వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -21

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -21

మల్లినాధుని ధనుర్వేద  పాండిత్యం

వ్యాఖ్యానాలలో అక్కడక్కడ మల్లినాధుడు ధనుర్విద్య పై తనకున్న పాండిత్యాన్ని తెలియ జేశాడు .కామ భంగిమను వివరిస్తూ దాన్ని గుర్తింఛి దానికి ఒక సాంకేతిక నామాన్ని పెట్టాడు .విలు కాడు బాణం సంధించేటప్పుడుసాధారణంగా అయిదు రకాల భంగిమలను ప్రదర్శిస్తాడని సూరి చెప్పాడు .కుమార సంభవం లో కాళిదాసు చెప్పిన భంగిమ ‘’ఆలీఢ కామ ‘’భంగిమ అని అప్పడు ధనిష్కుడు పిడికిలి బాగా బిగించి పట్టుకొంటాడని వివరించాడు –

మల్లినాధుని అపార వ్యాకరణ పాండిత్యం

మల్లినాదునికి వ్యాకరణ శాస్త్రం పై అపారమైన పాండిత్యం ఉంది .కవుల ప్రయోగాలను శాస్త్ర రీత్యా నిగ్గు తేల్చి చెప్పాడు .కిరాతార్జునీయం లో ‘’అర్ధ గౌరవం ‘’అనే పదాన్ని ఉపయోగించాడు .పాణిని సూత్రం ప్రకారం నాణ్యతను తెలియ బరచే పదం షష్టీ విభక్తి తో సమ్మేళనం చేయ కూడదు .కానీ మల్లినాధుడు   గుణం లేక వేరొక వస్తువు లేక విషయం సందర్భం లో  సమ్మేళన పద౦గా వాడకూడదని పాణిని సూత్రం నిషేధించిందని చెప్పాడు .కాని గుణాన్ని మాత్రమె చెప్పే సందర్భం లో దానికి నిషేధం లేదని స్పష్టం చేశాడు .మల్లినాధుడు సాధారణం గా ముందు పదాన్ని సమర్ధించి చెప్పి తర్వాత పాణిని సూత్రాన్ని లేక సూత్రాలను  ఉటంకి౦చి ఆ పదాన్ని సమర్ధిస్తాడు .అన్ని వ్యాఖ్యానలలోను ఇదే  విధానాన్ని  సూరి కొనసాగించాడు అని ప్రమోద్ గణేష్ లాల్యే పండితుడు అభిప్రాయ పడ్డాడు .

కిరాతార్జునీయం లో ‘’గత్వరైః’’పదాన్ని-గత్వరైః-గమనశీలైః-అస్తిరే ‘’అంటూ   మల్లినాధుడు వివరించి చెప్పాడు .అందులోనే ‘’దుర్వచనం ‘’అంటే ‘’వక్తు మవశక్యం ‘’అని అర్ధం చెప్పాడు అంటే చెప్పటానికి వీలు కానిది అని అర్ధం .’’నాగాధిపస్య ‘’పదం  షష్టీ విభక్త్యంతం గా శేషుని గూర్చి చెప్పబడిందని సమర్ధించాడు .క్రద్యోగవలన ష స్ట్య౦తం కాలేదని ప్రాధమిక ప్రత్యయం క్రుదంతం వల్ల అయి౦ద న్నాడు .పాణిని చెప్పిన నిషేధం ఇక్కడ పనికి రాదనీ చెప్పాడు .పాణిని సూత్రాలతో వ్యాకరణ విశేషాలను పెక్కింటిని మల్లినాధుడు వివరించాడు .కవిఉపయోగించిన గ పదాన్ని పాణిని సూత్ర సాధన చేత సమర్ధించి చెప్పాడు .ఎక్కడ పాణిని సూత్రం చెప్పాడో చెప్పలేని పరిస్థితి  ఉంది .కొన్ని నమూనాలను చూద్దాం .’’పారితో నికేతాన్ ‘’అనే శిశుపాల వధ లోని   పదం లోని విభక్తి విషయం లో పాణిని సూత్ర వార్తికం’’ అభితః పరితః ఇత్యాదినాద్వితీయా’’  ద్వారా సమర్ధించాడు .’’అవతస్తరే ‘’పదం విషయం లో పరిపూర్ణ కాలం (పెర్ఫెక్ట్ టేన్స్ )లో గుణం మారి పునరావృత్తి అయి ‘’స ‘’లోపిస్తుంది –‘’అవతస్తరే –స్త్రుణాతేః కర్తరి లిట్ –కృతశ్చ  సంయోగాదేర్గుణాః’(పాణిని )లింగ జన్జ్హోర్నలోపశ్చ శర్పువాఃరావయః (పాణిని  ) ఇత్యభ్యాసః సకారలాపశ్చ ‘’ అనే సూత్రాన్ని చెప్పాడు .రఘు వంశం లో లఘు అనేది రఘు గా మారుతుంది అని తెలియ జెప్పటానికి ‘’ఇత్య ప్రత్యయే వాలమూల లఘ్వలమంగుగులీనాం కాలే రత్వ మాపద్యతే ఇతి వైకల్పికె రేఫాదేశే రఘురితి రూపం సిద్ధం ‘’అని వివరించాడు .అలాగే మధు శబ్దానికి పుంలింగ రూపాన్ని –‘’అర్ధస్చ పుమ్సిచః ఇతి పుమ్లింగతా ఉక్తంచ మకరందస్య మద్యస్య మక్షికస్యపి వాచకః అర్ధర్చాది గణే పాఠాత్పుం నపు౦సకయోర్మధుః’’సూత్రం తో తెలియ జేశాడు .సమాసాంత పదం లాగా శిశుపాల వధ లోని ‘’ఆపధ’’పదం ఏర్పాటును దాని నపుంసక లింగాత్వాన్ని మరో సూత్రం తో సమర్ధించాడు –‘’ఆపద –పధోవిభాషాం –ఇతి నిషేధ వికల్పాత్ శ్రుక్పూ ఇత్యాదినా సమాసాంతః ఆపదం నపు౦సకం ఇతి నపు౦సకత్వాత్’’అనే సూత్రం తో సాధించి చెప్పాడు .

కొన్నిపదాల వ్యాకరణ నిర్మాణాన్నివివరించటానికి  మల్లినాధుడు  ఎన్నో సూత్రాలను తెలియ జేశాడు .అవసరమైతే ఒకటికంటే ఎక్కువ సూత్రాలను చెప్పి పదనిర్మాణ రహస్యాన్ని విప్పి చెప్పాడు .కొన్ని అసాధారణ పదాల ఏర్పాటును వివరించటానికి పాణిని సూత్రాలపై తనకున్న పట్టు తో నిరూపించాడు .వీటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకొందాం .

1-‘’విశ్వద్రిచి ‘’పదం విషయం లో చివరి అచ్చు తర్వాత వచ్చే హల్లు   ‘’విశ్వన్ ‘’మరియు’’ దేవ’’లసర్వ నామం అవుతుంది .  , దానిని ఏ ప్రత్యయం ఆశ్రయి౦చనప్పుడు దానికి బదులుగా  ‘’అద్రి ‘’వస్తుంది .పదం అదనంగా ఐ ను గ్రహించి’’ అ ‘’కు లోపం కలుగుతుంది అని చెప్పాడు –‘’విశ్వగ్దేవ యో శ్చ టేరధ్రన్చా తావ ప్రత్యయే ‘’పాణిని-6-3-92  –ఇతి దేరత్రాదేశా ‘’

‘’దారోజతే రూప సంఖ్యానాత్ ఉగితశ్చ’’-పాణిని 4-1-6 ఇతి దీమ్పు ‘’ఆచ’’-పాణిని 6-4-138

‘’ఇత్యకార లోపే ‘’చై ‘’-పాణిని-6-3-138

2-‘’తురసత్ ‘’పదా విర్భావాన్ని వివరిస్తూ పాణిని సూత్రాలను ‘’క్విప్ ‘’ను తొలగించి ర ను దీర్ఘం’’ రా’’చేసే సూత్రం చెప్పాడు –‘’తురాషట్ –‘’సహా తే శ్చోరాది కత్వాత్ క్విప్ –నహి వ్రుత్తీ-త్యాదినా ‘’-నైషధం -3-95

‘’పూర్వ పదస్య దీర్ఘః ప్రకృతి గ్రహేణ ణ౦తస్యాపి గ్రహ పాత్ ముగ్ధ శబ్దస్తు తురా శబ్దం టాబంత మాహ’’

3-మల్లినాధుడు ‘’అక్షి ‘’శబ్దం ‘’అక్ష ‘’గా మారటాన్ని వివరిస్తూ ,రఘు వంశం లోని  ‘’కాతరాక్షి’’లోని  చివరి ‘’ఐ ‘’అ గా మారటానికి రెండు సూత్రాలు పేర్కొన్నాడు –‘’కాతరాక్షీ బహువ్రీహో సవ యక్ష్మోః స్వండాత్షచ్ ఇతి షచ్ –షిద్వేరాదిభిశ్చఇతి దీమ్ష్ ‘’

4-కాళిదాసు ‘’ఘటోద్ని’’పదాన్ని గోవులకు విశేషణంగా  వాడాడు .’’ఉధాస్ ‘’అనేదాని బదులు ‘’అనం ‘’వచ్చి సమ్మేళన పదం బహువ్రీహి సమ్మేళనపదం అవుతుందని చూపించాడు –‘’ఘటా ఇవోదాంసి యాసం తా ఘటోద్రీః’’-ఊఘ సొ నండ్ఇత్య తండా దేశః –బహువ్రీహే రూఢసోడీమ్ష్’’

నైషద చరిత్ర లోని ఒక వాక్యం పై వ్యాఖ్యానిస్తూ సాధ్యమైన అన్ని అర్ధాలను తెలియ జేశాడు .’’హాన్దిక్వి పండితుడు దీన్ని అనువాదం చేసి అందించాడని లాల్యే పండిత ఉవాచ .ఇంద్రుడు శుభాంతంకోసం   నలునిలాగా ,చివరికి అసలైన నలుడిగా మారటం అంతా అతని కపట స్వభావమేనని మల్లినాధుని తీర్పు .-‘’కిం స్తానిషద భావ మదంత దృష్టం తాద్రుక్ కృత వ్యాకరణాః  పునః సః’’(నైషదీయం -10-136).ఇంద్రుని నలుని పాత్ర ధరించినా, నలుని శీల పవిత్రతను వ్యక్తం చేయలేక పోవటానికి కారణం అదే .’’గౌరీ ‘’అంటే తెలుపు అని హరిణి అంటే దుప్పి అని చెప్పి వన సంచారులైన వాటి పేర్ల విషయం లో తానేమీ కల్పించుకోనని చెప్పాడు .-‘’తస్య ఆలూ సంబందినః కార్యస్య హొతోః తదర్ధం దృష్టం నిషిద్ధం సయాని వద్భావం స్యాని వదాదేశోనల విధౌ –(పాణిని )-ఇత్యేనాల్ సంబందికయే శయని వదాదేశస్య నిషేషాది తి భావః కిం కద మదంత ఇతి అహో ఆశ్చర్యం అన్యాచ్చ ‘’

‘’తాద్రుకృత కరణాః తయాకృత   సంస్కారః  స ఇత్యయం శబ్దః స్వస్వకీయం ఆదేశం విదాయేతి ఖండీ విశ్లేషణాః త్యదాధత్వం ప్రాప్యేత్యర్ధః నానలః కార్యస్య హేతోః ఆలూ అక్షిత అలమ్ఘ్యాదిల క్షణస్యాని కార్యార్ధం కిం ఇతి దుస్టమలావిదావితి ప్రతి శేష దనుపంన్నం సయాని వభావ మదంత ?అహో విరుద్దామిత్యర్ధః ‘’లతో సమర్ధించాడు .

న్యాస,న్యాసోద్ధూత ,వామన అనే ప్రసిద్ధ వ్యాకరణ శాస్త్ర వేత్తల రచనలనుండి తన అభిప్రాయాలకు బలం చేకూర్చటానికి మల్లినాధుడు ఉదాహరించాడు .పాణిని సూత్రాలను పేర్కొనటం తో తనపని అయి పోయిందని సంతృప్తి పడకుండా ,ఆ సూత్రాల బలం చాలక పొతే ,తరువాత కాలపు వ్యాకరణ శాస్త్ర వేత్తల అభిప్రాయాలనూ ఉటంకించి తనవాదనకు బలం చేకూర్చుకొన్నాడు.రఘు వంశం లోని ‘’అరిహ ‘’శబ్ద విచారణ చేస్తూ మల్లినాధుడు ‘’అరి హణో రిపుద్రాః హంతేః క్విప్బ్రహ్మ భూణ వృత్రేషు క్విప్ ఇతి నియమస్య ప్రాయిక్త్వాత్ –యయాహ న్యాస్కారః  ప్రాయికశ్చాయం నియమః క్వచిదన్యాస్తి భూప పదేదృశ్యతే మధుహా ప్రాయిక్త్వం చ వశ్య మానశ్చబహుళ గ్రహణ స్య పురస్తాదప ‘’సూత్రాన్ని చెప్పాడు .

మల్లినాధుడు అనేక సంక్లిష్ట పదాలను వామన సూత్రాధారం గా రద్దు చేశాడు .ఉదాహరణకు –‘’అగ్ర పాదః ‘’-దీనిపై వివరిస్తూ సూరి –‘’కర్మ ధారయ సమాసః హస్తాగ్రహ స్తదాయో గుణ గుణినోర్భేదా భేదాభ్యా౦ ఇతి వామనః ‘’అని (కుమార సంభవం7-58)  పేర్కొన్నాడు .’’శరణాభవం’’అనే మేఘ సందేశ 1-45 శ్లోక పదాన్ని వివరిస్తూ ‘’శరవణాభవం’’-‘’అవర్జ్యో బహువ్రీహి ర్వ్యదికరణే జన్మాదుత్తర పద ఇతి వామనః ‘’అంటూ వామనోదహరణ నిచ్చాడు .

ఈ విధంగా మల్లినాధుని వ్యాకరణ పరిజ్ఞానం అవధులు లేనిదని రుజువవుతోంది .

తర్వాత మల్లినాధుని ‘’అలంకార శాస్త్ర విజ్ఞానాన్ని ‘’తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -20- సంగీత నాట్య శాస్త్రాలపై మల్లినాధుని ప్రజ్న

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -20-

సంగీత నాట్య శాస్త్రాలపై మల్లినాధుని ప్రజ్న

సంగీత శాస్త్రం పై మల్లినాదునికి లోతైన అవగాహన ఉన్నట్లు కనిపిస్తుంది .కుమార సంభవం లోని -1-4  శ్లోక వ్యాఖ్యానం లో ‘’తానం ‘’ను చక్కగా నిర్వచించాడు .తానం అనేది ముఖ్య స్వరం(మాస్టర్ టోన్) అని అందులోనుంచే విభిన్న స్వరాలు జనిస్తాయని నిర్వచించాడు .’’తాన ప్రదాయిత్వా నివోపమ౦తుం ‘’అనేదాన్ని వివరిస్తూ మల్లినాధుడు ‘’తానో నామ స్వగంతర ప్రవర్తకో రాజస్యితి ప్రవ్రుత్త యాది హేతురం శాపరణామ వంశ వవాద్య సాధ్యః –ప్రధాన భూతః స్వర విశేషః ‘’అని నిర్వచించి అభినవ గుప్త ,భరతుల వాక్యాల తో సమర్ధించాడు .మరొక సాంకేతిక పదం ‘’మూర్చన ‘’ను కూడా’’’’స్వరానా మారోహక్రమః మూర్చనా ‘’అంటూ గొప్పగా నిర్వచించాడు .- నాటకాలపై నిర్దుష్టంగా చెప్పిన దశ రూపకం లోని కొన్ని పంక్తులను ఉదహరించాడు .అదే శ్లోకం లో ‘’విభ్రమ ‘’కు ఉన్న అర్ధాన్ని దశ రూపకం నుంచి తెలియ జేశాడు .ఇది అదనపు అర్ధం  మాత్రమే-‘’-‘’అప్సరసాం విభ్రమ మండనాని విలాసాలంకరణా ని ‘’-అదవా విభ్రామో విపరీత న్యాసః –‘’విభ్రామత్వ రయా కాలే భూషాస్థానం విపర్యయః ‘’ఇతి దశ రూపకాత్ ‘’.మల్లినాధుడు రాగు వంశం లోని ‘’కరణ ‘’అనే ప్రత్యేక పదానికి అదొక ప్రత్యేక రకమైన ‘’తాడితం ‘’(బీట్ )లేక కాల స్థితి (టైమింగ్ )అని అర్ధం చెప్పాడు .దీన్ని సమర్ధించటానికి పెద్దగాప్రచారం లో లేని ‘’రాజ కందర్ప ‘’లోని –‘’కరణోస్థాలం  వ్యవస్తాపకే స్తానా  విశేషేః –తదుక్తం రాజ కదరా పేణ నృత్య వాదిత్వ గీతానాం ప్రయోగ వశ భేదినాం –సంస్యానం తాడనం రోధేః కారణాని ప్రచక్షతే ‘’శ్లోకాన్ని ఉదాహరించాడు .

శకున , సాముద్రిక  శాస్త్రాలపైనా  మల్లినాధుని అవగాహన

తన వ్యాఖ్యలలో శకున శాస్త్రాన్ని విస్తృతంగా ఉదహరించాడు .దీనినే సాముద్రిక శాస్త్రంగా కూడా పేర్కొన్నాడు .కాళిదాస కావ్యాలలో అనేక నమ్మకాలున్నాయి ఇవే తరువాత కాలం లో బాగా కొనసాగాయి .కొన్ని ఉదాహరణలు చూద్దాం -1- ఆమ్రకూట పర్వతం పై మేఘ౦  ఎందుకు విశ్రాంతి తీసుకొంటుంది ?అంతకు ముందు మేఘానికి మిత్రుడు ఎవరు?దీనికి ‘’నిమిత్తానందన ‘’సమాధానం ఏమిటి అంటే –యాత్రికుడు ప్రయాణకాలం లో సంతోషంగా ఉండాలి కనుక .మొదటి విశ్రాంతి సమయం లో ఆనందంగా ఉంటె ప్రయాణం అంతా సుఖ ప్రదం –దీనికి  సమర్ధన నిమిత్త నిదానం లోని ‘’-ప్రధమావసయే యస్య సౌఖ్యం తస్యాఖిలే హిని –శివం భవతి యాత్రాయాన మన్యదాత్వ శుభం ధృవం ‘’శ్లోకమే చాలు .

మేఘ దూతం లో శరీర భాగాలలో వచ్చే బాధలకు కారణాలను కూడా ‘’నిమిత్త నిదానం’’ ఆధారంగా చెప్పాడు-‘’స్పందానూన్మూర్ధ  . చత్రలాభం లలాటే పట్ట మంశుకం –ఇష్ట ప్రాప్తిం ద్రుశో రూర్ధ్వ మపా౦గే హాని మాది శేత్ ‘’.జ్యోతిషం లో ఉన్న సాముద్రికం నుంచి కొన్ని శ్లోకాలను చెప్పాడు .ఎర్రని కాలి  వేళ్ళున్న స్త్రీ చాలా అందంగా ఉంటుందని ,పాదం ము౦దు భాగాలు ఎత్తుగా ఉండి మడమలు కనపడకుండా ఉన్న స్త్రీలను రాజులు బాగా ఇష్టపడతారని సాముద్రిక శాస్త్రం ఆధారంగా మల్లినాధుడు –‘’అత్ర సాముద్రికా –యస్య రక్త తలో పాదావున్నతాగ్రే తల స్ప్రుశౌ –నిగూఢ గుల్ప్తౌ నిహతౌ సా స్యానృపతి  సమతా’’అనే శ్లోకం ద్వారా  కుమారసంభవ వ్యాఖ్యలో చెప్పాడు –అందమైన పలువరస ఉన్నఅమ్మాయి మరింత అందంగా ఉంటుందని సాముద్రికం ఆధారంగా తెలియ జేశాడు .అందమైన సౌస్టవమైన  ప్రక్కప్రక్కనే వరుసలో ఉండి మధ్యలో ఖాళీలు లేకుండా  చివరలు కోణాలుగా ఉన్నపలువరుస కలిగిన స్త్రీముందు  ప్రపంచం అంతా మోకరిల్లుతుందని సూరి చెప్పాడు—‘’యదుక్తం సాముద్రికే –‘’స్నిగ్ధాః సమాన రూపాః సుపంగత్వం శిఖరిణా శిలస్టాః-దంతా భవంతి యస్యాం తస్మాం పాదే జగత్  సర్వం ‘’.అంతే కాదు తాంబూల సేవనం తో దంతాలకు విపరీతమైన కాంతి లభిస్తుందని మేఘ దూత వ్యాఖ్యలో –‘’తాంబూల రస రక్తోపి స్పుట భాసః సమోదయః-దంతాః శిఖరిణౌ యస్యా దీర్ఘం జీవతి తత్ప్రయః ‘’అనేశ్లోకం ద్వారా  తెలియ జేశాడు మల్లినాద సూరి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

2016 డిసెంబర్ ”తెలుగు వెలుగు ”లో న రచన ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”పై డా .టి .శ్రీరంగ స్వామి సమీక్ష

2016 డిసెంబర్ ”తెలుగు వెలుగు ”లో న రచన ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”పై డా .టి .శ్రీరంగ స్వామి సమీక్షdarshaneeya

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

27-10-16ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టు కింద శ్రీ సత్యనారాయణ వ్రతం ,బంధు మిత్రులతో వన భోజనం –2

27-10-16ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టు కింద శ్రీ సత్యనారాయణ వ్రతం ,బంధు మిత్రులతో వన భోజనం –2వన భోజనం –2

 

వన భోజనం –1

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -19 ఇతిహాస పురాణాలపై మల్లినాధుని పట్టు

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -19

ఇతిహాస పురాణాలపై మల్లినాధుని పట్టు

మల్లినాధ సూరి మహాకావ్యాలు ఇతిహాసాలు అయిన రామాయణ ,మహా భారతాల ,పురాణాల ప్రకరణాలను విస్తృతంగా తన వ్యాఖ్యానాలలో ఉదహరించాడు .గతకాలపు సంఘటనలను కవులు ప్రస్తావిస్తే ,వాటిని  సమర్ధించటానికి  ఇతిహాస పురాణాల విషయాలతో నిగ్గు తేల్చాడు .విశ్వామిత్ర మహర్షి బల అతిబల విద్యలను రామ లక్ష్మణులకు ఇచ్చాడన్న దాన్ని సమర్ది౦చటానికి రామాయణ శ్లోకం –‘’క్షుత్పిసానే న తే రామ భవిష్యేతే నరోత్తమ –బలాతిబలాం చైవ పఠతః పది రాధవ ‘’ఉదాహరించాడు .రఘు వీరచరిత 11 అధ్యాయం 75 వ శ్లోకం పై వ్యాఖ్యానిస్తూ రామాయణం లోని అయిదు శ్లోకాలలు వరుసగా పేర్కొన్నాడు –-‘’తే గావా పర్వతం రామ కైలాసం దాతు మండితం –అగ్ని౦ నియోజన మాసుః పుత్రార్ధం సవా దేవతాః .మహా భారతం నుండి కూడా చాలా శ్లోకాలను ఇంద్రుని ఆయుధ సంపత్తి పై పేర్కొన్నాడు .రఘువీర చరితం 11-42 పై వ్యాఖ్యానిస్తూ మహా భారతం లోని –‘’బాహుం సవజ్రం శక్రస్య క్రుద్దాస్య స్త౦భయతు ప్రభుః’’

మల్లినాధుని పురాణ పాండిత్యానికి ముగ్దులవుతాం .వాటినుంచి విస్తృతంగా ఉదాహరణ లిస్తాడు .కుమార సంభవం 4-41 శ్లోకం పై వ్యాఖ్యానిస్తూ’’ బ్రహ్మ పురాణ౦’’ నుంచి హిమాలయ పర్వత ఉత్పత్తిని ఉటంకి౦చాడు-‘’యజ్ఞార్ధం హి మయా సృస్టో హిమవానచలేశ్వరః .’’శివ పార్వతులు ఒకరికొకరు విడరాని బాంధవ్యం ఉన్నవారని చెప్పటానికి  సాక్ష్యం  గా ‘’వాయు పురాణం ‘’లోని –‘’శబ్ద జాత మశేషం తు ధత్తే శర్వస్య వల్లభా –అర్ధ రూపం యధాఖిలం ధత్తే ముగ్దేందు శేఖరః ‘’శ్లోకాన్ని ఉదాహరించాడు .అలాగే ‘’త్వస్ట’’ సూర్యుని ప్రకాశాన్ని తగ్గించటానికి అతన్ని పదును పెట్టె యంత్రం పై సాన పట్టాడన్న విషయాన్ని’’మార్కండేయ పురాణం ‘’నుంచి  -విశ్వ కర్మాత్వనుజ్ఞాతః శాకదీయే వివస్వతా –భ్రమ మారేష్య తత్తేజః శతనాయోపచకమే ‘’శ్లోకాన్ని చెప్పాడు .ఒక్కొక్క సారి మల్లినాధుడు పురాణ కధలను సూటిగా ఉదాహరించాకుండానే తెలియ జేశాడు .స్కందుని నివాసం’’ దేవ గిరి ‘’అని మాఘ కావ్య వ్యాఖలో చెప్పాడు .

క్రౌంచ పర్వతం బ్రద్దలైన విషయాన్ని సూరి తెలియ జేశాడు కాని అది ఏ పురాణం లో ఉందొ చెప్పలేదు –‘’పురా కిల –‘’భ్రుగు నందనేన స్కంధస్య స్పర్ధయా క్రౌ౦చాశిఖ రిణామతి నిశితా విశిఖ ముఖేన –హేలయా మృత్పిండ భేదం భిత్వా తత్ ఏవ క్రౌంచ కోపాదేవ సాధ్యః మముజ్జ్హ్రుం భితే కస్మిన్నపి యశః  క్షీరనిదౌ నిర్విలమపి జగజ్జాల మాప్లావితి తామితికదా శ్రూయతే ‘’.మరో సందర్భం లో రావణుడు తన తలలో 9 తలలను శివునికి అర్పించడాన్న దానిని శిశుపాల వధ ,ఉత్తరరామ చరిత వ్యాఖ్యలలో పురాణ గాధను తెలియ జెప్పాడు –‘’పురా కిల –రావణః కామ్యే కర్మణి  పశుపతి ప్రాణనాధ నవ శిరస్యగ్నౌ హుత్వా దశ మారంభే సంతుస్టాంతస్మాత్  కైలాసాది పత్యం వప్రే ‘’.మల్లినాధుడు కనీసం రెండు సార్లుశివుని స్థానం లో  బ్రహ్మనియమింప బడినట్లు తెలియ జేసే   పురాణ గాధలను తెలిపాడు కాని యేపురాణంలోనిదో చెప్పలేదు –1-‘’పురా కిల –‘’భగవాన్  దూర్జటిః బాణ ప్రేమ్ణా బాణాభిధానం హరి మభి యుజ్య నిర్జత్ ఇతి పౌరాణిక వదంతి .

2-పురాకిల –‘’భగవాన్ సత్యభామా ప్రీతయే బలాదింద్ర లోకదపహృత్య పారిజాత౦ నిజ గృహ ద్వారే పితావానితి కధానాను సందేయా ‘’

ఈవిధంగా మల్లినాధుని పురాణం గాధలన్నీ కరతలామలకం అని స్పష్ట మౌతోంది .వీటిని గురించి చెప్పేటప్పుడు ‘’పోరాణికం’’అని  ‘’కదా ‘’అనే మాటలు ,లేక వాటికి సమానార్ధమిచ్చే బహుళ ప్రచారం లో ఉన్న పదాలు వాడాడు .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

26-11-16 శనివారం మా ఇంట్లో మా అన్నయ్య గారి మనవడు (కూతురుకొడుకు)రవి ,గాయత్రి దంపతులు ,ముని మనవడు ఛి రేయా౦శ్,మా అన్నయ్య గారబ్బాయి రాంబాబు జయలక్ష్మి దంపతులు

https://plus.google.com/photos/115752370674452071762/albums/6357152859406053825/6357154012607373874

 

26-11-16 శనివారం మా ఇంట్లో మా అన్నయ్య గారి మనవడు (కూతురుకొడుకు)రవి ,గాయత్రి దంపతులు ,ముని మనవడు ఛి రేయా౦శ్,మా అన్నయ్య గారబ్బాయి రాంబాబు జయలక్ష్మి దంపతులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -18 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్యం

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -18

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్యం

విద్యాధరుడు రాసిన ఏకావలి అనే అలంకార శాస్త్రానికి మల్లినాద సూరి’’ తరల ‘’వ్యాఖ్యానం రాశాడని ,అందులో ఎన్నో అలంకార శాస్త్ర విషయాలున్నాయని ముందే తెలుసుకొన్నాం .’’అలంకార సర్వస్వం ‘’లో మల్లినాధుడు ఉదాహరించిన విషయాలను ఇప్పుడు చూద్దాం .శిశుపాల వధ లోని అనేక శ్లోకాల అలంకార విశేషాలను వివరించటానికి అలంకార సర్వస్వం లోని శ్లోకాలను మల్లి నాధుడు పేర్కొన్నాడు –‘’విధాయ వైరం సమయేం నరోరో య ఉదాసతే –ప్రక్షిప్యో దర్ధషం కక్షే రోరతే తేభి భాస్తం’’. ఔదాశీన్యం ‘’,సాయన ‘’అనే మాటలు ఉన్న వాక్యాలు  అననుకూలం గా ఉన్నాయని మల్లినాద భావన .సందర్భాన్ని బట్టి ఆ రెండు వాక్యాలమధ్య సంబంధం  వరుసలో ఉండటం ‘’సాద్రుశ్యాలంకారం ‘’విశేషం అన్నాడు .కనుక ఇది నిదర్శనాలంకారం లో ఒక అంశమే .కనుక ఇక్కడ రెండు స్వతంత్ర వాక్యాలలో ఉన్నందున  అలంకారం దృష్టాంతం కాదని తేల్చాడు .ఇక్కడ బింబ ప్రతిబింబ సామ్యాన్ని గుర్తించాలన్నాడు . .అలాగే మేఘ దూతం 2 వ సర్గ లోని 18 శ్లోకం ,కిరాతార్జునీయం 9 వ సర్గ 15 వ శ్లోకం ,కుమారా సంభవం 1 వ సర్గ 2 వశ్లోకం పై వ్యాఖ్యానిస్తూ అదే విషయాన్ని తెలియ జేశాడు

ఏకావలి లో కొన్ని అలంకారాలు ‘’ఆరోపం ‘’పై ఆధార పడి ఉన్నాయని తెలుస్తుంది .అలంకార సర్వస్వాన్ని ఆధారం గా చేసుకొని మల్లినాధుడు ‘’అరోప ‘’విషయం పై చక్కని చర్చ చేశాడు –‘’అన్యత్రా న్యావాపః ‘’అంటే ఒక దానికి బదులు వేరొక దానిని చెప్పటం లేక ఉంచటం .’’విశేషోక్తి ‘’ని వివరిస్తూ కిరాతార్జునీయ శ్లోకాలను పేర్కొన్నాడు సూరి .ఇక్కడ కూడా అలంకార సర్వస్వ సహాయం తోనే విశేషోక్తిని వివరించాడు .-‘’యదికరణా సవ్యేకార్య సిద్ధిస్తదా విశేషోక్తిః’’అంటే కారణాలు అనేకం ఉన్నా ఫలితం కలగక పోతే ,అది విశేషోక్తి .ఏకావలి వ్యాఖ్య తరలలో  అలంకార సర్వస్వం నుంచి అనేక ఉదాహరణలిచ్చాడు .మరో అలంకారం’’ ఉత్ప్రేక్ష ‘’ను వివరిస్తూ సూరి అలంకార సర్వస్వంలో అధ్యావసాయ  భావనలను  ‘’పరిగణన లోకి తీసుకొని చెప్పాడు .-‘’సాదృశ్య ఏకత్వా ధ్యాసా దదోషః—ఇత్యలంకార సర్వస్వ కారః ‘’అని పేర్కొన్నాడు .ఉత్ప్రేక్ష ను వివరిస్తూ ‘’అధ్యవసాయ ‘’పై తనకున్న భావాలను స్పష్టం చేశాడు –‘’అలంకార సర్వస్వ కారస్తు తేష్వ సాపి  స్వతః సిద్ధత్వాత్ ప్రౌఢోక్తిసద్విష యో రభేదాధ్యసాయః –సంభావన వ్యాప్తి రిత్యాః –అత్ర సాక్షియత్వం తత్ ప్రయోజకత్వా న్నిమితం తత్ర అధ్యావసాయః ఇత్యాదినా సందర్భేణ’’అని ఏకావలి లో పేర్కొన్నాడు .అలంకార సర్వస్వ కర్త అభిప్రాయాన్ని దృష్టికి తెచ్చాడు సూరి .’’ఖండ గస్త వారి నారీషు ‘’అన్న దానిపై వ్యాఖ్యానిస్తూ –అస్య ప్రపంచ స్త్వలంకార సర్వస్వే ద్రస్టవ్యః ‘’ఏకావలి వ్యాఖ్య .

మమ్మటుడు’’భేదా భేద ‘’అలంకార విషయం లోచెప్పిన దాన్ని మల్లినాధుడు విభేదించాడు .అతిశయోక్తికి నాలుగే  నాలుగు భేదాలు చెప్పాడు . మమ్మటుడు ‘’సంబందా సంబంధ ‘’ను ప్రత్త్యేక వర్గం గా భావించాడు .అతిశయోక్తి అలంకారం లో 5 రకాలు ను సమర్ధించాడుసూరి  .అర్ధ శ్లేష శబ్ద శ్లేష ల పై మమ్మటుడి అభిప్రాయాలను అలంకార సర్వస్వం ఆధారంగా చర్చించి ‘’అర్ధ శ్లేష ‘’ను మాత్రమే గుర్తించాడు సూరి .భోజుని ప్రకరణాన్నిఉదాహరించినా దానిపై తాను భేదిస్తున్నానని చెప్పాడు . భోజుడు చెప్పిన ‘’చిత్ర హేతు ‘’ను మల్లినాధుడు  ‘’అసంగతి ‘’అన్నాడు .కారణం మన్మధుని ఆయుధపు దెబ్బఒక చోట పడితే గాయం వేరొక చోట  పడింది కనుక అన్నాడు —త్వదాపాంగసాహ్వయం యదంగతే –ముక్తం తదన్య తరేన చోష్యహం మనసి క్షతః –ఇత్రాన్యత్ర  శస్త్ర పాతో అన్యత్రం  క్షతి రిత్య సంగ గతి రేవేయామిత్యార్ధః ‘’

అనేక ప్రకరణాలను కర్త పేరు చెప్పకుండా మల్లినాధుడు ఉదాహరించాడు .వీటిని సింపుల్ గా ‘’తదుక్తం ‘’అన్నాడని లాల్యే పండితుని పిండితాభిప్రాయం . .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సేద దీర్చి హాయి గూర్చే ఉప్పలధడియం వారి ‘’దక్షిణా నిలం

సేద దీర్చి హాయి గూర్చే ఉప్పలధడియం వారి ‘’దక్షిణా నిలం ‘’

డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర నెట్ ద్వారాపరిచయమైన చెన్నై సాహితీ మిత్రులు .వారివీ వారి నాన్నగారివీ మనవీ పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవటం పోస్ట్ ద్వారా జరుగుతూనే ఉంది.కండ గల తెలుగు పద్యం చెప్పగల దిట్ట .మధ్యాక్కరలలో మక్కువ కూడా తీర్చుకొన్నారు .’తమ ’దక్షిణా నిలం ‘’అనే ఖండ కావ్య సంపుటిని జనని ప్రచురణలు ద్వారా ముద్రించి నాకు 27-7-16 న పంపారు . చూశాను కాని చదవ లేక పోయాను ఇవాళే అది బయట పడగా చదివి ఆనందిస్తూ మీతో ఆ ఆనందాన్ని పంచుకొంటున్నాను .

‘’గాలి వ్రేళులు కదిలి –అలల తీగల సాగి –రాగ ప్రస్తారమై ‘’ప్రపంచం సాగుతోంది అని ఖండ గతి లో ‘’దక్షిణానిలం ‘’కవితలో రాసి భావుకతకు అద్దం పట్టారు .అందులోనే మధ్యాక్కర లో –‘’జీవన మందొక కొన్ని వేళలు చిన్మయత్వంపు –తావలమై ఎన్ని జన్మలకును నైన దక్క కుండెడు మ –హా వైభవోపేతములయి దీపించు ,హ్రాదినీ తుల్య –కేవలానంద  తుందిల నిమేషముల్ క్రేళ్ళుగా చెలగు ‘’అంటూ జీవితం లోని మధుర స్మృతులను హృదయం లో భద్ర పరచుకొన్నారు .ఆయన చదివింది ఆంగ్లమాధ్యమం లో .14 వ ఏట నుంచి తెలుగు పద్యం రాయటం ప్రారంభించారు.హిందీ  భాష లోతులు తరచి రాష్ట్ర భాషా ప్రవీణ అయ్యారు .ఏలెక్ట్రికల్ ,ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మాధ్యమం లో  డిప్లొమా పొంది పి హెచ్ డి కూడా చేశారు .అయినా కవిత్వాన్ని వదిలిపెట్టక శ్రీ పులికంటి కృష్ణా రెడ్డి గారి ప్రోత్సాహమే వెన్ను దన్నుగా తండ్రి గారి మెలకువలతో వేంకటేశ శతకం ,మృత్యు ద్వీపం ,పునరపి ,జనని శతకం ,వెంకటేశ్వర మధ్యాక్కరలు రాసి ప్రచురించిన దీమతి శ్రీ వెంకటేశ్వర.ఇప్పుడీ ఖండకావ్యం .

కవికి వర్షం మాంచి హర్షాన్నిస్తుంది .పులకించి రాస్తారు. బహుశా మద్రాస్ లో ఒకప్పుడు వర్షాభావ పరిస్థితులను చూసి అనుభవించి ఉండటమూ కారణం కావచ్చు .హిందీ కవులు తులసీదాస్ కబీర్ లను ఆపోసన పట్టారు .’’తులసీదళం ‘’పేరిట ‘’తనదు కవిత గొప్పదని ఎంచు ప్రతికవి –కాని పరుల కావ్యగానము విని –సంతసి౦చువారి సంఖ్య ను లెక్కింప –నొక్క చేతి వ్రేళ్ళే ఎక్కువగును ‘’అన్న తులసీ దాసుని రామ చరిత మానస్ లోని పద్యానికి సార్ధకనామధేయం తో అనువదించి పవిత్రత చేకూర్చారు . ‘’తెలుగు వాడను నేనను తలపు విడక –భరత పుత్రుడ ననుమాట మరువకుండ –విశ్వ మానవ శ్రేయమ్ము వెల్లివిరియ –జయ పదమ్మున ఆంధ్రుడా !సాగి పొమ్ము ‘’అని ప్రబోధం కవితలో అంతర్జాతీయతను సాదిచంచ మని కోరారు .తండ్రి శ్రీ ఉప్పలధడియం రామ మూర్తిగారు చిత్తూరు జిల్లా ఏకో పాధ్యాయ పాఠశాల అనుభవాన్ని ‘’విద్యా దీక్ష ‘’లో బంధించి –‘’బడియయ్యు కాన రాద –క్కడ తగు సదుపాయమేమి ,క్రమ శిక్షణ తో-నడచుకొను చాత్రు లు౦డిరి –ఒడి దుడుకుల ధ్యాసలేని ఒజ్జయు నుండెన్ ‘’అని గురు దీక్ష, శిష్య విద్యా దీక్షకు నీరాజనం పట్టారు .

బాలుడు త్రివిక్రముడు అంటూ ‘’వామనుని పోల్కి కనిపించు బాలకుండు –కాని నిక్కమరయ త్రివిక్రముడు గాదె ‘’అన్నారు .మద్రాస్ విశ్వ విద్యాలయం లో నిర్వహించిన 24 గంటల కవి సమ్మేళనం లో ‘’భగ్న హృదయం ‘’కవిత వినిపిస్తూ కవి –‘’కనులు నిరతమ్ము కాల రేఖ పయి నిర్ని –మేషముగ నిల్చు నొక లక్షమిషలు చెప్పి –వ్యవధి లేదను మాట నేపంబొ నిజమొ-పరుగే బ్రతుకైన హృదయమ్ము వ్రయ్యలవదె?అని ఉరుకుల పరుగుల జీవిత పర్యవసానం అంతమే నని హెచ్చరించారు .ప్రముఖ వైయ్యాకరణులు శ్రీ దువ్వూరు వెంకట రమణ శాస్త్రి గారి ఆత్మ కద అందరూ చదవాల్సిన పుస్తకం .హృదయ గతం చేసుకోవాల్సిన గ్రంధమూ కూడా .ఆ పుస్తకాన్ని డా రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు గారు పంపగా చదివి పులకిత హృదయం తో –‘’చిన్ననాటి ముచ్చట్లను చేదుకొన్న –చాలునది యొక కావ్యమై జాలువారు –స్వీయ చరితలు కొన్నింటి చేర్చి చదువ –సంఘ జీవనమెల్ల  సుస్పష్ట మవదె’’అని ఆ పుస్తకాను భూతిని కమ్మని తేటగీతి లో పలికించారు. శాస్త్రి గారి ‘’జానకితో జనా౦తికమ్ ‘’ఎన్నో సార్లు రేడియోలో పునః ప్రసారమై సాహిత్యాభిమానులకు వీనుల విందు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది .

27-8-20 07 హైదరాబాద్ ప్రేలుళ్ళ పై  స్పందిస్తూ –‘’నగర జీవనంపు నరక యాతన నుండి –ఊరడిల్ల నెంచి పౌరుడొకడు –వనము కేగగ పిత్రువన మాయెనది ,కాలు –డెచటి కైన వెంబ డించుగాదె’’అని యముని మహిషపు లోహ ఘంటలు తప్పించుకోలేనివన్న వేదాంతాన్ని పలికారు .దక్షిణానిలానికి ‘’పంచ చామరం’’ వీస్తూ కవి –‘’ఇజాలు పోయి దోపిడీయె ఏక మాత్ర సూత్రమై –బజారు తత్వమే ప్రధాన భావ జాల మాయెరా –నిజాయితీకి చోటు లేని నేటి లోకమందునన్ –ప్రజాధనమ్ము కొల్లగొట్టు వాడె వన్నెకెక్కురా ‘’అని దోపిడీ,  బజారు తత్వమే ప్రాదానమై నిజాయితీ నీఱు గారి పోయిందని ఆవేదన చెందారు .’’చెంచా కవుల గురించి చెబుతూ ఒక్కొక్క వాక్యమే ఒక కావ్యం అని భ్రమిస్తూ భ్రమింప జేస్తూ ,వాడినే ‘’నవ కవి ‘’అని గుగ్గురువులు ప్రోత్సహిస్తూ శిష్య కోటి జాబితాలో చేర్చుకొని సాగే గురు  శిష్య సంబంధాన్ని ఏవ గి౦చుకొన్నారు.’’ఉగాది లక్ష్మి ‘’కవితలో –‘’షడ్రుచులు కల్సి నట్టి పచ్చడిని మెసవ –బ్రతుకు నందలి మంచి సెబ్బరల  నొక్క-రీతిగా గ్రహియించు పరిణతి కలుగు –మన ఉగాది పచ్చడి నెంత మహిమ గలదొ’’అని ఉగాది పచ్చడి ప్రవచించే జీవిత పరమార్ధాన్ని బాగా చెప్పి మెప్పించారు .

‘’వచన కవిత్వం గొప్పతనాన్ని మెచ్చుకు౦టానుకాని పద్యం పనికి రాదు అనేదాన్ని ప్రతిఘటిస్తాను’’అంటాడు  కవి –‘’వచన కవిత లోని వైవిధ్య మెంతయు –శ్లాఘ నీయ మనుచు చాటగలను –పనికి రాదు నేడు పద్య కావ్యంబను –భషణము ను మిగుల  ప్రతిఘటింతు ‘’అని నొక్కి చెప్పారు .కవికి పద్యం నల్లేరుపై బండి .సొగసుగా ,సరళ పదాలతో పద్యం లోనే ఎంతటి గహనమైన భావాన్నైనా చెప్పగల సమర్ధులు .దక్షిణా నిలం ను అందరూ ఆహ్వానించి సేదదీరి హాయి చేకూర్చుకోవాలని కోరుతున్నాను .

డా వెంకటేశ్వర గారు 1-విద్వాన్ సుందర కృష్ణ మాచారి ధర్మ నిధి పురస్కారం 2-నాగ భైరవ స్పూర్తి పురస్కారం 3-ఉగాది విశిష్ట పురస్కారం అందుకున్న సాహితీ మూర్తి .

ఇలా 42 శీర్షికల  తరంగాలుగా ‘’దక్షిణానిలం  ‘’వీచింది .మద్రాస్ మనకు దక్షిణంగా ఉన్నందున అక్కడినుంచి వచ్చిన  కమ్మ తెమ్మెరగా దీన్ని మనం భావించవచ్చు .ఈ కవితా ఖండికల సంపుటిని రమ్య భారతి సంపాదకులు సరసభారతికి ఆప్తులు ,సరసభారతి పుస్తక ప్రచురణ కర్త అయిన శ్రీ చలపాక ప్రకాష్ ఎంతో అందంగా అర్ధ వంతమైన ముఖ చిత్రం తో ప్రచురించారు .అంతే కాదు ‘ ప్రకాష్ గారి ’రమ్య భారతి’’  ఉప్పలధడియం వారి  ‘’జనని’’ సంయుక్తంగా మద్రాస్ లో ‘’తెలుగు భాష కు ప్రాచీన హోదా –తక్షణ కర్తవ్యమ్ ‘’పుస్తకా విష్కరణ సభ జరిపారు కూడా .ఇది చూసిన నాకు సరసభారతి విజయవాడ ,మచిలీపట్నాలలో అక్కడి స్థానిక సంస్థల తోకలిసి కార్య క్రమాలు నిర్వహించిందికదా జనని తో కలిసి ఒక కార్యక్రమం చెన్నై లో చేసి అక్కడి సాహితీ మిత్రుల మధ్య గడిపితే బాగుంటుంది అనిపిస్తోంది .చూద్దాం .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-16-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాక్షి- సంగీత అభిమనులకు తీరని లోటు

28a8d624-1cf1-40a8-86e3-2c78f7284d7f

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-2 గాన గ౦ధర్వ శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ

ఇది విన్నారా ,కన్నారా !-2

గాన గ౦ధర్వ  శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ

-శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ అసలు పేరు మురళీ కృష్ణ .కాని బాల్యం లోనే 9వ ఏట  మొదటి సంగీత కచేరీలు చేయటం తో ‘’బాల’’మురళీ కృష్ణ అని పిలవటం తో అదే స్థిరపడి పోయింది .-బాల్యం లో బాలమురళి విజయ వాడలో చేస్తున్న  సంగీత కచేరీ లో ప్రేక్షక స్థానం లో కూర్చున్న తిరుపతి కవులలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ‘’ఆగు ‘’అని కిందనుంచే అని ,వేదిక నెక్కి ‘’నా వలెనే వృద్దుడవై-నా వలెనే కీర్తి కాంచి –నా వలెనే శ్రీ దేవి పద భక్తుడవై –భూ వలయము తిరుగు మోయి ‘’అని మూడు పద్యాలలో ఆశీర్వదించారు .అది పూర్తిగా ఫలించిందన్న సంగతి మనకు తెలిసిందే ..

-బాలమురళి 12వ ఏట తిరువయ్యూర్ లో సంగీత సద్గురు శ్రీ  త్యాగ రాజ స్వామి వారి ఆరాధనోత్సవం లో కచేరీ చేసి ‘’బాల గ౦ధర్వ ‘’బిరుదు పొందారు .

-‘’చాలా మంది కర్నాటక సంగీత విద్వాంసులు ఒప్పు కోలేని ఒక గొప్ప అంశం ఒకటి ఉంది .అది కర్నాటక సంగీతం కన్నా హిందూ స్థానీ  సంగీతం లో శ్రోతలు ఎక్కువగా రక్తిని అనుభ విస్తారు అన్నది .అయితే  కర్ణాటకలోని ప్రౌఢత్వాన్నిహిందూ స్తానీలోని రక్తిమను జోడించి పాడగల మేటి గాయకుడు శ్రీ బాల మురళీ ఒక్కరే ‘’అన్నారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

-‘’ఆచార్య వీరభ్ద్రయ్యగారికి వీణ అన్నా వీణ విద్వా౦సులన్నా మహాప్రేమాభిమానాలున్నాయి .అందుకే శ్రీ పుదుక్కోటై వీరిని ‘’వీణ ‘’భద్రయ్య అన్నారు .శ్రీ ఎస్ .బాల చందర్ గారిలో ఉండే బరువైన ‘’మీటు ‘’వీరి వాయిద్యం లో కనిపిస్తుంది ‘’అన్నారు వరంగల్ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దుడ్డు సీతారామయ్య .-‘’సాహిత్యం స్పష్టంగా పాడితే లలిత సంగీతమని వెక్కిరిస్తారు .స్వర స్థానం మీద నిలిపి పాడితే హిందూ స్థానీ అని వేళాకోళం చేస్తారు .హిందూ స్తానీని మిక్స్ చేసి  పాడుతున్నాను అంటారు నన్ను .అసలు మిక్స్ చేయటం ఏమిటి ?హిందూ స్థానీ మన పిల్లల్లో ఒక పిల్ల సుమా ‘’అంటారు బాలమురళి .

-‘’దాక్షిణాత్య సంగీతాన్ని కర్నాటక సంగీతం అని యే శాస్త్రం లో ఉంది ?సంగీత రత్నాకరం లో ఉందా ?త్యాగ బ్రహ్మ చెప్పారా ?’’అని ప్రశ్నిస్తారు బాలమురళి .దీనికి వీరభద్రయ్యగారు వివరణ ఇస్తూ ‘’వాగ్గేయకారులైన ముత్తు స్వామి దీక్షితులవారి కీర్తనలలో హిందూ స్థానీ బాణీలు లేవా,ఆ బాణీలలోని రాగాలను వారు తీసుకోలేదా ?స్వాతి తిరుణాల్ రచనలలోను ఈ లక్షణం లేదా అంటూ ‘’వాతాపి గణపతిం భజే ‘’అన్న కీర్తన రచింప బడిన ‘’హంసధ్వని రాగం ‘’హిందూ స్థానీ నుంచే వచ్చిందని ఒక సంగీత మహా మహోపాధ్యాయులు అనలేదా ?అని చెప్పారు .అంతేకాదు దీక్షితులవారి ‘’నీరజాక్షి కామాక్షి ‘’ని పూర్తిగా హిందూ స్థానీ పద్ధతిలో ఒక విద్వాంసుడు పాడగా వీణ పై వాయించగా  తానూ విన్నానని మరి అలాంటప్పుడు బాల మురళిని ఎందుకు తప్పు పడుతున్నారో అర్ధం కావటం లేదని ఆచార్య వీణ(ర )భద్రయ్య అన్నారు .

-‘’మనకున్న మంత్రాల సంఖ్య 7 లక్షలట..అందులో తొంభై తొమ్మిది శాతం మృత మంత్రాలే నట .అంటే జీవన్మంత్రాలు కొన్ని వందలే నన్నమాట .అవతార పురుషులు అవతరించి అనేక మృత మంత్రాలకు ప్రాణం పోస్తారట .అలాగే రాగాలన్నీ ప్రాణప్రదాలు కావు .గాయకుని ప్రతిభా విశేషం వలన నే వాటిల్లో జీవం కలుగుతుంది .ఈ విధంగా బాలమురళి అనేకానేక రాగాలకు నూతన ప్రాణ దానం చేశారు .అంతేకాక72మేళ కర్త రాగాలలోను కీర్తనలను సంగీత యుక్తం గా కట్టి వాగ్గేయ కార చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకొన్నారు బాల మురళి ‘’అని బాలమురళిలోని వైశిస్ట్యాన్ని  ఆవిష్కరించారు ఆచార్య .

-‘’ఆయనను  మహా గాయకునిగానే చూస్తాం కాని ఆయన తనను ‘’వాగ్గేయ కారుని ‘’గా చూడమంటారు బాల మురళి .నిజమే వారు 400దాకా రచనలు చేశారు. వర్ణాలు ,కృతులు జావళీలు తిల్లానాలు రచించారు .బాలమురళి తిల్లానా వంటిది’’ నభూతో న భవిష్యతి’’ .గ్రహ భేదం తో వారొక తిల్లానాలో సాధించిన అందం అంతాఇంతా కాదంటారు ఆచార్యులవారు .ఏ పాఠశాల విద్యా లేకుండా ఎవరివద్దా సంస్కృతాంద్రాలు  నేర్వకుండా శతాధిక కృతులు రాశారు .సంగీతాన్ని మాత్రం త్యాగ రాజ స్వామి ప్రశిష్యులైన శ్రీ పారుపల్లి రామ కృష్ణయ్య పంతులుగారి వద్ద నేర్చారు దట్ ఈజ్ బాలమురళి .సంగీత సాహిత్యాలు రెండూ బాలమురళికి దైవ దత్తాలే .

-త్యాగ బ్రహ్మ నుంచి గురు పరంపరలో  నాలుగవ తరం వారు పారు పల్లివారు .త్యాగయ్య గారి పాఠమే,పారుపల్లి వారు పాడినది దానినే బాలమురళి అనుసరించారు .

-‘’మీరు ముందుగా సాహిత్య రచన చేసి దానికి సంగీతం కూరుస్తారా “”?అని అడిగితే ‘’సాహిత్య ,సంగీత రచనలు రెండూ ఏకకాలం లోనే చేస్తాను .పాట పాడాక అది యే రాగం లో వచ్చిందో చూసుకొంటాను ‘’అన్నారు స్వరబ్రహ్మ బాలమురళి .

-‘’ఏ పర్వీన్ సుల్తానా ‘’లాంటి మధుర గాయనీ మణులో తప్ప ఇతరులు పాడలేని ‘’అతి తార షడ్జమ స్థాయి ‘’ని అలవోకగా అధి రోహించి రాగల నేర్పు బాలమురళీ కృష్ణ గారికి వెన్నతో పెట్టిన విద్య .ఇతర గాయకులు  తార పంచమం చేరటానికే విపరీతంగా రొప్పుతారు ‘’అన్నారు ఆచార్య వీర భద్రయ్యగారు.

-‘’సంప్రదాయమొక బ్లూ ప్రింట్ మాత్రమే .బ్లూప్రింట్ రాగానే ఇల్లు దొరికినట్లు కాదు .అందులో ఎవరూ నివసించ లేరుకదా .బ్లూ ప్రింట్ ప్రకారం ఇల్లు కట్టుకొని అందులో ఉండాలి .కళాకారులు కావటం అంటే అదే .కేవలం సంగీత పుస్తకాలు చదవటం కాదు .సంగీతాన్ని తెలుసుకోవటం వేరు .సంగీతానికి నీవు తెలియటం వేరు .’’అన్నారు పద్మ విభూషణ్ బాలమురళి .

-సాధారణం గా అయిదు స్వరాలైనా లేనిది రాగం విశదం కాదు .కాని బాలమురళి ప్రయోగాత్మకంగా నాలుగు స్వరాలతోనే రాగం సృష్టించారు .లవంగి ,మహతి ,మనోరమ ,ఓంకారి ,ప్రతి మధ్యావతి ,రోహిణి, సర్వశ్రీ  ,సుముఖం సుషమ వంటి కొత్త రాగాలు సృష్టించి ప్రాణం పోశారు .

-గాత్రం తో పాటు బాలమురళి వీణ వయోలిన్ ,వయోలా మృదంగం వాయించటం లోనూ ప్రసిద్ధులు .

-‘’సంగీతసరస్వతిని సంకుచిత పరిధుల లో నుంచి విముక్తం చేసి ‘’భారతీయ సంగీతం ‘’అనే వినూత్న పంధానేర్పరచిన మార్గ దర్శి శ్రీ బాలమురళీ కృష్ణ ‘’అన్న ఆచార్యుల వారి విశ్లేషణ నూటికి వెయ్యి శాత0 య దార్ధం .

ఆధారం –ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య రచించిన ‘’మన గాత్ర ,తంత్రీ వాద్య సంగీతవిద్యానిధులు ‘’గ్రంధం.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-16-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged , | Leave a comment

చిన్నబోయిన శంకర గుప్తం బాలమురళితో రామదాసుకు జీవం

Inline image 1Inline image 1Inline image 1


మూగబోయిన ‘మురళి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), ఆరిలోవ, నవంబర్ 22: ప్రఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసుడు, నటుడు, గాయకుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ ఆకస్మిక మరణం సంగీతాభిమానులను హతాశులను చేసింది. తెలుగు సంగీత ప్రియుల గుండెల్లో చిరస్మరణీయులై ఎన్నో భక్తి గీతాలు, 25వేలకు పైగా కచేరీలు చేసిన బాలమురళి కర్నాటక సంగీతంతో పాటు పలు సినీ గీతాలను ఆలపించారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ బిరుదులతో ఆయన్ను గౌరవించింది. సంగీత కళానిధి బాలమురళికి విశాఖ నగరంతో విడదీయరాని అనుంబధం పెనవేసుకుంది. బాలమురళి సంగీత ప్రపంచాన్ని శాసించే స్థాయిలో విశాఖ నగరంలో పలు కచేరీలు చేశారు. దశాబ్ధాల బాలమురళి సంగీత ఝరికి విశాఖ వాసులు పులకించారు. 1995- 16లో నగరంలోని విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడెమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను స్వర్ణ కిరీటంతో సత్కరించారు. అదే సంస్థ కళా,సాంస్కృతిక రంగంలో విశేష సేవలందించిన వారికి స్వర్ణ కమలం ప్రధానం చేయాలని నిర్ణయించింది. సంస్థ తొలి ప్రయత్నంలో 2002లో బాలమురళిని నాదవిద్యాభారతి బిరుదుతో పాటు స్వర్ణ కమలంతో సత్కరించింది. అనంతరం 2010 జూలై 6న బాలమురళి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పోర్టు కళావాణి ఆడిటోరియంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన తన సంగీత గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. తిరిగి 2015 జూలై 24న లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డుల ద్వారా బాలమురళిని విశాఖ వాసులు ఘనంగా సత్కరించుకున్నారు. అంతకు ముందు 2013లో గీతం కళాశాల వేదికగా జరిగిన ఇండియన్ ఎకనామిక్స్ అసోసియేషన్ జాతీయ సదస్సు సందర్భంగా బాలమురళి గాత్ర కచేరీని ఏర్పాటు చేశారు. తన జీవిత చరమాంకంలో విశాఖ కేంద్రంగా ఉన్న విజయ్ నిర్మాణ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.
దేశం గొప్ప సంగీత విద్వాంసుని కోల్పోయిందని సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతిరావు అభిప్రాయపడ్డారు. బాలమురళితో కలిసి తాను ఆకాశవాణిలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సంగీతంలో ఆయనకు తెలియని గమకాలు లేవని అన్నారు.
ప్రఖ్యాత సంగీత కళాకారుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. దక్షిణాది సంగీతానికి బాలమురళి అందించిన సేవలు ఆయన్ను చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో నిలుపుతాయన్నారు. విశాఖలో ఆయన పలు సంగీత కచేరీల్లో పాల్గొన్నారని అన్నారు.

Inline image 1Inline image 1Inline image 1Inline image 1


Inline image 2

Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -16 మల్లినాధుని రాజకీయ శాస్త్ర పరిజ్ఞానం

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -16

మల్లినాధుని రాజకీయ శాస్త్ర పరిజ్ఞానం

అనేక రాజకీయ శాస్త్ర పండితుల ప్రకరణాల నెన్నిటినో మల్లినాద సూరి ఉదహరించాడు .రాజ్య వ్యవస్థపై కామందకుడు రాసిన వాటిని బాగా పరిశీలించి అవసరమైన చోట రాశాడు. కామందకుని ‘’నీతి సారం ‘’లో రాజు ,రాజ్యం ,రాజ్య పాలన మొదలైన విషయాలపై పై విస్తృత చర్చ ఉన్నది .మహా కావ్య రచయితలు  ముఖ్యంగా కాళిదాసు ,భవ భూతి లు భారతీయ రాజరిక వ్యవస్థలోని విషయాలను ఉదహరించారు .వారు చెప్పిన వాటి నిగ్గు తేల్చటానికే మల్లినాధుడు రాజకీయ శాస్త్రం పై ఉత్కృష్ట గ్రంధమైన’’ నీతి సారాన్ని’’ సహాయంగా తీసుకొన్నాడు .కాళిదాస భావభూతులకు తరువాతి కాలం వాడైన మల్లినాధుడు  ఈ మహా కవులు చెప్పిన రాజకీయ సిద్ధాంతాలు పూర్తిగా సంప్రదాయంగా వస్తున్న ,అందరూ అంగీకరించిన రాజకీయ శాస్త్ర సిద్దా౦తాలేనని రుజువు చేసి చూపించాడు .మహాకావ్య శ్లోకాల పై పూర్తీ రాజకీయ శాస్త్ర పరిజ్ఞానం తోనే వ్యాఖ్యానం రాశాడు .శిశుపాల వధలో 3 కిరాతార్జునీయం లో 4 ,భట్టి లో 1 ,రఘు వంశం లో 26 ,నైషధం లో 2 ,శ్లోకాలపై నీతిసారం ఆధారంగా రాజకీయ శాస్త్ర వ్యాఖ్య చేశాడు .అలాగే రఘు వంశం లో 11 శ్లోకాలకు  కౌటిల్యుని అర్ధ శాస్త్రం లోనుంచీ  ప్రకరణలు ఉదాహరించాడు .కౌటిల్యుడు ,చాణక్యుడు ఒక్కరే అన్నభావనతోనే మల్లినాధుడు ఉదాహరించాడు –‘’క్రియాహి వస్తుపా హితా  ప్రసీదతి’’అన్న రఘు వంశ వాక్యాన్ని వ్యాఖ్యానిస్తూ చాణక్యుడు చెప్పిన –‘’క్రియాహి ద్రవ్యం వినయతి న ద్రవ్యం ‘’తో సమర్ధించాడు  ..బలవంతుని ముందు మోకరిల్లటం ను’’వైటాసుర వ్రుత్తి ‘’అంటారని  ‘’అత్ర చాణక్యః శక్తానాం భూషణం క్షమా ‘’అన్నదానితో రఘు వంశ వ్యాఖ్య లో సమర్ధించాడు .రఘు వంశం లోనే మరో చోట మల్లినాధుడు –‘’అత్ర కౌటిల్యః బలీయసామభి యుక్తో దుర్బలః –సర్వత్రానుప్రణతో వేతసం ధర్మ మాతిస్టేత్ ‘’అన్న దానితో సమర్ధించి చాణక్య కౌతిల్యులు ఒక్కరే అన్నభావన కు బలం చేకూర్చాడు .అలాగే నియోగ ,వికల్ప ,సముచ్చయ శబ్దాల అర్ధాలను వివరించటానికి కౌటిల్యాన్ని వాడుకొన్నాడు-

‘’అత్ర కౌటిల్యః కార్యాణా౦ నియోగ వికల్ప సముచ్చయా భవంతి ‘’—అనేనైవోపాయేనవాన్యే నేతి నియోగః –అనేన  వాన్యేన వేతి వికల్పః-అనేనచేతి సముచ్చయః ‘’

కామందుని నీతి సారం ప్రాచీన రాజ్య వ్యవస్థపై  సాధికారం గా వ్రాయబడిన గ్రంధం కనుక మల్లినాధుడు ఎక్కువగా దీనినే ఉపయోగించుకోన్నాడని లాల్యే పండితుని అభిప్రాయం –‘’అత్ర కామందకః –శుశ్రూష శ్రవణం ధారణం తధా –ఊహాపోహోర్ద విజ్ఞానం చ ధీ గుణాః ఇతి –అన్వీక్షికీ జయీ దండ నీతిశ్చ శాశ్వతీ –ఏతా విదాశ్చ తత్రస్తు లోక సంస్థితి హేతవః ‘’అని మల్లినాద ఉవాచ .

ఇప్పుడు పేర్కొన్నవన్నీ మల్లినాధునికి  రాజకీయ శాస్త్ర౦ లో ఉన్న లోతైన అవగాహనకు గొప్ప ఉదాహరణలే అన్నాడు లాల్యే .

తంత్ర శాస్త్రోపజ్నుడు మల్లినాధుడు

నైషధం లో24 సర్గ 85 వ శ్లోకం  ఒక శ్లోకం అంతా తంత్ర పరిభాషలోనే ఉంది-

‘’ఆవామావా మార్ధే సకల ముభయ కార ఘటనా –ద్విధా భూతం రూపం భగవదిభి దేయం భవతి యత్

తదాంత మంత్రం మే స్మరహర మయం సేందు మమలం –నిరాకారం శస్వజ్జప  నర పతే సిద్ధ్యతు సతే’’

దీనిపై విపులమైన వ్యాఖ్యానం రాస్తూ మల్లినాధుడు నారాయణ వ్యాఖ్యాత రాసిన’’ అర్ధ నారీ నటేశ ‘’రూపం అనేది హ్రీంకార రూపం అని తెలిపాడు అందులోని మంత్రం సరస్వతీ మంత్రమే నని అందులో ‘’కామ రాజ బీజం ‘’నిక్షిప్తమై ఉందని  ఆ మంత్ర అర్ధాన్ని  శివ రూపం,మంద్ర రూపం ,యంత్ర రూపం అనే మూడు దృష్టి కోణాలలో వివరించాడు .ఈ శ్లోకం లో ‘’చింతామణి మంత్రం ‘’-ఓం హ్రీం ఓం ‘’అనే మంత్రం ఉందని ,అందరికి అన్వయించే విధంగా ఉందని వివరించాడు .దీనిపై పూనా లోని దక్కన్ కాలేజి ప్రొఫెసర్ ‘’హాన్దోక్వి ‘’అనే విశ్లేషకుడు ‘’నైషద ఆఫ్ శ్రీ హర్ష ‘’గ్రంధం లో వివరణ నిస్తూ ‘’ఈ విశేషణాలు మంత్రానికి ,భగదభిదేయ రూపానికీ రెండిటికి వర్తిస్తాయి.సరస్వతి మంత్రం ఒక్కో సారి అర్ధ నారీశ్వర రూపం తో గుర్తించటానికి వీలుగా ఉంది .కారణం అందులో మార్మిక రూపం దాగి ఉంది ‘’అన్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గ ప్రసాద్ -22-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-3(చివరి భాగం )

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట  సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-3(చివరి భాగం )

బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గురు వరేణ్యుల ‘’శ్రీ గురు చరిత్ర ‘’కధలో యోగ సంఘటనా సామ్యాన్ని సూచన ప్రాయంగా మేళ్ళచెర్వు వారు ఇలా తెలియ జేశారు –ఇందులో కవి గత విషయక  భక్తి  పూర్వక గురు యోగ విజయ ధ్వని ఉందని చెప్పారు .1-కవి దృష్ట్యా గురువుగారు నివాసమైన చందోలు ‘’ద్వాదశాంతము ‘’.మిగిలినది అంతా అవతార విభూతి ,మళ్ళీ చందోలు రావటం ,అవతారం స్వస్థలాన్ని చేరటం 2-గురు దృష్ట్యా బహిరంగ కధ3 అంతరంగ కధగా గురువొక యోగి ,వారి మార్గం యోగ మార్గం . గుర్రం  పై వెళ్ళటం ఇంద్రియ వ్యాపారం ,ఆసనాది వ్యాయామం గా ,వనం సంసారంగా ,చీకటి అజ్ఞానం గా దొంగలు కామ క్రోదాదులుగా ,శివాలయం మూలాధార విశ్వ లింగం గా ,వస్త్ర ద్రవ్యాపహరణం ఆవరణ భేదం  బ్రహ్మ గ్రంధి చేదనంగా ,ఈల ఓంకారంగా,పరానాదంగా ఇద్దరు దొంగలు ఇడా,పింగళ నాడులు,పుణ్య జ్ఞానం గా ,చెరువు స్వాదిస్టానంగా ,అశ్వ రధము హృదయ౦  గా ,రదికుని విష్ణువు,ఈశ్వరునిగా ,జ్ఞాన బోధ ,వికాసాలు విష్ణు గ్రంధి భేదనంగా ,అనాహత జీవ సంయోగం గా ,ఖడ్గదారి రుద్రునిగా ,గురు విజయము రుద్రగ్రంది భేదనంగా ,చోర త్రయం త్రిమూర్తులుగా ,వర్షము సహస్రార సుధా వర్షంగా ,నక్షత్ర దర్శనం భ్రూమధ్యలో కనిపించే కాంతి చక్రంగా ,చోరగృహం  ఉద్యానవనం రెండూ మస్తక మస్తిష్కములుగా ,కదంబవన చింతామణి గృహాలుగా, నుయ్యి సుధా సముద్రంగా ,చంద్రుడు సహస్రార చంద్రుడుగా ,చోర పత్ని శ్రీ చక్రేశ్వరిగా ,చోరనాధుడు కామేశ్వరుడుగా ,అగ్ని పరీక్ష నిర్వికల్ప సమాధిగా ,విడుదల జీవన్ముక్తిగా ,సుప్రభాతం జ్ఞాన దృష్టిగా ,తిరుగు ప్రయాణం వ్రత్యా వృత్తిగా ,అశ్వ యానం లింగ శరీరం గా ,రైలును వెన్నుగా ,పంచ భౌతిక శరీరం గా భావించి ఈ మహా శ్లేష కావ్యాన్ని రాశానని కవి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తెలియ జేశారు .ఇవన్నీ ఆలోచి౦చు కొంటూ కావ్య ప్రవేశం చేసిన వారికి గురు కటాక్షం తో పాటు శ్రీ లలితా పరాభాట్టారిక అనుగ్రహ౦ తో  మోక్ష ప్రాప్తి లభిస్తుంది అని ఫల శ్రుతి గా భావించాలి .

తరువాత ‘’సువర్ణ మంత్రం పుష్పం ‘’ను గురు దేవులకు సమర్పించారు కవి .-‘’అఖండ నారాయణ భావ మంతర్బహి ర్దరీ దర్శిత మః పశ్యన్ –నారాయణోస్మీతి  కృతార్ధనామా గురుర్విముక్తౌ చరమాహి వృత్తిః’’’

గురువుగారు 10-12-19 90 రాత్రి 12-40 గం లకు మహా నిర్యాణం చెందారు .వారి చితి జ్వాలలో  ఇద్దరు స్త్రీ మూర్తులు  కనిపించినట్లు ఫోటోతో సహా ఆంద్ర ప్రభ దిన పత్రికఆదివారం సంచికలో  8-9-1991 న ముద్రితమైంది.ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్య పోయారు .గురువుగారిపై జగదంబకు గల అనుగ్రహానికి ఇది గొప్ప ఉదాహరణ .సాధకులకు జిజ్ఞాసులకు అదొక గొప్ప తార్కాణ అన్నారు కవి –దీన్ని శ్లోకం లో బంధించి చెప్పారు –

‘’చాయా గ్రాహక యంత్ర చిత్ర ఫలకే చిత్యగ్ని ధూమ చ్చటా-మధ్యే స్తోరుణ  పాండు రా౦బరదరే   దేవ్యౌ గురో రంతికే ‘’

‘’క్రుత్వాత్మ జీవిత నిదర్శన దర్శనేన –నిశ్చ ప్రచం భువి సనాతన సంప్రదాయం

బ్రాహ్మీ భవన్నపి  మహా గురు రంబికేద్వే-ప్రత్యక్షయన్ ద్రఢ యతిస్మ జగద్ధితాయ .’

చితిస్తత్పద లక్షార్దా ,తస్య ప్రాణా ఇహైవ లీయతే ,శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్యః,తస్మై గురవేనమః ,’’త్వమేవ మే వృణిష్వ’’య౦ త్వం మనుష్యాయ హితత మం మన్యతే ,నారాయణా యేతి సమర్పయామి ‘’అంటూ గురు విష్ణు రూపుని స్మరించి ‘’శ్రీ రాఘవాయ విద్మహే నారాయణాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ ‘’అంటూ వందనం చేశారు కవి .

11 వ సర్గ లో గురూప దేశం లో –‘’సర్వం ప్రపంచం భగవత్స్వరూపం సందర్శయన్ సంసది విశ్వ రూపః –కృష్ణో మహాత్మా ధృత రాష్ట్ర మందం సంస్కర్తు కామోపి భభూవ నాలం ‘’అని పరమాత్మ తత్వాన్ని బోధించారు .జడ భరత వృత్తాంతాన్ని బోధిస్తూ –‘’జడ భారత ఇవ మన్యసే జీవజాలం –యది నిజకర సేవా వర్ధితం పౌరుషేణ-జనన మరణ బంధే పీద్యతే జ్ఞావా౦ తశ్ఛేత్ –జడ భరత ఇవ త్వం మోక్షసే జీవ జాలాత్ ‘’.అవసరమైన చోట్ల ‘’కవి వ్యాఖ్యా ‘’అని కొన్ని శ్లోకాలు రాశారు .

గురువు గారు తమ పరదేవతా సేవను తెలియ జేస్తూ –‘’సత్యం బ్రవీమి మనయేవ సమీర లీనం –కిం మేమనోరధయితి ప్రకృతే వదామి –నిత్యం జపామి పర దైవత మేవ తత్త్వం –కృత్యం కురుష్వ యదితేవిధి రేష దిస్టః’’

‘’సుత రసిత రసాం తామగ్ని వర్ణాంజ్వలంతీం –పరమ శివ సభాగాం కర్మజానంద కందాం –సకల భువన మూలా మాస్ట సిధ్యం శు జాలాం-అఖిల గురు మనీషా మాది శక్తిం దదర్శ ‘’

నిశ్చల సమాధి గతులైన గురుబ్రహ్మ ఎలా ఉన్నారు అంటే –‘’సుధా బిందు స్యందీసకల నల చక్రా హిత రుచిః-ప్రభా సారం చక్రే విమల నభసః స్పంద రహితః –సమాధౌ నిర్మగ్నౌః పిహిత నయనా హంస మునయః –నిలీనాః పద్మా౦కే స్ఖలిత మిధునా భ్రాంతి రహితాః’’అన్నట్లున్నారు .

‘’హ్రీ౦కారోంకార సామ్యం స్వర శిఖర గతం ఝం కృతౌ దర్శయంతీ-పీయూషానంద లోభాదను సృత కుసుమా భ్రామరీ లోక బంధోః-కామ్యంతీ కాంతి పూరం కవి హృదయ హారం ఖే నిరాలంబ మార్గే –వాతా ధారా నుయా౦తీ  శ్రుతి శిఖర రతా తీర్ధ మిత్రం బభూవ ‘’

గురువు గారిని ఎంత వర్ణించినా కవి గారికి తనివి తీరదు .వారి అమ్మవారి పదార్చనాలీనత తనివి తీరా వర్ణించారు .

‘’జ్యోత్సా స్పురత్సలిలబుద్బుద బింబి తాత్మ-చిత్రం తరంగ తతి కంపిత సర్వ గాత్రం –దృష్ట్వా చ నిశ్చల నిజస్థితి మారయ పాదః –జజ్ఞే శరీర పరమేశ్వర జీవ తత్త్వం .

16 వసర్గలో గురు పునః పురాగమనం  స్వాగత సత్కారాలు వర్ణించారు .17 వసర్గలో  లలితా పరా భట్టారికా స్తవం రాశారు –‘’అయి జగదీశ్వరి శంకర సుందరి భక్త మనశ్చరి పాహి పరే –అవనత పావని భావక శోధిని పాప విపాటిని పాహి శివే –జనశివ కారిణి సంభ్రుత వారుణి దానవమారిణి ధర్మ రతే-జయజయహే కరుణా రసవాహిని విశ్వ విమోహిని విష్ణు కరే ‘’అనే శ్లోకాన్ని ‘’అయిగిరి నందిని నందిత మోదిని ‘’ధోరణి లో రాశారు .మొత్తం 33 శోకాలలో అమ్మవారి స్తుతి ఉంది .మరొకటి చూద్దాం –

‘’సంచారః పదయో ర్మహేశ్వరి భవత్సంకల్ప సంపాదితః –కాంతా రేత్ర భవే త్ప్రదక్షిణ విధిః వాగీశ్వరీ స్వస్తితే –కామంస్యా మమ సర్వ వాక్య రచనా సి౦హాసనాదీశ్వరి –స్తోత్రం తే పరమేశ్వరి ప్రభావతా త్సర్వం తవారాధనం ‘’అని శివానందలహరిలో భగవత్పాదులు చివరి శ్లోకాలలో చెప్పినట్లు చెప్పారు .

18 వ సర్గలో అగ్ని పరీక్ష ఉంది .పరస్త్రీ తనను స్పర్శించటం ధర్మ యుక్తం కాదని అందుకు జగజ్జనని ని క్షమాపణ కోరారు .19 లో సూత్రధార సాక్షాత్కారం ,రహస్య ప్రకాశం,జీవన్ముక్తి ,రామప్రసాద్ ఆస్థానానికి వెళ్ళటం సన్మానం  ఉన్నాయి .

చివరిదైన 20 వ సర్గ లో కవి వ్యాఖ్య ,సుప్రభాతం ,కోశానుగ్రహం ,పాఠకాహ్వానంతో కావ్యాన్ని ముగించారు –చివర్లో రాసిన మరో రెండు గురు ధ్యాన శ్లోకాల రుచి చూద్దాం-

‘’హరిహర సమాహారం దేవం మహా శబరీ నగే –పరమ శిఖరే సోపానాంతే విలోక్యచ భైరవం –తడనుమకర జ్యొతిః కాంతిం మహా పురుషో యదా –ఉషసి గురు రాస్యాదిత్య స్య ప్రభా మయోఖైః-‘’

‘’ముక్తా విద్రుమ హేమనీల ధవళ చ్చాయై స్సహస్రామ్శుభిః-జిత్వానంత గతం తమోంతర బహిర్వ్యాప్త౦ జ్వలంతం దివి –సూర్యం వీక్ష్య గురుః ప్రపంచ మఖిలం తద్భావితం భావయన్ –సత్యం తస్య రజో హిరణ్మయ రధం దధ్యౌ మనో నీరజే ‘’

‘’న్యూనం యదత్ర ప్రతిభావ లేపాత్ ప్రజ్ఞా పరాధాచ్చ శిశు ప్రకృత్యా –పూర్ణం భవేత్ శ్రీ గురు పాద నామ స్మృతేః క్షమైవ స్కలితం క్షమేత ‘’అని వినయంగా సర్వ శాస్త్ర సాహిత్య మేలి చెరువు శ్రీ మేళ్ళచెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు  క్షమాపణ స్తోత్రం చెప్పుకొన్నారు .

నేను కూడా నా మిడి మిడి జ్ఞానంతో మహా పండిత శాస్త్రకవి శ్రీ మేళ్ళచెర్వు వారి కవిత్వ శోభను చెప్పే ప్రయత్నం చేశాను .దీన్ని పండితులద్వారా తెలుసుకొని వింటే పరమాన౦దమే లభిస్తుంది .మొదట్లోనే చెప్పినట్లు సమర్ధులు ఎవరైనా దీన్ని పూర్తీ అర్ధ తాత్పర్య భావాలతో విశేషాలతో రాసి లోకోపకారం చేయవలసిందిగా మరో సారి కోరుతున్నాను .

కావ్యమంతా గురు భక్తి ప్రవాహమే .కవిత్వం  పీయూష లహరి . ఎంతో తేలిక పదాలతో ,ధారా శుద్ధి సందర్భ శుద్ధి తో రచన సాగింది .శ్రీ గురు చరిత౦ ను శిష్య శ్రీ శాస్త్రిగారు కవితాక్షర సువర్ణాలతో శోభ కూర్చారు .దీన్ని రాసిన శ్రీ శాస్త్రిగారికీ  నాకు అందించి చదివింప జేసి రాయించిన శ్రీ తూము లూరు వారికి శతాధిక కృతజ్ఞతలు .ధన్యోస్మి .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-16 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-2

raghava-narayana-sastri-dampatuluగీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట  సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-2

శ్రీ గురుచరితం  సంస్కృత శ్లేష మహాకావ్యం లో శ్రీ మేళ్ళచెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ‘’ఆత్మ నివేదనం ‘’శీర్షికలో ఈ కావ్య నేపధ్యాన్ని, తన రచనా ప్రణాళికను శ్లేష తత్వాన్ని వివరించారు .బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి శిష్యుడు శ్రీ గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి గురువుగారి జీవితంపై ‘’అగ్ని పరీక్ష ‘’అనే చిన్న నవల రాశారు .ఇది సెకండరీ స్థాయిలో ఉపవాచకం గా ఉన్నది .ఈ నవలికను ఆధారం గా చేసుకొని తాను మహా కావ్యంగా శ్లేషను జోడించి రాశానని తెలియ జేశారు .అయితే దీన్ని ఒక మామూలు కధగా కాకుండా అవకాశాన్ని బట్టి భక్తీ జ్ఞానం ,యోగాలను ఈ కావ్య పుష్పానికి కేసర త్రయం గా అమర్చి తన భక్తిని సౌరభం చేసి రచించానన్నారు .ఈ విధంగా తన కావ్యం లో మూడు రకాల ధ్వనులను సరళ వైఖరిగా పాటించానని .వీలుని బట్టి లలితా  సహస్ర నామావళి ని ,ఉపనిషన్మకరందం పైన విశ్రమించేట్లు చేశానని ,అందువల్ల అది శ్రీ గురు చరితమై పాఠక జనాలకు ధన్యత చేకూరుతుందని భావించి నట్లు చెప్పుకొన్నారు .

అంతా గురు చరిత్రమేకనుక వర్ణనలకు అవకాశం తక్కువని ,నాయిక అయినా ,నాయకుడు అయినా శ్రీ గురువు మాత్రమేనని ,చరిత్ర అంతా మౌనమే నని ,కధాకాలం కేవలం 12 గంటలు మాత్రమేనని ,అదికూడా అంధకారం నిశీధ సమయం అని ,అయినా గురు కటాక్షం తో ముందుకు సాగి పోయానని చెప్పారు .ఇది ఎలా ఉందీ అంటే –‘’పాషాణాది పీయూషం స్య౦దతే యస్య లీలయా ‘’గా ఉందట .

కేసరాలను బట్టి ఈ కావ్యం గురువుగారు రాసిన ‘’దత్తాత్రయాష్టక గర్భిత ఆత్మ సుప్రభాతం ‘’ తో పాటు ‘’మత్స్వప్నః ‘’అనే గ్రంధాలకు పూజా పుష్పం అని చెప్పారు .అందులోనూ ముఖ్యంగా –

‘’సావత్పరో రజసి తత్సవితుర్వరేణ్యం –దేవస్య ధీమహి మహోమతి చోదకస్య –గాయత్ర మర్ధ మితి భావయతో దురంతా –సా౦తానిశా ప్రవిరలా మమ సుప్రభాత౦ ‘’అనే శ్రీ గురువుగారి సుప్రభాత శ్లోకమే ఈ కృతికి జీవ గర్ర అని గర్వంగా చెప్పుకొన్నారు .తరువాత కావ్యం అందరికీ అర్ధం కావటం కోసం అందులోని కధను సూక్ష్మగా తెలియ జేశారు .

నిశిరాత్రి చీకటి కధ

తండ్రిగారు శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు ప్రారంభించిన రచన ‘’శ్రీరామ కధామృతం’’ఆయన మరణం తో ఆగిపోతే కుమారుడు శ్రీ రాఘవ నారాయణ  శాస్త్రి గారు పూర్తీ చేయ ప్రారంభించి పూర్తీ చేసి ,అధీతి బోదా చరణ ప్రచారణ చతుర్దశీ కృత వేద విద్యా స్వరూపులై ,’’బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ‘’అనే మాటకు సార్ధకత్వం చేకూర్చిన గురు వరేణ్యుల జీవితం లో ఇదొక ఘట్టం మాత్రమే.రామ ప్రసాద్ అనే ఒక సంస్థానాధీశుని సన్మానం అందుకోవటానికి నరసింగ పురం బయల్దేరారు గురువు గారు .భీమవరం చేరే సరికే ప్రొద్దు గూకింది .చివరి బస్సు వెళ్లి పోగా ముందు ప్రయాణానికి ఆటంకం కలిగింది . ఏమి చేయాలో పాలుపోని సందిగ్ధ స్థితి .ఇంతలో ఒక అపరిచిత వ్యక్తీ గుర్రం బండి సిద్ధంగా ఉందని చెప్పి ,నడిపించి పోలి మేర దాటించి ఒక అడవిలో వదిలేసి అదృశ్యమైపోయాడు .ఇంతలో కొందరు దొంగలు గురువుగారిని ముట్టడించి ,వారి చేతనే వారి వస్త్రాలను ,ఆభరణాలను ఒలిపించి మూట కట్టించారు .ఒక్క అంగ వస్త్రంతో మాత్రమే ఉన్న గురువుగారి దగ్గరకు ఇద్దరు దొంగలు వచ్చి ,వాగు దాటించి ,మార్గ మాధ్యమం లో వదిలేసి వెళ్ళిపోయారు .ఆ కారు చీకట్లోనే కాలి  నడకన దొరికిన దోవ పట్టుకొని సాగిపోతున్న గురువు గారిని ఒక వ్యక్తీ కలిసి తన బండిలో ఎక్కించుకొని ,క్రమంగా మాటల్లోకి దించి అనేక విషయాలు చర్చించాడు .గురువుగారి వేదాంత ధోరణి ,అసంగత్వ భావం ,,తెగింపు గమనించి వారిని ఒకమర్రి చెట్టు దగ్గర వదిలి మౌనంగా వెళ్లి పోయాడు .అక్కడే గురువు గారు కాసేపు ఆగి ఉండగా ,ఒక భీకరాకారుడు కాపాలికుని లాగా నటించి ,ఆయనను బలి అవటానికి సిద్ధంగా ఉండమని చేతి లోని పట్టా కత్తిని ఝళిపించాడు .బలి అవటానికి సిద్ధమైన గురువుగారు ధ్యాన నిమగ్నమయ్యారు .అప్పుడు వాడు ‘’మా దేవి  వద్దు అంటోంది ‘’అని చెప్పి ,వధ ప్రయత్నం మానుకొని వెళ్ళిపోయాడు గత్యంతరం  లేక గురువుగారు ఒక కంకర రోడ్డు పట్టుకొని, ఉన్న ఒకే ఒక అంగోస్త్రం తో ప్రయాణం సాగించారు .కొంత దూరం నడిచి పోగా వారికి ఒక దివ్య భవనం కనిపించింది .ఆ ఇంటి దగ్గరున్న బావి వద్ద స్నానం చేసి ,దైవ స్మరణ చేసి ,దప్పిక తీర్చుకొని ,మళ్ళీ ప్రయాణం సాగించే ప్రయత్నం లో ఉండగా ,ఒక ప్రక్కగా తులసికోట దగ్గర పూజ చేస్తున్న ‘’స్త్రీ ‘’కనిపించింది .ఆమె వారిని ఆహ్వానించి నూతన వస్త్రాలు సమర్పించి ,అతిధి సత్కారాలు చేసి ,గురువుగారి చేత ‘’భద్రాయురుపాఖ్యానం ‘’పురాణం చెప్పించుకొని ,శ్రద్ధగా విన్నది .తర్వాత వారిని తన అభ్యంతర మందిరానికి గౌరవం గా తీసుకొని వెళ్లి ,ఒక కుర్చీలో కూర్చో పెట్టింది .గురువు గారు కనులు మూసి ధ్యాన నిద్రలోకి జారిపోగా ,ఆమె హఠాత్తుగా వారి వామాంకం పై ఆశీనురాలైంది.ఈ హఠాత్ సంఘటనకు గురువు గారు భయపడక ,చిత్త స్వాధీనం లో ఉండి ,సహజ యోగికనుక ,ప్రాణ లయం చేసి ,నిర్వి కల్ప సమాధి లోకి వెళ్లి పోయారు .వెంటనే గురువుగారి శ్వాస ఆగి పోయింది .ఆయన పరిస్థితి చూసి నివ్వెర పోయిన ఆ స్త్రీ ,కిందికి దిగి ,నిలుచుని విసన కర్రతో విసరటం ప్రారంభించింది .కొంత సేపటికి గురువుగారు మామూలు స్థితి లోకి వచ్చారు .ఇంతలో వారి వెనక ఉన్న తెరల లో నుంచి నలుగురు మనుషులు వచ్చి క్షమాపణ వేడుకొన్నారు .రాత్రి అంతా గురువుగారిని పరీక్షించింది వీళ్ళే .పరీక్షించటానికి  కారణం యేమని అడిగితే  వాళ్ళేమి చెప్పారంటే  మొదటి దొంగ వారితో అడవిలో నడిచినప్పుడు వాడి శరీరం అంతా నిప్పులు పోసినట్లు మండి పోయిందని ,అందుకే గురువుగార్ని ముట్టుకోవటానికే భయపడి ఆయన వస్త్రాలు ఆభరణాలను ఆయనతోనే ఒలిపించి మూట కట్టించాడని ,దీనివలన గురువుగారి మహిమ ఎలాంటిదో వాడికి తెలిసిందని అందుకే అందరూ రాత్రి అంతా శ్రీ వారిని పరీక్ష చేశారని చెప్పుకున్నారు .విన్న గురువుగారు ‘’ఇది ఆ త్రిపుర సుందరీ దేవి పరీక్షయే ‘’అని నమ్మి ,వాళ్ళను శాంత పరచి ,తెల్లవారిన తర్వాత తిరుగు ప్రయాణం చేశారు .ఈ కొత్త భక్తులు ఇక పై నుండి దొంగతనాలు చేయం అని ప్రతిజ్ఞ చేశారు .రాత్రి తాము దొంగిలించిన వస్తువులతో పాటు తమ వంతు కానుకలనూ గురువుగారికి సమర్పించి  వీడ్కోలు చెప్పారు .

ఈ కధలో నిక్షిప్తమై ఉన్న యోగ సంఘటనా సామ్యాన్ని సూచన ప్రాయంగా తర్వాత మేళ్ళచెర్వు వారు తెలియ జేశారు .ఆ విషయాలు తరువాత గ్రహిద్దాం .

బ్రహ్మశ్రీ రాఘవ నారాయణ శాస్త్రి దంపతులఫోటో జత చేశాను చూడండి

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-1

 

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట  సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-1

. ఒంగోలు మండలం ఉప్పు గుండూరు గ్రామవాసి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ జగన్నాధ శాస్స్త్రి శ్రీమతి మహా లక్ష్మమ్మ లకు జన్మించారు .భారద్వాజ గోత్రం .అనన్య సాధారణ పండితులు .చందవోలు శాస్త్రిగారిన బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్ద సంస్క్రుతకావ్యాలంకార ,వ్యాకరణ శాస్త్రాదులు నేర్చారు .తెనాలి సంస్క్రుతకాలేజిలో విద్యా ప్రవీణ అయ్యారు .సంస్క్రుతాధ్యాపకులయ్యారు .ఆంద్ర సంస్కృతాలలోఎం. ఏ .పొందారు .సంస్కృతం లో బహు గ్రంధాలు రాశారు ‘.శ్రీ గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు రాఘవ నారాయణ శాస్త్రి గారి పై ‘’అగ్ని పరీక్ష ‘’అనే చిన్న నవల రాస్తే అది ఉపవాచకం గా సెకండరీ స్థాయిలో బోధింప బడింది .దీన్ని ఆధారంగా శాస్త్రి గారి జీవితాన్ని ఒక యోగి చరిత్రగా భక్తీ జ్ఞాన యోగాలనుచేర్చి సంస్కృత మహా శ్లేష కావ్యంగా ‘’శ్రీ గురు చరితం ‘’లో శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ని గురించి సమగ్రంగా రాశారు .’’శ్రీ దేవీ మానసానంద హేతవే ధర్మ సేతవే –గుర్వే శిష్య లోకస్య నమోవాకం ప్రశాస్మహే ‘’అని గురు కీర్తన చేశారు .’’భావనా బృందావనం ‘’కావ్యం లో ముక్తక శ్లోకాలు రాశారు .’’సాలభంజికా సూత్ర దారం ‘’’’లాలితానంద లహరి, స్తన్య ధారా స్తవం ;;రచించారు .ఇందులో ఒక శ్లోకం –‘’హే నిత్య ప్రసావిత్రీ తే స్తన  యుగం ధారా ధారా హ్రీకరం-క్లీం మధ్యాక్రుతి మాత్రుగాదర గృహీత స్వాదితం భావయే –శ్రీ పీయూష ముపాస్య యస్య కవయ స్వెం బీజ వాజీ కృతా –అన్నాముత్ర జయంతి హన్తః –సుమనస్యో రాజ్య రారాజితాః’’

‘’వేదనాద స్తవం ‘’లో ‘’శరీరే యూపా గహనా కశేరుకా –విజ్ఞాన సంబందా మనసే మే జడస్య –ఆలస్య కచిద్ గోపికా  హంత సుప్తా –నూనం కించిత్ స్ప్రుశతీ వాద్వ యోక్త్రం ‘’అన్నారు .

వేదనా నివేదనం ‘’కావ్యం లో శిఖరిణీ శార్దూల విక్రేడి తాలలో కవనాన్ని కధనం తొక్కించారు .-‘’కిం దుఃఖం కిం సుఖం కిం శుభమితి మానసా వర్తమానాతీతం-నిస్చేతుం పంగ గుబుద్ధిః  -సతతామిద మా విశ్వాసజే ధ్నేయ్యమానః ‘’

ఇవికాక ‘’పరి ప్రశ్న మంజరి ‘’,లింగ దర్శనం ,కర్మ  వాద నిర్మధనం’’,దయా దారిద్ర్యం ,పరాకాయ ప్రవేశ స్తోత్రం ,తత్వ మంజరి ,నమశ్శివాయ ,బిన్డుమాలినీ స్తవం,రఘు కౌత్సం ,నిరపంనప ద్వాదశి ,శివ దోష స్తుతి ,అన్గాగార క్రుష్ణాగారః మొద లైనవి రాశారు.

ఒక్కసారి మేళ్ళచెర్వు  వారి త్రిభాష రచనా విభూతిని దర్శిద్దాం –

సంస్కృత రచనలు

1-శ్రీ గురు చరితం 2-సాలభంజికా సూత్రా దారం 3-లలితానందలహరీ ,స్పందలహరీ 4-స్తన్యదారా స్తవః 5-వేదనాస్తవః 6-వేదనా నివేదితం 7-లింగ నిర్మధనం 8-ఆకర్మానంద లహరి 9-దయాదరిద్రాయ నమశ్శివాయ 10-తస్యాభవత్కి౦చన 11-మన్యేహ మస్మి హృదయే పరమేశ్వరస్య 12-చరణార వింద షోడశి 13- అంతరార్ధ స్తోత్రం14-పరకాయ ప్రవేశ స్తోత్రం 15-బి౦దు మాలినీ స్తవః  16-రఘు కౌత్సుకం (నాటకం )17-అంగారక శృంగారః (జ్యోతిషం )

నిఘంటు నిర్మాణం

1-ధాతు కోశ పద కోశౌ 2-లింగాను శాసనము 3-తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు

తెలుగు గ్రంధాలు

1-సామి శరణం 2-మదాలస జోల పాట3-ఆత్మ సుప్రభాతం 4-ఆస్తి దేవము (సదసత్సంశయము )5-కనకధారాస్తవము –పద్యాను వాదము ,వ్యాఖ్య 6-శ్రీ కృష్ణ రాస లీల (యోగాత్రయీ హేల )7-కుజ సప్తతి (కుజ దోషం మీద పరిశోధన )8-బీజ తంత్రము 9-చందోలు మహర్షులు(చిన్ననవల ) 10-అటుకులలో కిటుకులు 11-గజేంద్ర మోక్షము –రుషి ఋణము 12-వామనుడు –వామనము .

ఆంగ్ల గ్రంధాలు

1-K.P.Special Study 2-P.G. Study on Traditional k.P.Astrology,Part- 13-P.G Study on Traditional K.P. Astrology –part -2

తెలుగు వ్యాఖ్యానాలు

1-త్రిపురామహిమ్నః స్తోత్రం -2-రామ కృష్ణ విలోమ కావ్యము 3-అష్టక గుచ్చము (బెల్లంకొండ వారి రచన )4-కనకధారా స్తవము (పద్యానువాదము )6-విజ్ఞాన భైరవము 7-విష్ణు సహస్ర నామ స్తోత్రము –మతత్రయ వ్యాఖ్యా సంగ్రహము 8-శివ గీత 9-సాంబ పంచాశిక (శ్రీ కృష్ణ పుత్ర సాంబ కృత సూర్య స్తోత్రము )10-వాగ్దేవీ స్తుతి (భోజ రాజ కృతం )11-ముక్తి ద్వారా స్తవ రాజము 12-వరాహోపనిషత్తు 13-కృష్ణ కుతూహలము (మధుసూదన సరస్వతి నాటకము ౦అనువాదము,లఘు వ్యాఖ్య 14-పరమాత్మ సహస్ర నామావళి –వ్యాఖ్య (బెల్లంకొండ రామ రాయ కృతం )

సహా సంపాదకత్వం లో వెలువ రించినది

సిద్ధాంత సింధుః(తెలుగు లిపి)(సంస్కృత మూలం శ్రీ రావి మోహనరావు గారితో కలిసి –దశ శ్లోకీ వ్యాఖ్య )

స్వీయ సంపాదకత్వం లో వవెలువరించినది

సిద్ధాంత సింధుః(నాగర లిపి )-ఆర్ .ఎస్. వి. పీఠం –తిరుపతి ద్వారా

సంస్కృత వ్యాఖ్య

రమావల్లభ రాయ శతకము (బెల్లం కొండ  రామ రాయ కవి )

ఆంధ్రానువాద గ్రంధాలు

1-బెల్లంకొండ రామ రాయ కృతాలు 1-అద్వైత విజయము 2-వేదాంత నిశ్చయము 3- అద్వైతామృతము 4 –భాగవత చతుశ్శ్లోకీ 5-సిద్ధాంత సింధువు –దశశ్లోకీ కి తెలుగు వివరణ 6 –శంకరా శంకర భాష్య  విమర్శనము 7- ఆంధ్ర వేదాంత ముక్తావళి 8-సిద్ధాంత లేశ –క్రష్ణాలంకార సంగ్రహం 9-పంచ పాదిక 10–స్వరూప ప్రకాశము 11-సంక్షేప శారీరకము (మధుసూదన కృత సార సంగ్రహ వ్యాఖ్య విశేషాలతో )12-బ్రహ్మ సూత్ర శంకర భాష్యము  13-పసామ త్రయి(వేదాంత పరిభాష వేదాంత పాఠం ,వాసుదేవ మననం )

సరళీకరణ సంగ్రహ తెలుగు గ్రంధాలు

1-సరళ విచార సాగరం (గ్రాంధిక తెలుగు నుంచి వ్యావహారిక తెలుగులోకి )2-సరళీకృత వ్రుత్తి ప్రభాకరం (గ్రాంధికం నుండి వ్యావహారికానికి )3-విద్యారణ్య కృత వివరణ ప్రమేయ సంగ్రహం కు ఆంధ్రానువాదం 4-శ్రుతి గీతలు –భాగవత దశమ స్కంధం లోని వాటికి టీకా తాత్పర్య ,పద్యానువాదం 5-నైష్కర్మ సిద్ధి –అనువాదం

ఇలామేళ్ళచెర్వు  వారి వేద, వేదా౦గ ,జ్యోతిష ,దర్శన సాహిత్య సరోవరం 70 గ్రందాలతో నిండి ఒడ్డుల నరసి నిండుగా ఉంది .ఇంకా ఎన్నో రాస్తూనే ఉన్నారు .వారి కలం నిత్యం పదునుతో  పరిగిడుతూనే ఉంది.ఇంతటి సాహిత్య శీలిని,పుంభావ సరస్వతీ మూర్తి ని  ప్రభుత్వ౦  గుర్తించక  పోవటం, పురస్కార ప్రదానం చేయకపోవటం  ఏలినవారి వక్ర దృష్టికి ఉదాహరణగా నిలుస్తుంది .శ్రీ వారు కూడా తానేదో సాహితీ సేవ చేస్తున్నానని మెహర్బానీ ప్రదర్శించకపోవటం ,గుర్తింపుకు ఆరాటపడక పోవటం  ,ఎక్స్పోజర్ కు దూరంగా ఉండట౦ వారి వినయానికి దర్పణం .

మేళ్ళచెర్వు వారి  గీర్వాణ భాషా వైశద్యాన్ని  ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం లో రాసే అదృష్టం నాకు కలిగింది .దీనికి డా .తూములూరు శ్రీ దక్షిణా మూర్తి గారే కారకులు .అంతకు ముందు ఎప్పుడో వారి గురించి కొద్దిగా రాశాను .మొన్న శాస్త్రిగారు తెనాలి వెళ్లి ,వారి ఫోటోను శ్రుతి గీతాలను ,వారి అపూర్వ సృష్టి బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారిపై సంస్కృతం లో శ్లేష మహాకావ్యంగా  రాసిన వారి దగ్గర మిగిలిఉన్న  ఒకే ఒక కాపీ  ‘’శ్రీ గురుచరితం ‘’ను నాకోసం తీసుకొని నిన్ననే నాకు అందేట్లు కొరియర్ లో శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు పంపారు .వాటిని బట్టి ఇదివరకు రాసినదాన్ని కొంచెం పెంచి ముద్రణకోసం లాస్ట్ మినిట్ లో డిటి పి చేయటానికి శ్రీ చలపాక ప్రకాష్ గారికి పంపాను .

వారి గురించి సమగ్రంగా గా రాయాలనే తలంపుతో ఈ వ్యాసం రాస్తున్నాను .వారి శ్రీ గురు చరితం ఇవాళే చదవటం ప్రారంభించి20 అధ్యాయాలలో 10 అధ్యాయాలు చదివాను .నాకు యేమని పించింది అంటే ఈ మహా కావ్యానికి మేళ్ళచెర్వు  వారే స్వయంగా అర్ధ తాత్పర్యాలతో తెలుగు లో వివరంగా విశేషాలతో రాస్తేఅద్భుతంగా ఉంటుందని .లేక వారంతటి శిష్యులు ఎవరితోనైనా రాయిస్తే ఈ తరంవారికి అందుబాటులో ఉంటుందని .వారు ఈ ప్రయత్నం చేసి గురు ఋణం ,పాఠక రుణమూ తీర్చుకోవాలని  వారికి నా విన్నపం .

నాకు తెలిసినంతవరకు ఈ కావ్యం లోని విషయాలు రెండవ వ్యాసం లో రాసే ప్రయత్నం చేస్తాను .

వారి ఫోటోను దీనితో పాటు జత చేస్తున్నాను చూడండి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-16 –ఉయ్యూరుmellachervu-subrahmanya-shaastri

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -15

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -15

మల్లినాధుని అద్వైత వేదాంత పాండిత్య గరిమ

మల్లినాధుడు అద్వైత వేదాంతాన్ని క్షుణ్ణంగా మదించిన వాడు .అందులో ఆయన పాండిత్య గరిమా ప్రదర్శనానికి సంబంధించిన కొన్నిటిని  తెలుసుకొందాం .కుమార సంభవం లోని విష్ణు స్తోత్రాలలో ఎన్నో వేదాంత విషయాలున్నాయి .వాటిని అద్వైత వేదాంతానికి అనుసంధానం చేస్తూ మల్లినాధుడు ఉపనిషత్ వాక్యాలను ఉదాహరించి తన అద్వైత అవగాహనా సామర్ధ్యాన్ని  నిరూపించాడు .-‘’కేవలాత్మనే ‘’కు ‘’ఏకః ఉపాయః ‘’అని చెప్పి ‘’ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ ‘’అనే ఐతరేయ ఉపనిషత్  వాక్యాన్ని పేర్కొన్నాడు . రఘువంశం లో ‘’హృదయస్థ మనాసన్నమకామం త్వాం తపస్వినం –దయాలు మనఘ స్పృష్టం పురాణ మజరం విదు’’ శ్లోకానికి మల్లినాధుడు  ఉపనిషత్ ధోరణి లోనే వ్యాఖ్య రాశాడు .-‘’అకామం నిత్య పూర్నత్వాత్ నిష్కామం తధాపి-తపస్వినం లోక యాత్రార్ధ౦ తాపసం విదుః –సోకామయత –బహుస్యాం ప్రజాయే యేతి –త తపస్యత్వా ఇదం సర్వ మసృజత ‘’అనే తైత్తిరీయ ఉపనిషత్ భాష్యంగా వివరించాడు .మరొక శ్లోకం లో మాయ అనేదానికి శక్తి అనే అర్ధం తో వివరించాడు .అద్వైత వేదాంత మార్గం లో జ్ఞాన కర్మ భక్తికలిసి ఒక ఆధ్యాత్మిక యాంత్రిక వ్యవస్థ నేర్పరచి మోక్షమార్గానికి దారి చూపిస్తుంది .

నైషధీయ చరితం లో అనేక శ్లోకాలు  అద్వైత భావ పరిమళాలను వెదజల్లుతాయి .అందులో   ఆసక్తికర మైన విషయం ఒకటి ఉంది –అది మనుషులు అయిదవ ప్రత్యామ్నాయమైన సత్యాన్ని నమ్మరు అన్నది .మిగిలిన నాలుగు ఇతర సిద్ధాంతాలు అద్వైతాన్ని వేళ్ళూన కుండా చేస్తాయి .దమయంతికి నలమహారాజు పై అనుమానం ఉన్నందున ,ఆమె అయిదవ ప్రత్యామ్నాయమైన సత్యాన్ని నమ్మదు .నలుడు అత్యంత నమ్మదగిన పురుషుడు .మిగిలిన నలుగురు ఆమెను పొందాలనుకొంటారు .అందుకు పూర్తీ నమ్మకస్తుడైన నలుని ఆమె చేరనీయ కుండా నిలువరించే ప్రయత్నం చేస్తారు –‘’సాప్తుం ప్రయచ్చతి న పశ్చతుస్టయే తాం మల్లాభ శంసిన న పంచమ కోటి మాత్రే –శ్రద్ధాం దధే నిషాద రాణ్విమతో మతానా మద్వేతతత్వ ఇవ సత్యత్తరేషి లోకః ‘’(నైషధం ).

‘’ రఘు మహా రాజు తన జ్ఞానాగ్ని చేత దహి౦ప బడ్డాడు ‘’అనే రఘు వంశ శ్లోకం –‘’అపారే దహనే స్వకర్మణా౦  వవృత్తే జ్ఞాన మయేన  వహ్నినా –‘’ అనేదానికి భగవద్గీత లోని ‘’య౦  యేయాంసి సనిద్రోగ్ని భస్మ సాత్ కురుతేర్జున –జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మసాత్ కురుతే తధా ‘’అనే దానితో సమర్ధించాడు సూరి .కుమార సంభావంలోని ఒక శ్లోకం పరమాత్మను తెలియాలి అంటే తనలోకి తాను చూసి తెలుసుకోవాలి  .బాహ్యే౦ద్రియాల చూసే చూపు ఆత్మను తెలుసుకోవటానికి పనికిరావు .అనే అర్ధం ఇచ్చేకుమార సంభావ  శ్లోకం –‘’మనో నవద్వార నిస్టిద్ర వ్రుత్తి హృది వ్యవస్థాప్య సమాధి పశ్యం –యమక్షరం క్షేత్ర విదో విదుస్త మాత్మా నమాత్మత్య న్యవ లోక యంతిం ‘’

న్యాయ శాస్త్ర కోవిదుడు మల్లినాధుడు

తార్కికులు ఒక క్రమ విధాన వాదనలను ,వివాదాస్పద వాదనలను  ఏర్పరచారు .అవి రెండు రకాలు .1-గతి తార్కిక వాదం(డయలేక్టికల్ ) 2-న్యాయ వాదం (సిల్లాజిస్టిక్ ).మొదటి దాని ప్రకారం రచయిత తన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు .తర్వాత దీనిపై అభ్యంతరాలను ముందే ఊహించి తన వాదాన్ని క్రమపద్ధతిలోమొదటి దాన్ని అనుసరించి వాటిని ఖండిస్తూ ,తన భావాన్ని సమర్ధిస్తూ  కొనసాగిస్తాడు . వ్యతిరేకులు కొన్ని విషయాలను ప్రతిపాదిస్తారు ,వాటిని సిద్ధాంత కర్త తృణీకరించి పక్కన పడేస్తాడు .ముగింపు మాత్రం మొదటి దానికి పూర్తిగా పునరుక్తిగా నే స్థిరపడుతుంది .ఇదే గతి తార్కిక వాదం .

రెండవది అయిన న్యాయవాదం లో అందరికి తెలిసిన అయిదు సోపానాలుంటాయి 1-ప్రతిపాదన 2-కారణం 3-ఉదాహరణ 4-అనువర్తన (అప్లికేషన్ )5- ముగింపు .మల్లినాదునికి ఇవన్నీ కరతలామలకాలే .సాధారణ న్యాయవాదాన్ని మల్లినాధుడు అనుసరించాడు .’’అను మేయ శోభి ‘’ని వివరిస్తూ పార్వతీ దేవి తుంటి భాగాన్ని వర్ణిస్తూ అవి చాలా అందంగా ఉన్నాయని ,అవి శివుని అర్ధభాగం గా ఉన్నప్పుడు మరింత శోభించాయని –‘’గిరిజా నితంబ బింబం విశ్వాతి శాయి సౌ౦దర్యం –గిరీశాంక రూఢత్వాత్వ్యతిరేకేణ నార్యంత రాశర్నితంబ బింబ వత్ ‘’అని కాళిదాసు  వర్ణించాడు  .దీన్నే మల్లినాధుడు ‘’అనుమేయ శోభి ‘’అన్నాడు .

వరద రాజు రాసిన ‘’తార్కిక రక్ష’’కు సూరి రచించిన ‘’నిష్కంటక ‘’వ్యాఖ్య లో మల్లినాధుని తార్కిక గరిమ మహోత్క్రుస్టంగా  ఉందని పి .జి లాల్యే పండితుడు విశ్లేషించాడు .మేఘం పై ‘’శైల భావన ‘’గుర్తుంచుకోవటానికి అనుకూలం .-‘’తస్యాత్తీరే —-ప్రేక్ష్యో పా౦తస్ఫురిత తాడితం త్వాంతమేవ స్మరామి ‘’అనేమేఘ దూత శ్లోకం పై వ్యాఖ్యానిస్తూ నిరుక్త కారుని మల్లినాధుడు విమర్శించాడు .భావన అనేది స్మృతికి సమానార్ధం కాదన్నాడు –దీనిపై స్పందిస్తూ సూరి –‘’నిరుక్త కారస్తు త్వాం తమేవ స్మరామి ఇతి యోజయిత్వా మీడే శైలత్వ రోప మాచస్టేసదా సంగాతం .శైలత్వ భావనా స్మ్రుతి రిత్యపి నొప పద్యతే .భావనాయః స్మ్రుతిత్వే ప్రమాణ భావాత్ –అనుభవ యోగాత్ సద్రుశ్యోపన్యాసస్య వైయర్దా చ్వ-విసద్రుశోపి సాలగ్రామే హరిభావ దర్శనోదితా ‘’అని చెప్పాడు .అలాగే ‘’మత్స దృశ్యం లిఖంతి’’అంటే ప్రేమలో మొదటిదశ అని  –లవ్ యట్ ఫస్ట్ సైట్’’గా అర్ధం చెప్పిన వ్యాఖ్యాతలను విపరీతంగా విమర్శించాడు  .దీనితర్వాత మల్లినాధుని రాజకీయ శాస్త్ర పాండిత్యాన్ని తెలుసుకొందాం.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

.

 

‘’

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రద్దు ”లోపనిలో పనిగా

పెద్ద నోట్ల రద్దు తో అందరి జీవితాల ఆనందాన్ని రద్దు చేసి ,మోడీ మరో తుగ్లక్ అని పిస్తున్నాడని అందరూ అన్నమాటే .చిక్కి శల్యా విశిష్టమై మంచం లోనే ఉండి పోయిన కాంగ్రెస్ ,కమ్మీ లకు రద్దు సంజీవిని లా పని చేసి ప్రాణం నిలిపి బజారులో గోల చేసే అవకాశమిచ్చింది .పరిస్థితి ఇలాగే ఉంటె ఉత్తర ప్రదేశ్ లోభి జె పి  నాయకులు ఎన్నికలలో గెలవలేమని నెత్తీ నోరు పెట్టు కొని తలబాదు కొంటున్నారట. అప్పనం గా మోడీ మళ్ళీ కేంద్రం లో కాం గ్రేస్ కు అధికారాన్ని బంగారు పళ్లెం లో పెట్టి అప్ప గిస్తాడేమో నాని అనుకొంటున్నారు .కనుక రద్దు లో పనిలో పనిగా బి జె పి అధిష్టానం మోడీ ప్రధాని పదవి రద్దు చేసి అద్వానీ వంటి సీనియర్ నాయకుని ప్రధానిని చేస్తే చరిత్ర పునరా వృత్తం కాకుండా ఉంటుందని అనిపిస్తోంది .-దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -39 దివిసీమ ఉప్పెన

Inline image 1

—  నా దారి తీరు -39

                                     దివిసీమ ఉప్పెన
            నా పెనమ కూరు ఉద్యోగం అంటే నాకు ముందు గుర్తుకొచ్చేది దివి సీమ ఉప్పెన మహోత్పాతమే . 1977 నవంబర్ 19 శని వారం రాత్రి జలప్రళ యమేర్పడి దివి తాలూకాను అస్తవ్యస్తం చేసింది పది వేలకు పైగా జనం ఉప్పెనకుబలి అయ్యారు .ఈ రోజే ఇందిరా గాంధి పుట్టిన రోజు కూడా  . నాటి  నుండి ఆమె ప్రతి పుట్టిన రోజుకీ జనం లో భయం ఉండేది ఏ ప్రమాదం వస్తుందో నని . అంతకు ముందు రోజు రాత్రి నుండి తుఫాను హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు   రేడియో ఏ ఆధారం ప్రమాద హెచ్చరికలు ఇరవై  నాలుగు గంటలూ మోగుతూనే ఉన్నాయి .శని వారం నుంచి మూడు రోజులు స్కూళ్ళను మూసి వేస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ అధికారికం గా ప్రకటించాడు .  స్కూల్ ఉంటుందేమో నని నేను సైకిల్ వేసుకొని పెనమకూరు కు వెళ్లాను హెడ్ మాస్టారు కానీ పించి సెలవు ప్రకటించామని చెప్పారు వెంటనే ఇంటికి తిరిగి వచ్చ్చే శా ను ఉదయం నుండి తీవ్రమైన నల్లటి మబ్బులు ఆకాశం అంతా  కమ్ముకొని దాదాపు  గంటకు వంద మైళ్ళ కంటే వేగం తో సముద్రం వైపు ప్రయాణించటం చూశాం .వర్షం , గాలి జో రైంది .
                     అప్పుడు మా ఇంటి పరిస్తితి ఒక సారి జ్ఞాపకం చేసుకొంటున్నాను . మా అన్నయ్య గారి అమ్మాయి వేదవల్లి మగ పిల్లాడిని రవి ని ప్రసవించి ఇంటిలో ఉంది . సావిట్లో ఆమెకు వర్షం పడకుండా ఉన్న  ఒక చోట మంచం వేసి పిల్లాడితోపడుకో బెట్టాం  నడుం కట్టుతో ఉంది .  భోజనాలు సాయంత్రం పెండ్రాలే చేసేశాం . మా తోడల్లుడు గారి అబ్బాయి ”సూర్యం ”మమ్మల్ని చూద్దామని ఆ ఉదయమే ఖమ్మం నుంచి వచ్చాడు .కదలి వెళ్ళటానికి వీలు లేక మా ఇంట్లోనేఉండీ  పోయాడు .  మేమందరం పదమ టిం ట్లో మంచాలేసుకొని పడుకోన్నాం.  అమ్మ ఆమెకున్న చిన్న నవ్వారు మంచం లో సావిట్లో మనవరాలికి తోడుగా పడు కొంది పెంకుటిల్లు కనుక వర్షం ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో పడుతోంది వీలైన చోట్ల తప్పాలాలు బకెట్లు చెంబులు ,గిన్నెలు పెట్టాము   వాటిలో పడటానికి . నిండగానే తూము లో పారబోస్తున్నాం . బయటికి తలుపులు తీయటానికి సాహసించలేక పోయాం . విపరీతమైన గాలి వాన  తో ముంచెత్తుతోంది . గుండె దిటవు చేసుకొని రేడియో పెట్టుకొని వార్తలను హెచ్చరికలను వింటున్నాం .
                          రాత్రి పది దాటిన తర్వాత  తుఫాను భీభత్సం పెరిగింది మిన్నూ మన్నూ ఎకమ య్యేట్లు భీభచ్చం గా వర్షం కురుస్తోంది . ప్రళయం ముంచు కొచ్చిందని భయ పడ్డాం . ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నాం ప్రతి క్షణాన్ని . భీకర మైన శబ్దాలు విని పిస్తున్నాయి . ఆకాశం బద్దలై పోతున్నట్లని పించింది ఎక్కడో మంటలు చేల రేగుతున్నట్లు అని పించింది .పాపమ్ రేడియో వాళ్ళు కమ్యూని కేషన్లు తెగ నంతవరకు చెప్పాల్సింది చెబుతూ హెచ్చరికలు చేస్తున్నారు దివి సీమ లో తుఫాను కేంద్రీక రించిందని బందరు అవని గడ్డ ప్రాంతాలలో జల ప్రలయమేర్పడి నట్లు వార్తలు చెప్పుతున్నారు అర్ధ రాత్రి దాటిన తర్వాతా రేడియో పని చేయలేదు . తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలియ లేదు .కుమ్భ వృష్టి కురుస్తూనే ఉంది ,గాలి వృక్షాలను ఇళ్ళ కప్పుల్ని కూల్చే వేగం తో వీస్తోంది మె రుపులు ఉరుములతో ఆకాశం  యము ఘంటి కలను మోగిస్తోంది . సరే ఎవరికి నిద్ర లేదు కళ్ళల్లో ఒత్తులేసుకొని బాలింత రాలీని చూసుకొంటూ ఇల్లు కూలి పోతుందేమో నని  నని భయ పడుతూ ,తలుపులు తీయకుండా గాలికి విరిగి పోకుండా అన్నీ రోళ్ళు రోకళ్ళు రాళ్ళు అడ్డాం  పెడుతూ  ఆ కా ళ  రాత్రి ని గడిపాం . తెల్లారే సరికి అంటా ప్రశాంతం గా ఉంది .వాకిల్లలొ రోడ్ల మీద మొల లోతు  నీళ్ళు బయటికి వెళ్ళే వీలే లేదు మర్నాటి వరకు .  కరెంటు ఎప్పుడో పోయింది రా వటా నికి వారం పైగా పట్టింది వైర్లు తెగాయి స్తంభాలు ట్రాన్స్ ఫార్మర్లు కూలి పోయాయి . అప్పటికి మాకు టెలిఫోన్ లేదు . పేపర్ వస్తేనే వార్తలు తెలిసేది .. రవాణా వ్యవస్థ దెబ్బ తిండి రోడ్లుమీడున్న చెట్లు కూలి పోయి ప్రయాణానికి ఆటంకం కలిగించాయి .
                          బయటికి వచ్చి రోడ్డు మీద  చూస్తె పరిస్తితి హృదయ విదారకం గా ఉంది . రేకుల షెడ్లు యెగిరి పోయాయి గడ్డి వాముల అడ్రస్ లు లేవు . పూరిల్లు ఎక్కడున్నాయో తెలియ లేదు సావిట్లో కట్టేసిన గొడ్లు చలికి వర్షానికి చచ్చి పడి ఉన్నాయి ఎన్ని కోళ్ళు చని పోయాయో లెక్క లేదు ఒక్క ఉయ్యూరు లోనే ఇట్లా ఉంటె మిగిలిన చోట్ల ఎలా ఉందొ నని అందరు భయ పడుతున్నారు . బస్సులు నడవటం పత్రికలూ రావటం రేడియో పని చేయటం  వల్ల  జరిగిన భీభత్సం క్రమం గా తెలుస్తోంది .దివి సీమ లో చెప్పలేనంత నష్టం జరిగిందని వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ,సముద్రం లో బడబాగ్ని పుట్టి ఊహించని నష్టాన్ని కలిగించిందని సముద్రం విరుచుకు పడి ఊళ్లకు ఊళ్ళను  తనలో కలుపుకోందని కెరటాలు కరెంటు స్తంభాల ఎత్తుకు వచ్చాయని ఇంత ఎత్తు  కెరటాలు రావటం ఇంత   వరకు ఎన్నడూ చూడలేదని ఎక్కడ పడితే అక్కడ శవాలు గుట్టలు గుట్టలు గా పడి  ఉన్నాయని జంతు కలేబరాలకు లెక్కే లేదని గడ్డి మోపులు కరెంటు స్తంభాల మీద కానీ పించాయని వార్తలోచ్చాయి .  జరుగ రాని  ఘోరం జరిగి పోయింది దివి సీమ లో బందరు కూడా బాగా దెబ్బ తిందని తెలిసింది .
Inline image 1
                          ఉప్పెన వచ్చిన మర్నాటి నుంచే మండలి కృష్ణా రావు గారు స్వయం గా బయల్దేరి దెబ్బ తిన్న ప్రాంతాలైన భావ దేవర పల్లి ,నాగాయలంకా ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఇబ్బంది పడే జనాలను ఓదార్చి మిగిలిన వారిని అవని గడ్డ లోని గాంధీ క్షేత్రానికి ,స్కూలు భవనాలకు తరలించి భోజన సౌకర్యాలు కలిగించారు ఆయన ఈ ఉప్పెన చూసి చలించి పోయారు ముఖ్య మంత్రి వెంగల రావు వస్తే కావలించుకొని ఏడ్చేశారు కా వలసిసహాయం అందినచమని అర్ధించారు .  స్వచ్చంద సంస్తలు అయిన ఆర్.యెస్.యెస్  వంటివి,సైన్యం  చాలా చొరవతో ముందుకు వచ్చి పునరావాస కార్యక్రమాలు చేబట్టాయి .     .శవాలను కాలువల్లోంచి బయటికి తీయటం పెద్ద సమస్య అయింది .శవాలకు అంత్య క్రియలు చేయటం పెద్ద సమస్య .వీలైనన్త వరకు బంధువులతో గుర్తింప జేశారు సామూహిక శవ దహనాలు చేయాల్సిన పరిస్తితి వచ్చింది . అక్కడ అంటూ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం పెద్ద సమస్య . కలెక్టర్ a.v.s.reddi అని జ్ఞాపకం . చాలా శ్రమించాడు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి పని చేయించాడు .
Inline image 2
                                ఈ ఉప్పెన మహోత్పాతాన్ని స్వయం గా చూడాలని పించింది .ఒక ఆదివారం మధ్యాహ్నం భోంచేసి బస్ లో అవని గడ్డ వెళ్లాను అక్కడి నుండి ఎక్కడికీ బస్సులు తిరగటం లేదు . జీపులు కార్లలోనే వెళ్ళాలి అలానే భావ దేవర పల్లి వెళ్లాను.  దారి పొడుగునా శవాలు కానీ పించాయి వాసన భీభత్సం గా ఉంది D.D.T.చల్లారు కాని ఆగటం లేదు ఆడా  మగా శిశువుల శవాలు చూసి గుండె జారిపోయింది పశువుల కలేబరాలకు లెక్కే లేదు . అవని గడ్డ లో స్వంచంద సంస్తల సేవలు చూసి కళ్ళు చెమర్చాయి .వాల్ల సేవకు ప్రతి ఫలం ఇవ్వలేము . ముక్కుకు కర్చీఫ్ పెట్టుకొనే తిరిగాను . గాంధీ క్షేత్రానికి వెళ్లి చూశాను భావ దేవర పల్లి లో ఉప్పెన నీరు హైస్కూల్ భవనం పై అంతస్తుకు చేరిందట  . ఉయ్యూరు  నుండి ఇక్కడికి వచ్చ్చిన  వచ్చిన సీతాపతి రావు హెడ్మాస్టారు పై అంతస్తు ఎక్కి ప్రాణాలు ఉగ్గాబట్ట్టుకోన్నారట అక్కడి లైబెరియన్ నాన్చారయ్య  కుటుంబం కూడా  అంతే తర్వాత ఉయ్యూరు కు బదిలీ అయ్యాడు .  అవని గడ్డకు మళ్ళీ చేరి బందరుకు బస్ లో వెళ్లాను .ఆన్ని  చోట్లా పంటలన్నీ నాశనం ఉప్పురిసి పోయాయి పొలాలన్నీ . రెండు మూడేళ్ళ దాకా పొలాలలో పంట పండదు .బందరు వైపూ  వైపునా ఇలాగే కానీ పించింది బందరు నుండి రాత్రికి ఉయ్యూరు చేరాను .
                     ఉయ్యూరు లో మేమందరం యార్ ఎస్ ఎస్ . వాళ్ళ కింద పని చేసి ఇంటింటికి తిరిగి బట్టలు డబ్బు పోగు చేశాం  మండావీరభద్ర రావు  మాకు నాయకుడు మాధవాచారి సహాయకుడు . వీటిని కార్లలో సేవా కేంద్రాలకు పంపి వారితో అందరికి అందజేయిన్చాం . ప్రతి స్కూల్ నుండి నిధులు వసూలు చేసి ఎవరికి వారు స్వచ్చందసం గా డ బ్బు వసూలు చేసిముఖ్య మంత్రి సహాయ నిధికి పంపారు దేశం ,ప్రపంచం అంతా  బాసటగా నిలిచింది మందులు పంపారు కొందరు దుప్పట్లు రగ్గులు చొక్కాలు చిన్న పిల్లల డ్రెస్ లు పంపారు ఇంకొందరు . మా తమ్ముడు మోహన్ మరదలు సునీత పూనా నుంచి చూడ టానికి వచ్చారు కూడా బట్టలు తెచ్చారు మళ్ళీ వాళ్ళతో వెళ్లి అక్కడ పంచి పెట్టాము . ఇదంతా  గుండె బరువేక్కువయ్యే సన్నీ వేషాలే .  ఆ సంఘటనపై  ”శని రాత్రి ”అనే దీర్ఘ కవితరాశాను .
                         ఈ విధం గా పెనమకూరు అంటే దివి ఉప్పెనే ముఖ్యం గా జ్ఞాపకం వస్తుంది . మా చల పతి  కి ఇచ్చిన మాటను నిలుపుకొన్నాడు వద్దే శోభనాద్రి .వాగ్దానం చేసిన  నాలుగు రోజులకే నన్ను పెనమకూరు నుండి ఉయ్యూరు కు ట్రాన్స్ ఫర్ చేయించాడు . 17-8-79 సాయంత్రం పెనమ కూరు హైస్కూల్ లో రిలీవ్ అయి మర్నాడు అంటే 18-8-79 ఉదయం ఉయ్యూరు హైస్కూల్ లో చేరాను ఇది  నా తొమ్మిదవ బదిలీ ఉయ్యూరు రావటం నాలుగో సారి . పెనమకూరు లో మంచి వీడ్కోలు విందు ఇచ్చారు హెడ్ మాస్టారు ఆప్యాయం గా మాట్లాడారు .స్టాఫ్ అంతా  మెచ్చుకొన్నారు .  Inline image 2
Inline image 3
                   సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –15-7-13- కాంప్ -హైదరాబాద్ .
Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

శని రాత్రి –కవిత

శని రాత్రి –కవిత

        19-11-1977  శని వారం అర్ధ రాత్రి దివి సీమను ఉక్కిరి బిక్కిరి చేసిన ఉప్పెన తగ్గిన తర్వాత ,ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూసి   స్పందించి ,30 -11 -1977 న రాసిన కవిత.
          అనిలం తో అనలం కలిస్తే ,సర్వం పరశు రామ ప్రీతి
అనిలం తో జలం కలిస్తే ,మహోధృత ప్రళయం
అనిలం ,జలం ,అర్ణవం ముప్పిరి గొంటే మహోప ద్రవం
ప్రుధివ్యాపస్తేజో వాయురాకాశ పంచ భూతాలు
ఒక్క ఉదుటున విరుచుకు పడితే
ఊహాతీత మానవ మారణ హోమం
శని రాత్రి -నిజం గానే మన పాలిటి ”శని రాత్రి ”
చిలికి .చిలికి గాలి వానయై ,కురిసి కురిసి కుంభ వ్రుస్టై
చాలదన్నట్లు ఉప్పెన పెన వేసుకు వస్తే
భూమి ,జలద( ధ)రించి ,భయకంపిత మైన వేళ
ఆకాశం ఆవులించి ,,బడబాగ్ని కీలలు నాలుక సాచితే
నమ్ముకున్న భూమి తొలగి పొమ్మంటే ,
కమ్ముకున్న గాలి తోసి పారేస్తుంటే
కడలి గర్భం   చీల్చుకొని ,సహస్ర కరాలు సాచితే
మానవునికి చోటేదీ ,దారేదీ ,దిక్కేదీ?
ఎన్ని వేల మానవ జీవితాలకు భరత వాక్యం పలికిందీ రాత్రి ?
ఎన్ని లక్షల మూగ జీవాల ఆర్తనాదం నినదించీ రాత్రి ?
ఎంత మందిఅభాగ్యుల కన్నీరు కాల్వలై
పొంగిన సాగర తరంగాలను ,వేనుకక్కు నేట్టిందీ కలి రాత్రి ?
కళ్ళ ఎదుటే ,కట్టుకున్న వాడు కూలి పోతుంటే
చూస్తూ చూస్తూనే తన వాళ్ళంతా ఊడ్చుకు పోతుంటే
నిస్సహాయం గా ,నీరవం గా ,జడమైనిల్చి పోతుంటే
సర్వస్వం కోల్పోయిన అభాగ్య సోదరుల
కన్నీటి గాధలు వింటుంటే
సాధించిన అభ్యుదయ మంతా
సాగరమ్  నీళ్ళ పాలై పోతుంటే
దిక్కు లేక మనసు వ్రక్క లై పోతుంటే
ఓదార్చే వారెవ్వరు ?,అక్కున చేర్చే వారెవ్వరు ?
ఎన్ని వేల కోట్లు ,ఈ దుఖార్తుల బాధలు తీర్చ గలవు ?
ఎన్ని వేల అశ్రు కణాలు ,ఈ అభాగ్యుల క్షుధాగ్ని ని ఆర్ప గలవు ?
ఎన్ని వేల చేతులు ,ఈ దారుణ మానవ ఖననం చేయ గలవు ?
ఏటా వచ్చే తుఫానే నేడు
ఉద్ద్రుతమై ,మహోద్ధ్రుతమై
ఒక్క రాత్రి లో సర్వం కబళించి
తెల్లారే సరికి ,జీర్ణించుకోలేక ,వెలి గ్రక్కింది
ఇది తెలుగు జాతి పాలిటి ఆశని పాతం

ఇది భారత జాతికే పెను సవాల్
సర్వ సభ్య సమాజానికే ఒక అగ్ని పరీక్ష
కొండంత ధైర్యం, గోరంత సాయం
ఉడతాభక్తి గా అందరం చేస్తే
ఈ శ్మశానం పై మళ్ళీ వసంతం ప్రభవిస్తుంది
ఈ శవాలపై నాగరకత వికశించి ,పరవశిస్తుంది
ఈ ఉప్పు నీరు గంగా జల మౌతుంది
ఈ కడలి పొంగు ,కంగు తింటుంది
ఈ చేలల్లో బంగారం పూసి ,స ఫలం అవుతుంది
ఈ నేల నాలుగు చెరగులా
మానవత మళ్ళీ చిగురిస్తుంది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్30-11-16

Posted in కవితలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -14 దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం -2

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -14

దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం -2

మల్లినాధుడు కొన్ని అనుబంధ శాస్త్రాలైన మీమాంస ,వేదాంత శాస్త్రాలను క్షుణ్ణంగా మధించాడని ,ఆయనకు మీమాంస శాస్త్రం లో ఉన్న పాండిత్యం అమోఘమైనదని దానికి తార్కాణం ఏకావలికి రాసిన ‘’తరళ’’వ్యాఖ్యానమే తెలియ జేస్తుందని ,అందులో కనీసం 25 సార్లు మీమాంస శాస్త్ర సిద్ధాంతాలను ప్రస్తావి౦చాడని ప్రొఫెసర్ ఎస్ .బి రఘునాదా చార్య పేర్కొన్నారు .ఆయన రాసిన వ్యాసం లో మరికొన్ని సిద్ధాంతాలను  –‘’మల్లినాధస్య మీమాంస శాస్త్ర పాండిత్యం ‘’అనే వ్యాసంలో  ఆయన రాసిన ‘’మల్లినాద మనీష ‘’లో వివరించారు .వేదమే అన్నిటికన్నా సాదికారమైనదని తెలియ జేయటానికి మల్లినాధుడు ఒక వాక్యాన్ని ప్రస్తావించాడు .

ఏకావలి పై వ్యాఖ్య రాస్తూ మల్లినాధుడు మీమాంస శాఖలో భట్టు యొక్క ‘’అభి తాన్వయ వాదం ‘’ను అనుసరించాడు .అంటే పదం యొక్క అర్ధం వాక్యార్దానికి దారి చూపిస్తుంది .. ’జ్యోతి స్టోమా ది వాక్యార్ధైఃపదేః-స్వాభి డేయ సామాన్య పర్వ సనాదాకాండ క్షాసం నిధిఃయోగ్యతా –బల్లబ్దేక వాక్యతా వ్యవస్తాపిత కారణాత్య  దిశక్తి యుక్తా నియతేవ్య క్తీరాక్షిపాద్రిమః –స్వస్తార్భి ఘనద్వారా తత్సంబంధి తదేర్పాదార్ధః లక్ష్యంతే—-యయాహుః –తస్మాత్ప దేశాభి హితైః పదాయైర్లక్షణాయా వాక్యార్ధః ప్రతిపాద్యతే ‘’( ఏకావలి )

ఏకావలి లోని ఆరవ ఉన్మేష లో అవిమృస్టావిదేయాంశశ ‘’యొక్క దోష రహితాలను చర్చ౦చాడు .ఇక్కడ మీమాంస శాఖ అభిప్రాయాలను పరిగణించాడు .ఇందులో  గుణం ముఖ్యమై విషయం తరువాతి స్థానాన్ని పొందింది –‘’తదేతత్ సమ్యగ్ వివేచిత స్మాభి స్తంత్ర వార్తికా యాం బాజపెయాదికరణే –తస్మాద్ విదేయస్య ప్రాధాన్య మప్రదాదాన్యం చను వాద్యస్యేతిమీమాంసా మా౦సలం వచ్చా ఇతి ప్రతీమః ‘’.మల్లినాధుడు మీమా౦స లోని అనేక అధికరణాలను వాటి పేర్లు చెప్పకుండా పరిగణన లోకి తీసుకొన్నాడు .

మొదట మల్లినాధుడు నమస్కార విధి ని చర్చించాడు .ఇందులో రెండు విధానాలను తెలిపాడు .అందులో మొదటిది కర్మకాండకు ముందు చేసే నమస్కారం .రెండవది వాజ పేయ జ్యోతిస్టోమ యాగాలలో కొన్ని ప్రత్యేకంగా చేయాల్సిన నమస్కారాలు .కర్మకాండకు ముందు చేసే నమస్కారం లో మళ్ళీ రెండు రకాలు .1-సూటిగా ఉపకరణాలతో చేసేది –దీన్ని ‘’సన్నిపాత్యోప కారకం ‘’అంటారు 2-దూరంగా ఉండి చేసేది దీన్ని ‘’ఆరాదుపకారక ‘’అంటారు .వీటిపై చర్చ చాలా సూటిగా అతి సరళం గా ,స్పస్స్టంగా ఉంటుంది .అలాగే ‘’సాంకేతికం ‘’ను ఉపయోగించే విషయం లో మల్లినాధుడు ‘’అక్ర్త్యాధి కరణం ‘’,’’తద్భూతాధి కరణం ‘’ లను ఉదాహరించాడు .విద్యాధరుని సమాధాన్ని పూర్తిగా వివరించాడు –‘’సర్వస్య జ్ఞానస్య విషయః అన్యాత్ ఫలమిత్వ వివాద మిత్యర్ధః –కుత్రేదం దృష్టం ?తత్రాహ విషయో హీతి –నీలాదిహి ఘటాది రిత్యర్ధః –ప్రాకవ్యం జ్ఞాతతా –సా చ జ్ఞాన జన్య జ్ఞానననుమాయికా విషయన్నిస్టాయత్ప్రసాదాత్ జ్ఞాతో ఘటః ఇతి విశిష్ట వ్యవహారో జాయతే ఇతి జ్ఞాతతోవాదినః ‘’(ఏకావలి ).తర్వాత మల్లినాదునిఅద్వైత వేదాంత పాండిత్య గరిమను తెలుసుకొందాం .

సశేషం

19-11-16 నాటికి   దివి సీమ ఉప్పెన వచ్చి  40 ఏళ్ళు అయిన సందర్భంగా జ్ఞాపకపు పొరల్లో నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

.

 

‘’

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘మా అన్నయ్య’ – కవితా సంకలనం మీద పద్య స్పందన

18.11.2016

సాహిత్యాభిమానులైన మిత్రులకు,

శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ, గారి అభినందన లేఖా మకరందము

నమస్కారములు !  నేను ఈమధ్య ‘మా అన్నయ్య అనే కవితా సంకలనం మీద నేను రాసి పంపిన  సమీక్షను మీరు చదివే ఉంటారు. అందులో ప్రస్తావించిన కొన్ని కవితా మకరందాలను ఆస్వాదించి, ప్రముఖ కవి, పండితులు, మిత్రులు శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ గారు తన సహృదయ స్పందనలను రెండు అందమైన కందాలలోనూ, ఒక ఆట వెలది లోనూ కవిత్వీకరించి నాకు పంపారు. ఆ అందాల కందాలనూ, బాలలా ఆటలాడిన ఆట వెలది’ నీ  ఈ క్రింద మీకందిస్తున్నాను. మనసుతో అందుకొని ఆనందిస్తారని ఆశిస్తున్నాను:

 

శ్రీ రామడుగు శర్మ గారు, గుంటూరు:                                          10.11.2016  

 

కం !! గీతాంజలి మూర్తి  సఖా !!

         మా తలపులయందు  నిలువ మా అన్నయ్యే

        చేత : ప్రీతిచే మీదగు  

        వ్రాతయె; గబ్బిట సఖుండె  భాగ్యుండాయెన్ !!

                                                        కం !! ..అన్నయ్య కవన సంకల

                                                                నోన్నతిని గురించి మీరలున్నతరీతిన్

                                                               ‘అన్నన్న !’ – అనెడి  విధముగ                                                                                   పన్నిన విశ్లేషణంబు  బాగుండె  సఖా !

మా అన్నయ్య ను గురించి:

 

ఆ.వే !! నాకె కాదు  మా కుటుంబ జనాళి

కెల్ల వేళలందు చల్లనైన 

జాడ; తోడు నీడ, మేడ మా అన్నయ్య

గుర్తు వచ్చె;  నివియె  కోటి నతులు !!

 అవ్యాజాభిమానంతో ఈ కవితలు రాసి పంపిన శర్మ గారికి  శతథా నా హృదయపూర్వక ధన్యవాదములు.

 

–          గీతాంజలి మూర్తి –                                                                                                

 

Posted in కవితలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -13 దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -13

దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం

ఇప్పుడు మల్లినాధుని దర్శన శాస్త్ర లేక తత్వ శాస్త్ర వ్యవస్థపై ఉన్న పాండిత్య వైభవాన్ని దర్శిద్దాం .మల్లినాదుని కాలానికి ఊహా లేక నిరాధార (స్పెక్యులేటివ్ )వ్యవస్థ క్రమంగా ఎదగటం చూశాడు .అన్ని వర్గాల ,మార్గాల వారికి వేదమే అంతిమ అధికారి(అల్టిమేట్ అధారిటి ).సహజం గా వేద గ్రందాలఅంటే శ్రుతుల  వ్యాఖ్యానం అత్యవసరమైంది .వేదాంత ,మీమాంస శాస్త్రాలు తమ వాదనలకు అనుకూలంగా వేద వ్యాఖ్య చేశాయి .ఈ రకమైన వ్యాఖ్యానం మొట్ట మొదట కుమారిల భట్టు ,ఆది శంకరాచార్యవంటి  అగ్ర శ్రేణి ఆచార్యులు ప్రారంభించారు .వీటిని వారి శిష్య బృందం పరిపూర్ణం చేసింది .మల్లినాధుడు అతి జాగ్రత్తగా వీటి అభి వృద్ధి సోపానాన్ని   మనస్సాక్షి గా ఒక విద్యార్ధిలా ఆకళింపు చేసుకొన్నాడు .పైగా అప్పటికే కవులు ,మహా కావ్య నిర్మాతలు అనేక శాస్త్రాలలో నిష్ణాతులు .కనుక వ్యాఖ్యాతలు ఆ కవీన్ద్రులతో సమానంగానో అంతకంటే ఎక్కువగానో వీటి లో సాధికారత కలిగి ఉండాల్సిన అవసరమేర్పడింది .తనకు ముందున్న వ్యాఖ్యాతల కంటే మల్లినాధుడు స్పష్టమైన గ్రంధ శాస్త్ర పాండిత్యం ఉన్నవాడు కనుక మహా వ్యాఖ్యాత అనిపించుకున్నాడు అని లాల్యే పండితుడు నిగ్గు తేల్చాడు .

ఇప్పుడు వేద విజ్ఞానం లోమల్లినాధుని ప్రతిభ ఎలాంటిదో దర్శిద్దాం .కాళిదాస మహా కవి కావ్యాలలో ఉన్న శ్లోకాల వ్యాఖ్యానానికి మల్లినాధుడు వేదం నుంచి అనేక ప్రకరణాలను ఉదాహరించి కాళిదాసుని వేదవిజ్ఞానం పై వెలుగులు కుమ్మరి౦చాడు . ద్వాదశాదిత్యులు గురించి కాళిదాసు చెప్పిన విషయాన్ని ఆరణ్యకాల లోని ‘’అరుణ కేతు చయనం ‘’లోని మంత్రాలను ఉదాహరించి ,ఈ ఆచార కర్మవలన ముఖ్య సూర్యుడు అధిపతి అయిన స్వర్గాన్ని చేర వచ్చు అనే విషయాన్ని నిర్ధారించి చెప్పాడు .ఈ ప్రకరణం అనేక సూర్యులున్నారని తెలియ జెప్పింది .మల్లినాధుడు ఆ సూర్యులందరి పేర్లు వివరించాడు .

వేదం లోని ఒక ముఖ్య నమ్మకాన్ని మల్లినాధుడు వేరొక చోట వివరించాడు .-‘’ఉదేతుమాత్మ జన్నీహం రాజాసు ద్వాదశాశ్వపి –జిగీషు రికో దినక్రుదాదిత్యే వివ కలాతే’’(శిశుపాల వధ వ్యాఖ్యలో )

నైషధం లో నలమహారాజు చంద్రుని మించాడు అనే విషయాన్ని ‘’ఆరోగ్యే భ్రాజః పటరః పతంగ-జ్యోతిస్టోమః స మహా మేరుర్ణ జహాతి ‘’అనేదానితో సమర్ధించాడు

‘’ఓ అమాయక చంద్రా !దమయంతి మనసు ఆమె మరణం తర్వాత నీలో కలుస్తు౦ద నుకొన్నావా .కాని ,మన్మధుడు ఆమె మనసు చంద్రుని లో నల ముఖం వలె కలిసిపోతుందని  ప్రకటించాడు .’’ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ మల్లినాధుడు బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి ఒక ప్రకరణాన్ని ఉదాహరించాడు –

‘’యత్రస్య పురుషస్య అగ్నం వాగత్యోపి వాతం ప్రాణాశ్చక్షు రాదిత్యం –మనశ్చంద్రః దిశాఃక్షేత్రం పృధివీం శరీర మాకారం మాత్మౌషదీ’’

దేవతల౦దరిలోవిష్ణు మూర్తి వరిస్టుడుఅన్నదాన్ని వివరిస్తూ కఠోపనిషత్ వాక్యాన్ని చెప్పాడు –‘’ఇంద్రియేభ్యః పరా హ్గ్రర్దాఅర్యేభ్యశ్చ పరం మనః ‘’

కాళిదాసు వేదం లో సూర్యుడు సాయం  వేళ తనకాంతిని అగ్నిలో నిక్షిప్తం చేస్తాడు అని రఘు వంశం లో చెప్పిన   ఒకనమ్మకాన్ని వేద ప్రమాణం తో సమర్ధించాడు –

‘’సౌరం తేజః సాయమగ్నిం సంక్రామతే –ఆదిత్యో వా అస్తం యన్నాగ్ని మను ప్రవిశతి –అగ్నిర్వా ఆదిత్యః సాయం ప్రవిశతి –ఇత్యాది శ్రుతి ప్రమాణాత్ ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-16 –ఉయ్యూరు

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 10-రుక్ సంహితలో విసర్గ సంధి పై పరిశోధించిన –వట కృష్ణ ఘోష్

– గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

10-రుక్ సంహితలో విసర్గ సంధి పై  పరిశోధించిన –వట కృష్ణ ఘోష్

1905లో జన్మించి 45 ఏళ్ళు మాత్రమే జీవించి 1950లో మరణించిన బెంగాల్ కు చెందిన (వ)ట కృష్ణ ఘోష్ భారతీయ భాషా శాస్త్రవేత్త మాత్రమె కాక ఇండో యూరోపియన్ భాషలను ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వాడు .సంస్కృతం ఇండో యూరోపియన్ భాషా శాస్త్రాలపై ఎన్నో గ్రంధాలు రాశాడు .పాళీ భాషపై విల్హెం గ్రీగర్ జర్మన్ భాషలో రాసిన పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించి కలకత్తా యూని వర్సిటీ నుండి ప్రచురించాడు .సంస్కృతం లో ఆయన మొదటి రచన –‘’లెస్ ఫార్మేశంస్ నామినేల్స్ఎట్ వేర్బెల్స్ ఎం పు డు సాంస్క్రిట్ ‘’

వట కృష్ణ ఘోష్ ఇతర రచనలు –ఆపస్తంభ అండ్ గౌతమ ,గోదే అండ్ హిస్ ఫాస్ట్ ,కలెక్షన్స్ ఆఫ్ ది ఫ్రాగ్ మెంట్స్ లాస్ట్ బ్రాహ్మణాస్ పాణిని ,ఇండో యూరోపియన్ ఆరిజిన్ ఆఫ్ సాంస్క్రిట్ ,వేదిక ,పాళీ లిటరేచర్ అండ్ లాంగ్వేజెస్ ,ఏ సర్వ్ ఆఫ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ,ఏ లా ఆఫ్ విసర్గ సంధి ఇన్ రుక్ సంహిత ,విజ్ఞాన బాడ,హిందూ ఐడియా ఆఫ్ లైఫ్ అకార్డింగ్ టు గృహ్య సూత్రాస్ అండ్ శ్రౌత సూత్రాస్ ధర్మ శాస్త్ర ,అర్ధ శాస్త్ర అండ్ కామ సూత్ర,లింగ్విస్టిక్ ఇంట్ర డక్షన్ టు సాంస్క్రిట్ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 9-వేద వృత్తి ప్రకాశిక కర్త –క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

9-వేద వృత్తి ప్రకాశిక కర్త –క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ

27-10-1896 న బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాలలో హుగ్లీ జిల్లా  నమ్ తా గ్రామం  లో కులీన చట్టోపాధ్యాయ కుటుంబం లో జన్మించిన క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ వేద వ్యాకరణ ,పాళీ ,ప్రాకృత, ఫైలాలజీ లో మహా విద్వాంసుడు .బంకిం చంద్ర చటోపాధ్యాయ కుటుంబ వారసుడేకాక ఆయననుంచి పునరుజ్జీవన భావదారనూ అందిపుచ్చుకున్నాడు .కలకత్తా యూని వర్సిటి నుండి మెట్రిక్ పాసై ,ప్రెసిడెన్సి కాలేజి లో చేరి చదివి ఇంటర్ పాసయ్యాడు .తర్వాత ఆగ్రా ఔద్ యునైటెడ్ ప్రావిన్స్ కు ప్రవాసిగా వెళ్లి అలహాబాద్ యూని వర్సిటి నుండి బి ఏ .బెనారస్ యూని వర్సిటినుండి 1919 లోసంస్కృతం లో  ఎం ఏ . పాసైనాడు .కలకత్తా యూని వర్సిటినుండి 1921 లో వేదం ,1922 లో వేదాంతం లలో ఎం ఏ .పాసయ్యాడు .కాలేజీలో చదివే రోజుల్లో నేతాజీ సుభాస్ చంద్ర బోస్ కు అతి సన్నిహిత మిత్రుడుగా ఉన్నాడు. క్షేత్రేశ డా.గంగా నాద ఝా శిష్యుడు .

1924 లో అలహాబాద్ యూని వర్సిటిలో సంస్కృత లెక్చరర్ గా పని చేసి ,1950 లో రీడర్ గా పదోన్నతిపోంది ,195 6 లో ప్రొఫెసర్ అయి రెండేళ్ళు పని చేశాడు .తర్వాత బెనారస్ లో సంపూర్ణానంద యూని వర్సిటిలో రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ అయి విస్తృత  పరిశోధనలకు  అవకాశాలు  కల్పించాడు .  .సరస్వతి భవన గ్రంధ మాల ధారావాహిక గ్రంధాలకు సంపాదకత్వం వహించాడు .సరస్వతి సుసమ అనే పత్రికకు ఎడిటర్ గా ఉన్నాడు .కేంద్రవిద్యా శాఖ ఆధ్వర్యం లోని తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం లో’’ వేదం అవెస్తా’’ల తులనాత్మక అధ్యయనానికి స్పెషల్ స్కాలర్ గా ఎంపిక చేయబడినాడు .1960 లో కలకత్తా యూని వర్సిటి ఈయనను కంపారటివ్ రెలిజియన్ పై స్టీఫెన్ నిర్మలేందు ఘోష్ లెక్చరర్ గా నియమింప బడ్డాడు .

1924 డిసెంబర్ లో మద్రాస్ లో జరిగిన ఆలిండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ లో క్రియా శీలక పాత్ర వహించాడు .19 37 లో త్రివేండ్రం లో వేదం,ఇండో ఆర్యన్  పై జరిగిన సభకు అధ్యక్షుడై నడిపాడు .1955 లో అన్నామలై యూని వర్సిటిలో 18 సెషన్ లో వేదం పై జరిగిన సభకుఆధ్యక్షం వహించాడు .1946 కరాచీ లో జరిగిన అఖిలభారతీయ హిందీ సాహిత్య సమ్మేళనం ఫైలాలజి సెక్షన్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు .క్షేత్రేశుని సంస్కృత భాషా వైదుష్యానికి మెచ్చి 1966 లో రాష్ట్ర పతి పురస్కారం అందజేయబడింది ‘

ఈశ ,కేన ఉపనిషత్ ‘’వేదవృత్తి ప్రకాశిక ,స్టడీస్ ఇన్ వేదిక్ అండ్ ఇండో ఇండియన్ రెలిజియన్ అండ్ లిట రేచర్ గ్రంధాలను  రాశాడు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 8-సంజ్ఞా నామవాచకాలపై విశేష పరిశోధన చేసిన సమీరన్ చంద్ర చక్ర వర్తి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

8-సంజ్ఞా నామవాచకాలపై విశేష పరిశోధన చేసిన సమీరన్ చంద్ర చక్ర వర్తి

భారతీయ భాషా పరిశోధకుడు ,సంజ్ఞా నామవాచాకాలపై(ఓమాస్టిక్స్ )  విశేష కృషి చేసిన సమీరన్ చంద్ర చక్రవర్తి బెంగాల్ లో జన్మించాడు .వేదాధ్యయనంపై నాపరిశోధన చేసిన సంపాదకుడు .ప్రస్తుతంకలకత్తా యూని వర్సిటిలో ఎమిరిటస్ ఫెలో గా ,జర్మన్ గెస్ట్ లెక్చరర్ గా ఉన్నాడు .రామ కృష్ణా మిషన్ఇన్ స్టి ట్యూట్ సెంటర్ ఫర్ ఇండలాజికల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ కు గౌరవ విజిటింగ్ ప్రొఫెసర్ . రవీంద్ర భారతి యూని వర్సిటి లో స్కూల్ ఆఫ్ వేదిక్ స్టడీస్ లో మాజీ రిటైర్డ్  డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్ ..    ఆపస్తంభ సామాన్య సూత్రలేక యజ్న పరిభాష సూత్రను ,బ్రాహ్మణ సంగ్రహం నురాశాడు .ఆంగ్లం లో ‘’సం ఆస్పెక్త్స్ ఆఫ్ వేదిక్ కల్చర్ ,బుద్ధిజం అండ్ వరల్డ్ కల్చర్ ,ఏ స్టడీఆఫ్ పరిప్లవ ,ది పరిభాషాస్ ఇన్ అశ్రౌత సూత్రాస్ ,ఆన్ ది ట్రాన్స్ లేషన్ ఆఫ్ వేదిక్ సాక్రిఫిసియల్ లోర్,ది పొజిషన్ ఆఫ్ ది పరిభాషాస్ ఇన్ ది టేస్ట్యువల్ ఆర్డర్ ఆఫ్ ది ఆపస్థంభ సూత్రాస్ మొదలైన గ్రంధాలు రచించాడు .

సంస్కృత విద్యా చక్రవర్తి అయిన సమీరన్ చంద్ర చక్ర వర్తి  గ్రిఫ్ఫిత్ మెమోరియల్ అవార్డ్ ,రాస్ట్రీయవేద విద్యా ప్రతిస్టాన్ పురస్కారం ,ఇంటర్నేషనల్ పెంగ్విన్ పబ్లిషింగ్ హౌస్ నుంచి ‘’రైజింగ్ పర్సనాలిటి ‘’అవార్డ్ ,కలకత్తా భారతీయ విద్యా భవన్ నుండి సాంస్క్రిట్ డే అవార్డ్ , 2009 లో రాష్ట్ర పతి పురస్కారం ,బొంబాయి భారతీయ విద్యా భవన్ నుంచి గురు గంగేశ్వరానంద వేద రత్న పురస్కారం అందుకొన్నాడు .

Inline image 1

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -12 నిఘంటువులపై సాధికారత

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -12

నిఘంటువులపై సాధికారత

మల్లినాధుడు అనేక నిఘంటువులు కోశాలనుంచి వాక్యాలను ఉదాహరించి తన వ్యాఖ్యానాలను సమర్ధించుకొన్నాడు .ఒక పదానికి తాను ఒక అర్ధాన్ని చెప్పాడు అంటే అది ఏ కోశాన్ని ఆధారం గా చేసుకొనిసమర్ధించి  చెప్పాడో వివరంగా తెలియ జేశాడు .వ్యాఖ్యాతగా తాను సాధికారంగా ఆ పదానికి సరైన అర్ధం చెప్పగలిగాడు .సంస్కృత భాషలో దాదాపుగా ప్రతి  పదానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి .కవి ఆ పదాన్ని ఏ అర్ధం తో,ఏమి ఆశించి  వాడాడో వివరించి చెప్పాల్సిన పని వ్యాఖ్యాతది.వ్యాఖ్యాత ఆ అర్ధాన్ని నొక్కి చెప్పి ,అందులోని సూక్ష్మాన్ని ,నిగూఢ విషయాన్ని బహిర్గతం చేయాలి .అ అర్థాన్నే ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఎందుకు దానికే ప్రాధాన్యమిచ్చాడో  సోదాహరణంగావివరించాల్సి ఉంది.మరి దీనికి ముఖ్య సాధికార ఆధారం నిఘంటువు లేక కోశమే . కనుక వ్యాఖ్యాత దీన్ని అభ్యంతర పెట్టి కాదనే వారి ని దృష్టిలో పెట్టుకొని ,అనర్హత గల అర్ధాలను చెప్పకుండా ,విమర్శ పాలుకాకుండా ,తనను తాను సమర్ధించుకోవాలి .దీనికి కోశమే శరణ్యం .అందుకని మల్లినాధుడు చాలా కోశాలు లేక నిఘంటువులను ఉపయోగించుకొన్నాడు .పాఠకుడి కి ఆ నిఘంటువులలోని వాక్యాలను ఆయన ఉదాహరిస్తూ వ్యాఖ్యానం చేస్తుంటే ఆశ్చర్యం ఆనందం కలుగుతాయి  ఈ విధంగా తన కాలానికి ఉన్న ప్రముఖమైన ఆ కోశాలను చదువరికి అతి సన్నిహితం చేయటానికి సూరి ఎంతో కృషి చేశాడు . .ఏయే కోశాలలనుంచి ఎన్ని ఉదాహరణలు ఇచ్చాడో చెప్పాలంటే అదొక చేంతాడంత లిస్టు అవుతుంది .అయినా మల్లినాద మనీష తెలుసుకోవాలి అంటే అదే దారి .

అమర కోశాన్ని –శిశుపాల వధకావ్య వ్యాఖ్య లో మొదటి సర్గలో 45 సార్లు ,రెండులో 35 సార్లు ,మూడులో 23 సార్లు ,నాలుగులో 30 సార్లు ,అయిదులో 36 సార్లు ,ఆరవ సర్గలో 28సార్లు ఏడులో 2 సార్లు ,ఎనిమిదిలో 19 సార్లు ,తొమ్మిదిలో 18 సార్లు ,పదిలో అప్ద్దేనిమిది సార్లు ,పదకొండులో పదిహేడు సార్లు ,పదిహేడులో పదహారు సార్లు ,పద్దేనిమిడిలో ముప్ఫై ఆరు సార్లు ,పందోమ్మిడిలో ముప్ఫై మూడు సార్లు ,ఇరవైలో ఇరవై ఒక్క సారి  ఉదాహరించాడు.

కిరాతార్జునీయం లో మొత్తం 297 సార్లు ,రఘు వంశం లో 462 సార్లు ,కుమార సంభవం లో 146 సార్లు ,నైషధం లొ6 24 సార్లు ,మేఘ దూతం లో 80  సార్లు ,భట్టికావ్యం లో 111సార్లు ఉపయోగించాడు.

‘’ వైజయంతి కోశం ‘’ను శిశుపాల వధలో 99 సార్లు ,రఘువంశం లో ఒకే ఒక్కసారి ,కిరాతార్జునీయం లో 4 7సార్లు ,కుమారసంభవం లో 60 సార్లు ,మేఘ దూతం లో 3 సార్లు ఉదాహరించాడు .

‘’శబ్దార్నవం ‘’నుశిశుపాల వధలో 8 సార్లు ,కిరాతార్జునీయం లో 4 సార్లు ,భట్టికావ్యం లో 1 సారి ,రఘువంశం లో 83 సార్లు ,కుమారసంభవం లో 5 సార్లు ,నైషధం లో 2 సార్లు పేర్కొన్నాడు .

‘’క్షీరస్వామి వ్యాఖ్యానాన్ని’’ శిశుపాల లో 2 ,మేఘ లో 2 ,కిరాత లో 3 సార్లు భట్టిలో 1 ,రఘు లో 20 ,కుమార లో 5 సార్లు ,ఉదాహరించాడు

‘’హారావళి ‘’విశ్వ ప్రకాశిక ,హాలాయుధ కోశ ,విశ్వకోశ ,శాశ్వత కోశ,యాదవ కోశ ,భట్తమల్ల వ్యాఖ్య ,లనుంచి కూడా విస్తృతంగా కోట్ చేశాడు .ఇన్ని కోశాలను ఆకలింపు చేసుకొని సందర్భాన్ని బట్టి ఉదాహరించాడు అంటే మల్లినాధుని మనీష ఎంత గొప్పదో తెలుస్తోంది అని పి జి లాల్యే విమర్శక శిఖామణి గుది గుచ్చి ఒక చోట చేర్చి విపులంగా చెప్పాడు . ధర్మ శాస్త్రాలవిషయాలను  వ్యాఖ్యానించ వలసి వస్తే మల్లినాధుడు ‘’మను ధర్మ శాస్త్రాన్ని’’,’’ కామందకాన్ని’’ ఆదారం చేసుకొని వ్యాఖ్యానించాడు .కనుక నిఘంటు ,కోశాలపై మల్లి నాదునికి అద్వితీయ వైదుష్యం సాధికారత ఉన్నాయని వీటన్నిటి వలన తెలుస్తోంది .”కోశమయ జీవి ”అనచ్చు సూరిని . సంస్కృత సాహిత్య శాస్త్రాలలోని అన్ని విభాగాలపై ఆయన పాండిత్యం మహోత్తమమం .కవులు మహా విద్వాంశులు కనుక వ్యాఖ్యాతలు కూడా అంతటి లేక అంతకు మించిన  విద్వాంసులై ఉండాలి .మల్లినాద మనీష ఆయన చేసిన వ్యాఖ్యానలలోని ప్రతి పంక్తిలోను దర్శనమిస్తుంది .సంస్కృత సాహిత్యం లో విభిన్న విభాగాలపై మల్లినాధుని వైదుష్యాన్ని తరువాత తెలుసుకొందాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-16 –ఉయ్యూరు .

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అర్హతకు తగిన గౌరవం

Inline image 1

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన సంపాదక కార్యాలయ ఆస్దాన పండిత పరిషత్తు మండలి లో కృష్ణా జిల్లా రచయితలసంఘం ప్రధాన కార్యదర్శి ,శతాధిక గ్రంథ రచయిత,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ,సరసభారతికి ఆత్మీయులు డా .జి వి. పూర్ణ చంద్ గారిని నియమించి సముచిత గౌరవం కల్పించి నందుకు దేవస్థానపాలకమండలిని ,అర్హత పొందినియమితులైన  ,శ్రీ పూర్ణ చంద్ గారిని మనసారా అభినందిస్తున్నాను -గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-16 -ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరసభారతి 99 వ సమావేశం మరియు లక్ష దీపోత్సవం

సరసభారతి 99 వ సమావేశం మరియు లక్ష దీపోత్సవం

 

Inline image 1

ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో

సరసభారతి 99 వసమావేశం గా 19-11-16 శనివారం సాయంత్రం 6-30 గం లకు కార్తీక మాస సందర్భంగా ”శివ మహిమ ”ధార్మిక ప్రసంగం ఏర్పాటు చేయబడింది .

— 26-11-16 శనివారం సాయంత్రం 6-30 గం .లకు భక్తుల సహాయ సహకారాలతో ”లక్ష దీపోత్సవం ”నిర్వ హింప బడుతుంది .భక్తులు ఈ రెండు కార్యక్రమాలకు విశేషంగా హాజరై జయప్రదం చేయ ప్రార్ధన .                                                         గబ్బిట దుర్గా ప్రసాద్

                                             సరసభారతి అధ్యక్షులు ,మరియు దేవాలయ ధర్మ కర్త

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -11 మల్లినాధుని శ్రుతి వైదుష్యం

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -11

మల్లినాధుని శ్రుతి వైదుష్యం

శ్రుతి అనగానే వేద సాహిత్యం అంతటికీ వర్తిస్తుంది .ఇందులో మల్లినాద సూరి పాండిత్య వైదుష్యాలను తెలియ జెప్పే కొన్ని విషయాలను తెలుసుకొందాం .రఘువంశ ప్రధమసర్గలోని 31 వ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ ‘’దక్షిణా ‘’పదానికి వివరణ నిస్తూ బ్రాహ్మణం లోని ఒక విషయాన్ని ఉదాహరించాడు .-

‘’యజో గాంధర్వ స్తస్య దక్షిణా అప్సరసః –దక్షిణాయా దాక్షిణ్యం నామార్త్విజో దక్షిణత్వం  పాపకత్వం

తే దక్శంతే దక్షిణాంప్రతిగ్రుహ్ణ’’

సూర్యుడు సాయం వేళ అగ్ని లో ప్రవేశిస్తాడు అని వివరించటానికి ఒక వేద వచనాన్ని ఉదాహరించాడు –

‘’సౌరం తేజః సాయమగ్నిం ప్రకమతే –ఆదిత్యో వా అస్తం యన్నగ్ని మను ప్రవిశతి –అగ్ని ర్వా ఆదిత్యః సాయం ప్రవిశీతి ‘’ కుమారుని ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక దాన్ని(కొటేషన్) ఉల్లేఖించాడు –

‘’ఏష అనృణీ యః పుత్రీ యత్వా బ్రాహ్మ చారీవా ‘’

‘’యదా సాంఖ్య ‘’అనే భావాన్ని వివరిస్తూ మతానికి సంబంధించిన సహాయకాలను ఉపయోగించుకొన్నాడు .ఎక్కువభాగం మీమాంస లోని చర్చలను ఉల్లేఖించి ,బ్రాహ్మణ పాఠ భాగాలను సంయోజనం చేస్తూ వాటి క్రమసంబందాన్ని విస్పష్ట పరచాడు.ఉపనిషత్ వాక్యాలను ఉదాహరించి భావం బలీయం చేశాడు .దేవతలు విష్ణుమూర్తి పై చెప్పిన స్తోత్రాలను చెబుతూ గతి ధర్మానికి ఉపనిషత్ వాక్యాలను చూపించాడు –‘’తమేవం విదిత్వా తి మృత్యుమేతి నాన్యః పంధా విద్యతే యనాయ ‘’అని రఘువంశం లో –‘’’’ఆత్మా వా రదమేక ఏవాయం పంధా విద్యతే యనాయ ‘’అని కుమార సంభవం రెండవ సర్గ లో –‘’సమవేదే నాస్తమయే గీయతే ‘’కుమారా సమ్భవ౦ 8 వ సర్గలో చెప్పాడు .

వ్యాకరణ పాండిత్యం

మల్లినాధుని వ్యాకరణ పాండిత్యం అవధులు లేని సముద్రమే .కొన్ని వ్యాకరణ గ్రందాలలోతులు తరిచి చూశాడు .అవి ఆయనకు వాచోవిధేయాలయ్యాయి .మనం ఇప్పుడు చెప్పేమాట ‘’ఫింగర్ టిప్స్ ‘’పై వ్యాకరణ సూత్రాలుంటాయి ఆయనకు .అత్యధికంగా పాణిని సూత్రాలను ఉదాహరించాడు .పదం యొక్క అర్ధాన్ని పూర్తిగా వివరిస్తే తప్ప ఆయనకు సంతృప్తి ఉండదు .అదీ మల్లినాదీయం .పతంజలి ,కైయాట,వృత్తికార లనుండి మూడు ఉదాహరణలు ముందు తెలుసుకొందాం .

ఉదాహరణ –మునిద్ర తాది త్యత్ర యద్యపి మునిద్ర తస్య మేనకాయా అనీప్సిత త్వాత్ ‘’కారణానార్ధ నాప్మీప్సితః ‘’ఇతి నాపాదానత్వం తయ్యాపి క్రుతోద్యమామితి  మానసప్రవేశో త్కర్తవ్యతాత్  ధ్రువ మపాయే పాదనం ఇత్యపాదానత్వమేవ స్యాత్ ‘’

1-యత్రామిధ్యా సంప్రన్య నివర్తతే తచ్చ ధృవం పాయేపాదానం ఇతి ప్రసిద్ధం (కుమారసంభవ వ్యాఖ్యానం-5-3  )

2-విశ్వ యోనే రితి షష్టీ తస్యానంతర మితి భాష్యేదర్శనాత్ ‘’                  (.’’’’’’’’                          6-9 )

3-అలమితిపర్యష్య ర్ధగ్రహణం ఇతి భాష్యకారః ‘’(మేఘ దూత వ్యాఖ్య -44)

రఘు వంశం లో ‘’విశ్రామయ ‘’కు అర్ధాన్ని వృత్తికార ఆధారం గా తెలియ జేశాడు  .శ్ర ను దీర్ఘం  చేయటం గత్యంతరం లేక చేయటమేనని ఇది ‘’వ్యవస్థిత విభాస ‘’కు చెందుతుందని ,కొన్ని ‘’స్లిస్ ‘’లాంటి మూలాలు  ఉపసర్గ లున్నప్పుడు సకర్మకాలౌతాయని చూపించాడు .

‘’విశ్రామయ విశ్రమయ ఇతి హస్తపాఠే ‘’జానీ మ్రుస్ట ఇతి మిత్వే మితాం హ్రస్వ ఇతి హ్రస్వః –దీర్ఘపాఠే మితాం ఇతి సూత్రే వా చిత్త విరాగే ఇత్యతో వా ఇత్యను వర్త వ్యవస్థిత విభాషా శ్వ ణాత్వాద్ హ్రస్వ భావః ఇతి వ్రుత్తి కారః ‘’(రఘు వంశ వ్యాఖ్య )

అలాగే ‘’ఉభ ‘’కు బదులుగా ‘’ఉభయ ‘’ను వాడటం విషయం లో రఘు వంశ వ్యాఖ్యలో వివరించాడు .ద్విరేఫనుసమర్ధిస్తూ కయ్యాటుని సూత్రంతో సమర్ధించాడు .వామనుడిని కనీసం 12 సార్లు మల్లినాధుడు ఉదాహరించాడు ..ముఖ్యంగా ‘’అగ్రపాద’’భావ నేత్ర జన్మా ,బింబాధర మొదలైన సంయోగ పదాలలో వామనుడిని బాగా వాడుకొన్నాడు .’’అతర్జాయత్ ‘’క్రియను సమర్ధించే ‘’ఆఖ్యాత చంద్రిక ‘’లోని సూత్రాన్ని వివరించాడు .కొన్ని సార్లు మల్లినాధుడు గ్రంధ కర్తపేరు చెప్పకుండానే వారి సూత్రాలను ఉదాహరిస్తాడు .’’విత౦త్రిః’’మొదలైన వాటిలో   విసర్గ లోపాన్ని  సమర్ధించాడు .-‘’అవి తస్తుతాన్త్రిభ్య ఈః’’ఇతి పత్నీ దాతో రైణాదిక ఈ ప్రత్యయః విభావాన్న —‘’ఇలా చెప్పుకొంటూ పోతుంటే ఎన్నెన్నో ఉన్నాయి .అని లాల్యే పండితుని వ్యాఖ్య .

సశేషం

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -15-11-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి ఆహ్వానం

aahvaanam-page-1 aahvaanam-page-2

Posted in సభలు సమావేశాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 7- మహేశ చంద్ర న్యాయ రత్న భట్టాచార్య

–  గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

7- మహేశ చంద్ర న్యాయ రత్న భట్టాచార్య

22-2-1836 న కులీన బ్రాహ్మణ కుటుంబం లో మహేశ చంద్ర భట్టాచార్య బెంగాల్ లో జన్మించాడు .నారిత్ కు చెందిన ఈ కుటుంబం తరతరాలుగా సంస్కృత భాషా పాండిత్యం లో పండిపోయింది .ఆ కుటుంబం వారందరూ దాదాపు సంస్కృత మహా విద్వా౦సులే.తండ్రి హరినారాయణ తర్క సిద్ధాంతం లో అద్వితీయుడు .ఒక బాబాయి గురుప్రసాద్ తర్క పంచానన బిరుదు పొందితే మరో బాబాయి ఠాకూర్ దాస్ చౌరామణి విశిష్ట పండితునిగా గుర్తింపు పొందాడు .పెద్దన్న పండిట్ మాధవ చంద్ర ‘’సార్వ భౌమ ‘’బిరుదు నందుకుని మహిషాదల్ రాజ్య సభా పండితుడైనాడు .

హుగ్లీ లోని జహానాబాద్ కు చెందిన  పండిత రామ చదర తర్క భాగిస్ కుమార్తె మందాకినీ ని వివాహమాడి మనోరమ ,మన్మధ నాద విద్యార్ధ భట్టాచార్య  ,మునీ౦ద్ర నాద్ భట్టాచార్య,మహిమ నాద భట్టాచార్య లకు తండ్రి అయ్యాడు  .పెద్దకొడుకు మద్రాస్ రాస్ట్ర మొదటి ఇండియన్ అకౌంటంట్ జనరల్  .

మహేశ భట్టాచార్య 70  వ ఏట 12-4-1906 న మరణించాడు .

18 7 6 లో ప్రసన్న కుమార్ సర్వాధికారి స్థానం లో సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు .ప్రిసిపాల్ గ 19 ఏళ్ళ పాలనలో సంస్కృతం లో ప్రతిభ గల విద్యార్ధులకు అర్హతలను బట్టి గౌరవ స్థానాలను కల్పించాడు .స్వగ్రామం నారిత్ లో ఆంగ్లో –సాంస్క్రిట్  సెకండరీ స్కూల్ ఏర్పాటు చేశాడు .కావ్య ప్రకాశ ,మీమాంస దర్శన ,కృష్ణ  యజుర్వేదాల ను విలువైన పీఠికలు రాసి సంపాదకత్వం వహించి ప్రచురించాడు .దయానంద సరస్వతి వేద భాష్యం పైనా,తులసీ ధర మీమాంస పైనా ,మృచ్చకటిక కర్త పైనా ,లుప్త సంవత్సరం పైనా అనేక పత్రాలు రాశాడు .దయానంద భాష్యంపై భట్టాచార్య చూపించిన అభ్యంతరాలకు దయానంద స్కూల్ సంస్కృత విద్వాంసుడు తెలియ బరచిన వివరాలను ఒక పుస్తకంగా ప్రచురించాడు .సంస్కృత విద్యా వ్యాప్తికి భట్టా చార్య కృషి ప్రశంసనీయం .సంస్కృత విద్యాలయాలకు కావలసిన నిధి సేకరణ కూడాచేసి వాటి నిర్వహణకు తోడ్పడ్డాడు .

నారిత్ గ్రామంలోను ,పరిసరాలలోనూ  మంచి రోడ్ల నిర్మాణం చేబట్టాడు .స్వంత జిల్లా హౌరా లోని ట్రా౦ రోడ్ల విషయం లోనూ శ్రద్ధ చూపాడు .16-2-1887 న విక్టోరియా రాణి పట్టాభిషేక రజతోత్సవ  నాడు ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదాన్నిచ్చి గౌరవించారు .’’మోస్ట్ ఎమినేంట్ ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ ‘’ భట్టో పాధ్యాయ  గుర్తింపు పొండాడు .భారతీయ సంస్కృత విద్వాంసులు ‘’న్యాయ రత్న ‘’బిరుదం తో సత్కరించారు .హ౦గేరిలోని బుడాపెస్ట్ లో ఉన్న ‘’హంగేరియన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ‘’ఫారిన్ మెంబర్ గా ఎన్నుకో బడ్డాడు .కలకత్తా విశ్వ విద్యాలయం ,బెంగాల్ లోని టెక్స్ట్ బుక్ కమిటీ ,బీహార్ సాంస్క్రిట్ సమాజ్ బొంబాయిలోని  ఆంధ్రో పలాజికల్ సొసైటీ లలో గౌరవ సభ్య స్థానం పొందాడు..హిందూ హాస్టల్ కమిటీ జాయింట్ సెక్రెటరిగా ,బెతూన్ కాలేజి మెంబర్ గా ,హౌరా ఇంజినీరింగ్ కాలేజి కి విజిటర్ గా ఉన్నాడు .బెంగాల్ ప్రెసిడెన్సిలో అంటే బెంగాల్ బీహార్ ఒరిస్సాప్రాంతాల సంస్కృతానికి న్యాయ రత్న స్థాయి లో ఇంచార్జి గా సేవలు అందించాడు .ఉత్తర కలకత్తాలోని శ్యాం బజార్ కు ‘’భట్టా చార్య బజార్ ‘’అని గౌరవ నామం పెట్టి గౌరవించారు .వందలాది ఆయన వద్ద విద్య నేర్చి సంస్కృత మహా విద్వాంసు లయ్యారు .

Inline image 1

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

12-11-16 శనివారం మధ్యాహ్నంయాకమూరు ప్రాధమికోన్నత పాఠశాలలో పఠనోత్సవం బాలల దినోత్సవం లోముఖ్య అతిదిగానేను పాల్గొన్న చిత్ర మాలిక

12-11-16 శనివారం మధ్యాహ్నంయాకమూరు ప్రాధమికోన్నత పాఠశాలలో పఠనోత్సవం బాలల దినోత్సవం లోముఖ్య అతిదిగానేను పాల్గొన్న చిత్ర మాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు (వ్యాసం ) –

ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు (వ్యాసం ) – గబ్బిట దుర్గా ప్రసాద్

ఫిన్నిష్ సాహిత్య నేపధ్యం

ఫిన్లాండ్ దేశం లో మొదటి రచన 13 వ శతాబ్దపు బర్చ్ బార్క్ లెటర్ గా గుర్తింపబడింది .అప్పటి రచనలు స్వీడిష్ ,లాటిన్ భాషలోనే ఉండేవి .16 వ శతాబ్దం నుండే ఫిన్నిష్ భాషాభి వృద్ధి మొదలైంది .ఫిన్నిష్ భాషలో మొదట రాసిన వారిలో ఫిన్నిష్ ,లూదరన్ ,మైకేల్ అగ్రికోలాలు 1510-1557 మధ్య రాశారు .అగ్రికోలా న్యు టెస్ట్ మెంట్ ను 1548 లో ఫిన్నిష్ భాషలోకి అనువదించాడు .

19 వ శతాబ్ది పూర్వ భాగం లో ఫిన్లాండ్ రష్యా పాలనలో ఉండేది .స్వాతంత్ర సముపార్జనకై ఉద్యమాలు సాగటం తో జానపద సాహిత్యం అభి వృద్ధి చెందింది .మొదట్లో ఇవీ స్వీడిష్ భాషలో ప్రారంభమై క్రమంగా ఫిన్నిష్ భాషలో వ్యాప్తి చెంది ఫిన్నిష్ అస్తిత్వాన్ని సాధించింది .వేలాది జానపద కవితలు సేకరి౦చి ప్రచురించారు .మొదటి ప్రముఖ కవితా సంకలనం 1835 లో వచ్చిన ‘’కలే వాల ‘’ .అలెక్సిస్ కివి రాసిన ‘’సెవెన్ బ్రదర్స్ ‘’ఫిన్నిష్ మొదటినవల 1870లో వచ్చింది ‘’.ఫ్రాన్స్ ఈ మిల్ సిలనపా ‘’రాసిన ‘’మీక్ హెరిటేజ్ ‘’కు మొదటి నోబెల్ బహుమానం వచ్చింది .మరో ప్రముఖ రచయిత వైనో లిన్నా.ఇలా ఫిన్నిష్ సాహిత్యం ప్రపంచ గుర్తింపు పొందింది .ఇప్పుడు ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయితల గురించి తెలుసుకొందాం .

1- ఫిన్నిష్ దేశపు మొదటి కవయిత్రి -క్రిస్టినా రేజీనా వాన్ బర్చేన్ బాం : 

17 వ శతాబ్దపు ఫిన్నిష్ రచయిత్రి క్రిస్టినా వాన్ బర్చేన్ బాం స్వీయ చరిత్ర వంటి ఒకే ఒక ఆక్రోస్టిక్ కవిత 24-7-1651 లో రాసిన ‘’ఎనాన్నన్ నీ వీసా (మరో కొత్త పాట ) మాత్రమే లభించింది .ఎనిమిది లైన్లు ఉన్న స్టాంజాలలో 29 లైన్లు మాత్రమె దక్కాయి .ఇది ఫిన్నిష్ జానపద పాటలాగా ఉంటుంది .దీన్ని లింకో పిన్ లైబ్రరీలో భద్ర పరచారు . బర్చేన్ బాం కేరేలియా లో జన్మించింది .మూడేళ్ళప్పుడే తండ్రి చనిపోయాడు .వరించి వచ్చిన వరుని వివాహమాడి’’ ముప్ఫై ఏళ్ళ యుద్ధం ‘’ లో పాల్గొనటానికి భర్త వెడుతూ ఒక సందేశం రాసి పంపితే విషయం తెలుసుకొన్నది .17 ఏళ్ళు అతని కోసం నిరీక్షించి ఇక తిరిగి రాడు అని నిశ్చయం చేసుకొని ,తన వలపు వయసు వ్యర్ధమైనాయని బాధపడి ఒక య౦గ్ నోబుల్ మాన్ ను మళ్ళీ పెళ్ళాడింది .స్వార్ధ పరుల పుకారుల మధ్య అక్కడ ఉండ లేక కొత్త జంట విడిపోయింది .తన కవితలో తాను ఒంటరి దానినని వేదన భరించలేక తాను ఈలోకాన్ని వీడి వెళ్లి పోతున్నానని రాసుకొన్నది .ఫిన్లాండ్ దేశపు మొట్ట మొదటి కవయిత్రి గా బర్చేన్ బాం గుర్తింప బడింది

2—నాటక రచయిత్రి -క్రేస్టి సాల్వేజ్ బెర్గ్రోత్ : 

24-1-1886 న జన్మించిన కరే స్టి సాల్వేజ్ బెర్గ్రోత్ ప్రముఖ రచయిత ,నాటక రచయిత కూడా .చిన్నతనం లోనే సాహిత్యాభిలాష అలవడిన అదృష్ట వంతురాలు .1920 వరకు స్వీడిష్ భాషలోనే రాసి ,ఇంగ్లీష్ ఫ్రెంచ్ సాహిత్యాన్ని ఫిన్నిష్ భాషలోకి అనువాదం చేసింది .ఆమెకు జర్మన్ భాషపైనా మంచి పట్టు ఉంది.కేరిలియన్ మాండలికం లో ఆమె రాసిన ’’అను జా మిక్కో ‘’,కుపార్ సారే అంటి ‘’నాటకాలు బహుళ ప్రచారం పొందాయి .నవలలు నాటకాలు జ్ఞాపకాలు ,పిల్లల కధలు అన్నీ కలిపి 70 దాకా రాసింది .
వాలంటైన్ వాలా అనే సినిమా దర్శకునితోకలిసి ‘’టేట్’’అనే మారుపేరుతో ‘’మొర్సిలయన్ య్లాట్ట ,తోషితార్కోటు క్షేల ,డైనమిట్టీతో,ఊక్రా సుల్హానేన్ ,వికాన్ టిట్టో అనే ,అయిదు సినిమాలకు పని చేసింది .ఇవన్నీ హాస్యపు గుళికలే ఆమె రచనా ప్రతిభకు ఉదాహరణలే .యుద్ధానంతర కాల ప్రజలు ఈమె రచనలను పెద్దగా మెచ్చలేదు. మనసు గాయపడి రోమ్ ,ఇటలీలు తిరుగుతూ అప్పుడప్పుడు ఫిన్లాండ్ వస్తూ 1970 లో ఫిన్లాండ్ లో స్థిర బడింది .1975 జనవరి 24 న 7 9 వ ఏట హెల్సింకి లో మరణించింది .

3 – మత్స్య కార నవలా రచయిత్రి -అన్ని బ్లోం క్విస్ట్ : 

7-10-1909 లో అన్ని బ్లోం క్విస్ట్ రష్యన్ సామ్రాజ్యం లో ఉన్న గ్రాండ్ డచి ఫిన్ లాండ్ లోని అలాన్ ఐ లాండ్స్ లోని వార్డో లో జన్మించింది .తండ్రిది చేపలు పట్టే వ్రుత్తి .పది మంది సంతానం లో పెద్దది ..అమ్మమ్మ అన్నా దగ్గర పెరిగి మూడు నవలల శ్రు౦ ఖల రాసింది .1936 లో వాల్టర్ బ్లూమ్ క్విస్ట్ ను పెళ్లి చేసుకొని నలుగురు సంతానం కని, చేపల వేట, షిప్పింగ్, కొద్ది పాటి వ్యవసాయం పై జీవించారు .చురుకు దనం ఉండటం వలన స్థానిక మార్తా సంస్థకు చైర్మన్ అయి ,వాక్సినేషన్ ను ప్రోత్సహించింది .ఆలాండ్ ఐలాండ్ కు విద్యుచ్చక్తి రావటానికి కృషి చేసింది .ఆమె రాసిన మొదటి చిన్నకధ పోటీలలో మొదటి బహుమతిని 1949 లో సాధించింది .
రెండేళ్ళ తర్వాత మూడు నవలల ‘’ స్టారంస్కార్స్ –మజ’’ సీరియల్ లో మొదటినవల ‘’వేగెన్ స్టిల్ స్టారం స్కారేట్ ‘’నుప్రచురించింది .అయిదు నవలల ఈ సీరియల్ చేపలు పట్టే వాని భార్య మజ జీవిత చరిత్ర .ఈ నవలలు 19 7 5 లో టెలి సీరియల్స్ గా వచ్చాయి .అశేష ఆదరణ పొందాయి .1973 లో ఈ సీరియల్ లోచివరినవల పూర్తీ చేయగానే ,హెల్సింకి యూని వర్సిటి లోని స్టిగ్ జటినేన్ తో కలిసి ఆలాండ్ ఐలాండ్ ప్రజల జీవితం పై అధ్యయనం చేసి,’’సిమ్ స్కాలా ‘’పేరుతో దీన్ని 1977 లో ప్రచురించింది

తర్వాత ‘’అన్నా బీటా ‘’ట్రయాలజి మొదలు పెట్టి మొదటి నవల ‘’అన్నా బీటా ‘’రాసి 1979 లో వెలువరించింది .ఇందులోని కధలన్నీ తన అమ్మమ్మ భర్త అయిన తాతయ్య జీవిత చరిత్రే .1987 లో ఆమె కొడుకు సముద్రం లో మునిగి చనిపోయాడు .ఈ విషాదాన్ని జీవిత చరిత్రగా ‘’హావేట్ ఫిన్స్ ఇంటర్ మెర్ ‘’పేరిట రాసి 1989 లో ప్రచురించింది .జీవితాంతం వార్డో లో గడిపి బ్లోం క్విస్ట్ 26-6-1990 న 80 ఏళ్ళ వయసులో మరణించింది .ఆమె గౌరవార్ధం ఆలాండ్ ఐలాండ్ ప్రభుత్వం 21-3-2009 న ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది .క్విస్ట్ రెండు ఫిక్షన్ లు ,మజ సీరియల్ లో 5 నవలలు ,అన్నా బీటా ట్రయాలజిలో 3 నవలలు ,స్వీయ చరిత్ర వంటి 3 రచనలు చేసి ఫిన్నిష్ సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది .చేపలు పట్టే స్త్రీ ఒక్కొక్క మెట్టూ ఎక్కి అనితర సాధ్యమైన సాహిత్య కృషి చేసి తనకు తన వ్రుత్తి వారికి తన గ్రామానికి ఆలాండ్ ఐలాండ్ కు చిర యశస్సు నార్జించి పెట్టిన స్త్రీ రత్నం బ్లోం క్విస్ట్ .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -10 మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ? -3

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -10

మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ?-3

శిశుపాల వధ పై మల్లినాధుని ‘’కూలంకష ‘’వ్యాఖ్యానాన్ని కూలంకషంగా తెల్సుకొందాం  .మల్లినాధుడు నిష్పాక్ష పాత౦ గా గుణ దోషాలను విమర్శిస్తాడు .సాధుత్వ అసాదుత్వాలను ప్రమాణ పూర్వకం గా సిద్దాన్తీకరిస్తాడు .తప్పు ఉంటె చెప్పటానికి వెనుకాడడు .సాధ్యమైనంతవరకు కవి పోకడను సమర్ధిస్తాడు .కవి ప్రయోగం ఏవిధంగా సమర్ధనీయం కాదో ,చెప్పి దుస్సాధనం అనిపిస్తే ఖండిస్తాడు .ఇతర వ్యాఖ్యాతల అపోహల్ని దురభిప్రాయాలను అప వ్యాఖ్యానాలను అక్కడక్కడ ప్రస్తావించి నిరాకరిస్తాడు .దోషాలను చెప్పేవాడేకాని ,మల్లినాధుడు దోషాలనే వెతకాలనే రంధ్రా న్వేషకుడు కాదని గ్రహించాలి .విచక్షణతో పాటు సౌజన్యం మూర్తీభవించిన  వ్యాఖ్యాత .’’వ్యాఖ్యానతో విశేష ప్రతి పత్తిః’’అన్నట్లు గ్రంధం లోని విశేషాలను తెలియ జేస్తూ ,దానికి అనుబంధంగా వ్యాఖ్యానం నడిపిస్తాడు .ఇవన్నీ పూర్వం మనం తెలుసుకోన్నవే .అవికాక సర్వం కష లో  మిగిలిన విషయాలను తెలుసుకొందాం .

ఆకాశం నుంచి కిందకు దిగి వచ్చే తేజో రాశిగా నారద మహర్షి ని  వర్ణిస్తూ మాఘకవి ‘’క్రమాదముం నారద ఇత్యభి బోధిస ‘’అని వర్ణించాడు కర్మవాచాకమైన నారద శబ్దం రెండవదిగా రావాల్సి ఉంటె ‘’ఇతి ‘’అనే దానితో చెప్పబడటం తో కర్మత్వం రాలేదని ‘’నిపాతే నాభిహితే కర్మాణి న కర్మ విభక్తిః’’అనే వామనుని సూత్రాన్ని సూచించి మల్లినాధుడు సమర్ధించాడు .

’’రణద్భి రాఘట్టనయానభస్వతః ప్రుధగ్వి భిన్న శ్రుతి మన్దలైః స్వరైః’—స్ఫుటీ భవద్గ్రామ విశేష మూర్చనా మవేక్ష మాణం మహతీం ముహుర్ముహుః’’అన్న శ్లోకం లో సంగీత విషయాలను కూలంకషంగా చర్చించి వెలుగు లోకి తెచ్చాడు .అవసరమైనంతవరకే గ్రహించి ‘’తత్రేహ నామాని  తు-నాపేక్షిత ముచ్యతే –ఇతి ప్రతిజ్ఞా భంగ భయాన్నలిఖ౦త ఇతి ‘సర్వ మదాతం’’అని అందంగా ముగించాడని చెరువు వారు ఉవాచ .  ద్వారకకు వచ్చే నారదుని వర్ణనలో మాఘుడు రాసిన శ్లోకాలను వ్యాఖ్యానిస్తూ మల్లినాధుడు ఆ శ్లోకం లోశ్రుతి స్వర గ్రామ మూర్చనాది సంగీత శాస్త్ర పారిభాషికాలను అను సందానించాడు .నారదుని వీణ మహతి .స్వర ప్రారంభం లో ప్రధమ శ్రావణ రూప హ్రస్వ మాత్ర శబ్ద విశేషాన్ని శ్రుతి అని ,శ్రుతి తర్వాత అనురణన ధ్వనికి స్వరమని ,స్వరాలు ఏడు అని ,స్వర సందోహాన్ని గ్రామం అంటారని ,నంద్యా వర్త ,జీమూత ,సుభద్ర అనే మూడు గ్రామాలకు షడ్జ ,మధ్యమ ,గాంధారాలు జన్మ హేతువులుగా ప్రసిద్ధాలని ,మూడు గ్రామాలలో ముఖ్యం గా ఏడేడు మూర్చనలు ఏర్పడగా మొత్తం 21 మూర్చనలు అవుతాయని ,ఇన్ని పారి భాషిక పదాలను నారద వర్ణనలో మాఘకవి తన సంగీత అభిజ్ఞాతను చాటుకున్నాడు. ఆ లోతుల్ని మల్లినాధుడు వెలికి తీసి వ్యాఖ్యానించాడు .

ఏకాదశ సర్గ లో వైతాళికులు శ్రీ కృష్ణుని మేలు కొలుపు పాడే సందర్భం లో శ్లోకాలోనూ సంగీత ప్రస్తావన ఉంది –

‘’శ్రుతి సమధిక ముచ్చైః పంచమం పీడ యంతః –సతత మ్రుషభహీనం భిన్నకీ కృత్య షడ్జమం

ప్రణి జగదు రకాకు శ్రావక స్నిగ్ధ కంఠాః–పరిణతి మితి రాత్రేః మాగాదా మాధవాయ ‘’

పంచమ ,ఋషభ,షడ్జ స్వరాలు వదిలేసి మిగిలిన స్వరాలతో కూడిన రాగ ప్రస్తారాలతో వంది మాగధులు సుప్రభాత గీతాలను పాడి మేలుకొలిపారు .షడ్జ ఋషభ షడ్జ స్వరాలు ప్రభాత సమయం లో ఉపయోగించ రాదు అని భరతమహర్షి చెప్పిన దాన్ని కవి బాగా అర్ధం చేసుకున్నాడని సూరి వ్యాఖ్య .

అలాగే మాఘ కవి కి ఉన్న నాట్య శాస్త్ర పాండిత్యాన్ని ,భరతుని ధనుంజయుని కవి ఎంత చక్కగా సమన్వయము చేసి రాశాడో వివరంగా తెలిపాడు .భోజనాలు నాటకాలులాగా ఉన్నాయని కవి రాశాడు .ఆ సంబంధం ఎలా ఉందొ సూరి వ్యాఖ్యానించాడు .అలాగే అలంకార కామ ,వైద్య ,ధనుర్వేద మంత్రం సాముద్రిక శకున ,రత్న ,గజ ,అశ్వ , శాస్త్రరహస్యాలన్నీ కవికి కరతలామలకాలు .వాటి లోతులను తరచి నిగ్గు తేల్చి చూపాడు సూరి  ,మాఘ కావ్యం లో ప్రతి శ్లోకం లో ఏదో ఒక విశేషం ఉంటుంది .15 వ సర్గలో 34 శ్లోకాలు ప్రక్షిప్తాలు అనిపండితాభి ప్రాయం .శబ్దార్ధ శైలీ భావాలలో కూడా మిగిలిన కావ్యం కంటే తేడాలు కనిపిస్తాయి .వీటిలో స్తుతి ,నింద రెండు కూడా ఉన్నాయి .16 వ సర్గ లో అననుకూలమైన ప్రతికూల అర్ధ బోధకాలైన దూత వాక్యాలను వర్ణించే శ్లోకాలు పేలవం గా కావాలనే రాసినట్లున్నాయి.వల్లభ దేవుడు వీటికీ వ్యాఖ్యానం రాశాడు .కాని మల్లినాధుడు అవి మాఘ కవి రచన కానందున ‘’నా మూలం లిఖ్యతే కించిత్ ‘’అని తాను చేసిన ప్రతిజ్ఞననుసరించి వ్యాఖ్యానం చేయలేదు

‘’ప్రతి శరణమ శీర్ణ జ్యోతి రగ్న్యాహితానాం ‘’అనే శ్లోకానికి మీమా౦సా దర్శన పరిచయాన్ని విపులంగా రాశాడు .మల్లినాధుడు శ్రుతిమీమాంసా ప్రమాణాలతో శ్రౌత క్రియాదులను వివరిస్తూ సుదీర్ఘంగా వ్యాఖ్యానించి చివరికి ఇక ఈ చాందస గోస్టీ వ్యసనాన్ని చాల్లే పొమ్మని కొంటేతనంగా పూర్తీ చేశాడని చెరువువారి విశ్లేషణ .మల్లినాధుడు వ్యాకరణ ప్రక్రియను అంతటినీ సూత్రప్రదర్శన పూర్వకం గా వ్యాఖ్యానించి ‘’స సంతత౦ దర్శయతే గతస్మయః ‘’అనే కిరాతార్జునీయానికి రాసిన ఘంటా పద వ్యాఖ్యలో చక్కగా విచారించానని ,తాను వ్యాఖ్యానాలు రాసిన గ్రంధాలలో ఎక్కడెక్కడ అలాంటి ప్రయోగాలున్నాయో వాటిని సందర్భాను సారం గా చదువుకొనే వారికి తేలికగా ఉండేట్లు చేసి వ్యాఖ్యాతలకు ,విమర్శకులకు ఆదర్శ ప్రాయంగా మల్లినాద సూరి నిలిచాడు .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

6-11-16 ఆదివారం విజయవాడ ఐలాపురం హోటల్ లో ఆంద్ర పత్రిక సాహితీ సేవ, శత వసంతోత్సవ సభ చిత్రాలు

Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo: with sri ke srinivasarao -secretary ,sahitya akademy
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -7

-పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -7

31-‘’కృశ పరిణతి చేతః క్లేశ వశ్యం కవ చేదం –కవ చ తవ గుణ సీమోల్లంఘినీ శశ్వ దృద్ధిః

ఇతి చకితమ మందీకృత్య మాం భక్తి రాధాత్-వరద చరణ యోస్తే వాక్య పుష్పోపహారం ‘’.

భావం –భక్త వరదా శివా !నామనస్సు కృశించే లక్షణం కలది .ఎన్నో కష్టాలకు  వశమైనది .కనుక నా మనస్సెక్కడ ?ఎల్లప్పుడూ పరిమితులు మించి ఉండే నీ మహిమ ఎక్కడ ?ఏవిధంగా నీ గుణాలను నామనసు భావి౦చ గలదు ?దానికి అది సాధ్యం కాని పనికదా అని ఎంతో భయపడుతున్నాను .కానీ నీ పై భక్తి నన్ను మండుడిని చేయటం లేదు .అది నన్ను యెంతో ఉత్సాహ వంతుణ్ణీ,సమర్దుడిని చేస్తుంది .దాని ఫలితం గా నీ పాద ద్వయానికి ఈ శ్లోకాలనే పుష్పాలను కానుకగా ఆ భక్తియే సమర్పింప జేస్తోంది .

‘’భక్తిః కిం న కరోత్యహో వనచరో భాక్తావత౦సాయతే ‘’అన్నారు శంకర భగవత్పాదులు శివానంద లహరి లో .భక్తిచేయలేని పని లేదని తాత్పర్యం .

32-అసిత గిరి సమం స్కాత్కజ్జలం సింధు పాత్రే –సుర తరు వర శాఖా లేఖినీ పత్ర ముర్వీ

లిఖతి యది గృహీత్వా శారదా సర్వ కాలం –తదపి తవ గుణానా మీశ పారం న యాతి ‘’

భావం –పరమేశా !సముద్రం పాత్రగా ,కాటుక కొండ అంత కాటుక మసి తో ,కల్ప వృక్షపు కొమ్మ ఘంటం గా భూమి అంతా రాసే పత్రం గా ఏర్పడి వీటినన్నిటి సాయం తో సాక్షాత్తు సరస్వతీ దేవి యే లేఖకురాలై వ్రాయటానికి పూనుకొన్నా నీ గుణాలనన్నిటినీ వ్రాయటం సాధ్యం కాదు కదా .

‘’యాత్ర వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ‘’అని శ్రుతి .ఒకప్పుడు వాక్కులు పరమాత్మను వర్ణించటానికి పూనుకొని కొంతదాకా వెళ్లి శక్యం కాక మనసుతో అవి తిరోగమనాన్ని పొందాయని .సర్వం తానె అయిన పరబ్రహ్మను వర్ణించటం అసాధ్యం అని భావం .

33-అసుర సుర మునీన్ద్రై రర్చిత స్యేందు మౌళేః-గ్రథిత గుణ మహిమ్నో నిర్గుణ సేశ్వరస్య

సకల గుణ వరిస్టః పుష్పదంతాభి దానో –రుచిర మలఘు  వృత్తైః స్తోత్ర మేతచ్చకార ‘’

భావం –శ్రేష్ట రాక్షస ,దేవ ,ముని గణాలచే అర్చింపబడే పరమేశ్వరుడు చంద్రుని శిరోభూషణంగా ఉన్నవాడు ,గుది గుచ్చిన సద్గుణాల మహిమకలవాడు ,త్రిగుణాలకు అతీతుడు .అలాంటి సర్వేశ్వరుని మహిమలను వర్ణించే ఈ స్తోత్రాన్ని పుష్పదంతుడు కూర్చాడు .అతడు భక్తులకు ఉండాల్సిన లక్షణాలున్న  శ్రేష్టుడు.భావ గర్భితమైన ఈ స్తోత్రం ఎంతోమధురమైనది ఛందస్సుసంబంధించిన విశిష్టమైన వృత్తాలతో రచి౦ప బడింది.

34-‘’అహరహరనవద్యం దూర్జటేః స్తోత్రమేతత్ –పరతి పరమ భక్త్యా శుద్ధ చిత్తః పుమాన్యః

స భవతి శివ లోకే రుద్రా తుల్య స్తథాత్ర-ప్రచురతర  ధనాయుః పుత్రవా న్కీర్తి మాంశ్చ’’

భావం –పరమేశ్వరుని సంబంధించిన ఈ స్తోత్రం ఉత్తమమైనది .ప్రతి రోజూ రాగ ద్వేషాదులతో కలుషితం కాని శుద్ధమనసు కలిగి ,పరమభక్తి తో దీన్ని పఠించే వాడు ,ఈ లోకం లో అత్యధిక ధనాన్ని ,పూర్ణాయుస్సును ,పుత్రులను కీర్తినీ పొందుతాడు .మరణించాక శివ లోకం లో రుద్రునితో సమానుడవుతాడు.

ధూర్జటి అంటే-‘’ధూః భార భూతా జఃటిః జటా యస్యేతి ధూర్జటిః’’-భారమైన జడలు కలవాడని అర్ధం

35-మహేశాన్నాపరో దేవో మహిమ్నోః నా పరాస్తుతిః-అఘోరాన్నాపరో మంత్రో నాస్తి తత్త్వం గురోః పరం ‘’

భావం –సృష్టిలో పరమేశ్వరునికి మించిన దైవం లేడు.పరమేశ్వరునికి చెందిన అఘోర (సౌమ్యమైన )మంత్రమైన పంచాక్షరికి మించిన మరో మంత్రం లేదు ,శివునికంటే ,పంచాక్షరికంటే మించినవీ గురువు కంటే పరతత్వ మైనదీ ఏదీ లేదని తాత్పర్యం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

95 ఏళ్ళ యువకుడితో 77 ఏళ్ళ నేను

కృష్ణా జిల్లాపరిషత్ లో నాతొ పాటు సైన్స్ మేష్టారు గా హెడ్ మాస్టర్ గా పని చేసి ,బాడ్ మింటన్ లో గొప్ప ఆటగాడిగా గుర్తింపబడి నేషనల్ స్థాయిలో ఆడి ప్రయిజులుపొందిన 95 ఏళ్ళ వయసులోనూ అతి చలాకీగా ఆరోగ్యం గా ఉన్న మంచి మనసున్న నా అభిమాని  అయిన శ్రీ సి వి సన్యాసి రాజు గారితో ఇవాళ హోటల్ ఐలాపురం లో ఆంద్ర  శత జయంతి రోజు న తీసుకున్న ఫోటోలు .నేనంటే ఆయనకూ విపరీతమైన అభిమానం .నేను 19 67 లో మానికొండ హైకూలు లో పని చేస్తుండగా హెడ్మాస్టర్ శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వరరావు గారి తో కలిసిమాస్టాఫ్ బాడ్ మింటన్, వాలీ బాల్ ఆటలను ఫ్రెండ్లీ మ్యాచెస్  చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వర రావు గారిరుద్రా పాక  హైస్కూల్    లో ఆడటానికి వెళ్లినప్పటి నుంచి రాజుగారితో పరిచ య0 ..చైర్మన్ గారింట్లో మకాం .విందుభోజనాలు ఆతిధ్యం మర్చి పోనీ సంఘటన సెంట్రల్ ప్లేయరా గా మహాసునాయాసం రెండు చేతులతో రెండు బాట్లూ పట్టుకొని షాట్లతో  ఆడే నైపుణ్యం ఉన్నవారాయణ   .ఆస్కూల్హెడ్మాస్టర్ శ్రీ ఈడుపుగంటి వెంకటేశ్వరరావు ,డ్రిల్ మాస్టర్ ఆయనతమ్ముడు శ్రీ రత్తయ్య మొదలైన వారితో ఆడిన ఆట నా స్మృతిలో ఇంకా నిలిచే ఉంది ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు కలిసాం .. ఏళ్ళక్రితం రిటైరైనా గొప్ప చలాకీగా కనిపించటం చూసి అమాంతం ఆలింగనం చేసుకొని ఆనందించాను అదీ ఈ ఫోటోల మధురానుభూతి -దుర్గా ప్రసాద్    102_7794 102_7795

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -9

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -9

మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ?-2

మాఘకవి శిశుపాల వధ కావ్య వ్యాఖ్య ప్రారంభిస్తూ మల్లినాధుడు ఇందీవర శ్యాముడు ,ఇందిరానంద కారుడు వందారు జన మందారుడైన యదునందనునికి నమస్కరించి ,వప్ర క్రీడా విలాసాలలో దంతాగ్రాలతో ధరణిని గ్రుచ్చి ఎత్తి ఆదివరాహం లాగా కనిపిస్తూ ఉల్లాఘ ఉత్ఫణ ఫణాధర గరీయ మాన క్రీడా వదానుడైన ఇభరాజవదనుని ప్రార్చించాడు తర్వాత శారదాంభోజ వదన ,సన్నిధి ,సర్వద అయిన శారద తన వదనా౦బుజ౦ న సర్వ కామదయై సర్వదా సన్నిధి చేసేట్లు సరస్వతీదేవిని స్తుతించాడు. తరువాత ‘’వాణీం కాణ భుజీం ‘’శ్లోకం లో తన శాస్త్ర పరిచయాన్ని వ్యాఖ్యాన అర్హతను సాధికారంగా వెల్లడించి ,మహోపాధ్యాయ బిరుదున్న ఈ మల్లినాధసూరి  మాఘ కావ్యానికి సర్వం కష వ్యాఖ్యానాన్ని రచిస్తున్నానని  ,నామ నిర్దేశ పూర్వకంగా వివరించాడు .కావ్య అవతారిక నుండి మరో రెండు మల్లినాధుని శ్లోకాలు –దంతా౦చలేన ధరణీతల మున్నమయ్య –పాతాళ కేళిషు ద్రుతాది వరాహ లీలం

ఉల్లాఘనోత్ఫణ ఫణాదరగీయమాన –క్రీడావదాన మిభ రాజ ముఖం నమామి ‘’

‘’మల్లినాద సుదీస్సో య౦ మహోపాధ్యాయ శబ్దభాక్  -విధత్తే మాఘ కావ్యస్య వ్యాఖ్యాం సర్వం కషా భిధాం’’

తన వ్యాఖ్యాన సమగ్రత్వాన్ని ,రసభావ ధ్వని ,అలంకారాది సర్వ విషయ ప్రతిపాదికత్వాన్ని ప్రకటిస్తూ మల్లినాధుడు  ఈ కింది విధంగా  చెప్పుకొన్నాడు –

‘’ఏ శబ్దార్ధ పరీక్షణ ప్రణయినో ఏవా గుణాలంక్రియా –శిక్షా కౌతికినో విహుర్తు మనసో యేచ ధ్వనేరధ్వని

క్షుభ్యద్భావ తరంగితే రస సుధా పూరే మిమంక్షంతి యే- తేషామేవ కృతే కరోమి వికృతిం మాఘస్య సర్వంకషాం’’

దీనిభావం –ఎవరు శబ్దార్దాల సందర్భ శుద్ధి ఔచిత్యాన్ని పరిశీలించటానికి ఇష్ట పడతారో,ఎవరు గుణాల అలంకార లోతులను సమన్వయ విశేషాలను తెలుసుకోవటానికి ఉత్సాహ పడతారో ,ఎవరు ధ్వని ప్రస్తానం లో విహరించటానికి మనసు పడుతారో ,ఎవరు ఉవ్వెత్తున లేచే భావ తరంగాలుగల రసామృత సముద్రములో మునకలు వేయటానికి ఉరుకు లెత్తుతారో ,వారంద కోసమే  ఈ ‘’సర్వం కష ‘’ను రచిస్తున్నాను ‘’అని వ్యాఖ్యానం యొక్క ప్రాశస్త్యాన్ని వివరించాడు .దీన్ని బట్టి ఇతర కావ్య వ్యాఖ్యానాలు చేయటం కంటే మల్లినాధుడు దీని వ్యాఖ్యానం రాయటానికి చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోన్నాడని తెలుస్తోంది .

సూరి లేఖినీ నర్తన విన్నాణాన్ని నిపుణ౦ గా  పరిశీలిస్తే –మేఘ సందేశ ,శిశుపాల వధ వ్యాఖ్యానాలు రెండు గ్రంథస్త విషయాన్ని బట్టి ,అనేక అంశాలు ,అనేక రహస్యాలు తెలియ జేయటం లో ఉదాత్తం అని పిస్తాయి .ఎన్నో శాస్త్ర పరిశీలనం చేసి ,సప్రమాణంగా ఆయా సందర్భాలను పరిష్కరించటం లో మల్లి నాధుడు ఈ కావ్య ద్వయ వ్యాఖ్య  రచన కోసం ఎన్నో ఏళ్ళు చాలా కస్ట పడ్డాడని తెలుస్తోంది .అందుకే ‘’మాఘే మేఘే గతం వయః ‘’అని ఆయనే చెప్పిన మాట వలన అర్ధమౌతోంది అని చెరువువారు శ్రీ గరిమెళ్ళ వారి వ్యాఖ్యానం లో పేర్కొన్నట్లు తెలియ జేశారు .

అప్పటికే పంచకావ్యాలకు వ్యాఖ్యానాలు రాసి మల్లినాధుడు ముదుసలి అయ్యాడు .నైషదానికి కూడా వ్యాఖ్య రాయాలని కోరిక కలిగింది .జరా భారం తోజారిపోతున్న కనుబొమలను దారం తో ఎత్తి కట్టుకొని ,తాళ పత్ర గ్రంధాలను తడివి తడివి చదువుతూ ,శిష్యులచే చదివించు కొంటు వ్యాఖ్యానం చేశాడని ,మిత్రులెవరో ఇంతకాలం ఏం చేశావు ,ఇంత శ్రమ చేసి ఇప్పుడు  రాయటం ఎందుకు అని ప్రశ్నించి ఉంటారని అందుకే ‘’మాఘానికి ,మేఘానికి వ్యాఖ్యానాలు రాయటం లో నా ఆయుర్దాయం చాలా భాగం గడిచి పోయింది ‘’అని చెప్పి ఉంటాడని విజ్ఞులు భావిస్తున్నారు .నిజంగానే ఆ వ్యాఖ్యల గొప్పతనం  అంతటిది .ప్రబంధ ధ్వని కి ఉదాహరణమైన నైషదానికి చేసిన వ్యాఖ్యానం కూడా అసామాన్యమైనదే .తన పంచ కావ్య వ్యాఖ్యానాలను చదివిన వారికి ,అందులో సర్వంకషాధ్యయనం చేసిన వారికి నైషధం లోని సర్వార్ధ రహస్యాలు తేలికగా గ్రహించ గలరనే నమ్మకం తో నైషద వ్యాఖ్య ‘’జీవాతువు ‘’ను క్లుప్తంగా రాశాడని పండితాభిప్రాయం .

మాఘ కావ్యం లోని విశిస్టత,,పరిపాకం ,అర్ధ నిర్భరత ,విషయ బాహుళ్యం ,అనేక శాస్త్ర పరిచయం ,కదా సంవిధాన వైచిత్రి, అపూర్వ వర్ణనా విస్ఫూర్తి  ఆ కావ్యం మీద గౌరవాన్ని పెంచుతాయి. కనుక అతి శ్రద్ధగా ఈ కావ్యాన్ని ,కావ్య కర్తను సూరి మనసారా శ్లాఘించాడు –

‘’నేతాస్మిన్ యదు నందన స్స భగవాన్ వీరః ప్రదానో రసః –శృంగారాది భిరంగవాన్ విజయతే పూర్ణా పునర్వర్ణనా’’

‘’ఇంద్ర ప్రస్థగమాద్యుపా య విషయః చైద్యా వ సాదః ఫలం –ధన్యో మాఘ కవిః వయం చ కృతినః తత్సూక్తి సంసేవనాత్ ‘’ ఇంత మెచ్చుకొన్న మాఘ కావ్యం శిశుపాల వధ కు చేసిన’’ సర్వం కష’’ వ్యాఖ్య లో ఏ ఏ విషయాలను ,ఏయే విధంగా సమన్వయము చేసి దీనికి అంతటి గౌరావాన్ని సంపాదించాడో తెలుసుకోవాల్సిందే .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -6

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -6

26- త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవహ –స్త్వమాపస్త్వం వ్యోమత్వము ధరణి రాత్మా త్వమితిచ

పరిచ్చిన్నా మేవం త్వయి పరిణతా బిభ్రతి గిరం –న విద్వస్తత్తత్వం వయ మిహతు యత్వం న భవసి ‘’

భావం –మహేశా !పండితులు నువ్వు సూర్యుడివి ,చంద్రుడివి ,వాయువు ,అగ్ని ,నీరు ,ఆకాశం ,భూమి ,ప్రత్యగాత్మవు అని కూడా చెబుతున్నారు .అవన్నీ నీ స్వరూపాలుగా ,నీ స్వరూపాన్ని పరిమితం చేస్తూ వాక్కులతో కొలుస్తున్నారు .మేము మాత్రమీ చరా చర సృష్టి లో నువ్వు అసలు ఏ వస్తువు కావో తెలుసుకోలేక పోతున్నాం .

27-త్రయీం తిస్రో వృత్తీ త్రిభువన మథో త్రీనపి సురా –నకారా ద్వైవర్ణై స్త్రిభిరభి దధత్తీర్ణ విక్రుతిః

తురీయా తే ధామ ధ్వనిభి రవరుంధాన మణుభిః- సమస్తం వ్యస్తం త్వాం శరణద గృణోత్యోమితి పదం ‘’

భావం –భక్త హృదయావాసా పరమేశా !అకార ఉకార మకారాలు కలుపగా ఓం పదం ఏర్పడి మూడు వేదాలను ,మూడైనా సత్వ రజస్ తమోగుణాల వృత్తులను  ,మూడులోకాలను ,బ్రహ్మ విష్ణు రుద్ర అనే ముగ్గురు దేవతలనూ బోధిస్తోంది .గుణాలకు అతీతం ,షడ్భావ వికార రహితం అయిన నీ నిర్గుణ రూపమే నీ నాల్గవ స్థితి .సూక్ష్మ నాదాలతో ఓంకారం  ఆ స్థితినే స్తుతిస్తుంది విశ్వ మంతా సూక్ష్మ ఓంకారనాదాలు వ్యాపించి నీ నాల్గవది అయిన నిర్గుణ తత్వాన్ని అభి వర్ణిస్తున్నాయి ‘

‘’ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ‘’అని వేదం .ఓంకారమే పరబ్రహ్మ వాచకం .ఓంకార మహాత్మ్యాన్ని ఛాందోగ్య ఉపనిషత్ విశేషంగా వ్యాఖ్యానించింది .

28-భవః శర్వో రుద్రః పశుపతి రథోగ్రః సహ మహాన్ –తథా భీమేశా నా వితి యదభిధానాస్టక మిదం

అముష్మిన్ ప్రత్యేకం ప్రవిరచతి దేవా శ్రుతి రపి-ప్రియా యాస్మై ధామ్నే ప్రణిహిత నమస్యో స్మి భవతే ‘’

భావం –శంభో !భవ ,శర్వ ,రుద్రా ,పశుపతి ,ఉగ్ర ,మహా దేవా ,భీమ ,ఈశాన అని నీ నామ అష్టకం ప్రసిద్ధి చెందింది .ఒక్కొక్క నామాన్ని గురించి శ్రుతి చక్కగా ప్రత్యేకంగా నిన్ను స్తుతిస్తోంది .అందరికీ ఇష్టుడూ ,ఈ రకమైన తేజస్స్వరూపుడు అయిన నిన్ను (నీకు)నమస్కరిస్తున్నాను

ఈ నామాల అర్ధం తెలుసుకొందాం

భవః –‘’భవతి భవతే వా సర్వ మితి భవః –‘’సర్వం తానె అయిన వాడు

శర్వః –‘’ప్రళయే భూతాని శ్రునాతి హినస్తీతి శర్వః ;;-ప్రళయ కాలం లో సమస్త ప్రాణులను హింసించే వాడు

రుద్రః –‘’రోదయతి శత్రూనితి రుద్రః –‘’-శత్రువులను దుఖపెట్టేవాడు –‘’స్వయం రురోద ఇతి వా రుద్రా ‘’-ఒకప్పుడు బ్రాహ్మ వలన జన్మ ప్రాప్తి౦చగా దుఖి౦చినవాడు –‘’రుదం రోదనం ద్రావయతి ఇతి వా రుద్రః ‘’-దుఖాన్ని పోగొట్టేవాడు

పశుపతిః-‘’పశూనాం జీవానాం పతిః’’పశువులు అనే జీవులు ప్రమధులైన  వారికి ప్రభువు –‘’బ్రహ్మ విద్యాః స్తావరాంతా శ్చ పశవః పరికీర్తితాః-పశవః క్షేత్రజ్ఞాః తేషాం పతిః తేషాం త్రాతా ఇతి పశుపతిః’’-పశువులు అనే జీవులను సంసార బంధం నుంచి రక్షించేవాడు .

ఉగ్రః –‘’ఉగ్రత్వాత్ ఉగ్రః ;;-మిక్కిలి భయంకరుడు

మహా దేవః –‘’మహా౦ శ్చఅసౌ  దేవః ‘’-శ్రేష్టు డైన దేవుడు

భీమః –‘’బిభేతి అస్మాత్ త్రైలోక్యం ఇతి భీమః ‘’-ముల్లోకాలను భయపెట్టేవాడు

ఈశానః –‘’ఈస్టే ఇతి ఈశానః ‘’-ఐశ్వర్యం కలవాడు .

29-నమో నేదిస్టాయ ప్రియదవ ! దవిస్టాయ చ నమో –నమః క్రోధిస్టాయ స్మరహర ! మహిస్టాయచ నమః

నమో వర్షిస్ఠాయ త్రినయన !యవిస్టాయ చ నమో –నమః సర్వస్మై తే తదిదమితి సర్వాయ నమః ‘’

భావం –అడవిలో ఉండటానికి ఇష్టపడే శివా !నువ్వు అందరికీ దగ్గరగా ఉంటావు .అలాగే దూరంగానూ ఉంటావు .మన్మధ సంహారా !మిక్కిలి సూక్ష్మ౦ గా  ,మిక్కిలి పెద్ద ఆకారం గా కూడా ఉంటావు .ముక్క౦టీ!బాగా వ్రుద్దుడువు బాగా యువకుడివీ కూడా .అంతేకాక సమస్తమూ అయిన వాడవు .అంతేనా –ఇది అది అని నిర్దేశించి చెప్పే వ్యవహారమంతటినీ మించిన  సర్వ స్వరూపుడవు నువ్వు .అట్టి నీకు నమస్కారం .

ఈశ్లోకం కృష్ణ యజుర్వేదం లోని నమక భాగం లోని ‘’నమస్సోమాయచ రుద్రాయచ ‘’అని నమః నమః అని చాలా సార్లు వచ్చే మంత్రానికి అనుసరణ .

30-బహుల రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమోనమః –జనసుఖ కృతే సత్వోద్రేకే మ్రుడాయ  నమో నమః

ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః –ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః ‘’

భావం –జగదీశా !నువ్వు సమస్తసృస్టి కార్యం నిర్వహించేటప్పుడు రాజోగుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటావు .ప్రజాసుఖ పాలనలో సత్వ గుణాన్ని ,పొంది మృడుడవు అవుతావు .సృష్టి ని లయం చేసేటప్పుడు తమోగుణ సంపన్నుడవై  హరుడు అనిపించుకొంటావు .కాని నువ్వు మీ మూడు గుణాలకు అతీతుడవే. గొప్ప తెజస్స్వరూపుడవై శివుడు అనిపించుకొంటావు.అంతటి విశిస్టుడ వైన నీకు నమోవాకాలు .

ఈపదాల అర్ధాలు గ్రహిద్దాం –

భవః –‘’భవతి భవతే వా సర్వ మితి భవః –అంతా తానె అయిన వాడు

మృడః-‘’మృడ యతి సుఖ యతి భక్తానితి మృడః;’’-భక్తులను సుఖింప జేసేవాడు –‘’స్వయం సుఖీ వా ‘’తాను సుఖం కలవాడు అని కూడా

హరః –ప్రళయం లో సమస్తమూ లయింప జేసేవాడు –‘’భక్తానాం ఆర్తి హరతీతి హరః ‘’భక్తుల పీడను హరించేవాడు

శివః –‘శామ్యతి పరమానంద రూపత్వాత్ నిర్వికారో భవతీతి శివః –‘’బ్రహ్మానంద స్వరూపుడు ,నిరాకారుడుకనుక శమించి ఉండేవాడు –‘’శేరతీ సజ్జన మనాంసి ఇతివా ‘’-ఇతనిలో సజ్జనుల మనస్సు ఉంటుంది –‘’శేతే సజ్జన మనస్సు ఇతివా ‘’-సాధుజన హృదయ వాసి –‘’శివం కల్యాణం తద్యోగాద్వా శివః ‘’-శుభం తో కూడిన వాడు .’’శివో ప్రదాత్ వా శివః ‘’-శుభాలనిచ్చేవాడు

.Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -8

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -8

వ్యాఖ్యానాలు మల్లినాధుడు రాయలేదా ?

మల్లినాధుని కుమారుడు కపర్ది పండితుని ఆపస్తంభ గృహ్య సూత్రాలకు ‘’తాత్పర్య దర్శనం ‘’రాసిన సుదర్శనా చార్యుడు –‘’యత్కృతం వేద వద్భాష్య మాద్రి యంతే విపశ్చితః –స కపర్దీ చిరంజీయా ద్వేద వేదంగతత్వవిత్ ‘’అని ప్రశంసించాడు .మల్లినాధుని తమ్ముడు పెద్ది భట్టు అని వీరిద్దరూ కపర్ది కి కుమారులని పెద్ది భట్టు మహా మహోపాధ్యాయుడై నైషదాదులకు వ్యాఖ్యానం రాశాడని మాతులేయుని క్రతువులో సర్వజ్న సింగ భూపలునిచే సత్కరింప బడినాడని ,ఈ పెద్ది భట్టు కొడుకు కుమార స్వామి అని ,ఇతడే ప్రతాప రుద్రీయానికి రత్నాపన వ్యాఖ్య రాశాడని ,ఈతని కొడుకే  శంభువు  అని ,యితడు విశ్వజిద్యాగం చేశాడని ,ఇతని కొడుకు భాస్కరుడు ,అతనికొడుకు నాగేశ్వర యజ్వ సర్వ ముఖ యాగం చేశాడని ,నాగేశ్వరునికొడుకు కొండుభట్టు వేద వేత్త అని ,కొండు భట్టు కొడుకు నాగేశ్వరుడు ,అతని కొడుకు నారాయణుడు ,.నారాయణ పండితుడు చంపూ రామాయణానికి ‘’పద యోజనం ‘’వ్యాఖ్య రాశాడని ,అందులోని అవతారిక లో –

‘’కోలాచలాన్వయాబ్దీ ౦దు ర్మల్లినాధో మహా యశాః-శతావధాన విఖ్యాతో వీర రుద్రాభి వర్నితః

మల్లినాదాత్మజః శ్రీమాన్ కపర్దీ మంత్ర కోవిదః –అఖిల శ్రౌత కల్పస్య కారికావృత్తి మాతనోత్

కపర్ది తనయో ధీమా న్మల్లినాదోగ్రజః స్మృతః –ద్వితీయ స్తనయో దీమాన్పెద్ది భట్టో మహోదయః

మహోపాధ్యాయ ఆఖ్యాత స్సర్వ దేశేషు సర్వతః –మాతులేయ క్రతౌ దివ్యే సర్వజ్ఞే నాభి వర్షితః

గణాధిప ప్రసాదేన ప్రోచే మంత్ర వరాన్ బహూన్ –నైషద జ్యోతిషదీనాం వ్యాఖ్యాతా భూజ్జ గద్గురుః

పెద్ది భట్ట సుతః శ్రీమాన్ కుమార స్వామి సంజ్ఞకః –ప్రతాపరుద్రీ యాఖ్యాన వ్యాఖ్యాతావిద్వదిగ్రమః ‘’

దీన్ని బట్టి మల్లినాధుని తమ్ముడు పెద్దిభట్టు నైషదాది కావ్యాలకు వ్యాఖ్యానాలు రాశాడని ,కుమార స్వామి యజ్వ పెద్ది భట్టు కొడుకు అని ,మల్లినాధుని ఔరసుడుకాదని అనిపిస్తోంది .కాని ప్రతాప రుద్రీయానికి కుమార స్వామి రాసిన ‘’రాత్నాపణ ‘’వ్యాఖ్యలో ‘’శ్రీ మహా మహోపాధ్యాయ కోలాచల మల్లినాద సూరి సూనునా ,విశ్వజనీన విద్యస్య విద్వన్మణేః –పెద్ద యార్యాస్యాను జేన కుమార స్వామి సోమ పీథినా ‘’అని అతి స్పష్టంగా చెప్పేశాడు .కనుక కుమారస్వామి మల్లినాధుని చిన్న కొడుకే అని నిర్మొహమాటం గా చెప్ప వచ్చు .

శ్రీ మల్లాది సూర్య నారాయణ శాస్త్రి గారు ఈ రెండు వాదాలకు మధ్యేమార్గం గా పరిష్కారం చెప్పి పెద్ది భొట్టు కొడుకు కుమార స్వామి మల్లినాధుని దత్త పుత్రుడు అయి ఉండచ్చు అని, అందుకే కుమారస్వామి తాను మల్లినాధుని కొడుకునని చెప్పుకొని ఉండవచ్చునని ,జన్మ చేత సోదరుడైన పెద్దయార్యునికి తాను తమ్ముడిని అని రాశాడు అని ఉదాహరించారు .కాని ఇది సంగతమైన విషయం కాదని ,పొసగదని ,పెద్ది భట్టు అన్ని వ్యాఖ్యానాలురాస్తే తండ్రిపేరు చెప్పుకోక పోవటం ఆక్షేపణీయమని ఈవాదం తప్పు అని ,కుమార స్వామి పెద్దిభట్టు పేరు ఎక్కడా ప్రస్తావించలేదని ,అవతారికలో ‘’పద వాక్య ప్రమాణ పారావార పారీణుడైన మల్లినాదునికి తండ్రికి తగ్గ తనయుడుగా కోలాచలం పెద్దయార్యుడు జన్మించాడని ,ఆతని తమ్ముడినైన తాను రత్నాపణవ్యాఖ్య రచిస్తున్నానని  తెలిపాడు –ఆ శ్లోకాలు

‘’త్రిస్కంద శాస్త్ర జలదిం చులుకీకురుతేస్మయః –తస్య శ్రీ మల్లినాధస్య తన’’యోజని ‘’తాదృశః

కోలాచల పెద్ద యార్యః ప్రమాణ పద వాక్య పార దృశ్వా యః –వ్యాఖ్యాత నిఖిల శాస్త్రః ప్రబంధ కర్తా చ సర్వ విద్యాసుః

తస్యానుజన్మా తదనుగ్రహా త్త -విద్యోననవద్యో వినయావమ్రః-

స్వామీ విపశ్చి ద్వితనోతి టీకాం –ప్రతాప రుద్రీయ రహస్య భేత్రీం ‘’

అని చెప్పి అన్ని సందేహాలకు మంగళం పాడి మల్లినాధుని కొడుకులు పెద్దయార్య ,కుమార స్వామి అని ,స్వామి అన్నగారి వద్దే విద్యేనేర్చాడని అర్ధమౌతోంది .మిగిలిన వాదాలేవీ దీని ముందు నిలవవు .అంతేకాక ‘’తనయోజని తాదృశః కోలాచల పెద్దయార్యః ‘’అనటం వలన ‘’అజని ‘’అనే క్రియా పద సామర్ధ్యం చేత కుమారస్వామి మల్లినాధుని ఔరస పుత్రుడే అని నిర్దా రింప బడుతోంది అని డా.చెరువు సత్యనారాయణ శాస్త్రి తమ ‘’శిశుపాల వధ –ఆంధ్రీ కృతులు ‘’అనుశీలనం లో అన్నారు .అంతేకాక మల్లినాధుని తమ్ముడు పెద్దిభట్టు అనేక కావ్య గ్రంధాలకు వ్యాఖ్యానాలు రాసి అన్నగారిపై భక్తీ చేత మల్లినాధుని పేరుతొ వెలయించాడు అనే నానుడి లోకం లో ప్రచారం లో ఉన్నదని ,కాని అది క్షమార్హం కాదని ,కొన్ని అయినా పెద్దిభట్టు తనపేర రాసుకో కుండా ఉంటాడా అని ,కొన్ని మాఘ ,నైషద వ్యాఖ్యాన ప్రతులలో ‘’పెద్ది భట్ట కృతే ‘’అని ఉందని ,ఈ వ్యాఖ్యానాలను పూర్వం ‘’పెద్ది భట్టీయం ‘’పేరుతొ పిలిచేవారని అంటారు. ఇదీ అసంగతమైన విషయమేనని ,అలా అయితే పెద్ది భట్టునే  వ్యాఖ్యాత్రు శేఖరునిగా లోకంలో  ఎందుకు ప్రసిద్ధి చెందలేదని ప్రశ్నించి ,మల్లినాధుడు అంతటి మహా వ్యాఖ్యాన పండితుడు తమ్ముడు రాసిన  వ్యాఖ్యానాలకు తన పేరు పెట్టుకోవటానికి అంగీకరిస్తాడా అని కొట్టి పారేసి అవన్నీ కోలాచలం  మల్లినాద సూరి వ్యాఖ్యానాలే అని తేల్చి స్పష్టంగా చెప్పారు చెరువు వారు  .

మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ?

మల్లినాద సూరి ప్రతికావ్య వ్యాఖ్యాన ప్రారంభం లో గణేశ ,సరస్వతి ,శివ ,కేశ వాదులను స్తుతిస్తూ ప్రార్ధనా శ్లోకాలు రాశాడు .అవి రమణీయాలై పండిత లోకం లో బహుళ ప్రచారం పొందాయి –అందులో మచ్చుకు కొన్ని –

‘’అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావన మచింత్య వైభవం –

తం నరం వపుషి కుంజరం ముఖేన్మహే కిమపి తు౦దిలం మహః ‘’

‘’ఆశాసు రాశీ భవదంగవల్లీ భాసైవ దాసీకృత దుగ్ధ సింధుం –

మందస్మితై ర్నిందిత శారదే౦దు౦ ,వందేర విందాసన సుందరిత్వాం ‘’

‘’శారదా శారదాంభోజవదనా వదనాంబుజే –సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధి౦ క్రియాత్ ‘’

‘’ఇందీవర దళశ్యామ మిందిరా నంద వర్ధనం –వందారు జన మందారం వందేహం యదు నందనం ‘’

‘’జాహ్నవీ మూర్ధ్ని పాదే వా కాలః కంఠే వపుష్యధ్య –కామారిం కామతాతం వా కంచిద్దేవం భజామ్యహం ‘’

మాతా పితృభ్యాం జగతో నమో వామార్ధ జానయే –సద్యో దక్షిణ దృక్పాత సంకుచ ద్వామ దృస్టయే ‘’

ఈ శ్లోకాలు  మల్లినాధుని కవన పాండిత్య మాధుర్యాలణు వ్యక్త పరుస్తున్నాయి .ఇందులో సరస్వతీ దేవిపై రాసిన ‘’శారదా శారదాంభోజ ‘’శ్లోకం కృష్ణునిపై రాసిన ‘’నదీ వర దళ శ్యామ ‘’శ్లోకం అవి మల్లినాదునివే అని తెలియక పోయినా జనం నాలుకలమీద ఆనాటి నుంచీ నర్తిస్తూ నే ఉన్నాయి .

ప్రతి కావ్య వ్యాఖ్యాన ప్రారంభం లో ‘’అన్వయ ముఖం గా నే నేను వ్యాఖ్యానిస్తాను .మూలం లో లేని విషయాలు రాయను .అసంబద్ధ విషయాలను ప్రస్తావించను .’’అని నియమం ఏర్పరచుకొని అన్యూన్యాతిరిక్తం గా రచించాడు .మల్లినాద ప్రతిజ్ఞా శ్లోకం –

‘’’’ఇహాన్వయ ముఖే నైవ సర్వం వ్యాఖ్యాయతే మయా –నా మూలం లిఖ్యతే కించి న్నాన్న పేక్షిత ముచ్యతే’’ అదీమల్లినాధుని నిబద్ధత .ఈ విషయాన్నే అక్కడక్కడ ‘’అలమతి పల్లవితేన’’—‘’అలమతి విస్తరేణ’’-గ్రంధ విస్తరభయాన్న లిఖ్యతే’’  అనే మాటలతో ఎప్పటికప్పుడు జాగృతం అయ్యాడు .

నైషద వ్యాఖ్యానానికి జీవాతువు అనే పేరు పెట్టాడని తెలుసుకొన్నాం .జీవాతువుఅంటే జీవ నౌశాధం అని అర్ధం చెప్పాడు సూరి (జీవాతుర్జీవ నౌషధం );నారికేళ పాకమైన కిరాతార్జునీయానికి ‘’ఘంటా పాఠ’’వ్యాఖ్య రాస్తూ సూరి –చెప్పిన ప్రారంభ శ్లోకాలు –

‘’నారికేళ ఫలసమ్మితం వచో భారవే స్సపది తద్విభజ్యతే –స్వాదయ౦తు రస గర్భ నిర్భరం సారమస్య రసికా యధేప్సితం ‘’

‘’నానా నిబంధ విషయైక పదైర్నితాంతం సాశంక చంక్రమణ భిన్నధియామశంకం –కర్తుం ప్రవేశ మిహ భారవి కావ్య బంధే ఘంటా పధం కమపి నూతన మాతనిష్యే’’అని రాశాడు అంటే –‘’భారవి పలుకులు నారి కేళ ఫల సమానాలు వాటిని నేను పగుల కొడతాను .రసనిర్భరాలైన ఆ వాక్యాల సారం రసికులు ఆస్వాది౦చుదురు గాక ‘’అని భారవికవి గొప్ప తనాన్ని తెలిపాడు .’’’అనేక వ్యాఖ్యానాల ఎగుడు దిగుడు వలన భారవి గొప్పతనం జనాలకు దూరమై పోయింది .భారవి కవితలో నిస్సందేహంగా బుద్ధి ప్రసరించేట్లు రాచబాట లాంటి కొత్త వ్యాఖ్యానం రాసి దగ్గరకు తెస్తాను’’అని మరీ చెప్పి సుగమమైన వ్యాఖ్యానం రాశాడు .

’అలాగే నైషదానికి కూడా తన వ్యాఖ్యాన అవసరం కలిగిందనిచెబుతూ ‘’ మిగిలిన కావ్యాలకు ఎలాంటి దుర్గతి పట్టిందో ,నైషదానికి కూడా అలాంటి దుర్గతే పట్టి ,క్షుద్ర వ్యాఖ్యాన విష పీడితాలైన శ్రీ హర్ష కవి రాజ వాక్యాలకు బ్రతికి౦చ టానికి జీవాతువు (జీవాతుర్జీవ నౌషధం )అనే వ్యాఖ్య రాస్తున్నాను. రస భావ గుణార్ధ దోష ధ్వన్యలంకార రహస్యజ్నుల సంతోషం కోసం నైషద కద రూపమైన అమృత కావ్యాన్ని వ్యాఖ్యానిస్తున్నాను’’అని తెలియ జేసి మొదలు పెట్టాడు .దీనికి ఆయన శ్లోకాలు ఇవి-

‘’క్షుద్ర వ్యాఖ్యా విషార్తానాం శ్రీ హర్ష రాజ కవిరాడ్గిరాం –ఉజ్జీవనాయ జీవాతు ర్జీయా దేష మయాక్రుతం ‘’

‘’శ్రీ మల్లినాద విదుషా విదుషాం మతేన తేనైవ నైషద కదామృత కావ్య బంధః

-వ్యాఖ్యాస్యతే డ్య రసభావ గుణార్ధ దోష సాధ్వన్యలంక్రుతి రహస్య విదా౦ ముదేస్తు’’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-16 ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -5

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -5

21-క్రియాదక్షో దక్షః క్రతుపతి రదీశస్త నుభ్రుతా –మృషీణామార్తిజ్వం శరణద సదస్యా స్సురగణాః

క్రతు భ్రంశ స్త్వత్తః క్రతుషు ఫలాదాన వ్యసనినో –ద్రువం కర్తు శ్శ్రద్దావిదుర మభి చారాయ హి మఖాః’’

భావం –భక్తరక్షక పరమేశా !శరీరధారులకు దక్షుడు అధిపతి .యాగ నిర్వహణలో గొప్ప  సమర్ధుడు .ఆయన చేసే యజ్ఞాన్ని నిర్వహించేవారు సామాన్యులుకాదు , మహర్షులు . యజ్న వేదికపై ఆసీనులైనవారు దేవతా సమూహం . ఇన్ని సమకూరినా యాగ ఫలాన్నిచ్చే నీ వలన దక్ష యజ్ఞం విధ్వంసమైంది. శ్రద్ధ లేనివాడు ఎంత వైభవంగా యజ్ఞం చేసినా కూడా ,ఆ యజ్ఞాలు చేసేవారికి అనర్ధాలే కలిగిస్తాయి .

యజ్నఫల దాత శివుడు ఫలాననివ్వటానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాడు .యజ్ఞం లోశ్రద్ధలేకుండా ఆయన అనుగ్రహం పొందలేరు .ఎంతటి గొప్పవాడైనా, శాస్త్రీయంగానే యజ్ఞం చేసినా అనర్ధాలే ఫలిస్తాయి ‘’యదేవ శ్రద్ధయా కరోతి తదేవ వీర్య వత్తరం భవతి ‘’అని  ఛాందోగ్యం చెప్పింది

22-ప్రజానాధం ప్రసభ మభికం స్వాం దుహితరం –గతం రోహిద్భూతాం రిరమయి షుమృశ్య వపుషా

ధనుష్పాణేర్యాతమ్ దివమపి సపత్రా కృతమముం –త్రసంతం తే ద్యాపిత్యజతి  న మృగ వ్యాధ రభసః ‘’

భావం –గౌరీశా !సంధ్యాదేవి బ్రహ్మ కూతురు .ఒక రోజు ఆమె లేడి రూపం పొంది విహరిస్తుంటే బ్రహ్మకాముకుడై ఆ లేడి వెంట పడి కూతురే అయినా క్రీడించటానికి ఉబలాట పడ్డాడు .అప్పుడు విషయం తెలుసుకొన్న నువ్వు పినాకం అనే ధనుస్సు ధరించి వేటాడే బోయవానిగా ఎడురయ్యావు .బ్రహ్మ భయపడి ఆకాశం లోకి పారిపోయాడు .నీ వేటగాని సంరంభం బ్రహ్మకు ఎప్పుడూ ఒణుకు తెప్పిస్తూనే ఉంటుంది .అనుచితంగా ప్రవర్తించే వారికి నువ్వు సింహ స్వప్నమే .

23-స్వలావణ్యాంశంసా ధృత ధనుష మహ్నాయ తృణవత్-పురః ప్లుస్టం ధృస్ట్వాపురమధన పుష్పాయుధమపి

యది స్త్రైణ౦ దేవీ యమనియత దేహార్ధ ఘటనా –దవైతి త్వామద్దా బత వరద !ముగ్దా యువతయః ‘’

భావం –పరాక్రమ ప్రబల త్రిపురాసురిడిని సంహరించిన పరమేశా !అహంకారం తో మన్మధుడు నీకు చిత్త చాంచల్యం కలిగించాలని సంకల్పించి విల్లు ఎక్కుపెట్టగా నువ్వు గడ్డిపోచనుకాల్చినట్లు  దహనం చేసేశావు .కనుక నువ్వు మన్మధ వికార రహితుడవని భావించాలి .యోగ సమాధిలో నిగ్రహించుకొన్న శరీరం తో నువ్వు జగజ్జనని అయిన పార్వతీ దేవిని అర్ధభాగంగా గ్రహించావు .తన ముఖ లావణ్యాన్ని తలచుకొని ఆమె నిన్ను స్త్రీలోలుడిగా భావించి ఉంటె, లోకం లో యువతులు తెలివి తక్కువ వాళ్ళు అని  నిశ్చయి౦చాల్సి వస్తుంది .ఇది యదార్ధమేకడా ఈశా .అంటే నిన్ను స్త్రీలోలుడిగా భావించటం తెలివి తక్కువ తనమే .

మాలవికాగ్ని మిత్రం లో మహా కవి కాళిదాసు ‘’కాంతా సమ్మిశ్ర దేహోప్య విషయ మనసాం యః పరస్తా ద్యతీనాం ‘’అన్నాడు శరీరం లో అర్ధభాగం గా పార్వతిని గ్రహించినప్పటికీ పరమేశ్వరుడు విషయ వా౦చల నుండి ఇంద్రియాలను నిగ్రహించుకొన్న యోగి పుంగవుల కంటే అగ్ర గణ్యుడుఅని తెలియ జెప్పాడు .

24-స్మశానేష్వా క్రీడా స్మరహర !పిశాస్స హ చరాః-చితాభస్మా లేపః స్రగపి నృక కోటీ పరికరః

అమంగల్యం శీలం తవ భవతు నామైవమఖిలం –తదాపి స్మర్త్రూణాం వరద !పరమం మంగళమపి ‘

భావం –స్మర దహనా !శివా !నువ్వు విహరించేది స్మశానాలలో .నువ్వుపూసుకోనేది శవాలు కాలిస్తే వచ్చే బూడిద .నీ మెడలో మానవ కపాలాల దండ .ఇలా నీ స్వభావం సర్వం అమంగళమే .వరదాతవైన నువ్వు భక్తులకు పరమ శుభ దాయకుడవు అవటం ఆశ్చర్యం .

‘’శివం కల్యాణం తద్యో గాద్వా శివ ప్రదత్వా ద్వా శివః ‘’అని శివ శబ్దానికి నిరుక్తి .శుభాలతో కూడి, శుభాలనిచ్సువాడు .అమంగళం గా కనిపించినా మంగళ కారుడు శివుడు అని తాత్పర్యం .

25-మనః ప్రత్యక్చి త్తే సవిధ మవధా యాత్త మారుతః –ప్రహ్రుష్య ద్రోమాణః ప్రమద సలిలో త్సంగిత దృశః

యదా లోక్యా హ్లాదం హ్రద ఇవ నిమజ్యా మృత మయే –తధత్యంత స్తత్వం కిమపి యమిన స్తత్కిల భవాన్ ‘’

భావం –దుర్గేశా !యోగులు యోగ విధానం లో మనసును వాయు స్తంభన చేసి ప్రత్యగాత్మ లో నిలుపుతారు .అప్పుడు వారు అలౌకికానందాన్ని పొందుతారు .ఆ ఆనందానుభవంగా వాళ్ళ ఒళ్ళు పులకరిస్తుంది .కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి .ఆ స్థితిలో  ఏ వస్తువును  చూసి అమృత సరస్సులో మునిగి నంత ఆనందం పొందుతారో దాన్ని వాక్కులచేత వివరింప శక్యం కాదు పరమాత్మా ! ఆ వస్తువు నువ్వే .పరమేశ్వరుడు సచ్చిదానంద పరబ్రహ్మ అని తాత్పర్యం .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీ’ర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం గ్రంథావిష్కరణ సభ (100 వ సమావేశం )

అక్షరం లోక రక్షకం

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు

–  అక్షరం లోక రక్షకం

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు

’గీ’ర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం గ్రంథావిష్కరణ సభ (100 వ సమావేశం )

ఆహ్వానం

సరసభారతి , రోటరీక్లబ్ ,ఉయ్యూరు సంయుక్తంగా నిర్వహిస్తున్నసరసభారతి అధ్యక్షులు  శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచన ;’’గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం(482 మంది సంస్కృత కవుల జీవిత ,సాహిత్య పరామర్శ )కీ శే లు శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  శ్రీమతి ,భవానమ్మదంపతులకు అంకిత మిస్తూ , శ్రీ మైనేని గోపాల కృష్ణ,శ్రీమతి సత్యవతి దంపతుల (అమెరికా )సౌజన్య సహకారాలతో వెలువడిన గ్రంథాన్ని4-12-20 16 ఆదివారం సాయంత్రం ,రోటరీ క్లబ్ ఆడిటోరియంలో  ఆంద్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు  విష్కరణ చేసే  సభలో పాల్గొని జయ ప్రదం చేయవలసినదిగా అతిధులకు  ,సాహిత్యాభిమానులకు  ,కవి పండితులకు  సాదర గా ఆహ్వానం పలుకుతున్నాం .

 

కార్య క్రమం

4-12- 16 ఆదివారం  మధ్యాహ్నం 4 గం ల నుండి -5 -30 గం వరకు

గీర్వాణ వైభవం (సంస్కృత సంస్కృతి)పై ప్రముఖ కవుల కవి సమ్మేళనం –

నిర్వహణ డా .గుమ్మా సాంబ శివరావు (తెలుగు శాఖాధిపతి ,లయోలా కళాశాల ,విజయవాడ )

సాయంత్రం 5 -30-నుండి 5-45 గం వరకు

‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం –ఆవిష్కరణ

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు ,గ్రంధ కర్త

సభ ప్రారంభకులు  –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,సరసభారతి గౌరవాధ్యక్షులు మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు

ముఖ్య అతిధి ,గ్రంథావిష్కర్త –మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ,శాసన సభ ఉప సభాపతి

విశిష్ట అతిధులు –పద్మశ్రీ ప్రొఫెసర్ కోనేరు రామ కృష్ణా రావు ,గీతం యూని వర్సిటి చాన్సెలర్ ,విశాఖ పట్నం

ప్రొఫెసర్ గబ్బిట ఆంజనేయ శాస్త్రి , న్యాయశాఖ ప్రొఫెసర్ , బెనారస్ హిందూ యూని వర్సిటి  వారణాసి.

శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి ,న్యాయశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ – శ్రీ జగన్నాధ విశ్వ విద్యాలయం ,పూరి

గౌరవ అతిధి   –డా .ధూళి పాళ రామ కృష్ణ ,సంస్కృత శాఖాధ్యక్షులు ,మేరీ స్టెల్లా కాలేజి ,విజయవాడ

మాన్య అతిధదులు  –  శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసన మండలి సభ్యులు

శ్రీ జి .వెంకటేశ్వర రావు  సి .ఓ ఓ.,-కె సి పి.

ఆత్మీయ అతిధులు – ప్రముఖ టి వి ,సినీ నటి ,యాంకర్ ఝాన్సి (అమృతం ఫేం )

శ్రీ గుండు హనుమంత రావు ,ప్రముఖ సినీ హాస్య నటులు ,(అమృతం ఫేం)

శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం

డా .జి వి .పూర్ణ చంద్ ,ప్రధాన కార్య దర్శి,కృష్ణాజిల్లా రచయితల సంఘం

శ్రీ చలపాక ప్రకాష్ ,రమ్య భారతి సంపాదకులు ,మరియు కార్య దర్శి,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం

సాయంత్రం 5- 45గం నుండి – 6 గం వరకు – గ్రంథ పరిచయం

డా .తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి ,రిటైర్డ్ ప్రిన్సిపాల్ ,శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల ,పొన్నూరు

సాయంత్రం 6 గం నుండి –రాత్రి 7- 30 గం వరకు –అతిధుల అభిభాషణం ,అతిధులకు సన్మానం

కార్య క్రమ నిర్వహణ -శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్య దర్శి

జోశ్యుల శ్యామలాదేవి  మాదిరాజు శివ లక్ష్మి  గబ్బిట వెంకట రమణ    గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు, మరియు    కార్య దర్శి              కోశాధికారి           అధ్యక్షులు -సరసభారతి

రోటరీ క్లబ్ ప్రెసిడెంట్

పూర్తి వివరాలతో ఆహ్వాన పత్రికను నవంబర్ 15 లోపు అంద జేస్తాము

‘’’చందః పాద యుతాం నిరుక్త నఖరాం ,శిక్షాది జ౦ఘాన్వితాం

ఋక్సామోరుయుగా,మధర్వ జఘనా  ,మధ్వర్యు వేదో ధరాం

తర్క న్యాయ కుచాం,పదస్మృతిభుజాం కావ్యార వి౦దాననాం

వేదా౦తామృత  లోచనాం,భగవతీం వాగ్దేవతా మాశ్రయే ‘’.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -7

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -7

మల్లినాద మహా వైదుష్యం

అనితర సాధ్యమైన మేధస్సు ,పాండిత్య గరిమ శాస్త్ర పరిజ్ఞానం ,కావ్య ప్రతిభ విమర్శనా చాతుర్యం ,విశ్లేషణ సామర్ధ్యం,లోకజ్ఞానం  మల్లినాద సూరి ప్రత్యేకతలై ,ఇతార వ్యాఖ్యాతలు ఆయనకు ఆమడ దూరం లో ఉండిపోయారు .ఆయన పాండిత్య పారావారానికి అవధి లేదు .అన్ని నిఘంటువులు ,పదకోశాలు , ,,సర్వ శాస్త్రాలు ,పాణిని సూత్రాలు ,ధర్మ శాస్త్రాలు ఆయనకు కరతలామలకాలు వాచో విదేయాలు .రెండు చోట్ల మాత్రం తనను గురించి చెప్పుకొన్నాడు .రఘు వంశ వ్యాఖ్యానం లో తనను ‘’పద వాక్య ప్రమాణ పారావార పారీణ’’అని ,తనకున్న అపార శాస్త్ర పాండిత్యాన్ని సంజీవిని వ్యాఖ్య ప్రారంభం లో ఒక శ్లోకం లో తెలియ జేశాడు –

‘’వాణీం కాణభుజీ మజీగణదవాసా సీచ్చ వైయాసికీ –మంత్రస్తంత్ర మరంస్త పన్నాగ గవీ  గు౦భేషు చాజా గరీత్

వాచామాచకల ద్రహస్య మఖిలం యశ్చాక్ష పాద స్ఫురాం –లోకే భూద్యదుపజ్న మేవ విదుషాం సౌజన్య జన్యం యశః ‘’

దీనిభావం –కణాద,గౌతమ తర్క శాస్త్రాలను ,వ్యాసకృత బ్రహ్మ సూత్రాలను ,మీమాంసా వ్యాకరణాలను క్షుణ్ణంగా అభ్యసి౦చాను ,కనుక మహా మహోపాధ్యాయ బిరుదు సార్ధకం .అన్ని శాస్త్రాలలో సిద్ధాంత స్థాపనం చేసేవారినే మహా మహోపాధ్యాయులు అంటారు .శంకర భగవత్పాదులు ‘’ఈక్షితేర్నా శబ్దం ‘’అనే సూత్రానికి వ్యాఖ్యానం రాస్తూ ‘’తత్ర పద వాక్య ప్రమాణజ్నేనాచార్యేణ వేదాంత వాక్యానాం బ్రహ్మావగతి ప్రదర్శనాయ వాఖ్యాభాస ప్రతి పత్తయః పూర్వ పక్షీయ నిరా క్రియ౦తే’’అని రాసే సందర్భం లో ‘’పద వాక్య ప్రమాణజ్న ‘’బిరుదు ను బాదరాయణ మహర్షికి(వ్యాసర్షి ) విశేషంగా ప్రయోగించారని శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారు ‘’ఆంద్ర మాఘ కావ్య పీఠిక ‘’లో తెలియ జేశారని డా చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు తమ శిశుపాల వధ ఆంధ్రీ కృతులు అనుశీలనం లో రాశారు .

వరద రాజ కృత ‘’తార్కిక రక్షా సార సంగ్రహం ‘’కు నిష్కంటక వ్యాఖ్య ,కుమారిల భట్టు రాసిన ‘’తంత్ర వార్తికం ‘’కు వ్యాఖ్యానం ,జితేంద్ర సిద్ధి రచన ‘’న్యాస గ్రంధం ‘’కు ‘’న్యాసోద్యోతం వ్యాఖ్యతోపాటు ఒక జ్యోతిష గ్రంధాన్ని మల్లినాధుడు రాశాడని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి రాశారని  చెరువు వారు  చెప్పారు . కాళిదాస కావ్య వ్యాఖ్యానం చేస్తూ ‘’కాళిదాస గిరాం సారం ,కాళిదాస స్సరస్వతీ –చతుర్ముఖో ధవా సాక్షా ద్వేత్తి నాన్యేతుమాద్రుశాః ‘’అని వినయం తోపలికాడు సూరి .’’’భారతీ కాళిదాసస్య దుర్వ్యాఖ్యా విష మూర్చితా –ఏషా సంజీవినీ వ్యాఖ్యా తామద్యో జ్జీవ ఇష్యతి ‘’అంటే కాళిదాస మహా కవి వాక్కులకు అనేక దుర్వ్యాఖ్యానాలు వలన అర్ధ ప్రసన్నత  కోల్పోయి  మూర్చిల్లాయనీ, సార్ధకమైన నా సంజీవినీ వ్యాఖ్య వాటికి ప్రాణం పోసి వికసింప జేస్తాయి .అని భావం.’’మల్లినాద కవిస్సోయం మందాత్మా నుజి ఘ్రుక్షయా –వ్యాచస్టే కాళిదాసస్య కావ్య త్రయ మనాకులం ‘’అని ప్రతిజ్ఞ కూడా చేశాడు మల్లినాధుడు .అల్ప బుద్ధికలవారికి అతి సునాసంగా కాళిదాస హృదయం అర్ధమయ్యేట్లు చేయటం నా విధి ‘అని భావం .

మల్లినాధుడు తొక్కిన కొత్త దారి

సామాన్యుడికి కావ్య శాస్త్రాలు చేరువవ్వాలంటే అసలు అప్పటిదాకా ఉన్న వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయి ,మల్లి నాధుని కొత్త మార్గం ఏది ?తెలియాలి .కేవలం కద తెలుసుకోవటానికి కావ్యం చదవక్కరలేదు .ఇతిహాస పురాణాలలో ఈ కధలన్నీ ఉండనే ఉన్నాయి .కావ్యం లోని విశేషాలను మనసుకు అందజేసి,ధ్వని భావ చమత్కారాలకు మురిసి ,రసాందాన్ని పొందటమే కావ్య పరమార్ధం .పండితులకు తత్వజ్నులకు ఈ రహస్యాలు తెలుస్తాయి .సామాన్యులకు అవి కరతలామలకాలు కావటం లేదు .కనుకనే వ్యాఖ్యానాల అవసరం కలిగింది  .పైకి రావాలనే విద్యార్ధులకు అందుబాటులో లేని ప్రబంధాది కావ్యాలకు కరదీపికలై మార్గదర్శనం చేస్తాయి వ్యాఖ్యానాలు ..

సాధారణ వ్యాఖ్యానాలలో అన్వయ క్రమం లో పదాలను కూరుస్తారు వీటిని అన్వయ వ్యాఖ్యలు అంటారు .మరికొన్నిటిలో కర్త ,కర్మ ,క్రియ లను ముందుగా చెప్పి తర్వాత ఆకాంక్షను బట్టి ఆ యా పదాల విశేషాలను వివరించబడుతాయి వీటిని ‘’సాకా౦క్ష వ్యాఖ్యానాలు ‘’అంటారు .అంటే పదాలకు ,పదా౦తరాలకు ఉన్న సంబంధాన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పి సంబంధాన్ని నిరూపించటం అన్నమాట .

రెండు రకాల వ్యాఖ్యానాలలో సమన్వయ ముఖ వ్యాఖ్యానం కావ్యాల విషయం లో సమన్వయ సారళ్యాలకు  సులభంగా అర్ధం చేసుకోవటానికి ఉపకరిస్తుంది .ఇలాంటి వ్యాఖ్యానాలనే టీక అంటారు .వీటిలో పదాలకు సంబంధించి అర్ధాలకు సంబంధించి విశేషాలు సమాసాలకు విగ్రహ వాక్యాలు ,ప్రకృతి ప్రత్యయ విభాగాలు ,కఠిన పదాలకు అర్ధాలు ,వాటికి నిఘంటు ప్రమాణాలు ,అలంకార విశేషాలు ,వాటి లక్షణాలు ,అందులో చెప్పబడిన శాస్త్ర విషయాలణు వివరించే ప్రమాణ వాక్యాలు మొదలైన వాటితో సమగ్రంగా ఉంటుంది .ఇవన్నీ లేకుండా కేవలం పద సమన్వయము మాత్రమే ఉంటె ‘’లఘు వ్యాఖ్య ‘’అంటారు .సమన్వయము లేకుండా కఠిన పదాలకు అర్ధం మాత్రమే చెప్పే వాటిని ‘’గచ్చద్వాఖ్యలు ‘’అంటారు .కావ్యం లోని విశేషాలను మాత్రమే చెప్పి ,అందుకు సంబంధించిన శాస్త్ర ,లక్షణ గ్రంధాది ప్రమాణాలతో ,ఉదాహరణలతో వివరించే వాటిని ‘’టిప్పణి’’అంటారు .ఇందులో ఉన్న లాఘవాన్ని బట్టి లఘు టిప్పణి అన్నారు ఇలా వ్యాఖ్యానాలలో ఉన్న రకాలను చెరువు వారు వివరిచారు .

సంస్కృత కావ్య నాటకాదులలో అన్వయం ద్వారా సమగ్ర వ్యాఖ్యానంతో వాటిలోని విశేషాలను పాఠకుడు తేలికగా గ్రహిస్తాడు .ఇలాంటి పరిజ్ఞానాన్ని ‘’సాహిత్యం ‘’అంటారు .సాహిత్యం అంటే సహి తత్త్వం .శబ్దార్ధ ,గుణాలంకార ,రసభావ వివిధ శాస్త్ర విషయ సహితం కనుక ఇది సాహిత్యమయింది .సాహిత్యం అంటే ఇవన్నీ ఉన్నది . సాహిత్య పండితుడు అంటే ఇవన్నీ పూర్తిగా తెలిసినవాడు అని  అర్ధం .మల్లినాధుడు అన్వయ ముఖ సవ్యాఖ్యాన మార్గమే తొక్కి మార్గ దర్శియై ,ఆదర్శ ప్రాయమైనాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆంధ్ర పత్రిక శత జయంతి ఉత్సవ ఆహ్వానం

ఆంధ్ర పత్రిక శత జయంతి ఉత్సవ ఆహ్వానంsahitya-akademy-andhra-patrika

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఇమాన్యుయేల్ కాంట్ -వికాసం అంటే ఏమిటి ?

ఇమాన్యుయేల్ కాంట్  -వికాసం అంటే ఏమిటి ?

ఇమాన్యుయాల్ కాంట్ (1724-1804 )గొప్ప జర్మన్ మేధావి గణిత శాస్త్ర వేత్త  ప్రపంచ తత్వ వేత్తలలో అగ్ర శ్రేణికి  చెందినవాడు  .భారతీయ తత్వ వేత్తలు ఆయన సిద్ధాంతాలను తరచూ ఉదాహరిస్తూ ఉంటారు .ఆయనకూ మన దేశం పై అపార మైన గౌరవం ఉన్నది .వికాసోద్యమానికి ఆధ్యాత్మిక మూలాలు సంతరించాడు. స్వచ్చమైన హేతువాద పరామర్శ (క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ),సిద్ధాంతీకరణ విమర్శ(క్రిటిక్ ఆఫ్ జడ్జిమెంట్ ) కాంట్ గొప్ప రచనలు .లెస్సింగ్ లాగా వికాసం అనేది నిరంతర కార్యక్రమం అని మనోవికాసం తో కూడిన హేతు వాదం వైపుకు పురోగామించటమే మానవ జీవిత పరమార్ధమని కాంట్ అంటాడు .ఆయన రాసిన’’ హేతు వాదం అంటే ఎమిటి ‘’?అనేదాన్ని ఆయనమాటలలోనే తెలుసుకొందాం

‘’వికాసం అంటే స్వయంగా తెచ్చుకొన్న పారతంత్రం నుండి విమోచన .పార తంత్రం అంటే మనిషి ఇతరుల ఆదేశం లేకుండానే తన తెలివిని ఉపయోగించుకోలేని అసమర్ధత . అందుకే ఈ  పారతంత్ర్యం .దానికి హేతువు అయిన వివేచనా శక్తి లోపం వలన కాకుండా ఇతరుల ఆదేశం లేకుండా దాన్ని ఉపయోగించుకోవటానికి అవసరమైన పట్టుదల సాహసం లేక పోవటం వలన కలిగేది. ఇది స్వయం కృతం .’’సాహసించు –నీ హేతువాద వివేకాన్ని ఉపయోగించు ‘’అనేది వికాస వాద సూత్రం .

‘’అలసత్వం ,పిరికితనం పారతంత్రానికి ముఖ్య కారణాలు.బాహ్య దేశం నుంచి విముక్తిపొందినా వీళ్ళు జీవితమంతా సంరక్షకత్వం (ట్యూటేలేజ్ )లో మసులుతూ ఉంటారు .నాకోసం అన్నీ అర్ధం చేసుకొని నా పని తేలిక చేసే పుస్తకం ,నాకోసం ఒక అంతరాత్మగల గురువు ,నా ఆహారాన్ని నిర్ణయించే వైద్యుడు ఉంటె నేనుగా ప్రయత్నం చేయటం ఎందుకు ?నేను ఆలోచి౦చక్కరరలేదు .నేను డబ్బు వెదజల్లితే ఇవన్నీ చేసేవారు నాకు దొరుకుతారు ..ఇతరులే నా బదులు పని చేయటానికి సిద్ధంగా ముందుకు వస్తారు ..ఈ సంరక్షకులు మొదట తమ ‘’పశువుల మందకు’’ మూగతనాన్ని అలవాటు చేసి తర్వాత తాళ్ళతో బంధించి బండీకి కట్టేస్తారు .తప్పించుకొనే ప్రయత్నం చేస్తే ఎంత ప్రమాదమో తెలియ జేసి గ్రిప్ లో ఉంచుకొంటారు .ఎవరిడైనా గీత దాటటానికి చేసి విఫలమైతే  మిగిలిన వారికి కనువిప్పుకలిగించి ఆ ప్రయత్నం జోలికి వెళ్ళకుండా చేస్తారు .కనుక ఒంటరిగా ఉంటూ ఈ పారతంత్రం నుంచి తప్పించుకోవటం చాలా కష్టం .పారతంత్రం అతనికి మహా భాగ్యం గా ఉంటుంది .బుద్ధిని ఉపయోగించటానికి అశక్తుడు అవుతాడు .అవకాశమూ ఇవ్వరు, తీసుకోడు కూడా .స్వేచ్చాచలనం అలవాటు లేక దేనికోదానికి బందీ అయిపోతాడు .

ప్రజలు తమంత తాము వికాసం పొందటం సాధ్యమే .స్వేచ్చ ఇస్తే వికాసం వస్తుంది .పారతంత్ర కాడిని బుజం మీదనుంచి తోసిపారేశాక తమ యోగ్యతను గురించి ఆలోచిస్తారు .కర్తవ్యమ్  అనే సూత్రాన్ని గుర్తెరిగి బాగా ప్రచారం చేస్తారు .అసూయా ద్వేషాలు నాటటం ప్రమాదకరం .మనోవికాసానికి కావాల్సింది స్వేచ్చ మాత్రమే . ‘’వాదించకు ,చెప్పింది చెయ్యి విశ్వసించు ,వాదించినా విదేయుడవై ఉండు ‘’అని స్వాతంత్ర్యాని అడ్డ కట్టలు  సర్వత్రా ఉంటాయి .హేతువాద వివేచనకు మనిషికి ఎప్పుడూ స్వతంత్రం కావాలి .సమాజం లోని వ్యక్తులు కృత్రిమ ఐక మత్యం తో అస్వతంత్రులుగా పని చేయాలి .అప్పుడే వారి ప్రయోజనాలను ప్రభుత్వం గుర్తించి అనుకూలంగా ప్రవర్తిస్తుంది .పన్నుల అనౌచిత్యాన్ని ,అన్యాయాల గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు పౌరులుగా తమ ధర్మాలకు వ్యతిరేకంగా పని చేయకూడదు .మతం కాని సంఘం కాని మనవ మనో వికాసాన్ని అణచిపెట్టే ఏ పనీ చేయ రాదు .ఒక వర్గానికున్న హక్కును వేరొక వర్గానికి లేకుండా చేయరాదు

‘’మనం వికాస ౦ పొందిన యుగం లో జీవించటం లేదా అని ఎవరైనా ప్రశ్నిస్తే’’లేదు’’ అని నా సమాధానం .కారణ౦ మనం ఉన్నది వికాస వాద యుగం లోనే కాని , వికాస యుగం లోకాదు. వికాసవాద యుగం అంటే ఫ్రెడరిక్ శతాబ్ది. ఫ్రెడరిక్ ప్రభువు మానవులకు నిషేదాలులేకుండా స్వేచ్చా జీవుల్లా ఉంచటానికి ప్రయత్నంచేసి మనోవికాసాన్ని సాధించినవాడు .పౌరస్వాతంత్ర్యం ప్రతి వ్యక్తీ మనస్సుకూ తన శక్తికొలది విస్తృతంగా వికాసం పొందటానికి  అవకాశం కలిగిస్తుంది .అతి కఠిన మైన మెదడు చిప్పలోప్రకృతి అద్భుతమైన విత్తనాన్ని ఆరోపించింది .దాన్ని అతి సుకుమారంగా చూసుకొంటుంది. ‘స్వేచ్చగా ఆలోచించాలి అన్న ఆసక్తే ఆ బీజం .ఇది ప్రజల పరిణామ౦ మీద ప్రభావం కలిగిస్తుంది దానితో స్వాతంత్రానికి అర్హత సంపాదిస్తాడు .చివరికి అది ప్రభుత్వ విదానాలమీదకూడా ప్రభావం చూపిస్తుంది .ప్రభుత్వం వారిని యంత్రాలలాగా కాకుండా అప్పుడు వారి వారి హోదాలకు తగినట్లు సంభావిస్తుంది .

Inline image 2

ఆధారం –జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం –మధ్యయుగాల నుండి నేటి వరకు -1971 లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ –మద్రాస్ ప్రచురణ

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-16 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment