అచ్చమైన ఉత్తరాంధ్ర దరిద్రం కధ శ్రీమతి శీలా సుభద్రాదేవి ‘’వానా వానా కన్నీళ్లు ‘’

అచ్చమైన ఉత్తరాంధ్ర దరిద్రం కధ శ్రీమతి శీలా సుభద్రాదేవి ‘’వానా వానా కన్నీళ్లు ‘’

అసలు శీర్షికలోనే కన్నీళ్ళ జడి వాన కురిపించారు శ్రీమతి సుభద్రాదేవి .కధకు శీర్షిక అంటే ఇలా ఉండాలి .ఉత్తరాంధ్ర దరిద్రాన్ని ఇద్దరు కుర్రాళ్ళ జీవిత సంఘటనలో ప్రత్యక్షం చేశారు .సాధారణం గా ఎలక్షన్లు వచ్చాయంటే మనవాళ్ళు రాసే కధలు సరదాల పరదాలు కప్పుకొని ముందుకొస్తాయి, గిలి గింతలు పెడతాయి. కాని సుభద్రా దేవి రాసిన కదచదివితే  కన్నీళ్ళ వాన కురుస్తుంది .అదీ మిగతా వారి కంటే కధకురాలిగా ఆమె చూపు లోని వైశిష్ట్యం .ఒక రకం గా ప్రత్యక్షర శిల్పమే ఈ కద అని పించింది నాకు .అందుకే మీ అందరికీ తెలియాలని దీన్ని గురించి రాస్తున్నాను .కొంచెం ఫ్లాష్ బాక్ లోకి వెడతా .’’ఉత్తరాంధ్ర కధలు ‘’అనే బృహత్ గ్రంధాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 20 14  జులై లో కీ శే విరియాల లక్ష్మీ పతి ,డా చాగంటి తులసి గార్ల సంపాదకత్వం లో డా ఎస్వీ సత్యనారాయణ గారు గౌరవ సంపాదకులుగా వెలువరించారు .దీన్ని నాకు ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా )కొని, కానుకగా 20-1-15 న పంపారు .దీన్ని 12-7-15 న ప్రారంభించి ,సమయం ఉన్నప్పుడు చదువుతూ ‘’లాగు’’తున్నాను .ఇవాళ శ్రీమతి శీలాసుభద్ర గారి ‘’వానా వానా కన్నీళ్లు ‘’కద చదివి దాన్ని గురించి రాయకుండా ఉండలేక పోయాను .ఇదీ నేపధ్యం .

పార్టీ వాళ్ళుఇచ్చిన ఎలెక్షన్  జెండా ను అయ్య చొక్కా కుట్టిస్తే ఆ కొత్త చొక్కా తొడుక్కున్నాడు బజార్లో కాగితాలేరుకొనే సూరిగాడు .అంత కంటే దరిద్రం తో బాధ పడుతున్న అదే పనిని  వాడితో పాటు చేస్తున్న అప్పిగాడు బోల్డంత ఆశ్చర్య పోయి చూసి నేస్తాన్ని ఎవరు కుట్టి౦చారని అడిగితె వాడు ‘’అయ్య కుత్తిం చేడు .పారటీ వొల్లు ఇచ్చినారట ‘’అన్నాడు ముడుకుల కింత వరకు వేలాడుతున్న చొక్కాని మురిపెంగా చూసుకొంటూ సూరిగాడు .పార్టీ వాళ్ళు ,ఎలచ్చన్ల గొడవలు తెలీని అప్పి గాడికి వివరంగా బోధిస్తూ ‘’పెచారానికి ఈ రంగు చొక్కానే తొడగాలి .ఆ పార్టీ వొల్లుమా అయ్యా రిచ్చాను బేరమాడుకున్నారు .రిచ్చా చుట్టూ అచ్చరాలు రాసిన గుడ్డ కూడా నాకు గోసీకని ఇత్తాడట మా అయ్య’’  కాగితాల గోని సంచీ మరో బుజానికి మార్చుకుంటూ గర్వం గా చెప్పాడు సూరిగాడు . అప్పిగాడు మాసి పోయిన తన గోచీ గుడ్డను ఓ సారి తడుముకున్నాడు .తనకీ కొత్త గోచీ ఉంటె బాగుండును అనుకొన్నాడు .వాడి అయ్య మిల్లు లో పని చేస్తాడు .’’మేనేజరు బాబుపంచ ఏదైనా ఇత్తే,అప్పుడు అయ్యా ఆడి పంచ చింపి ,తనకి తమ్ముల్లిద్దరికి గోసీ కిత్తాడు .అంత దాకా ఈ పాత గోసీయే ‘’అను కున్నాడు కూడా .

ఇద్దరూ పోటీ పడుతూ కాగితాలేరు కొంటున్నారు .ఎన్నికల హడావిడి కనుక బోల్డు కాగితాలు దొరుకుతున్నాయి .వీధులు తిరుగుతూ ఎలక్షన్ పందిరి దగ్గరికోచ్చారు .అదేటోఅప్పిగాడికి తెలవక పాయె .సూరిగాడు అనుభవజ్నుడిలా ‘’ఈడ కూడా ఎలచ్చన్ల పెచారం చేత్తార్రా ‘’అన్నాడు .ఇన్ని విషయాలు వాడికెలా తెలిశాయో ఆశ్చర్య పోయి అడిగితే ‘’నాను రెండో కళాసు సదివినాను కాదేటి .ఆడ అతికించిన కాగితాలు సదువుతే నాకు తెలిసిపోనాది ‘’గొప్పగా చెప్పాడుఅమృతం సీరియల్ లో హోటల్ సర్వర్ లా సూరిగాడు తనకైనా వయసులోనే కాదు అన్నిట్లోనూ చిన్న వాడైన అప్పిగాడితో .ప్రచారం కాగితాలను మొహమాటానికి జనం తీసుకొని చదివినట్లు నటించి పార్టీ వాళ్ళు కనుమరుగు కాగానే చింపి పారేస్తుంటే వీళ్ళిద్దరికీ కడుపు నిండా అన్నం మాటేమో కాని సంచీ నిండా కాగితాలే కాగితాలు ఏరుకొన్నవాడికి యేరు కొన్నంత .  .బస్టాండ్ దగ్గర ఎలక్షన్ టెంట్ దగ్గరికి చేరే లోపే మరో తడికల టెంట్ కనిపించింది  అక్కడికి సూరి  గాడి నాన్ననారాయణ పరిగెత్తుకొంటూ వచ్చి ‘’ఒర్ సూరిగా ! ఆ చొక్కా బేగిప్పేసి ఇయ్యరా ,పెచారినికి తోడుక్కేల్లాలి.నీ ఒంటి మీదసూసినారా కొంప మునుగుద్ది .నా బనీను నువ్వేసుకో ‘’అని చొక్కా బనీను తండ్రీ కొడుకులు మార్చుకొన్నారు ఆఘ మేఘాల మీద .కొత్త చొక్కా ఒంటి మీద లేనందుకు దిగులు పడ్డా ,తండ్రి రిచ్చ జెండాలతో కళకళ లాడి పోవటం చూసి చొక్కా విరహం మర్చి పోయాడు .అప్పి గాడికి ఇదంతా వింత గా ఉంది చోద్యం చూస్తున్నాడు నోరెళ్ళ బెట్టి .’’సూసావురా అప్పిగా !అయ్య రిచ్చా చుట్టూతా పెట్టినారే ,ఆ గుడ్డే ఎలచ్చను అయ్యాక ఇత్తారట’’అన్నాడు అల్ప సంతోషి సూరి .ఇంతలో టెలిఫోన్ స్థంభాలకు రోడ్డుపైన పెద్ద బానర్ కట్టటం చూశారిద్దరూ .గుడ్లు తేలేసి గుడ్డ వంక చూస్తూ ‘’అది మనకైతే అయిదు చొక్కాలు అవుతాయి కదరా !’’అన్నాడు అప్పి  .’’కాదురా .రెండు మన ఆదివి అయి రెండు మీ బుడ్డోడికి అవుతాయి  ‘’అన్నాడు ఆరిందా సూరి .అప్పుడే ఆ బానర్ గుడ్డ తమకిచ్చేసినట్లు దాన్ని చొక్కాలు కుట్టి౦ చేసినట్లు ఫీలై , కబుర్లతో సంతృప్తి పడ్డారు ఆ అమాయక గర్భ దరిద్ర బుడత జీవులు .  ఇక ఆపూటకి ఏరుడు ఆపేసి  ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లి పోయారు సూరి ,అప్పి గాళ్ళు .

ఇంటికి వచ్చాడే కాని అప్పిగాడు పరధ్యానం లోనే ఉన్నాడు  ఏదో ఇంత అంబలి కతికి ఆరు బయట బొంత మీద రాత్రి పడుకొని నక్షత్రాలు చూస్తున్నాడు ..పైడి తల్లి మిల్లు నుంచి వచ్చి చెంబెడు నీళ్ళు దిమ్మరించుకొని అంబలి తాగి వచ్చి కొడుకు అప్పిగాడి పక్కన కూర్చున్నాడు .నెమ్మదిగా అయ్యను పలకరించి ‘’అయ్యా !నువ్వు కూడా రిచ్చా తోక్కవే ‘’అన్నాడు ప్రాదేయంగా .కొడుక్కు వచ్చిన వింత ఆలోచన అర్ధం కాలేదు తండ్రికి ‘’మా అయ్య ఇంతప్పటి నుంచి మిల్లు కాడే సేసినాడు .ఆడు సేసిన అప్పులు తీర్చటానికి నాను కూడా మిల్లు కాడే కుదురుకున్నాను అప్పు తీరుతుందో లేదో ఎరిక నేదు .ఇంకా రిచ్చా ఏటిరా ?’’అన్నాడు .ఇంతలో  తల్లి వచ్చి ‘’బాగానే ఉంది అయ్యా కొడుకుల సంబడం .అందరం సేసే సాక్రి కూడుకే సాలటం నేడు .ఇంకా రిచ్చాలేంటి కలలు కంటున్నావా ?అని గదిరింది  .

మళ్ళీ రెండు రోజులు అప్పి సూరి పేపర్ల వేటలో బిజీ బిజీ .అయినా అప్పిగాడి మనసులో ఆ బానర్ దోబూచు లాడుతూనే ఉంది. కనీసం టెంట్ కు కట్టిన గుడ్డ అయినా చాలు అని కలలు కంటున్నాడు .ఒకరోజు సూరిగాడికి చెప్పకుండా టెంట్ దగ్గరకొచ్చి ఎవరూ చూడటం లేదనుకొని టెంట్ తడికకు కట్టిన గుడ్డను బ్లేడ్ తో కోయటం మొదలు పెట్టాడు .దరిద్రం ఎంతకైనా తెగిస్తుంది .ఇంతలో పార్టీ వాడొకడు గమనించి కేకలు లంకించుకొన్నాడు .అందరూ పోగై అప్పిగాడిని పట్టు కొన్నారు,కొట్టారు  .వాడు వేరే పార్టీ వాడేమోనని ,అందుకే  చింపేస్తున్నాడని పొరబడి అప్పిగాడి వీపు చించేశారు . వీడు ‘’ఓర్నాయనో 1 నానే పారిటీ వోన్నీగాను .కొత్త గోసీ గుడ్డ కోసం సి౦పుకున్తున్నాను బావో ‘’అని ఏడ్చాడు .ఇంతలో అప్పి గాడు తనని పిలవ కుండా వచ్చేసాడేమో అనుకొంటూ అక్కడికి తండ్రితో చేరిన సూరిగాడికి సీను అర్ధమై  ,నెమ్మదిగా వాడిని ఆ గుంపు నించి తప్పించి బయటపడేసి వాడి మానాన్ని కాపాడాడు .’ఒర ప్పిగా ! మా అయ్యా ఇత్తే ఆ గుడ్డ  నీక్కూడా కసింత ఇత్తానులేరా ‘’అని అభయమిచ్చాడు స్నేహ ధర్మంగా .’’ఉరే !ఎలచ్చన్లు  అయ్యే దాకా ఆటి జోలికి మనం ఎల్తే సంపెత్తారు .సమయానికి మేం రాబట్టి సరి పోయింది .నేక పొతే ఏటయ్యేదో ‘’అని పార్టీ ఎలక్షన్ కోడ్ చెప్పి ,అనునయించి తీసుకు వెళ్ళాడు .అప్పిగాడికి తగిలిన దెబ్బలకు సూరీ తండ్రీ బాధ పడ్డారు .అయితే ‘’వాళ్ళ బాధ లోకానికేం బాధ లేదు కనుక యాంత్రికంగా మరో రెండు రోజులు గడిచి పోయాయి ‘’అంటారు లోకానుభవం తో రచయిత్రి .

ఎన్నికల మూన్నాళ్ళ భోగం పూర్తీ అయి మళ్ళీ రిక్షా బేరాలకి వెళ్ళాల్సి వచ్చిందే అని సూరి తండ్రి ‘’సూనాయన ‘’తెగ బాధ పడిపోయాడు  . తండ్రి నడిగి రిక్షా చుట్టూ కప్పిన గుడ్డను విప్పేసుకొచ్చి కప్పేసు కొన్నాడు సూరి .’’అప్పుడే దాన్ని సిమ్పీ సేయ్యమాకు. నాల్రోజుల తర్వాత సూడచ్చు ‘’అని హెచ్చరించాడు తండ్రి .సూరి గాడి ముఖం చిన్న బోయింది .కానీ తర్వాతన్నా అది తనదే అవుతుంది కదా అనే ఆశ, ధైర్యం వాడిది .అందుకే మడతేట్టి గూట్లో జాగ్రత్త చేశాడు .కాని ఏమనుకోన్నాడో ఏమో తండ్రి నారాయణ  మర్నాడే బానర్ గుడ్డా ,జెండాలు తీసికెళ్ళి పార్టీ ఆఫీసులో ఇచ్చోచ్చాడు .తెలిసిన సూరి ఏడుపుకు అంతం లేదు .అప్పిగాడి తో చెప్పుకొని తెగ ఇదయ్యాడు .’’పోన్లేరా మన అదుట్టం అంతే ‘’అని ఓదార్చాడు అప్పి గాడు .బానర్ ఎ౦డా వానలకు రంగు వెలిసి పోయినట్లు వాళ్ళ ముఖాలు పాలిపోయాయి అన్నారు సుభద్రా దేవి .గాలికి పడిన చినుగు కనిపించేసరికి మరింత విల విల్లాడారు .

ఒక రోజు రాత్రి విపరీతంగా కొండ పోత గా వాన కురిసింది .గుడిసె వాసులు నిద్ర లేకుండా ఏమై  పోతామో అని జాగరణ చేస్తున్నారు .అప్పిగాడికి ఒక ‘’అవుడియా’’ వచ్చి ఇంట్లోంచి బయటికొచ్చి ఇంట్లో వాళ్ళు అరుస్తున్నా లెక్క చేయకుండా  బయట ఉన్న సూరిగాడితో కలిసి బస్టాండ్ దగ్గర కట్టిన బానర్ వైపు పరిగెత్తారు .అక్కడికి చేరి పైకి చూస్తే  తాము ఇన్నాళ్ళుగా కలలు కంటూ కోరుకున్న బానర్ అడ్రస్ లేదు .తాళ్ళ చివరల గుడ్డ పేలికలు మాత్రమే వేలాడుతూ కనిపించాయి .ఇద్దరి నవ నాడులూ కలిసి 18 నాడులూ కుంగి పోయాయి .రోడ్డంతా కలయ చూశాయి .నాలుగు కళ్ళు ఒకటై .బురదలో కూరుకు పోయిన బానర్ కంట బడింది .అది ఎండా వానలకు, బురదకు చీలికలు పేలికలై కనిపించింది .’’ఇద్దరి గుండె పగిలింది .ఆ చప్పుడు వాళ్ళిద్దరికే వినిపిస్తోంది .రాత్రి  వర్షానికి మించిన తీవ్రత తో కురుస్తున్న వాళ్ళ కన్నీరు ,వాళ్ళిద్దరూ వర్షం లో పూర్తిగా తడిసి పోవటం చేత బయటి వాళ్ళకైతే వినిపిచటం లేదుకాని ,వాళ్ళిద్దరికీ ఒకరి కన్నీరు ఒకరికి కని  పిస్తూనే ఉంది ‘’అని కధను పూర్తి చేశారు శ్రీ మతి సుభద్రా దేవి .

ఉత్తరాంధ్ర అంటే ఘనీభవించిన దరిద్రం అని భావిస్తాం. దాన్ని కళ్ళకు కట్టించారు సుభద్రా దేవి .గోచీ కోసం పడే కుర్రాళ్ళ తపన పరా కాస్ట గా చిత్రించారు . ‘’ఉత్తరాంధ్ర కధలు ‘’కదా సంకలం మొత్తం మీద దరిద్రం పై ఇంత గొప్ప కద ఇంకొకటి మాత్రమె కనిపించింది నాకు. అది శ్రీ  ఏ వి రెడ్డి శాస్త్రి గారి ‘’మునిగిపోతున్న బల్లకట్టు’’.దీన్ని నా వాయిస్ తో చదివి రికార్డ్ చేసి ఇది వరకే మీ అందరికీ అందించాను. ఇవాళ ఈ కద నన్ను బాగా ఆకర్షించింది .ఇంకా సుమారు ముప్ఫై  కధలున్నాయి .చదవాలి  . పుస్తకం పంపిన శ్రీ మైనేనిగారికి ధన్యవాదాలు  ,ఈ కద రాసిన శ్రీ మతి సుభద్ర గారికి మనః పూర్వక అభినందనలు .న్యాయంగా ఈ కధ అక్షర లక్షలు చేసే కధ.

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-16-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

దేవీ నవరాత్రుల సందర్భంగా సరసభారతి 98 వ సమావేశం –దేవీ ప్రాశస్త్యం -ధార్మిక ప్రసంగం

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

  దేవీ  నవరాత్రుల సందర్భం గా సరసభారతి 98 వ సమావేశంగా శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి దంపతులచే ”దేవీ ప్రాశస్త్యం ”ధార్మిక ప్రసంగం 4-10-16 మంగళవారం సాయంత్రం 6- 30గం లకు స్థానిక శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఏర్పాటు చేయబడినది .సాహిత్యాభిమానులు భక్తులూ పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .
 జోశ్యుల శ్యామలాదేవి    మాదిరాజు శివ లక్ష్మి   గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్ 

                                                                                       సరసభారతి  అధ్యక్షులు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7 15-లూడో రోచెర్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7

15-లూడో రోచెర్

సంస్కృత విద్యా వేత్త ప్రొఫెసర్ లూడో రోచెర్ బెల్జియం లో 25-4-1926 న జన్మించి 72 లో అమెరికా పౌరుడయ్యాడు .ఘెంట్ యూని వర్సిటి నుండి పి హెచ్ డి పొందాడు .బ్రస్సెల్స్ యూని వర్సిటిలో 1956 నుండి పదేళ్ళు సంస్కృతం కంపారటివ్ ఫైలాలజీ బోధించాడు .అదే వర్సిటిలో 61 నుండి 67 వరకు ‘’సెంటర్ ఫర్ స్టేడి ఆఫ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏసియా ‘’కు డైరెక్టర్ గా ఉన్నాడు .

ప్రొఫెసర్ నార్మన్ బ్రౌన్ ఆహ్వానం పై రోచెర్ అమెరికాలోని ఫిలడేల్ఫియాకు వెళ్లి పెన్సిల్వేనియా యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా నియమింప బడి 1966 నుండి 36 ఏళ్ళు నిరాటంకంగా 2002 వరకు పని చేశాడు .1991 లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ పీఠానికి అధిపతి అయ్యాడు .అమెరికన్ ఓరిఎంటల్ స్టడీస్ కు చైర్మన్ అయి ,అమెరికన్ ఫిలసైకల్ సొసైటీ కి ,రాయల్ అకాడెమి ఆఫ్ ఓవర్సీస్ సైన్సెస్  (బెల్జియం )కు మెంబర్ గా  ఫెలో ఆఫ్ ఏషియాటిక్ సొసైటీ  గా ఉన్నాడు .భార్య రోసేన్  రాచెర్ తో కలిసి ఫిలడేల్ఫియా లో ఉంటున్నాడు.

సంస్కృతం లో 25 పుస్తకాలు రాశాడు .లెక్కలేనన్ని పత్రాలను సంస్కృత న్యాయ శాస్త్రం పై రచించాడు .భార్యతో కలిసి రాసిన ‘’దిమేకింగ్ ఆఫ్ వేస్త్రెన్ ఇండాలజీ ‘’గ్రంధానికి ‘’ఫాండేషన్ కొలిఎట్ కాలిఎట్ ‘’బహుమానం పొందాడు .’’ఫౌండర్స్ ఆఫ్ వెస్టర్న్ ఇండాలజీ ‘’,స్టడీస్ ఇన్ హిందూ లా అండ్ ధర్మ శాస్త్ర ,జీమూత వాహనాస్ దాయ భాగ ,ది పురాణాస్ ,స్మ్రుతి చింతామణి ఆఫ్ గంగాదిత్య, ది దీరీ ఆఫ్ ప్రూఫ్ ఇన్ ఎంసేంట్ ఇండియా ,వాచస్పతి మిశ్రా –వ్యావహార చింతామణి మొదలైన గ్రంధాలు బాగా ప్రసిద్ధమైనవి .రాచెర్ కు లబ్ధ ప్రతిస్తులైన రాబర్ట్ పి గోల్డ్మన్ ,ప్రొఫెసర్ సిగ్మే ఎం కొమేన్ వంటి శిష్యులు చాలా మంది ఉన్నారు .రాచెర్ దంపతులకు అనేక సంస్థలు బిరుదులిచ్చి సత్కారం చేశాయి

.Inline image 1  Inline image 2

 

16-రోసేన్ రోచెర్

రోసేన్ రోచెర్ 10-8-1937న   లో బెల్జియం లో మౌస్ కార్న్ లో  జన్మించింది .క్లాసిక్స్ లోను ,ఇండో ఇండియన్ స్టడీస్ లోను ఎం ఏ డిగ్రీలు పొందింది .బ్రసెల్స్ యూని వర్సిటి నుండి సాంస్క్రిట్ లింగ్విస్టిక్స్ లో పి హెచ్ డి సాధించింబెల్జియం నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్లో ప్రి డాక్టరల్ ,పోస్ట్ డాక్ట్రల్ ఫెలోఅయింది   .లూడో రోచెర్ ను పెళ్లి చేసుకొని ఫిలడెల్ఫియా వెళ్లి అక్కడ అమెరికన్ పౌరసత్వం పొందింది .1970 నుంచి పెన్సెల్వేనియా యూని వర్సిటి లో బోధిస్తూ ,డిపార్ట్ మెంట్ ఆఫ్ సౌత్ ఏసియా స్టడీస్ చైర్ అధిస్టించి ,సౌత్ ఏసియా నేషనల్ రిసోర్స్ సెంటర్ కు డైరెక్టర్ అయి ,ఏసియన్ అమెరికన్ స్టడీస్ ప్రోగ్రాం కు వ్యవస్థాపక డైరెక్టర్ అయింది .

 

ఆక్స్ ఫర్డ్  డిక్షనరీ ఆఫ్ నేషనల్బయాగ్రఫీ ,యెన్ సైక్లో పీడియా ఆఫ్ ఏసియన్ హిస్టరీ ,హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ సైన్సెస్ ఇంటర్నేషనల్ యెన్ సైక్లో పీడియా ఆఫ్ లింగ్విస్టిక్స్ ,ఎన్సైక్లో పీడియా ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్స్ మొదలైన ఉద్గ్రందాలకు సహకరించింది .సంస్కృత సాహిత్యం పై పుస్తకాలు రాసింది .ది మేకింగ్ ఆఫ్ వెస్స్టర్న్ ఇండాలజీ ‘’గ్రంధానికి భర్త లూడో రోచెర్ తో కలిసి ఫా౦డేషన్  కోలేటీ కేలియాట్ అవార్డ్ అందుకొన్నది

ప్రైవేట్ ఫార్త్యూన్స్ అండ్ కంపెని ప్రాఫిట్స్ ఇన్ ఇండియన్ ట్రేడ్ ఇన్  యైటీ౦త్ సెంచరి ,ఇండియా అండ్ ఇండాలజీ ,అలేక్సాండర్ హామిల్టన్ మొదలైన గ్రంధాలు రాసింది .

Inline image 3Inline image 4

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5 11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5

11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ

26-10-18 96 న జన్మించి 18-8-1966 న చనిపోయిన 20 వ శతాబ్ది ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ లూయీ రెనౌ 1920 లో అగ్రిగేషన్ పాసై ,రోఎన్ లోని లైసీ లో  ఒక ఏడాది ఉద్యోగించి ,సంస్కృత గ్రంధాలను చదవటం నేర్చి ,ఆంటోనీ మీలేట్ లో చేరాడు .తర్వాత పూర్తిగా సంస్కృత అధ్యాయనానికే అంకితమయ్యాడు .ఈకోల్ డేస్ హాట్స్ ఎత్యూడ్స్ లో జూల్స్ బ్రాచ్ ఇచ్చే ఉపన్యాసాలను శ్రద్ధగా విని ,అదే సమయం లో ‘’లెస్ మైత్రేస్ డీ లా ఫైలాలజి వేదిక్ ‘’పుస్తకం1928  లో  రాశాడు .1925 లో డాక్ట టోరియల్ దీసేస్ ‘’లా వేలూర్ డుపార్ఫేట్ డాన్స్ లెస్ హిమ్స్ వేదిక్స్ ‘’ప్రచురించాడు .తరువాత మరి రెండు చోట్ల పని చేసి సార్బోన్నే చేరి ,.ఆల్ఫ్రెడ్ ఏ ఫౌచేర్ కు వారసుడుగా పదివి అధిష్టించాడు .1946 లో అకాడెమి డేస్ ఇన్స్క్రిప్షన్స్’’కు ఎన్నికయ్యాడు .

Inline image 1

1948  -49 లాయిండియా ,1953 లో ఏల్స్ యూని వర్సిటి ,1954 నుంచి రెండేళ్ళు టోక్యో లలో పర్యటించి ‘’మాసన్ ఫ్రాంకో జపానీస్ ‘’కు డైరెక్టర్ అయ్యాడు .ఇండియా భాషలు తప్ప మరే దానిమీదా రాయనే లేదు చాలా కాలం .ఆర్కియాలజీ ,రాజకీయశాస్త్రం ,బౌద్ధం పై ఉన్న వ్యామోహాన్ని పూర్తిగా వదిలేసి ఋగ్వేదం పైన పూర్తిగా దృష్టి పెట్టాడు .40 ఏళ్ళు తన సృజనాత్మక పరిశోధనలను పెద్ద పెద్ద గ్రంధాలుగాఅత్యున్నత ప్రమాణాలతో  రాస్తూనే ఉన్నాడు .ఆయన మనసులో సంస్కృత వ్యాకరణం పూర్తిగా నిండి పోయింది .అందుకే ‘’ఎత్యూడ్స్ వేదిక్ ఎట్ పాణినేస్’’రాసి 1955 -56  మధ్య ప్రచురించాడు  .ఇది రెండు వేల పేజీలతో వేద మంత్రాలకు అనువాదం వ్యాఖ్య లతో ఉంది . ఋగ్వేదం లో రెండు వంతుల భాగం చనిపోయే లోపు పూర్తీ చేయ గలిగాడు .ఇన్ స్టి ట్యూట్డీ సివిలిజేషన్ఇండి యెన్నెకు డైరెక్టర్ అయి ,సొసైటీ ఏషియాటిక్ ,అకాడెమి ల మీటింగ్ లకు హాజరయ్యేవాడు .1 66 లో మహా విద్వాంసుడు లూయీ రెనౌ 70 వ ఏట చనిపోయాడు .

ఇంగ్లీష్ లో లూయీ రాసిన గ్రంధాలు –రెలిజియన్స్ ఆఫ్ ఎన్శేంట్ ఇండియా ,హిస్టరీ ఆఫ్ వేదిక్ ఇండియా ,హిందూయిజం ,ఏ హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ .ఫ్రెంచ్ భాషలో 13 పుస్తకాలు రాశాడు .

 

12-కాదంబరిని అనువదించిన –సి .ఎం .రిడ్డింగ్

కరోలిన్ మేరీ రిడ్డింగ్ 30-8-1832 న వెస్ట్ మిడ్లాండ్స్ లోని మెరిడన్ లో జన్మించి సంస్కృత ,పాళీ భాషలలో విద్వాంసురాలై  భట్టబాణుని కాదంబరిని ఇంగ్లీష్ లోకి అనువదించింది ,తండ్రి విలియం రిడ్డింగ్  మెరిడన్ కు వికార్ ,క్రికెట్ ఆటగాడు .తల్లి కెరొలిన్ సేలిన కాల్డే కాట్ జార్జి రిడ్డింగ్ కు సమీప బంధువు .రిడ్డింగ్ సంస్కృతం నేర్చిన మొట్ట మొదటిమహిళా  స్కాలర్ .ఇ .బి .కౌవేల్ శిష్యురాలు .ఆయన 1903చనిపోయాక ఆయన వద్ద ఉన్న 260గ్రంధాలు ఆమె అధీనం లోకి వచ్చాయి .ఈ పుస్తకాలను కేటలాగింగ్ చేసింది .కేంబ్రిడ్జి యూని వర్సిటి లైబ్రరీకి మొదటి మహిళా అధికారి ..ఎన్నో వేల గ్రందాల పట్టిక తయారు చేసిన ఘనత ఆమెది .

1923 లో కేంబ్రిడ్జి యూని వర్సిటి స్త్రీలకూ మొదటి సారిగా డిగ్రీ ని ప్రదానం చేసినప్పుడు ఆమె ఎం .ఏ డిగ్రీ పొందింది .సంస్కృత ,పాళీ భాషలలో ప్రావీణ్యాన్ని సంపాదిన్చాటమేకాక  బెంగాలి హిందీ లనూ నేర్చింది .టిబెట్ భాష నేర్చి అ భాషా గ్రంధాలపై  జర్నల్ ఆఫ్ ఏషియాటిక్ స్టడీస్ లో విమర్శలు రాసింది . షార్లెట్ మేరీ యాంగ్ పై ఆమెకు వల్లమాలిన అభిమానం .యాంగ్ రాసిన గ్రంధాలను గిరర్టన్ కాలేజి కి ప్రదానం చేసింది .రిడ్డింగ్ 9-11-1941 న మరణించింది. ఆమె గౌరవార్ధం ‘’రిడ్డింగ్ రీడింగ్ ప్రైజ్ ‘’ను ఏర్పాటు చేశారు .

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-16 –ఉయ్యూరు

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -4

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -4

11-ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ వేదం నేర్చిన –విలియం జోన్స్

28-9-1746 న ఇంగ్లాండ్ లోని వెస్ట్ మినిస్టర్ లో ఉన్న బ్యూఫోర్ట్ బిల్డింగ్స్ లో జన్మించిన విలియం జోన్స్ ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ ,పూస్నే జడ్జి ,ప్రాచీన భాషా వేత్త .తండ్రిపేరు కూడా విలియం జేమ్స్ అవటం తమాషా .తండ్రి వేల్స్ లో గణిత శాస్త్ర వేత్త .గణితం లో ‘’పై ‘’గుర్తు ను కనిపెట్టిన వాడు కూడా . కొడుకు జోన్స్ బాల్యం లోనే ఇంగ్లీష్ వెల్ష్ గ్రీక్ ,లాటిన్ పెర్షియన్ ,అరెబిక్ ,హీబ్రూ ,చైనా భాషలను నేర్చి న బాల భాషా మేధావి  .చనిపోయే నాటికి 13 భాషల్లో మహా పాండిత్యం మరో 28 భాషల్లో పాండిత్యం సాధించిన వాడు .అందుకే ఆయన్ను మహోన్నత బహుభాషా వేత్త అన్నారు .

తండ్రి చిన్నప్పుడే చనిపోతే తళ్లి మేరీ నిక్స్ అతి జాగ్రత్తగా పెంచి పోషించింది 1753 లో హారో లో చేరి తర్వాత ఆక్సఫర్డ్ లో చదివాడు .68 లో డిగ్రీ 1773 లో ఎం ఏ చేశాడు . ఫీజులు కూడా కట్ట లేనంత దరిద్రం తో బాధ పడి ఎర్ల్ స్పెన్సర్ కొడుకు ఏడేళ్ళ లార్డ్ ఆన్త్రాప్ కు ట్యూషన్ చెప్పాడు .ఆరేళ్ళు ట్యూటర్ గా అనువాదకుడుగా ఉంటూనే పర్షియన్ భాషలో మీర్జా మేహిది ఖాన్ అష్టార్ బాడి రాసిన ‘’హిస్టరీ ఆఫ్ నాదర్ ఛా ‘’ను ఫ్రెంచ్ భాషలోకి అనువదించాడు .దీన్ని డెన్మార్క్ రాజు ఏడవ క్రిస్టియన్ కోరికపై రాసి 24 ఏళ్ళకే ఓరిఎంటలిస్టు అనిపించుకొన్నాడు  .ఇదే ఆయన మొదటి రచన

1770 లో ‘మిడిల్ టెంపుల్ లో చేరి మూడేళ్ళు’’లా’’ చదివటం తో ఇండియా వెళ్ళే అవకాశం వచ్చింది .30-4-1772 న రాయల్ సొసైటీకి ఫెలో గా ఎంపికై ,వేల్స్ లో సర్క్యూట్ జడ్జి గా పని చేసి , పారిస్ లో బెంజమిన్  ఫ్రాంక్లిన్ పరిచయం తో అమెరికన్ విప్లవం  విషయం లో రాజీ కుదర్చ లేక ,సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేచర్ గా కలకత్తా లోని  ఫోర్ట్ విలియమ్స్ లో   పూస్నే జడ్జిగా1783 లో  నియమింపబడి ,ఏప్రిల్ లో నైట్ హుడ్ పొందాడు .అన్నా మేరియా శిప్లీ ను పెళ్ళాడి ముగ్గురుపిల్లల్ని పొంది భార్య సాయం తో ఇండియా చరిత్రను డాక్యుమెంట్ చేశాడు

తీవ్ర భావాలున్న రాజకీయ ఆలోచనా పరుడైన విలియం జోన్స్ అమెరికా స్వాత్నత్ర్య పోరాటాన్ని  సమర్ధించాడు . ‘’ప్రిన్సిపుల్స్ ఆఫ్ గవర్న్ మెంట్ ఇన్ ఎ డయలాగ్ బిట్వీన్ ఎ స్కాలర్ అండ్ ఏ పెజంట్ ‘’పుస్తకం రాసి ప్రచురించాడు .ముద్రణ తర్వాత రాజ ద్రోహం కింది నేర విచారణ ఎదుర్కొన్నాడు .దక్షిణ ఆసియా సంస్కృతులపై మోజు ఎక్కువై 15-1-1784 న కలకత్తాలో ‘’ఏషియాటిక్ సొసైటీ ‘’స్థాపించాడు .నాడీయ హిందూ యూని వర్సిటి కి చెందినా సంస్కృత పండితుడు  రామ లోచన  వద్ద వేదాలను అభ్యసింఛి నిష్ణాతుడయ్యాడు .జ్యోతిషం పై సామ్యుయాల్ డేవిస్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .ఇదంతా తర్వాత ఆయన రచనా స్రవంతికి  గొప్పగా దోహదం చేశాయి .ఇండియాలోని స్థానిక న్యాయం సంగీతం సాహిత్యం వృక్ష ,భూగోళ శాస్త్రాలపై విస్తృత౦ గా రచనలు చేశాడు .భారతీయ సాహిత్యాన్ని మొదటి సారిగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు .47 ఏళ్ళు మాత్రమె జీవించిన భారత భాషాభిమాని పండితుడు విద్యావేత్త విలియం జోన్స్ 27-4-1794 న కలకత్తా లో మరణించి సాహితీ లోకం లో తీవ్ర వెలితిని సృష్టించాడు .సౌత్ పార్క్ స్ట్రీట్ సేమేటరిలో ఖననం చేశారు .

విలియం జోన్స్ చేసిన అతి ముఖ్యమైన పని –ఇండో యూరోపియన్ భాషల మధ్య ఉన్న వారసత్వ బాంధవ్యాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేయటం.ఏషియాటిక్ సొసైటీ మూడవ వార్షికోత్సవం లో మాట్లాడుతూ సంస్కృత ,గ్రీకు,లాటిన్ భాషలకు ఒకే మూలం ఉందని ,అదే గోతిక్ ,సెల్టిక్ పెర్షియన్ భాషలనూకలుపుతోందనీ చెప్పాడు .ఈవిషయం విలియం జోన్స్ కంటే ముందే 16 వ శతాబ్దపు ఐరోపా యాత్రికులు గుర్తించి భారత ఐరోపా భాషలమధ్య సన్నిహిత సంబంధం ఉందని రాశారు .1653 లో ‘’వాన్ బాక్స్ హారన్ అనే భాషా వేత్త  జర్మన్ ,‘గ్రీక్ బాల్టిక్ ,స్లావిక్ సెల్టిక్ ,ఇరానియన్ భాషలకు ’ప్రోటో లాంగ్వేజ్ ‘’అనే అభిప్రాయాన్ని ప్రతిపాదిస్తూ  పుస్తకం రాశాడు .ఫ్రెంచ్ అకాడెమి సైన్సెస్ కు 1767 లో’’జీవితం అంతా ఇండియాలో గడిపిన  ఫ్రెంచ్ జెసూట్ గాస్టన్ లారెనన్స్ కోర్ డాక్స్  ‘’సంస్కృతానికి యూరోపియన్ భాషలకు మధ్య ఉన్న సారూప్యతను నిర్ధారించి రాసిపంపాడు .1786 లో విలియం జోన్స్ –సంస్కృత ,ఇరానియన్ గ్రీక్ ,లాటిన్ జర్మన్ సెల్టిక్ భాషలకు ఒకే మూలం ఉందని ప్రతిపాదించాడు .అయితే జోన్స్ కృషి అతని ముందు వారి  కృషి కంటే తక్కువే .హిందీ ని వదిలేసి ఇండో యూరోపియన్ భాషలలో ఈజిప్షియన్ జపనీస్ చైనా భాషల్ని జోన్స్ చేర్చాడు .ఈ సామాన్య ఆధార విషయం ‘’ప్రోటో –ఇండో –యూరోపియన్ ‘’గా పిలువ బడింది .

ఉపఖండం లో ఆర్యుల దండ యాత్ర విషయం ప్రతిపాదించి జాతుల మధ్య విభజన తెచ్చిన మొదటి వాడు విలియం జోన్స్ .కాని అతని దగ్గరున్న ఆధారాలు అసంపూర్తిగా ఉన్నాయి .1763 లో 17 వ ఏట జోన్స్ లాటిన్ భాషలో ఆరు లైన్లు ఉండే ఛందస్సులో ‘’కిస్సా ‘’అనే కవిత రాశాడు .దీనికి మాతృక చదరంగం పై 1527 లో ప్రచురింపబడిన ‘’స్కాచ్చియా లూడస్’’అనే 658 లైన్ల కావ్యం .దీనిభావం –వనదేవత కాస్యా మార్స్ పురోగమనాన్ని తిప్పి కొడుతుంది .మార్స్ అంటే కుజుడు క్రీడా దేవత సాయం కోరుతాడు .ఆయన చదరంగాన్ని సృస్టింఛి మార్స్ కు సాయం చేసి కాస్యా అభిమానం పొందేట్లు చేస్తాడు .ఈ చెస్ గేం లో మార్స్ కాస్యాను ఓడిస్తాడు అప్పటినుంచి చెస్ కు కాస్యా దేవతః అయింది .ఇదీ కద

తత్వ వేత్త కోపెన్ హార్ విలియం జోన్స్ రాసిన ‘’వరల్డ్ ఆజ్ విల్ అండ్ రిప్రేసేన్తెషణ్ ‘’నుఉదహరిస్తే, అమెరికన్ కవి ఎడ్గార్ అల్లెన్ పో  తన బెర్నిస్ కదానికలో జోన్స్ కవితను పొందుపరచాడు .విలియం జోన్స్ దాదాపు 30 గ్రంధాలు రాశాడు

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-26-9-16 –ఉయ్యూరు

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3 8- జర్మన్ ఇండాలజిస్ట్ -దియోడర్ ఆఫ్రేట్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3

8-  జర్మన్ ఇండాలజిస్ట్  -దియోడర్ ఆఫ్రేట్

జర్మన్ ఇండాలజిస్ట్ అయిన ధియోదర్ ఆఫ్రేట్ 7-1-1822 న ప్రష్యన్ సైలీశియా లోని లేస్చిన్జ్ లో   జన్మించి 3-4-1907న 85 వ ఏట మరణించాడు .1847 లో బెర్లిన్ లో గ్రాడ్యుయేషన్ చేసి ,అప్పుడే ‘’ట్రి టైట్ ఆన్ సంస్కృత ఆక్సేంట్ ‘’గ్రంధం క్రిస్చాఫ్ తో కలిసి రాసి వెలువరించాడు .1852 లో ఆక్స్ ఫర్డ్ కు మారి బోడియాన్ లైబ్రరీలో చదివాడు .1862 నుండి ,1875 వరకు 13 ఏళ్ళు స్కాట్ లాండ్ లోని ఎడిన్ బర్గ్ యూని వర్సిటి లో ప్రొఫెసర్ గా పని చేసి ,మొదటి సారిగా ఏర్పడిన ‘’సాంస్క్రిట్ ,కంపారటివ్ ఫైలాలజి ‘’పీఠాన్ని అధిష్టించాడు .1875 లో ఎల్.ఎల్.డి.డిగ్రీ పొందాడు .

1875 లో ఆఫ్రేట్ బాన్ యూని వర్సిటి ఇండాలజీ చైర్ పై కొలువయ్యాడు .14 ఏళ్ళు అందులో ఉన్నాడు .1891 నుంచి 1903 లోపు ‘’ఆల్ఫబెటికల్ కేటలాగ్ ఆఫ్ ఆల్ సాంస్క్రిట్ మాన్యు స్క్రిప్ట్ కలెక్షన్ ‘’చేశాడు .దీనికే ‘’కేటలాగ్ కేట లాగోరం ‘’అని పేరు పెట్టాడు .1935 నుండి అన్ని భారతీయ వ్రాత ప్రతులను అపూర్వం గా సేకరించిన ఘనత ఆయనది .మద్రాస్ యూని వర్సిటి ఆ నాటి వరకు ఉన్న వాటినన్నిటిని సేకరించి కేటలాగ్ తయారు చేసింది .ఉజ్వల దత్త వ్యాఖ్యానం ,డీ హైమేన్ డేస్ రిగ్వేద,ఆత్రేయ బ్రాహ్మణ ,కేతలాగో కేటలాగోరియం మూడు  భాగాలు అఫ్రేట్ అద్భుత కృషి

.Inline image 1

9-స్కాటిష్ ఓరియెంటలిస్ట్ -జేమ్స్ రాబర్ట్  బాలంటైన్

స్కాటిష్ ఓరి యెంటలిస్టు జేమ్స్ రాబర్ట్ బాలంటైన్ 1813 లో జన్మించి 1864 లో మరణించాడు .1845 నుంచి వారణాసి సంస్కృత కళాశాలలో సూపరిం టే౦డెంట్ గా ఉన్నాడు .1861 లో లండన్ వెళ్లి ఇండియా ఆఫెస్ లైబ్రరీకి లైబ్రేరియన్ గా ఎన్నికయ్యాడు .

బాలం టైన్ సంస్కృత ,హిందే  మరాటీ భాషలకు వ్యాకరణం రాశాడు.’’లఘు కౌముది ఆఫ్ వజ్ర దత్త ‘’ను1849 నుండి 52 లోపు కృషి చేసి ప్రచురించాడు .పతంజలి మహా భాష్యం  మొదటి భాగాన్ని 1856 లో ప్రచురించాడు   .ఈవిదం గా నేటివ్ ఇండియన్ వ్యాకరణ పద్ధతిని  ను మొదటి సారిగా యూరోపియన్ విద్యా  వేత్తల దృష్టికి తెచ్చాడు  .ఇతర రచనలు –ఎలిమెంట్స్ ఆఫ్ హిందూ అండ్ వ్రజ్ భాషా గ్రామర్ ,హిందూ స్తాని సెలెక్షన్స్ ,పాకెట్ గైడ్ టు హిందూ స్తాని కన్వర్సే షన్ ,పర్షియన్ కాలి గ్రాఫి ,ప్రాక్టికల్ ఓరిఎంటల్ ఎంటర్ ప్రిటర్ ,కాటే చిజం ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్ ,క్రిస్టియానిటి  కాం ట్రాస్తేడ్ విత్ ఇండియన్ ఫిలాసఫీ ,ఫస్ట్ లెసన్స్ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్ .

Inline image 2

10-బహు భాషా వేత్త మిత్రలాభ ప్రచురణ కర్త  –ఫ్రాన్సిస్ జాన్సన్

179 5 లో పుట్టి 1876లో చనిపోయిన ఫ్రాన్సిస్ జాన్సన్ సంస్కృత ,తెలుగు ,బెంగాలి భాషలను ఈస్ట్  ఇండియా కాలేజి లో 1824 నుంచి 1855 వరకు 34 ఏళ్ళు బోధించాడు .పర్షియన్ ఆరబిక్ ,ఇంగ్లిష్ భాషలకు సమగ్ర నిఘంటువులు తయారు చేసి 1852 లో ప్రచురించాడు .యవ్వనం లో చార్లెస్ లాక్ ఈస్ట్ లేక తో కలిసి రోమ్,ఎదేన్స్ లను సందర్శించి 1824 లో మళ్ళీ లండన్ చేరుకొన్నాడు .హెర్ట్ ఫోర్ట్ హీత్ లో కాంగ్రి గేషనల్ చాపెల్ నిర్మాణం చేశాడు .హితోపదేశ ,మొదటి సంస్కృత పుస్తకం పేర మిత్రలాభం  ప్రచురించాడు .

Inline image 3

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శుక్రవారం మహళాయ పక్ష మధ్యఅష్టమి నాడు మా నాయనమ్మగారి తిధి సందర్భంగా ఐలూరు వరద కృష్ణ వేణీ స్నానం మరియు పుష్కరం

23-9-16 

శుక్రవారం మహళాయ పక్ష మధ్యఅష్టమి నాడు మా నాయనమ్మగారి తిధి సందర్భంగా ఐలూరు వరద కృష్ణ వేణీ స్నానం మరియు పుష్కరం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 6-ఇండియా ఆఫీస్ లైబ్రేరియన్ -ఫ్రెడరిక్ విలియం ధామస్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2

6-ఇండియా ఆఫీస్ లైబ్రేరియన్ -ఫ్రెడరిక్ విలియం ధామస్

1867 లో జన్మించి 1956 లో మరణించిన ఫ్రెడరిక్ విలియం ధామస్ 21-3-18 67 న టాం వర్త్ స్టాఫర్డ్ షైర్లో జన్మించాడు .బర్మింగ్ హాం కింగ్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదివి ,కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజిలో 1885 లో చేరి ,క్లాసిక్స్ లోను ,ఇండియన్ లాంగ్వేజెస్ లోను ఫస్ట్ క్లాస్ డిగ్రీ పొందాడు .రెండిటిలోనూ బ్రౌన్ మెడల్ సాధించాడు .కేంబ్రిడ్జి లో ఎద్వార్డ్ బిల్స్ కోవెల్ వద్ద సంస్కృతం అభ్యసించాడు

Inline image 2

1898 నుండి 1927 వరకు ఇండియా ఆఫీస్ లైబ్రరీలో లైబ్రేరియన్ గా ఉన్నాడు .అదే సమయం లో లండన్ యూని వర్సిటి కాలేజి లో  కంపారటివ్ ఫైలాలజి  లెక్చరర్ గా.19 08 నుంచి 19 35 వరకు పని చేశాడు .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి బోడేన్ సాంస్క్రిట్ ప్రొఫెసర్ గా 19 27 నుంచి 37 వరకు పని చేస్తూ బాలియాల్ కాలేజి ఫెలో అయ్యాడు .ఆక్స్ ఫర్డ్ లో ఆయ శిష్యులైన వారిలో ప్రముఖుడు హోరాల్ద్ వాల్టర్ బైలీ ఉన్నాడు .19 27 లో ఫెలో ఆఫ్ బ్రిటిష్ అకాడెమి గౌరవం పొందాడు .6-5-1956 న 8 8 వ ఏట మరణించాడు .

జాక్వెస్ బకాట్ టో కలిసి ‘’ఓల్డ్ టిబెటన్ హిస్టారికల్ టేక్స్త్స్ సేకరించి ప్రచురించాడు .మధ్య ఆసియా నుండి టిబెటన్ వ్రాతప్రతులను సేకరించి ఇండియా ఆఫీస్ లైబ్రరీలో భద్ర పరచాడు .బాణుని హర్ష చరిత్ర ,సైనో  టిబెటన్ సరిహద్దు ప్రాంత౦ పు ‘’నాం’’భాష పై  పరిశోధన చేసి రాశాడు .ఎన్శేంట్ ఫోక్ లిటరేచర్ఆఫ్  ఈస్ట్రన్ టిబెట్ పుస్తకం రాశాడు .

7-ఇంగ్లీష్ ఓరి ఎంటలిస్ట్-డాక్టర్ హోరేస్  హేమన్ విల్సన్

ఇంగ్లిష్ ఓరి ఎంటలిస్ట్అయిన హోరేస్ హేమన్ విల్సన్  26-9-1786 న జన్మించి ,సెయింట్ ధామస్ హాస్పిటల్ లో మెడిసిన్ చదివి 1808 లో ఇండియా వచ్చి బెంగాల్ లో అసిస్టంట్ సర్జన్ గా ఈస్ట్ ఇండియా కంపెని లో పని చేశాడు  .మెటలర్జీ మీద ఆయనకున్న అపార జ్ఞానం కలకత్తా లోని మింట్ కు దగ్గర చేసి,జాన్ లేడెన్ తో కలిసి పని చేశాడు .భారతీయ పురాతన సాహిత్యం పై అభిలాష ఏర్పడి నందున హెన్రి ధామస్ కోల్ బ్రూక్ ఇతన్ని బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ సెక్రెటరి చేశాడు .కాళిదాస మేఘ దూతం ను అందమైన ఆంగ్లభాషలోకి అనువాదం చేశాడు .1819 లో మొట్ట మొదటి సంస్కృత –ఇంగ్లీష్ నిఘంటువును సంస్కృత విద్యావేత్తల సయం తో తన స్వంత పరిశోధనతో కూర్చాడు .దీన్ని రుడాల్ఫ్ రోత్ ,ఆతోవాన్ బోత్లింక్ లు1853  – 1876 మధ్య తయారు చేసిన ‘’సాంస్క్రిట్ ఓర్టర్ బర్చ్ ‘’ వెనక్కి నెట్టేసింది .

విల్సన్ కు ఆయుర్వేదం పై అభిరుచి కలిగి అధ్యయనం చేసి కలరా ,కుష్టు వ్యాధుల నివారణకు మందులపై మెడికల్ అండ్ ఫిజికల్ సొసైటీ ఆఫ్ కలకత్తా లో వ్యాసాలు రాశాడు .1827 లో ‘’సెలెక్ట్ స్పెసిమేన్స్ ఆఫ్ ది దియేటర్ ఆఫ్ ది హిందూస్ ‘’పుస్తకం ,భారత దేశ నాటకాలను ,నాటక శాలలను క్షుణ్ణంగా పరిశోధించి రాశాడు .’’మెకంజీ కలెక్షన్స్ ‘’అనేది మరొక గొప్ప కృషి .’’హిస్టారికల్ స్కెచ్ ఆఫ్ ది ఫస్ట్ బర్మీస్ వార్ విత్ డాక్యుమెంట్స్ పొలిటికల్ అండ్ జాగ్రాఫికల్ ‘’మరో గొప్ప పుస్తకం .పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీ సేక్రేటరిగా ,కలకత్తా సంస్క్రుతకాలేజి సూపరింటే౦డ గా పని చేశాడు .విష్ణు పురాణాన్ని ఇంగ్లీష్ లోకి  అనువదించాడు .హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా రాశాడు .ఇంగ్లీష్ ను భారతీయుల నెత్తిన రుద్ద కూడదని ఎలుగెత్తి చాటిన భారతీయ భాషాభిమాని హోరేస్ విల్సన్ దీనివలన కొంత వ్యతిరేకతను బ్రిటిష్ వారి నుంచి ఎదుర్కొన వలసి వచ్చింది .1832 లో బ్రిటిష్ ప్రభుత్వండా హోరేస్ విల్సన్ ను ఆక్స్ ఫర్డ్  లో ఏర్పాటు చేసిన బోడెం సంస్కృత పీఠం కు మొదటి అధికారిగా ఎంపిక చేసి నియమించింది .దీనిపై 1832 మార్చి 6 న ‘’ది టైమ్స్ ‘’పత్రికు ఒకకాలం నిడివిఉన్న ప్రకటన ఇచ్చాడు .1836 లో ఈస్ట్ ఇండియా కంపెనీ లైబ్రేరియన్ అయ్యాడు .ఈస్ట్ ఇండియా కంపెనికాలేజిలో బోధనా చేశాడు కలకత్తా మెడికల్ అండ్ ఫిజికల్ సొసైటీలో సభ్యత్వ మిచ్చి గౌరవించారు .రాయల్ ఏషియాటిక్ కంపెనీకి ప్రాధమిక సభ్యుడు .1837  నుండి చనిపోయేదాకా దానికి డైరెక్టర్ గా ఉన్నాడు .8-5-1860లో చనిపోయిన విల్సన్ ను కేంసాల్ గ్రీన్ సేమిటేరి లో ఖననం చేశారు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-16- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 3-బ్రిటిష్ ప్రాచ్య భాషా వేత్త –ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2

3-బ్రిటిష్ ప్రాచ్య భాషా వేత్త –ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్

ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్ 26-3-18 8 5 న బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేజినాల్ద్ జాన్స్టన్ కు జన్మించాడు .ఈటన్ కాలేజి ,ఆక్సఫర్డ్ లోని న్యు కాలేజీలలో చదివి గణితం నుంచి చరిత్రకు జంప్ అయి 1907లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ పొందాడు .బోడేన్ సాంస్క్రిట్ స్కాలర్షిప్ పొంది ఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరి 1909నుండి ఇండియాలో వివిధ హోదాలలో15 ఏళ్ళు పని చేసి రిటైరై ఇంగ్లాండ్ వెళ్లి పోయాడు . అప్పటినుంచి సంస్క్రుతాధ్యయనం సాగించాడు .చైనా టిబెట్ భాషాధ్యయనమూ చేశాడు  .

మధ్యయుగపు శిల్పాలపై ఒక వ్యాసం రాశాడు .తర్వాత సంస్కృత సాహిత్యం లో వ్యవసాయం మొదలైన విషయాలపై 1928నుండి 36 వరకు రాశాడు .రెండవ శతాబ్దానికి చెందిన బుద్ధ ఘోషుని ‘’బుద్ధ చరిత్రను’’ అనువాదం చేసి ప్రచురించాడు.ఇదే తన మహత్తర రచన అని ‘’ది టైమ్స్ ‘’పత్రికలో తెలియ జేశాడు .1937లోఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో  బోడేన్ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్  అయి ,ఇండియన్ ఇన్స్టిట్యూట్ కీపర్ గా ,,ప్రోఫెస్సోరియాల్ ఫెలో ఆఫ్ బాలియాల్ కాలేజ్ గా పని చేశాడు .బోడేలేన్ లైబ్రరీకి సంస్కృత వ్రాతప్రతుల కేటలాగింగ్  చేశాడు .ఇండియన్ ఇన్స్టిట్యూట్ మ్యూజియం అభి వృద్ధి కి కృషి చేశాడు .ఇండియా ఆఫీస్ లైబ్రరి వ్రాతప్రతులపైనా సహాయం చేశాడు .వివిధ వైవిధ్య అంశాలపై చాలా వ్యాసాలూ రాసి ప్రచురించాడు .సర్ హెన్రి మే కుమార్తె ఐరిస్ మే ను పెళ్ళాడి ,చనిపోయిన తన సోదరుని పిల్లలను చేరదీసి పెంచాడు .రెండవ ప్రపంచ యుద్ధకాలం లో కుటుంబాన్ని అమెరికాకు మార్చి ,తాను ఆక్స్ ఫర్డ్ లోనే ఉన్నాడు .ఎయిర్ రైడ్ వార్డెన్ గా ,హోమ గార్డ్ గా సేవ చేశాడు .1942 అక్టోబర్ 24న57 వ ఏట  మరణించాడు .

4-సంస్కృత వ్యాకరణ రచయిత ఆర్ధర్ ఆంటోని మాక్డోనాల్డ్

11-5-1854 నజన్మించి 28-12-1930 న మరణించిన ఆర్ధర్ ఆంటోని మాక్ డోనాల్డ్ ఇండియాలోని ముజఫర్ పూర్ లో ఇండియన్ ఆర్మీ కి చెందిన చార్లెస్ అలేక్సాండర్ మాక్ డోనాల్డ్ కుమారుడు .గాట్టిన్జన్ యూని వర్సిటి లో చదివి ,కార్పస్ క్రిస్టి కాలేజ్ – ఆక్స్ ఫర్డ్  నుంచి 1876 లో మెట్రిక్ పాసై బర్మన్ ,చైనీస్ సంస్కృతం లో  బోడేన్ స్కాలర్షిప్ పొంది  క్లాసికల్ ఆనర్స్ లో 1880 లో గ్రాడ్యుయేట్ అయి ,ఆక్స్ ఫర్డ్ లో ‘’టైరియాల్ టీచర్ ఆఫ్ జర్మన్ ‘’గా ఉద్యోగం పొంది ,83 లోలీప్జిగ్ యూని వర్సిటి నుంచి  పి .హెచ్ .డిఅందుకొని,88 లో ఆక్స్ఫర్డ్ లో సంస్కృతం లో డిప్యూటీ ప్రొఫెసర్ గా చేరి 8 9 లో బోడేన్ ప్రొఫెసర్ అయి , బాలియాల్ కాలేజ్ ఆక్స్ ఫర్డ్ కు ఫెలో షిప్ పొందాడు .అనేకసంస్కృత గ్రంధాలను ఎడిట్ చేశాడు .సంస్కృత వ్యాకరణం రాశాడు .సంస్కృత నిఘంటువు ను కూర్చాడు .వేదిక్ గ్రామర్ ,వేదిక్ రీడర్ వేదిక్ మైదాలజి లతోబాటు సంస్కృత చరిత్ర రాశాడు .ఇవికాక,అనే ఋగ్వేదం లోని దేవీ దేవతలపై  ‘’బృహద్దేవత’’పుస్తకం రాశాడు .

 

5- క్లాసిక్స్ ప్రొఫెసర్-క్రిస్టఫర్ మిన్కోవ్ స్కి

క్రిస్టఫర్ జాన్ మిన్కోవ్ స్కి అమెరికా దేశ విద్యా వేత్త .ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటిలో సంస్కృత బోదేన్ ప్రొఫెసర్ .గిల్మన్ స్కూల్ లో చదివి హార్వర్డ్ కాలేజి లో ఇంగ్లీష్ అధ్యయనం చేసి ,ఢిల్లీ యూని వర్సిటి నుంచి 1976 లో హిందీలో డిప్లమా పొంది ,హార్వర్డ్ కు తిరిగొచ్చి ,మాస్టర్ డిగ్రీ అందుకొన్నాడు ,సంస్కృతం ,ఇండియన్ స్టడీస్ లో 1986 లో పి హెచ్ డి తీసుకొని  ఆక్స్ ఫర్డ్ వుల్ఫ్సన్ కాలేజిలో రిసెర్చ్ చేయటానికి ముందు అయోవా ,బ్రౌన్ యూని వర్సిటీలలో విద్యా బోధన చేశాడు.

1989 నుంచి 2006మధ్య కార్నెల్ యూని వర్సిటీలో బోధన గరపి ,ఏషియన్ స్టడీస్ అండ్ క్లాసిక్స్ కు ప్రొఫెసర్ అయ్యాడు .2005 లో ఆక్స్ ఫర్డ్ లో బోడేన్ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ అయ్యాడు .దీనితో బాటు ఆక్స్ ఫర్డ్ లోని బాలియాల్ కాలేజి ప్రోఫెస్సోరియాల్ ఫెలో కూడా అయ్యాడు .

‘’ప్రీస్ట్ హుడ్ ఇన్ ఎన్శేంట్ ఇండియా ‘’అనే గ్రంధాన్ని 1991 లో రాసి ప్రచురించాడు .వేదమతం ,సాహిత్యం ,మోడరన్ ఇంటలేక్త్యువల్ హిస్టరీ ఆఫ్ సదరన్ ఏసియా లపై చాలా వ్యాసాలూ రాశాడు .

 

6- హిందూ యిజం గ్రంధ కర్త ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ స్థాపకుడు  -సర్ మోనియర్ మాక్స్ ముల్లర్ తో పోటీ పడిన -మోనియర్ విలియమ్స్

12-11-1819 నఇండియాలోని బొంబాయి లో  జన్మించిన మోలియర్ మోలియర్ విలియమ్స్ బాంబే ప్రెసిడెన్సిలో సర్వేయర్ జనరల్ మోనియర్ విలియమ్స్ కుమారుడు .1887 వరకు ఇంటిపేరు విలియమ్స్ గా ఉండి తర్వాత మొనియర్ విలియ మ్స్ మార్చాడు .1822 లో ఇంగ్లాండ్ లోని హావ్,చెల్సియా ,ఫించ్లి  స్కూల్స్  లో చదవటానికి వెళ్ళాడు .కింగ్స్ కాలేజి స్కూల్ బాలియాల్ కాలేజి లలో  ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో చదివాడు .1848 లో జూలియా గ్రంధం నుపెళ్ళాడి ఆరుగురు మగ ,ఒక ఆడ పిల్లలకు తండ్రి అయ్యాడు .71  వ ఏట ఫ్రాన్స్ లోని కేన్స్ లో 11-4-1899 న మరణించాడు .

18 4 4 నుండి -5 8 వరకు ఈస్ట్ ఇండియా కంపెని కాలేజి లో ఏషియన్ లాంగ్వేజెస్ బోధించాడు ,1887 ప్రధమ భారత స్వాతంత్ర సంగ్రామం లో ఆ కంపెని రద్దయింది .186౦ లో బోడేన్ చైర్ ఆఫ్ సాంస్క్రిట్ ఎన్నికల ప్రచారం లో మాక్స్ ముల్లర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి బాగా గుర్తింపు పొందాడు .1831 లో సంస్కృత పీఠం అధిస్టించి సంస్కృత వ్రాత ప్రాతులను సేకరించి భద్ర పరచిన హోరాక్ హేమాన్ విల్సన్ 186౦ లో మరణించగా ఖాళీ ఏర్పడింది .తన స్థానాన్ని విలియమ్స్ కు ఇవ్వాలని ఆయన కోరాడు .జగజ్జెట్టి అయిన మాక్స్ ముల్లర్ కు పోటీ గా నిలిచాడు .మాక్స్ ముల్లర్ మత విషయం లో ఉదార వాది . విలియమ్స్ కు ఇండియాపైనా సంస్క్రుతంపైనా అనుభవం బాగా ఉంది. క్రిస్టియన్ మతం పై పూర్తీ విశ్వాసమున్నవాడు .ముల్లర్ జీవితం లో ఇండియాను చూడనే లేదు .ఇది విలియమ్స్ కు బాగా కలిసి వచ్చింది.ప్రొఫెసర్ గా ఎంపికైన విలియమ్స్ ఓరిఎంటల్ స్కాలర్షిప్ కు క్రిస్టియన్ మత స్వీకరణ ముఖ్యం అన్నాడు  .188 7 లో ‘’హిందూ యిజం ‘’అనే పుస్తకం రాశాడు .హిందూ ఇజం అనేపేరు అప్పుడే నిఘంటువులో చోటు చేసుకొన్నది

18 8 3 లో విలియమ్స్ యూని వర్సిటికి చెందిన ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ను ఏర్పాటు చేసి విద్య తోబాటు సివిల్ సర్విస్ కు శిక్షణ కూడా ఇప్పించాడు .భారతీయ సంస్కృతిపై పరిశోధన జరగాలని కోరాడు .18 7 5 నుండి ఏడాదిపాటు ,18 8 3 లోను ఇండియాలో పర్యటించి తన భావనలో ఉన్న ప్రాజెక్ట్ కోసం ధన సమీకరణ చేశాడు .భారత దేశ రాజులకు ప్రేరణ కలిగించాడు .1883 లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ శంకు స్థాపన చేయగా 1886 లో లార్డ్ జార్జి హామిల్టన్ ప్రారంభోత్సవం చేశాడు .ఈ సంస్థ 1947 లో భారతదేశం  స్వాతంత్ర్యం పొందగానే మూత పడింది .

మొనియర్ విలియమ్స్ అనేక వ్యాసాలు  రాసి అద్వైత వేదాంతం ఒక్కటే వేదాలను సరిగ్గా అర్ధం చేసు కొనే పద్ధతిలో ఉందని అదే ముక్తికి మార్గమని తెలియ జేశాడు .బాగా ప్రచారం లో ఉన్న కర్మ ,భక్తీ సిద్ధాంతాలు తక్కువ స్థాయివి అని అభిప్రాయ పడ్డాడు .సంక్లిష్ట విధానాలతో అల్లకల్లోలమైన భావాలను సంస్కృతసాహిత్యం  ఐక్య పరచింది అన్నాడు .మొనియర్ సంస్కృత –ఇంగ్లిష్ నిఘంటువు 1899 లో తయారు చేశాడు .ఇది1872 లో వచ్చిన  పూర్వపు పీటర్స్ బర్గ్ నిఘంటువును ఆధారం గా చేసిందే. కాళిదాస మహాకవి విక్రమోర్వశీయం  ,శాకుంతలం లను  అనువాదం చేశాడు .ఎలిమెంటరిగ్రామర్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ,శిక్షా పత్రీ కి అనువాదం ,బ్రాహ్మినిజం అండ్ హిందూఇజం ,బుద్ధిజం ,కూడా రాశాడు

1876 లో నైట్ హుడ్ పొందాడు .ఆక్స్ ఫర్డ్ నుంచి ఆనరరి డి.సి ఎల్ ,కలకత్తా నుండి ఎల్. ఎల్. డి,గూటిన్జేన్ నుండి గౌరవ పి .హెచ్ .డిఅందుకొన్నాడు. రాయల్ ఏషియాటిక్ సొసైటీ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు

 

సశేషం

మీ గబ్బిట దుర్గా ప్రసాద్-22-9-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు

1-ఆక్స్ ఫర్డ్ సంస్కృత ప్రొఫెసర్ -ధామస్ బారో

1909జూన్ 29 న  మాంచెస్టర్ లోని లేక్క్ లో జాషువా ,ఫ్రాన్సి ఎలినార్ బారో లకు ఆరుగురు సంతానం లో పెద్ద వాడుగా జన్మించిన ధామస్ బారో  కిరక్ బీ లాంన్స్ డెల్ లో క్వీన్ ఎలిజబెత్ గ్రామర్ స్కూల్ లో చదివి కేంబ్రిడ్జ్ క్రైస్ట్ కాలేజి లో చేరటానికి స్కాలర్షిప్ సాధించాడు .సంస్క్రుతంపై అభిమానమేర్పడి కంపారటేటివ్ ఫైలాలజిలో స్పెషలైజ్ చేశాడు .ఇండియాలోని అన్నామలై యూని వర్సిటి లో పి ఎస్ సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద ‘’సంస్కృతం లోని ద్రావిడ భాషా పదాలను గుర్తించటం లో సమస్యలు ‘’పై పరిశోధన చేసి ‘’ది కలేక్టేడ్ పేపర్స్ ఆన్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ ‘’గా 1968 లో ప్రచురించాడు . ఇండాలజిస్ట్ మాత్రమే కాక బారో ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో బోడెన్ సంస్కృత ప్రొఫెసర్ కూడా .19 44నుంచి 76 వరకు 32 ఏళ్ళు అక్కడ పనిచేశాడు .అదే సమయం లో ఆక్స్ ఫర్డ్ బలియాల్ కాలేజి ఫెలో గా కూడా ఉన్నాడు . ఆయన రచనలు 1-ఏ ద్రవిడియన్ ఎటిమలాజికల్ డిక్షనరీ ,2-ది ప్రాబ్లెమ్స్ ఆఫ్ ష్వా ఇన్ సాంస్క్రిట్, 3-ది సాంస్క్రిట్ లాంగ్వేజ్ .ఇతర రచనలు –ట్రాన్స్ లేషన్ ఆఫ్ ది ఖరోషి ఫ్రం చైనీస్  అండ్ టర్కిస్తాన్  ,ఏ కంపారటివ్ వొకాబ్యులరి ఆఫ్ ది గోండి లాంగ్వేజ్ ,కలేక్క్టేడ్ పేపర్స్ ఆఫ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ .సంస్కృత భాషా సేవకుడైన బారో 19 86 జూన్ 8 న మరణించాడు .

2- బౌద్ధం పై సాధికారత ఉన్న రిచర్డ్  గా౦ బ్రిచ్

పియానిస్ట్ అయిన ఐల్ గామ్బ్రిచ్ కు ఆస్ట్రియన్ –బ్రిటిష్ ఆర్ట్ హిస్టోరియన్ ఎర్నెస్ట్ గాం బ్రిచ్ దంపతుల ఏకైక కుమారుడు రిచర్డ్ గాం బ్రిచ్ .17-7-1937న జన్మించాడు .లండన్ లోని సెయింట్ పాల్ స్కూల్ లో చదివి ,ఆక్స్ ఫర్డ్ లోని మాగ్డలిన్ కాలేజి లో చేరాడు .1961 లో బి ఏ పాసై ,63 లో హార్వర్డ్ నుంచి ఎం .ఏ .పొంది ,70 లోఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి నుండి  డి.ఫిల్ .సాధించాడు .ఇండాలజిస్ట్ గా ఉండి సంస్కృత ,పాళీ ,బౌద్ధాలపై విద్వా౦సుడయ్యాడు .ఆక్స్ ఫర్డ్ లో బోడెం ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ గా 1976 నుంచి 2004వరకు 28 ఏళ్ళు పనిచేశాడు .

బౌద్ధమత అధ్యయనం లో కాకలు తీరిన పండితుడు రిచర్డ్ .సమకాలీన సింహళ బౌద్ధం పై పరిశోధన చేసి ‘’ప్రిసేప్ట్ అండ్ ప్రాక్టిస్ –ట్రడిషనల్ బుద్ధిజం ఇన్ ది రూరల్ హైలా౦డ్స్ ఆఫ్ సిలన్ ‘’గ్రంధాన్ని 1971 లో ప్రచురించాడు  .20 వ శతాబ్దపు ‘’తెర వాదబౌద్ధ’’మహా పండితులలో వ్రేళ్ళ మీద లెక్కించదగిన వారిలో రిచార్డ్ ఉన్నాడు .ఇప్పుడు బౌద్ధ అధ్యయనం లో రిచర్డ్ పేరు మీద ‘’గా౦బ్రిచియన్ ‘’పదం చోటు చేసుకొన్నది అంటే అతని  ప్రమేయం ఎంత ఉందొ అర్ధమై పోతుంది .

40 ఏళ్ళకు పైగా ఆక్స్ ఫర్డ్ లో పని చేసి రిటైర్ అయ్యాక కూడా ఇంకా బోధిస్తూనే ఉన్నాడు .ఆయన 50 కి పైగా పరిశోధన పత్రాలు రాశాడు .అందులో సింహ భాగం బౌద్ధం మీదనే ఉన్నాయి .బౌద్ధ సంఘ లోని పెద్దలపైనా పరిశోధన చేశాడు .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో బౌద్ధ అధ్యయనం కోసం ‘’నుమత ఫౌండేషన్ ‘తో ఒక పీఠం’ఏర్పరచాడు. ఉన్నత విద్యాభి వృద్ధిపై మక్కువ ఉన్న రిచర్డ్ 2000సంవత్సరం లో టోక్యో యూని వర్సిటి లోని గ్రాడ్యుయేట్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ స్టడీస్ ఆహ్వానం పై వెళ్లి ‘’బ్రిటిష్ హయ్యర్ ఎడ్యుకేషన్ పాలిసి ఇన్ ది లాస్ట్ 20 యియర్స్ ‘’అనే అంశం పై ఉన్నత విద్య పై తనకున్న అభిప్రాయాలను వెల్లడించాడు .విజిటింగ్ ప్రొఫెసర్ గా ప్రిన్స్ టన్,కింగ్స్ కాలేజ్ –లండన్ ,హాంగ్కాంగ్ సియోల్ మొదలైన యూని వర్సిటీలను సందర్శించి బోధించాడు .ఆక్స్ ఫర్డ్ సెంటర్ ఫర్ బుద్ధిష్ట్ స్టడీస్ కు ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు .1994 నుండి 2002వరకు పాళీ టెక్స్ట్ సొసైటీ ప్రెసిడెంట్ గా పని చేశాడు .క్లే సాంస్క్రిట్ లైబ్రరీ కి జనరల్ ఎడిటర్ ఎమిరిటస్ హోదా ఉంది .

1993 లో కలకత్తా లోని ఏషియాటిక్ సొసైటీ ఆహ్వానించి సన్మానించింది .94 లో శ్రీలంక ప్రెసిడెంట్ ‘’శ్రీలంక రాణజ్న’’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు

..

సశేషం

మీ-గబ్బిట డుర్గాప్రసాద్ -22-9-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 (రెండవ భాగం )ఆవిష్కరణ

సరస భారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు ప్రచురిస్తున్న 22 వ పుస్తకం గా ,నేను రచించిన 14 వ గ్రంధంగా సరసభారతి కి అత్యంత ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ప్రాయోజకులుగా సహాయి సహకారాలతో ముద్రిస్తున్న 7 వ పుస్తకం గా ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం 482 మంది సంస్కృత కవుల జీవిత,సాహిత్య పరామర్శ గా బృహద్గ్రంథం గా అక్టోబర్ మాసం చివరలో ఆవిష్కరణ జరుపు కో బోతోందని సవినయం గా  తెలియ జేయటానికి సంతోషం గా ఉంది .పూర్తి వివరాలతో ఆహ్వాన పత్రం అక్టోబర్  రెండవ వారం లో అందజేస్తాము   .-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-16

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మణిపూర్ ఉక్కు మహిళ- ఐరాం షర్మిల – గబ్బిట దుర్గాప్రసాద్

మణిపూర్ ఉక్కు మహిళ- ఐరాం షర్మిల – గబ్బిట దుర్గాప్రసాద్

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

కల్లోల ఈశాన్య భారతం ‘’ నిరంతర కల్లోల ప్రాంతమైన ఈశాన్య భారతం’’ లోని 7రాష్ట్రాలలో 2005 నుండి 2015 వరకు దశాబ్దం పాటు విప్లవం హింస ,రాజకీయ దౌర్జన్యాలతో అట్టుడికి పోయి దాదాపుఆరు వేలమంది అమాయక ప్రజలు మరణించారు .భారత ప్రభుత్వం చేసేదేమీ లేక ప్రజల ధనమాన ప్రాణ సంరక్షణ కోసం 1958 ఆర్మేడ్ యెన్ఫోర్సేడ్ యాక్ట్ ను ఈ ఏడు రాష్ట్రాలలో అమలు చేసి౦ది .దీనిప్రకారం సైన్యం ప్రజా రక్షణ కోసం వారంట్ లేకుండా ఆస్తులు ఇల్లు వ్యక్తులను సోదా చేయటానికి ,జమ్మూ కాశ్మీర్ లో లాగా రాజ్యాంగ ధిక్కారం పై యే మాత్రం అనుమాన మొచ్చినా తీవ్రమైన ఆయుధాలను ప్రయోగించటానికి అనుమతి నిచ్చింది ఒక్కోసారి సైన్యం కూడా దురుసుగా ,దుడుకుగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి అవి పెద్ద ఉద్యమాలకు దారి తీశాయి . .ఇదీ ఈశాన్య భారత స్థితి .ఈ కల్లోల భారతం లో మణిపూర్ లో జన్మించిన మహిళా జాతి రత్నమే ఐరాం షర్మిల .

షర్మిల పోరాట పటిమ :

‘’మణిపూర్ ఉక్కు మహిళ’’ అని పిలువబడే ఐరాం షర్మిల.14-3- 1972లో జన్మించి హైస్కూల్ చదువులో 12 వ క్లాస్ పూర్తీ చేయకుండానే తన రాష్ట్రం లో ప్రజా ప్రతిఘటన నాయకురాలిగా నిలిచింది .పౌరహక్కుల రాజకీయ పోరాట యోధురాలు .కవ యిత్రి .ఐరాం పై తండ్రి ప్రభావం చాలా ఉంది. మానవ హక్కులను కాల రాస్తున్నందుకు నిరసనగా ప్రజా హక్కుల పోరాటం చేసింది .

నరమేధానికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష : 
ఇంఫాల్ లోయ లోని 2-11-2000 న ‘’మాలూం నర మేధ౦ ‘’లో అస్సాం రైఫిల్స్అనే పారా మిలిటరీ దళం చేతిలో 10 మంది అమాయక ప్రజలు బస్ స్టాప్ లో నిలబడి ఉండగా కాల్పులలో చని పోవటానికి సైన్యం చేసిన దమన కాండకు నిరసనగా ఆమె మాలూం లో 28 వ ఏట నవంబర్ 5 న నిరాహార దీక్ష చేబట్టింది .చనిపోయిన వారిలో’’ లీసేంగ్ భం ఐసే టో౦బి’’,అనే 62 ఏళ్ళ మహిళ ,’’నేషనల్ బ్రేవరి అవార్డ్ ‘’పొందిన 18 ఏళ్ళ’’ సీనం చంద్ర మణి’’ ఉన్నారు . ఈ సంఘటన ఆమె పై గొప్ప ప్రభావం చూపింది . ‘’ఆఫ్సాచట్టాన్ని ‘’ప్రభుత్వం ఉప సంహరించేవరకు తాను అన్నంతిననని , మంచి నీళ్ళుకూడా తాగనని తల దువ్వుకోనని అద్దం లో ముఖం చూసుకోనని కఠోర నియమాలు ఏర్పరచుకొని నిరాహార దీక్ష కొన సాగించింది .మూడవ రోజున ఆమె ఆత్మ హత్యా ప్రయత్నం చేస్తోంది అని చట్టప్రకారం అది నేరం అని అరెస్ట్ చేసి,తర్వాత జుడీషియల్ కస్టడీలో ఉంచారు .ఆమె ఆరోగ్యం క్షీణించి పోతూ ఉండటం తో ఆమెకు బలవంతంగా ద్రవాహారం ఇచ్చారు .ప్రతి సంవత్సరం ఆమె నిరాహార దీక్ష చేబట్టటం అరెస్ట్ అవటం విడుదలవటం మళ్ళీ దీక్ష చేబట్టటం జరిగింది .

2006లో అక్టోబర్ 2 గాంధీ జయంతినాడు షర్మిల ఢిల్లీ లోని రాజ్ ఘాట్ ను సందర్శించి తనకు ఆదర్శమైన మహాత్మునికి పుష్ప గుచ్చం సమర్పించి ,ఆ సాయంత్రమే విద్యార్ధి బృందాలు మానవ హక్కులకోసం చేస్తున్న పోరాటం లో జంతర్ మంతర్ వద్ద కలిసి నాయకత్వం వహించి౦ది .అస్సాం రైఫిల్స్ హెడ్ క్వార్టర్ ముందు షర్మిలకు మద్దతుగా 30 మంది మహిళలు నగ్న ప్రదర్శన చేశారు .వాళ్ళ చేతులలో ‘’భారత సైన్యం మమ్మల్ని రేప్ చేస్తుంది ‘’ అన్న బానర్లు ఉన్నాయి .వాళ్ళందర్నీ నిర్బంధించి మూడు నెలలు జైలులో ఉంచారు .

షర్మిలకు మద్దతు : 
2011 లో షర్మిల మానవ హక్కుల నాయకుడు అన్నా హజారే ను మణిపూర్ సందర్శించ వలసిందిగా కోరింది ఆయన తన తరఫున ఇద్దరినీ పంపాడు .అదే ఏడాది అక్టోబర్ లో ‘’మణి పూర్ ప్రదేశ్ ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ ‘’శషర్మిలకు మద్దతు ప్రకటించి ,పార్టీ ప్రెసిడెంట్ మమతా బెనర్జీ ని’’ఆఫ్సా చట్టాన్ని ‘’ఉపసంహరించటానికి సాయం చేయమని కోరింది .దీనికి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సానుకూలంగా స్పందించాయి .11 వ నిరాహార దీక్ష సమయం లో నవంబర్ లో ప్రధాని మన్మోహన్ సింగ్ ను షర్మిల కలిసి అస్సాం లో అమలులో ఉన్న చట్టాన్ని ఉపసంహరించమని కోరింది .నవంబర్ 3 న 100 మంది మహిళలు అంబారి లో మానవ హారంగా చేరి 24 గంటల నిరాహార దీక్షతో షర్మిలకు మద్దతు తెలిపారు .అదే ఏడాది ‘’సేవ్ షర్మిలా సాలిడారిటి కాంపైన్ ‘’ఏర్పడి ఆమె ఉద్యమానికి మరింత బలం చేకూర్చారు .డిసెంబర్ లో పూనే యూని వర్సిటి మణిపూర్ మహిళలు 30 మందికి డిగ్రీ చదవటానికి స్కాలర్ షిప్ లను ‘’షర్మిలాచాను’’ 39 వ జన్మదినోత్సవ పురస్కారంగా మంజూరు చేసింది .దీక్ష ప్రారంభించాక ఒకే ఒక్క సారి తల్లిని చూడటానికి వెళ్ళింది .’’ఆఫ్సా చట్టం’’ ఉపసంహరించాక మాత్రమే మా అమ్మ దగ్గరకు వెళ్లి ఆమె పెట్టిన అన్నం తింటాను ‘’అని ప్రకటించింది .
దీక్ష విరమణ

28-3-2016 న 16 ఏళ్ళ నిరాహార దీక్షను షర్మిల విరమించింది .చేసిన శపథం ప్రకారం ఆమె ఇంటికి వెళ్ళలేదు తల్లిని చూడలేదు చట్టం ఉపసంహరించాల్సిందే అని పట్టు బట్టి అదే రోజు సాయంత్రం ఇంఫాల్ లో షాహిద్ మీనార్ లో మళ్ళీ నిరాహారదీక్షమొదలు పెట్టింది .ఆమరణ నిహారాహార దీక్ష నేరం అంటూ మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేశారు .26-7-16 న షర్మిల తాను ఆగస్ట్ 9 న దీక్ష విరమిస్తానని ,మణిపూర్ ఎన్నికలలో పాల్గొంటానని ప్రకటించింది .ఆమె ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది .ఆమె చేసిన శపదాలను పట్టించుకోనందుకు జనం కలతచెందారు ‘’నేను రాజకీయాలలో ఉండి ఆఫ్సా చట్ట ఉప సంహరణకు తీవ్రంగా కృషి చేస్తాను ‘’అని శాంత పరచింది ..

ప్రపంచ ప్రసిద్ధ చారిత్రాత్మక నిరాహార దీక్ష : 
ఏకంగా 500వారాలు కఠిన కఠోర నిరాహార దీక్ష చేసింది .ప్రపంచ నిరాహార దీక్ష సమ్మెలో ఇది చారిత్రాత్మకంగా నిలిచి రికార్డ్ సృష్టించింది .ఇంత సుదీర్ఘకాలం నిరాహార దీక్ష చేసినవారెవ్వరూ ప్రపంచం మొత్తం మీద లేనే లేరు ..ఆహారం నీరు లను ఆమె తీసుకోకుండా నే ఇంతకాలం నిరాహార దీక్ష చేసింది . 2014 ఎన్నికలలో ఆమెను రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున ఎన్నికలో పోటీచేయమని కోరాయి .ఆమె తిరస్కరించింది .జైలులో ఉన్న వాళ్లకు ఓటు హక్కు రద్దు అయినట్లు చట్ట ప్రకారం ఆమెకు ఓటు చేసే హక్కును రద్దు చేసింది ప్రభుత్వం .19-8-20 14 న కోర్టు ఆమెను నిర్బంది౦చ టానికి తగిన కారణాలేవీ లేవని విడుదల చేసింది .కాని 22-8-2014న మళ్ళీ అరెస్ట్ చేశారు .విడుదల చేసి, కోర్టు ఆమె ను జుడీషియల్ కస్టడీ లో 15 రోజులు ఉంచారు . ‘’ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ సంస్థ ‘’ఐరాం షర్మిలను ‘’ప్రిజనర్ ఆఫ్ కాన్షన్స్ ‘’గా ప్రకటించింది .

గౌరవ పురస్కారాలు : 

2004 లో షర్మిల ను ‘’ప్రజా ప్రతిఘటన చిహ్నం ‘’గా గుర్తించి ఆరాధించారు . ‘’ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ సంస్థ ‘’ఐరాం షర్మిలను ‘’ప్రిజనర్ ఆఫ్ కాన్షన్స్ ‘’గా ప్రకటించింది .అహింసా పూరిత సత్యాగ్రహ పోరాటానికి షర్మిలకు 2009 లో ‘’మయిల్లమ్మా ఫౌండేషన్ ‘’వారు ‘’మయిల్లమ్మా అవార్డ్ ‘’ను ప్రదానం చేశారు .2010 లో ‘’ఏషియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్’’షర్మిలకు ‘’జీవన సాఫల్య పురస్కారం ‘’అందించింది .రవీంద్ర నాద టాగూర్ శాంతి బహుమతి తో పాటు 5 లక్షల నగదు పురస్కారాన్ని ‘’ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్ ‘’పురస్కారం అందుకొన్నది .’’శాంతి సామరస్య ‘’సాధన కోసం చేసిన కృషికి ‘’సర్వ గుణ సంపన్న’’పురస్కారం పొందింది . .2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఐరాం షర్మిల ఏం. ఎస్ .ఎన్ .వాళ్ళు నిర్వహించిన ఓటింగ్ లో అగ్రభాగాన నిలిచింది .

షర్మిల జీవితం పోరాటాలపై ‘’దీప్తి ప్రియా మేర్హోత్ర ‘’బర్నింగ్ బ్రైట్ –ఐరాం షర్మిల –అండ్ హర స్ట్రగుల్ ఫర్ పీస్ ఇన్ మణిపూర్ ‘’పుస్తకాన్ని రాశారు ..’’ఓజాస్ యే సి ‘’అనే పూణే నాటకనటుడుఆమె జీవితం ఆధారంగా ‘’టేక్ ది టార్చ్ ‘’అనే మొనో ప్లే ప్రదర్శించాడు .దీన్ని దేశం లో చాలా చోట్ల ప్రదర్శించి షర్మిల స్పూర్తిని తెలియ జేశాడు . మణిపూర్ ఉక్కు మహిళ ఐరాం షర్మిల అందరికీ ఆదర్శంగా నిలిచి స్పూర్తి ,ప్రేరణలనిచ్చింది .

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

లాభాపేక్ష లేని స్వచ్చంద సేవా సంస్థ -గౌతమి కంటి ఆస్పత్రి –రాజమండ్రి

లాభాపేక్ష లేని  స్వచ్చంద సేవా సంస్థ -గౌతమి కంటి ఆస్పత్రి –రాజమండ్రి

రాజమండ్రి లోని గౌతమి కంటి ఆస్పత్రి లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఉచిత నేత్ర వైద్యం చేస్తున్న గొప్ప సంస్థ .ఉభయ గోదావరి జిల్లాలు ఖమ్మం కృష్ణా జిల్లాలో వారు ఐ కాంప్ లు నిర్వహిస్తూ ,రాజమండ్రి నుండి సకల వైద్య పరికరాలతో వచ్చి ఉచితం గా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలిచ్చి ,మరీ అవసరమైతే వారి కున్న ఏ సి వాన్ లో రాజమండ్రి తీసుకు వెళ్లి అక్కడి గౌతమి హాస్పిటల్ లో చేర్చి ఉండటానికి ఏ సి రూమ్ ఇచ్చిఉచితం గా  అపరేషన్ చేసి అవసరమైన మందులు ఇచ్చి మర్నాడు వారి ఏ సి కారు లోనే ఇంటికి అంటే స్వగ్రామానికి చేరుస్తున్నారు .ఒక వారం తర్వాత వారే కారు లో ఇంటికి వచ్చి ఫాలో అప్ యాక్షన్ చేసి నేత్ర రోగులపాలిటి అశ్వినీ దేవతలుగా సేవ లందిస్తున్నారు .ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డ్ కాని ఆధార కార్డ్ కాని ,ఉంటె చాలు రోగులు ఎలాంటి ఫీజులు ఆపరేషన్ ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నిర్వహిస్తూ ,అందరి అభిమానం పొందుతున్నారు .ముఖ్యంగా రిటైర్ అయిన వారికి గొప్ప ఊరట కల్పిస్తున్నారు .

సుమారు వారం క్రితం నా తోటి ప్రధానోపాధ్యాయుడు ,హిడ్ మాస్టర్ అసోసియేషన్ సెక్రటరి ,మాతో పాటే రిటైర్ అయిన పెదముత్తేవి ఓరిఎంటల్ హై స్కూల్ మాజీ హెడ్ మాస్టర్ శ్రీ కోసూరు ఆదినారాయణ రావు నాకు ఫోన్ చేసి కృష్ణా జిల్లా మొవ్వ ,కూచిపూడి మండలాల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యం లో రాజమండ్రి గౌతమీ నేత్రాలయ వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించామని వారి సేవలు చిరస్మరణీయమని  మా ఇద్దరికీ తెలిసిన ఎందరో చికిత్స చేయించు కొన్నారని ,11 వ తేది న మొవ్వ హై స్కూల్ లోపెన్షనర్స్ సర్వ సభ్య సమావేశం జరుగుతోందని అందులో గౌతమి  నేత్రాలయ సీనియర్ డాక్టర్ ఎం డి శ్రీ రాజు గారిని ఆహ్వానించి సత్కరిస్తున్నామని ,నన్ను కూడా ఆత్మీయ అతిధిగా రావలసిందిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు ఆ రోజు నాకు వేరే పని ఉండటం వలన రాలేక పోతున్నానని తెలియ జేశాను .సరే అన్నారు .తర్వాత రెండు రోజులకు ఫోన్ చేసి 18 వ తేది కూచిపూడి లో గౌతమి వారి ఐ కాంప్ నిర్వహిస్తున్నామని తప్పక రావలసిందిగా కోరారు సరే అన్నాను .

ఇవాళ కూచిపూడి సిద్ధేంద్ర కళా క్షేత్రం లో జరిగిన ఐ కాంప్ కు నేను వెళ్లాను .ఇద్దరు యువ డాక్టర్లు చాలా శ్రద్ధగా అందరినీ చాలా ఓపికగా అన్ని పరీక్షలు చేసి సలహాలు ఇస్తున్నారు .నాతొ పాటు రిటైర్డ్ హెడ్ మాస్టర్లు శ్రీ యెన్ అంజయ్య ,శ్రీ రామస్వామి శ్రీ ఆంజనేయులు మొదలైన వారూ వచ్చారు పరీక్ష కోసం .శ్రీ జి .ఉమామహేశ్వర రావు గారు ఇప్పుడు పెన్షనర్స్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్షుని హోదాలో కనిపించారు .నేనూ పరీక్షలు చేయించుకొన్నాను .నాకు సుమారు 8 ఏళ్ళక్రితం ఎడమ కంటి రెటీనాకు లేజర్ ఆపరేషన్ చేయిన్చుకోన్నానని ఆ రిపోర్ట్ చూపి ,జూన్ లో ఉయ్యూరు రోటరీ కంటి ఆస్పత్రిలో చెక్ చేయించుకొని కొత్త జోడు వాడుతున్నానై చెప్పాను అన్నీ ఓపికగా విని కంటిలో రెండు సార్లు డ్రాప్స్ వేసి మళ్ళీ పరీక్ష చేసి అంతా బాగానే ఉందని కుడి కంటికి కొద్దిగా శుక్లం ఉందని ఇపుడిప్పుడేమీ కంగారు పడాల్సింది లేదని అంటే ఒక ఏడాది ఆగచ్చా అని నేను అడిగితే ఆరునెలల తర్వాత మళ్ళీ పరీక్ష చేసి చూపు తగ్గితే అప్పుడు చూద్దాం ప్రస్తుతం మండులుకాని ఐ డ్రాప్స్ కాని అక్కర లేదు అని చెప్పారు .ఈ యువ డాక్టర్ గారి సరసభారతి ప్రచురణ గ్రంధాలు 9 ,శ్రీ ఉమా మహేశ్వర రావు తోడుగా అందజేశాను ఆయన వాటిని ‘’మీ పెద్దాయనకు ఇవ్వండి ‘’అని చెప్పారు సరే అన్నారు కుర్ర డాక్టర్ .ఉమా గారికీ మన పుస్తకాలు ఇచ్చాను .దాదాపు 100మంది దాకా ఇవాళ పరీక్ష చేయించుకొన్న వారున్నారు .అందరు చాలా సంతృప్తిగా ఉన్నట్లు అర్ధమైంది .ఇలాంటి కాంప్ లు నిర్వహిస్తున్న శ్రీ ఆదినారాయణ అండ్ కొ వారికి ,గౌతమి నేత్రాలయ వారికి వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు .రాష్ట్రం లో అంధత్వం ఉండరాదు అన్న రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం తో చేతులు కలిపి గౌతమి  సేవ చేస్తోంది .వారిని అడిగి వారి బ్రోచర్ తీసుకొన్నాను .అందులోని ముఖ్య విషయాలు మీకు తెలియ జేస్తున్నాను .

ఉద్యోగుల ఆరోగ్య పధకాలను హెల్త్ కార్డ్ ద్వారారుసుము లేకుండా  సేవలు అందించటం .ప్రాధమిక పరీక్షలు ,నిర్ధారిత పరీక్షలు అవసర శాస్త్ర  చికిత్సలు  ఉచితంగా పొందవచ్చు .ప్రభుత్వంనిర్దేశించిన ప్రమాణాలతో సేవలు అందించటం సమాజం లో విజ్ఞులైన వర్గాలకు కంటి సేవలు అందించటం వీరి ముఖ్య ధ్యేయం.ఉద్యోగ సంఘాలున్న చోట కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తారు .ఉన్న కళ్ళ జోడు నుపరీక్షించి మార్పులు ఉంటె సూచించటం మధు మేహ వ్యాధి ఉన్నవారికి రెటీనా ఫోటో తీసి గ్లకోమా ,రేటినో పతి నిర్ధారణ చేస్తారు .న్యాయమైన ధరలకు కళ్ళజోళ్ళు అందజేస్తారు .శస్త్ర చికిత్సలు చేయించుకొనే వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు .వీరికి రాజమండ్రి గౌతమి హాస్పిటల్ లో ఉచిత భోజన వసతి సదుపాయం కల్పిస్తారు శస్త్ర చికిత్స చేయి౦చు కోనేవారికి అవసరమైన రక్త పరీక్షలు ,కంటి పరీక్షలు ఉచితం గా చేస్తారు.అమెరికా పద్ధతిలో శుక్ల శస్త్రచికిత్సలు చేస్తారు .శస్త్ర చికిత్సానంతరం కూడా వైద్య సేవలు అందజేస్తారు .గౌతమి నేత్రాలయం లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ . సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నదాన్ని ఆచరణ లో చూపిస్తూ సేవ చేస్తున్న ఉన్నత ఆదర్శాలతో నడుస్తున్న సంస్థ . అవసరమైన వారందరూ వీరి సేవలను వినియోగించుకొని కంటి స్వస్థత పొందాలని కోరుతున్నాను .

కళా క్షేత్రానికి వెడుతున్న దారిలోమెయిన్ రోడ్డుకు దగ్గరలో  ఎడమవైపు సిలికానాంధ్రా వారుఅన్ని వైద్య సేవలు అందించే  చాలా పెద్ద  .సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ కడుతున్నారు .భూమిని సుమారు నాలుగు గజాల లోతు కు తవ్వి ఉంచారు .పనులు ప్రారంభించాలి ఇది శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారి ఆధ్వర్యం లో సర్వాంగ సుందరంగా అన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న విద్యాలయం .కూచిపూడి కి వరం అందరికీ గొప్ప సదుపాయం .

గౌతమి నేత్రాలయ కంటి శిబిరం ఫోటోలు తీశాను. జత పరుస్తున్నాను చూడండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్- -18-9-16 –ఉయ్యూరు

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భారత రత్న ఏం ఎస్ సుబ్బులక్ష్మి శత జయంతి

Inline image 1

సరస భారతి ఆధ్వర్యం లో ఈ రోజు 17-9-16 శనివారం సాయంత్రం 6- 30 గం లకుసరసభారతి 97వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల దేవాలయం లో గానకోకిల ,భారత రత్న శ్రీ మతి ఏం ఎస్ సుబ్బు లక్ష్మి గారి శత జయంతి సభ నిర్వహిస్తున్నాం .తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ బృందం సంగీత కచేరి నిర్వహిస్తారు . సంగీత రసజ్ఞులందరూ విచ్చేసి సభను జయప్రదం చేయవలసినదిగా ఆహ్వానిస్తున్నాం .

జోశ్యుల శ్యామలా దేవి   మాది రాజు శివ లక్ష్మి ,గబ్బిట వెంకట రమణ   గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు             కార్య దర్శి               కోశాధికారి                అధ్యక్షులు -సరసభారతి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం )

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం )

‘’విశ్వనాధకు ఆంద్ర దేశపు గాలి నీరు ,వాన ,చివరికి చీమ అన్నీ మాననీయాలే .’’ఆకాశం లో క్రతు ధ్వనులు ‘’వింటాడు .ఆ క్రతుధ్వనుల్లో ఆయన శ్రోత్రియత చక్కగా వాసించింది .ఎంతగా కవి లీనుడైతేనో తప్ప ఈ తన్మయీ భావంకుదరదు .విశ్వనాధ రచనలు చదవటానికి ఒక ప్రత్యేక అధికారం కావాలి .తెలుగు సాహిత్యం లో ఆయన తాకకుండా విడిచిన మార్గం లేదు .ఆయన పద రచనలలో బాగా పండినవి కిన్నెరసాని పాటలు .దీని కదా వస్తువు ఆయన తయారు చేసుకోన్నదే .దీనికి ఆధారం రెండే రెండు .ఒకటి భద్రాద్రి దగ్గర కొండ ,రెండవది దాన్ని చుట్టుకొని ప్రవహించే యేరు .ఆ ఏరే ‘’తెలుగు సాని ‘’అయింది .పెనుగొండ లోని ‘’బృందావనం ‘’చూసి ,శుక్తిమతి ,కోలాహలపర్వత౦, గిరిక పాత్రలను   సృష్టించిన భట్టు మూర్తి జ్ఞాపకం వస్తాడు. ఒకటే దృశ్యం రెండు హృదయాలలో భిన్న రీతులలో భిన్న లక్ష్యాలకు ఆధార మైంది .భట్టు పాండిత్యాన్ని గుమ్మరించి ,మెదడును వంచి భళీ అని పించుకొంటే ,విశ్వనాధ తాను వాపోయి ,మనల్ని ఏడిపించాడు .రసనాళాలను తాకి ,రసము యొక్క మేరలు తడిమాడు .కిన్నెర సాని రసాకృతి .అందుచే ‘’ధునీ వైఖరి బూనింది .మగడు శిలా సదృశుడైన మగవాడు –రాయి అయ్యాడు .ఇద్దరికీ కలిగింది ఒకటే దుఖం .కాని సంభవించింది భిన్న పరిణామం .దీనికి కారణం స్త్రీ పురుషుల జన్మల మూలతత్వం లో ఉన్న భేదమే .ప్రకృతి రూపం లో ఉన్న స్త్రీ రసాకృతి .,ముగ్ధ లలితా స్వరూపిణి .పురుషుడు స్త్రీకంటే గంభీరుడు ,ఉదాత్తుడు .వాని హృదయం దుఖం చేత పగులు తు౦ది కాని ప్రవహించదు .ఈ దృశ్యాన్ని చదువుతుంటే ఉత్తర రామ చరితలో భవభూతి వర్ణించిన ‘’అనిర్భిన్న గభీరత్వా దంత ర్గూఢ ఘనవ్యదః –పుట పాక ప్రతీకాశో రామస్య కరుణో రసః ‘’జ్ఞాపకం వస్తుంది .కిన్నెర సాని దుఖాన ఒక వనమే కాదు ,తెలుగు వారి బ్రతుకులన్నీ పాట అయి పోతాయి .ఇదొక విలక్షణ కావ్యం .ఒక ప్రత్యేక రచనా పద్ధతికి దారి తీసింది .విశ్వనాధ –కిన్నెర సాని అనుస్యూతాలై ఆంద్ర సారస్వతం లో నిక్కచ్చిగా నిలిచి పోతాయి .సాంకేతిక కావ్య దృష్టిలో చూస్తే   కిన్నెర సానిలో ‘’పులుముడు ‘’ఎక్కువ .అందుకే దాన్ని చదవ కూడదు .పాడాలి .’’ఓ నాధ ఓ నాద ‘’అని నాలుగు సార్లు వస్తుంది .ఈ నాలుగు సార్లను వేర్వేరు స్వరాలలో మేళవిస్తే ,అనేక భావ ,రాగాలకంటే స్పష్టంగా కనిపిస్తుంది .దీనితో ‘’లీనత ‘’ధర్మం ఎక్కువై మనసుకు పడుతుంది .(దీన్ని విశ్వనాధ స్వరం లో  వింటే మధురాతి మధురం గా ఉంటుంది ఆ ఒయ్యారాలు పోకడలు అన్నీ కళ్ళకు కట్టిస్తాడు )కావ్యం అంతా ‘’రోకంటి పాట’’లాగా కాకుండా విషయ భేదాన్ని బట్టి గేయాల మట్టులు మారాయి .నిష్కల్మష ప్రేమకు భగవంతుడు దగ్గరలోనే ఉంటాడు .కిన్నెర ,దాని మగడు బతికి పవిత్రులు ,చచ్చి కూడా పవిత్రులైనారు .కనుక ఈ కావ్యం మోదాంతమే .

‘’విశ్వనాధ నవలలో మూడు నేను చూశాను .అవి నవలలు కాదు కావ్యాలే .విశ్వనాధ నవలలు రాయటం అంటే భవభూతి నాటకాలు రాయటం లాంటిదే .నాటక కారుడు సహస్రాక్షుడు అవ్వాలి .భవభూతి నాటకాలలో ‘’సెన్స్ ఆఫ్ ప్రోపోర్షన్ ‘’-పరిమాణం లో మితి తక్కువ .మాలతీ మాధవ నాటకమే దీనికి ముఖ్య సాక్ష్యం .విశ్వనాధ ‘’మహావేశి.చెలియలి కట్ట నవల లో ఆత్మ వేదన మొదటి నుంచి చివరిదాకా ఛాయా రూపంగా పారింది .ఆయన వచనం వచనం కాదు –కవిత .అంటే గద్యానికి కావలసిన గుణాలకంటే ,పద్యానికి కావలసిన భావన ,ఆవేశం ముందు నడుస్తాయి .వేయి పడగలు చదువు తూ ఉంటె ఒక మహా కావ్యాన్ని చదువుతున్నట్లు అనిపిస్తుంది .ఆయన వచనం లోనూ అనేక శయ్యలున్నాయి .నన్నయ లాగా దీర్ఘ కోమల సమాసాలు ,తిక్కన లాగా విరుపులు ,శ్రీనాధుని బిగువైన పటాటోపం ,పోతన లాగా గలగలమనే అనుప్రాస లతో మధుర లాస్యం చేస్తాయి .పెద్దన లాగా శిరీశ కుసుమ పేశల వైదగ్ధ్యాన్ని ,రాయలలాగా మారు మూల పదాల పోహలింపు ,తెన్నాలి వానివలె ఉద్దండ శైలి చిమ్మగలడు. చేమకూర వాని లాగ తెలుగులోని అచ్చు కత్తులు చూపిస్తాడు .చివరికి చూర్నికలనూ వదలలేదు .చిత్ర విచిత్ర శయ్యల్ని కొత్తగా సృష్టించాడు .వచన రచనలో అతనికి అతడే సాటి .నిజంగా గద్యానికి శైలి అంటూ ఉండదు. కాని ఈయన ఎన్నో పద్ధతులను ప్రవేశ పెట్టి అప్రతిభులను చేశాడు .వేయి పడగలు అపూర్వ సృష్టి ..సుబ్రహ్మణ్య స్వామికి వేయి పడగలు .కాని ఈ కవి ప్రతిభాషణం అసంఖ్యాకాలై తెలుగు నేలను ఆవరించాయి .దానిలో ఒక ‘’విరాట్ స్వరూపం ‘’ఉంది.ప్రాచీన ,నవీన సమాజాలకు వేయి పడగలు ఒక లంకె .దాన్ని చదవకూడదు .వల్లించాలి .ప్రేమించ దగినదే కాదు పూజించాలి ఆంధ్రులకు అది గర్వ కారణం పసరిక పాత్ర భావనా కల్పితం .గిరిక దేవ దాసీత్వం గూడు కట్టిన మూర్తి .అరుంధతి సాక్షాత్తు అరుంధతీ దేవియే .ధర్మారావు  విశ్వనాధ యే..అదొక అమృత ప్రవాహం .గ౦ధర్వ లోకం .

వేన రాజు నాటకం పండితులలో ఒక ‘’తుఫాను నే లెవ దీసింది .దాన్ని పరా మర్షించే  విమర్శ గ్రందాలెన్నో వచ్చాయి .నర్తన శాల చిన్నతనం లో రాసినట్లు అనిపిస్తుంది .ఆయన ప్రాచీన మహా కవుల కెవ్వరికీ తీసిపోని సాహితీ సార్వ భౌములు ,మహా పండితుడు ,విశంకటుడు ‘’అయన మరో రూపం లో వచ్చిన నన్నయ .గుడివాడలో జరిగిన సన్మానం చంద్రునికో నూలు పోగే .న్యాయం గా ఆయనను ‘’ధర్మ సింహాసనం పై ఎక్కించి ,రాజులు మోయాలి .ఆయన గౌరవం ఆంధ్ర దేశ గౌరవం .ఇప్పటికే అ మహా కవి ‘’కాలమందు అరుగని వాడు ‘’అయ్యాడు .ప్రతి పద్య రాసాస్పదమైన  రామాయణ కల్ప వృక్షాన్ని పాడి రుషియే కాగలడు.’’అంతా వ్యర్ధం .వట్టి ఆశ పెను మాయా వల్లి ‘’అంటూ మూల కూర్చు౦టాడేమోనని భయం నాకు ఉంది  .తెలుగు వారి నోముల  చేత ,ఆంద్ర సాహితీ పుణ్యం చేత అలాంటి దుష్కాలం మాత్రం రాకుండు గాక ‘’అనిసరస్వతీ పుత్రులు కోరుకొన్నారు .   ఇదీ శ్రీ పుట్ట పర్తి నారాయణ చార్య గారి దృష్టి కోణం లో విశ్వనాధుని  సాహితీ విశ్వ రూపం ..

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-16 –ఉయ్యూరు

Inline image 1 Inline image 2

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -2

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -2

‘’సత్యనారాయణ గారిలో రసాను భూతి కి బాధ కలిగించే ప్రయోగాలు లేవు .అతని భాష ‘’లేత బుర్రలకు ‘’పనికి వచ్చేది కాదు .జటిలమైనది .వసంతకాలమున తిన్నగా కదలి వచ్చు పువ్వులవాన వంటిది కాదు .కీకారణ్యం లో యధేచ్చగా తిరిగే మదగజాల గుంపు .ఈ రెంటిలోనూ సౌందర్యం ఉంది.విశ్వనాధ శైలిలో సంగీతం లేదనటం కంటే ,అది తార శ్రుతిలో పలికింది అనటం యదార్ధం .ఈ మహా కవికి ధ్వని దృష్టి చాలా తక్కువ .దాన్ని చిత్రించాలంటే నెమ్మది, నిలకడ కావాలి .ఆవేశ పరుడై పరిగెత్తే ఆయనకు నిలకడ ఎక్కడ ఉంటుంది ?ఈ తెగ వారంతా రసవాదులే .అతని కావ్యాలలో రెండు ,మూడు చోట్ల నాకు ధ్వని కనిపించింది .’’అయ్యా !భక్తుల పైని నీ కరుణ ,దివ్యా౦భ స్తరంగాలలో –ముయ్యేరై ప్రవహి౦చు గాని యెడ ‘’ఇక్కడ  అత్యంత సూక్ష్మంగా త్రిమూర్త్యాత్మక స్వరూప ధ్వని కనిపిస్తుంది .’’పతి వంక చూచుచూ –పడతి కిన్నెర సాని  -పోయేటి వేళలో భూమి తనంతగా –తోరమై విరియుచూ త్రోవ చేసిందీ ‘’ గీతం లో సీతా నిర్యాణ రూప మైన రామాయణ వృత్తాంతం వ్యంగ్యం గా ధ్వని0చింది .’’పరు గెత్తెడు నీ వేణి –బంధము బూనితి చేతను ‘’లో శాస్త్రీయ ధ్వని ఉన్నా ,శ్లేష అనిపిస్తుంది .విశ్వనాధ ముఖ్యంగా వాచ్య కవి .భావ తీక్ష్ణత పై ఉన్న దాహం శిల్పం మీద లేదు .

‘’  ఆయనకు నియతమైన శైలి ఉందా అని అనుమానం వస్తుంది .ఆయన ఉపాస్య దైవం నన్నయకే లేదు .ఇతనికి ఎక్కడి నుంచి వస్తుంది ?దీనికి రసావేశమే కారణం .మహా స్వతంత్రుడు .ఏ పోకడలనైనా పోతాడు .భాషా రంగం లో అతడు సవ్య సాచి .భావాలలో భగీరధుడు .గద్య ,పద్యాలలో ఆయన శైలి విశ్వ రూపం దాలుస్తుంది .నిలిచి స్వతంత్రంగా చెబితే మాత్రం నన్నయ భట్టారకుడే ప్రత్యక్ష మౌతాడు .లయ ,తూకం ఉన్న కవిత్వం రాస్తాడు .శ్రీనాధుని సమాసాలలో లాగా ఆర్భాటం ఉండదు .సంస్కృత సమాసాలలో మంద గతి కనిపిస్తుంది .ఆయన సమాసాలు ఒక్కో సారి పద్యం లో నాలుగు పాదాల వరకు విస్తరిస్తాయి  .రెండు పాదాలైనా ఆక్రమించని సమాసం ఉండదు .అతడు వాడే అలంకారాలన్నీ కొత్తవే .నూత్నత లేకుండా అసలు రాయనే రాయడు .తీక్షణం గా ఆలోచించే మెదడు ,భావించే హృదయం ,తోచింది చెప్పగలిగే వైదుష్యం ఆతని సొత్తు .చాలని దానికి  సృస్టించుకొనే సాహసమున్నవాడు .విశ్వేశ్వరుని ‘’గళ రుద్రాక్షీ భవద్బాడబా ‘’అని సంబోధించే సాహసం ఉన్నవాడు .’’కనులకు కైవసం ‘’అనే కొత్తభావం చూపిస్తాడు .ప్రౌఢోక్తి అతని సొమ్ము..కేదారాలను విజయ లక్ష్మీ కేశ బంధం అంటాడు పరమ రామణీయకంగా.ఆయనకు చంద్రుడు ‘’వడ గట్టిన ఎండుగంధపు బెరడు ‘’గా కన్పించాడు .సముద్రుడు ‘’చీకటిలో మరణ వేద తో మూల్గుతున్న దున్న ‘’గా కనిపించాడు ‘’దేవ దాసి పలు వరుసలు సుదర్శనాయుధపు అంచులు ‘’గా గోచరించాయి .

‘’  పారే కిన్నెర సాని-‘’పడువు గట్టిన లేళ్ళకడుపులా తోచింది –కదలు తెల్లని పూల నది వోలె కదలింది –వడలు తెల్లని త్రాచు పడగలా విరిసింది ‘’ఇవన్నీ తెలుగులో కొత్త పదబందాలే .  స్వతంత్రమతనికి ఒక క్రీడ..మనకు కొత్తగా అలవాటు పడని భావ నూత్నత,ఆ భావాలను లగింప చేయటానికి కోడె త్రాచు లాగా చుట్టలు చుట్టలు గా చుట్టుకొన్న భాష .ఈ రెండూ మనల్ని దూరానికి నెట్టేసి,  మనల్ని నిట్టూర్పులతో వెనక్కి పంపిస్తాడు .మహా రసావేశి కనుక  పదాలు ,భావాలు అవశాలై దొర్లుతాయి .వెనకా ముందూ చూసే నిలకడ ఉండదు .నరాలకు అంటిన వైదుష్యం ,జన్మానకు అంటిన ప్రతిభ ,బ్రతుక్కి అంటిన స్వాతంత్రం ఉన్న  ఈ కవికి  తలచుటకు ముందే తమంత తామే పై బడి దూకుతాయి .’’నాకు మల్లె నీవు నది వోలె పారరా –జలముగా ఇద్దరము కలసి పోదామురా –కెరటాలు కెరటాలు కౌగిలిత్తామురా’’అని వాపోయినప్పుడు ఆ ముగ్ధతకు మనమే కాదు రస స్వరూపమే పులకరిస్తుంది .’’తన్మయీ భవనం ‘’విశ్వనాధకు వెన్నతో పెట్టిన విద్య .గాఢం గా భావించి ,తీవ్రంగా మననం చేసి ,పూర్తిగా తనను  తానే మరిచి పోతాడు .’’నీ నిస్టాగతి నీవు గాక మరి లేనే లేను విశ్వేశ్వరా ‘’అంటాడు ఇది తన్మయీ భావానికి పరాకాష్ట ..ఏ వస్తువును భావించినా ‘’శిల వోలె కదల లేక హృదయ స్నిగ్నార్ద్రసద్భావనాఖిల చైతన్యుడై పోతాడు ‘’.

‘’తెలుగుదనం అంటే మహా గర్వం .ఎన్ని జన్మలైనా తెలుగు నేల మీదే పుట్టాలని కోరుకొంటాడు .పూర్వ ఆంద్ర రాజుల వైభవం చూసి అతని రక్తం ఉడు కెత్తుతుంది .అక్కడి తెలుగు మట్టి గడ్డలలో ‘’నవ మృగీ మద వాసనలు ‘’ఆఘ్రాణిస్తాడు .ఇంత అభిమానం ఉన్నా అతనికి ‘’తెలుగుతనం అంటలేదు ‘’.చిక్కని జాతీయాలు ,పూల గుత్తుల్లాంటి  ఆచ్చికాలు, విశ్వ నాద శైలిలో కనిపించవు .అతని శైలి సంస్కృత సమాస బరువుకు భుగ్నమైంది .అలాంటి శైలే ఆయనకు కావాలి .లేకపోతే గంభీర భావాలు సుకుమారమైన భాష లో ఇమడక హిందీ రచయిత  ‘’ద్విజేంద్రు’’ని సాంఘిక నాటకాల కు పట్టిన గతే పట్టేది .ఇతనిలో హాస్యమూ తక్కువే .బ్రతుకు లో లేని హాస్యం రచనలో ఎక్కడినుంచి వస్తుంది ?నిష్టుర ప్రపంచాన్ని ఆశ్రయించి బతకాల్సి వచ్చిందే అని తోచక నవ్వే’’వెకిలి  నవ్వు ‘’ఆయనది .భవ భూతి నవ్వూ ‘’సేం’’ ఇలాంటిదే..అంటే ఏడవ లేని నవ్వు అన్నమాట .

ఎంత  ఖచ్చితం గా బంగారాన్నితూచి విలువ కడతారో అంతఖచ్చితంగా విశ్వనాధ సాహిత్యాన్ని తూకం వేసి నిగ్గు తేలుస్తున్నారు సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణా చార్య .అందుకే నాకీ వ్యాసం బాగా నచ్చింది అన్నాను .మిగిలిన విశేషాలు మరో సారి .,

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-16- ఉయ్యూరు

 

 


గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ

ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా వెలువరించిన ‘’విశ్వనాధ సాహితీ విశ్వరూపం ‘’20 16 మార్చి లో విడుదల అయింది .ఒక రిఫరెన్స్ గ్రంధంగా రూపు దిద్దుకొన్న ఈ పుస్తకం లో చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన రచయితల రచనలున్నాయి .నాకు అందులో సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్య గారి వ్యాసం’’మహా కవి శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ ‘’ శిరో భూషణం గా ఉందని పించింది .అందులోని విషయాలు అందరికీ తెలియాలనే ఉద్దేశ్యం తో అందులో అతి ముఖ్యమైన విషయాలను మీ ముందు ఉంచుతున్నాను .

‘’  విశ్వనాధ స్పర్శ అగ్ని కణం.-తీవ్ర బాధ –దారుణ తపస్సు .అతడొక విచిత్ర మానవుడు .విశిష్ట వ్యక్తీ .ఆ హృదయానికి విషాదమే పరి వేషం .సుఖం లో ఒదిగిన దుఖం .జ్ఞానం లో ఉన్న అజ్ఞానం ,సంయోగం లో భావ వియోగం వీటినే చూస్తాడు .తెలుగు నేలపై విశ్వనాధ వంటి పండితుడు ఉండవచ్చు కాని అటువంటి సంస్కారి అరుదు .అతని జీవితం అగ్ని కుండం .కుంగి కుంగి దుఖం పట్టలేనప్పుడు వహ్ని పర్వతం లావాను వెదజల్లినట్లు ఒక్క సారి తన రచనలను బయటికి వెదజల్లుతాడు .జీవచ్చవమై పోతున్న సమాజాన్ని చూసి కుంగి కన్నీరు మున్నీరుగా బావురు మన్నాడు .దీనికి తోడూ దరిద్రం .దానితో వైదుష్యం .స్వాతంత్ర్యం మతి ప్రభ అన్నీ కిం భాగ్యమైపోయాయి .విశ్వనాధ కు వ్యాస భగవానునితో ప్రారంభమై ,భవభూతిలో పండిన మార్గమే పట్టింది .ఇదే ఆయన మూల తత్త్వం .తాను మాయ నేర్వ లేడు.నేర్చిన వారిని చూసి ఓర్వ లేదు .తనకు సరిపోని ప్రపంచాన్ని విడువ లేడు,సరి పోనీ వాడిని సహనం తోసహింప లేడు.ఆయన కవిత్వం లో ఆంధ్ర రక్తం మాటేమో కాని వైదిక రక్తం ప్రవహించింది .లేమిడి పెద్ద ఆస్తిగా దక్కింది .దరిద్రం ఆభిజాత్యంగా సంక్రమించింది .ఆయనకు వైదిక కవి నన్నయ ఇంటి దేవుడు .ఆంధ్ర దేశం లో సంస్కృతాన్ని వైదికులు ,తెలుగును నియోగులు పోషించారు .నన్నయ కంటే తెలుగు తీపిదనం తిక్కనలో వేయి రెట్లు ఎక్కువ .నన్నయ కవితలో పోకడలు తప్ప విశ్వనాధ లో తిక్కన తెలుగు దానం లేదు .కోకిలమ్మ పెళ్లి లో తెలుగు కోకిల నుసృష్టించాడు .కాని తానుమాత్రం సంస్కృత చిలకే అయ్యాడు .అతని వైదుష్యం అంతు లేనిది .సంస్కృత వాజ్మయాన్ని సమగ్రంగా పరిశోధించాడు .వ్యాకరణాన్ని వల్లె వేశాడు .ప్రస్థాన త్రయ పాఠం చదివాడు .భాసుని నుండి నీల కంఠ దీక్షితులు వరకు ఉన్న అనేక కవుల చాయలు అతని రచనలలో ఉన్నాయి .ఆంధ్రాన్ని ఔపోసనే పట్టాడు .నన్నయ ను ఉపాసి౦చాడు .తిక్కనను సేమమడిగి ,శ్రీనాదునితో చేయి కలిపాడు .పోతనకు మొక్కి ,రాయల వాజ్మయాన్ని చదివి ,తెనాలి రామునితో వియ్యమందాడు .

ఆంగ్ల భాషలో ప్రాచ్య హృదయం లోని శాంతి-రుషిత్వం విశ్వనాధ కు కనిపించలేదు .ఆయన పరీక్ష మహా నిశితమైనది .వస్తువునుకాని ద్రుశ్యాన్నికాని నిశితంగాపరీక్ష గా  చూస్తాడు .ఆ పరీక్ష లో సౌందర్య సీమను దాటుతాడు .సౌందర్యం గౌణం అయి కర్కశత్వం ఏర్పడుతుంది .ఏదైనా చెబితే పాఠకుడు మరువనట్లు మరచి పోలేనట్లు చెప్పాలని ఆకాంక్ష .అమిత వేధ అనుభవిస్తాడు .లెక్కలేనన్ని కొత్త పదాలు సృష్టిస్తాడు .భాషను సుడులు తిప్పుతాడు .కొత్త ఉక్తుల్ని కల్పిస్తాడు .ఇదే వేదన భవభూతి పొందాడు .భవ భూతికి సీత లాగా విశ్వనాధకు దేవదాసి ,గిరి కన్నేలలలో భగవంతుడు ఆడాడు .వీరిద్దరికీ స్త్రీ జగన్మాత .

ప్రయోగాలలో విశ్వనాధ సర్వ స్వతంత్రుడు .సంస్కృత వైకల్పికాలన్నీ రచనలో గుప్పించాడు .ఆయన ఆచ్చిక ప్రయోగాలకు వ్యాకరణం ఇంకా సాధించాలి .గ్రామ్య పదాలేన్నిటికో గ్రా౦ధికత కల్పించాడు .ఆవేశం లో ఆయనకు శరీరమే తెలియదు .సంస్క్రుతాభిమానం తో జాను తెలుగు సొగసుల్ని  అభిమాని౦చ లేదేమో .రసలబ్దులగు రచయితలకు అనవసరం కూడా .నాకు మాత్రం పాత్రోచిత భాషా వాది అని పిస్తాడు .ఆయన భాష గీర్వాణ సార్వ భౌమత్వాన్ని అంగీకరించింది .ఆయన అనుభవం ‘’రావి ఆకుల చుట్టలు కాల్చుకొనే పాలేరు బుడ్డ వాళ్ళు మొదలు కొని ,జమీందారుల వరకు విరిసి కొన్నది’’ .ప్రౌఢత్వం ఆయన స్వభావం అయి పోయింది .చిన్న భావాన్ని కూడా గొప్ప భాషలో చెబుతాడు .భాషా సంధిలో భావ బంధాన్ని ఇరికించి నపుడు భావం మనకు అందుబాటులోకి రాదు ‘’.

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికా నుంచి వచ్చిన మా అల్లుడు ఛి కోమలి సా0బావధాని 11-9-16 ఆదివారం ఉయ్యూరులో మా ఇంట్లో

అమెరికా

నుంచి వచ్చిన మా అల్లుడు ఛి కోమలి సా0బావధాని 11-9-16 ఆదివారం ఉయ్యూరులో మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు -2(చివరిభాగం )

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు -2(చివరిభాగం )

విధవా పునర్వివాహ ఉద్యమ౦

1884 లో మద్రాస్ కు చెందిన బ్రహ్మ సమాజ ప్రచారకుడు బుచ్చయ్య పంతులు బళ్ళారి వచ్చి బ్రహ్మ సమాజ సిద్ధాంతం పై నా ,విధవా పునర్వివాహం పై నా వరుస ప్రసంగాలు చేశాడు .దీని ప్రభావం తో వెంకట రావు బళ్లారిలో మొదటి విధవా వివాహాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి విందు కూడా ఏర్పాటు చేశాడు .సాంప్రదాయ స్మార్తులు వెంకట రావు కు వ్యతిరేకమై ఆయనను ఆయన శూద్ర సేవకులను వెలివేసి చాలా ఇబ్బందుల పాలు చేశారు .దీన్ని ధిక్కరించి ఆయన తనకు తన వారికి స్నేహితులకు అందరూ చూస్తూ ఉండగానే మంచి నీరు ,విలువైన ద్రవ్యాలు తీసుకుని వెళ్ళేవాడు .విరూపాక్ష మతానికి చెందిన శ్రీ శంకరా చార్యులు  వెంకట రావు కు బంధువులు అవటం వలన ఆయన తటస్థంగా ఉండిపోయారు .విధవ పునర్వివాహాలపై విస్తృతంగా శాస్త్ర  చర్చ జరగాలని శంకరాచార్య అభిప్రాయ పడ్డారు .వెంకట రావు చొరవ ,ధైర్యాలకు ఆకర్షింపబడిన ఆయన కులస్తులు సంకోచం లేకుండా ఆయనతో సన్నిహితంగానే మెలిగి స్మార్తుల ఆంక్షలను తూ నా బొడ్డుఅన్నారు .దీని తర్వాత మళ్ళీ రెండు విధవా పునర్వివాహాలను వెంకట రావు నిర్వహించాడు .అందులో ఒకదాన్ని తన స్వంత ఇంట్లోను ,రెండవది తన స్నేహితుడైన సభాపతి మొదలియార్ ఇంట్లో చేశాడు .పరిస్థితి  అర్ధం చేసుకొన్న అతని బంధుగణం ఆయన ఇంట్లో జరిగిన ఏ శుభ ,అశుభ కార్యాలకూ ఆటంకం కలిగించకుండా ప్రవర్తించారు .

సముద్రం పై విదేశీ యానం

1887 లోమద్రాస్ లో  జరిగిన సోషల్ కాన్ఫ రెన్స్ కు హాజరై ,సముద్రాంతర ప్రయాణం పై ఆనాడున్న ఆంక్షల విషయం పరిష్కరించాలనుకొన్నాడు .’’కాలాపానీ ‘’ని రెండు సార్లు దాటి శ్రీలంకకు ,రెండు సార్లు బర్మాకు ఓడపై ప్రయాణించి వెళ్ళాడు .ప్రతిసారీ సముద్రం పై నాలుగు నుంచి ఆరు రోజులు ప్రయాణం చేశాడు .వెంకట రావు దృఢ సంకల్పానికి ఆయన బంధువులు మిత్రులు అందరూ అబ్బురపడి ఎవరూ అభ్యంతరం తెలుప లేదు. ఈ విధం గా జన హృదయాలను గెలుచుకొన్నాడు .ఆయన శీలం మీద మచ్చ పడకుండా ప్రవర్తించారు అందరూ .దీనిపై మరింత అవగాహన కలిగించాలని ఆయన 1902మేలో ఇంగ్లాండ్ దేశానికి వెంట వంటవాడు కాని పనివాడుకాని లేకుండానే ఒక్కడే వెళ్ళాడు .ఆరునెలలుండిఇంగ్లాండ్ లోని  గ్రామీణ ప్రాంతాలను పట్నాలను కలియ తిరిగి ,తర్వాత స్కాట్లాండ్ ,ఐర్లాండ్ తో పాటు ఐరోపాలోని చాలా దేశాలు పర్యటించాడు .స్కాండినేవియన్ పెనిన్సుల ,రష్యా ,టర్కీ లు తప్ప అన్నీ చూశాడు .ఆ యా దేశాలలో తాను చూసిన వాటి గురించి బంధు మిత్రులకు వెంట వెంటనే వివరంగా ఉత్తరాలు రాసేవాడు .వాటిని ముద్రించి ఉంటే అమూల్యమైన యాత్రా , లేఖా సాహిత్యం మనకు లభించి ఉండేది  .9-8-1902 న లండన్ లో జరిగిన ఏడవ ఎడ్వర్డ్ రాజు పట్టాభిషేకానికి హాజరై నాడు .

అపూర్వ స్వాగతం

సీమ దేశ పర్యటన దిగ్విజయం గా ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చిన వెంకట రావు కు గుంతకల్ రైల్వే స్టేషన్ లో బ్రాహ్మణ ,అబ్రాహ్మణ ,వైదిక ,గృహస్త జనాలందరూ అపూర్వ స్వాగతమిచ్చి బళ్ళారి దాకా ఊరేగింపుగా తోడ్కొని వచ్చి ఇంటి వద్ద కు చేర్చారు .బళ్లారిలో అంతటి సంరంభం అంతకు ముందెన్నడూ ఎవరూ చూడలేదు .ఎవరికీ జరుగ లేదు కూడా .వెంకట రావు ఎక్కిన బండీని  .ప్రజలు భక్తిగా తామే లాగుతూ పురవీధుల్లో ఊరేగింపు చేశారు .తర్వాత అన్ని కులాలవారు వెంకట రావు ను విందు భోజనాలకు ఆహ్వానించి అపూర్వా సఖ్యతను చాటారు .ప్రెసిడెన్సి కి అవతల ఉన్న ఆయన కులస్తులు కూడా అరమరికలు మరచి ఆయనను ఆహ్వానించి ఆయనతో కలిసి మెలిసి నడిచారు .

అపూర్వ వ్యక్తిత్వం

అజేయమైన నడవడి .మచ్చ లేని శీల సంపత్తి ,ప్రగతి పై అకు0ఠిత విశ్వాసం ,ధ్యేయ సాధనకు మనో నిబ్బరం ఆత్మ స్థైర్యం ,సాహసం అందరిని ఒప్పించే నేర్పు ఉన్నవాడు కనుకనే వెంకట రావు అన్నిటా  విజయం సాధించాడు అని గ్రహించాలి .ఆయన ప్రవర్తనలో  అణుమాత్రం కూడా దోషం ఎవరూ గుర్తించలేదు. అంతటి విశుద్ధ మనస్కుడు వెంకట రావు .ఆ రోజుల్లో అందరూ తాగే  సోడా నీరుకాని ,మత్తు పానీయాలు కాని రుచి చూడని అపూర్వ వ్యక్తి వెంకట రావు .1889 లో భార్య మరణించింది .అప్పటి నుండి భారత దేశం లో విధవలు పాటించే అత్యంత పరిశుద్ధ జీవితాన్ని వెంకట రావు గడిపాడు .భార్య చనిపోతే ఏ విధురుడూ అంతటి కఠోర నియమాలతో జీవించటం మనం ఎవరూ చూడనది .సాంఘిక నియమాలను ఉల్లంఘించిన వారిని వెంకట రావు చాలా సున్నితంగా మందలించి తప్పు తెలుసుకోనేట్లు చేసేవాడు ఆయన నడవడి ఆచరణ  ఆలోచన అంతా విశ్వ జనీనమైనదిగా అంటే కాస్మోపాలిటన్ గా ఉండేది .ఆయనకు కులమతాల పట్టింపు ,పక్షపాతాలు లేనేలేవు.హిందూ ,మహమ్మదీయ ,క్రైస్తవులను సోదరులుగా ఆత్మీయులుగా భావించి ,వారికి ఏ కష్టం ,నష్టం వచ్చినా మనస్పూర్తిగా వారిపక్షాన నిలబడి సాయం ,న్యాయం చేసేవాడు .వారి సాంఘిక రాజకీయ ఉన్నతికి పాటు పడేవాడు .అందరితో కలిసి సంచరిస్తూ దురభ్యాసాలనుంచి వారిని దూరం చేస్తూ పరిశుభ్రత పారిశుధ్యాలపై అవగాహన కలిగింఛి ఆచరణ సాధ్యం చేసేవాడు .

ఆ రోజుల్లో బళ్ళారి లోని బ్రాహ్మణకుటుంబాలలో ఎవరైనా మరణిస్తే ,వారి శవాలను  ఇళ్ళనుండి చాలా దూరం లో ఉన్న శ్మశానానికి తీసుకొని వెళ్ళటానికి శవ వాహకులు లభించేవారు కాదు .ముఖ్యంగా బీద బ్రాహ్మణులు శవవాహక బ్రాహ్మణులు కోరే అధిక ధనాన్ని చెల్లించలేని పరిస్థితి ఉండేది .ఈ అనివార్య పరిస్థితులలో వెంకట రావు వారికి అండగా ఉండి ధన రూపం లోనూ ,శవ వాహన విషయ౦  లోనూ  సహాయ కారిగా నిలిచేవాడు .

మునిసిపల్ చైర్మన్ వెంకట రావు

వెంకట రావు సేవా దృక్పధాన్ని ,చొరవను ,సంస్కరణాభిలాషను గుర్తించిన బళ్ళారి ప్రజలు 1902 లో ఆయనను మునిసిపల్ చైర్మన్ గా ఎన్నుకొని అపూర్వ గౌరవం చూపించారు .దురదృష్ట వశాత్తు అదే సమయం లో బళ్ళారి ని ప్లేగు మహమ్మారి చుట్టు ముట్టి భీభత్సం సృష్టించింది .మొక్కవోని ధైర్యం తో చైర్మన్ వెంకట రావు మూడు నెలలు అహోరాత్రాలు శ్రమించి వేలాది రూపాయల తన ధనాన్ని ,శారీరక శ్రమను ఖర్చు చేసి దీనజన బా౦ధ వుడిలా ఆదుకొని ప్రభుత్వ సాయం తో ప్లేగు వ్యాధిని అరికట్టగలిగాడు .

వితరణ శీలి వెంకట రావు

అతి పేదవాడుగా జీవితం ప్రారంభించి నెలకు కేవలం 40 నుండి 70రూపాయల జీతం తోనే  ప్లీడర్ అయ్యేదాకా గడిపాడు .న్యాయవాదిగా పుష్కరం పాటు పనిచేసినా మొదత్లొఆయన సంపాదన బొటా బొటీ గా ఉండేది .ఇలా చాలీచాలని జీతంతో గడుపుతున్నా దాన ధర్మాలు మానలేదు .1896 నుంచి తన సంపాదనలో ఆరవ వంతు ,కొన్ని సార్లు నాలుగవ వంతు దాన ధర్మాలకు వినియోగించిన త్యాగ శీలి ,ఆదర్శ మూర్తి వెంకట రావు .తన తర౦ భౌతిక, ఆధ్యాత్మిక, సాంఘిక ఔన్నత్యం సాధించాలని తపన పడేవాడు .బళ్ళారి బాలుర క్రికెట్ ఆటస్థలం కోసం ప్రభుత్వం 3 వేల రూపాయలు ఖర్చు చేస్తే ,దానికి రక్షణ కంచే కోసం ,నిర్వహణ కోసం  వెంకట రావు ఒక వెయ్యి రూపాయలు స్వంత ధనాన్ని వెచ్చించాడు .ఇప్పుడు అది జింఖానా గ్రౌండ్ అయింది .ప్రముఖ సంఘ సంస్కర్త ,విధవా వివాహాల చాంపియన్ రావు బహదూర్ వీరేశ లింగం పంతులు  గారుచేబట్టిన  ‘’విధవా గృహం ‘’నిర్మాణానికి వెంకట రావు 3 వేల రూపాయలు విరాళం గా అందజేసి ,మరుసటి ఏడాది మరొక 2 వేల రూపాయలను అంది౦చిన వదాన్యుడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి భూరి విరాళ మందించిన వితరణ శీలి .లండన్ లోని జాతీయ కాంగ్రెస్ కు చెందిన బ్రిటిష్ కమిటీ డబ్బు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే  ఖర్చులకు ఏటా 500  రూపాయలను 3 ఏళ్ళు అందజేశాడు .బళ్లారిలో బాలికా ఉన్నత పాత శాల నిర్మాణం కోసం 7 వేల అయిదు వందలు ఇచ్చాడు .బళ్ళారిర లోని హిందూ ముస్లిం క్రైస్తవ సేవా సంస్థలకు ప్రతినెలా విరాళాలు అందించేవాడు .బళ్లారిలో సభలు సమావేశాల కోసం టౌన్ హాల్ ను అర లక్ష రూపాయలతో నిర్మించి ,మరో యాభై వేల రూపాయలతో దానికి అనుబంధంగా ఒక గ్రంధాలయాన్ని 10 వేల విలువైన పుస్తకాలతో ఏర్పాటు చేశాడు .తన మాతృ మూర్తి పేర క్షయ రోగులకోసం ఒక విద్యాలయాన్ని కట్టించాడు .తన తమ్ముడు ప్రముఖ నటుడు నాటక రచయిత కోలాచలం శ్రీనివాసరావు  రచించి ,ప్రదర్శించటానికి ,వీలుగా  ఒక నాటక శాలను 10వేల రూపాయలతో నిర్మించాడు .అనాధ బాలలకోసం అనాధాశ్రమ నిర్మాణానికి 20 వేల రూపాయలు ఖర్చు చేసిన మహానుభావుడు

శాసన మండలి సభ్యుడు వెంకట రావు

నార్దర్న్ గ్రూప్ ఆఫ్ మునిసిపాలిటీస్ వెంకట రావు ను 1903నవంబర్ లో మద్రాస్ శాసన మండలికి సభ్యునిగా ఎన్నిక చేసింది .అన్ని ప్రాంతాల ప్రజలు తర తమ భేదాలు పాటించకుండా వెంకట రావు నుఆహ్వానించి సన్మానించి ఆయన ప్రసంగాలతో తన్మయులయ్యారు .సాంఘిక సంస్కరణ ల అమలులో ఆచరణాత్మకంగా కృషి చేసిన వెంకట రావు ను మించిన వారెవ్వరూ లేరు .1903లో గ్రూప్ వారి వార్షిక సాంఘిక సభలకు వారి అభ్యర్ధనపై అధ్యక్ష స్థానం అలంకరించి సమర్ధం గా నిర్వహించాడు ‘ ప్రపంచ పర్యాటకుడు వెంకట రావు 1904 ఫిబ్రవరి లో కుమారుడు రామ చందర్ తోకలిసి ప్రపంచ యాత్ర దిగ్విజయంగా పూర్తీ చేసి అక్టోబర్ 30కి తిరిగి వచ్చాడు .కుమారుడు బార్ కోసం  చదివి బారిస్టర్ అయి బళ్లారిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు .

బిజినెస్ మాగ్నెట్

వెంకట రావు కు సభాపతి ప్రెస్ , నాలుగు జిన్నింగ్ మరియు హైడ్రాలిక్ ప్రెస్సింగ్ ఫాక్టరీలు ఉండేవి .రిప్పన్ ప్రెస్ అండ్ షుగర్ మిల్ లో అరలక్ష పెయిడ్ అప్ కాపిటల్ ఉంది .డెక్కన్ ప్రెస్సింగ్ అండ్ జిన్నింగ్ కాయస్ కు సెక్రటరిలలో ఒకడు గా ఉండేవాడు .వజ్ర కరూర్ డైమ౦డ్ప్ ప్రాస్పెక్టింగ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ .దీనిలో ఇంగ్లీష్ రష్యన్ ,ఆఫ్రికన్ భాగ స్వాములు ఉండేవారు .ఆయనకుఆయిల్ ఇంజన్ తో నడిచే  ఒక ప్రత్యేక ఎక్స్ పెరిమెంటల్ ఫారం ఆధునిక హంగులతో  ఉండేది .స్పిన్నింగ్, వీవింగ్ ,షుగర్ ఫాక్టరీలలో  షేర్లు చాలా ఉండేవి .ఇవికాక భూవసతి ,పొలాలు ,భవనాలు లెక్కలేనన్ని ఉన్న బడా బిజినెస్ మాగ్నెట్ వెంకట రావు .సేవా భావం లోనూ సాటి లేనివాడు కోటీశ్వరుడైన కోటి కొక్కఁడైన వాడు శ్రీ కోలాచలం వెంకట రావు . .

ఆధారం –కోలాచలం వంశానికి చెందినవారు ,వెంకట రావుగారి తమ్ముడు బళ్ళారి నివాసి  అయిన లాయర్ శ్రీకోలాచలం  అనంత ప్రకాష్ గారు నాకు 8-7-16 న పంపిన ఆంగ్ల రచన ‘’Life of Mr .K.Vencata Rao .

మనవి -కానీ వెంకట రావు గారు ఎక్కడ ,ఎప్పుడు చనిపోయినదీ పై ఆంగ్ల వ్యాసం లో లేదు .నెట్ లో వెతికినా దొరకలేదు .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-16 -ఉయ్యూరు

 

 

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవం

3-9-16 శనివారం మధ్యాహ్నం 3 గంలకు  సరసభారతి  ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ వారితోకలిసి శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి(అమెరికా ) దంపతుల సౌజన్య సహకారాలతో  శ్రీకోట సూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యులగురు పూజోత్సవం. ముఖ్యతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్  ,ఆత్మీయ అతిధులుగా   ,శ్రీ కోటగురు పుత్రులు శ్రీ కోట చంద్ర శేఖరశాస్త్రి ,శ్రీ గాయత్రి ప్రసాద్ శ్రీ సీతారామాంజనేయులు గార్లు కుటుంబాలతో

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు

సంస్కృత మహా కావ్యాలకు మహా వ్యాఖ్యానం రాసిన కోలాచలం మల్లి నాద సూరి తాత గారు కోలాచలం సుబ్బా శాస్త్రి కర్ణాటకలోని దార్వార్ జిల్లా మహేంద్ర గడ నివాసి .ఎన్నో హరికధలుమరాటీ కన్నడ భాషలలో రాశాడు .అవి నీతి బోదకాలు గా ఉండటం వలన ఇప్పటికి జనం నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయి .ఆయన తండ్రి నిజాం రాజ్యం లోని ఆనే గొందే సంస్థానం లో దివాన్ .ఇది విజయనగర సామ్రాజ్యం లో భాగం .ఆ వంశానికి చెందిన వాడే శ్రీ కోలాచలం వెంకట రావు .ఆయన నిజంగా కోటికోక్కడై కీర్తి పొందాడు .ఆయన గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .

జనన విద్యాభ్యాసాలు –లాయర్ వెంకట రావు

శ్రీ కోలాచలం వెంకట రావు 28-2-18 50 న కర్ణాటక లోని హంపి దగ్గరున్న కమలాపురం లో జన్మించాడు .ఇది పూర్వపు విజయనగర సామ్రాజ్యం లో భాగం .వార్డ్లా ఇన్ష్టి ట్యూట్ లోను ,,తర్వాత గవర్నమెంట్ ప్రొవిన్సియల్ స్కూల్ లోను చదివాడు .1867 డిసెంబర్ లో ఎఫ్ .ఏ .పాసయ్యాడు .మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజ్ లో మిస్టర్ ధాంసన్ వద్ద బి ఏ .కొంతకాలం చదివి ,మద్రాస్ వాతావరణం ఆరోగ్యానికి సరిపడక చదువు మానేశాడు .మద్రాస్ ప్రావిన్స్ లో అదొక్కటే కాలేజ్ కనుక ఇంకెక్కడా చదవలేక పోయాడు .పొట్ట పోషించుకోవటానికి స్కూల్ మేస్టరీఉద్యోగం లో చేరి 1874 వరకు పని చేశాడు .తర్వాత జిల్లా మున్సిఫ్ కోర్ట్ లో హెడ్ క్లార్క్  గా ఉద్యోగం పొంది నాలుగేళ్ళు పని చేశాడు .డిప్యూటీ తాసిల్దార్ గా ,సబ్ మేజిస్ట్రేట్ గా పదోన్నతి పొంది రెండేళ్ళు సేవ చేశాడు .తన మనసులోని భావనలకు చేస్తున్న ఉద్యోగానికి పొంతన లేదని భావించి  న్యాయ శాస్త్రం  చదివి1880  లో పాసై బళ్ళారి న్యాయ స్థానాలలో సివిల్,క్రిమినల్ కేసులు వాదిస్తూ మంచి లాయర్ గా ప్రసిద్ధి చెందాడు లాయర్ వెంకట రావు .1883 లో దియోసఫిస్ట్ అయి ,క్రమంగా మత ,రాజకీయ సాంఘిక వేదాంతాల పట్ల ఆసక్తి వృద్ధి చేసుకొని ప్రజాసంక్షేమమే ధ్యేయంగా జీవించాడు . .

సకల మతాసక్తి –సంఘ సంస్కరణాభిలాష

హి0దూ వేదాంతం కొరాన్ బైబిల్ లను ఆసక్తిగా అధ్యయనం చేసి ఆకళింపు చేసుకొన్నాడు వెంకట రావు .హిందూ ధర్మం పై అమితాసక్తి కలిగి హిమాలయాలకు వెళ్లి అక్కడి ప్రసిద్ధ స్వాముల వద్ద విశేషాలు గ్రహించాడు .రెండు సార్లు బర్మా శ్రీలంకలను సందర్శించి బౌద్ధ ధర్మ పారమ్య౦ ఎరిగాడు .శారీరక ,మానసిక స్వచ్చత ను1884 లో పొందాడు .దేవాలయాలలో ,స్నేహితుల ఇళ్ళలో జరిగే  దేవా దాసీ నృత్యాలను చూడటానికి వెళ్ళటం మానేశాడు .స్వర్గీయ రావు బహదూర్ ఎ.సభాపతి మొదలియార్ తో కలిసి వేశ్యా నృత్యనిషేధం పై పోరాటం చేశాడు .పిలిచినా ,పిలవక పోయినా దేవాలయాలలో ఉత్సవాల సందర్భం గా ఏర్పాటు చేసే వేశ్యా నృత్యాలకు వెళ్లి ,సంఘం లో పతితలైన వారిని ఈ రొంపిలోకి దించటం అన్యాయం అని ఉపన్యాసాలిచ్చి దాన్ని మాన్పించే ప్రయత్నం చేశాడు .ఇది ప్రజలలో గొప్ప ప్రభావం  కలిగించి క్రమంగా దేవ దాసీ నృత్యాలుబళ్ళారి లో కనుమరుగై పోయాయి .

రాజకీయ ప్రవేశం

లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థలను విస్తృత పరచే చట్టాన్ని తెచ్చాడు .సభాపతి మొదలియార్ తన వైశ్య బంధువులను వీటిలో ఎన్నికలలో పాల్గొని బాధ్యతలు స్వీకరించమని హితవు చెప్పాడు .ఆయన మాట మన్నించి ఎన్నికలలో నిలబడి గెలిచి పదవులు చేబట్టి రాణించారు .1884 లో బళ్ళారి లో  వెంకట రావు గెలిచి బొంబాయి కి వెళ్లి రిప్పన్ పదవీ విరమణ సందర్భం గా జరిగిన పెద్ద బహిరంగ సభలో పాల్గొన్నాడు .అక్కడ అనేక సభలలో పాల్గొని అక్కడ రెండు సంస్థలను ఏర్పాటు చేయటానికి అందరూ అంగీకరించారు అందులో ఒకటి ‘’భారత జాతీయ కాంగ్రెస్ ‘’అనే రాజకీయ సంస్థను ఏర్పాటు చేయటం ,రెండవది ‘’సోషల్ కాన్ఫరెన్స్ ‘’అనే సాంఘిక సంస్థ ఏర్పాటు . 1, 2, 3, 4 ,5, 7 కాంగ్రెస్ సభలకు ఆ తర్వాత 7 కాంగ్రెస్ సభలకు హాజరయ్యాడు .1884 నుంచి సంవత్సరం లో రెండు ,మూడు నెలలు భారత దేశమంతా ,సిలన్, బర్మా మొదలైన దేశాలు పర్యటించిఅక్కడి జన జీవన పరిస్తితులు ,దేవాలయాలు మసీదులు చర్చి లు  ,ప్రాచీన సంస్కృతులను ,ఆర్కి టేక్చర్ ను సందర్శించి ,ప్రజలతో కలసి మెలసి అన్నీ అర్ధం చేసు కొన్నాడు .

ఆధారం -8-7-16 న బళ్ళారి నుంచి శ్రీ కోలాచలం అనంత ప్రకాష్ గారు నాకు శ్రీ వెంకట రావు గారిపై ఆంగ్లం లో రాసిఉన్న జిరాక్స్ కాగితాలు కొరియర్ లో పంపారు .వారెవరో నాకు అసలు తెలియదు .పంపిన కాగితాలపై వారి ఫోన్ నంబర్ ఉంటె ఫోన్ చేశాను .చక్కని తెలుగులో మాట్లాడారు .మల్లి నాదసూరి  వంశ0 కోలాచలం వంశపు వాడినని ,తాను బళ్లారిలో లాయర్ నని చెప్పారు  మహా మహోపాధ్యాయుడైన సూరి అపార పాండిత్యాన్ని గూర్చి ,సంస్కృత పంచ కావ్యాలపై మల్లినాద సూరిరాసిన వ్యాఖ్యానాన్ని గురించి ముచ్చటించుకోన్నాం .మల్లినాద సూరి సమగ్ర జీవిత చరిత్ర తయారు చేస్తున్నామని నాలుగైదు నెలలలో వెలువరిస్తామని చెప్పారు .మన సరసభారతి పుస్తకాలు పంపిస్తున్నానని చెప్పిమర్నాడే 9-7-16 న రెండు వందలు ఖర్చు చేసి వారిచ్చిన అడ్రస్ కు పంపాను .కాని పుస్తకాలు అందాయో లేదో తెలీదు .జులై చివర్లో ఆగస్ట్ లో రెండు సార్లు ,ఇవాళ ఈ వ్యాసం రాయ బోయే ముందు వారిచ్చిన సెల్ నంబర్ కు ఫోన్ చేశాను .కాని ఎవరో లిఫ్ట్ చేసి కన్నడం లో మాట్లాడుతూ రాంగ్ నంబర్ అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది .వారిచ్చిన అడ్రస్

కోలాచలం అనంత ప్రకాష్ ,లాయర్ ,80,Gooty Kalappa Compound ,అనంత పూర్ రోడ్ ,బళ్ళారి -583101  -కర్నాటక

సెల్ నంబర్ -0 94,94,23,60,84

సశేషం

మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -8-9-16 –ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మా ఇంట్లో 4-9-16 ఆదివారం సాయంత్రం -శ్రీ సూరి ఆంగీరసశర్మ గారు ,కుమారుడు

మా ఇంట్లో 4-9-16 ఆదివారం సాయంత్రం -శ్రీ సూరి ఆంగీరసశర్మ గారు ,కుమారుడు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

విశ్వ విఖ్యాత నైరుప్య చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ రామారావుకు ఘన సత్కారం

IMG-20160902-WA0026విశ్వ విఖ్యాత నైరుప్య చి

త్ర కళాయశస్వీ పద్మశ్రీ రామారావుకు ఘన సత్కారం

నేటి విద్యార్ధులు చదువుతోపాటు కళలపట్ల మక్కువ చూపాలని, నైరుప్యంగా ఎదగాలని విశ్వ విఖ్యాత చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ ఎస్వీ రామారావు అన్నారు. గురువారం నాడు సరసభారతి మరియు శ్రీశ్రీనివాస విద్యాసంస్థల సంయుక్త అధ్వర్యంలో నిర్వహించిన సత్కర సభలో రామారావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నాటి భారతీయులైన రవీంద్రనాథ్, హరగోవింద్ ఖురానా , రాధాకృష్ణ, చంద్రశేఖర్లకు నోబుల్ అందినాయని నేటి యువత దానిని అందిపుచ్చుకోవడంలో వెనుకంజలో ఉన్నారని తెలిపారు. విద్యార్ధులు తమ సమయాన్ని గ్రంధలయలల్లో ఎక్కవ సేపు గడిపితే జీవితం తెలుస్తుందని, కానీ యువత ఉద్యోగాలకోసం ఉపయోగపడే విద్యనే అభ్యసిస్తున్నరన్నారు.
సభలో శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామారావు లాంటి పెద్దలను చూసి య

వత కళల పట్ల అధ్యయనం చేయాలనీ, చదువుతో పాటు విద్యార్ధులకు కళలను విద్యాసంస్థలు ప్రోత్సాహం అందించాలని సూచించారు.
రియో ఒలింపిక్స్లో రజిత,కాస్య పతకాలు సాధించిన సింధు, సాక్షిలను ఆదర్శంగా తీసుకోవాలని, అలంటి క్రీడలు, కళలు జోలికి నేటి విద్యార్ధులు ఆసక్తి కనబరచడం లేదని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రామారావు లాంటి చిత్రకారులు మన కృష్ణాజిల్లా, రాష్ట్రానికి దేశానికి తమ చిత్రలేఖనం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం గొప్ప విషయమని అన్నారు. అనతరం పద్మశ్రీ రామరావుని శాసనమండలి సభ్యులు రాజేంద్రప్రసాద్, సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీ శ్రీనివాస విద్యాసంస్థల చైర్మన్ పరుచూరి శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన రావు. ఎం పి టి సి ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసరనేని మురళి ఘనంగా సత్కరించారు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విశ్వ విఖ్యాత నైరూప్య చిత్ర్రకళా యశస్వి పద్మశ్రీ ఎస్ వి రామారావు గారికి ఆత్మీయ సత్కారం

విశ్వ విఖ్యాత నైరూప్య చిత్ర్రకళా యశస్వి పద్మశ్రీ ఎస్ వి రామారావు గారికి ఆత్మీయ సత్కారం

by gdurgaprasad

విశ్వ విఖ్యాత నైరూప్య చిత్ర్రకళా యశస్వి పద్మశ్రీ ఎస్ వి రామారావు గారికి ఆత్మీయ సత్కారం

సరసభారతి-సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు 95 వ సమావేశంగా స్థానిక శ్రీనివాస విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల (అమెరికా )సౌజన్య సహకారం తో శ్రీనివాసకళాశాల సెమినార్ హాల్ నందు

విశ్వ విఖ్యాత నైరూప్య చిత్రకారులు కవి ,రచయిత విశ్లేషకులు  పద్మశ్రీ ఎస్ వి రామారావు గారికి

1-9-2016గురువారం  మధ్యాహ్నం 2- 30 గం లకు ఆత్మీయ సన్మానం నిర్వహిస్తున్నాము

ముఖ్య అతిధిగా శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ (శాసనమండలి సభ్యులు )గౌరవ అతిధిగా డా.శ్యాం కుమార్ లు పాల్గొనే ఈ ఆత్మీయ సత్కార సభకు సాహిత్యాభిమానులు కళా హృదయాలు విచ్చేసి జయ ప్రదం చేయ ప్రార్ధన

గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

పరుచూరి శ్రీనివాస రావు –ప్రిన్సిపాల్ ,శ్రీనివాస విద్యా సంస్థలు –ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం

నా దారి తీరు -100

మేడూరు లో ఉద్యోగం

2-9-1989 న చిలుకూరి వారి గూడెం లో చేరిన నేను 22-8-90 సాయంత్రం విధులనుండి విడుదలై ,రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కనుక జాయినింగ్ టైం ఉండదు కనుక మర్నాడే  మేడూరు హైస్కూల్ లో 23-8-90 ఉదయం చేరాను .

సుమారు సంవత్సర కాలమే చిలుకూరి వారి గూడెం లో పని చేసినా ,ఆ స్కూల్ అన్నా ఆ ఊరు అన్నా విపరీతమైన అభిమానం ఏర్పడింది .మళ్ళీ ఎప్పుడైనా అక్కడే చేయాలని అనిపించేది .అంతమంచి వాతావరణం ఏర్పడి ,అనుబంధం శాశ్వతమయింది .అందుకే ఈబాద .రాను పోనూ ప్రయాణపు ఇబ్బంది తప్ప అక్కడనాకు యే ఇబ్బందీలేదు స్టాఫ్ సహకారం ,పిల్లల ప్రవర్తన కమిటీ వాళ్ళ చేయూత అన్నీ అందుకొని స్కూల్ రూపు రేఖలనే మార్చగాలిగాను .ఇంత గొప్ప అభి వృద్ధి చేయగాలుగుతానని నాకే తెలియదు అన్నీ కుదిరి అలా జరిగింది .ఇందులో నాకు సహకరించిన లెక్కల మేష్టారు శ్రీ పురుషోత్తమా చారి సెకండరీ మాస్టారు శ్రీ శేషగిరి రావు హాస్టల్ వార్డెన్ శ్రీ రాఘవుల చేయూత జీవితం లో మరువ లేనిది .నేను అక్కడి నుంచి బదిలీ అయి వచ్చినా, వీళ్ళు నాతో ,మా కుటుంబం తో అదే బాంధవ్యాన్ని కొనసాగించారు .లెక్కల మాస్టారి తల్లిగారు భార్య నా యెడల చూపిన ఆప్యాయత మరువలేను .పై మూర్తిత్రయం బెజవాడ వైపు వచ్చినప్పుడల్లా ఉయ్యూరు వచ్చి మా ఆతిధ్యం పొంది వెళ్ళేవారు వాళ్ళను చూస్తే మహదానందంగా ఉండేది .పూర్వం మానికొండలో రాజుగారు గరుడాచలం గారు ,రాఘవ రావు లు యెంత అభిమానంగా ఉండేవారో అదే ఇప్పుడు కనిపించింది .జననాంతర సౌహృదం అనిపిస్తుంది ఆలోచిస్తే .అలాగే మేము మైలవరం వైపు వెళ్ళినా వాళ్ళను కలిసి మాట్లాడకుండా ఉండే వాళ్ళం కాదు .మా మూడో వాడు మూర్తి చిలుకూరి వారి గూడెం దగ్గర రామ చంద్రాపురం లో ఆర్ ఏం పి డాక్టర్ గా ఉన్నప్పుడు ,మైలవరం దగ్గర గణపవరం లో ఉన్నప్పుడు కారు మీదమా అక్కయ్య బావలతో  మైలవరం లో రాఘవులుగారిని పుల్లూరులో ఆచార్యుల గారి ఫామిలీ ని అక్కడికొచ్చిన శేష గిరి రాగారినీ చూసి కిన్నెర సాని ,భద్రాచలం ,నెమలి ,జమలాపురం ఒక సారి వెళ్లాం మరో సారి మా అమ్మాయి మేము కలిసి వెళ్లి వీళ్ళందర్నీ చూశాం .అలా చాలాకాలం కొనసాగింది .

తర్వాత శేషగిరి రావు గారు నన్ను మళ్ళీ చిలుకూరి వారి గూడెం ట్రాన్స్ ఫర్ చేయించే ప్రయత్నం శాసనసభ్యులు శ్రీ కోమటి భాస్కర రావు గారిద్వారా చేస్తానని రిక్వెస్ట్ రాసి ఇమ్మని ,రెండు మూడు సార్లు నేను అడ్డాడలో ఉండగా వచ్చి అడిగారు .అది ఇక జరగని పని అని ఆయన్ను సమాధాన పరచి పంపేవాడిని .ఆయనకు హెడ్మాస్టర్ బండి రామారావు కు కెమిస్ట్రీ కుదరలేదని ఆయన మాటల్లో తేలింది స్కూల్ డబ్బు స్వాహా చేస్తున్నాడని కూడా చెప్పిన జ్ఞాపకం గుడివాడలో ఆయన బ్రహ్మాండమైన ఇల్లు కట్టి గృహప్రవేశానికి స్వయంగా ఆహ్వానిస్తే వెళ్లాను అక్కడ లెక్కలమేస్టారు వార్దేన్ గారు మళ్ళీ కలిశారు .తర్వాత శేషగిరి రావు గారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని లేక్కలమేస్టార్ ఫోన్ చేస్తే బెజవాడ విజయ టాకీస్ ఎదురుగా ఉన్న హాస్పిటల్ లో ఇన్సెంటివ్ కేర్ లో ఉండగా చూసొచ్చాను .కాని ఆయన ఆతర్వాత రెండుమూడు రోజులకే చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పాడు గుడివాడలో కార్యక్రమాలు చేశారు కాని నేను వెళ్ళలేక పోయాను వీరు భొట్ల శేషగిరిరావు గారి అన్నగారికి ఉయ్యూరు లో ఉన్న వేమూరు దుర్గ,సుబ్రహ్మణ్యం గార్ల అమ్మాయినిచ్చి ద్వితీయం చేశారు .ఆ సందర్భం గా రెండు వైపులవారూ నన్ను సంప్రదించి మంచి చెడ్డలుతెలుసుకొన్నారు ఈ విధంగా ఉయ్యూరు బంధం ఆయనకు ఏర్పడింది

లెక్కల మాస్టారు ఏం .పురుషోత్తమా చారి గారి తో స్నేహం అసలెన్నటికీ మరుపు రాదు ఆయన కుటుంబం తో నూ అంతే .ఇదెక్కడి బంధమో ఆశ్చర్యమేస్తుంది .ఆచారి గారి తల్లిగారి ఆరోగ్యం బాగా ఉండేదికాదు భార్య చాలా సన్నగా అనారోగ్యంగా నే ఉండేవారు .కాని ఆదరణకు స్నేహానికి వాళ్ళనే చెప్పుకోవాలి ఆడపిల్ల మగ పిల్లాడు చిన్నక్లాసులు చదువుతున్నారు .దాదాపు 8 ఏళ్ళక్రితం ఆచారి గారు చనిపోయారని వాళ్ళబ్బాయి ఫోన్ చేశాడు .వెళ్ళలేక పోయాను .తర్వాత వాళ్ళ అమ్మాయి వివాహం మైలవరం లో చేస్తున్నామని శుభలేఖ పంపి వాళ్ళబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు  .అదే ముహూర్తానికి బెజవాడలో మల్లాది వెంకటేశ్వర్లు కూతురు వివాహం .వివాహం చూసి అక్షంతలు వేసి దీనికి హాజరైన దంటు వారబ్బాయి ,వెంపటి శర్మగారబ్బాయిలను చాలా రోజుల తర్వాత చూశాం .అక్కడికి మమ్మల్నిద్దర్నీ చూడటానికి వచ్చినఆత్మీయులు కవి కధకులు  శ్రీ గంధం వేంకాస్వామి శర్మ గారిని చూశాం అప్పటికే 85 ఏళ్ళ వృద్దు ఆయన .’’ఎందుకండీ శ్రమ పడి వచ్చారు ?మేమే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళం కదా ‘’అన్నాను .ఆయన నవ్వి ‘’మీ ఇద్దర్నీ చూస్తే పార్వతీ పరమేశ్వరులని పిస్తుంది అందుకే దర్శనం కోసం వచ్చాను ‘’అన్న ప్రేమాభిమాన మూర్తి వారు .ఇదే వారిని చూసిన చివరి సారి .ఆ తర్వాత మేము అమెరికా వెళ్ళటం అక్కడ మేము ఉండగానే వెంకాస్వామి శర్మగారు చనిపోవటం జరిగింది

సత్యనారాయణ పురం లో మల్లాది  వెంకటేశ్వర్లు కూతురు పెళ్లి నుంచి సరాసరి బస్ స్టాండ్ కు వెళ్లి మైలవరం బస్ ఎక్కి ఫంక్షన్ హాల్ కు చేరేసరికి సుమారు మధ్యాహ్నం 2 అయింది వేలాది మంది వచ్చి భోజనాలు చేసి వెడుతున్నారు మేము లేక్కలమాస్టారి భార్యను పలకరించి పెళ్లి కూతురు కు కానుక అందజేసి ఆశీర్వ దించి వాళ్ళబ్బాయి అబ్బాయాచారి మా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట వివాహ భోజనం చేసి మళ్ళీ బస్ ఎక్కి బెజవాడ మీదుగా ఉయ్యూరు చేరాం ఇన్ని జ్ఞాపకాలు మాకు లేక్కలమేస్తారి కుటుంబం తో ఉన్నాయి పిల్లలిద్దరూ మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లోనే బి టేక్ చదివి బెంగుళూర్ లో ఉద్యోగాలలో ఉన్నారు మంచి అభివృద్ధి సాధించారు లెక్కల మేస్టారి మంచి మనసే ఈ అభివృద్ధికి కారణం వారి అమ్మగారి ఆశీస్సులు విశుద్ధ హృదయం తోడ్పాటుగా నిలిచాయి .

అంతకు ముందు మైలవరం గర్ల్స్ స్కూల్ హెడ్ మిస్త్రేస్ విజయ లక్ష్మి గారి పదవీ విరమణకు ఆహ్వానిస్తే నేనూ  వెళ్లాను అప్పుడు ఆచారిగారు కలిసి ఇంటికి తీసుకు వెళ్ళారు .

మేడూరు స్కూల్ విశేషాలు

ఉయ్యూరు లో 23-8-90 ఉదయం 7 గంటలకేఇంట్లో భోజనం చేసి సరాసరి బెజవాడ మేడూరు బస్ ఎక్కి ,తాడంకి కపిలేశ్వరపురం వీరంకిలాకు పమిడిముక్కల మీదుగా మేడూరు చేరాను .ఉదయం విధుల్లో చేరినట్లు సంతకం పెట్టాను .పెద్దస్కూల్ .సుమారు ౩౦౦ మంది పిల్లలు .అన్నీ రెండు సెక్షన్లు .స్టాఫ్ అందరూ కొత్త నా ముందు ఇక్కడ పనిచేసిన శ్రీ జి ఎస్ యెన్ చౌదరి కూడా బిఎడ్ లో నా ట్రెయినింగ్ మేట్ అవటం మరో తమాషా అతన్ని పునాది పాడు వేశారు .ఒక సారిస్కూల్ అంతా కలయ తిరిగా .మంచి బిల్డింగ్ లున్నాయి .పెద్ద ఆటస్థలం  మంచి లేబరేటరీ దానిలోనే పాఠాలు చెప్పటానికి వీలైన విశాలమైన హాలు ,పైన లైబ్రరీ కం కామన్ హాల్ ఉంది లైబ్రరీలో చాలా పుస్తకాలు మంచి పుస్తకాలు ఉన్నాయి లైబ్రేరియన్ శ్రీమతి  కోటమ్మ అనిజ్ఞాపకం ఇక్కడే ఉద్యోగం లో చేరి నాన్ స్టాప్  గా పని చేస్తోంది చాలా మంచి ఆవిడ అనిపించింది .పెద్దావిడే .స్కూల్ ముందు వెనకా ఆట స్థలం చుట్టూ కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి పెద్ద ఊటబావి దానికి ఎలక్ట్రిక్ మోటారు ఓవర్ హెడ్ వాటర్ టాంక్ అన్నీ ఉన్నాయి .కొబ్బరి  పోషణకు ప్రభుత్వం డబ్బు అందజేస్తుంది మూడు నేలలలకోసారి జమాఖర్చులు పంపాలి ఉయ్యూరయ్య అనే జూనియర్ గుమాస్తా స్కూల్ లెక్కా డొక్కా తోపాటు దీన్నీ చూస్తాడు .నమ్మకస్తుడు భయస్తుడు కమితీవారి తలలో నాలుక కూడా .కొంతా స్థలం లో వరిసాగు కూడా ఉంది గొప్ప  .సీనియర్ గుమాస్తా సుబ్రహ్మణ్యం గారని గుర్తు ఉయ్యూరులో మాధవరావు అనే ఆయన తోడల్లుడు .గంభీరంగా ఉంటాడు .సైన్స్ మేస్టర్ శ్రీసుబ్రహ్మణ్యం  నాతొ పెనమకూరులో చేశాడు .భార్య గ్రేడ్ టు తెలుగుపండిట్ .లెక్కల మాస్టారుశ్రీ ప్రసాద్ అని చాలా సమర్ధుడు ,మంచి టీచర్ .తలలో నాలుక .స్కూల్ ఇంచార్జ్ హెడ్ మాస్టర్ ఆయనే ఇంకో పోస్ట్ లో ఎవరో ఒకరు రావటం వెళ్ళటం జరిగేది .కనుక బాధ్యతఅంతా ప్రసాద్ గారిమీదే ఉండేది .సీనియర్ తెలుగు మేష్టారు శర్మగారు .దగ్గరలో ముళ్ళపూడి వారు స్కూల్ ఫంక్షన్ లన్నీ ఈయనే నిర్వహించేవారు .వాళ్ళబ్బాయి టెన్త్ లో ఉన్నాడు చురుకైనవాడు పబ్లిక్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు నాకు బాగా ఇష్టమైన శిష్యుడు చాకు అంటామే అలాంటి షార్ప్ నెస్ ఉన్నవాడు ఆయన కుటుంబం లో అందరూ తెలుగు పండితులే ఒక అన్న పెనమకూరు లో తెలుగు పండిట్ .ఇంకో ఆయన కపిలేశ్వరపురం లో అలా .సోషల్ మేష్టారు మస్తాన్ గారు .ఇక్కడి వాడే  హిందీటీచర్ లేడీ .ఉయ్యూరు లనుండి వస్తారు కోటలో అద్దెకుంటున్నారు భర్త తమిరిశ దగ్గర సోషల్ మేష్టారు ఇద్దరు ఆడపిల్లలు .పేరు తూటుపల్లి సావిత్రి అనిజ్ఞాపకం .సెకండరీ గ్రేడ్ లలో లంకపల్లి ఆయన నల్లగా పొట్టిగా ఉండేశ్రీరామ మూర్తిగారు .మా మామయ్యా వాళ్ళ పొలం కౌలుకు చేస్తానని ఒకటి రెండు సార్లు ఉయ్యూరులో నన్ను చూశానని గుర్తు చేసుకొన్నారు  .ఈయనే స్టాఫ్ సెక్రటరి .అందర్నీ ఒప్పించగలిగే ఓర్పూ నేర్పూ ఉన్నవారు .భీష్మ పితామహుడు ఒకాయన రెడ్డియ్యగారు ఉండేవారు .క్రాఫ్ట్ మాస్టర్ ప్రకాశ రావు గార్డెనింగ్ .’’దేవదాసు ‘’.అటెండర్ అర్జున రావు .రుద్రపాక వాడు ఇక్కడే సెటిల్ అయ్యాడు నైట్ వాచ్ మన్ ఆ ఊరివాడే కోటయ్య .సీనియర్ డ్రిల్ మాస్టారు శ్రీ సుబ్బారావు కపిళేశ్వరపురం వాడు రెండో డ్రిల్ మాస్టారు పమిడిముక్కలనుంది వచ్చేవారు మెతక మనిషి .నా దగ్గరే రిటైర్ అయ్యాడుసహృదయుడు  లాబ్ అసిస్టంట్ ప్రసాద్ –అతనికొడుకు 9 లో ఉన్నాడు స్కూల్ లో సంచాయిక ‘’అనే పిల్లల పొదుపు పధకం నేనెక్కడ పని చేసినా సమర్ధంగా నిర్వహించాను ఇక్కడ దాన్ని ప్రసాద్ చూస్తున్నాడు .వార్షికోత్సవం నాటికి ఎవరు ఎక్కువ పొడుపు చేస్తే వారికి బహుమతి ఇచ్చేవాళ్ళం .బాగా తెలివిగలవాడు సహృదయుడు .కొద్దికాలానికి గుమాస్తా సుబ్రహ్మణ్యం గారు బదిలీ అయి, లోయ శంకర రావు వచ్చాడు జగజ్జన్త్రీ మాటల గారడీ వాడు పని కూడా స్పీడ్ గా చేసేవాడు బాగా రాజకీయ పలుకుబడి ఉన్న వాడు .నాకు బాగా ఉపయోగ పడ్డాడు .అలాగే కొద్దిమంది బదిలీ అవటం కొత్తవాళ్ళు రావటం జరిగేది .

సాయంకాలం స్టాఫ్ సెక్రెటరి స్టాఫ్ సమావేశం ఏర్పాటు చేశారు తేనీటి విందు ఇచ్చారు .నన్ను నేను పరిచయం చేసుకొని అందరి పరిచయం చెప్పించి ,అందరం కలిసి స్కూల్ అభి వృద్ధికి పని చేద్దాం యిలా చేస్తా అలా చేస్తా అని నేను చెప్పను సంవత్సరం చివరికి మనం ఏం చేశామో తెలుసుకొందాం అని చెప్పాను ఒక పావుగంటలో స్టాఫ్ మీటింగ్ పూర్తీ చేశాను స్కూల్ జనరల్ డిసిప్లిన్ అంతా డ్రిల్ మాస్టర్ సుబ్బా రావు గారే చూసేవారు .రోజూ సమయానికి అసెంబ్లీ నిర్వహించటం ,లేట్ గా వచ్చిన వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వటం అన్నీ పకడ్బందీ గా చేసేవాడు .టీచర్ లలో బాడ్మింటన్  ఆడే వాళ్ళలో నేనూ తెలుగు మాస్టారు డ్రిల్ మాస్టారు , సైన్స్ ,లెక్కల మేస్టార్లు ఉన్నాం మేమందరం వాలీబాల్ కూడా ఆడేవాల్లమే కనుక స్కూల్ అయ్యాక ఒక గంట ఆడుకొని అప్పుడు బయల్దేరేవాళ్ళం

మళ్ళీ ప్రయాణం తిప్పలు

మేడూరు ఉయ్యూరుకు దగ్గరే .సుమారు 15 కిలోమీటర్లు కాని రోడ్డు బాగుండదు బస్ ఫ్రీక్వెంసి లేదు .ఏదో రకంగా వీరంకి లాకు చేరితే అక్కడినుండి వెళ్ళాలంటే ‘’టంగు’’ తెగేది .ఏదో తంటాలుపడి పమిడిముక్కల చేరితే అక్కడి నుండి స్కూల్ పిల్లల సైకిల్ మీద ఎక్కి వెళ్ళాలి లేక పోతే లెఫ్ట్ అండ్ రైట్ రెండుకిలోమీటర్లు   అలాగే సాయంకాలం 5 గంటలకే మేడూరు నుంచి విజయవాడ బస్ .అది మిస్ అయితే ఆరున్నరకో ఏడుకొ కాని మళ్ళీ బస్ లేదు .ఇంటికి చేరేసరికి ఎనిమిది దాటేది .ఒక రకంగా నాపని’’ పెనం మీంచి పొయ్యిలోకి ‘’అన్నట్లు అయిందేమో అనిపించింది .

సాయంకాలం బస్ కోసం స్కూల్ దగ్గరే ఉన్న యలమంచిలి వెంకటేశ్వరరావు గారు అనే రిటైర్డ్ సెకండరీ గ్రేడ్ మాస్టారి అరుగులపై ఆయనతో కబుర్లు చెప్పుకోవటం ఆయన శ్రీ పి శ్రీరామ మూర్తి గారి మనిషి .కబుర్లు బాగానే చెప్పేవారు ఎన్నో పాత విషయాలు తవ్వుకొని మాట్లాడుకొనేవాళ్ళం అలాగే ఆ ఊళ్లోనే రిటైర్ అయిన ఒక హిందీ మాస్టారు కూడా ఉన్నారు ఆయనా వెంకటేశ్వర రావే ఆయన ఇక్కడ ట్యూషన్ కింగ్ .

శ్రీ యలమంచిలి రామమోహన రావు గారు

మేడూరు అన్నా మేడూరు స్కూల్ అన్నా శ్రీ యలమంచిలి రామమోహన రావు గారే జ్ఞాపకం వస్తారు ఎవరికైనా మేడూరు లోనే కాదు చుట్టూ ప్రక్క వంద గ్రామాలలో అంతటి మంచి మనిషి .లేరు .మేడూరు గ్రామ సర్పంచ్ గా దాదాపు 25 ఏళ్ళు పనిచేశారు స్కూల్ బిల్డింగ్ కు స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్టించారు .పంచాయితీ భవనం పసువులాస్పత్రి వంటివి అన్నీ వారి వితరణ వలన వచ్చినవే  ఆయన గొప్ప సంస్కారి .మాంచి కాంగ్రెస్ అభిమాని నిజాయితీకి నిర్భీకతకు ప్రసిద్ధి .ఎప్పుడూ తన చేయి పైనే ఉండాలని కోరుకొనేవారు దాన ధర్మాలకు లెక్కేలేదు .శ్రీ కాకాని వెంకటరత్నం గారికి నమ్మిన బంటు ,కాకాని వారు యే ఎలక్షన్ లో నిలబడినా ఖర్చు అంతా రామ మోహన రావు గారిదే దానితో ఎలక్షన్ అయ్యాక ఈ యన పొలం నాలుగో ఐదో ఎకరాలుఖాళీ .అంతమాత్రం చేత వెనకడుగు వేసేవారుకాడు మళ్ళీ ఎన్నికకు మళ్ళీ రెడీ సుక్షేత్రమైన మాగాణి పొలం కాకాని వారికోసం ఎన్నికలార్పణం అయ్యేది .సర్పంచ్ గా గ్రామాన్ని సర్వతోముఖా భి వృద్ధి చేశారు కాని రోడ్డు సౌకర్యం ఎర్పరచుకోలేక పోయారు తారు రోడ్డు గతుకుల రోడ్డే గతి .రావు గారికి రాజకీయ ప్రమోషన్ రావాలని ఆశించారు జనం దానికి ఆయన ససేమిరా అనేవారు నేను శాసన సభకు నిలబడతాను అంటే కాకానికి నిలబడే సాహసం ఉండేదికాదు అంత సాహసం ఈ వీర భక్త హనుమాన్ చేయలేదు ఏనాడూ .చివరికి ఉయ్యూరు మండలానికి ఉపాధ్యక్షులుగా అందరి బలవంతం మీద పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .ఆయన కనబడినా ఆయన పేరు చెప్పినా ‘’చేయెత్తి మహానుభావుడు ‘’అని నమస్కరిస్తారు జనం అదీ ఆయన కున్న కీర్త ప్రతిష్ట ‘అలాంటి రామ మోహన రాగారు నేను మేదూరులో చేరటానికి సుమారు రెండు నెలల ముందు చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రావు  మేడూరు సర్పంచ్ .ఆయన తమ్ముడు ఉయ్యూరు షుగర్ ఫాక్ట్రరీ లోను ,చుట్టూ ప్రక్కలా ప్రసిద్ధుడైన చెరుకు రైతు .పేరు గుర్తు లేదు .స్కూల్ కు సలహా దారు కూడా  ఇదీ నేను చేరిన మేడూరు అక్కడి స్కూలు నేపధ్యం మిగతా వివరాలు తరువాత తెలియ జేస్తా .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-16- ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మట్టి పరిమళం గుబాళించిన చిక్కని చక్కని కవితలే వెన్ను విరిగిన కంకులు

మట్టి పరిమళం  గుబాళించిన చిక్కని చక్కని కవితలే వెన్ను విరిగిన కంకులు

డా మక్కెన శ్రీను గారితో నాకు ముఖ పరిచయం లేదు .కాని వారు నిన్న తమ ‘’వెన్ను విరిగిన కంకులు ‘’నాకు ఆదరంగా పంపారు .రాత్రికే చదవటం పూర్తీ చేశాను .ఇది రైతు కవిత్వం.  కవి  శాస్త్రజ్ఞులు కూడా .కనుక కవిత్వం శాస్త్ర బద్ధంగా కవితాత్మకం గా విషయ వివేచనంగా పండింది .వెన్నులు విరిగినా తరగని కవితా కంకులను పండించింది .డాక్టర్ గారికి హృదయ పూర్వక అభినందనలు తెలియ జేస్తున్నాను .ఇందులో నాకు అందిన సోయగాలను మీకు పరిచయం చేస్తున్నాను

అభివాదం శ్రమవేదం ,ఆర్తనాదం సమ్మోదం అనే నాలుగుభాగాలుగా ఉన్న ఈ కావ్యం  రైతు ప్రశంస ,అతని శ్రమజీవన విధానం ,ఇంత చేసినా గిట్టుబాటుకాక పడే ఆవేదన పెడుతున్న ఆర్తనాదాను వినిపిస్తూనే చర్యలు సక్రమ౦ గా అందరూ తీసుకొంటే వచ్చే సమ్మోదం కూడా సోపాన పద్ధతిలో కవి వివరించారు .నేత జీవుల మీద శ్రీ రాధేయ  లాంటి కవులు అద్భుత కవిత్వం వెలువరించారు .రైతులమీదాశ్రీ కొండ్రెడ్డి వెంకట రెడ్డి వంటివారు రాశారు .వాటిల్లో ఆవేశం ,ఆక్రోశం పాలు ఎక్కువ .దీనిలో సమతూకం నాకు కనిపించింది .నాలుగు పాదాలలో చిక్కని చక్కని కవిత్వం చెప్పారుకవి ఈ నాలుగు భాగాల కు వివరణ ఇచ్చారు-అభివాదం లో రైతు గొప్పతనం మట్టికీ రైతుకూ ఉన్న బాంధవ్యం  వర్ణించానని శ్రమవేదం లో రైతు శ్రమ ఆరాటం  వృత్తిధర్మాలు చెప్పానని ,ఆర్తనాదం లో ప్రకృతి వైపరీత్యాలు నకిలీ విత్తనాలు ఎరువులు పురుగులమందుల వలన కుదేలైన రైతు దీన గాధ తెలియ జేశానని ,చివరగా సమ్మోదం  లో ప్రభుత్వాలు రైతుకు సాయం చేసి వ్యవసాయానికి తోడ్పడాలని సూచించానని తన ప్రణాళిక తెలియ జేశారు

ముందుగా రైతుకు అభివాదం చేస్తూ ‘’సేద్యమంటే బహు చక్కని స్నేహం –మనిషీ పశువు పాడే ఐక్యతా రాగం –ఆకలిని హరించే హలం పాడే గాత్రం ‘’అనటం బహుశా నేనెప్పుడూ వినలేదు చదవలేదని గుర్తు .చాలాసుకుమార భావనలు తగిన పదాలతో వర్ణించి వన్నె తెచ్చారు ‘’వ్యవసాయం ఒక సుమ సంగీతం ‘’అనటం గొప్ప అభి వ్యక్తీ .దున్నటం నుండి గంపలకు పైరు ఎత్తుకోవటందాకా వివరిస్తూకవి ‘’నాగలి భువికి చేసే లేత గాయం –చినుకులు పూసే పట్టికి లేపనం –మొలకలు రైతుకు హరిత దీపం –పంటలు పసిడి సిరుల ప్రతి రూపం ‘’చాలా సుకుమారంగా హృద్యంగా ఉంది పాదం గుర్తులతో పునీతమైన క్షేత్రానికి చేతి స్పర్శ మట్టి స్తోత్రమై మురిసిన ఆకాశం చినికే చినుకుల ఛత్రమై భూమి లిఖించిన సిరి సేద్యపు పత్రమైంది . ఏరువాకే ఆనంద హేల అయిన రైతు జాతి ఏలిక ,పాలిక ‘’అనటం రైతుకిచ్చిన గౌరవం .నెత్తిమీద తలపాగ కిరీటం .నడకలో మహా రాజసం ఒలక బోస్తాడు రైతు రాజు .అతనికి ‘’వడ్లు గొడ్లు ‘’చూస్తే సంబరం ‘’కవి వర్ణించిన రైతు ప్రకాశం జిల్లా వీరన్నపాలెం రైతు అయిన ఆయన తండ్రిగారే అని గ్రహిస్తాం ఆయనే ఆశీర్వదించి రాయమన్న కావ్యం ఇదంతా .

కవినీ రైతునీ ,కాగితాన్నీ నేలను పోలుస్తూ రెండవభాగం శ్రమవేదం ‘’లో ‘’హలాన్ని కలంలా చేత బట్టి –వేదాన్ని సిరాగా జాలువార్చి –చదునైన నేలను కాగితంగా మార్చి – అక్షర సేద్యం చేసే కవి రైతన్నేగా ‘’అంటూ చాలా భావ గర్భిత౦ గా రాశారు కవి .రైతుచేసేది ధర్మ ,కర్మ ,శ్రమ సేద్య యుద్ధాలు హలం తో ,స్వేదం తో ,పొలం తో క్షేత్రం తో వరుసగా ఈ యుద్ధాలు సాగిస్తాడు రైతు అంటే –‘’స్వేదం చిందించిన సేద్య ‘’రూపకం ‘’,వేదం పలికించిన శ్రమ వాచకం ,’’అంతే కాదు శాస్త్ర వేత్త పరిశోధించని జీవన శాస్త్రం . రైతు అనగా ‘’రచయిత లిఖించని పచ్చని కావ్యం అని ప్రక్రియా పరంగానో  ఉత్క్రుస్టుడురైతు అన్నారు ‘’కొడవలి మెడపై పైరు నాట్యాలు ‘’చేస్తాయట .రమ్యమైన మాట .ఏ కార్తికి వాన పడితే పంట ఎలా ఉంటుందో రైతు అనుభవం ,శాస్త్రానుభావాలతో చెప్పారు .’’రేవతిలో సస్య రమ పులకిస్తే ,మృగశిర ముక్కారు పంట ఇస్తుంది కత్తెర వాన కనకం పండిస్తే భరణి వాన ధరణి విరగ బూయిస్తుంది ఆరుద్రలో దరిద్రం ఉండదు పునర్వసులో వాన పుష్ప వర్షమే ,’’అందుకే ‘’కృషీ వలుని కృషికి కార్తెలే హర్షం ‘’

ఉత్తర లో ఊడవటం కంటే ఏడవటం మంచిది ,మూల కురిస్తే ముంగారు పంట ,కృత్తికలో విత్తితే కుత్తుక నిండదు . ఆశ్లేష వర్షానికి అరికాలు తడవదు ,విశాఖ వర్షం విషం ,పుబ్బలో చల్లితే దిబ్బలో పోసినట్లే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని వ్యవసాయం చేయాలని హితవు .ఇది రైతు పంచాంగం గా భావించాలి . రైతు అంటే ‘’మానెడు చల్లి పుట్టెడు సృష్టి కర్త ‘’’’హాలికుడు నిలువెత్తు స్వేద దీపం ‘’రైతు రోజూ చూసేది ‘’నవజాత మేఘాలనే –నమ్మేదేప్పుడూ వాతావరణాన్నే ‘’అహం చేరని సనాతన సస్యాలయ౦ ,’’రైతే ఒక వ్యవసాయ విశ్వ విద్యాలయం ‘’ఒకప్పుడు రైతు ‘’సాయం చేసే సేద్య రూపం .మరి ఇప్పుడు ‘’సాయం లేని వ్యవసాయం  ఒకప్పుడు సంబురాల వ్యవసాయం .ఇప్పుడుసాయం లేని  ఎగ తాళికి గురైన ‘’ఎగసాయం ‘’అయింది

మూడవ భాగం ‘’రైతు ఆర్తనాదం ‘’వినిపించారుకవి .ఇప్పటి వ్యవసాయం ‘’భరోసా  ,భద్రతా లేనిది గజి బిజీ యై విరగ కాచి వరదపాలై ,ఈన గాచినక్కల పాలై నా ‘’సేద్యపు యుద్ధానికి రైతెప్పుడూ సిద్ధమే ‘’పుట్ల కొద్దీ పండించిన అన్నదాత నేడు పట్టెడన్నం కోసం ,ఎదురు చూస్తున్నాడు .రైతు నడుం విరిగింది .ఋతుపవనాలు కను చూపులో కానరాక మేత లేక బక్క చిక్కిన పశువులు ,ఎరువు చిమ్మిన బీడు భూములై వాపోతున్నాడు ‘’చేదకు అందని ఎండిన  బావి  –చేను పండుట ఇక ఎండ మావి ‘’అని నిర్ణయించుకొని ,అన్నీ కుదువపెట్టి విత్తి నా ఫలితం లేక నకిలీ విత్తనాలు ఎరువులకు బలై చితికి చేరువయ్యే కట్టె అయ్యాడు అందుకే చివరికి

‘’పగ్గం కాడి మేడి వదలబడి –కొడవలి నాగలి మూలన పడి –రైతన్న అడుగు మెల్లగా తడబడి –చరిత్రలో కలిసిపోఎను సాగుబడి ‘’అని రైతు దీన హీన చరిత్రను కళ్ళముందు ఉంచారు .ప్రపంచీకరణం తెచ్చిన గొప్ప మార్పు రైతు కూలీఅవటం కమత ౦ సెజ్ లు గా మారటం .తాను పండించిన పంటకు ధర నిర్ణయించే అధికారం లేక ,వ్యవసాయం జూదంగా మారింది ‘’ దేశాన్ని కాచే సూరీడికి పొద్దు పొడవటం లేదు ‘’ఆర్దికమే అన్నీ నిర్ణయిస్తుంటే హార్దిక బంధాలు పటా పంచలవుతుంటే నిబద్ధతకే తిలోదకాలిచ్చే రోజు –‘’మానవీయత మరువని రైతే రాజు ‘’అంటారు కవి .

ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో కవి శాస్త్ర వేత్తగా ఆలోచించి చెప్పారు ‘’సమ్మోదం ‘’అనే 4 వ భాగం లో

‘’సాగు దిగుబడి నిష్పత్తిలో సామ్యం –దిగుమతి ఎగుమతుల్లో భాగ స్వామ్యం –ధరల నిర్ణయాన రైతులే ముఖ్య పాత్రలు –నెరవేరాలి స్వామినాధన్ సస్య సిఫార్సులు అని సూక్తి ముక్తావళి చెప్పారు

చివరగా రెండు బంగారు కవితలతో రైతు కావ్యానికి పుస్తకానికి ముగింపు చాలా అర్ధవంతంగా పలికారు కవి

‘’నాలుగు వేదాలు విశ్వ జనితం –నాగేటి నాదాలు రైతు జీవితం –శ్రమ వేదమే జాతి నినాదం –స్వేద వాదమే జనతకు నాదం ‘’అని రైతు గీత ‘’సేద్యపు భగవద్గీత చెప్పారు .చివరగా

‘’రైతు తలగుడ్డవ్వాలి జాతి పతాకం –ఎర్ర కోట పై ఎగరాలి సేద్య కపోతం –రైతు రంగా ఆశయాలే రైతుకు భోజ్యం –గాంధీజీ కన్నకలలే గ్రామ స్వరాజ్యం ‘’అంటూ ఎంతో ఆశాభావంగా ‘’వెన్ను విరిగిన కంకుల్ని మళ్ళీ ‘’వెన్ను విరుచుకొనే లాగా చేయాలని ఆరాట పడ్డారు కవి శ్రీ మక్కేన శ్రీను .

ముందుమాటలలో కవి తండ్రి కావ్యాన్ని అంకితం పొందిన  శ్రీ మక్కేన రామ సుబ్బయ్య గారు ‘’హలమే మా శ్రీను కలం ‘’అని వెన్ను తట్టి ప్రోత్సహించారు ఇంట్లో కవ్వం చేలో కర్రు కదిలితే కరువే ఉండదని అందుకే రైతు రాజు  రారాజు అయ్యాడని ,ఇప్పుడు అంతా ఉల్టా అయిందని బాధ పడ్డారు .హైదరాబాద్ ‘’ఇగ్నో ‘’లో అసోసియేట్ ప్రొఫెసర్ డా పి వి కె .శశిధర్ ‘’జీవనకవనం ,మట్టి కుదుళ్ళు ‘’,భావ తరంగం రాసి ప్రశంసలు పొందిన శ్రీ మక్కేన సార్ కవి రాసిన ఈ కవితా సంపుటి అందరి మన్ననలు పొందాలని ఆశించారు ‘’తన పదవీకాలం లో చాలాభాగం వ్యవసాయ రంగం లో నే గడిచిందని శ్రీను గారు ‘’Fully exploited the versatility of the Telugu Language ‘’అని ఆశీర్వదించారుఆంద్ర ప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రెటరి భు భాషా కోవిదులు  డా మోహన్ కందా

‘’మక్కేన శ్రీను గారు –చెక్కిన బొమ్మ ఈకావ్యం ‘’అని’’ ఆయన నడిచే నవ్య సేద్యాలయం ‘’అని కీర్తిస్తూ ‘’విత్తనం మొలిస్తే గేయం –కరువు నవ్వితే గాయం –రైతు బతికితే అజేయం –రైతు దుఖం ప్రభుత్వాలకు పరాజయం ‘’అంటూ హెచ్చరిక జారీ చేశారు ఇంకొల్లు ,తెలుగు అధ్యాపకులు కవి ,రచయిత  .డా బీరం సుందర రావు ‘’.నామాట ‘’అంటూ కవి గారు తానుఆచార్య రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం స్నాతక స్నాతకోత్తర డాక్టోరల్ పట్టాలు పొంది ,తిరుపతి పశువైద్య విజ్ఞాన కళాశాలలో చదువుకోన్నానని ,ఉద్యోగ ధర్మం రచనా శక్తికి అడ్డుగా నిలిచిందని ,ఆంగ్లం లో వైజ్ఞానిక వ్యాసాలూ 20 0కు పైగా రాశానని ఈ మధ్యనే ప్రవ్రుత్తి పై  మ నసుపోయి తెలుగులో మూడు రచనలు చేశాననిదీనినీ ఆదరించమని కోరారు .కనుక అందరు చదివి ప్రోత్సహించాలని కోరుతున్నాను .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-16- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవం –ఆహ్వానం

– శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవం –ఆహ్వానం

3-9-16 శనివారం మధ్యాహ్నం 3 గంలకు  సరసభారతి  ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ వారితోకలిసి శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి(అమెరికా ) దంపతుల సౌజన్య సహకారాలతో  శ్రీకోట సూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యులగురు పూజోత్సవం ,పబ్లిక్ స్కూల్ లో నిర్వహిస్తున్నాం  .ముఖ్యతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్  ,ఆత్మీయ అతిధులుగా   ,శ్రీ కోటగురు పుత్రులు శ్రీ కోట చంద్ర శేఖరశాస్త్రి ,శ్రీ గాయత్రి ప్రసాద్ శ్రీ సీతారామాంజనేయులు గార్లు కుటుంబాలతో పాల్గొంటారు . ,శ్రీ కోట మాస్టారి చిత్రపటానికి పుష్పహార  సమర్పణ జరుగుతుంది  .

ఆనాటి కార్యక్రమం లో శ్రీమైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) ఏర్పాటు చేసిన  శ్రీ కోట సూర్యనారాయణ మాస్టారి ధర్మపత్ని కీశే .కోట సీతమ్మగారి ,స్మారక నగదుబహుమతి 10 ,000 రూపాయలను , ప్రతిభ ,పేదరికం ఉన్న శాంతి నికేతన్ హైస్కూల్ బాలికకు  ,అలాగే ప్రతిభ ,పేదరికం ఉన్న ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ బాలునికి కీ శే .కోట సూర్యనారాయణ గురు వరేణ్యుల స్మారక నగదు బహుమతి10 ,000రూపాయలను సరసభారతి ద్వారా అందజేయబడుతుంది ,కోట సోదరులు తమ తలిదండ్రుల జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన స్మారక నగదు పురస్కారం 10 000రూపాయలను పేదరికం  ప్రతిభా ఉన్నఇంటర్  విద్యార్ధికి వారి చేతులు మీదుగా అందింప జేయటం జరుగుంది .

రెండు రోజుల తర్వాత వచ్చే  5 వ దేదీ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 3 వ తేదీ ననే శ్రీ కోట మాస్టారి గురు పూజోత్సవ సందర్భంగా  శ్రీ కోట సోదరులకు ,శాంతి నికేతన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ మధుసూదన్ పిళ్లే శ్రీమతి విజయ లక్ష్మి దంపతులకు ,సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మిగారికి ,,ఇద్దరు పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులకు  సత్కారం జరుగుతుంది ..

శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవ సందర్భంగా నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవానికి సాహిత్యాభిమానులు ,విద్యాభిమానులు విశేషంగా పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన

మనవి-ఇటీవలి కృష్ణా పుష్కరాలు , సందర్భం గా ప్రత్యేక ఆహ్వానపత్రం ముద్రింఛి అందజేయటానికి   సమయం చాల నందున ఇదే ఆహ్వానంగా భావించి అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన

Inline image 1  Inline image 2

గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

ఏం కె బాబు –ప్రిన్సిపాల్ –ఉయ్యూరు పబ్లిక్ స్కూల్

శ్రీ వినాయక చవితి మరియు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలతో

 

ఉయ్యూరు .

26-8-16

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మధురం మధురం మాధవ నామం

మధురం మధురం మాధవ నామం

శ్రీ కృష్ణుడు ఉద్భవించిన చోటఉత్తర ప్రదేశ్ లోని  మధుర లో ఆయన జన్మించిన చెరసాల చుట్టూ శ్రీ కృష్ణాలయం నిర్మించారు .కేశవ దాసాదేవాలయం దాటగానే కృష్ణాలయం వస్తుంది .ప్రక్కనే మసీదుకూడా ఉంటుంది మొట్టమొదటి ఆలయాన్ని వజ్ర నాభుడు నిర్మించాడు అది దెబ్బతింటేతర్వాత విక్రమాదిత్య మహారాజు పునర్నిర్మించాడు మహమ్మదీయ దండ యాత్రలో ఈ దేవాలయం 17 సార్లు ధ్వంసమైంది ధ్వంసమైన ప్రతిసారీ కొత్త ఆలయాన్ని నిర్మించారు .

శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారం స్వయం భువు . సాక్షాత్తు  శ్రీ మహా విష్ణువే శ్రీ కృష్ణ రూపం లో ద్వాపర యుగం కంస శిశుపాలాది దుస్ట రాక్షసగణాలను సంహరింఛి ధర్మ సంస్తాపనకోసం  ఉద్భవించాడు శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీ కృష్ణ జయంతి .గోవింద ,ముకుంద వాసుదేవ అని ఆయన్ను మనసారా భక్తజనం పిలుచుకొంటారు .మనసులను ఆకర్షించేవాడుకనుక కృష్ణుడు ..శ్రీకృష్ణ ,వాసుదేవ బాలకృష్ణ ,గోపాల మూర్తిగా క్రీ .పూ.4 వ వశతాబ్దినుంచి పూజలు అందు కొంటున్నట్లు చరిత్రకారులు అంటారు .కృష్ణుని స్వయంభువుగా భావి౦చ టాన్ని ‘’కృష్ణ తత్త్వం ‘’అన్నారు ఇది మధ్యయుగం లో భక్తీ మార్గం పరిపక్వంగా ఉన్నప్పుడు బాగా వ్యాపించింది 10 వశతాబ్దం నుండి శిల్పాలలో చిత్రలేఖనం లో క్రిష్ణాక్రుతులకు ప్రాధాన్యం పెరిగింది .ఒరిస్సాలో ని పూరీ క్షేత్రం లో శ్రీ జగన్నాధ దేవాలయం ఈ ప్రభావం తో నిర్మించబడింఅలాగే మహారాస్ట్రలో విఠోబా అనే పాండురంగని ఆలయం రాజస్థాన్ లో శ్రీనాద్ దేవాలయం ఏర్పడ్డాయి 19 60 తర్వాత పాశ్చాత్య దేశాలలో కృష్ణా కాన్షేస్ బాగా పెరిగి అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి అంతర్జాతీయ కృష్ణా కాన్షేస్ సంస్థ చాలా ప్రాచుర్యం పొందింది దీనినే ‘’ఇస్కాన్ ‘’అంటారు

సాధారణం గాశ్రీ కృష్ణ విగ్రహాలు నల్ల రాతితో తయారు చేసేవారు .కాలక్రమేనణా నలుపు తగ్గించి నీలం రంగు వాడుతున్నారు అసలు ఆయన రంగుకు ‘’జమ్బూల్ ‘’అనిపేరు దీన్నే జామున్ అంటారు అది  ‘’ఊదా రంగు (పర్పుల్ కలర్ )ఫలం జంబూ ఫలానికి ఉన్న నాలుగు చిహ్నాలలోరెండు  శ్రీకృష్ణుని కుడి పాదం పైన ఉన్నట్లు వాటిని శ్రీ రూప చింతామణి ,ఆనంద చంద్రిక అంటారని శ్రీ మద్భాగవతానికి వ్యాఖ్యానం రాస్తూ శ్రీల విశ్వనాధ చక్ర వర్తి ఠాకూర్ తెలియ జేశారు

సింద్ లోని లర్కానా జిల్లాలోని మొహన్జ దారో ‘’లో దొరికిన ఒక ఒక షొప్ స్టోన్ శిలాఫలకం పై యమలార్జున గర్వ భంగం అంటే రెండు మద్ది చెట్లను నడుముకు కట్టిన రోటి తో ధ్వంసం చేసిన బాలక్రిషణ మూర్తి శిల్పం బయట పడింది  అంటేసిందు నాగరకత కాలం నాటికే శ్రీ కృష్ణ కధలు బహుళ ప్రచారం లో ఉన్నాయి అని పురా తత్వ వేత్తలు వి ఎస్ అగర్వాల్ లాంటి వారు నిర్ణయించారు కృష్ణుడిని బాల కృష్ణు నిగా లేక రాదా కృష్ణుని గా యవ్వన దశలో ఉన్న విగ్రహాలు ఎక్కువ .ఆయన నిలబడి మురళి వాయిస్తూ  వ్యత్యస్త పాదం తో కనిపించటం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది చుట్టూ గోవులు గోపాలురు గోపికలు పర్య వేష్టించి ఉంటారు ఈ త్రిభంగిమ ‘’లో కనిపించే కృష్ణుడిని ‘’ పశుపాలకుడైన దేవదేవునిగా భావించి గోవింద అని గోపీ కృష్ణా అని ఆత్మీయంగా పిలుచుకొంటారు అయన చిలిపి చేష్టలకు గుర్తుగా వెన్న నవనీత చోరా ,గోకుల కృష్ణ ,కాళీయ మర్దన  గిరిధర గోపాల అని పిలుచుకొని మురిసిపోతారు .

ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా మీర్జా పూర్ లో త్రవ్వకాలలో దొరికిన శిల్పాలు శ్రీ కృష్ణుని కురుక్షేత్ర సంగ్రామానికి చెందినవి .ఇవి క్రీ పూ.800కాలానివి .అస్త్ర శస్త్ర దారిగా అర్జున  రధ చోదకుడిగా చేతిలో చేన్నాకోలతో గుర్రాలను అదిలిస్తూ కనిపిస్తాడు ..ఈ కృష్ణుడిని  ,పార్ధ సారధిగా కొలుస్తారు .

క్రిష్ణకధలు భారత భాగవత ,హరివంశ పురాణాలలో నిక్షిప్తమై అక్షర బద్ధమైనాయి రుగ్వేదం లోని 1-22-164 లో 31 వ సూక్తం లో చెప్పబడిన పశుపాలుడు శ్రీ కృష్ణుడే అని శ్రీ భక్తీ వినోద ఠాకూర్ అభిప్రాయ పడ్డారు క్రీ పూ..8 నుంచి 6 వ శతాబ్దాలకు చెందిన ఛాందోగ్య ఉపనిషత్ లో 3-17 -6  సూక్తం లో వాసుదేవ కృష్ణుడు దేవకీ కుమారుడు అని ఘోర అంగీరసుని శిష్యుడని పేర్కొన బడింది క్రీ పూ 6 వ శాతాబ్దికి చెందిన యాస్కుని నిరుక్తం అక్రూరుని వద్ద శ్యమతక మణి ఉన్నట్లు శత పద బ్రాహ్మణం ఐతరేయ అరణ్యకాలలో కృష్ణుడిని వృష్ణి వంశ సంజాతునిగా చెప్పాయి క్రీ పూ 5 లేక 6 శతాబ్దాలలో ఉన్న పాణిని తన అష్టాధ్యాయి లో వసుదేవుని కుమారుడు వాసుదేవుడని  అర్జున కౌరవు లగురించి చెప్పాడు అంటే కృష్ణునికి అర్జునికి కౌరవులకు సంబంధం ఉందని తెలుస్తోంది

ఇంతటి విస్తృత ప్రచారం ద్వారకా నాధుడు మధురా వల్లభుడు వ్రేపల్లె నందవంశ బాల కృష్ణు డికి ఉంది భారత యుద్ధం లో అర్జునికి కర్తవ్య బోధ చేసి గీతాచార్యుడై ‘’కృష్ణం వందే జగద్గురుం ‘’అని అందరి మొక్కులు అందు కొంటున్నాడు

Inline image 3Inline image 4Inline image 1 Inline image 2

 

శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కన్నయ్య సన్నిధిలో చూడయ్య (గోకులాష్టమి సందర్భం గా మనసులో మెదిలిన భావనకు ఊహా రూప కద

కన్నయ్య సన్నిధిలో చూడయ్య (గోకులాష్టమి సందర్భం గా మనసులో మెదిలిన భావనకు ఊహా రూప కద)

వ్రేపల్లెలో కన్నయ్య పుట్టిన రోజు వేడుకలు బహుపసందుగా సాగుతున్నాయి .ఊరంతా ముగ్గులు తోరణాలు ,ఆటలు పాటలు ,బాలకృష్ణుని చిలిపిచేస్టల ప్రదర్శనాలు నాటకాలు ఒకటేహడావిడి .ప్రతి ఇంట్లోనూ వాళ్ళింట్లోనే కన్నయ్యపుట్టాడనే సంతోషం తో చేస్తున్నారు వేడుకలను .ఇవన్నీ అయిపోయి అందరూ నంద యశోదల ఇంటికి చేరారు .అందరి దృష్టీ పలురకాల ప్రదర్శనల పైనే ఉంది.కన్నయ్య ఒక పక్క వంశీగానం భువన మనోహరంగా చేస్తూ మనసులకు ఆనంద పరవశం కలిగిస్తున్నాడు .వెన్నెలలో బృందావన సందర్శనాన్ని కల్పిస్తున్నాడు అపురూపమైన తమకన్నయ్యకు తల్లి యశోదమ్మ వివిధ రకాలైన నూతన వస్త్రాలను ఆభరణాలను గంటకో రీతిగా మారుస్తూ సంతృప్తి పడుతోంది ఆడపిల్ల లేదన్న బెంగ తీరటానికి కన్నయ్యను కన్నెపిల్లగా కూడా అలంకరించి మరిన్ని నగలు దిగేసి ముచ్చట తీర్చుకొంది.ఇక నందయ్యకు ఒంటిమీద బట్ట నిలవటమే లేదు పొంగిపోతున్నాడు తనకు దక్కినఅదృస్టానికి .ఎన్నిజన్మల తపోఫలమో అని భగవంతునికి చేతులెత్తి మాటిమాటికీ నమస్కరిస్తున్నాడు .ఆడవారి సందడి చెప్పనే అక్కర్లేదు

ఇలా కోలాహలం గా పరవశంగా వాతావరం ఉంది అందరూ  మేనుమరచి పోతున్నారు .ఈ హడావిడి ఒక్కడి విషయం లో మాత్రం లెక్క తప్పింది .వాడే ‘’చూడయ్య .వాడి ద్రుష్టి అంతా కన్నయ్య మీదే ఉంది .చూపు పక్కలకు తిప్పితే ఒట్టు .ఎంత సేపు అట్టాకన్నయ్యని తాగుతాడు వీడు? అని అందరికీ లోపల ఉందికాని కన్నయ్య ఏమనుకొంటాడోనని నోటికి తాళాలు బిగించు కొంటారు .ఇవాళ అయితే కృష్ణాష్టమి అని సరిపుచ్చుకు౦దామంటే ,రోజూ ఇదే తంతు .కన్నయ్య ఎక్కడుంటే అక్కడే వాడు .ఆయనతో మాట్లాడడు .పలకరించడు .తమలాగా ఆయనతో వెన్న, పాలు దొంగతనాలు చేయడు.ఈ చిలిపి పనులు కన్నయ్య చేసేటప్పుడు కూడా  చూడయ్య చూపు కన్నయ్య చేసే పనులమీద ఉండదు .తాము నవ్వుతూ కేరింతలేస్తీ ఆ పనులు చేస్తుంటే వాడుమాత్రం కన్నయ్య మీంచి రెప్ప పక్కకు తిప్పుడు,ద్రుష్టి ,మరల్చడు.అందుకే వాడి అసలు పేరు అందరూ మర్చిపోయి కన్నయ్యను ఎప్పుడూ చూస్తూ ఉంటాడుకనక  చూడయ్యఅని పిలవటం మొదలు పెట్టారు . ఇదేమైనా గాలి రోగమేమో అనుకొనేవాళ్ళు .వాడి తలిదండ్రులకు చెప్పారు కూడా .’’ఒరేయ్ ! వాడేవురికిఅర్దమవ్వడు  పొద్దున్నే ఇంత సద్ది నోట్లో కుక్కుకొని ఇంటినుంచి బయటికి అడుగు పెట్టినోడు , యే అర్ధరాత్రికో కన్నయ్య నిద్రపోయాక కొంపకు చేరుతాడు .తినటానికి ఏమైనా పెడదామని అడిగితే’’కడుపు చాలా బరువుగా ఉందమ్మా నేనేమీ తినలేనే ‘’అని ముసుగు తన్ని పడుకుంటాడు .వాడు మా దారికి రాడని తెలిసి మేమే ఆడి దారిలో పడ్డాం ‘’అంటుంది తల్లి .’తండ్రి మాత్రం ‘’ఆడిదోఇంతపుటకరా .పుట్టటం తోనే ఆడిపక్క కన్నయ్య బొమ్మ ఉంది .మేమేవరుమూ,కొని తెచ్చి పెట్టి౦దికాదు ‘’పుట్టినోడు ఏడవాలా ?ఆహా అదేమీ లేదే  పిలగాడికి .కన్నయ్య బొమ్మను చూస్తూ నగూ కొన్నాడు .గాలీ ధూళీ లాంటివేమైనా పట్టాయా అని ఆల్లనీ పిల్పించాం .ఆళ్ళుతమవల్లకాదని కాడి పారేశారు .ఇదీ ఈడి సంగతి అబ్బయ్యా .ఎప్పుడూ మీ పక్కనే ఉండేటోడుగనక మీరే కుసింత కనిపెట్టి ఉండ౦ డబ్బా’’అన్నాడు తండ్రి .అప్పట్నించి ఇంక ఎవరూ వాడినేమీ అనరు పట్టించుకోరు .

రంగ రంగ వైభవంగా కన్నయ్య పుట్టిం రోజు జరిగిపోతోంది .చూడయ్య చూపు మాత్రం కన్నయ్యను వదలలేదు .యశోదమ్మ చివరగా వచ్చి దిష్టి తీసి ,ఇంతవెన్న నోట బెట్టి ౦ది .కను చూపుతో సైగ చేశాడు తల్లికి .వెంటనే అర్ధం చేసుకొని ఆ ఎంగిలి  వెన్నముద్ద నే చూడయ్య నోట్లోనూ పెట్టింది .వాడికి ఆ స౦గతి తెలుసా? .వాడి మనోరంగమంతా  కన్నయ్య ముఖ చంద్ర బింబ దర్శనాస్వాదనలోనే ఉండిపోయింది.  యశోద వెన్నపెట్టిన సంగతీ తెలీదు అది నోట్లోకి జారిపోతున్న వైనమూ వాడికి స్పృహలో లేదు .అందరూ వెళ్లి పోయారు కన్నయ్యా చూడయ్యా ఇద్దరే ఉన్నారు .కన్నయ్య ‘’చూడా !నాతో మాట్లాడవు .పలకరించవు ఆటాడవు ఎప్పుడూ నా మొహం లోకి చూస్తూనే ఉంటావు .విసుగు అనిపించదా ?’’అడిగాడు కన్నయ్య .ఎప్పుడూ కన్నయ్య ముందు నోరు విప్పని చూడయ్య ఒళ్ళంతా పులకరించింది .అదేదో జన్మ జన్మల అనుబంధం అనిపించింది .కన్నయ్య అడిగాడు కనుక జవాబు చెప్పక పొతే బాగుండదని ‘’కన్నా !నీముఖం చూస్తేనే చాలు నా పంచప్రాణాలకు చైతన్యం కలుగుతుంది .నీతో మాట్లాడితే ఆ భాగ్యం దక్కదేమోనని భయం .కనుక నిన్నే చూస్తా నాకు అంతకంటే ఆనందం లేదు అక్కర్లేదు .ఇలా శాశ్వతంగా నీ ముఖ సందర్శన భాగ్యమివ్వు ఈ చూడ య్య కు .’’అన్నాడు చూడుడి కళ్ళనుండి ధారా పాతంగా ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి కాదు కారిపోతున్నాయి .ఏమైందో తెలీదుకాని కన్నయ్య కళ్ళనుండీ సంతత ధారాపాతం గా బాష్పదారలు కురుస్తున్నాయి .పైన ఉన్న దేవతాగానం రుషిగణంకృష్ణాష్టమి వేడుకలు చూస్తూ ఈ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు పుష్ప వృష్టి కురిపించారు .

కొంచెం బాహ్య స్పృహలోకి వచ్చారు ఇద్దరూ ‘’కన్నయ్యా !నేను నిన్ను ఇలాఅంటిపెట్టుకొని ఉలకక పలకక నిన్నే చూడటం నీకిస్టమేనా ఇబ్బందిలేదా ?’’అడిగాడు చూడుడు .కరిగి పోయిన కన్నయ్య ‘’చూడా !మనది జన్మ జన్మల అనుబంధం .నువ్వు చూడామణి అనే రుషీశ్వరుడివి నేను కృష్ణావతారం దాల్చే టప్పుడు రుషిగణమంతా గోప గోపికలు గా జన్మించారు అప్పుడు నువ్వు నాదగ్గరకొచ్చి ‘’పరమాత్మా !నేను  అనవరతం నీ ముఖార వి౦దాన్ని దర్శించే  భాగ్యం మాత్రం ప్రసాదించు నాకింకేమీ వద్దు  ‘’అని కోరావు .ఆ వర ప్రభావం వలననే నువ్వు ఇంత సన్నిహితంగా నన్ను నా ముఖాన్నీ చూస్తూ పరమానందాన్ని పొందుతున్నావు .’’అన్నాడు .అంతే చూడడు కన్నయ్య పాదాలపై వాలి భక్తితో ప్రణమిల్లి’’ ఇంతకంటే ఇంకా యే ఆనందం నాకక్కర్లేదు కన్నా ‘’అని ముఖాన్ని పైకి త్రిప్పి కన్నయ్య ముఖ చంద్రోదయాన్ని తనివి తీరా దర్శించి అలా కన్నయ్య పాదాలపై వాలిపోయాడు .ఒక దివ్యజ్యోతి చూడయ్యనుంచి కన్నయ్యలోకి ప్రవేశించింది .దీనికి సాక్షులు పైనున్న రుషి ,దేవ గణం..విషయం  తెలిసి  అందరూ వచ్చి కన్నయ్య చూడయ్య  ల అనుబంధాన్ని అర్ధం చేసుకొని చూడయ్య భక్తికీ కన్నయ్య కృపకూ  ముగ్ధులయ్యారు

Inline image 1  Inline image 2

శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలతో

మీ గబ్బిట దుర్గాప్రసాద్-25-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

1 of 18,073 Print all In new window ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపించింది -అభినందన సభ లో బాబు –

విజయం ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపిస్తోంది: అభినందన సభలో చంద్రబాబు By: Nageshwara Rao Published: Wednesday, August 24, 2016, 14:25 [IST] అమరావతి: కృష్ణా పుష్కరాల విజయం ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులు, అధికారులు, కార్మికులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాకంటే సిబ్బంది, ఉద్యోగులు ఎక్కువగా కష్టపడ్డారని అన్నారు. పోలీసులు కూడా పుష్కరాల్లో సేవ చేశారని మెచ్చుకున్నారు. Also Read: బాబు సర్వే: టిడిపి స్థితిపై దిమ్మతిరిగే ఫలితం పోలీసులంటే లాఠీలు ఉపయోగిస్తారన్న చెడుభావం గతంలో ఉండేదని, పుష్కరాల పోలీసుల ఇమేజ్ పెరిగిందని అన్నారు. టెక్నాలజీ సాయంతో పుష్కరాలను విజయవంతం చేశామని తెలిపారు. టెక్నాలజీ వల్ల కమ్యూనికేషన్‌ గ్యాప్‌ రాలేదన్నారు. ఈ విజయం అన్ని వర్గాల ప్రజలది, అధికారులదని సీఎం తెలిపారు. నది పారిన అన్ని ప్రాంతాల్లో పుష్కరస్నానాలు చేశారని చెప్పిన చంద్రబాబు, పారిశుద్ధ్యం విషయంలో పురపాలకశాఖ తీరు అభినందనీయమని కొనియాడారు. 17వేల మంది విద్యార్థులు పుష్కర సేవకులుగా పనిచేశారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఐవోటి కింద ముందుకు తీసుకువెళ్లడానికి ఈ పుష్కరాల అనుభవం ఉపయోగపడుతుందని అన్నారు. పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్‌ సమన్వయం బాగుందని, పక్కా ప్రణాళికతో పుష్కరాలను నిర్వహించారని అభినందించారు. కృష్ణా పుష్కరాలు మతాలకు అతీతంగా జరిగాయని.. ముస్లింలు, క్రైస్తవులు కూడా పుష్కర స్నానాలు చేయడం అభినందనీయమన్నారు. Also Read: 2 పుష్కరాలు, సింధు గోల్డ్ మెడల్, థ్యాంక్స్: వచ్చినవారితో సంకల్పం చేయించిన చంద్రబాబు ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సేవ చేయడం, స్వచ్ఛంద సంస్థలు యాత్రికులకు అన్నదానం చేయడం అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. ఇక డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ పుష్కర విధుల్లో మృతి చెందిన పోలీసు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. పుష్కరాల్లో సాంకేతికను ఎక్కువగా వినియోగించుకున్నామని ఆయన తెలిపారు. ఈ విజయం వెనుక అందరి కృషి దాగి ఉందని చెప్పిన ఆయన రాబోయే రోజుల్లో అన్ని శాఖలతో సమన్వయంతో కలిసి ముందుకు సాగుతామని అన్నారు. సీఎం ప్రోత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు. Post Comment Ads by Revcontent From The Web Today Mumbai Girl Gets 4 Shades Fairer in 14 Days by Using This 1 Weird Old Trick! Just Copy & Paste To Make Rs. 2,25,000/Month Indian Millionaires Trying To Ban This Program No Diets Or Gym: Melt All

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం
శ్రీమన్నారాయణుని షోడశ కళల పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడు అవతరించిన శ్రావణ బహుళ అష్టమి పుణ్యతిథి శ్రీకృష్ణాష్ఠమిగా జరుపుకోవటం సంప్రదాయం. దశావతారాలు ఇంతటి వైవిధ్య భరితమైనది, ప్రముఖమైనది మరొకటి లేదు. శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే దేవకీ వసుదేవులకు తన నిజరూప దర్శన ప్రాప్తి కలిగించాడు. తన అవతార రహస్యం చెప్పాడు. ఆ తర్వాత కార్యమైన తనను గోకులానికి చేర్చటం, యశోద పుత్రికను తెచ్చి దేవకి దగ్గరలో పరుండబెట్టటం ఇత్యాది భావి కార్యాచరణకు ఆదేశమిచ్చాడు. పుట్టినది మొదలు గోకులం, యమునాతీరం, బృందావన ప్రాంతాలు అన్నీ ఆ చిన్నారి చిద్రూపుని విహార భూములయ్యాయి. ఈ అమాయక గోపబాలుడు వెన్నదొంగ అయి ఎన్నో అలౌకిక దివ్యలీలలు ప్రదర్శించాడు. భక్తాగ్రగణ్యులైన గోపికలు కృష్ణుని భౌతిక దృష్టితో దేవకీవసుదేవుల పుత్రుడిగా కాక ఆత్మదృష్టితో దర్శించి ఆరాధించారు. అఖిల దేహినా మంతరాత్మదృక్ అని భావగత పురాణం వివరించినట్లు సకల ప్రాణులలోను అంతర్యామియై ఉన్నవాడనే భావనతోనే చూశారు. వారికి జన్మాంతర బంధమున్నది. ధర్మసంరక్షణార్థం మహావిష్ణువు కృష్ణుడుగా అవతరించినప్పుడు, ఎందరో మహర్షులు, దేవతలు గోపగోపీ జనులుగాను, ఆదిశేషుడు బలరామునిగాను ఆ ఆదిదేవుని అనుసరించి జన్మించిన వారే!
ఆ బాలకృష్ణుని దివ్యలీలా చేష్టలకు పరవశించి, కలవరించి, కవులెందరో ఆ వేణుగానలోలుని గుణగణాలను గానంచేసి తరించారు. మన తెలుగు వారికి కృష్ణుని పేరు చెప్పగానే స్ఫురించేది పోతనగారి భాగవతమే! భక్తికి మరోపేరు భాగవతంగా ప్రసిద్ధి పొందటానికి కారణం మందారమకరంద సదృశమైన శైలిలో, సుందర పదబంధ భరితమైన పోతనగారి తెలుగు పద్యాలే. కవిత్వాన్ని కైవల్య సాధనంగా చేసుకొని మధురమైన భక్తిమార్గంలో పయనించి తరించిన భాగవతోత్తముడు పోతన.
తెలుగునాట పోతన పద్యం లాగా ఉత్తరాన సూరదాస్‌కీర్తనలు బహుళప్రాచుర్యం పొందినవి. ఇవి భాగవతంలోని కథలను వర్ణించినా,దశమస్కందంలోని కృష్ణ లీలలను తనివితీరా పాడుకొన్నాడు సూరదాస్. వంగ సాహిత్యాన్ని శ్రీకృష్ణ చైతన్యంతో పునీతమొనరించిన వాడు చైతన్య మహాప్రభు. మహారాష్ట్రులకు పండరిపురంలో వెలసిన పాండురంగడే పరమ ఆరాధ్యుడు. ఏకనాథ్, తుకారం, నాందేవ్ లాంటి కవులు శ్రీకృష్ణ కవితా లహరిలో తడిసిన వారే. గుజరాతీలో నరసిమెహతా రచనలు ప్రసిద్ధి పొందాయి. శ్రీకృష్ణుడే ధ్యాసగా, శ్వాసగా తన్మయం చెంది గానం చేసిన మీరాభజనలు యావద్భారతావనిని మధుర భక్తి లహరిలో ఓలలాడించాయ. కృష్ణతత్త్వ ప్రతిపాదిత గ్రంథాలలో జయదేవుని గీతగోవింద ప్రాశస్త్యం ఇంతింతనరాలేము కదా. అటులనే లీలాశుకుని కృష్ణ కర్ణామృతం, నారాయణ తీర్థుల కృష్ణలీలా తరంగిణి మకుటాయమానంగా భాసించే మహత్తర మధుర కావ్య కల్పతరువులు.
శ్రీకృష్ణుడు తన అవతారంలో చూపిన లీలా వినోదా లన్నింటిలోకి రాసలీల మధురాతిమధురం. భాగవతంలో రాసలీలలు 5అధ్యాయములలో వర్ణితాలైనవి. దీనినే రాస పంచాధ్యాయి అంటారు. బహుజన్మ కృత పుణ్యఫలంగా గోపికలను కృష్ణ పరమాత్మతో తదాత్మ్యం చెందే భాగ్యం లభించింది. అదే రాసలీలా పరమార్థంగా సంభాషించాలి. అనురక్తికే కాక భక్తికీ సుందర అభివ్యక్తిగా నిలిచింది రాధ. మధురాధిపతే రఖిలం మధురం అని మాధుర్య రసాధిపతి అయి భాసించినవాడు కృష్ణుడు. పరా ప్రకృతిగా భాసించినది రాధ. పైకి శృంగారంగా కనపడినా జీవాత్మ పరమాత్మల సంయోగం కోసం అంతరచైతన్యం కోరుకునే భగవద్రతి అది. భాగవతంలో కనిపించే గోపికల ప్రణయ తత్త్వమూ ఇదే! రాధా తత్త్వాన్ని ఉపాసించి కృష్ణానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని అంటారు. శ్రీకృష్ణ్భగవానుడు తన అనంతముఖ అవతార రహస్యాలను మూడు ముఖ్య దశలలో విశదపరిచాడు. మొదటిది బాల్యదశ. వెన్నదొంగగా మారి, గోపాలకుడై నందకులాన్ని వందనీయం చేశాడు. బృందావనానికి మారటం కాళీయమర్దనం, తదుపరిదైన యవ్వనాంకురదశ, బృందావనం తరువాత‘ప్రౌఢ నిర్భర పరిపాక దశ’. అష్ట మహిషులతో పరిణయం, కురుపాండవుల సంగ్రామం, గీతాబోధ. ఇది ప్రపంచానికి కర్తవ్య బోధ. ఇక రుక్మిణీ కల్యాణం, సత్యభామ పరిణయం ఇవన్నీ తెలిసినవే. కలడో లేడో అనే సంశయం లేకుండా అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు శ్రీకైవల్య పదాభి లాషులందరి హృదయాలలోనూ వెలసే ఉన్నాడు. అలా వెలసి ఉన్న వాడిని తెలుసుకోవడమే జన్మ సార్థకత.(ఆంద్ర భూమి )

బిల్వమంగళుడు లీలాశుకమహర్శియై శ్రీ కృష్ణ కర్ణామృతం మధుర భక్తికి పరాకాష్ట గా రాశాడు .మొదటి శ్లోకంలో

‘’చింతామణి ర్జయతి సోమగురుర్మే-శిక్షా గురుశ్చ భగవాన్ శిఖి పించమౌళిః

యత్పాద కల్పతరు పల్లవ షేఖ రేషు –లీలాస్వయం వరరసం లభతే జయశ్రీః’’

అంటే –శ్రీ కృష్ణ కర్ణామృత కావ్య రచనలో నాకు మార్గ దర్శి అయిన చింతామణికి ,నాకు దీక్షా గురువైన సోమ గిరికినమస్కరిస్తున్నాను .కల్ప వృక్షం తమ చిగురాకుల కొనలవద్ద లక్ష్మ్మీ దేవిని అలంకరించుకొని విలాసంగా కన్పిస్తోంది  ఆ కల్ప వృక్షం లాంటి పాదాలతో విరాజిల్లుతూ నెమలి పించం ధరించి ఉన్న నా శిక్షా గురువైన శ్రీ కృష్ణునికి కూడా నమస్కరిస్తున్నాను

శ్రీ కృష్ణ కర్ణామృత శ్లోకాలు ఉత్తర ,దక్షిణ భారతాలలో విరివిగా వ్యాప్తి చెందాయి సంగీత భజన సభలలో ఆలపిస్తారు తాళ లయాన్వితంగా ఉండటం తో వీటిని నృత్యాభినయానికీ చక్కగా వినియోగిస్తారు .మూడు ఆశ్వాసాల కర్ణామృతం నిజంగానే చెవులకు అమృతమే .4 వ శ్లోక౦ భావ  మాధుర్యాన్ని జొన్నలగడ్డ పతన్జలిగారు వివారించారు చూడండి

బర్హోత్తంస విలాస కుంతలభరం మాధుర్య మగ్నాననం –ప్రోన్నీ లన్నవ యౌవనం ,ప్రవిల సద్వేణుప్రణాదామృతం

ఆపీనన స్తన కుట్మళా భి రాభితో ,గోపీభి రారాదితం –జ్యోతిశ్చేతసి నశ్చ కాస్తుజగతా మేకాభిరామాద్భుతం

భావం –లోకాలన్నితిలోని మనోహర వస్తువులకంటే ,ఆశ్చర్య పదార్దాలన్నిటికంటే ,ఆశ్చర్యమైనది గోపాల కృష్ణుని దివ్య తేజస్సు శిర్సులో నెమిలి పించం ఉంటుంది బాలుడే అయినా సౌన్దర్యం లో పడుచువారి లక్షణాలు కనిపిస్తాయి మాధుర్య విలసిత మోము నుండి వీనుల విందైన మురలీనాడం వెలువడుతుంది .ప్రౌఢ గోపా కాంతలు నిరంతరం ఆయన చుట్టూ చేరి ఆరాధిస్తూ ఉంటారు .అలాంటి తేజో రూప గోపాలుని రూపం ఎప్పుడూ నా మనసులో ప్రకాశించాలి .

 

అందరు చెప్పుకొనే శ్లోకం ‘’కస్తూరీ తిలకం ‘’లీలాశుకునిది అని చాలామందికి తెలియదు .

‘’కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం –నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుఃకరేకంకణం

సర్వాంగే హరి చందనం చ కలయన్ కంఠేచ ముక్తావళీ—గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః

328 శ్లోకాలున్న ఈ స్తోత్ర మంజరి లో ప్రతిశ్లోకం కర్ణ రంజనమే .చివరగా లీలాశుకుడు

‘’లీలాశుకం రచితం తవ దేవ దేవ కృష్ణ కర్ణామృతం వహతు కల్పశతాంత రేపి ‘’అని చెప్పాడు వంద  కల్పాల

దాకాఅంటే నాలుగు యుగాల దాకా  కావ్యం జీవించి ఉండాలని ఆకాంక్షించాడు .ఉంటుంది కూడా

లోకం లో కృష్ణుడిని ‘’గోపాల సుందరి ‘’గా అర్చించే విధానం ఉంది .ఆ మూర్తి జపానికి  33 బీజాక్షరాలున్నాయి .ఇందులో 18రాజ గోపాల మంత్రం లోని వైతే 15 శ్రీ విద్య లోని పంచ దశాక్షరాలు .

దక్షిణ ద్వారక లోని రాజా మన్నార్ గుడి దైవం శ్రీ రాజగోపాలుడు. ఆయన ధ్యానం ‘’శ్రీవిద్యా రాజ గోపాలునిగా చేస్తారు స్వామి పాదాల చెంత శ్రీ చక్రం ప్రతిష్టితమై ఉండటం గొప్ప విశేషం ఆయన అలంకారం ఏమిటో తెలుసా ?మోహినీ అలంకారం అంటే మదన గోపాల సుందరి అలంకారం  బ్రహ్మోత్సవాలు ఈ అలంకారం తోనే నిర్వహిస్తారు .లీలాశుకుడు ఈ మదన గోపాల సుందరి ని శ్రీకృష్ణ కర్ణామృతం లో 3 నుంచి 104 శ్లోకాల వరకు తనివితీరా బహు సుందర పదబంధం తో వర్ణించాడట

శ్రీ రామ కర్ణామృతం

కంచి మఠానికిచెందిన పీఠాదిపతి శ్రీ శ్రీ బోదేంద్ర సరస్వతి గారికి శ్రీరామ సిద్ధాంతం   పై మహా అభిరుచి ఉండేది  వారు తమ పీఠాదిపత్యాన్నిఐచ్చికంగా త్యజించి  పదవీ విరమణ తర్వాత కుంభ కోణం దగ్గరున్న గోవిందాపురం గ్రామం వెళ్లి రామభక్తి సామ్రాజ్యం లో చిదానందాన్ని అనుభవిస్తూ ‘’శ్రీ రామ కర్ణామృతం ‘’అనే మహా గొప్ప స్తోత్ర రచన చేశారు. త్యాగ రాజస్వామికివీరు  ము౦దు వారు .వీరి అనుయాయులు రామనామ  సిద్దాంతా న్ని కావేరీ  పరీ  వాహక  ప్రాంతం లో విస్తృతంగా వ్యాపింప జేశారు. కావేరీనదీ ఉపనది అయిన వీరసోగ్హన్ నదిలో స్వామివారు ‘’జీవ సమాధి ‘’ చెందారు . రామ కర్ణామృత శ్లోకాలు కృష్ణ కర్ణామృత శ్లోకాలలానే ఉండటం విశేషం .ఆ సౌరు చూద్దాం –ముందుగా కృష్ణ కర్ణామృత శ్లోకం –

‘’హే దేవ హే దయిత ,హే జగదేక బంధో-హే కృష్ణ హే చపల హే కరుణైక సింధో

హే నాధ హే రమణ ,హే నయనాభి రామ –హాహా కదాను భవితాసిపధం ద్రుసోర్మే

ఇప్పుడు శ్రీ రామ కర్ణామృత మకరందం జుర్రుదాం

‘’హే రామ ,హే రమణ హే జగదేక వీర –హే నాద హే రఘుపతే కరుణాలవాల

హే జానకీ రమణ  హే జగదేక బంధో –మాం పాహి దీనం అనిశం కృపణం కృతజ్నం ‘’

 

 

కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో వున్న పాపమును కూడా త్రాగేశాడు. పుణ్యమే మిగిలిపోయింది. అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరువత్తుల వాసన వచ్చింది. కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణునికి తల్లి వుంటే ఏ లోకములకు వెళుతుందో ఆ లోకములకు పూతన వెళ్ళిపోయింది. మరి అ ‘పిల్లవాడు నా కొడుకు’ అనే ప్రేమతో పాలిచ్చిన తల్లి ఏ స్థితికి వెళుతుందో! వాళ్ళు వెళ్ళే స్థితిని నేను చెప్పలేను అన్నారు పోతనగారు.
ఇది పూతన సంహార ఘట్టము. ఈ ఘట్టమును తాత్త్వికంగా పరిశీలించాలి. భాగవత దశమ స్కంధము ఉపనిషత్ జ్ఞానము. ఆవిడ పేరు పూతన. అమరకోశం ‘పునాతి దేహం పూతన’ అని అర్థం చెప్పింది. దేహమును పవిత్రముగా చేయుడానికి పూతన అని పేరు. మనకి సంబంధించిన ఒక వస్తువును చూపించి ఎవరిదీ అని ప్రశ్నిస్తే నాది అని చెపుతాము. అయితే ఇప్పుడు నేను అనబడే నువ్వు ఎవరు? దానికి జవాబు మనకే తెలియదు. అదే పెద్ద అజ్ఞానము. ‘నేను నేను’ అంటున్నది ఏది? అంటే తెలియక ఆ ‘నేను’ని చీకటితో, అజ్ఞానముతో కప్పివేశాము. అదే పూతన. అవిద్య. ‘నేను’కు ‘నాది’ తోడవుతుంది. నేను అనేది అబద్ధము. ఈ అబద్ధామునకు నాది అనే మరియొక అబద్దం తోడవుతుంది. దీనికి అస్తిత్వం లేదు. ‘నా’ అన్నప్పుడల్లా ఒక పాశం వేసుకుంటున్నాడు. ఎన్ని వేసుకుంటే అంత పశువు అవుతున్నాడు. పశువుకి అజ్ఞానం, అవిద్య ఉంటాయి. ‘నేను, నాది’ అనే రెండు పూతన రెండు స్తనములు. ఇందులోంచి విషయములను ఇస్తుంది. విషయమే విషము. దేహము ఎప్పుడూ సుఖమునే కోరుతుంది. కానీ దేహసంబంధమయిన సుఖములు విషముతో సమానమయినవి. అవి ఎప్పటికీ దేహి సూక్ష్మరూపమును తెలియనివ్వవు. అలా తెలియకుండా జీవుడు ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు. దీనిని ఏమయినా చేయగలమా? ఏ పని చేసినా దానిని భగవత్ ప్రసాదమని భావించాలి. భగవదర్పణ చేసి సుఖములను అనుభవిస్తే అవి మనపట్ల విషములు కావు అమృతములు అయిపోతాయి. భగవంతుని అర్పించడం వలన లోపల శుద్ధి జరుగుతోంది. శుద్ధి లేకుండా తింటే విషం అయిపోతుంది. పూతన కృష్ణునికి విషపూరిత స్తన్యమును ఇచ్చింది. విషము అమృతము అయిపోయింది. మీకు కూడా అన్నింటినీ ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటు అయితే అది అమృతం అవుతుంది. మనస్సును దేహమును కూడా శౌచపరచగలదు. ఈశ్వరుని వైపు తిప్పగలదు. ఈ రహస్యమును ఆవిష్కరించడమే పూతన సంహారమునందు ఉన్న పెద్ద ప్రయత్నము.
ప్రకృతి వికారమయిన శరీరం పైకి అందంగా ఉన్నట్లు ఉంటుంది. కానీ దీనియందే ఉండిపోతే అసత్యమయిన ‘నేను’నందు మీరు ఉండిపోతే అది అమృతత్వమును యివ్వదు. అసత్యమయిన ‘నేను’ సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపు వెళ్ళినట్లయితే ఈ భక్తి ఒకనాడు జ్ఞానము అవుతుంది. జ్ఞానము ఎప్పుడు కలిగేదీ మనం చెప్పలేము. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే ప్రారంభించాలి. అది ఎప్పుడో జ్ఞానం అవుతుంది. జ్ఞానమును అగ్నిహోత్రంతో పోలుస్తారు. మీకు తెలియకుండానే ఒకరోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అపుడు అసలు ‘నేను’ను తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి. అదే పూతన సంహారఘట్టం. అందుకనే కృష్ణుని మొదటి లీల పూతన సంహారంతో మొదలవుతుంది. ఇది దేహమును పవిత్రం చేసింది. అపవిత్రమయినది పవిత్రం అయింది. పవిత్రము అవగానే లోపల వున్న వస్తువును తెలుసుకోవడానికి ఇది ఉపకరణంగా మారిపోతుంది. మారిపోయి అసలు ‘నేను’ను పసిగట్టగలిగిన స్థితికి తీసుకు వెళుతుంది. ఈ ఘట్టమును పరమోత్కృష్టమయిన పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు.

 

Inline image 1Inline image 2Inline image 3

శ్రీ కృష్ణ జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-16 -కాంప్-బాచుపల్లి -హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణా పుష్కర ఆయాస ,అనుభవ ఆకాంక్షలు –తొక్కా చానెల్

కృష్ణా పుష్కర ఆయాస ,అనుభవ ఆకాంక్షలు –తొక్కా చానెల్

హమ్మయ్య నిన్నటితో కృష్ణా పుష్కరాలు రంగరంగా వైభోగం గా పూర్తయ్యాయి .అందరూ హాయిగా ఊపిరి పీల్చుకొన్నారు .చంద్రబాబుకు అలసట బదులు ఉత్సాహం పరవళ్ళు తొక్కింది .వాలు కుర్చీలో కూచుని వీటిని నెమరేసుకొంటూ ఉంటె నాస్నేహితుడు టిక్కూ  రొప్పుతూ ,రోజుతూ ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చి ‘’గురవా !’’తొక్కా టి వి ‘’వాళ్ళు నన్ను నీదగ్గారికి పంపారు .వాళ్ళ విలేకరులంతా ఎక్కడెక్కడో బిగుసుకు పోయారట .నువ్వు జనం లోకి వెళ్లి ‘’పుష్కరాయాస౦ ,  ,అనుభవ, ఆకాంక్షలు’’ రికార్డ్ చేసి ఇవ్వాలట .మరీ మరీ రిక్వెస్ట్ చేస్తే పరిగెత్తుకొచ్చా ‘’అన్నాడు చెమటను చోక్కాతోతుడుచుకొంటూ .’’సరే నాకేంటి ?’’అన్నా.’’ఈ పని చేస్తే ఈ సారినుంచి నువ్వు రాసిన యే చెత్త అయినా ప్రసారం చేస్తామని నాకు హామీ ఇచ్చారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ నా పరువు కాపాడవా “’  అన్నాడు వగరుస్తూ .’’నీ పరువు సరే నా’’ బరువు ‘’సంగతి ?వెహికిల్ ఇస్తారా కెమెరామాన్ ఉంటాడా ,అరగంటకోసారి టిఫిన్ కాఫే మధ్యాహ్నం మీల్స్ అన్నీ ఉన్నాయా ?  నేను రికార్డ్ చేసింది అక్షరం వదలకండా బ్రాడ్ కాస్ట్ చేస్తారా .కటింగ్ ఉంటె కోర్టుకు వెడతానని చెప్పు ‘’అని మేక పోతుగా౦ భీర్యం ప్రదర్శించాను ’ .’’ఆ లోపం ఏమీలేదు .వాటన్నిటితో వెహికిల్ మీ వాకిట్లో రెడీ .నువ్వు ఎక్కి సురూ చేయటమే ఆలస్యం ‘’అంటూ మనసులో ‘’ఈ తొక్క ప్రోగ్రాం ప్రసారం అయినప్పడుకదా’’అని వాడుమనసులో అనుకోన్నమాట నా మెదడు రికార్డ్ చేసేసింది   .’’వీడు ఇంత పకడ్బందీ ప్లాన్ లో వచ్చాడంటే లబ్ది బానే ఉంటుందని కక్కుర్తి పడి వడినీ వాన్ లో కుక్కి నేనూ ఎక్కాను .

ముందుగా పోలీస్ వారిని అడగాలని వారిదగ్గరకు వెళ్లాను .వాలిపోతూ సోలిపోతూ కుర్చీలో కూర్చోలేక పోతూ ,కాళ్ళు వాఛి  ఉన్నాడు పోలీసాయన .’’మైక్ ఆన్ చేయింఛి ‘’సార్ ! మీ పుష్కరం అనుభవం రికార్డ్ చేయటానికి తొక్కా టి వి వాళ్ళు నన్నుపంపారు చెప్పండి ‘’అన్నాను .’’నీరసం ఒళ్ళంతా వ్యాపించి కాళ్ళూ చేతులు స్వాధీనం కాకుండా ఉన్న ఆయన ‘’బలే అనుభవం సార్ .ఒకచోట కూర్చోకుండా నిలబడకుండా 24 గంటల డ్యూటీ చేశాం నడుం విరిగింది .అయినా ఆ జనం హుషా రేంటి సార్.విరగబడి వచ్చారు .వాళ్ళను చూస్తె ,మా అలసట మాయమైంది .కస్టమనిపించలేదు .ఇష్టం తోనే చేశాం .మాదేముంది సార్ .సి ఏం సార్అసలు నిద్రాహారాలు తీసుకొన్నారో లేదో అనిపించింది సార్.ఈ డ్యూటీలో ఆల్ హేపీ హేపీ సార్’’అని కూలబడిపోయాడు .

దారిలో 70 ఏళ్ళ ముసలాయన కనిపిస్తే ఆగి మైకం ఆనించాను ‘’సార్!మీ పుష్కరానుభవం చెప్తారా ‘’అని అడిగా ‘’ఓ తప్పకుండా .నేను 5 పుష్కరాలు చూశాను .అందులో ఇది ది బెస్ట్ .ఏర్పాట్లు పర్య వేక్షణ ఉచిత బస్ సౌకర్యం విశాల ఘాట్లనిర్మాణం ,పారిశుధ్యం ,ఉచిత టిఫిన్ కాఫీ భోజనాలు పోటీలు పడి ఏర్పాటు చేయటం,ముసలీ ముతకలను జాగ్రత్తగా కనిపెట్టి ఉండటం ఓహ్ మహా ఆనందంగా ఉంది .చంద్రబాబు దూర దృష్టికి టెక్నికల్ సైంటిఫిక్ నాలెడ్జ్ వాడకానికి పరాకాష్ట ఈపుష్కరం. గోదావరికీ ఇలానే చేశాడు .తపన ఉన్నవాడేచేయగలడు .మీద్వారా ఆయనకు ,ప్రభుత్వానికి అధికారులకు పోలీసులకు స్వచ్చంద సంస్థలకు ,విద్యార్ధులకు దాతలకు మా తరఫున అభినందనలు అందజేయండి ‘’అని గుక్క తిప్పుకోకుండా గురువుగారు వాయించి పారేశాడు .

అంతా పాజిటివ్ గానే ఉండే వ్యతిరేకం గా ఎవరూ చెప్పటం లేదే అని లోపల పీకు తోంది .సరే ఈ సారి పార్టీలవాళ్ళను వాళ్ళ ఆకాంక్షలను అడుగుదామని పించి ముందుగా జగన్ పార్టీఆయన కనిపిస్తే మైక్ ఇచ్చాను ‘’తొక్కలో పుష్కరానికి ఇంత ఖర్చా .పార్టీ రాజకీయమేకాని ప్రజాదృస్టి ఎక్కడ?అన్నాడు జగన్ పరిభాషలో .’’వచ్చే పుష్కరానికి మీ  లక్ష్యం ఏమిటి ‘’?అడిగా .మానాయకుడు పక్కనే ఉన్నాడు ఆయనే చెబుతాడు అని ఆయన్ను పిలుచుకొచ్చి మైకిచ్చాడు ‘’ఇదేం తీరు .ఎక్కడాప్రజలు ఇబ్బంది పడకుండా చేస్తే ఎలా ?మనల్ని ఎలా గుర్తుంచుకొంటారు  .తొక్కిసలాటలు ఉండాలి జననస్టం  కలగాలి .నేను వెళ్లి కావులించు కొంటూ ఓదార్చాలి ,సాను భూతి చూపాలి .నాకు ఆవకాశమే లేకుండా చేసి నోట్లో మట్టి కొట్టాడు  ‘’అన్నాడు .””మరి మీ లక్ష్యం “?’’ఏముందీ .కృష్ణను ఇడుపులపాయకు ,మా తండ్రిచనిపోయిన పావురాల దిబ్బకు పారించి అక్కడ పుష్కరం పెట్టటం ‘’అన్నాడు .ఆహా ఏమి కోరిక అనిపించి నోరుమేదాపక జారుకొన్నాం .

హస్త వాసి ఒకాయన కనిపిస్తే మైకిచ్చి ‘’వచ్చే పుష్కరాలకు మీ ప్లాన్ ఏమిటి ?’’అడిగా కంగారు లో ‘’అప్పటిదాకా మా పార్టీ ఉంటేకదా’’అని గబుక్కున నోరుజారి పక్కనున్న నాయకుడికిస్తే ఆయన ‘’అప్పుడు  మా రాష్ట్ర నాయకుడితో వారున జపం చేయించి కృష్ణ నీటిని మడకశిర ధర్మవరం దాకా తీసుకు వెళ్లి  ప్రతి ఊరికి కాలవలద్వారా పారిస్తాం .ఇంటికొక జల్లు స్నానం  పెట్టి ఇక్కడికొచ్చే శ్రమ లేకుండా చేస్తాం  .’’అన్నాడు .ఓహో ఇదేదో బానే ఉందనుకోన్నాను .ఇంకొంచెం ముందుకు వెడితే నారాయణ రాఘవులు చెట్ట పట్టాలేసుకొని ఖుషీగా కన్పించారు .పార్టీ వేదికల మీద ,సభల్లో ఎడమొగం పెడమొగం గా ఉన్న ఈ ఇద్దరు ఇంత జబర్దస్తీ దోస్తీచేస్తున్నారేమిటి అని బోల్డు ఆశ్చర్య పోయి జమిలిగా మైకిచ్చా ‘’మాకు ఇవి ఒంటికి పడవు .అయినా జనాల సెంటి మెంట్ ను గౌరవి౦ చాలికనుక ఈ సారి పుష్కరానికి రష్యాలోని ఒల్గానదిని చైనాలోని యాంగ్ చికియాంగ్ నదినీ కృష్ణానదిలో సంగమించేట్లు చేసి ఘన౦ గా రెడ్   బాడ్జీలతో పుష్కర శోభ తెస్తాం .’’’’మీకు అధికారం లోకి వచ్చే ఆశ ఉందా స్వామీ ‘’అన్నాను మైక్ కట్ చేసి ‘’అధికారమా మశానమా !ఉన్న అస్తిత్వమే పోతుంటే .మోడీ దెబ్బకు మా పేట్రన్ దేశాలే కుదేలైపోతే ‘’అన్నారు ఇద్దరు .

ఇంకా ఎవరు మిగిలారబ్బా అనుకొంటుండగా మజ్లిస్ నాయకుడు ఎదురయ్యాడు .’’వచ్చే పుష్కరాలకు మీ లక్ష్యం ఏమిటి ?’’అడిగా ‘’అరె భాయ్ !మా మతపోళ్ళు కొందరు పుష్కర స్నానం చేస్తుండగా ఫోటోలు వీడియోలు తీసి పెద్ద పబ్లిసిటి ఇచ్చారు ..అయినా మా వాళ్లకు పూర్తీ స్వాతంత్రం ఉంది అన్నిట్లో  మేం కాదనం .వచ్చే పుష్కరాలకు ‘’కాబా ,మక్కాలనుండి పవిత్ర జలాలు తెప్పించి పుష్కర జలాల్లో కలిపి శుద్ది చేస్తాం .ఇదే మా యాక్షన్ ప్లాన్ ‘’అన్నాడు .ఇంతలో గులాబీ చొక్కా ఆయన ఎదురయ్యాడు .మామూలు ప్రశ్నే అడిగా ‘’ఏందివయ్యా మీ బాబు అన్ని కోట్లు ఖర్చు చేసి అన్ని సౌకర్యాలు కలిగించి మా దిమా కరాబు చేసి౦డాడు  .మా నాయకుడు సిందుకే స్వాగతం పలక్క ,ఎవరినోపంపి చేతులు దులుపుకొంటే ,మీ బాబు ఆమెనూ గురువునూ ప్రత్యెక విమానం లో బెజవాడ రప్పించి కేంద్రమంత్రులు, స్వామీజీ ,కృష్ణా పుష్కర సమక్షం జనం ముందు ఘనం గా సన్మానించి నజరానా లు  అందించాడు మీ డబ్బులన్నీ దొబ్బెసిన మేమే ఇంతఘనంగా చేయలేకపోతే ,రోజూ అప్పుచేసిపప్పుకూడు తినే మీరింది వయ్యా ఇంతగొప్పగా చేసిండ్రు . .భేష్ వయ్యా .ఈ సారి పుష్కరాలకు మేము కృష్ణానది అంతా గులాబీ రంగుతో పారించి ,కృష్ణకు గులాబీరంగు అద్ది మా భక్తీ ప్రకటిస్తాం ‘’అన్నాడు .’’ .’’ఓరి నాయనో 1 ఇదేం ప్రాదేశిక భక్తీ అని అవాక్కయ్యాను .

ఇంకెవరినైనా ఇంటర్వ్యు చేద్దామంటే గత 12 రోజులకంటే ఎండ మండి మాడ్చేస్తోంది .పుష్కరం కిక్ లో ఆ ఎండలని భరించి స్నాన దాన ప్రదానాలు చేసి దైవ దర్శనంతో పులకించి తరించిన కోట్లాది పుష్కర భక్తులకు శుభా కాంక్షలు పలుకుతూ ఓవర్ టు తొక్కా చానెల్ .ఇది మీ తిక్కకు సరైన లెక్క .అనుభవించండి ‘’

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-24-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుష్క(ల )ర హాస్యం –2

11-కృష్ణా పుష్కర శోభను ఆకాశం నుంచి చూస్తున్న లక్ష్మీ పార్వతీ సరస్వతీ  పరవశించి అబ్బురపడి తన్మయం తో ఆనందిస్తూ ఉన్నా సహజమైన ఆడలక్షణం పోక ఒకరినొకరు సూటి పోటీ మాటలు రువ్వుకొంటున్నారు .ముందుగా పార్వతి ‘’అమ్మా లక్ష్మీ !మీ ఆయన పాదాల నుంచే నీళ్ళు కారాయని మేము బాధపడుతుంటే ఇప్పుడు ఏకంగా ఒళ్లంతా నీళ్ళు కారుతూ కృష్ణగా నల్లగా కనిపిస్తూ,చీమలు పిట్టలు కాకులతో సహ్యాద్రి పై ఉన్న అశ్వత్ధ వృక్షం నుంచి కారుతున్నాడు .నాకైతే కంపర మేస్తోంది బాబూ ‘’అంది .

లక్ష్మి తక్కువదా’’గురివింద గింజ సామెత రుజువు చేశావుకాని ఇక చాలు ఆపవమ్మా !మా అయన పుట్టిన చోటే తగుదునమ్మా అని మీ ఆయనా పచ్చి ఉసిరికాయల చెట్టు లోంచి కిందకు దూకి ,వేణి గా  మా ఆయనలో కలవలేదా “”అని అంటించింది  .

తానూ ఏదో ఒకటి మాట్లాడాలికనుక సరస్వతి ‘’ఏమోనమ్మా !ఎక్కడా లేని విడ్డూరం మీ ఆయనల్లో ఉంది .అయినా మగా మగా ఈ సంపర్కమేమిటి అసహ్యంగా .స్వజాతి సంపర్కంలా .పోనీ నదులే కదా ఆని సరి పెట్టు కొంటె , అంతటితో ఆగారా ?ఇద్దరూ  పరస్పర  వ్యామోహం తో కిందామీదా పడి అయ్యప్పనే కన్న మహానుభావులు .చెప్పు కొంటె సిగ్గేస్తోంది ‘’అంది నిష్టూరంగా .

అప్పుడు లక్ష్మీ పార్వతులు ‘’అమ్మా !ఇలా సూటీ పోటీ మాటలు అంటావనే  మీ ఆయనకు మా ఆయనలు గుడులే నిషేధించారు .ఒక్క గుడిలో అయినా మాకున్నట్లు మీ ఇద్దరి విగ్రహాలు ఉన్నాయా?చాలు చాల్లేవమ్మా ‘’అన్నారు .అవాక్కైంది సరస్వతి

అదే సమయం లో త్రిమూర్తులూ పుష్కర వైభవాలను చూసి ముచ్చటపడుతుండగా పై మాటలు వాళ్ళ చెవుల బడ్డాయి’’చూశారా ! లోకపూజలు అందుకొంటున్నా ,మన ఆడవాళ్ళకు ఆడ బుద్ధి పోలేదు ‘’బ్రహ్మవి మూడు విష్ణువుదొకటి ,శివుడివి అయిదు  మొత్తం   9  మొహాలతో ఆకాశమ౦ తా వినబడేలా పగలబడి నవ్వారు .

12-‘’ఒరేయ్ ! మా అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది కృష్ణ వేణి పేరు పెట్టారు .’’అన్నాడు ఇంకోడితో .ఇంకోడు ‘’మా అబ్బాయికి మగపిల్లాడు పుట్టాడు ‘’పుష్కర్ ‘’అని నామకరణం చేశాం ‘’అన్నాడు .ప్రక్కనే ఉన్న ఒక యాభై ఏళ్ళ పెద్దాయన ‘’మరి మొన్ననే నాకు 12 వ సంతానం కలిగింది .ఏం పేరు పెట్టాలో తెలీక బుర్ర గోక్కు౦టు న్నాను  ‘’ .వీళ్ళిద్దరూ ‘’పిండం ‘’అనిపెట్టు అన్నారు .ఆయన గుడ్లురిమి చూశాడు ‘’అదేనండి పిండజ’’అని పెట్టండి. అరిరే పీరు.బాగా కిక్  అవుతుందని వెళ్ళిపోయారు . ఉంటే కోడతాడేమో ననే భయం తో .

13-‘’గురూ ! బాబు పుష్కరాలకు మోడీని పిలిచాడా ?’’

‘’ఇది ఎవరింట్లో పెళ్లి .ఆయనే రావాలికాని  ఆహ్వానాలు కావాలా ?’’

‘’ఒక వేళ వచ్చి ఉంటే ఏమిచ్చే వాడు ?

‘’పూర్తిగా కృష్ణ నీటిలో మునిగి అడుగున దొరికిన ఇసక మట్టి నువ్వులు దర్భలు తీసి బాబు చేతిలో పెట్టి    ‘’కృష్ణార్పణం ‘’అనేవాడేమో !

14-‘’శాస్త్రీ !ఇదివరకు పుష్కరాలకు ముందు హేతువాదులు నాస్తికులు ఇదంతా ‘’మనువాదుల ‘’అకృత్యం అని ,ఇందులో సైంటిఫిక్ రీజన్ ‘’లేదని వాదించి పుంఖాను పుంఖాలుగా కరపత్రాలు పంచి పెట్టేవారు .ఇప్పుడు వాళ్ళ జాడే కనిపించట్లేదే ?’’

శాస్త్రి ‘’నిజమే శర్మా !పాపం వాళ్ళ మాట వినే నాధుడే లేడిప్పుడు .విశ్వాసానికి మించిన సైన్స్ లేదని ఆనాటి నుంచి ఈనాటి దాకా మనవాళ్ళందరూ ఘోషిస్తూనే ఉన్నారు .

మూర్తి ‘’అయ్యా శాస్త్రిగారు శర్మగారు ! ఊరవతల ఒక చోట టెంట్ వేసి ఎవరికీ తెలీకుండా పుష్కరాలు లాగిస్తున్నారని కర్ణాకర్నీగా  వినికిడి .ఇది నేను చెప్పానని నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్ ‘’అనగా అందరూ నవ్వుకొన్నారు .

15-‘’పంతులుగారూ !మానాన్నకు ఇద్దరు భార్యలు .మా అమ్మకు ఇద్దరు భర్తలు .నేను ఎవరెవరికి తర్పణాలు వదలాలో తెలియటం లేదు ‘’అన్నాడు

‘మరి నీ సంగతి ?’’పంతులుగారి ప్రశ్న .

‘’ముగ్గురు పెళ్ళాలు .నా చివరిపెళ్ళానికి అయిదుగురు భర్తలు ‘’అన్నాడు

‘’అందరూ కట్టకట్టుకొని కృష్ణలో పడి మునగండి చాలు ‘’విసుక్కొంటూ పంతులుగారు లేచిపోయాడు .

16-అందరూ ఆకాశం వైపు కన్నార్ప కుండా చూస్తున్నారు .ఏమిటి విశేషం అని తెలుసుకోవటానికి వెళ్లి అడిగాను

‘’బాబూ ! ఇప్పుడే పోలీసులు వాన్ లలో 80 మంది అంధులను అతి మర్యాదగా కార్లలో ఎక్కించుకొని వచ్చి ,ప్రతి ఒక్కరికీ దగ్గరుండి పుష్కర స్నానం చేయించి ,టిఫిన్ కాఫీ భోజనాలు సంతృప్తిగా పెట్టి గొప్ప సేవా ధర్మం చూపారు .ఇప్పుడే మధ్యాహ్నం అయిందిగా అదుగో ఆకాశం లో సకల దేవ రుషి గణాలు ,పుష్కర, కృష్ణవేణి తల్లి వారందరినీ మనసారా ఆశీర్వ దిస్తున్నారు .ఇంతకంటే పుష్కర మహాత్మ్యం ఏముంటుంది ‘’అని అందరూ ఆకాశం వైపుకు నమస్కరిస్తూ ఆనందం ప్రకటించారు .

17-‘’ఇంతటి సేవా భావం తెలంగాణలో కనపడలేదేం?’’ఒకాయన సూటి ప్రశ్న

‘’దండుకోనేవాడు ,పిండు కొనేవాడు ఒకడైతే ,దయా దాక్షిణ్యాలు మానవతా ప్రదర్శించేవాడు ఇంకోడు నాయనా .అందుకే అంత తేడా ‘’అన్నాడు పక్కవాడు

18-‘’గురూ !పుష్కరాలకు ఇంత ఖర్చు చేయాలా ? రోజూ హారతులివ్వాలా ,రోజూ బాబు ప్రత్యక్షంగా చూడాలా .నాకు మాత్రం చాలా సిల్లీ గా ఉంది ‘’అన్నాడొక సిల్లీ ఫెలో.

‘’శిష్యా ! పన్నెండు ఏళ్ళకోసారి వచ్చే అరుదైన అవకాశం .మనం తిన్నా తినక పోయినా అతిధి మర్యాదలను కాపాడాలి .పుష్కర స్నానం చేస్తేనో పిండ ప్రదానాలు చేస్తేనో మోక్షం వచ్చేదానికన్నా  ఇన్ని లక్షలమంది కి మర్యాద పూర్వక ఆతిధ్యమిచ్చి వాళ్లకు యే అసౌకర్యం కలగకుండా కంటి పాపల్లాగా కాపాడి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే వచ్చే పరమ సంతృప్తి ఇంకేది చేసినా రాదు .ఆ సంతృప్తీ ,ఆనందమే బాబు కళ్ళల్లో ముఖం లో ప్రస్పుటంగా కనిపిస్తోంది .మన ఇంట్లో కార్యక్రమం జరుగుతుంటే యజమాని ఎక్కడో కూచుంటే దానికి శోభ రాదు .అందరితో మమైకం అవ్వాలి అప్పుడొచ్చే సంతృప్తి ఇంకెప్పుడూ రాదు .దానికోసమే బాబు పడే శ్రమ .స్వార్ధం లేనప్పుడే ఇంతటి పరమానందం కలుగుతుంది ‘’అన్నాడు గురూజీ .

19-‘’శాస్త్రిగారూ! పుష్కరాలలో ఏదైనా ఇష్టమైంది వదలాలా “”?భార్యా భర్త ప్రశ్న

‘’వదిల్తే మంచిది నాయనా ‘”

‘’అయితే ఇష్టం తో కాదుకాని కష్టం తో మా ఆవిడను వదిలేస్తా ‘’అన్నాడు  భార్యా బాధితుడు

‘’కానిస్టేబుల్ !అని అరిచి ‘’మా ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు చూడండి ‘’అంది

‘’నాయనోయ్ ! కాశీకి వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు ‘’నిన్ను నేనెక్కడ వదల గలను బాబోయ్ ‘’అన్నాడు

20-సిపి ఐ నారాయణ ,సిపిఎం రాఘవులు పుష్కర ఘాట్లు చూసుకొంటూ వస్తూ ‘’జనం వెర్రికి హద్దులేదు .నది దేనికో ప్రతినిధి అట  మూఢ విశ్వాసం పెరుగుతో౦ది కాని తగ్గట్లేదు ‘’అనుకొంటున్నారు .ప్రక్కనే ఉన్నాయన ‘’అయ్యా మీగుర్తులు సుత్తీ కొడవలి మీ జెండాలు మీ విశ్వాసాలకు ప్రతినిదులుకావా ?’’అన్నాడు .కనిపించకుండా ఆ ఇద్దరూ పరార్ .

కృష్ణా పుష్కరం చివరి రోజు శుభా కాంక్షలతో

Inline image 1Inline image 2Inline image 3

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-23-8-16- కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -99

నా దారి తీరు -99

బదిలీ ప్రయత్నం వగైరా

స్కూలు  రోడ్డు ప్రక్కనే ఉంది .మైలవరం నుంచి తిరువూరు ,భద్రాచలం మొదలైన చోట్లకు చిలుకూరి వారి గూడెం మీదనుంచే పోవాలి .ఎక్స్ ప్రెస్ బస్సులు ఇక్కడ ఆగవు .కనుక మైలవరం లో దిగి సాధారణ బస్  కాని లారీ కాని ఎక్కి ఈ ఊరు రావాలి .స్కూల్  టైం కు చేరుకోవాలంటే ఉయ్యూరు లో కనీసం 5 గంటలకేబయల్దేరాలి .బెజవాడ చేరి అందుబాటులో ఉన్న బస్సెక్కి రావాలి .అప్పటికే ఇంటి దగ్గర టిఫిన్  చేసి కాఫీ కలిపి అయ్యగారికి రెడీ చేసేది మా శ్రీమతి .అన్నం వండి ,ఒకటో రెండో కూరలు ,పప్పు సిద్ధం చేసి కారియర్ సిద్ధం చేసేది  .ఇవన్నీ తీసుకొని దొరగారు బయల్దేరాలి .మధ్యలో ఎక్కడైనా బస్ మిస్ అయినా టెన్షన్ టెన్షన్ .మైలవరం బస్ స్టాండ్ లో టిఫిన్ బాగానే ఉండేది .అవసరమైతే తినేవాడిని .సమయానికి ఎలాగో అలా తంటాలు పడి స్కూల్ కు చేరేవాడిని .బట్టలు మాసిపోయేవి .ఒక్కోసారి ప్రయాణం అంటే భయమేసేది .అట్లాగే సాయంత్రం స్కూల్ వదిలాక ఇంటికి బయల్దేరటమూ బ్రహ్మ ప్రళయ మైపోయేది .బస్సులు సమయానికి రాక వచ్చినా ఖాలీలేక ఆటోలోనో లారీలోనో వెళ్లాల్సివచ్చేది మైలవరం నుండి సూపర్ ఫాస్ట్ లేక ఎక్స్ ప్రెస్ బసు ఎక్కి ఇబ్రహీం పట్నం నుంచి బెజవాడ చేరి మళ్ళీ ఆర్డినరి బస్ ఎక్కిఊరు చేరేవాడిని .ప్రయాణం నరకమయ్యేది మైలవరంనుండి మిల్క్ ప్రాజెక్ట్ మీదుగా బెజవాడ బస్ దొరికితే ఎక్కేవాడిని .ఏమైనా సోమవారం శనివారం ప్రయాణాలకు అటు నుంచి ఇటు ,ఇటు నుంచి అటు చాలా కష్టమై పోయేది .స్కూల్ బాగుంది పిల్లలు మేస్టార్లు మంచివాళ్ళు కమిటీ సహకారం బాగా ఉంది  స్కూల్ చుట్టుపక్కల  వాతావరణమూ బాగుంది .నన్ను ఇక్కడే ఉండిపోమ్మనే వారూ బాగా ఉన్నారు నాకూ చాలా ఇష్టమైన స్కూల్ ఇప్పటిదాకా చేసినవాటిలో .కాని ప్రయాణ బాధ భరించ లేక పోయేవాడిని .అలాంటి సమయం లో మాతమ్ముడు మోహన్ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చి నా బదిలీ ప్రయత్నాలకు ఊపు వచ్చింది .ఆ విషయాలు చెప్పేముందు మరికొన్ని విషయాలు చెప్పాలి .

,మామిడి కాయలు

స్కూల్ రోడ్డుకు దగ్గర గా ఉండటం ,రోడ్డుకిరువైపులా మామిడి చెట్లు ఉండటం ఈ స్కూల్ కు నాకు వరం అయింది .ఉయ్యూరు వెళ్ళేటప్పుడల్లా అటెండర్ దాస్ కు చెబితే మామిడికాయలు కోసి రెడీ చేసేవాడు .తీసుకు వెళ్ళేవాడిని. పుల్లూరులో ,మెరుసుమిల్లి గ్రామాలలో వెన్న పూసా బాగా మంచిది దొరికేది. లెక్కల మేస్టారికి చెప్పి డబ్బులిచ్చి కొని పించి తీసుకు వెళ్ళేవాడిని .కృష్ణ దాసు దాసుగారి అమ్మాయిసీత తో పాటు ,మరొక పొట్టి అమ్మాయి ఇంకొక మెరుసుమిల్లి తొమ్మిది చదివే అమ్మాయిప్రభావతి అనిజ్ఞాపకం –తెల్ల చొక్కా ఆకుపచ్చ పరికిణీ మీద వేసేది .మగ పిల్ల అని పించేది  .వీళ్ళే కాక  మగపిల్లలూ ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారు .ఎక్కడో బయట వంద కిలో మీటర్ల దూరం లో ఉన్నాను అనే ఫీలింగ్ వీరందరి వల్లా ఉండేదికాదు.  స్కూల్ అన్నివిధాలా అభి వృద్ధి చేశాం .అదొక ‘’తుత్తి’’.

స్కూల్ బోర్డ్ లు

స్కూల్ కు డిస్ ప్లే బోర్డ్ లు ఉండాలి అవేవీ లేవు ఇన్స్పెక్షన్ కు ముందే వివరాలన్నీ సేకరించి ముందుగా ‘’గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ‘’బోర్డ్ తయారు చేయించాను. అంటే స్కూల్ పుట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు యేయే హెడ్ మాస్టర్లు ఎంత కాలం పని చేశారో వివరాలు అన్నమాట .తర్వాత  టెంత్ క్లాస్ రిజల్ట్  బోర్డ్  .యే సంవత్సరం యెంత రిజల్ట్ వచ్చింది ,స్కూల్ ఫస్ట్ ఎవరు వివరాలన్నమాట .తర్వాత 7 వ తరగతి జిల్లా కామన్ పరీక్షలలో ఉత్తీర్ణతా శాతం స్కూల్ ఫస్ట్ విద్యార్ధి వివరాలు .ఆ తర్వాత స్టాఫ్ పర్టిక్యులర్స్ .హెడ్ మాస్టర్ తో ప్రారంభించి సీనియారిటీ ప్రకారంబి ఎడ్ అసిస్టంట్ట్లు సెకండరి గేరేడ్ లు , ,తెలుగు హిందీ డ్రిల్ డ్రాయింగ్ అటెండర్ నైట్ వాచ్మన్ తో సహా వివరాల బోర్డ్ కూడా తయారు చేయించాను. ఇవి రాయటానికి పెయింటింగ్ చేయటానికి డ్రాయింగ్ మాస్టారు లేదు  కనుక ప్రైవేట్ ఆర్టిస్ట్ తో డబ్బు లిచ్చికామన్ గుడ్ ఫండ్ నుంచి ఖర్చు చేసి  రాయించాను .వీటితో స్కూల్ కు సమగ్రతః ఏర్పడింది అందమూ వచ్చింది .ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయికనుకనే ఇన్స్పెక్షన్ లో మంచి రిమార్క్ లు పొందగాలిగాం .గార్డెన్ వర్క్ చా లా ప్రోత్సాహకంగా ఉండేది. కూరగాయల వలన రాబడీ వచ్చేది .కనుక ఎందుకు ఈ ఊరు వదలాలి అని మనసు పీకేది .నేను వెళ్ళటం ఎవరూ హర్షించే విషయమూ కాదు కూడా .

స్కూల్ కు గుమాస్తా లేదు అన్నీ ఆచారిగారే చెయ్యాలి పే బిల్స్ జీతాలబట్వాడ నామినల్ రోల్స్ తయారీ పరీక్షల ఏర్పాట్లు అన్నీ ఆయనే చేసేవారు .బెజవాడ నుండి ఉమాశంకర్ అనే ఆయన వస్తాడని బాగా ప్రచారం జరిగింది .కాని రాలేదు ఆయన బాగా పలుకుబదిఉన్న తోట్ల వల్లూరు బ్రాహ్మిన్ .కనుక రాలేదు .మైలవరం పంచాయితీ రాజ్ లో లో జూనియర్ గుమాస్తా ప్రసాద్ అనే కుర్రాడిని వేశారు .తండ్రి టీచర్ చనిపోతే కొడుక్కి ఉద్యోగం ఇచ్చారు .బాగానే పని చేసేవాడు .కనుక గుమాస్తా బాధా తీరింది .

ఇక్కడ ఉండగానే  రెండవ మేనల్లుడు అంటే చిన్నక్కయ్య బావలకుమారుడు ఛి .మృత్యుంజయ శాస్త్రి ,ఛి సౌ విజయలక్ష్మి ల వివాహం హైదరాబాద్ లో జరిగితే వెళ్లాను .తిరిగి వచ్చేటప్పుడు అ౦చ లంచేలు మీద రావటం తో పాంట్ షర్ట్ రైలు ఇంజన్ లో బొగ్గు వేసేవాడి బట్టల్లా నల్లగా మారిపోయాయి .స్కూల్ దగ్గర గప్ చిప్ గా దిగి  స్నానం చేసి బట్టలు మార్చుకొన్నాను. ఇదొక తమాషా అనుభవం నాకు

శ్రీ వి .హనుమంత రావు గారి రికమండేషన్ లెటర్ – మేడూరు కు ట్రాన్స్ ఫర్

హైదరాబద్ బి. డి .ఎల్ .లో పని చేసే మా తమ్ముడు మోహన్ ఒక సారి ఉత్తరం రాస్తూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన శ్రీ వి .హనుమంత రావు గారి బామ్మర్ది తన దగ్గర పని చేస్తున్నాడని రోజూ ‘’సార్ !మీరు నాకు ఉద్యోగం ఇచ్చి చాలాహేల్ప్ చేశారు .మాబావగారి ద్వారా ఏదైనా పనికావాలంటే ఇట్టేచేయించి పెడతాను ‘’అనే వాడట ఈవిషయంనాకు రాసి ఉయ్యూరు చుట్టూ పక్కలకు చేరాలంటే ఇదే మంచి అవకాశం అన్నాడు. సరే ప్రయత్నం చేయమన్నాను .బామ్మర్ది బావకు ఏం చెప్పాడో తెలియదు కాని పది రోజుల్లో శ్రీ హనుమంతరాగారు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పిన్నమ నేని కోటేశ్వర రావు గారికి నన్ను ఉయ్యూరు లేక దానికి అతి దగ్గరలో ఉన్న స్కూల్ కు ట్రాన్స్ ఫర్ చేయమని రికమండేషన్ లెటర్ రాసి ఇచ్చారు .దాన్ని బామ్మర్ది మా వాడికిస్తే వాడు నాకు పోస్ట్ లో వెంటనే పంపేశాడు .ఈవిషయం ఎవరికీ చెప్పలేదు చాలా  రహస్యంగా నే ఉంచాను . మా ఆవిడకూ చెప్పలేదు .ఒక శని వారం ఉయ్యూరు వెళ్లి ఆ సీల్డ్ రికమెండేషన్ లెటర్ ను చైర్మన్  శ్రీ కోటేశ్వర రావు గారిని జిల్లా పరిషత్ ఆఫీస్ లోకలిసి అందజేశాను .అయన ఆశ్చర్యంగా ఒక సారి తలపైకెత్తి నా వైపు చూసి నవ్వుతూ కాంప్ క్లెర్క్ కిచ్చి అర్జెంట్ గా ఈపని పూర్తిచేయమని చెప్పారు .నేను తర్వాత చిలుకూరివారి గూడెం వచ్చి నా పనులు నేను చేసుకు పోతూనే ఉన్నాను. లెక్కల మేస్టారికి శేషగిరి రావు గారికి కూడా రహస్యం చెప్పలేదు .ఒక రోజు టపాలో నా ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది నన్ను మేడూరుకు ట్రాన్స్ ఫర్ చేసి ఇక్కడ నా పోస్ట్ లో మైలవరం నేటివ్ నాలాగానే సైన్స్ మేస్టర్, నాకు రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజి లో సహాధ్యాయి నల్లగా ఎత్తుగా తెల్ల బట్టలతో ఉండే రామా రావు ను వేశారు .నేను ఇక్కడికోచ్చినప్పుడుకూడా నా ట్రెయినింగ్ మేట్ జి .హెచ్. హనుమంతరావు ను ఇక్కడినుండి కాజ కు ట్రాన్స్ ఫర్ చేసి, నన్ను చిలుకూరివారి గూడెం హెడ్ మాస్టారుగా వేశారు .నేను రిలీవ్ చేసినవాడు నన్ను రిలీవ్ చేసిన వాడూ నా సహాధ్యాయు లవటం తమాషా గా ఉంది .స్టాఫ్ అంతా షాక్ తిన్నారు .చెప్పకుండా ఎందుకు చేశారీపని అని కమిటీ ప్రెసిడెంట్ రెడ్డిగారు వచ్చి గోల చేశారు .శేషగిరిరావు గారిముఖాన నెత్తుటి బొట్టు లేదు. దిగాలు పడిపోయారు ..ఏదో అందరికి సర్ది చెప్పాను .మంచి టీపార్ర్టీ సెండాఫ్  పార్టీ ఇచ్చారు .ఒక ఆల్ఫా సూట్  కేస్ ను బహుమతిగా  అందజేశారు దాన్ని చాలా ఏళ్ళు వాడాను .పిల్లలందరూ బార హృదయం తో వీడ్కోలు చెప్పారు .ప్రయాణం భారం తప్పిందికదా అని నేను సంతోషించాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-22-8-16-ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

దిగ్విజయంగా ముగిసిన మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం

దిగ్విజయంగా ముగిసిన మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం

ఆగస్ట్ 19, 20, 21 (2016)  తేదీలలో  సాయంత్రం హైదరాబాద్ లో శ్రీ త్యాగరాజ గాన సభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం విజయవంతంగా జరిగింది. పలు రాష్ట్రాలు, నగరాల నుండి సుమారు 100 మంది మహిళా రచయితలూ, సాహితీవేత్తలూ ఈ మహా సభలలో పాల్గొని ప్రసంగించారు.

మొదటి రోజు (ఆగస్ట్ 19, 2016) సాయంత్రం 6 గంటలకి సుప్రసిద్ధ రచయిత్రి డి. కామేశ్వరి గారి జ్యోతి ప్రజ్వలన, లక్ష్మీ పద్మజ ప్రార్థనా గీతంతో కేవలం మహిళా రచయితలకి మాత్రమే అయిన ఈ ప్రత్యేక సాహిత్య వేదికకి డా. ముక్తేవి భారతి అధ్యక్షత వహించగా డా. ముదిగంటి సుజాతా రెడ్డి గారు ముఖ్య అతిధిగానూ, శారదా అశోక వర్ధన్, పోల్కంపల్లి శాంతా దేవి, డా. అమృత లత (నిజామాబాద్), కొండవీటి సత్యవతి, కళా శారద విశిష్ట  అతిధులుగా వేదికని అలంకరించారు. డా. తెన్నేటి సుధా దేవి గారు స్వాగత వచనాలు పలికి సభా నిర్వహణకి నాందీ ప్రస్తావన చేయగా పలకగా సుప్రసిద్ద గాయని సుచిత్ర బాలాంత్రపు ఆహ్వానిత అతిథుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. వక్తలు ఈ నాటి సాహిత్య వాతావరణం, పుస్తక ప్రచురణలో రచయిత్రులకి ఉన్న ఇబ్బందులు,  సంఘటితం గానూ, వ్యక్తిపరంగానూ సాహిత్యాభివృద్ధికి చేయ వలసిన అంశాల మీద సముచితంగా ప్రసంగించారు. పొత్తూరి విజయ లక్ష్మి, నెల్లుట్ల రమా దేవి తమ హాస్య కథానికలని వినిపించి ఆహుతులని నవ్వులతో ముంచెత్తగా, తమిరిశ జానకి, శైలజా మిత్ర, ఐనంపూడి శ్రీ లక్ష్మి, సి. భవానీ దేవి, మండపాక మహేశ్వరి, తదితరులు స్వీయ రచనా పఠనం, పద్య పఠనం, తదితర సాహిత్య ప్రసంగాలతో సుమారు వంద మంది సాహిత్యాభిమానులని ఆకట్టుకున్నారు.

రెండవ రోజు ఆగస్ట్ 20, 2016 ఉదయం 10 గంటలకి జ్యోతి ప్రజ్వలన అనంతరం ముందుగా స్త్ర్రీల పాటల మీద స్నేహలతా మురళి గారి సోదాహరణ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తరువాత విరామం లేకుండా సుమారు నాలుగు గంటల పాటు 18 మంది రచయిత్రులు  అనేక అంశాలపై సాధికారంగా తమ ప్రసంగాలు వినిపించారు. తెనాలి రామకృష్ణుడు తీర్చిదిద్దిన  స్త్రీ పాత్రల మీద నందివాడ అనంత లక్ష్మి తాళ్ళపాక తిమ్మక్క మీద మంగళగిరి ప్రమీలా దేవి, భాగవతంలో మానవతా విలువల మీద వారిజా రాణి గారు, మొల్ల రామాయణం మీద సర్వ మంగళ గౌరి, ప్రాచీన సాహిత్యంలో సామాజిక బాధ్యతల మీద కస్తూరీ అలివేణి, శతక సాహిత్యం మీద కూలంకషంగా జరిగిన కోటంరాజు రమా దేవి గారి ప్రసంగం, నవలా సాహిత్యం మీద సమగ్ర సమీక్ష చేసిన ఇంద్రగంటి జానకీ బాల ప్రసంగం, ఆధునిక సాహిత్యంలో కవిత్వం మీద అత్యంత ఆసక్తికరంగా, సాధికారంగా ఆచార్య శరత్ జ్యోత్స్నా రాణి అభిభాషణ, ఆధునిక సాహిత్యంలో కథానిక మీద కె. బి. లక్ష్మి సమగ్ర విశ్లేషణ, రాయసం లక్ష్మి, వి. త్రివేణి, వై. కామేశ్వరి, ప్రభల జానకి, కె. లలిత, సంధ్యా రాణి, బి.జ్యోతి, శ్రీ మణి గారి ప్రసంగాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

తరువాత జరిగినన స్వీయ రచనా విభాగంలో మున్నంగి కుసుమ, లంక సీత, మల్లాది పద్మజ, ములుగు లక్ష్మీ మైథిలి, శ్రీ వల్లీ రాధిక, వరలక్ష్మి, మీనీషా జోస్యుల, వారణాసి నాగ లక్ష్మి గారి ఆకట్టుకున్న కవిత, రాజీవ, శ్రీ లక్ష్మి, ఘంటసాల నిర్మల, మిరియాల లలిత గారి ప్రచార కవిత్వం, పోతన జ్యోతి, లక్కరాజు నిర్మల వైవిధ్యమైన కవితా పఠనం, లావణ్య, సీనియర్ రచయిత్రి వెంపటి హేమ మొదలైన వారు తమ రచనలు వినిపించారు.

ఆఖరి విభాగంలో ఆధునిక సాహిత్యంలో కథానిక మీద సాధికారంగా ప్రసంగించిన సీనియర్ రచయిత్రి పోలాప్రగడ రాజ్యలక్ష్మి, టీవీ చానెల్స్ -సమాజ ప్రభావం మీద తమ అనుభవాలని క్రోడీకరించి ప్రసంగించిన విజయ దుర్గ, టీవీ చానెల్స్ లో స్త్రీ పాత్రల చిత్రీకరణ, సీరియల్స్ ప్రభావం మీద ఆవేదనా భరితంగా ప్రసంగించిన ఉషా రాణి, గురజాడ శోభా పేరిందేవి, చలన చిత్రాలలో జానపద గేయాలపై ఆయా పాటలు పాడుతూ విశేషించిన సుప్రసిద్ద గాయని, వ్యాఖ్యాత సుచిత్ర ప్రసంగం సభికులని బాగా ఆకట్టుకున్నాయి. ఆఖరి అంశంగా కేతవరపు రాజ్యశ్రీ ఆదునిక కవితా రీతుల పై సమగ్ర ప్రసంగం చేశారు.

ఉదయం 10 గంటల నుండి సాయత్రం 6 దాకా నిర్విరామంగా సాగిన ఈ రెండవ రోజు కార్యక్రమంలో సుమారు 50 మంది మహిళా రచయితలు ఉత్సాహంగా పాల్గొన్నారు.  సుప్రసిద్ధ సాహితీ వేత్త ఆచార్య ఆవుల మంజులత గారు సభకి విచ్చేసి తమ సందేశాన్ని వినిపించి ఈ నాటి సాహిత్య సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.

ఆగస్ట్ 21, 2016 ఉదయం 10 గంటలకి జ్యోతి ప్రజ్వలన అనంతరం ముందుగా కన్నెగంటి అనసూయ, కుప్పిలి పద్మ, తెన్నేటి సుధా దేవి ల స్వీయ కథా పఠనంతో సభ ప్రారంభం అయింది. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో వి. శైలజ (సిద్ధ్దిపేట), వాణిశ్రీ, శ్రీ లక్ష్మి (గుడివాడ), కందేటి రాణి ప్రసాద్ (సిరిసిల్లా),సుజనా దేవి (కరీం నగర్), మెర్సీ మార్గరెట్, గొడవర్తి సంధ్య తమ కవితలు వినిపించారు. తరువాత విభాగంలో పత్రికా నిర్వహణలో ఇబ్బందుల మీద కాశీనాధుని సువర్చలా దేవి, పత్రికా నిర్వహణ బాధ్యతలపై పొత్తూరి జయ లక్ష్మి సుదీర్ఘ ప్రసంగం, పత్రికా రంగంలో మహిళల పాత్ర మీద సూర్య కుమారి (ఖమ్మం), నిజ జీవితానికీ, టీవీ సీరియల్స్ లో స్త్రీ పాత్రలకీ తేడా పై చెంగల్వల కామేశ్వరి, బతుకమ్మ పాటల మీద తిరునగరి దేవకీ దేవి, తెలంగాణా పండుగల మీద ఆచార్య సూర్య ధనుంజయ్, మన పండుగలు, సంప్రదాయాల మీద తెన్నేటి హేమ నళిని, నాటక రంగం లో స్త్రీలు అనే అంశం మీద అత్తలూరి విజయ లక్ష్మి సాధికార ప్రసంగం, చలన చిత్రాలలో సెన్సార్ బోర్డ్ పాత్ర మీద సెన్సార్ బోర్డ్ సభ్యులు, నటీమణి, దివ్యాంగులకి ఆదర్శ మహిళ పద్మ ప్రియ ప్రసంగం, జానపద సాహిత్యంలో స్త్రీ అనే అంశం మీద రాజ మల్లమ్మ, వల్లూరి రేవతి స్వీయ కవితా గానం అందరినీ ఆకట్టుకున్నాయి.

ముగింపు సమావేశం లో డా. నందమూరి లక్ష్మీ పార్వతి ముఖ్య అతిథిగా మంచి సాహిత్య ప్రసంగం చేశారు. డా. కె.వి. కృష్ణ కుమారి, డా. మంథా భానుమతి విశిష్ట ప్రసంగాల అనంతరం మహిళా రచయితలకి పురస్కార ప్రదానం జరిగింది. ఈ ముగింపు సభలో వంగూరి చిట్టెన్ రాజు పాల్గొన్నారు.

దిగ్విజయంగా జరిగిన మూడవ జాతీయ మహిళా రచయిల సమ్మేళనం ఫోటోలు కొన్ని ఇందుతో జతపరుస్తున్నాను. మూడు రోజుల ఫోటోలు అన్నీ ఈ క్రింది లంకెలలో చూడవచ్చును.

 

August 19, 2016: Inagural Day photo.

https://onedrive.live.com/?authkey=%21AMwfHPgcKd0cX6I&v=photos&id=698227D5154D95E0%2110133&cid=698227D5154D95E0

August 20, 2016 : Photos

https://onedrive.live.com/?authkey=%21AEK_bYkztD59vmE&v=photos&id=698227D5154D95E0%2110228&cid=698227D5154D95E0

August 21, 2016: Photos

https://onedrive.live.com/?authkey=%21ACHVqqumLRZrDH8&v=photos&id=698227D5154D95E0%2110438&cid=698227D5154D95E0

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పుష్క(ల )ర హాస్యం

పుష్క(ల )ర హాస్యం

1-       అప్పుడే ఒకడిని కత్తితో కసక్కున చంపి ఒక రౌడీ ఒక ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ కాళ్ళపై పడి చేసిన తప్పు చెప్పి ‘’స్వామీ కృష్ణా పుష్కరం లో మునిగితే నా పాపం పోద్దా ?’’అని అడిగాడు .

వెంటనే స్వామి ‘’’’నువ్వు మునిగి పోతే’’ అంతా పోతుంది నాయనా ‘’అన్నాడు .

2-      కృష్ణకు హారతి ఇవ్వటానికి జనం లోంచి దూసుకెళ్లిన ఒకడు పక్కవాడితో ‘’ఇంత పెద్ద’’ గోదా- కృష్ణ ‘’కు ఈ హారతులు చాలవేమో గురూ ?’’అన్నాడు.

పక్కవాడు ‘’నువ్వైతే నీళ్ళపై పెట్రోల్ పోసి హారతిచ్చేవాడివా టింగిరి నాయాలా ‘’అని విసుక్కున్నాడు .

3-      ‘’మా నాన్నకు పాతిక వేలు పెట్టి పుష్కరం పెట్టాను తెలుసా ?’’అన్నాడొక బాజా రాయుడు పదేళ్ళ తర్వాత బెజవాడ పుష్కరం లో కలిసిన గుడివాడ ఫ్రెండ్ తో

‘’అలాగా ! నిన్న సాయంత్రమే గుడివాడలో మీ నాన్న తో మాట్లాడానే ! అప్పుడే పోవటం పుష్కరం పెట్టటం కూడా అయిందా ?ఆశ్చర్యంగా అడిగాడు గు. మి.

‘’ఒరే!పదేళ్ళ కిందట మానాన్నను మా ఆవిడ సరిగ్గా చూడటం  లేదని కోపం తో ఇల్లు వదిలి వెళ్లి పోయాడు .పోయాడనే అనుకొన్నాం .మా ఆవిడ’’ పుష్కరం పెట్టి మీ నాన్న పీడా విరగడ చేసుకో మంటే పాతిక వేలు క్షవరం చేసుకొని పెట్టాన్రా బాబూ .మా నాన్న బతికే ఉన్నాడన్నమాట .నేను బతికున్న సంగతి ఆయనకు మాత్రం చెప్పకురా ప్లీజ్ ‘’అన్నాడు బె .మి .

4-‘’ఒరే! చంద్రబాబు మరీ పిసినారి .వత్తులతో నక్షత్ర హారతిప్పిస్తున్నాడు ‘’అన్నాడు ఇంకో ఠికానా లేని వాడితో

రెండో వాడు ‘’అయితే ఏం చేయాల్రా ?’’అడిగాడు

మొ. వాడు ‘’రాకెట్ పంపించి నక్షత్రాలని తెంపుకొచ్చి హారతివ్వచ్చుగా ‘’అన్నాడు .

4-      బికినీతో ఆమె ,పోట్టినిక్కర్ తో వాడు పుష్కరానికొచ్చారు .ఆమె స్నేహితురాలు కనిపించి ‘’ఒసే సుశీ !మొన్నేకదే మీ పెళ్లి అయింది .అప్పుడే పుష్కరానికొచ్చారేం “”?అని అడిగింది

సుశి ‘’మీ అన్న టింగ రోడే.ఎక్కడికీ కదలడు .నేనే హనీ మూన్ కి  పుష్కరానికి లాక్కొచ్చా ‘’అంది.

5 –ఒక పల్లెటూరాయన సంచీనిండా సామానుతో పుష్కర స్నానానికి వచ్చి బ్రాహ్మడి దగ్గరకెళ్ళి ‘’పంతులు గారూ !ఇవాళ పండు ,కూర ,పుస్తకం దానం చేయమని పంచాంగం లో ఉంది ,పుచ్చుకోండి ‘’అన్నాడు

గిరాకీ  లేని ఆయన తలో కిలో కూరలు డజను పళ్ళు ఏదైనా భాగవత గ్రంధం లాంటిది దానం ఇస్తాడేమోనని ఆశతో ‘’సరే’’నన్నాడు .వాడు సంచీ అంతా కెలికి ‘’పంతులుగారు !రేట్లు మండిపోతున్నాయి .ఏదీ కొనేట్టు లేదు’’ అని పండు కు ప్రత్యామ్నాయంగా పావలా విబూది పండు ,కూరకు బదులుగా ఒక కొత్తిమిరకాడ ,పుస్తకానికి బదులు పావలా ఎక్కాల పుస్తకం చేతిలో పెట్టాడు .’’ఓరి నీ పిండం పిచికలకు పెట్టా ‘’అని మనసులో అనుకోని చెంబెడు నీళ్ళు వాటిమీద దిమ్మరించి  కృష్ణలో కలపమన్నాడు.

6         ఒకడు పుష్కరానికొచ్చి స్నానం చేయకుండా వాచీ చూసుకొంటూ కాలం గడుపుతున్నాడు .ఇది గమనించి ఒక పెద్దాయన ‘’ఏమిటి నాయనా దేనికోసం ఎదురు చూస్తున్నావ్ ‘’అని అడిగాడు

‘’ఏం లేదండీ !మధ్యాహ్నం పన్నెండున్నర ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాను ‘’అన్నాడు .’’ఏమిటి దాని ప్రత్యేకత ?అడిగాడు .’’తెలియదా మీకు  .ఆ సమయం లో ముక్కోటి దేవతలు పుష్కరుడు బృహస్పతి పుష్కర జలం లో ఉంటారు కదా అప్పుడు స్నానం చేస్తే కనిపిస్తారేమో నని’’ అన్నాడు ఆ అమాయక బ్రహ్మ ‘’స్నానం చేస్తే కనిపించరు .స్నానం చేస్తూ’’ పోతే ‘’వాళ్ళే కనిపిస్తారు ‘’అని చమత్కరించాడాయన .

7-‘’స్వామీ !పుష్కరాలలో వాగ్దానం చేసి నెరవేర్చక పోతే ఏటవుద్ది ?’’ఒక డౌటేశ్వర్.

‘’ఏమీకాదు .తెలంగాణా ప్రభుత్వం ఉచిత ఫలహారాలు భోజనాలు అని హోర్డింగ్ లతో హోరెత్తించి పిడికెడు మెతుకులు కూడా రాల్చలేదు .ఏమయింది ?నాయకుల వాగ్దాన వైఫల్యం ప్రమోషన్ కు దారి .పుష్కరుడు కూడా ఏమీ పీకలేడు ‘’అన్నాడు స్వామీజీ గడ్డం సాఫు చేసుకొంటూ .

8–‘’పాపం బాబు ఉచిత టిఫిన్ భోజనం ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తూ కంటికి నిద్రలేకుండా పర్య వేక్షిస్తున్నాడు కదా స్వామీ .కేంద్రం నుంచి ఏదైనా రాల్పిస్తాడా పుష్కరుడు ?’’

‘’ఏం రాల్పిస్తాడు నాయనా ! మట్టీ మశాన్నం తప్ప .ఏదో మెతుకులు విసిరినట్లు ఇవ్వాల్సినవాటినే వందో వంతు రాలుస్తుంటే .ఆయన మాత్రం ఏం చేస్తాడు ?కస్టపడేవాడికి ఫలితం లేటు .మాటలగారడీ వాడికి సద్యో ఫలితం ‘’అన్నాడు నిర్లిప్తంగా స్వామి.

9—‘’గురవా !ఇన్నికోట్లమంది పుష్కర స్నానం చేస్తే మనపాపాలన్నీ తొలగించి పుష్కరుడు ఈ పాపా౦మూట మోస్తాడా పాపం ‘’అన్నాడొక సామాన్యుడు .

‘’అందుకే గదరా సన్నాసీ –ఇవన్నీ వదిలించు కోవటానికి ఆయనకు 12 ఏళ్ళు పట్టేది . అప్పటిదాకా మన మొహం చూడడు.

10 –‘’పుష్కరాలకు పుష్కలం గా వస్తున్న అశేష జన సందోహాల భక్తీ శ్రద్ధలకు ,నమ్మక విశ్వాసాలకు  సంస్కృతీ పారంపర్యానికి ఘనంగా నమస్కరిస్తూ సరదాకోసం రాసిన దీన్ని’’ లైటర్ వీన్’’ గా తీసుకోమని ప్రార్ధిస్తున్నాను –

మీ– దుర్గా ప్రసాద్ –22-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నాదారి తీరు -98 చిలుకూరివారి గూడెం హైస్కూల్ లో చదువు ,ఇతర విషయాలు

నాదారి తీరు -98

–చిలుకూరివారి గూడెం హైస్కూల్ లో చదువు ,ఇతర విషయాలు

సాధారణం గా హెడ్ మాస్టర్ గా ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ పోయెట్రి వారానికి మూడో నాలుగు క్లాసులు ,ఒకటో రెండో మోరల్ క్లాసులు పదవతరగతికి తీసుకొనికాలక్షేపం చేస్తూ  అడ్మినిస్ట్రేషన్ భారం అంటూ తప్పించుకొంటారు .కాని నేనెప్పుడూ అలా చేయలేదు .ఇక్కడి కారణాలు చాలా ముఖ్యమైనవి .పదవ తరగతి లో సెకండరీ గ్రేడ్ మాస్టారరు శేషగిరి రావు గారబ్బాయి   మాంచి తెలివి తేటలున్నవాడు శ్రీనివాస్ ,అలాగే ఆడపిల్లల్లో బాగా చదివే బాలమ్మ అనే అమ్మాయి ఉన్నారు .వీళ్ళను దృష్టిలో పెట్టుకొని శేషగిరిరావుగారు నేను జాయిన్ అవగానే ‘’సార్ ! టెన్త్ క్లాస్ ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ మీరు తీసుకొంటేనే న్యాయం జరుగు తుంది ‘’అని దాదాపు వేడుకొన్నట్లుగా సూచించారు .నేను ప్రతివార౦ ఉయ్యూరు వెళ్ళాలి ఎలా అని ముందు కొంచెం సందేహించా .కాని సవాలుగా తీసుకొన్నా .ఈ రెండూ చాలా బరువైన సబ్జెక్ట్ లు ఎంత చెప్పినా ,ఎన్ని పీరియడ్ లు బోధించినా చాలనివి .కనుక వారానికి మాక్సిమం పీరియడ్లు రెండు సబ్జెక్ట్ లకునేనే తీసుకొని బోధించేవాడిని .మెరిట్ స్టూడెంట్ లు ఉంటేమరీ రెచ్చి పోవటం నాకున్న పెద్ద జబ్బులాంటి అలవాటు. వాళ్లకు ఒక్కమార్కు కూడా తగ్గరాదు అనే ఆరాటంనాది .ఇది బాగా ఫలించింది  ఏ మాస్టారు సెలవు పెట్టినా, టెన్త్ కు ఎక్స్ట్రా వర్క్ నాకే వేయమని చెప్పి వేయించుకొని స్లిప్ టెస్ట్ లకు వారం ముందు  క్వార్టర్లీ హాఫియర్లీ, పరీక్షలకు పది పది హీను రోజుల ముందే కోర్స్ పూర్తీ చేసి థరోగా రివిజన్ చేసి సబ్జెక్ట్ కరతలామలకం చేసేవాడిని .ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా అదే పధ్ధతి అలవాటైన పధ్ధతి .క్లాస్ లో పాఠం చెబితే దాదాపు ఇంటికి వెళ్లి చదవాల్సిన అవసరం లేకుండా చేసేవాడిని .మర్నాడు క్లాస్ కు వచ్చేటప్పటికి అంతా హృదయ గతం గా ఉండేది .నిన్నటి దానిపై ప్రశ్నలడిగి జవాబులు చెప్పించటం ముఖ్యమైన నిర్వచనాలు దాదాపు క్లాసు లో అందరితో అనిపించటం తో విద్యార్ధులలో మంచి హుషారు వచ్చి దూసుకు పోయేవారు .

ఇదికాక నేను తెల్లవారు జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సంధ్య ,పూజ ‘’చదువు’’కొని ఎనిమిదింటికల్లా సిద్ధంగా ఉండేవాడిని .ఒక వైపు స్టవ్ మీద వంట చేస్తూ టెన్త్ పిల్లలకు లెక్కలు కూడా చెప్పేవాడిని .మోడల్ లెక్కలు చేయించి బిట్ లతో సహా సిద్ధం చేసేవాడిని .అంటే మూడు ముఖ్యమైన సబ్జెక్ట్ లు చెప్పేవాడినన్నమాట. కమిటీ ప్రెసిడెంట్ వచ్చి అభినందించేవారు .ఒకసారి శాసన సభ్యులు శ్రీ కోమటి భాస్కర రావు గారింటికి తీసుకొని వెళ్లి నా గురించి బాగా చెప్పేవారు .కాని నేను కాంగ్రెస్ అభిమాని కాదని తెలుగు దేశం వాడినని తెలుసుకొన్నారు .నేనేమీ ప్రచారం చేయలేదు మాటవస్తే అభిమానం చాటే వాడిని అంతే.రాత్రిళ్ళు హాస్టల్ విద్యార్ధులను చదివి౦చేవాడిని .హిందీతో సహా యే సబ్జెక్ట్ లో అనుమానం వచ్చినా తీర్చేవాడిని .అది వాళ్లకు ప్లస్ పాయింట్ అయింది .

టెన్త్ క్లాస్ పరీక్షలు మైలవరం లో రాయాలి ఈ స్కూలు పిల్లలు .గవర్నమెంట్ హై స్కూల్ కు నన్ను డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా వేశారు .చీఫ్ సూపరింతెండ్ నాకు పూర్వ పరిచయం ఉన్న బెజవాడ ఆయనే .ఇక్కడ కాపీలు బాగా జరుగుతాయని ప్రచారం బాగా ఉండేది .నేను చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడిని .ఎవ్వరి దగ్గరా స్లిప్ లు లేకుండా ముందే తనిఖీ చేయించి పరీక్ష హాల్ లోకి పంపేవాడిని .పాపం అందరికి ఇది కంటకంగా ఉండేది .ప్రక్కనే బస్ స్టాండ్ .లోపలి రావటానికి కాపీలు అందజేయటానికి అవకాశాలు ఎక్కువ .అన్నీ జరాగకుండా చేయగలిగాను .ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారమ్మాయి పరీక్ష రాస్తోందని కొంచెం చూసీ చూడనట్లు పొతే మంచిదని చీఫ్ నాకు చెప్పారు .నా నిఘా మరీ పెంచాను ఆయన నిరుత్తరుడైనాడు .ఆ అమ్మాయి ఏమీ రాయలేక పోయింది. పరీక్షలో తప్పినట్లు తర్వాత తెలిసింది .మా స్కూల్ పిల్లలు గర్ల్స్ స్కూల్ లో పరీక్షలు రాసిన గుర్తు .టెన్త్ రిజల్ట్స్ మాకు బాగా ప్రోత్స్సహకంగా ఉన్నాయి ఎంతో ఇప్పుడు జ్ఞాపకం లేదు శేషగిరి రావు గారబ్బాయి స్కూల్ ఫస్ట్ వచ్చాడు .అయిదు వందల టోటల్ దాటినట్లు జ్ఞాపకం ఇంగ్లీష్ సైన్స్ లలో 80 లకు పైగా మార్కు లోచ్చాయి .బ్రైట్ స్టూడెంట్ కు తగ్గ మార్కులవి .నాకంటే అతడి కృషి గొప్పది .శేషగిరిరావు గారు వారింట్లో గొప్ప విందు స్టాఫ్ కు ఇచ్చారు .

విశాలాంధ్ర తాత మనవడు

ఉయ్యూరులో మాచిన్నప్పుడు ఒక చిన్న  కొట్లో చెప్పులూ బూట్లు అమ్మకం చేస్తూ వీర కమ్యూనిస్ట్ అయిన తాత ఒకాయన ఉండేవాడు. ఆయన విశాలాంధ్ర పత్రిక ఏజెంట్ .ఇంటింటికీసైకిల్ మీద  వెళ్లి పత్రిక  వేసేవాడు .ఆయన సైకిల్ ఎక్కటం బలే తమాషాగా ఉండేది .సైకిల్ ను కోతదూరం తోసుకొంటూ వెళ్లి ఎక్కేవాడు .ముతక పంచ మోకాళ్ళు దాటి కట్టు తో కోటేరు ముక్కుతో కొంచెం పొట్టిగా ఉండేవాడు .ఆయన్ను అందరూ ‘’విశాలాంధ్ర తాత ‘’అనేవారు .చాలా నిక్కచ్చైన మనిషి .ఆయన చెయ్యి కొంచెం వంకర పోయి కలిపించేది .కమ్యూనిస్ట్ ఉద్యమం లో ఆయన పాల్గొన్నందుకు పోలీసులు కొట్టిన దెబ్బలకు చెయ్యి వంకర పోయి౦ద ని ఆయనే నాకొక సారి చెప్పాడు .ఫోటోలకు ఫ్రేం లు కూడా కట్టేవాడు .చాలా పొందిక గా మర్యాదగా ఉండేవాడు .’’ఏమే మనవడా 1’’అంటూ అందర్నీ పలక రించేవాడు  .ఈ తాత తర్వాత ఏమయ్యాడో తెలియదుకాని చిలుకూరివారి గూడెం లో స్కూల్ కు ఎదురుగా హాస్టల్ కు దగ్గరలో ఒక ప్రభుత్వ హోమియో క్లినిక్ ఉండేది .ఒక సారి ఆ డాక్టర్ గారిని లేక్కలమేస్తారు పరిచయం చేశారు .మాటల సందర్భం లో ఆ యువ డాక్టర్ తాను  విశాలాంధ్ర తాత మనవడినని, తాత చనిపోయి చాలాకాలమై౦దని చెప్పాడు .ఎంత కాలానికి ఎక్కడ ఎలా ఎవరు పరిచయమౌతారో తెలియదు .

గబ్బిట మేష్టారు

చిలుకూరు వారి గూడెం లో చాలాకాలం ఎలిమెంటరీ సెక్షన్ లో పని చేసి అప్పుడు మద్దుల పర్వ స్కూల్ లో సోషల్ మాస్టారుగా పని చేస్తున్న గబ్బిట సుబ్రహ్మణ్య శాస్స్త్రి గారు ఒక సారి మా స్కూల్ కు వచ్చి పరిచయం చేసుకొన్నారు .అయన మానికొండ దగ్గర మానేడు మాక గ్రామం వాడు .నేను మానికొండలో సైన్స్ మేస్టర్ గా పని చేస్తున్నప్పుడు , ఆ ఊరివాడు గబ్బిట దుర్గా ప్రసాద్ అనే నా పేరున్నవాడు మానికొండ హై స్కూల్ లో తోమ్మిదో క్లాస్ చదివాడు. వాడు నా దగ్గర ట్యూషన్ కూడా చదివాడు .వాడితో మిగతా ట్యూషన్ పిల్లలతోరమణారావు రాసిన  ‘’భర్త మార్కండేయ ‘’నాటకం ప్రాక్టీస్ చేయింఛి వార్శికోత్సవం లో వేయించా. ఆ దుర్గా ప్రసాద్ ఈ శాస్త్రి గారి తమ్ముడే . ఈ శాస్త్రిగారికి ఒక సారి ఆక్సిడెంట్ జరిగి బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలో ఉంటె నేనూ  ఆచారిగారు వెళ్లి పలకరించాం .

బాబూ రావు గారి సలహా

యెన్ .బాబూ రావు అనే సెకండరీ గ్రేడ్ టీచర్ గుడివాడ కు దగ్గర వాడు .నల్లగా స్పోటకం మచ్చల తో ఉండేవాడు ..మాజీ ఏం .ఎల్. సి .శ్రీ పి శ్రీరామ మూర్తిగారి అభిమాని లోడ లోడ గా వాగటమే తప్ప సబ్జెక్ట్ బోధించటం తక్కుత. క్లాస్ ను సరిగ్గామేయి౦ టెన్ చేసే శక్తీ లేనివాడు .కాని లోకజ్ఞానం బాగా ఉన్నవాడు .ఒక సారి మాటల సందర్భంగా మా అమ్మాయి విజయ లక్ష్మి టెన్త్ పాసైందని ,పాలిటెక్నిక్ లో చేర్చాలను ఉందని అన్నాను .ఆయన వెంటనే కొత్తగా డి టి, సి .పి.కోర్సు ప్రారంభిస్తున్నారని కంప్యూటర్ నేర్పించే కోర్స్ అని గుంటూరు ప్రభుత్వ గర్ల్స్ పాలిటెక్నిక్ లో ఉందని వివరాలన్నీ చెప్పాడు .దానిప్రకారమే అప్ప్లికేషన్ పెట్టించి సీటు రాగానే చేర్పించి హాస్టల్ లో ఉంచి మూడేళ్ళు చదివించాము .ఈ సలహా ఇచ్చినందుకు బాబూరావుగారికి కృతజ్ఞుడిని .ఇలా తీగలాగితే ఎన్నో డొంకలు  కదుల్తున్నాయి . మరిన్ని విషయాలు మరో సారి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

స్వాతంద్రోద్యమ అస్సాం అమర నారీమణులు -గబ్బిట దుర్గా ప్రసాద్ 28/07/2016 గబ్బిట దుర్గాప్రసాద్ -విహంగ ఆగస్టు

స్వాతంద్రోద్యమ అస్సాం అమర నారీమణులు -గబ్బిట దుర్గా ప్రసాద్

Gabbita Durgaprasadభారత స్వాతంత్ర్య సమరం లో వీర మరణం పొంది అమరులైన అస్సాం వీర నారీమణులు శ్రీమతి కనకలతా బారువా ,మరియు శ్రీమతి సతి జయమతి మొదలైనస్త్రీ మూర్తుల నిస్వార్ధ త్యాగాలను ఈస్వాతంత్ర్య దినోత్సవ సమయం లో స్మరించుకొందాం .

కనకలతా బారువా:

అస్సాం లో దారంగ్ జిల్లా బోరంగ బారి గ్రామం లో 22-12-1924న కనకలతా బారువా జన్మించింది .ఆమెను బీర్బలా అని కూడా పిలిచేవారు .తండ్రి కృష్ణ కాంత్ ,తల్లి కామేశ్వరి .తాత గారు ఘనకాంత బారువా గొప్ప వేటకాడు .ఈమె పూర్వీకులు పూర్వపు దోలాఖారియా రాజ్యం వారు .తర్వాత దోలకారియా బిరుదును త్యజించి బారువాబిరుదును మాత్రమే ఉంచుకొన్నారు .అయిదేళ్ళప్పుడే తల్లిని కోల్పోయిన అభాగ్యురాలు కనకలత .తండ్రి రెండో పెళ్లి చేసుకోన్నాడు .కాని ఈమె 13 వ ఏట తండ్రికూడా గతించగా అనాధ అయ్యింది .మూడవ తరగతి వరకు స్కూల్ లో చదివి తన చెల్లెళ్ళు తమ్ముళ్ళ సంరక్షణ కోసం చదువు మానేసింది .

భారత స్వాతంత్రి సమరం లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం లో కనకలత పాల్గోని’’ అస్సాం సబ్ డివిజన్ లోని ‘’మృత్యు వాహిని ‘’అనే యువ దళంలో చేరింది .20-9-1942 న ఈ మృత్యువాహిని దళం పోలీస్ స్టేషన్ దగ్గర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయి౦చుకొన్నది .చేతులలో యే ఆయుధాలు లేకుండా ఆ గ్రామ యువజనం కనకలతా బారువా నాయకత్వం లో పోలీస్ స్టేషన్ కు పెద్ద ఊరేగింపుగా బయల్దేరింది .పోలీస్ ఇన్స్పెక్టర్ రేబతిమోహన్ శోం వారిని ఊరేగింపు అపు చేయకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని హెచ్చరించాడు .బెదరక చెదరక మొక్కవోని ధైర్యం తో కనకలత తన బృందాన్ని ముందుకే నడిపించింది ..పోలీసులు వారిపై తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు .చేతిలోని జాతీయ పతాకను వదిలిపెట్టకుండా కనకలత తుపాకి గుళ్ళకు ఎదురొడ్డింది .తూటాలు ఆమె గుండెను చీల్చుకొని రాగా కనకలతా బారువా అక్కడికక్కడే కుప్పకూలి వీరమరణం పొందింది .అప్పటికి ఆమె వయసు 17 సంవత్సరాలు మాత్రమే .ఆమె చేతిలోని జాతీయ పతాకను ముకుంద కాకోటి చేతిలోకి తీసుకొని ముందుకు నడిచాడు .అతనిపైనా కాల్పులు జరుపగా ఆయనా అక్కడికక్కడే మరణించి అమర వీరుడయ్యాడు .

ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చెందిన తీర రక్షణ నౌకకు కనకలతా బారువా పేరు పెట్టి భారత ప్రభుత్వం గౌరవించింది .20 11 లో కనకలత నిలువెత్తు విగ్రహాన్ని గౌరీ పూర్ లో నెలకొల్పి ఘనమైన నివాళులు అర్పించారు .

సతి జయంతి:
భారత స్వాతంత్ర్య పోరాటం లో ఏమాత్రం సందేహించకుండా తమ రక్త తర్పణం తో భారత మాత ఋణం తీర్చుకొన్న అస్సాం దేశ భక్తు లెందరో ఉన్నారు .అందులో సతి జయంతి త్యాగం స్మరించ దగినది .అస్సాం రాజ్యం లో లోరా రాజ్యం లో విచ్చల విడిగా పెరిగి పోయిన అన్యాయం ,అవినీతి లపై ఎదురు తిరిగి పోరాడి ప్రాణాలర్పించిన మహా గొప్ప మహిళా సత్యాగ్రహి ,త్యాగ మూర్తి సతి జయతి .ఆమెను పెట్టిన మానసిక, శారీరక క్షోభ ,కాని చావు అంటే భయం కాని ఆమె స్థిర నిర్ణయాన్ని మార్చలేక పోయాయి .అంతటి నిర్భీక నిర్ణయాత్మక స్త్రీ మూర్తి ఆమె .అస్సాం రాజు సులిక్ఫా అవినీతి అన్యాయ పాలనపై జయంతి స్పందించిన తీరు అస్సాం ప్రజల కు కనువిప్పు కలిగించి ఆమెకు మద్దతునిచ్చి గొప్ప ఉద్యమాన్నే నిర్వహించారు .ఫ్రాన్స్ దేశపు జోన్ ఆఫ్ ఆర్క్ లాగా సతి జయంతి భాసించింది .

ఉషామెహతా:

ఎనిమిదేళ్ళ వయసులోనే ఉషా మెహతా బాల విప్లవ కారిణిగా గుర్తింపు పొందింది .సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమం లో బ్రిటిష్ ప్రబుత్వం పై పోరాడిన చిట్టి తల్లి ఉషా మెహతా .తండ్రి బ్రిటిష్ ప్రభుత్వం లో జడ్జి అయినా ఆమె భయ పడలేదు వెనుకడుగు వేయలేదు .తండ్రి నయానా భయానా ఆమెను ఉద్యమంలో పాల్గొనవద్దని హెచ్చరించాడు .ఆమె అన్ని బంధనాలను త్యజించి భారతమాత దాస్య విముక్తికోసం ముందుకే ఉరికింది .చదువు మానేసి ఉద్యమమే ఊపిరిగా జీవితం సాగించింది .అండర్ గ్రౌండ్ లో రహస్య రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసి క్విట్ ఇండియా ఉద్యమం లో వార్తా ప్రసారం చేసిన ధైర్య సాహస నారి మెహతా .తనతో బాటు అనేక బాలబాలికలను ఉద్యమ సభలలో ఊరేగింపులలో మొహరించి గొప్ప చొరవ చూపింది .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Share

– See more at: http://vihanga.com/?p=17443#sthash.BbQvctwT.dpuf

Posted in రచనలు | Tagged | Leave a comment

నాదారి తీరు 97-క్షేత్ర దర్శనం ,విహార యాత్ర ఎన్నికలు వగైరా

— నాదారి తీరు

97-క్షేత్ర దర్శనం ,విహార యాత్ర  ఎన్నికలు వగైరా

చిలుకూరి వారి గూడెం దగ్గర  చండ్రగూడెం లో  మల్లె తోటలు ఉండేవి .ఉయ్యూరు వెళ్ళేటప్పుడు కొని తీసుకు వెళ్ళేవాడిని .చాలా సువాసనతో ఉండేవి  .ఇక్కడే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ,దానికి అనుబంధంగా మంచినీటి కేంద్రం ఉన్నాయి .వాహన దారులకు బాట సారులకు అక్కడి బావిలోని చల్లని నీరు దాహంగా ఇచ్చేవారు. గొప్ప సేవాకార్యక్రమం .నీళ్ళు కొబ్బరి నీళ్ళు అంత తియ్యగా ,అంత చల్లగా ఉండటం ప్రత్యేకత .లారీలవాళ్ళు బస్సులవాళ్ళు దాతలు ఇచ్చిన విరాళాలతో దీన్ని నడుపుతున్నట్లు అర్ధమయింది .ఇక్కడి మల్లెపూలను ఉయ్యూరు లో మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో జరిగే శ్రీ హనుమజ్జయంతికి లెక్కలమాస్టారు శ్రీ పురుషోత్తమాచారి గారు చాలాశ్రమపడి తెచ్చి అందించేవారు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళేవారు .ఆచారిగారితోపాటు శేషగిరిరావు గారుకూడా ఒకటి రెండు సార్లు ఉయ్యూరుకు ,మా ఇంటికి వచ్చి మా ఆతిధ్యం పొందిన జ్ఞాపకం .

జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ దర్శనం

చిన్నప్పటి నుంచి జమలాపురం కేశవరావు గారి గురించి ,వారి సేవానిరతి గురించి వింటూనే ఉన్నాను .ఆచార్లగారు శేషగిరిరావుగారు నన్ను ఒక సారి జమలాపురం తీసుకు వెళ్ళారు .శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది .లెక్కలమేస్టారికి అక్కడి పూజారులు అందరూ బాగా పరిచయమే .కనుక సరాసరి దర్శనానికి వెళ్లాం .అక్కడ వివాహాలు చేసుకొంటారు పుట్టు వెంట్రుకలు అక్షరాభ్యాసం అన్నప్రాసనలు లెక్కే లేదు. అందరికీ ప్రసాద వితరణ ఉంది .స్వామి విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది .కళ్యాణోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి .ఇది దాటితే మధిర వస్తుంది మధిర నుండి బస్ సర్వీస్ ఫ్రీక్వెంసి బాగా ఉంది

నెమలి శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం

ఒకశనివార౦  పుల్లూరులోనే ఉండిపోయి ,మర్నాడు ఆదివారం ఉదయం నేను లెక్కలమేస్టారు కలిసి ,రామచంద్రాపురం తోటపల్లి గంపలగూడెం మీదుగా నెమలి వెళ్లాం .నెమలి లో శ్రీ వేణుగోపాలస్వామి ప్రత్త్యేక ఆకర్షణ ఉన్న దైవం .కోరికలు తీరటానికి ఇక్కడ రాత్రి నిద్ర చేసి ఉదయం స్వామి దర్శనం చేస్తారు. వంటలు చేసుకొనే వీలు, గదులు ఉన్నాయి .నీతటి సౌకర్యం లేని ఆతిమెట్ట ప్రాంతం. జిల్లా పరిషత్ స్కూళ్ళలో నెమలి పనిష్ మెంట్  ఏరియా గా భావించేవాళ్ళం .దగ్గరలోనే ఊటు కూరు లో కూడా హై స్కూల్ ఉంది. శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారి శాసనమండలి ఎన్నిక సమయం లో ఆయనతో పాటు ఈ ప్రాంతాలన్నీ కారులో తిరిగి ప్రచారం చేశాం .స్వామి నల్లరాతి వ్యత్యస్త పాదార వింద విగ్రహ రూపుడు .గొప్ప కళ కనిపిస్తుంది .ఇక్కడి స్వామి వారి కల్యాణానికి అనేక ప్రాంతాలనుండి భక్తజన సందోహం వస్తుంది .అర్చకులు ఉయ్యూరు వేదా౦తంవారికి బంధువులే .మా రచకులు వేదాంతం రామాచార్యులగారి కొడుకు దయాకర్ కు ఈ ఆలయ అర్చకస్వామి కుమార్తెనే ఇచ్చి వివాహం చేశారు .స్వామి దర్శనానందం తో మధ్యాహ్నానికి పుల్లూరు తిరిగి వచ్చి ఆచార్యుల గారింట భోజనం చేసిన గుర్తు .

ఇక్కడ పని చేస్తుండగానే ఎన్నికలు జరిగిన జ్ఞాపకం .ఒక చోట రిటర్నింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్నప్పుడు మొదటి సారిగా శ్రీబోళ్ళ బుల్లిరామయ్య, శ్రీ గంటి మోహన చంద్ర బాల యోగి గార్లు బూత్ పరిశీలనకు రాగా చూసిన గుర్తు .

పంద్రాగస్ట్ వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాం .విపరీతమైన వర్షం  వచ్చింది .లోపలే వరండాలో కానిచ్చాం .పోటీలు నిర్వహించి ప్రైజులు అందజేశాం .జాతీయ గీతాలు నేర్పి పాడించాను .కమిటీ ప్రెసిడెంట్ గారు ముఖ్యఅతిధి .పిల్లలకు మైలవరం నుండి స్వీటు హాటు చాక్లెట్లు తెప్పించి ఇచ్చాం .టీచర్స్ కు టీ పార్టీ ఇచ్చాం. ఇక్కడ ఏదైనా చాలా ఘనంగా జరిగేది .అందరి సహకారం బాగా ఉండేది .

శ్రీ కృష్ణ దాసు గారి ఆతిధ్యం ,ప్రభావం

పుల్లూరు స్కూలు ఎలిమెంటరీ స్థాయి నుంచి హైస్కూల్ స్థాయికి ఎదిగి ఇప్పుడు ఇ౦త సర్వాంగ సుందరంగా ఉండటానికి ముఖ్య కారకులు శ్రీ వి .కృష్ణ దాసు గారు .వారిది గుడివాడ దగ్గర భూషణ గుళ్ల .ఇక్కడే చేరి పని చేసి అంచెలంచెలుగా స్కూల్ ను అభి వృద్ధి చేసి తానూ డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ బి ఎడ్ లు సాధించి ఇంగ్లీష్ లో అసమాన పాండిత్యం పొంది అన్నీ వున్నా చాలా అణకువగా ఉన్న విశిష్ట వ్యక్తీ .కమిటీ వారికి తలలో నాలుక. శాఖా పరమైనది ఏది సాధించాలన్నా ఆయనే ముందు ఉండి సాధించి అభి వృద్ధి చేసేవారు .పీనల్ హెడ్మాస్టర్ వచ్చేవరకు ఆయనే అన్నీ ,రూల్స్ ,రేగ్యులేషన్లు కరతలామలకం .నేను బాగా పని చేస్తున్నాని తెలుసుకొని ఒక సారి స్కూల్ కు వచ్చి పలకరించి వారింట ఆతిధ్యం తీసుకోమని వినయంగా కోరారు. వారమ్మాయి సీత తొమ్మిది చదువుతోంది .ఇక్కడ వారి కాపురం చిలుకూరు వారి గూడెం లోనే . నేను వారింటికి భోజనానికి వెళ్లి నప్పుడు తల్లిగారు భార్యగారు స్వంత బందువు లాగా ఆప్యాయత కనబరచి చాలా మర్యాద చేశారు .దాసు గారటే మైలవరం ప్రాంతం లో తెలియని వారు లేరు .నేనంటే చాలా ఆత్మీయంగా ఉండేవారు .వారి తల్లి గారు స్వంత కొడుకులాగా ఆదరించారు వారి ఆతిధ్య మర్యాద మరుపుకు రాదు  .వీలున్నప్పుడు స్కూల్ కు వచ్చి పలకరించేవారు .వేసవి సెలవులలో వారబ్బాయి ఉపనయనం స్కూల్ లో చేయాలనుకొన్నానని చెబితే, జిల్లా పరిషత్ కు రాసి పర్మిషన్ తెప్పించాను .మేమిద్దరం ఉపనయనానికి ఉదయమే హాజరై వారి ఆతిధ్య మర్యాదలు పొందాము  మా ఇద్దరికీ నూతన వస్త్రాలు అందజేశారు .నేను చిలుకూరి వారి గూడెం వదిలాక వారికి నెమ్మది నెమ్మదిగా ప్రోమోషన్లు వచ్చి అంగలూరు డయట్ లెక్చరర్ అయి డిప్యూటీ డి.యి. ఓ. అయి పరీక్షల ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించి  రిటైర్ అయ్యారు .సుమారు ఏడెనిమిది ఏళ్ళ క్రితం  సాహితీ బంధువు పెద వోగిరాల వాసి మాకు అత్యంత ఆప్తులు కవి అందునా భక్తకవి అయిన శ్రీ ఓగిరాల సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి వివాహం లో బెజవాడలో దాసు గారు మళ్ళీ కనిపించారు .సహృదయం ,సంస్కారం, సౌజన్యం ,వినయం, నిక్కచ్చితన౦  మూర్తీభవించిన వారు శ్రీ కృష్ణ దాసు గారు  నవ్వుతూ చక్కని చతురోక్తులాడుతూ ,సాహిత్య మర్మాలు తెలియ జేస్తూ ఎలివేట్ చేసే గొప్ప సుగుణం వారిలో ఉంది .వారు నాకు పరిచయమవ్వటం నా అదృష్టంగా భావించాను వారి స్పూర్తి ప్రేరణ నా విద్యుక్త ధర్మానికి మంచి మార్గం చూపాయి .

నాగార్జున సాగర్ యాత్ర

లేక్కలమేస్టారు  ఇక్కడ ప్రతి ఏడాది ఏదో చోటుకు పిల్లలను యాత్రా సందర్శనానికి తీసుకొని వెళ్ళే అలవాటు ఉందని ఒక సారి నాతో అంటే ఈ ఏడాదీ వేద్దాం అని చెప్పి విద్యార్ధుల అభిప్రాయం పరిగణలో తీసుకొని నాగార్జున సాగర్ యాత్ర ఏర్పాటు చేశాం .సుమారు పదిహేను రోజులముందే నేనూ ఆచారిగారు కలిసి బెజవాడ వెళ్లి ఒక ప్రైవేట్ బస్ బుక్ చేసి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాం .విద్యార్ధుల వద్ద డబ్బు వసూలు చేయటం ఏర్పాట్లు వసతి అన్నీ లేకల మాస్టారు సైన్స్ మాస్టారు చూశారు.  వార్డెన్ రాఘవులుగారు   హాస్టల్ తరఫున భోజనం టిఫిన్ ఏర్పాట్లు చూస్తానని ముందుకొచ్చారు .అంతా రెడీ అయి ఒక రోజు రాత్రి 7 గంటలకు బయల్దేరటానికి నిర్ణయించుకొని విద్యార్ధినీ విద్యార్ధులను సాయంత్రం 5 గంటలకే స్కూల్ లో హాజరు కావాలని చెప్పాం .వాళ్ళందరూ వచ్చారు .కాని బస్ మిస్ .అనుకొన్న సమయానికి బస్సు రాలేదు .ఆచార్లుగారు ఫోన్లమీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు .ఇదిదగో అదుగో అని తెల్లవారు ఝామున అయిదింటికి బస్ వచ్చింది .బెటర్ లేట్ దాన్ నెవర్ సామెత  సార్ధకం చేస్తూ అందరం బస్సు ఎక్కాం .సుమారు అరడజను మంది టీచర్లు కూడా విద్యార్ధుల అవసరాలను తీర్చటానికి తీసుకొని ఉపాధ్యాయులందరికి ఉచితంగా తీసుకొని వెళ్ళే ఏర్పాటు చేశాం అంతా హాపీ .

కోదాడకు దగ్గర ఏటి ఒడ్డున బస్ ఆపి కాల కృత్యాలు తీర్చుకొనే అవకాశమిచ్చి కోదాడ హోటల్ లో టిఫిన్ చేయించి మళ్ళీ బయాల్దేరాం .సాయంత్రానికి నాగార్జున సాగర్ చేరాం రాత్రి అక్కడ ఒక స్కూల్లో బస ముందే ఏర్పాటు చేసుకొని వార్డెన్ గారు వండించిన భోజనం చేసి రాత్రి విశ్రమించాం .ఉదయం కార్యక్రమాలు కానిచ్చి వార్డెన్ గారి టిఫిన్ తిని కాఫీ తాగి సాగర్ డాం అంతా కాలినడక న తిరిగి ప్రతి విషయాన్ని అర్ధమయేట్లు వివరించి చెప్పి ఈపర్యటన  సఫలం చేశాం .తర్వాత విజయపురి  గెస్ట్ హౌస్ మ్యూజియం వగైరాలు చూపించి రాత్రి భోజనాలు చేసి బయల్దేరి మర్నాడు ఉదయం 10 గంటలకు చిలుకూరి వారి గూడెం చేరాం .విద్యార్ధులను తమ అనుభవాలను తెలియ జేయవలసినదిగా అసెంబ్లీ లో కోరి చెప్పించాం చాలా సంతృప్తి చెందారు అందరూ .దీని విజయానికి ముఖ్య కారకులు లెక్కల మాస్టారు పురుషోత్తమా చారిగారే నని సగర్వంగా తెలియ జేస్తాను ఇచ్చిన బాధ్యతా అ౦త పకడ్బందీ గా నిర్వ హించే సామర్ధ్యం ఆయనది  .

వార్షిక తనిఖీ

విజయవాడ జోన్ లో ఈ స్కూల్ ఉంది కనుక అక్కడి ఉపవిద్యా శాఖాధి కారి గారుశ్రీ సుగుణ భూషణ రావు గారు ? స్కూల్ ను తనిఖీ చేయటానికి వచ్చారు .ఆయన తూర్పు గోదావరి జిల్లావారు ..చలాకీ మనిషి .స్కూల్ లోనే వారికి వసతి సౌకర్యాలు కలగజేసి ,కాఫీ టిఫిన్లు నాకూ వారికీ లెక్కల మాస్టారి ఇంటి నుంచే తెప్పించే ఏర్పాటు చేశాం. ఆచారి గారి భార్య గారు తల్లిగారు ఈ బాధ్యత తీసుకోవటం లో పరమాన౦ద పడ్డారు .స్కూల్ రికార్డ్ లన్నీ పకడ్బందీ గానే ఉన్నాయి కనుక ఇబ్బంది లేదు .అన్ని క్లాసుల ,అన్ని సబ్జెక్ట్ ల తనిఖీకి చుట్టు ప్రక్కల స్కూళ్ళ సీనియర్ ఉపాధ్యాయులను పానెల్ ఇన్స్పెక్టర్లు గా ఆహ్వానించాము .ఏర్పాట్లన్నీ ఘనంగా చేశాం .గంటకో సారి కాఫీ లేక టీ .తనిఖీకి ముందు టిఫిన్ ఏర్పాటు అన్నీ పెళ్లి తంతు లాగా నడిపాం .ఆఫీసర్ గారు ,గుమాస్తా ఖుషీ ఖుషీ .వారిద్దరికీ’’ తాంబూలాలు’’ఇచ్చి మర్యాదా చేశాం .తనిఖీ  రెండు రోజులు చేశారు .రెండు రోజులూ ఇదే విధానం .మొదటి రోజు మధ్యాహ్నం లంచ్ ,రెండవ రోజు సాయంత్రం డిన్నర్ షడ్రసోపేతంగా ఆచారిగారి ఇంటి నుండే కమ కమ్మగా వండి పంపారు. లొట్టలేసుకొంటూ అందరం తిన్నాం  .స్టాఫ్ మీటింగ్ లో ఉపవిద్యాశాఖాదికారిగారు నన్నూ స్కూల్ ను స్టాఫ్ ను బాగా మెచ్చుకొన్నారు. విద్యార్ధుల ప్రవర్తనకు ముగ్ధులయ్యారు .చాలామంచి రిమార్క్ లు రాశారు. లాగ్ బుక్ లో విజిట్ బుక్ లో ఘనంగా పొగిడారు. మా స్కూలు అందరికీ అన్ని విషయాలలో ఆదర్శంగా ఉందన్నారు .  తాను  చాల చాలా సంతృప్తి చెందానని చెప్పారు . .ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ కావటానికి స్టాఫ్ నాకిచ్చిన తోడ్పాటు ,విద్యార్ధుల ప్రవర్తన యెంత ముఖ్యమైనవిగా ఉన్నాయో ఆచార్యుల గారింటి ఆతిధ్యం అంతకంటే గొప్పగా ఉంది చెప్పక తప్పదు.లెక్కల మాస్టారు ఈ ఖర్చు అంతా తానే భరిస్తానని ముందే నాకు చెప్పారు .అలాకుదరాదని మొత్తం ఖర్చు ఎంతో లెక్కరాయమని చెప్పి ,జీతం ప్రకారం వాటా వేసి మొత్తం వసూలు చేయించి ఆచారిగారికి ఇప్పించా .ఆయన కూడా కాదన లేక పోయారు . నేను అక్కడి నుంచి వచ్చాక లేక్కలమేస్టారు ఆయనతో సాన్నిహిత్యాన్ని బాగా పెంచుకొన్నారు .తర్వాత ఈ అదికారిగారు బందరులో స్పాట్ వాల్యుయేషన్ లో అసిస్టంట్ కాంప్ ఆఫీసర్ గా ఉండాగా కలిశాను .ఆ రోజుల్ని బాగా గుర్తుకు తెచ్చుకొన్నారు .

రోజూ పసందైన విందు

ఈ తనిఖీ విందు అందరిలో ఆనందాన్ని నూతన ఉత్సాహాన్ని కలిగించింది .ఒక సారి నేను ఒక సోమవారం ఉదయమే ఉయ్యూరు లో గారెలు , ,చక్కర పొంగలి  పులిహోర , మా శ్రీమతితో చేయించి  ఉయ్యూరు అరటిపళ్ళు కూడా తీసుకొని కాన్ ల నిండా పెట్టించుకొని అంచెలంచెల మీద స్కూల్ కు సమయానికి చేరి ,ఎవరికీ తెలియ జేయకుండా మధ్యాహ్నం స్టాఫ్ మీటింగ్ ఉందని చెప్పి ,అందరికీ ఉయ్యూరు నుంచి తెచ్చిన పదార్ధాలు వడ్డింప జేసి టీ కూడా తెప్పించాను అందరూ మహా రుచికరంగా ఉన్నాయని ఎంతో సంతోషంగా తిని ధన్యవాదాలు చెప్పారు. బహుశా ఆరోజు మా పెళ్లి రోజేమో జ్ఞాపకం లేదు .ఇది ప్రేరణ కలిపించింది అందరికి. ఇలాంటి వాటిలో ముందుండే శేషగిరిరావు అనే సెకండరీ గ్రేడ్ మాస్టారు ఒక రోజు వాళ్ళ ఇంట్లో ఇంతకంటే ఎక్కువ ఐటమ్స్ వండించి విందు చేశారు .తర్వాత లెక్కలమాస్టారు .ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వార్డెన్ రాఘవులుగారు కూడా  తమ బాధ్యతగా తీసుకొని రోజు పసందైన విందు చేస్తూ తాము వెనక బడలేదని నిరూపించుకొన్నారు .ఇట్లా చాలా హుషారుగా  జాలీగా హేపీగాఒక నెల రోజులు విందే విందు గా  కాలం దొర్లి పోయింది చిలుకూరి వారి గూడెం లో .

Inline image 1  Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-20-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 30 నేటి వైణికులు 44-బోనాల శంకర ప్రసాద్

— ఇది విన్నారా కన్నారా !  30

నేటి వైణికులు

44-బోనాల శంకర ప్రసాద్

323-వీణావాదన విద్యను  ఒక శతాబ్ది కాలంముందుకు తీసుకు వెళ్ళిన ,వెళ్తున్న మహా వైణికులు శ్రీ బోనాల శంకర ప్రసాద్ రాగ జీవాన్ని ,ప్రాణాన్ని పట్టుకొని వాయిద్యానికి ప్రాణం పోసినవారు  .వాసా ,ఈమని ఇత్యాదుల సంగీత రహస్యాలను ఆపోశనపట్టి ‘’మన కర్నాటక సంగీతానికి మంచి రోజులొచ్చాయి ‘’అని ఆనందం పొందేట్లు చేశారు .1966 లోవిశాఖ  జిల్లా పెనుగోల్లు గ్రామం లో జగన్నాధం ,రమణి దంపతులకు జన్మించారు .మంచి ఆధ్యాత్మిక వంశం వారిది తండ్రిగారితోకలిసి రమణ మహర్షి శిష్యులైన ‘’బాబు గారు’’ అని పిలువబడే స్వామీజీ విశాఖలో లలితానగర్ లో స్థాపించిన ఆశ్రమం లో వీణ వాయించేవారు .తండ్రి జగన్నాధంగారు ఈ ఆశ్రమం లో తప్ప ఇంకెక్కడా కచేరీ చేసేవారు కాదు .

324 –తొమ్మిదవ ఏట కచేరీ ప్రారంభించిన ప్రసాద్ ,సంగీత డిప్లమా సాధించి ,కడప రేడియో నిలయ విద్వాంసులై ,తర్వాత విశాఖ కేంద్రం లో చేరి పదేళ్ళు పనిచేసి, చెన్నై వెళ్లి పనిచేశారు శ్రీ జయేంద్ర సరస్వతి వీరిని కంచి పీఠ ఆస్థాన విద్వాంసులను చేశారు .,వీణ కచ్చేరీలకు ప్రోత్సాహం తక్కువ అని భావించారు ప్రసాద్ .

Inline image 1

45 –అంబుజ వల్లి

325-వాసా వారి  శిష్యులలో మొదటివారు శ్రీమతి అ౦బుజవల్లి .కానుకుర్తి వెంకట్రావు లచ్చన్నమ్మ దంపతులకు జన్మించారు జమీందారి వంశం .తండ్రి చిన్నప్పుడే చనిపోగా శ్రీకాకుళం చేరి ఆర్ కాళిదాసుగారి వద్ద వీణ నేర్చారు .హరిడేహళ్ వెంకట రావు  గారితో వివాహమయ్యాక నెర్లిమర్ల చేరి ,సుదర్శనం అప్పలాచార్యులవద్ద నేర్చారు .వాసావారు రోజూ వీరింటికి వచ్చేవారు .రాజనీతి శాస్త్రం ప్రజాపాలన లలో ఏం యే తో పాటు బి ఎడ్ చేసిన  అ౦బు జవల్లి విజయనగరం రాజా వారికాలేజిలో 1965 నుంచి 1993 వరకు వీణ లెక్చరర్ గా, శాఖాధిపతి గా  పని చేసి ,పదవీ విరమణ తర్వాత తెలుగు విశ్వ విద్యాలయం లో వీణ లెక్చరర్ అయ్యారు .సంగీతం పైనా వాసా వారిపైనా ,గాన కళ మీద ఎన్నో వ్యాసాలూ రాశారు .

Inline image 2

46 –ఆనంద రాజ్య లక్ష్మి

326 –మాధుర్యం వైదుష్యం రెండూ ఉన్న వైణికులు ఆనంద రాజ్య లక్ష్మిగారు .వీణ తప్ప వేరే ప్రపంచం లేదీమెకు .16 వ ఏట చిట్టిబాబుగారు వాసా వారింటికి రాగా తన శిష్యురాలి ప్రతిభను ఆయనముందు ప్రదర్శింప జేశారు .కష్టమైన తోడి రాగం వాయించి మెప్పు పొందారు .వాసావారి నుంచి అనేక రహస్యాలు గ్రహించారు .’’లాహిరి లాహిరి ‘’సినిమాకు ,టి వి సీరియల్స్ కు వీణ వాయించారు సినీ నటి జయప్రద వీరివద్ద నాలుగేళ్ళు  వీణ నేర్చుకొన్నారు .వీరి వీణ కృషికి యునేస్కో సర్టిఫికేట్ ఇచ్చింది .

Inline image 3

47 –ఇ .గాయత్రి

327 –వీణకు మహా గౌరవం తెచ్చినవారిలో గాయత్రి గారొకరు .వీణ పై గజల్స్ వాయించి రికార్డ్ చేశారు ‘’పంచ సూక్తాలను’’ వీణ పై వాయించే నేర్పు ఈమెది .పంజాబీ భాంగ్రా ,గుజరాతీ డాండియా పాటల్ని వీణపై వాయిస్తారు .వీణకు పరిమితులు లేవని భోపాల్ లో జరిగిన సెమినార్ లో పత్రం రాసి సమర్పించారు .అవసరం ఉంటేనే గమకం వేస్తారు .వాసా వారి శిష్యరత్నం .దేశ విదేశాలలో అనేక అవార్డులు పొందారు .ఆమె కేసెట్లు అమెరికాలోని పిట్స్ బర్గ్ దేవాలయందాకా వ్యాపించాయి .

Inline image 4

48-ఈమని కల్యాణి

328 –ఈమని శంకర  శాస్త్రిగారమ్మాయి  కల్యాణి .తండ్రికి కచేరీలలో సహకరించారు .భర్త లక్ష్మీనారాయణ .ఈమె వీణ తండ్రిని గుర్తు చేస్తుంది .చిట్టిబాబు వీణ ఈమనిని మరి పిస్తుంది .గమక ప్రాధాన్యం ,మీటు వైశిష్ట్యం ,కీర్తన వాయించటం లో స్పష్టత కల్యాణిగారి ప్రత్యేకత .ఆవేశం తోపాటు నిగ్రహమూ ఉన్న కళాకారిణి .భౌతికంగా ఈమని వారు మనమధ్య లేక పోయినా కుమార్తె కల్యాణిగారు సృజిస్తున్న ‘’నాద దేహదారణ చేస్తున్నారు ‘’ అంటే అతిశయొక్తికాదు’’ అన్నారు ముదిగొండశ్రీ .’’మధుర స్మృతి-ఇతర కీర్తనలు ‘’అనే పేరుతొ కేసెట్ గా రికార్డ్ చేశారు .1975 లో ‘’మొదటి ప్రపంచ తెలుగు మహా సభలలో తండ్రి ఈమని శంకర శాస్త్రి గారితో వేదికపై సహకార వాద్యం వాయించిన ఘనత కల్యాణి గారిది

.49  –టి పద్మిని

329 –మంచి ప్రయోగ శీలి పద్మినిగారు రామవరపు విజయ లక్ష్మి తిరుపతి రామానుజ సూరి గార్ల వద్ద వీణ నేర్చారు .తుమ్మల వేణు గోపాలరావు కృష్ణా బాయ్ దంపతులకు జన్మించి ,రచయితా ,ఆంద్ర విశ్వ విద్యాలయ తెలుగు శాఖలో ఆచార్యులు అయిన అత్తలూరి నరసింహారావు గారిని పెళ్లి చేసుకొని ,1956 లో బెజవాడలో గాత్రం వీణలలో డిప్లొమా పొంది ,ఏం యే ఇంగ్లీష్ చేసి ,పి హెచ్ డి.సాధించారు .ఆకాశవాణి ,దూరదర్శన్ లోకచేరీలు చేశారు .1979 లో ‘’మ్యూజిక్ –పెయింటింగ్ ఫీస్ట్ ‘’వాయించారు వీరు వీణ వాయిస్తుంటే ఇద్దరు చిత్రకారులు చిత్రాలు వేయటం అనేది ఇక్కడ చేసిన ప్రయోగం .భరతుడు నాట్య శాస్త్రం లో యే రసానికి యే రంగు ఉంటుందో తెలియజేశాడు .సన్నాయి వాయిద్యం తో కలిసి పద్మిని గారు’’ ద్వివాద్య ‘’కచేరీ చేయటం మరో ప్రయోగం .1993 ,99 లలో రెండు సార్లు అమెరికా వెళ్లి పాడుతూ వాయించమంటే అలాగే కచేరీలు చేసి వచ్చారు .

50 –జయ లక్ష్మీ శ్యామ సుందర్

330-వాసా ,అయ్యగారి ,పప్పు వంశాలు వైణిక వంశాలు .పప్పు సోమేశ్వరరావు గారమ్మాయి ,అయ్యగారి సోమేశ్వర రాగారబ్బాయి శ్యామ సుందర్ గారి భార్య శ్రీమతి జయలక్ష్మి ..1955 లో జన్మించి తండ్రి ,మామగార్ల భర్త  సాన్నిధ్యం లో సాధన చేసి ,అగ్రశ్రేణి వైణికురాలై భర్తకు  సహకార వాద్యం వాయిస్తూ ,ఆకాశవాణిలో  టి .వి .లో సోలోగా జంటగా వాయిస్తూ 2001 అమెరికా తానా సభలకు వెళ్లి జంటగా వాయించి డెట్రాయిట్ ,న్యు జేర్సీలలో విడిగా కచేరీలు చేశారు జయలక్ష్మి .విజయవాడ రేడియో కేంద్రం నుంచి ‘’రండి చేయి చేయి కలుపుదాం ‘’’’పచ్చలహారం ‘’,తుంగ భద్ర ‘’వంటి రూపకాలను ప్రసారం చేశారు .

51 –రామవరపు మాధురీ దేవి

331 –ఒరాకిల్ డెవలపర్ 20 00 ,,మైక్రో సాఫ్ట్ అప్లికేషన్స్ నాలెడ్జ్ తో అప్లికేషన్ లో డిప్లొమా పొందిన రామవరపు మాదురీదేవి ,ఆంధ్రా యూని వర్సిటి నుంచి వీణ డిప్లొమా ,ఢిల్లీ  విశ్వ విద్యాలయం నుంచి కర్నాటక గాత్ర సంగీతం లో ‘’సంగీతశిరోమణి ‘’వీణలో ఏం.ఎ గోల్డ్ మెడల్ ,కర్నాటక సంగీతం లో అదే యూని వర్సిటీ నుంచి ఏం. ఫిల్ .పొందిన ఘనత మాదురీదేవిగారిది .15-1-1969 లో విశాఖ లో రామవరపు విజయలక్ష్మి ,శరత్ బాబు దంపతులకు జన్మించిన మాధురి చిన్నతనం లోనే పెద్ద పేరు పొందింది .రేడియోలో ఎ గ్రేడ్ వీణా ఆర్టిస్ట్ ,లలిత సంగీతం లలిత వాద్య సంగీతం లో బి గ్రేడ్ ఆర్టిస్ట్ .’’కర్నాటక సంగీతం లో వర్ణముల పాత్ర ‘’,జావళి అన్న సంగీత ప్రక్రియా పరిశీలనం ‘’అనే రెండు అంశాలపై గొప్ప పరిశోధన చేసి పత్రాలను సమర్పించారు .చిట్టిబాబుగారి ‘’టెంపుల్ బెల్స్ ‘’,’’సేరేనాడే ‘’అనే ఎల్ .పి రికార్డ్ లలో వాయించిన అదృష్ట వంతురాలు .కర్నాటక ,లలిత ,పాశ్చాత్య సంగీతాలు మూడింటి లోను నిష్ణాతురాలు .1989 -90 లలో అమెరికాలో అనేక రాష్ట్రాలలో పర్యటించి అనేక ప్రముఖ పట్టణాలలో కచేరీలు చేసి మెప్పు పొందారు .’’అంకిత భావం ఉంటేనే ఏదైనా సాధ్యం ‘’అంటారు ఆమె .ఆమె వీణ విద్యా రహస్యాన్ని ఒక పత్రిక ‘’స్వర వీణా మాధురి ‘’అని మెచ్చింది .Inline image 7

52- మేడూరి శ్రీనివాస్

332  -వృద్ధ సంగీత విద్వాంసులు శ్రీ మేడూరి శ్రీనివాస్ గారు .పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర దొమ్మేరులో 19 13 జనవరిలో జన్మించి ,1923 నుంచి రెండేళ్ళు శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రిగారి వద్ద వీణ నేర్చిన శ్రీనివాస్ గారి తలిదండ్రులు లక్ష్మీ సూరమ్మ ,కామ దాసు గార్లు .విజయనగరం లో వాసా వెంకట రావు గారి వద్ద వీణ అభ్యసించి ,హైదరాబాద్ కింగ్ కోఠీ ప్రభుత్వ సంగీత కళాశాలలో 16 ఏళ్ళు వీణ అధ్యాపకులుగా పని చేశారు .10 వ ఏట నుండే వీణ వాయించిన వీరి భార్య కుమార్తెలు అందరూ వీణా వాదన నిపుణులే .

53 –మేడూరి నరసింహా రావు ,సుబ్బలక్ష్మి

333 –మేడూరి నరసింహారావు నిలబెట్టి  వాయించేవారు వీణను .సంగమేశ్వర శాస్త్రిగారి శిష్యులు .నరసింహా రాగారమ్మాయి సుబ్బలక్ష్మి .తండ్రివద్దేవిద్య నేర్చ శ్రీపాద పినాక పాణిగారివద్ద మెళకువలు గ్రహించి వేగంగా వీణ వాయించే నేర్పు సాధించారు .బెంగుళూరులో ఉంటున్నారు .

54- మేడూరి శ్రీనివాస్

334 -1969 ఆగస్ట్ లో దొమ్మేరులో పుట్టి తండ్రివద్దే విద్య నేర్చి ,వీణ టెక్నిక్ లను అక్క సుబ్బలక్ష్మి దాగ్గర గ్రహించి అగ్ర స్థాయి వైణికులుగా ఉంటూ యెంత వేగంగా వాయించినా స్పష్టత తగ్గకుండా ,శ్రోతలను కదల కుండా కూర్చేపెట్టే సామర్ధ్యం పొంది బాగా రాణిస్తున్నారు .వాద్యం పై గొప్ప అధికారం నైపుణ్యం ఉన్నవారు .ఇన్సూరెన్స్ ఉద్యోగి అయినా శ్రోతల మానసిక ఇన్సూరెన్స్ కు వీణ ద్వారా హామీ ఇస్తున్నారు .చిట్టిబాబుగారు ఒకే వీణపై 10 వీణల పెట్టుగా ఎలా వాయి౦చ గలరో శ్రీనివాస్ కూడా అంతేసులభంగా శంకరాభరణం, తోడి రాగాలను ‘’తోడి పారేయ ‘’గలరు .

55- అయ్యగారి సత్య ప్రసాద్

335-అయ్యగారి శ్యామసుందర్ గారి తమ్ముడు ,సోమేశ్వరరావుగారబ్బాయి సత్య ప్రసాద్ .తండ్రేగురువు .వీణలో డిప్లోమాపొంది విశాఖ రేయోకేంద్రం నుండి వీణ వాయించేవారు 28-10-1955 లో గుంటూరు జిల్లా బాపట్ల లో జన్మించిన వీరు  ,గాత్రధర్మానికే ప్రాధాన్యమిస్తారు .ఎవరూ ఎదురుగా  తాళం వేయాల్సిన అవసరం లేకుండా మనసులోనే తాళం నడుపుకొనే ప్రత్యేకత వీరిది .సప్త తంత్రులను సద్వినియోగం చేస్తారు. రాజమండ్రి ప్రభుత్వ సంగీత కళాశాలలో వీణ అధ్యాపకులుగా ఉన్నారు .

Inline image 8

56 –యోగ వందన

336 –ఉస్మానియా నుంచి ఏం. ఎస్ సి ,,త్యాగరాజ ప్రభుత్వ కళాశాలనుంచి వీణ డిప్లొమా ,మీరజ్ లోని అఖిల భారత గాంధర్వ విద్యాలయ నుంచి ప్రధమ శ్రేణి లో ‘’అలంకార్ ‘’ను పొందిన విదుషీమణి యోగవందన .దేశ విదేశాలలో గొప్ప కీర్తి పొందిన వందన భాగ్య నగరం లో పుట్టి పెరిగింది  భర్త శ్రీ కామేశ్ ను పెళ్ళాడి బెంగుళూరు లో స్థిరపడ్డారు .వీరి తలిదండ్రులు శ్రీ వేటూరి ఆనందమూర్తి శ్రీమతి చంద్ర కళ .తల్లి గొప్ప గాయని. తండ్రి మహా పండితులు ,కవి రచయితా విఖ్యాత విమర్శకులు,పరిశోధకులు . .తాతగారు జగత్ ప్రసిద్ధకవిపండిత పరిశోధకులు మాస్టర్ సి వి గారి శిష్యులు  వేటూరి ప్రభాకర శాస్త్రిగారు .

337-శ్రీమతి కాజ శుభాషిణి ,శ్రీ ఎ.అనంత రావు గార్ల వద్ద విద్య నేర్చి వాసావారి వాదనా పద్ధతికి అలవటై, కుసుమ కోమల మార్దావాన్ని సాధించారు. మహారాజపురం విశ్వనాధయ్యర్ గోల్డ్ మెడల్ పొందారు .మన రాష్ట్రం లోని అన్నినగరాలలో కచేరీలు చేశారు .తిరువయ్యూర్ త్యాగ రాజ ఆరాధనోత్సవాలలో భక్తీ శ్రద్ధలతో పాల్గొంటారు .

338-2011 మే నెలలో మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో ‘’టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ‘’లో,ఇండియన్ కల్చరల్ సెంటర్ ,లలో వీణ కచేరి చేశారు  ఐ సి సి ఆర్ ద్వారా సైప్రస్ ,చైనాలకు ఆహ్వానాలన౦దు కొని సింగ పూర్ లో మన ఎ౦బసిలో వీణ వాయించారు. దుబాయ్ జర్మనీ డెన్మార్క్ లలో ఆహ్వానాల మేరకు వెళ్లి కచేరీలు చేసి ఘన సన్మానాలు అందుకొన్నారు .

339-‘’వాయి౦చ గానే శ్రోతలకు యిట్టె తెలిసి పోయే ప్రముఖ కృతులను ఎన్నుకొని వాయిస్తాను .రాగం వెంట రాగం వాయిస్తున్నప్పుడు రెండు రాగాలలో స్వర సామ్యం లేకుండా చూసుకొంటాను .భిన్న వాగ్గేయ కారుల రచనలనూ వేర్వేరు తాళాలను ఎన్ను కొంటాను .కచేరీ చివర హిందూస్తానీ రాగాలు వాయిస్తాను ‘’ అని యోగ వందన తన విజయ రహస్యం చెప్పారు .

340 –‘’జనం వీణకచేరీలకంటే గాత్రకచేరీలను ఎక్కువగా ఆదరిస్తున్నారని ‘’అనటాన్ని యోగవందన ఒప్పుకోవటం లేదు .కన్నైకుడి వైద్యనాదంగారి వయోలిన్ సోలో  కచేరీ ఎంతటి ప్రసిద్ధి చెందిందో అందరికి తెలుసు .ఇప్పుడు శాస్త్రీయ సంగీతానికి ఆదరణ బాగా ఉందని ,వాద్య కళాకారులు కూడా శ్రోతల్ని రంజింప చేయటం ముఖ్యంగా భావించాలన్నారు ..సంగీత విద్యాభి వృద్ధికి విశ్వ  విద్యాలయాలు బాగా తోడ్పడుతున్నాయని ,అయితే ప్రభుత్వ సాయం, ప్రోత్సాహం ఇంకా ఎక్కువగా ఉండాలని ,తలిదండ్రులు తమ పిల్లలను సంగీతం పై ప్రోత్సాహం కలిగించాలని ,గురువుల బాధ్యతా కూడా ఎక్కువగా ఉందని వీణ నేర్చుకోవ టానికి గాత్ర సాధన కూడా అవసరమని ,సాధనకన్నా సంగీతం  వినటం ఎక్కువ అవసరమని ,కచేరీముందు అదనపు సాధన విజయాన్నిస్తుందని తన కుమార్తె యోగ కీర్తన కూడా ఇదే కోవ లోకి చెందుతుందని వీణా ‘’యోగం’’ లో అందరి ప్రోత్సాహ’’ వందనాలు’’ అందుకొంటున్న ‘’యోగ వందన ‘’గారి మాటలు అందరూ ఆలోచింప దగినవే .

Inline image 9

‘’ఇది విన్నారా ,కన్నారా ‘’అనే ఈ సంగీత ధారావాహిక ఇంతటితో సమాప్తం .

మొదట్లోనే చెప్పినట్లు ఈ బృహత్ రచనకు ఆధారం –తెలుగు అకాడెమి వారు ప్రచురించిన ఆచార్య శ్రీ ముది గొండ వీరభద్రయ్య గారి రచన ‘’మన గాత్ర,తంత్రీ వాద్య సంగీత విద్యా నిధులు ‘’అని వినయ పూర్వకం గామళ్ళీ  తెలియ జేస్తూ,ఇంత మంది సంగీత సరస్వతులను ,వారి గురు మహోదయులను ,శిష్య ప్రముఖులను పరిచయం చేసే మహా అదృష్టం నాకు దక్కిందని పొంగిపోతూ ,ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారి కీ ,వారి విశేష కృషికి నమస్కరిస్తూ   సెలవు తీసుకొంటున్నాను .

Inline image 10

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్- 20-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్ .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 29 నేటి వైణికులు 39-పుదుక్కోటై కృష్ణ మూర్తి

ఇది విన్నారా కన్నారా !  29

నేటి వైణికులు

39-పుదుక్కోటై కృష్ణ మూర్తి

308 –నేటి అగ్రశ్రేణి వైణికులలో పుదుక్కోటై కృష్ణ మూర్తి ఒకరు .అయన లో అనేక వాదనల శైలి మిశ్రమితమై ఉంది .అందరి లోని మేలిమిని గుర్తిస్తూ తనదైన శైలి ఏర్పరచుకొన్నారు .7-10-19 39 లో మీనా౦ బాళ్ ,రామస్వామి దంపతులకు కొడైకెనాల్ లో జన్మించారు ..తండ్రి పుదుక్కొట రాజావారి కార్ డ్రైవర్ .9 వ ఏటనే పుదుక్కోటై శ్రీనివాసన్ దగ్గర సంగీత శిక్షణలో చేరి 13 వ ఏట గాత్ర కచేరీ చేశారు .అన్నామలై విశ్వ విద్యాలయం లో సంగీతం లో బాచిలర్ డిగ్రీ పొంది ,20 వ ఏటతిరుచ్చి,,మద్రాస్ ఆకాశవాణి లనుంచి కచేరీలు చేశారు.22 వ ఏట 1961 లో తిరుపతి దేవస్థానం సంగీత కళాశాలలో చేరి 1997 వరకు అధ్యాపకులుగా చేసి ,ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ పొందారు  .విరమణ తర్వాత శ్రీ సత్య సాయి మీర్ పూరి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ ప్రిన్సిపాల్ అయి సర్టిఫికేట్ ,డిప్లొమా కోర్స్ లకు రూప కల్పన చేసి ,బాబా నుండి ప్రశంసలు పొందారు .

309- .’’వైణిక పంచానన ‘’ ,వైణిక గాయక ‘’బిరుదులు  పొంది గాత్ర వాద్య మాదుర్యాలతో మెప్పించారు .పరమనాజూకైన తమగాత్రం తో పాత పాడుతూ వీణ వాయించి సవ్య సాచి అనిపించారు .రెండిటిని సమాన ప్రతిభతో వ్యక్తం చేయటం వారి ప్రత్యేకత .వారికి అపారమైన కీర్తన పాఠం ఉన్నదని,తానం లో అందే వేసిన చేయి అని ,సప్తవిధ తానాలు అలవోకగా వాయించ గలరని హామీరు ,కల్యాణి రాగాలను వాయించేటప్పుడు అచ్చంగా హిందూస్థానీ పద్ధతిలోనే వాయిస్తారని ముదిగొండవారంటారు .

310- సాధారణం గా వైణికులు తమ వీణకు మేళం కట్టుకోరని ,కాని కృష్ణమూర్తిగారు తామే కట్టుకొని ,కొత్త పద్ధతులను కూడా కనుక్కోన్నారని చెక్కతో మేళం కట్టుకోవటాన్ని సాధించారని వీణ కుండ సైజు ను తగ్గించి స్థాయిని 1 ½ స్థాయిగా మార్చి అంటే’’ మానవుడికంఠం పలికే స్థాయి’’కి చెక్కమేళం కట్టి ,యాళి ముఖాన్ని పై వైపుకు మార్చి ‘’కృష్ణ వీణ ‘’అని పేరు పెట్టారని ఆచార్య శ్రీ తెలిపారు .భార్య పద్మా కృష్ణ మూర్తి గారితోకలిసి సంగీత కేసెట్ తెచ్చారు .

311-5-2-2003 న విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో గురు పూజోత్సవ సమయం లో శ్రీ అన్నవరపు రామస్వామి గారు కృష్ణ మూర్తిగారిని  సన్మానించి ,వెండి వీణ బహూకరించి ‘’వీణా వాద్య విద్వద్మణి’’బిరుద ప్రదానం చేశారు .పదవి విరమించాక తిరుపతిలో స్థిరపడి వీణ మీటు ,సరలీస్వరాల నుంచి రాగం తానం ,పల్లవి దాకా నేర్పటం పై 32 డి,వి.డి.లను సిద్ధం చేసి కొత్త రీతిలో గురుత్వం వహిస్తున్నారు .ఇవి 38 గంటల నిడివి ఉన్నవి .ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన 4 సంవత్సరాల సర్టి ఫికేట్ కోర్స్ కు దృశ్య శ్రవ్య మాధ్యమాలలో వాయించి చూపారు .స్పెయిన్ కెనడా దేశాలు భార్యతో పర్యటించి వీణ కచేరీలు చేసి మెప్పు పొందారు .

Inline image 1

40 –అయ్యగారి శ్యామ సుందర్

312-అయ్యగారి సోమేశ్వర రావు గారికుమారులైన శ్యామ సుందర్ తండ్రికి మించిన తనయులు .తండ్రి ‘’వైణిక రత్న ‘’అయితే కుమారుడు ‘’వీణా వాద్య విశారద ‘’.19 48 లో విజయనగరం లో జన్మించి 8 ఏళ్ళకే మొదటికచేరీ చేసిన ఉద్దండ పిండం .4 వ ఏటనే కీర్తనలు వాయించిన ఈచిన్నారికి 5 న చేయాల్సిన అక్షరాభ్యాసం 4 వ ఏటనే చేసి స్పీడ్ పెంచారు తలిదండ్రులు .30 వ ఏట ఆకాశవాణి ఎ గ్రేడ్ ఆర్టిస్ట్ అయ్యారు. అదే వయసులో మద్రాస్ సంగీత అకాడెమి ‘’ఉత్తమోత్తమ వీణా వాదకుని ‘’గా గుర్తిస్తే ,1978 లో శ్రీ కృష్ణ గాన సభ వీరిప్రతిభను గుర్తించి సత్కరించింది

313-త్యాగ రాజ పంచరత్న ఊహా స్వర తరంగిణి ,భ్రమ ,విశ్వ సంగీత పరిణామం అనే వాద్య బృంద రచనలు చేసి ,అనేక యక్షగానాలకు సంగీతం కూర్చి సామర్ధ్యం రుజువు చేసుకొన్నారు .వీరి ‘’నాగ బంధం ‘’రచనకు జాతీయ పురస్కారం లభించింది .17 ఏళ్ళుగా ప్రభుత్వ సంగీత కళాశాలలో పని చేశారు  .విజయవాడ కాలేజి ప్రిన్సిపాల్ గా పని చేశారు వీరి వీణ తరగతి లో 200కు పైగా విద్యార్ధులు ఉ౦డేవారంటే వారి సామర్ధ్యం ఎంతటిదో తెలుస్తుంది .ఆహ్వానం పై అమెరికా వెళ్లి అనేక చోట్ల కచేరీలు చేశారు .’’నాకు అనుభవం అంతా నాన్నగారితో కచేరీలు చేయటం వల్లనే వచ్చింది ‘’అని చెప్పుకొన్నారు .3 గంటల కచేరీలో 20 ఐటమ్స్ వాయించే నేర్పు వారిది .’’వీణ మీద గిమ్మిక్స్ చేయ కూడదు . ,అది సంగీతం కాదు . వీణ పాడాలి ‘’అంటారు .

Inline image 2

41- –రామ వరపు విజయ  లక్ష్మి

Inline image 3

314-కొన్ని వేలమందికి వీణ నేర్పిన విజయలక్ష్మి విశాఖ వాసి .ఆమె పుట్టినిల్లు మెట్టి నిల్లు  రెండూ సంగీత నిలయాలే పట్రాయని నారాయణ మూర్తిగారి వద్ద పదేళ్ళు నేర్చారు .ఓలేటి వెంక టేశ్వర్లుగారి కర్నాటక హిందూ స్థానీ బాణీల సమ్మేళన పధ్ధతి బాగా నచ్చి దానిలో సాధన చేసి అగ్రభాగాన నిలిచింది .కుమార్తె మాధురి వైణికురాలు ,కుమారుడు తేజస్వి మార్దంగికుడు .సంగీతం లో డాక్టరేట్ పొందాడు .ఉక్కు విశాఖ ను సంగీత విశాఖ గా తీర్చి దిద్దిన ఘనత రామ వరపు విజయ లక్ష్మిగారిదే .ఆమె శిష్యురాళ్ళు డా పద్మిని ,మాధురి లు అంతర్జాతీయంగా ఎదిగిన విద్వాంసులు.

Inline image 4

42-దుడ్డు సీతా రామయ్య

315-20-2-1956 న జన్మించిన సీతారామయ్య 1994నుంచి హైదరాబాద్ త్యాగరాజ ప్రభుత్వ సంగీత కళాశాలలో వీణా చార్యులుగా పని చేస్తున్నారు .9 వ ఏటనే వీణ మీటిన ఈ చిరుత 1973 లో చిట్టిబాబుగారి వీణ కచేరి చూసి ప్రేరణ పొంది సాధన చేశారు .కౌశల్యం వచ్చాక నేపాల్ ప్రధాని కొయిరాల ,మెక్సికో గవర్నర్ ఆల్బర్టో కార్దినాస్ సమక్షం లో కచేరీలు చేశారు .

316-వీణ లో దొడ్డ వారైన దుడ్డువారు శయన వీణా విధానాన్ని మార్చి ఊర్ధ్వ వీణగా వాయించటం మొదలు పెట్టారు .తాళానికి ‘’మెట్రో నిం ‘’(తాళయంత్రం ) ఉపయోగిస్తారు .’’చిట్టిబాబు గారి వాదనలో మెలోడి ఉంటుంది .అదే పండితుడిని ,పామరుడిని కట్టి పడేసింది .చిట్టిబాబు గారే నా ఇన్ స్పి రేషన్ ‘’అన్నారు దుడ్డు వారు .’’పుదుక్కోటై క్రిష్ణమూర్తిగారిలో ఒక టెంపో ఉంది .అది హుషారెత్తిస్తుంది .గమకం ,అలవోకతనం గాత్ర ధర్మం వాద్య ధర్మం ఉంటాయి .స్వర కల్పనలో నిర్దుష్ట మైన మాద మేటిక్స్ ఉంటాయి ‘’అని అభిప్రాయపడ్డారు .

317 –‘’వీణ మీద తానం ప్రత్యేక అంశం .తానానికి ఎక్సేర్ సైజు లుంటాయి .ఇవన్నీ చెప్పి ,కలిపేస్తే సామాన్యంగా సులభం గా ఉండే రాగాలలో తానం వాయి౦చేట్లు విద్యార్ధిని సిద్ధం చేయ వచ్చు. తానం లో లయ ఉంది .జాగాకి రావాలన్న టెన్షన్ ఉండదు ‘’అన్నది దుడ్డువారి దొడ్డ అభిప్రాయం .మంచి ప్రయోగశీలి ఉత్తమ అధ్యాపకులు మేధా సంపత్తి ఉన్నవారు సీతారామయ్యగారు అని వీరభద్రయ్యగారి విశ్లేషణ .

43-కాజా సుభాషిణీ శాస్త్రి

318-వాసా కృష్ణ మూర్తిగారి శిష్యులలో ఇప్పుడు వీణ బాగా వాయించేముగ్గురిలో శ్రీమతి కాజా సుభాషిణీ శాస్త్రి ,శ్రీమతి ఆనంద రాజ్య లక్ష్మి శ్రీమతి అంబుజ వల్లి గారు అని ముదిగొండ ఉవాచ .ముగ్గురూ ముగ్గురే .సంగీత అమ్బోనిది ని చిలికి అమృతం తెచ్చినవారే నంటారు .కచేరీలు చేస్తూ గాన సభలు నిర్వహిస్తూ విద్య నేర్పుతూ మూడింటిలోనూ అసామాన్య ప్రతిభ చూపినవారు సుభాషిణీ శాస్త్రి .1958మే నెలలో కందుకూరులో రాజేశ్వరి నరసింహం దంపతులకు జన్మించారు .విశాఖలో వాసావారి శిష్యురాలై వీణ అభ్యసించారు .వాసావారికి లలిత ,సినీ సంగీతం ఇష్టం లేదని ఆమె చెప్పారు .

319- అరుణాచల శాస్త్రిగారిని వివాహం చేసుకొని హైదరాబాద్ లో ఉంటూ మంచాల వారి వద్ద వీణాభ్యాసం కొన సాగించారు .1987లో ఎ గ్రేడ్ ఆర్టిస్ట్ అయి మనరాస్ట్ర , కొచ్చిన్ రేడియో కేంద్రాలనుంచి ,దూరదర్శన్ లలో కచేరీలు చేశారు .ప్రస్తుతం హైదారాబాద్ తెలుగు విశ్వ విద్యాలయం లో బోధిస్తున్నారు .మనో ధర్మ సంగీతాన్ని ఆదరించారు .’’తుమురాడ ,వాసా ,ఈమని త్రయం  తెలుగు వీణకు కొత్త జీవం పోశారు .శాస్త్రిగారి శిష్యుడు చిట్టిబాబుగారు వీణకు హత్తిన మాధుర్యం అంతా ఇంతా కాదు ‘’అన్నారు సుభాషిత౦ గా  సుభాషిణి గారు .1986 డిసెంబర్ లో ముదిగొండవారికి  నిజామాబాద్ లో మామిడి పూడి ఆనంద్ గారి అబ్బాయి సింహాచలం గారింట్లో ఈమని వారితో రెండు మూడు గంటలు మాట్లాడే సదవకాశం లభించిందట .అప్పుడు ముదిగొండ వారు ఈమనివారిని ‘’వీణా వాదనలో బాల చందర్ గారిది ఒక పంధా ,మీది ఒక పంధా గా ఉన్నాయి కదా ఈ రెండిటిలో ఏది శ్రేష్టమైనది ?’’అని అడిగితే తడుముకోకుండా ‘’నా మార్గమే ‘’అని నిర్ద్వంద్వంగా శాస్త్రి గారు చెప్పారట ‘’అది నిజమే .పద నిర్దేశకుడై ఒక రీతికి ప్రవక్త అయిన మహా వైణికుడు తనమార్గం తక్కువదనో ,ఇతరుల మార్గం తనదానికంటే గోప్పదనో అంటాడా ?’’అన్నారు ఆచార్య ముదిగొండ .

320-శ్రీ సంజీవ రెడ్డి తర్వాత హైదరాబాద్ లోని గ్రీన్ లాండ్ సౌధాన్ని యే ముఖ్యమంత్రీ ఉపయోగించలేదని శ్రీ టంగుటూరి అ౦జయ్యగారు ముఖ్యమంత్రి అయి ఆ సౌధానికి మరమ్మత్తులు చేయించి గృహ ప్రవేశం చేసే సందర్భం లో ముఖ ద్వారం ముందు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి వీణ సంగీత కచేరీ  ఏర్పాటు చేయించారని ,అ౦జ య్యగారు గృహప్రవేశం చేయాలంటే శాస్త్రిగారు తమ వాయిద్యాలతో సహా వేదిక వదిలి వెళ్ళాల్సిందే నని ,గంట సేపు జరిగిన ఆ కచేరీని అ౦జయ్యగారు ఆస్వాదించి వేదిక ముందుకు వచ్చి శాస్త్రిగారికి  వారి వీణకు వంగి నమస్కరించి ,వేదికదాటి సకుటుంబం గా గ్రీన్ లాండ్స్ సౌద ప్రవేశం చేశారని అ౦జయ్య గారి సంస్కారం అది అని ,శాస్త్రిగారి వీణ వైదిక మంత్రోచ్చారణ తో సమానమని ,అది సామవేద గానమని ,కచేరీలలో మంత్రం పుష్పాన్ని ,ఘన పాఠాన్ని వాయించటం శాస్త్రి గారి ప్రత్యేకత అని ముదిగొండ వారు ముదిత మనస్కులై వివరించారు .

321-సంగీతం లో పండిపోయిన శాస్త్రిగారు 16 ఏళ్ళ వర్దిష్ణువు అయిన సుభాషిణి శాస్త్రి కి తనతో పాటు కొన్ని కచేరీలలో సహకార వాద్య కారిణిగా అవకాశం కల్పించారని ,కొంత కాలం ఆ శాస్త్రి గారు ఈ శాస్త్రికి వీణ కూడా నేర్పారని ,ఆయనతో చేసిన కచేరీల విషయాలెన్నో తనకు తెలియ జేశారని ఆచార్యులవారన్నారు .శాస్త్రిగారి అరుదైన ‘’లైటర్ మూడ్స్ ‘’అంటే తేలిక లక్షణాలను సుభాషిణి రికార్డ్ చేసి భద్రపరచారు .ఆయన వద్ద సంగీతం నేర్చుకోవటానికి తన రెండున్నర ఏళ్ళ కొడుకు రామ కృష్ణ తో  సహా వెళ్ళేదాన్ని అని వాడుఏడవవకుండా  ఆటబొమ్మలు బిస్కెట్లు తీసుకు  వెళ్ళేదాన్నని కాని ,వాడు శాస్త్రి గారి శాస్త్రిగారి ‘’పాన్ పరాగ్ ‘’డబ్బా తీసుకొని పారి పోయేవాడని ,గురువుగారు వెంటపడి ‘’ఒరే దాన్ని తినకురా ‘’అని అరుస్తూ వెంబడించేఈ చిన్న విషయాలను కూడా తాను  రికార్డ్ చేశానని సుభాషిణి శాస్త్రి గారు చెప్పారు .పెద్దవారి జీవితం లో చిన్న తంతు ఇది .ఇదంతా ‘’జీవన సంగీతమే ‘’అంటారు సుభాషిణి .

322-ఒక సారి శ్రీకాకుళం లో శాస్త్రిగారి కచేరీకి సుభాషిణీ శాస్త్రి గారి కుటుంబాన్ని శాస్త్రిగారు కారులో తీసుకు వెళ్లారట .కచేరీ మొదలవ్వటానికి ముందు సుభాషిణి కొడుకు రామ కృష్ణ శాస్త్రిగారిని ‘’కచేరీ ఎప్పటికి పూర్తీ అవుతుంది తాతగారూ ?అని అడిగితె ‘’బిగ్ ముల్లు 12 ,స్మాల్ ముల్లు9 మీదకు వస్తే ప్రోగ్రాం అయి పోతుందిరా ‘’అన్నారట .పిల్లాడు వాచీ మాటిమాటికీ చూసుకొంటూ9 కాగానే స్టేజి దగ్గరకెళ్ళి గట్టిగా ‘’తాతగారూ ! 9 అయి పోయింది ‘’అన్నాడు .కోపం తెచ్చు కోకుండా’’ తాత శాస్త్రిగారు -‘’అయి పోయి౦ది నాన్నా కచేరీ ‘’అని కొన సాగించారని సుభాషిణిగారు తెలియ బర్చారు .’’జీవితానికి సంగీతం మాధుర్యం తెస్తే ,సంగీతానికి జీవితమూ మాధుర్యం తెస్తుంది .విద్య విషయం లో  శాస్త్రి గారు ఎంతటి రసిక మూర్తి యో ,జీవితం లోనూ వారి శిష్య వాత్సల్యం లోనూ ఆయన పరమ సహృదయ రసమూర్తి ‘’అని చెప్పారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

Inline image 5

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 28 38-కళాప్రపూర్ణ చిట్టిబాబు

ఇది విన్నారా కన్నారా !  28

38-కళాప్రపూర్ణ చిట్టిబాబు

296-1981నుండి 87దాకా తమిళనాడు రాష్ట్ర కళాకారుడుగా ఉన్న చిట్టిబాబు గురించి 656   పేజీలున్న ‘’హిందూ స్పీక్స్ ఆన్ మ్యూజిక్ ‘’గ్రంధం లో  గురించి కేవలం 10 పంక్తులు మాత్రమే రాశారని బాధ అపడ్డారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .కానీ ‘’కన్నడ సంగీత నృత్య పరిభాషా కోశ ‘’లో చిట్టిబాబు గురించి కొన్ని వివరాలైనా సంక్షిప్తంగా తెలియ బరచారని సంతోషించారు.

297 –చల్లపల్లి రంగారావు ,సుందరమ్మ దంపతులకు చిట్టిబాబు 1936 లో కాకినాడ లో జన్మించారు తండ్రివద్దా ,పా౦డ్రవరపు సింగ రాజు గారి దగ్గరా శిక్షణ పొందారు తర్వాత జయుణ్ణి అప్పలాచార్య వద్ద రెండేళ్ళు శిష్యరికం చేశారు .1948భరణీ వారి ‘’లైలా మజ్ను ‘’సినిమాలో మజ్ను వేషధారి అక్కినేనికి బాల మజ్ను వేషం వేయటానికి మద్రాస్ వచ్చి వేషం వేసి మెప్పించారు. ఆసినిమా గొప్ప విజయం సాధించింది .రెండవ సినిమా   బాలరాజు లో కూడా బాల నాగేశ్వర రావు గా నటింఛి  చిట్టిబాబు గట్టి బాబు అనిపించుకొన్నారు .ఈసినిమా కూడా మాంచి హిట్ కొట్టింది   .12 వ ఏట వీణ లో మహా విద్వా౦సుడినవ్వాలనే సంకల్పమ కలిగి ,  చిట్టి బాబు మహా మహోపాధ్యాయ ఈమనిశంకర శాస్త్రి గారి దృష్టిలో పడి వారి వద్ద వీణ నేర్చారు .అసలు పేరు’’ చల్లపల్లి హనుమాన్లు ‘’ను శాస్త్రిగారు ‘’సి .చిట్టి బాబు ‘’గా మళ్ళీ నామకరణం చేశారు .శాస్త్రిగారు ముద్దుగా చిట్టి బాబూ అని పిలిచే పిలుపే పూర్తిగా నామదేయమై పోయింది .

298 – 1948 నుండి62వరకు  ‘’సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రి ‘’లో వీణ కళాకారుడుగా ఉండి,ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావు పెండ్యాల నాగేశ్వర రావు విశ్వనాధన్ –రామ మూర్తి గార్ల వద్ద సంగీత శాఖలో పని చేస్తూ అనేక తెలుగు తమిళ చిత్రాల సూపర్ డూపర్ హిట్ ట్యూన్లకు కారకులయ్యారు  .

13-10-1964 న చిట్టిబాబు అభినందన సభలో డా .పి.వి రాజమన్నార్ ‘’ఒక వ్యక్తీ లలితకళలలో ప్రజ్ఞా వంతుడు కావటానికి ‘’పూర్వ జన్మ పరిపాకం ‘’అవసరం .చిట్టిబాబు వీణా గానం వింటే ఆయన అలాంటి పరిపాకం లో జన్మించినట్లు తెలుస్తుంది సాధారణం గా గాయకులూ వాద్య విద్వాంసులు సంప్రదాయాన్ని అనుసరిస్తూ ,అందులోంచి బయట పడలేక అంటిపెట్టుకొని ఉండి పోతూ ఉంటారు .చిట్టి బాబు అలా కాకుండా సంప్రదాయాన్ని ఆధునిక పోకడలతో మేళవించి ,అద్భుత రస కల్పనలతో స్వకపోల కల్పితమైన ఒక బాణీ కి రూప కల్పన చేశారు .కళకు శిఖరాగ్రం అంటూ ఉండదు .కళాకారుడు కళను నిరంతరంగా ఉపాసన చేయాల్సి ఉంటుంది ‘’అన్నారట .

299 –‘’గాన కళ ‘’1964 సెప్టెంబర్ –అక్టోబర్ సంచికలో ‘’చిట్టిబాబు గారి వీనావాదన విన్నప్పుడు వారి గురువుగారు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి బాణీ స్పురణకు వస్తుంది .’’మార్గ హిందోళ ‘’రాగాలాపన ,కల్యాణి రాగం లో విశిష్ట కల్పనలు అనన్య సామాన్యమైనవి ఉపజ్ఞా  పూరితమైన వీరి భావనా పటిమ పెద్దలైన వైణిక విద్వాంసుల కోవకు చెంది నట్లుగా ఉంది .’’బేహాగ్ ‘’చక్కని హిందూ స్థానీ లో వాయించారు ‘’అని మెచ్చుకోన్నది.

300-తిరువయ్యూరు ‘’శ్రీ త్యాగ రాజ బ్రహ్మోత్సవ సభ ‘’నిపుణుల సంఘం లో చిట్టిబాబు సభ్యులు .కంచికామ కోటి పీఠఆస్థాన విద్వాంసులై వన్నెకెక్కారు .శ్రీ తిరుమల తిరుపతి దేవాలయం ఆస్థాన విద్వాంసులను చేసింది .1990 లో కేంద్ర సంగీత నాటక అకాడెమి పురస్కారం అందజేసి గౌరవించింది .మైసూర్ రాజ దర్బార్ లో ‘’వైణిక శిఖా మణి ‘’బిరుదు ప్రదానం చేశారు .

301  -చిట్టిబాబు ఎందరెందరికో ప్రత్యక్షంగా ,పరోక్షంగా గురువై వీణ నేర్పారు కొలంబియా గ్రామ ఫోన్ రికార్డింగ్ కంపెని వీరి వీణా గానాన్ని ఎల్;పి.రికార్డ్ లుగా ,45 ఆర్. పి.ఏం .రికార్డ్ లుగా తెచ్చంది .వీటికంటే ము౦దేవీరి 75 ఆర్.పి.ఏం రికార్డులున్నాయి .తర్వాతకాలం లో అన్నీ కేసెట్లుగా సి.డి .లుగా వచ్చాయి .తమ శిష్యులైన సుందర్ ,నగేష్ బాబు ,శాంతి రావు ,డా సుమ ,చూడామణి ,శాంత లతో కలిసి ‘’బెల్స్ ఆఫ్ జాయ్ ‘’అనే కేసెట్ ను రికార్డ్ చేశారు .ఇది ‘’శుభోదయం ‘’తో ప్రారంభమై ‘’శుభ రాత్రి ‘’తో పూర్తి అవటం విశేషం .ఇవికాక ‘’సప్త స్వర ,నగు మోము ,రమ్మనవే ,చిన్నం చిరుకులే (రాగమాలిక )తో పాటు స్వయ౦గా ‘’సముద్ర ప్రియ ‘’రాగం లో వాయించిన ‘’కరుణించ వయ్య ‘’అనే కీర్తనలున్నాయి .

302 –ప్రయోగ శీలి అయిన చిట్టిబాబు వీణపై దేనినైనా వాయించవచ్చు ,వీణకు ఏదీ అసాధ్యం కాదు అని రుజువు చేశారు .’’వెడ్డింగ్ బెల్స్ ‘’అనేది పాశ్చాత్య సంగీతాన్ని రుచి చూపించిన కేసెట్ జగత్ ప్రసిద్ధమైంది .చిట్టిబాబుగారి ‘’కొమ్మలో కోయిల ‘’వీణను జన సామాన్యం లో తెచ్చింది .విని పులకించని వారు లేరు .ఆమని కొయిన కలకూజితానికే.మాధుర్యం అద్ది నట్లు ఉంటుంది  .వింటే పులకించి పోవాల్సిందే .

303 –వీణ మీద ‘’వేణు మీటు ‘’ను మీటి వంశీ గానం తో మోహన వంశీ స్వరూపులై భాసిస్తారు .ఇదీ చిట్టిబాబు మరో ప్రత్యేకత .మాంచి స్పురద్రూపి .దైవ భక్తీ అధికం .మాతా పితృ భక్తికి నిలువెత్తు ఆదర్శం చిట్టిబాబు .’’కలై కోవిల్ ‘’అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు .చిట్టిబాబుగారి సంగీత వాద్యం తో వచ్చిన ‘’ఉన్నై పోల్ ఒరువన్ ‘’రష్యన్ అవార్డ్ పొందింది

304 –యుగోస్లేవియా రోమ్ ,జర్మని మలేషియా ,కెనడా మొదలైన విదేశాలలో పర్యటించి అక్కడి రసజ్నులనూ మెప్పించిన వీణ ఘనాపాటీ ,కళా ప్రపూర్ణ చిట్టి బాబు గారు .మద్రాస్ లోని ‘’బాలసుబ్రాహ్మన్య సభ ‘’వైణిక కులాలంకార ‘’బిరుదు నిచ్చి సత్కారించింది .చిట్టిబాబువీణా  వాదన గుణాన్ని’’ కన్నడ సంగీత నృత్య పరిభాషా కోశ ‘’గ్రంధం ‘’మీటుసౌఖ్య ,నాద మాధుర్య ,లయ ప్రచోదనం ‘’అని మహో త్క్రుస్టం గా అభి వర్ణించింది .

305-‘’తెలుగువారి కీర్తి పతాక ,మహా ప్రయోగశీలి ,వీణ వాదనకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన నాద తపస్వి ,గురువు ఈమని నిమరపించిన ప్రియ శిష్యుడు చిట్టిబాబు ‘’అన్నారు ఆచార్య ముది గొండ .

306-9-2-1996 న 60 ఏళ్ళ వయసులోనే చిట్టిబాబు అమరులయ్యారు .బాపు దర్శకత్వం వహించిన’’ సంపూర్ణ రామాయణం ‘’సినిమా కు ‘’రఘువంశ సుధాంబుధి చంద్ర ‘’కీర్తన వీణపై వాయించారు .సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన రాజాజీ జీవితం పై తీసిన తమిళ చిత్రం’’దిక్కట్ర పార్వతి ‘’కి సంగీత దర్శకత్వం వహించారు. దీనికి సంభాషణలు ప్రముఖ మాటల రచయిత’’కన్నదాసన్ ‘’.ఇందులో వాణీ జయరాం పాడిన ‘’ఆగిం మఝై పోఝిందాల్’’పాట విపరీతమైన ప్రజాదరణ పొంది ఆల్ టైం రికార్డ్ అయింది .కన్నడ చిత్రం ‘’శ్రీ రాఘవేంద్ర మహిమే ‘’కు కూడా సంగీత సారధ్యం చేశారు చిట్టిబాబు .ఇది తెలుగులో కి డబ్  అయింది .

307 –చిట్టిబాబు గారి ప్రతిభకు తగ్గ పురస్కారాలు ఎన్నో లభించాయి .కేంద్ర సంగీత నాటక అకాడెమి 1990 లో నాటి భారత రాష్ట్రపతి శ్రీ ఆర్ వెంకట రామన్ గారి చేతులమీదుగా పురస్కారాన్ని అందజేసింది .తమిళనాడు ప్రభుత్వం 19 72 లోనే ‘’కలైమా మణి ‘’పురస్కారం తో గౌరవించింది .ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘’తెలుగు వెలుగు ‘’పురస్కారాన్ని ,తమిళ ప్రభుత్వముఖ్యమంత్రి ఏం జి రామచంద్రన్  ‘’స్టేట్ ఆర్టిస్ట్ అవార్డ్ ‘’ను ,మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ‘’తంత్రీ విలాస్ ‘’బిరుదాన్ని ,ఉప రాష్ట్ర పతి శ్రీ శంకర దయాళ్ శర్మ ‘’స్పిరిట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డ్ ‘’ను ,మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ క్లబ్ ‘’సంగీత కళా నిపుణ ‘’లను అందించి తమను తాము సత్కరించుకొన్నాయి .వీటి కంటే ప్రముఖమైనది మైసూర్ మహారాజు శ్రీ జయ చామరాజ వడియార్ 1967 లో మైసూర్ ఆస్థాన సభలో ప్రదానం చేసిన ‘’వైణిక శిఖా మణి ‘’బిరుదం .అంతేమాత్రమె కాదు అక్కడ చిట్టిబాబు గారు చేసి అత్యద్భుత  వీణా వాదన కచేరిలో ప్రదర్శించిన  అనితర సాధ్యమైన ప్రతిభకు ముగ్ధులైన మైసూర్ మహా రాజా తాము తమ మెడలోనిత్యం ధరించే అతి విలువైన అత్యంత అభిమానమైన  స్వర్ణ ఆభరణాన్ని  స్వయం గా తీసి చిట్టి బాబు గారి క౦ఠానికి. అలంకరించటం గొప్ప చారిత్రాత్మక సంటనం ,చిరస్మరణీయమై నిలిచింది .ఒక వ్యక్తి సామర్ధ్యం గుర్తించటానికి  అంతే సామర్ధ్యం ఉండాలి. మైసూర్ మహా రాజా శ్రీ జయ చామరాజ వడియార్ సాహిత్య ,సంగీతాది కళలన్నిటిలో అందే వేసిన చెయ్యి .అందుకనే వారిని ‘’రాజులలో సంగీత విద్వాంసుడు సంగీత విద్వాంసులలో రాజు ‘’అనే వారు .ఈ అరుదైన సత్కారాన్ని అందు కొన్న చిట్టిబాబు గారు ధన్యులు .

Inline image 1  Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 27 37-వీణా పాణి విశ్వేశ్వరన్ -2(చివరి భాగం )

ఇది విన్నారా కన్నారా !  27

37-వీణా పాణి విశ్వేశ్వరన్ -2(చివరి భాగం )

288—వాగ్గేయ కారుడైన విశ్వేశ్వరన్ వందకు పైగా కృతులు ,తిల్లానాలు ,పదాలు ,వర్ణాలు ,కొన్ని లఘు సంగీత రచనలు చేశారు తెలుగు కన్నడ సంస్కృతాలలో ఈ రచనలున్నాయి .దర్బారు ,నాయకి ,ఆరభి ,దేవ గాంధారి ,రీతి గౌళ ,ఆనంద భైరవి ,వరాళి ,శుభ పంతు వరాళి, భైరవి ,శ్రీ ,మనిరంగు ,మధ్యమావతి వంటి గొప్పరాగాలలోనూ రచన చేశారు కొన్ని హిందుస్తానీ లో  చేశారు .కర్నాటక సంగీతం గొప్పతనాన్ని గురించి వీరభద్రయ్య గారితో ‘’Ours is enormously Evolved –ours best chiselled  one ‘’అన్నారట .దీక్షితులవారి హిందోళ రాగ కృతి ‘’నీరజాక్షి కామాక్షి ‘’హిందూ స్థానీ  బాణీ లో మాల్కోస్ రాగం అనిపించేట్లు పాడేవారట .

289 –వీణా వాదనకు గాత్రానికి భేదం లేకుండా వాయించిన ఆమహా వైణికులు విశ్వేశ్వరన్ .యాజ్న వల్క్య మహర్షి చెప్పిన –

‘’వీణా వాదన తత్వజ్ఞః శ్రుతి జాతి విశారదః –తాలజ్నశ్చ ప్రయాసేన మోక్ష మార్గం స గచ్చతి ‘’అన్న శ్లోకం సంగీతోపాసకులందరికి గీతోపదేశం లాంటిది అన్నారు ముదిగొండవారు .

290-మహోన్నతులని వైణికులు తంత్రులపై వాయిస్తుంటే అది వారి గొంతుకలోని స్వర తంత్రులను అనునాదం లో కదిలిస్తాయి .ఏ ధ్వని వోకల్ కార్డ్ లను కదలించ లేక పోతుందో అది గాత్ర హీనమైనదని ఆచార్య ఉవాచ .బహుశా యే వైణికునికీ లభి౦చనిఅరుదైన అదృష్టం విశ్వేశ్వరన్ గారికి దక్కింది .దీక్షితులవారు ఒక సారి కాశీలో గంగా స్నానం చేస్తుండగా వారికి మంత్రం దీక్ష నిచ్చిన చిదంబర యోగి ‘’నీకు మంత్రం సిద్ధి అయింది ‘’అని చెప్పబోయే తరుణం లో దీక్షితులవారి కర కమలాలలోకి వీణ వచ్చి నిలిచింది .నాద జ్యోతి ముత్తుస్వామి దీక్షితులు వాయించిన వీణపై వాయించే అరుదైన అవకాశం విశ్వేశ్వరన్ గారికి కలిగింది .దీక్షితులవారు నిత్యమూ అర్చించుకొనే శ్రీ చక్ర యంత్రం ,గణపతి విగ్రహం ,సుబ్రహ్మణ్య స్వామి పటాలకు రెండు రోజులు పూజించే అదృష్టమూ కలిగింది .దీక్షితులవారి వీణకు యాళి ఊర్ధ్వ ముఖంగా ఉన్నట్లే విశ్వేశ్వరన్ గారు తమ వీణలకూ అలాగే ఉండేట్లు తయారు చేయి౦చు కొన్నారు .దక్షిణాది శిల్పాలన్నిటిలో వీణ యాళి ఊర్ధ్వ ముఖం గా ఉంటుంది అని ఆచార్య శ్రీ పరిశీలించి చెప్పారు.

291-Never has Lakshana  is in the leading position ,and it is only Lakshya that has always hearled ,only  followed Lakshana’’

‘’Lakshya and lakshana should be inseparable .It is only when this tribe grows that there is a meaningful progress in the art and benefit to the recipients of the experience from music be it in the musicians or the listeners ‘’అన్నది విశ్వేశ్వర సంగీత తీర్ధ సారాంశం .

ఆయన లక్ష్య ,లక్షణ సమన్వయానికి ముఖారి రాగం లో విశ్వేశ్వరన్ గారు కట్టిన గీతం గొప్ప ఉదాహరణ

పల్లవి –‘’లక్ష్య లక్షణ సమన్వయ ముఖ్యత నెంతని తెలప నా తరమా ‘’

అనుపల్లవి –‘’లక్ష్యమే ముందుండి రాజిల్లు సంగీతములో

స్వర మేల,కళానిధిని రామామాత్యుడు వ్రాసినది ఈ

సమన్వయ స్తాపనకే నని వినలేదా ?

స్వర లయా౦ కార  గమక రాగ భావ రసములతో

పరమునకు ,ఇహమునకు ఏక సాధనమని చెప్పిన

వర  నిశ్శంకునికి యశము నిచ్చిన అంతక ప్రముఖారి

విశ్వేశ్వరుని వర ప్రసాదమైన సంగీతములో ‘’  .

292 –విశ్వేశ్వరన్ గారికి దేశ ,విదేశాలలో ఎన్నో గౌరవ పురస్కారాలు లభించాయి .చెన్నై శ్రీ కృష్ణ గాన సభ ‘’సంగీత చూడామణి ‘’బెంగుళూర్ వారు ‘’పలని సుబ్రహ్మణ్య పిళ్లే ‘’పురస్కారాన్ని ,కర్నాటక గాన కళా పరిషత్ ‘గాన కళా భూషణ ‘’బిరుదు తోపాటు ‘’ఆలిండియా మ్యుజీషియన్స్ సిల్వర్ జూబిలీ కాన్ఫ రెన్స్ ‘’కు అధ్యక్షునిగా ఎన్నుకొన్నది .వ్యాస రాజ ధర్మ సంస్థానం పరివ్రాజకాచార్యులు ‘’సంగీత సార్వ భౌమ ‘’ను ,ప్రపంచ సంగీత దినోత్సవం నాడు ఆకాశ వాణి ‘’జాతీయ పురస్కారాన్నిఅందించగా   ,అమెరికాలో కాలిఫోర్నియా ‘’ధియోడోర్ ధామస్ విశ్వేశ్వరన్ గారిపై ఒక  డాక్యు మెంటరిని తీశారు .20 02 లో కర్నాటక ప్రభుత్వం ‘’రాజ్య సంగీత విద్వాన్ ‘’ప్రదానం చేసింది

293 –ఇంగ్లాండ్ ,ఐర్లాండ్ లకు మూడు సార్లు వెళ్ళారు .బి బి సి  వీరి కచేరీ రికార్డ్ చేసింది కేంబ్రిడ్జ్ ,డబ్లిన్ ,బర్మింగ్ హాం బెల్ ఫాస్ట్ మొదలైన రేడియో కేంద్రాలు టి వి కేంద్రాలు వీరి సంగీతాన్ని ప్రసారం చేశాయి .వీరి వీణా వాదన ను సంగీత కంపెని –సంగీత వీణా వైభవ ,గ్రేట్ రాగాస్ ,సోల్ స్టర్రింగ్ రాగాస్ మొదలైన కేసెట్లుగా తెచ్చింది .’’ఏకత లో భిన్నత ‘’సర్వం ఖల్విదం బ్రహ్మ ,వాది రాజు మొత్తం రచనలకు ‘’భ్రమర గీతం ‘’రచన చేసి రికార్డ్ చేశారు

294 –విశ్వేశ్వరన్ గారి భార్య ఉషాదేవి .కూతుళ్ళు విద్యా నటరాజ్ ,వీణా జయంత్ లు .కుమారుడు కార్తీక్ అందరూ వైణికులే .ఆయన చదువు ఏం యే –ఇండాలజీ .1965 లో మైసూర్ విశ్వ విద్యాలయం సంగీత నృత్య కళాశాల స్థాపించి విశ్వేశ్వరన్ ను మ్యూజికాలజిస్ట్ గా నియమించింది .1973 లో వీణ అధ్యాపకులై 78లో వాద్య సంగీతాఆచార్యులుగా పదోన్నతి పొంది ఎందరెందరికో వీణ విద్యనూ నేర్పారు

295 –‘’ధన్యుడనైతి ని సంగీతమును నేర్చి నందువలన ‘’అని కీర్తనలో తన మనో ప్రవ్రుత్తి చాటారు .కన్నడదేశం లో తెలుగు మర్చి పోతున్న తెలుగు కుటుంబీకుడు అయిన విశ్వేశ్వరన్ దేవ గాంధారి రాగం కీర్తన ఆయన ఎంతటి వినీతులో తెలియ జేస్తుంది –

‘’అంతరంగము తెలిసి పాడిన –సంగీతమునకు మాత్రమే  పూర్ణార్ధము

చింతన ,మనన ,సాధన జత గూర్చి –మన కెంతో చక్కని మార్గము జూపిన పెద్దల ‘’.ఒక్కటి చాలు ఆయన అంత రంగ ఆవిష్కారానికి.  సితార్ విద్వాంసుడు పండిట్ శివ కుమార్ శర్మ వద్ద సితార్ అభ్యసించిన విశ్వేశ్వరన్ ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు జి .యెన్ .బాల సుబ్రహ్మణ్య౦ గారికి’’ నెవ్యు’’.   2007 లో 63 వ ఏట వీణా పాణి విశ్వేశ్వరన్ తన తల్లి సంగీత సరస్వతీమాత సంగీత  సామ్రాజ్యం లో ఆస్థాన విద్వాంసుడు గా  చేరటానికి ఇహలోకం వీడారు .

Inline image 1  Inline image 2Inline image 1Inline image 2

g.n bala subramanyam

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 26 37-వీణా పాణి విశ్వేశ్వరన్

ఇది విన్నారా కన్నారా !  26

37-వీణా పాణి విశ్వేశ్వరన్

281-తెలుగు మాతృ భాష అయినా  విశ్వేశ్వరయ్య ఎప్పుడో మైసూర్ రాష్ట్రానికి తరలి వెళ్లి పోయారు .అందుకే ఇంటి పేరు తండ్రి పేరే అయింది .తల్లి వరలక్ష్మి ,తండ్రి రామయ్య గార్లు .కనుక రామయ్య గారి విశ్వేశ్వరయ్య ఆర్ .విశ్వేశ్వరయ్య అయ్యారు .కుటుంబం లో అందరికి సంగీతాభిమానం ఉంది .విశ్వేశ్వరన్ ఎవ్వరి వద్దా వీణ నేర్చుకోలేదు వీనావాదనం ఆయన లోంచి విచిత్రంగా ఆవిష్కారమైంది .అన్న సీతారాం ఆ నాడు ఆస్థాన విద్వాంసుడు .ఒక రోజు అన్నగారు ‘’సామి నిన్నే ‘’అనే శంకరాభరణ రాగం గురు పద్ధతిలో వాయిస్తూ ఉంటే ,అది తమ్ముడు విశ్వేశ్వరన్ కు కర్ణ కఠోరం  అనిపించి ,అలా వాయించ రాదు అని వెక్కిరించారు .’’వాయిస్తుంటే పాడి నట్లు ఉండా’’ అని తమ్ముడు అన్నకు సలహా ఇచ్చాడు ‘.పౌరుషం పొడుచుకొచ్చిన అన్న ‘’మరెట్లా వాయించాలో వాయించి ఏడు ‘’అన్నాడు కోపంగా .ఇది చాలెంజ్ అనిపించి అ౦తకు ముందు ఎన్నడూ వీణను ముట్టుకొని సాధన చేయని  విశ్వేశ్వరన్  వీణ దగ్గరకు వెళ్లి తీసుకొని ‘’దేవుడు పూనిన వాడి ‘’లాగా నిండు గమకం తో పాట పాడినట్లు అని పించేలా శంకరా భరణ  వర్ణాన్ని వాయించాడు .ఇది అటు ‘’అన్నాయి’’ కే కాక ఇటు ‘’తమ్మాయి’’కీ అద్భుతం అని పించింది .దైవానుగ్రహం వలన ఆ రోజు వాయించిన వైనమే ఆయన్ను అగ్రశ్రేణి విద్వాంసుని చేసింది .

282 –బాల్య దశలో జరిగిన పై సంఘటన తర్వాత విశ్వేశ్వరన్ యే రాగాన్ని పట్టుకొంటే ఆ’’ రాగ దేవత’’ ఆయన్ను రెండు ,మూడు గంటలు ఆవహించి ఉండేది .ఇలా చిన్ననాటి నుంచి నాద సుఖాన్ని ,నాదానందాన్ని ఆయన అనుభవించారు .గురువు లేకుండా వీణా సాధన అసాధ్యం .గురుముఖతా నేరిస్తేనే ఎడమ చేతి వ్రేళ్ళతో వాయించే నేర్పు అలవడుతుంది కాని వీటికి అతీతుడైన విశ్వేశ్వరన్ అన్నీ గురువు లేకుండానే దైవ కృప వలన నేర్చుకొన్నారు ఇదొక అద్భుతం

283 –విశ్వేశ్వరన్ వ్రేళ్ళను వీణ మీద సాధించటం తో పాటు తన గొంతునే వీణ మీదకు దింపారు అన్నారు ఆచార్య ముదిగొండ .అందరూ ఇలా చేయగలరా అంటే లేదనే చెప్పాలి .కొందరికే ఇది సాధ్యమయింది .ఆయన వ్రేళ్ళను వినియోగించేవిధానం పరమ నూతనం అని ,దాన్ని చూసి అనుభవించాల్సిందే తప్ప రాతలో వర్ణించి చెప్పలేమని ఆచార్య వీరభద్రయ్య గారి అభిప్రాయం .అందుకే వీణపై ‘’విశ్వేశ్వరన్ రీతి ‘’ఏర్పడింది అన్నారు. విద్యలతల్లి సరస్వతీ మాత మాత్రమె ఆయన గురువు .వేరే గురువెవ్వరూ లేరాయనకు. ఒక నాడు నాదానందం లో లయించి ఉండగా నాద దేవత వాణీ దేవి దర్శన మిచ్చి ,రెండు రోజులు వీరికి విద్యా బోధన చేసింది .వాద్యం లో లీనమయిన వానికి అమ్మ అనుగ్రహం తప్పక ఉంటుంది .అందుకే వీనావాదనం మోక్ష విద్యకు మార్గం అయింది అన్నారు ఆచార్య శ్రీ .గాత్ర ధర్మం లో లేని ఒక్క అంశమూ వారి వీణా వాదనలో వినిపించక పోవటం ప్రత్యేకత .నిష్ణాత్రుత్వం తో విశ్వేశ్వరన్ ‘’స్వయంభు ‘’అయ్యారన్నారు ముదిగొండ వారు .మానుష గురువు లేకుండా ఇంతటి పూర్ణ ప్రజ్న సాధించినవారెవ్వరూ లేరు అని వీరభద్రయ్య గారు వాక్రుచ్చిన మాట యదార్ధం .వీణ చేత బట్టిన ఆరు నెలలకే మైసూరు చుట్టుప్రక్కల వైణికుడు గా విశ్వేశ్వరన్ పరిచయమయ్యారు. వైదుష్య సంపాదనలో ఆయన ఇంకా శిఖరారోహణం చేస్తూనే ఉన్నారు .

284 –నూనూగు మీసాల నూత్న యవ్వనం లో 16 వ ఏట మైసూర్ కు 18 మైళ్ళ దూరం లోని టి .నరసీపూర్ లో రామోత్సవాలలో ఆహ్వానం పై  1947 .ఏప్రిల్ లో 3 ½గంటలు వీణ కచేరీ చేసి అందరినీ తల ఊపేట్లు చేశారు .ఈ తొలి కచేరీకి మృదంగం వాయించిన వారు  మహా మార్దంగికులైన విద్వాన్ శ్రీ చౌడయ్య.వయోలిన్ చౌడయ్యగారికి ,ఈ చౌడయ్య గారు చాలా కచేరీలలో మృదంగం వాయించారు

285 –విశ్వేశ్వరన్ ఎంతటి వైణికులు అంటే వీణ మాస్ట్రో బాలచందర్ నిండు గుండెలతో మెచ్చుకొన్న వైణికులు .విశ్వేశ్వరన్ కంటే వీణ బాలచందర్ నాలుగు ఏళ్ళు మాత్రమే పెద్దవారు .మీటులో ఇద్దరికీ చాలా తేడా ఉంది అన్నారు ఆచార్య శ్రీ .సంగీత సామ్రాజ్యం లో బాలచందర్ మకుటం  లేని చక్ర వర్తి .ఆయన పంధా ఎవరూ అనుసరి౦చ లేరు .ఒక సారి బాల చందర్ ఇంటి పూజా గదిలో విశ్వేశ్వరన్ వీణ కచేరీ ఏర్పాటు చేశారు .ప్రసిద్ధ సంగీత విద్వా౦ సులందర్నీ ఆహ్వాని౦చారు .విశ్వేశ్వరన్ వీణ వాయిస్తున్నత సేపు బాల చందర్ ‘’సెహ బాష్ ,’’భేష్ ‘’అని చాలా సార్లు అని పొంగిపోయి కచేరీ అనంతరం కాశ్మీర్ జరీ శాలువా తో సన్మానించి ,ప్రశంసించారు బాలచందర్ .

286 –ఒక సారి ‘’ఇడయం ‘పత్రిక బాల చందర్ ను ఇంటర్వ్యు చేస్తూ ‘’మిమ్మల్ని మెప్పించిన వైణికులు ఎవరు ?’’’’అని ప్రశ్నిస్తే ‘’వాగ్గేయకారుడు ,అత్యంత ప్రతిభావంతుడు ,మైసూర్ విశ్వేశ్వరన్ నా హృదయాన్ని దోచుకొన్న వాడు ‘’అని చెప్పారు ,1988 లో మైసూర్ లో బాలచందర్ ‘’విశ్వేశ్వరన్ నాకన్నా గొప్ప సంగీత విద్వాంసుడు .నేను కేవలం వైణికుడినిమాత్రమే .ఆయన వైణికుడేకాక వాగ్గేయ కారుడు కూడా ‘’అన్నారు హిమాలయోత్తు౦గ  సదృశ పద్మభూషణ్ డా బాలచందర్ .1990 లో మద్రాస్ లో ‘’సరస్వతీ వాగ్గేయ ట్రస్ట్ ‘’విశ్వేశ్వరన్ స్వీయ రచనల కచేరీ ఏర్పాటు చేయగా బాలచందర్ వచ్చి ఆశీర్వదించి ‘’నా కన్నా కొన్ని సంవత్సరాలు చిన్నవాడే అయిన విశ్వేశ్వరన్ బుద్ధీ ,పాండిత్యం ,సంగీతసార అవగాహన లో ,మేధావిలసనం లో ఎంతో పెద్దవాడు గొప్పవాడు విశ్వేశ్వరన్ లాంటి వారి వలననే మనం సంగీతం లో అసలైన శాస్త్రీయత (క్లాసిజం )ను అవగాహన చేసుకో గలుగుతున్నాం .ఆయన సంగీతాన్ని ,వారు చెప్పే మాటల్ని ,వారి రచనల్లో నిక్షిప్త మైన విలువలను శ్రద్ధగా వినటం వలన మనకు భగవంతుని చేరే మార్గం చాలా సులభతరం అవుతుంది ‘’అని నిండుమనసుతో మెచ్చుకొన్నారు

287 –వీణ పై మొదటి కచేరీచేసిన కొద్ది రోజులకే మైసూర్ రేడియో వారు విశ్వేశ్వరన్ గారిని 1949 లో  వీణ కచేరీకి ఆహ్వానించారు .అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 60  సంవత్సరాలు ఆకాశ  వాణి కేంద్రాలలో వాయిస్తూనే ఉన్నారు .మద్రాస్ సంగీత అకాడెమి వీరి కచేరీ ఏర్పాటు చేసి గౌరవించింది .వీరికి ప్రక్క వాద్యాలు వాయించిన మహా మార్దంగికులలో పాల్ఘాట్ రఘు ,ఉమయాళ పురం శివరామన్ ,గురువాయూర్ దొరై ,ఉపేంద్రన్ ,ఎల్లా వెంకటేశ్వర రావు మొదలైన వారున్నారు.

 

Inline image 1Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-16- కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవాలు -4 మరిన్ని అలంపురం విశేషాలు (చివరిభాగం )

నా కృష్ణా పుష్కర అనుభవాలు -4

మరిన్ని అలంపురం విశేషాలు (చివరిభాగం )

పాప వినాశిని తీర్ధం –

అల౦పురానికి దక్షిణాన అరకిలో మీటర్ దూరం లో ‘’పాప నాశినీ తీర్ధం ‘’ఉంది .అష్టాదశ తీర్ధాలలో తీర్ధ రాజం గా ప్రసిద్ధి .అలంపురం లో బ్రహ్మేశ్వరాలయంసమూహం  ఉన్నట్లే ఇక్కడా ఒక దేవాలయ సముదాయం ఉంది .ప్రధాన ఆలయం చుట్టూ చిన్న చిన్న గుడులు కట్టారు .ఇవి  ద్రావిడ, వేసర పద్ధతులలోఉంటాయి .ప్రధానాలయం లో ‘’పాపనాశేశ్వరుడు  ‘’ఉంటాడు .సూర్య నారాయణ స్వామి ఆలయానికి ,ఇక్కడి ఆలయ మండపానికి స్తంభాలు ,పై కప్పులకు ,వాటిపై ఉన్న మూర్తులకు చాలా పోలికలుంటాయి .ద్వారబంధం స్తంభాలు ,పైకప్పు బండలు ఎర్ర ఇసుక రాతి తో చేయబడ్డాయి .ఒక రంగ మండపం మీద’’ త్రైలోక్య మల్లుని’’ కాలపు శాసనం ఉంది .మంటపం లో దక్షిణాన గణపతి ,సప్త మాతృకలు ,ఉత్తరాన అష్ట భుజ మహిషాసుర మర్దిని విగ్రహాలున్నాయి .ఆలయానికి ఉత్తర ,దక్షిణాలలోచక్కని గుళ్ళు ,మంటపాలు నిర్మించారు స్తంభాలపై రామాయణ గాధ,క్షీర సాగర మధనం శిల్పాలు పరమ రామణీయకంగా దర్శన మిస్తాయి.ఈ గుడులన్నీ నవ బ్రహ్మాలయాల తర్వాత కాలం లో నిర్మింప బడ్డాయి  .చాళుక్య రాజులకాలం నాటి వాస్తు ,శిల్ప పరిణామాల అధ్యయనానికి ఈ రెండు దేవాలయ సమూహాలను తప్పక చూసి తీరాల్సిందే .శ్రీ శైలం ప్రాజెక్ట్ ప్రభావం వలన ఆలంపూర్ కు దగ్గరలోనే ఈ తీర్ధం పునర్నిర్మాణం జరిగింది అన్నారు గడియారం రామ కృష్ణ శర్మ గారు .

Inline image 16

నరసింహాలయం

అలంపురం కోట లోపలే నరసింహాలయం ,సూర్య నారాయణ స్వామి ఆలయాలున్నాయి ఇవి 9 లేక 10 వ శతాబ్దం లో నిర్మించ బడి ఉండచ్చు .నరసింహాలయం శిధిలం కాగా త్రిభువన మల్లుని కాలం లో జీర్ణోద్ధరణ జరిగిందని శాసనం తెలియ జేస్తోంది .ఆ కాలం లో నరసింహ స్వామిని ‘’మాధవ దేవర ‘’అని పిలిచే వారు .గుడి ప్రవేశ ద్వారం ప్రక్కనే ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ,గుడిలో రంగ నాయకులు ,ఆళ్వారులు ,విజయనగర రాజులకాలం లో ప్రతిష్టించారు .లోపల ప్రదక్షిణం చేసుకొనే దారి లేదు .వరుసగా మూడు గర్భ గుడులు ఉండటం విశేషం .మొదటి దానిలో ‘’మాధవీ శక్తి ‘’,మధ్య దానిలో ‘’యోగానంద నరసింహ స్వామి ‘’,మూడవ దానిలో లక్ష్మీ విగ్రహానికి బదులు ‘’చాకమ్మ ‘’విగ్రహాన్ని ప్రతిష్టించారు ఇవన్నీ దివ్య మంగళ విగ్రహాలే .ఇలాంటి దేవాలయాన్ని  ‘’త్రిక దేవాలయం ‘’అంటారని శర్మ గారన్నారు .ఉత్సవ మూర్తులు పంచలోహ దాక్షిణాత్య సుకుమార శిల్ప కళా నైపుణ్యం తో ఉంటాయి గర్భ గుడి మీద విమానం ,ప్రవేశ ద్వారంపై గోపురం ఒకే కాలం లో నిర్మించబడి ఉంటాయని గడియారం వారి ఊహ .

Inline image 12Inline image 13

Inline image 14Inline image 15

సూర్య నారాయణ స్వామి దేవాలయం

నరసి౦హాలయానికి వెళ్ళే దారిలోనే సూర్య నారాయణ స్వామి గుడి ఉంది ఇదీ సుమారుగా తొమ్మిది ,పదీ శతాబ్దాలలో కట్టినదే. ఆలయానికి ముఖ మండపం లేక పోవటం ఒక ప్రత్యేకత .మూడు వైపులా మూసి ,ఒక వైపు మాత్రమే తెరచి ఉన్న విశాల మండపం ఉంది .ప్రదక్షిణ మార్గం లేదు .మధ్యలో ప్రధాన మూర్తి సూర్య నారాయణ స్వామి కొలువై ఉన్నాడు .ఇరువైపులా శివలింగాలు ఉండటం మరో విశేషం .స్తంభాలపై పురాణ గాధలు చెక్కబడ్డాయి పై కప్పు బండలకు దిక్పాలకులు ,గౌరీశంకర కల్యాణం ,గౌతమ బుద్ధునితో కూడిన నవావ తారాలు శిల్పించబడ్డాయి .ఎర్ర ఇసుక  రాతి కట్టడమే ఇది కూడా .కనుక చాలా ప్రాచీనాలయమన్నారు శర్మాజీ .మూడు గర్భాలయాలపై సోపాన పద్ధతిలో మూడు కదంబ శైలి విమానాలున్నాయి .ప్రధాన దైవం సూర్య నారాయణ మూర్తి విగ్రహం ‘’పాద రక్షల’’తో ఉత్తర దేశ ఆచారాన్ని బట్టి కన్పించటం మరొక ప్రత్యేకత .గణపతి సప్త మాతృకలు ,నంది ,పరశురాముడు నల్లరాతి తో సర్వాంగ సుందరంగా శిల్పీకరించ బడ్డారు .మంటప స్తంభం మీద ‘’కాల చర్య భుజ మల్లుని ‘’కాలం లో కర్నాటక ప్రసిద్ధులైన వణిక్ ప్రముఖులు వేయించిన’’ దాన వాహనం ‘’ఉంది అని అలంపురం పై సాధికారం ఉన్న గడియారం వారు చెప్పారు

Inline image 9Inline image 10Inline image 11

కూడలి సంగ మేశ్వరాలయం

శ్రీ శైలం ప్రాజెక్ట్ వలన ముంపుకు గురైన ఈ ప్రాంతం లో’’ కూడలి సంగమేశ్వరాలయాన్ని ‘’అలంపురం కు తరలించి ఊరి ముందు విశాల స్థలం లో యదా తధంగా పునర్నిర్మించారు .ఈ దేవాలయ గోడలపై ఉన్న మూర్తులు విలక్షణ శిల్ప విన్యాసాన్ని చాతుతున్నాయని శర్మ గారువాచ .నరసింహ సూర్యనారాయణ ,పాప వినాశన ,సంగమేశ్వరాలయాలను  సమయం లేక మేము చూడలేక పోయాం .

అలంపురం మూర్తులు

అలంపురం శిల్పాలలో మూర్తి లక్షణం ,ప్రతిమా లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి .శైవం మూలాధారంగా ఉన్న శిల్పాలివి .హైందవ పురాణ విజ్ఞానం ,తత్వ విచార పరిచయం తెలిసిన వాళ్ళకే వీటిలోని లోతుపాతులు తెలుస్తాయని శర్మగారంటారు దీనికి ఉదాహరణ ఇక్కడి ‘’అంధకాసుర సంహార మూర్తి ‘’,మరియు ‘’ధ్యాన ముద్రా శివ మూర్తి ‘’లను పేర్కొన వచ్చు అన్నారు గడియారం వారు .అలాగే ‘’త్రిముఖ మహేశ మూర్తి ‘’ప్రత్యేకమైనదని ,ఇలాంటిది ఎలిఫెంటా గుహాలయం లో మాత్రమే ఉందని ఈ మూర్తి భగవంతుని సృష్టి స్థితి లయాలను తెలియ జేస్తుందని విశ్లేషించి చెప్పారు నందులలో తల వాకిలి కి ఎదురుగా ఉన్నది అపూర్వమైనదని ,అది గౌరీ శంకరులను మోస్తున్నట్లు ఒకే రాతిలో చెక్కబడిందని ఇలాంటి మూర్తి ప్రపంచం లో ఇంకెక్కడా లేదని ,దీన్ని ‘’వృషభారూఢ మూర్తి ‘’అంటారని తమకున్న అపూర్వ శిల్పాను భవం తో శర్మగారు వాక్రుచ్చారు .

Inline image 6Inline image 7Inline image 8

పురావస్తు సంగ్రహాలయం

మ్యూజియం అనే పురావస్తు సంగ్రహాలయం అలంపురం లో కుమార బ్రహ్మాలయానికి వెనక ,ఒకప్పటి సిద్ధుల మఠం లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది .ఇందులో అలంపురం పరిసరాలలో పడి ఉన్న దేవతా మూర్తులు ,శిలాశాసనాలు తెచ్చి చక్కని పీఠాలపై అమర్చారు .ఇవన్నీ విలక్షణ మూర్తులే .హైందవ విగ్రహ మూర్తి లక్షణాలు తెలుసుకోవాలంటే ఈ సంగ్రహాలయం ‘’అపూర్వ విజ్ఞాన దాయిని ‘’అన్నారు శర్మగారు .

కనుక దైవ భక్తీ ,విజ్ఞాన పరిశీలనా ,చారిత్రిక పరిశోధనా ,వాస్తు, శిల్ప జిజ్ఞాస ఉన్నవారందరూ సందర్శించాల్సిన అపూర్వ క్షేత్రం అలంపురం .ఆలం అనే సంస్కృత పదానికి  ’’ఇక చాలు ‘అని అర్ధం .ఎంత చూసినా ‘’చాలు అని పించని ‘’జిజ్ఞాసా ప్రదేశం అలంపురం .జోగులాంబ దర్శనం ముక్తి దాయకం .ఈ విషయాలన్నీ తెలుసుకొని ఈ క్షేత్రాన్ని దర్శించండి .అపూర్వ అనుభవం పొందండి .

Inline image 3Inline image 4Inline image 5

శ్రీగడియారం రామ కృష్ణ శర్మ గారు

అలంపురం దేవాలయాలు శ్రీ శైలం ప్రాజెక్ట్ లో జల సమాధి కాకుండా పరి రక్షించినవారు ,ఇక్కడి శిల్ప సంపద ,చరిత్ర ,పురా తత్వ విషయాలను పరిశోధించి ప్రపంచానికి తెలియ జెప్పినవారు ,ఆరు వందల ఏళ్ళ తర్వాత ,జోగులాంబా దేవి నూతన ఆలయాన్ని పూర్వం ఉన్న చోటనె నిర్మించ టానికి మూల కారకులు ,సంస్కృతాంధ్ర కవి ,పండితులు వక్త ,సంస్కర్త ,స్వాతంత్ర్య సమర యోధులు ,చరిత్ర శాసన పరిశోధకులు జీవితం లో  సగం కాలం ఆలంపూరు పరిశోధనలకే వెచ్చించిన వారు , కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత స్వర్గీయ శ్రీ గడియారం రామ కృష్ణ శర్మ గారు .శర్మగారు రచించి 15 వ ముద్రణ పొందిన ‘’దక్షిణ కాశి –ఆలంపూరు క్షేత్రం ‘’పుస్తకమే నేను తెలియ జేసిన విషయాలన్నిటికి ఆధారం అని మనవి చేస్తూ ఆ మహాను భావునికి కై మోడ్పు ఘటిస్తున్నాను .

శర్మగారు 1919 మార్చి 6 న అనంతపురం జన్మించి అలపురం కు వచ్చి స్థిరపడి లో 25-7- 2006 న ల 87 వ ఏట మరణించారు .’’శత పత్రం ‘’అనే వారి ఆత్మకధకు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్నిశర్మగారి మరణానంతరం  అందించింది .మాధవ విద్యా రణ్య చరిత్ర ,హిందూ ధర్మం ,పల్లెపాడులోని విజయాదిత్య తామ్రశాసనం ,కేయూర బాహు చరిత్ర ,విజ్ఞాన వల్లరి ,మన వాస్తు సంపద అనే గ్రంధాలు రాశారు

Inline image 1Inline image 2

పీచే మూడ్

‘’యోగాంబ’’అనే జోగులాంబ శక్తి పీఠాన్ని 15-8-16 సోమవారం సందర్శించిన మేము మధ్యాహ్నం 3 -30 గంటలకు అందరం స్ప్రైట్ తాగి ,మళ్ళీ కారులో హైదరాబాద్ కు బయల్దేరాం .పిల్లలు ‘’ఆకలో అని గోల’’ .దారిలో కేసి ఆర్ గారి ఉచిత టిఫిన్ కాఫీ సెంటర్లు కాని ఉచిత భోజనాలు కాని ఎక్కడా జాడ లేదు .దాబాలపై’’ దాడి’’ చేసి పుష్కర యాత్రికులు ,’’డబ్బు చిలుం’’ వదిలించుకొని అక్కడ ఉన్న అన్నం లాంటి దేదో కతికి, కడుపాకలి తీర్చుకొంటూ కనిపించారు .సరైన హోటల్ ఎక్కడా దొరకలేదు .మధ్యలో ‘’హేబ్బెర్ ‘’అనే ఊరు వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడు కనిపించింది .వెంటనే నాకు ‘’హెబ్బార్ నాగేశ్వర రావు ‘’అనే కవి కధకుడు జ్ఞాపకం వచ్చాడు. బహుశా ఇక్కడి వాడేమో అనుకొన్నాను .దారిలో అంతా’’ బిగ్ పిరమిడ్’’ హోటల్ ఫ్లేక్సీలు చూసి ఆశగా జడ్చెర్ల దాటాక’’ బిగ్ పిరమిడ్ ‘’అనే పెద్ద హోటల్ పై మేమూ దాడి చేద్దామని వెళ్లి కూర్చున్నాం .కాని అక్కడ నీళ్ళ సరఫరా లేదట .ఒక గంట అయ్యాక వండి వడ్డిస్తామన్నారు టిఫిన్లు .నెత్తిన ముసుగేసుకొని ఇంకొంచెం దూరం పోయి అక్కడ విఘ్నేశ్ విరాట్ హోటల్ లో దూరాం .నేను అట్టు ఆర్డర్ ఇచ్చా మిగినవాళ్ళు అట్టు ,చపాతీ ఆర్డర్ ఇచ్చారు .నాకేమీ సహించలేదు. సగం తిని వదిలేశా,ఐస్ క్రీం కొని కడుపు చల్లార్చుకోన్నాం పిల్లలు నేనూ .కడుపు లో ఏదో పడిందనే సంతృప్తి మాత్రమే మిగిలింది .బాచుపల్లి కి రాత్రి 9 గంటలకు చేరుకున్నాం .భోజనం మా అబ్బాయిఇంటి పక్కనే ఉన్న వాడి  బావ మరిది ప్రసాద్ ఇంట్లో .తిని ఇంటికొచ్చి హాయిగా నిద్ర పోయా .ఒళ్ళంతా పులిసింది కనుక నిద్ర బాగా పట్టింది .

అనుకోని కృష్ణా పుష్కర ప్రయాణమే అయినా ఆనందం సంతృప్తి ఆధ్యాత్మిక చారిత్రిక వైభోగాలను అందించింది ఈ పుష్కరం .అలంపురం లో సాంస్కృతిక కార్య క్రమాలూ నిర్వహిస్తున్నారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment