకు తెలియదు .ఆమె  ఆ  రోజు నా పొందు సౌఖ్యానికి వచ్చి ఏదో అలికిడికాగా గుట్టు రట్టు అవుతుందని ఇంత కథ అల్లింది .అందిన ద్రాక్ష పళ్ళను అనుభవించకుండా ఉండే వెర్రి వాడు ఉంటాడా “?అని ఎదురు తిరిగాడు .మునులందరూ అవాక్కయ్యారు .ఈ కట్టు కధకు విశాల నరకబడిన లేత అరటి చెట్టులాగా కుప్పకూలి పోయింది .ఇదంతా కస్వ ముని మౌనంగా చూస్తున్నాడు .ఇద్దరు పర్ణాశనులను చూసి కోపంతో అందులో ఎవరు తన అసలైన శిష్యుడో చెప్పకపోతే బూడిద చేసేస్తానన్నాడు .అసలు శిష్యుడు ఏడుస్తూ ముని పాదాలపై పడి తనకెవ్వరూ అన్నదమ్ములు లేరని చెప్పి మాయావి ని తన రూపం ఎందుకు వేసుకొని వచ్చాడని ప్రశ్నించాడు .దానికి వాడు ‘’నువ్వే నా రూపం ధరించి ఇక్కడ మోసం చేస్తున్నావు ?’అంటూ కత్తి తీసుకొని అతని తల నరకబోయాడు.మాయావి చేతిని మహర్షి  స్తంభింప జేసి  వాడు మాయంకావాలని కమండలం నీటిని చల్లగా వాడు అదృశ్యమయ్యాడు .

ఇంతలో మరో అద్భుతం జరిగింది .ఆశ్రమ నుంచి మరో ధర్మ మేథి ,విశాల చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి అసలు ధర్మ మేథి ని చూపిస్తూ’’ ఈ రంకు ఎంతకాలం నుంచి సాగుతోంది’’? అని కోప౦తో తనరూపాన్ని మక్కికి మక్కి అనుసరించి ఆశ్రమం లో పాపాలు చేస్తున్నాడని ఖడ్గం బయటికి తీయగా కస్వర్షి క్రోధం తో కమండలజలం చేతిలోకి తీసుకోగానే వాడూ అదృశ్యమయ్యాడు .కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న విశాలదగ్గరకు వానర ,భల్లూకాలు వస్తే వాటి విశ్వాసానికి ఒక అరటి గెల ఇస్తే దాన్ని పట్టుకొని రెండూ అడవిలోకి పారిపోయాయి .

విశాల మూలంగా ఆశ్రమ పవిత్రత దెబ్బతిన్నదని మునులు భావించి అ విషయమై తర్జనభర్జన చేస్తుండగా మరో వింత జరిగింది .ఆమెను రక్షించిన కోతి మళ్ళీ వచ్చి ఆమెను బుజ్జగిస్తున్నట్లు నటించి ఆమె చీర కొంగు లాగటం మొదలు పెట్టి చివరకు బలంగా చీరను లాగి పారేస్తే కస్వ ముని తన శాటీని ఆమెకు కప్పాడు .ఇది ఆమెను రక్షించిన కోతికాదు .మాయా పర్ణా శనుడే ఈరూపం లో వచ్చాడు. ఇంతలో అసలైన కోతివచ్చి మాయ కోతి గుండెలపై తన్నగా అది దిమ్మదిరిగి నేలపై పడి పోయింది .కోతీ ఎలుగు బంటీ రక్షించటం ఏమిటి అని కుర్రకారు మునులకు  అనుమానం వచ్చింది . ముసలి మునులు వాళ్ళను వారించి నిజానిజాలు తెలుసుకోకుండా  ని౦దించ రాదని బుద్ధి చెప్పారు .

కస్వముని వార౦దరితో’’ఎవడోరాక్షసుడు  ఈ పన్నాగం పన్నాడు విశాల తప్పు ఏమీ లేదు .ఆమె పరమ పతివ్రత.వాడెవడో ఈ ఆశ్రమపై అకారణంగా క్రోధం పెంచుకొని ఇలా  చేసి  ఉంటాడు .దైవ ప్రేరణ చేత ఆమె ఆసమయం లో నదికి వెళ్ళింది .ఈ దోష పరిహారార్ధం మనమందరం శ్రీ ఆంజనేయ స్వామి ప్రీత్యర్ధం ఒక మహా యజ్ఞం చేద్దాం .అప్పుడు హనుమ దయ మనపై ప్రసరించి ఇకపై ఆపదలు రాకుండా చూస్తాడు ‘’అనగానే మునుల హృదయాలు శాంతించాయి .ధర్మ మేథి పర్ణాశనుడితో ‘’కోపం లో నిన్ను శపించాను .కాని ఆశాపం ఇప్పుడు ఫలించదు .ఎప్పుడో ఒక ఏడాదికాలం మాత్రం నువ్వు నక్రంగా ఉంటావు .దానికీ ఏదో కారణం ఉండే ఉంటుంది ‘’అని ఊరడించాడు .తనవలన నిరపరాధి అయిన అతనికి ఇంతటి శాపం వచ్చినందుకు క్షమించమని కోరింది .వేదనా భారం తో పర్ణా శనుడు కస్వ మహర్షి వెంట ఆశ్రమానికి వెళ్ళగా ఎవరిదారిన వారు వెళ్లి పోయారు .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలా0జ నేయ  స్వామి దేవాలయం లో ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమాలు  

ఉయ్యూరు శ్రీ సువర్చలా0జ నేయ  స్వామి దేవాలయం లో ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమాలు

 ఉయ్యూరు  రావి చెట్టు బజారు లో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో –
1- 21- 7-18 శనివారం -ఉదయం -9 గం .లకు శాకాంబరీ పూజ
2-23-7-18 సోమవారం- తొలి ఏకాదశి సందర్భంగా- సాయంత్రం 6-30గం లకు శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ
   నిర్వహింపబడుతాయి .భక్తులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
                                                          గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

డా. శ్రీ మొవ్వవృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-2

డా. శ్రీ మొవ్వవృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-2

1-నైమిశ ఖండం –

ఒకప్పుడు మహర్షులు సత్యలోకానికి వెళ్లి బ్రహ్మ దేవుని దర్శించి తాము దీర్ఘ సత్రయాగం చేయాలను కొంటున్నామని దానికి అనువైన చోటు ఏదో చెప్పమని కోరగా ,సంకల్ప మాత్రంగా ఒక రధాన్ని సృష్టించి ,అది ఆకాశ౦ లో సంచరిస్తూ రథ చక్రం యొక్క శీల ఎక్కడ జారి పడుతుందో అదే తగిన స్థలం అని చెప్పాడు .రధం వెంట మహర్షులు వెడుతూండగా దాని నేమి అంటే శీల ఒక దట్టమైన అరణ్యప్రాంతం లో పడింది .అదే నైమిశారణ్యం .

మళ్ళీ మహర్షులుమహా విష్ణు సందర్శనం చేసి ఒక దీర్ఘ కాల యజ్ఞం సంకల్పించామని ,తగిన స్థలం తెలుపుమని అడగగా ,తన సుదర్శన చక్రాన్ని వదలి అది యెంత దూరం వెడితే అది అంతా అనువైన ప్రదేశమే అని చెప్పాడు .ఆ చక్రం సంచరించిన ప్రదేశమే నైమి శారణ్యం .మహర్షులు ఇక్కడే 12 ఏళ్ళు యజ్ఞం చేశారు .దీన్ని చూడాలని సూతమహర్షి వచ్చాడు .మహర్షులు ఆయన చుట్టూ చేరి ఆయన వలన సకల పురాణాలు విన్నారు .కాని వారికి తృప్తికలగక కలియుగం లో శ్రీ వేంకటేశ్వర స్వామి ,శ్రీ ఆంజనేయస్వామి భక్తుల కోర్కెలు తీర్చే వారుగా ప్రసిద్ధి చెందారు ,వెంకటేశ్వర గాథలు విని తరించామని, ఇప్పుడు వాయు సుతుని విశేషాలు వినాలని కోరికగా ఉంది కనుక తెలియ జేయమని ‘’ముఖ్యంగా కసాపుర క్షేత్రం లో,నెట్టేకంటి ఆంజనేయ క్షేత్రం మహా మహిమాన్వితం అని విన్నామని  వ్యాసరాయలు నమలిన వేపపుల్ల చిగిర్చిన చోట   స్వామి ఆలయ నిర్మాణం జరిగిందని తెలిసిందని కనుక ఆక్షేత్ర మాహాత్మ్యాన్ని సవివరంగా తెలియ జేయమ’’ని అర్ధించారు . తనకూ ఆ విశేషాలు చెప్పాలని మనసులో ఉందని సూతర్షి చెప్పి ‘’వ్యాసరాయలు తిరుపతి లో తపస్సు చేశారని ,కృష్ణ దేవరాయలకు అక్షరాభ్యాసం చేశారని ,మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి సన్యాస దీక్షనిచ్చారని ,శిల్పగిరి అంటే నేటి చిప్పగిరి ప్రాంతం లో కసాపురం లో సమీర కుమారా లయాలు నిర్మించిన హనుమ భక్తులు . హనుమ మహిమలను వివరించటం మానవ మాత్రులకు అసాధ్యం .అయినా తెలిసి న౦తవరకు వివరిస్తాను .‘’అనీ చెప్పటం ప్రారంభించారు .                          2- శాప ఖండం

కస్వుడు అనే మహర్షి ఒక ఆశ్రమం నిర్మించుకొని  ఘోర అతపస్సు చేస్తుండగా ఎందరెందరో మునులు జనులు ఆయన దగ్గరకు చేరి నివాసమున్నారు .వారికి  ఆశ్రమ ధర్మాలు బోధించి వాటిని కట్టు బాట్లను తప్పక పాటించాలని హితవు చెప్పి వారికి నివాస స్థలం చూపించాడు .దూర దేశాలనుండి వచ్చిన వారికి ఆశ్రమ వాసులు మర్యాదతొ ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసేవారు .గౌతమాది మహర్షులు విచ్చేసినప్పుడు ప్రత్యేక గోస్టులు నిర్వహించేవారు .ఆశ్రమానికి దగ్గరలో దాని చుట్టూ ఒక  జీవనది  ప్రవహిస్తూ ఉండేది .కస్వ మహర్షికి ధర్మ మేథి అనే సకల శాస్త్ర పారంగతుడు శిష్యుడుగా ఉండేవాడు. అతని ధర్మ పత్ని విశాల సకల సద్గుణ రాశి .మహా పతివ్రత.

ఒక రోజు ధర్మ మేథి ఒక క్రతువు చేశాడు. పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు .ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించారు .ఆశ్రమ ధర్మాలను మర్చి పోయారు .మునులు ఏమీ చేయలేక మౌనంగా ఉండి పోయారు .సాయం కాలమైనది .సంధ్యోపాసన  చేసుకోవటాని భర్త ఇంటికి వస్తాడని ,ఇంట్లో నీళ్ళు లేనందున నదికి వెళ్లి నీరు తీసుకు రావటానికి  లోన భయంగా ఉన్నా బయల్దేరింది .చిమ్మ చీకటులు కమ్మేశాయి .ధైర్యంగా ,కర్తవ్య నిర్వహణగా నదికి వెళ్లి పాత్రలో నీరు తీసుకొని ఇంటికి బయల్దేరింది .బాగా లతలు అల్లుకున్న ప్రదేశం వచ్చింది .కాళ్ళు తడబడి  తీగలలో తగుల్కొని కింద పడిపోయింది .ఇంతలో అక్కడ ఒక యువ కాముకుడు వచ్చి ఆమెను పట్టుకో బోయాడు .దిగ్భ్రమ చెంది ఆమె పరిగెత్తింది .వాడు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు .వివస్త్రను చేసే ప్రయత్నం చేస్తుండగా ‘’అన్నా !తాపసభామినిని.చెల్లి వంటిదాన్ని .ఇది తగదు ‘’అని వేడుకొన్నది.హద్దుమీరితే మహర్షుల శాపానికి గురికావాల్సి వస్తుందనీ హెచ్చరించింది .అప్పుడామే  నిశ్చలభక్తితో భగవంతుని ధ్యానించింది .అప్పుడొక మెరుపు మెరవగా వాడి ముఖాన్ని గుర్తు పట్టింది .వాడు కస్వమహర్షికి ఇష్టమైన శిష్యుడు’’  పర్ణాశణుడు ‘’ నిరంతరం ఆయన వెంటే ఉంటాడు ధర్మ శాస్త్రాలన్నీ మహర్షుల వద్ద నేర్చాడు వినయశీలి. అందరికి తలలో నాలుక .అలాంటి సద్గుణ సంపన్నుడు ఇంతటి నీచ కార్యానికి వొడగట్టటం ఆశ్చర్యమేసింది .వాడి వేమీ పట్టించుకోకుండా ఆమెను గాఢంగా బాహువుల్లో బంధించ బోయాడు .ఇంతలోఅనుకోకుండా మబ్బులు మాయమై ఒక కోతి ,ఒక భల్లూకం అక్కడికి వచ్చాయి .వానరం భయంకరంగా గర్జించి  తోక ఎత్తి వాడి చాతీమీద తన్నగా ఇద్దరిమధ్య పోరాటం జరుగుతుండగా ,ఆమె పారిపోతుండగా ఎలుగు బంటి ఆమెకు రక్షణగా    వెంట  నడిచింది .ఆమె ఆశ్రమం చేరి భోరున విలపిస్తూ జరిగినదంతా భర్తకు నివేదించింది .ఆయనకు విపరీతంగా కోపం వచ్చింది .విషయం అంతా చుట్టుప్రక్కల పాకి పోయింది .

ముని పల్లె అంతా ధర్మ మేథి దగ్గరకు చేరి ఓదార్చి ఆశ్రమ స్త్రీలకే రక్షణ కరువైతే మిగిలిన వారి  సంగతేమిటి అని  ప్రశ్నించి మళ్ళీ ఇలాంటివి జరగ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు . ఈ విషయ౦ క్రతు ,పూజాదికాలలో మునిగి పోయిన కస్వమహర్షికి తెలియదు .పర్ణాశనుడు యధావిధిగా గురువు గారికి సకలోపచారాలు చేస్తున్నాడు .ఇతడికీ  ధర్మమేధి ఆశ్రమదగ్గర జరుగుతున్న విషయాలు తెలీవు .తన క్రతువు పూర్తి  అవగానే  పర్ణాశనుడికి యజ్న ప్రసాదం ఇచ్చి , మహర్షులందరికి అందజేసి  రమ్మని పంపాడు .

అమాయకుడైన అతడు ధర్మ మేథి ఆశ్రమానికి వచ్చి ప్రసాదం ఇవ్వబోగా అతడిని అక్కడి వారంతా నానా దుర్భాషలాడి నిందించారు. అతడు తాను నిరపరాధిని అని నెత్తీ నోరూ మొత్తుకున్నాడు .తీవ్ర కోపం తో ధర్మమేథి అతడిని మొసలి గా  మారిపోవాలని శపించాడు .తన తప్పు లేకపోయినా శపించటం దారుణం అంటూ కాళ్ళమీద పడి క్షమించమని అర్ధించాడు .అతనివలన ఆశ్రమం మలిన మై౦దని కాళ్ళు లాగేసుకున్నాడు ధర్మ మేథి .ఈ వింత పరిణామానికి అందరూ  నిశ్చేస్టులై , కస్వ మహర్షికి ఈవిషయం తెలిసి ఉండదని భావించారు.

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -15-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 


 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment