ఉయ్యూరు లో మా ఇంట్లో 15-1-16 శుక్రవారం సంక్రాంతి సందడి 

This gallery contains 16 photos.

More Galleries | Tagged | Leave a comment

సంక్రాన్తివైభవం ,కొన్ని కవితలు

Inline image 3Inline image 1Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

Gabbita Krishna Mohan Saradaga Mari Konthasepu Book Releases – Sri. Ravi Kondala Rao Speech

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రోడ్డుపై సూరీడు అద్దేపల్లి అస్తమయం

Inline image 1

 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

14-1-16గురువారం భోగి పండుగ సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ధనుర్మాస సందర్భంగా ఉదయం 5-30గం లకు వివిధ కాయ గూరలతో స్వామి వారలకు ”శాకబరి పూజ ”చిత్రాలు

14-1-16గురువారం భోగి పండుగ సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ధనుర్మాస సందర్భంగా ఉదయం 5-30గం లకు వివిధ కాయ గూరలతో స్వామి వారలకు ”శాకబరి పూజ ”చిత్రాలు

https://plus.google.com/u/0/photos/115752370674452071762/albums/6239489620468039617

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంక్రాంతి శుభా కాంక్షలు

Inline image 4 అందరికి 14-1-16,15-1-16 భోగి ,సంక్రాంతి శుభా కాంక్షలు –దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఏం ఎస్ సుబ్బులక్ష్మి

Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వామి వివేకానంద్ 152వజయంతి సందర్భంగా ఉయ్యూరు పరిన్కాయల జూనియర్ కాలేజిలో నిర్వహించిన 12జాతీయ యువజనోత్సవం అనే యువ సంకల్ప దివస్ ఫోటోలు 

స్వామి వివేకానంద్ 152వజయంతి సందర్భంగా ఉయ్యూరు పరిన్కాయల జూనియర్ కాలేజిలో నిర్వహించిన 12జాతీయ యువజనోత్సవం అనే యువ సంకల్ప దివస్ ఫోటోలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

”కేమోటాలాజి పిత కొలచల సేతారామయ్య ”గ్రంధావిష్కరణ సభకు ఆహ్వానం -25-1-16 ఉదయం 10 గం

kssinaugaretion1 001 kssinau2 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మనసుకవి ఆత్రేయ -మూసి డిసెంబర్

atreya3 001 atreya4 001 atreya5 001 atreya1 001 atreya2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చాట్ల శ్రీరాముల ప్రజ్ఞ -రచన -జనవరి

maro2 001 maro1 001 chatla 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి కీ.శే.శ్రీ యలమంచిలి సీతారామయ్య కీ శే .శ్రీమతి శేషుమాంబ గార్లకు అంకితమిస్తున్న‘’కెమోటాలజిపిత కొలచలసీతారామయ్య –ఉయ్యూరు నుండి ఓల్గా దాకా’’ గ్రంధా విష్కరణ సభ ‘సరసభారతి ,ఎ.జి.అండ్ ఎస్ .జి .సిద్ధార్ధ డిగ్రీకళాశాల ,ఉయ్యూరు –కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘’కెమోటాలజిపిత కొలచల సీతారామయ్య ‘’గ్రంధా విష్కరణ సభకు ఆహ్వానం.. కార్య క్రమం వేదిక –ఎ.జి.అండ్ యెస్.జి .డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు సెమినార్ హాల్ . తేది ,సమయం –25-1-2016 సోమవారం ఉదయం 10గంటలకు సభాధ్యక్షులు –శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ముఖ్య అతిధి ,మరియు గ్రంధ ప్రాయోజకులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు విశిస్ట అతిధి మరియు గ్రంధావిష్కర్త –శ్రీ జి.వల్లీశ్వర్ ,’’భారత్ టు డే’’ ప్రధాన సంపాదకులు ఆత్మీయ అతిధులు – శ్రీ తాతినేని శ్రీహరి రావు ,కన్వీనర్ ,ఎ.జి అండ్ ఎస్ జి .సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు శ్రీ సూరి శ్రీరామ మూర్తి ,శ్రీమతి రమా త్రిపురసుందరి ద౦పతులు ,హ్యాం రేడియో నిర్వాహకులు డా.శ్రీ .జి.వి .పూర్ణ చంద్,ప్రధాన కార్య దర్శి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం శ్రీ చలపాక ప్రకాష్ ,ప్రధాన కార్య దర్శి ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ,మరియు రమ్య భారతి సంపాదకులు శ్రీ కొడాలి సత్యనారాయణ ,ప్రిన్సిపాల్ ,ఏ.జి అండ్ ఎస్.జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు శ్రీ జి .కృష్ణ మోహన్ ,రచయిత శ్రీ సూరి ఆంగీరస శర్మ ,సీతారామయ్య గారి బంధువులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు ,సరసభారతి శ్రీ టాం జొస్,ప్రసిద్ధ అంతర్జాతీయ హ్యాం సేవాకార్య కర్త గ్రంధ సమీక్ష — శ్రీ జోశ్యుల నాగేశ్వర రావు ,హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ,కెమిస్ట్రీ కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివలక్ష్మి ,కార్య దర్శి ,సరస భారతి రిపబ్లిక్ డే శుభా కాంక్షలతో ఎ.జి.అండ్ యెస్.జి.సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు సీతారామయ్య గారి పరిచయం – ”పుల్లేరు కా లువ ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి1918లో కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కస్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దానివలన ఏమీరాబడి లేకుండానే అతని దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ హీనంగా భావించ కుండా చేస్తూ శ్రద్ధగా చదివి కెమిస్ట్రిలో మాస్టర్ డిగ్రీపొంది ,అ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి అభి వృద్ధి చెందుతున్న రష్యా దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశం తో రష్యా చేరి,ఓల్గా తీరం లోని మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు, పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమోటాలజి ,””ఫాదర్ ఆఫ్ ట్రైబో కేమిస్ట్రి(ట్రైబాలజి ) ”బిరుదులు పొంది, సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42రోజులు మాత్రమే ఉండి, జీవితాంతం రష్యాలో ఉన్నా ,మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని గడిపిన ఉయ్యూరుకు చెందిన సాహసి చరిత్రదృష్టిలో పెద్దగా పడని ”అజ్ఞాత మార్గ దర్శి” ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త కేమోటాలాజి పిత శ్రీ కొలచల సీతారామయ్య గారి జీవిత ప్రస్థానమే ”పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’.” .

సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి కీ.శే.శ్రీ యలమంచిలి సీతారామయ్య కీ శే .శ్రీమతి శేషుమాంబ గార్లకు అంకితమిస్తున్న‘’కెమోటాలజిపిత కొలచలసీతారామయ్య –ఉయ్యూరు నుండి ఓల్గా దాకా’’  గ్రంధా విష్కరణ సభ

‘సరసభారతి ,ఎ.జి.అండ్ ఎస్ .జి .సిద్ధార్ధ డిగ్రీకళాశాల ,ఉయ్యూరు –కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్  సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘’కెమోటాలజిపిత కొలచల సీతారామయ్య ‘’గ్రంధా విష్కరణ సభకు ఆహ్వానం..

కార్య క్రమం

వేదిక –ఎ.జి.అండ్ యెస్.జి .డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు సెమినార్ హాల్ .

తేది ,సమయం –25-1-2016 సోమవారం ఉదయం 10గంటలకు

సభాధ్యక్షులు –శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం

ముఖ్య అతిధి ,మరియు గ్రంధ ప్రాయోజకులు

శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు

విశిస్ట అతిధి మరియు గ్రంధావిష్కర్త  –శ్రీ జి.వల్లీశ్వర్ ,’’భారత్ టు డే’’ ప్రధాన సంపాదకులు

ఆత్మీయ అతిధులు – శ్రీ తాతినేని శ్రీహరి రావు ,కన్వీనర్ ,ఎ.జి అండ్ ఎస్ జి .సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు

శ్రీ సూరి శ్రీరామ మూర్తి ,శ్రీమతి రమా త్రిపురసుందరి ద౦పతులు ,హ్యాం రేడియో నిర్వాహకులు

డా.శ్రీ .జి.వి .పూర్ణ చంద్,ప్రధాన కార్య దర్శి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం

శ్రీ చలపాక ప్రకాష్ ,ప్రధాన కార్య దర్శి ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ,మరియు                                                                                                                                      రమ్య భారతి సంపాదకులు

శ్రీ కొడాలి సత్యనారాయణ ,ప్రిన్సిపాల్ ,ఏ.జి అండ్ ఎస్.జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు

శ్రీ జి .కృష్ణ మోహన్ ,రచయిత

శ్రీ సూరి ఆంగీరస శర్మ ,సీతారామయ్య గారి బంధువులు

శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు ,సరసభారతి

శ్రీ టాం జొస్,ప్రసిద్ధ అంతర్జాతీయ  హ్యాం సేవాకార్య కర్త

గ్రంధ సమీక్ష —        శ్రీ జోశ్యుల నాగేశ్వర రావు ,హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ,కెమిస్ట్రీ

కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివలక్ష్మి ,కార్య దర్శి ,సరస భారతి

రిపబ్లిక్ డే శుభా కాంక్షలతో

ఎ.జి.అండ్ యెస్.జి.సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు

సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు

సీతారామయ్య గారి పరిచయం – ”పుల్లేరు కా లువ  ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి1918లో  కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కస్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దానివలన  ఏమీరాబడి లేకుండానే  అతని  దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ  హీనంగా భావించ కుండా చేస్తూ శ్రద్ధగా  చదివి   కెమిస్ట్రిలో  మాస్టర్  డిగ్రీపొంది ,అ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి అభి వృద్ధి చెందుతున్న రష్యా  దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశం తో రష్యా చేరి,ఓల్గా తీరం లోని  మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు, పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమోటాలజి ,””ఫాదర్ ఆఫ్ ట్రైబో  కేమిస్ట్రి(ట్రైబాలజి ) ”బిరుదులు  పొంది, సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42రోజులు మాత్రమే ఉండి,   జీవితాంతం రష్యాలో ఉన్నా ,మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని గడిపిన ఉయ్యూరుకు చెందిన సాహసి చరిత్రదృష్టిలో  పెద్దగా పడని ”అజ్ఞాత మార్గ దర్శి”    ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన  ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త కేమోటాలాజి పిత  శ్రీ కొలచల సీతారామయ్య గారి జీవిత ప్రస్థానమే  ”పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’.”  .

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి

లక్ష్మీదేవి ,అనంతరామ శాస్త్రిల పుత్రుడైన ఈ నరసింహ కవి గత శతాబ్దపు గణిత శాస్త్ర మేధావి .1860లో గోదావరి జిల్లా ఏనుగు మహల్ లో జన్మించాడు .విజయ నగర ప్రభువు ఆనంద గజపతి ఆస్థానం లోను , కశింకోట రాజు మారెళ్ళ వెంకటాచలం సంస్థానం లోనూ  ఉన్నాడు .తర్వాత సన్యాసం స్వీకరించాడు .మహాగ్ని చిత్ ,సర్వ ప్రస్ట,ఆప్తోర్యామ మొదలైన యజ్న యాగాలు చేశాడు .ఆగమ ,మంత్రం శాస్త్రాలలో అఖండుడు .మహా శ్రీ విద్యోపాసకుడు ఆయన పూర్వీకులూ గట్టిఉపాసకులూ కవులే .తన వంశ చరిత్రను ఇలా తెలియ జేశాడు –

‘’పరివ శక్తిర్మహతీ హ రాణి ,సా సుప్రసన్నా హరి తన్వి యోస్మిన్ –రాజ్నీతితస్మాత్ ప్రదితోన్వ యోహం నృసింహ నామా కవి రతన రాజే ‘’ఇదంతా’’ చిత్సూర్య లోకం ‘’లో రాశాడు .కాల మానోపత్తి ,తిది మంజరి లలో కవి తన సర్వ ప్రతిభా ప్రదర్శన చేశాడు .చిత్సూర్య లోక అనే అన్యార్ధ నాటకాన్ని అయిదు అన్కాలలో కశింకోట రాజు కోరికపై   రచించాడు .ఈయనకే తన సిద్ధాంత కౌస్తుభం అంకితమిచ్చాడు చిత్సూర్య లోక నాటకం సూర్య చంద్రుల మధ్య సంఘర్షణ .చివరికి  సూర్యునిదే విజయం .దీనికి కారణం చంద్రుని భార్య నిశి .సూర్యుని  భార్యదివాదేవి కి ఈమెకూ స్పర్ధ వాళ్ళ జరిగిన కద.నిషి తన భర్త చంద్రుడిని సూర్యుని అవమానించమని ప్రోద్బలం చేస్తుంది .నిషి చెలికత్తె భారతి దీన్ని అమలు చేస్తుంది .నాందీ ప్రస్తావన శ్లోకం –

‘’అజ్ఞా రోప్య నిజేతర క్రియమపి జ్యొతిః పరం నిష్క్రియం –వేద్యం జ్ఞాని బిరేవ సాక్షిణామిండా దారం  విభుం ప్రేరకం ‘’’సూర్యుని చెంత ఉండే పింగళ అనే విదూషకుడు ,సూర్యునితో బాటు నడవ లేక కున్తివాదినయ్యానని బొంకే సన్నివేశం లో శ్లోకం

‘’భగ్నేరుసుర తీస్తే గ్రహ పరి బృదయస్చందన రాకేకచాక్రః –భగ్నాన్యన్యాని చక్రణ్యనవధిక గతేస్తేశ్చపక్షిత్వ మపే’’

నాలుగవ అంకం లో చంద్ర ,సూర్య బలగాల మధ్య యుద్ధ వర్ణన చేశాడు .చంద్ర ,బృహస్పతి భార్య తారల పుత్రుడైన బుధుడు తండ్రి వైపున కాక సూర్యునికి బాసటగా నిలిచి యుద్ధం చేస్తాడు .తండ్రీ కొడుకుల మధ్య ఉన్న సుదీర్ఘ వైరాన్ని  రెండు పిశాచాల ద్వారా  వర్ణించాడు-

యదా రణిభవో వహిఃవిరుధ్యా రణిం భువి –బుధస్చంద్ర భవస్త ద్వాదర్తితే చంద్ర భంజేన ‘’.

చంద్రుని బంటు రాహువు సూర్యుని పై చేరి గ్రహణం పట్టిస్తాడు .నిత్యకర్మలకు ,దాన తర్పణాలకు  ఈ సందర్భం గా స్వార్ధ పరులైన పురోహితులు రాబడికోసం  నీచంగా తమలో తాము కలహించుకొంటారు –

‘’సంకల్పఃప్రధమం మయేవ కదితః స్నానస్య మంత్రాస్తదా –త్వం మధ్యే ప్రసభం ప్రవిశ్య కద యస్త ప్రజ్నరే నిస్త్రప ‘’.గ్రహణ స్నానాలు చేయటానికి వచ్చిన స్త్రీలను కొందరు ఆకతాయిలు అల్లరి చేస్తారు .దీనిపై యువతులు అభ్యంతరం చెప్పి ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకొంటారు –

‘’గచ్చన్న చుమ్బత్ కరి చర్మాంకుచయోః కరిద గ్రహీతు  -దస్ట వాను కరి చద ఘరె  నిశా ప్రాయా దివం యతః ‘’

రవి బుధులకు రక్షణగా  పృథ్వి వస్తుంది –ఆమె వర్ణన-

‘దాత్రీ మిక్షు ధనుః ప్రసూన విశిఖ౦ శాలేశ్చసన్మంజరీ – కీరం హస్త చతుష్ట యేనదధతీంమాణిక్య భూషోజ్జ్వలం ‘’

నానా వర్ణ విచిత్ర దివ్య వసనం శ్యామా మురోజోన్నత ౦ –తన్వ౦గీ వికచోత్పలె క్షణ యుగం దిస్త్యాస్శ్ర్యహం దుష్టవాన్ ‘’

భూదేవత బుధుడికి విశ్వం ,మాయా, చిత్ మొదలైనవాటిని వివరించి చెబుతుంది .కధకూ దీనికి సంబంధం ఏమీ ఉండదు –ఒక శ్లోకం –‘’భ్రాంతి స్తవే యమభవన్నను వత్స పశ్య –సా తే పయాతు బృహదంతర దర్శనేన ‘’

అధ్యాస మధ్య గత వనసి లోక దృష్ట్యా –నైజేక్షణేన యది పశ్యసి నేక్షతే సౌ ‘’

భారత వాక్యం గా చెప్పిన శ్లోకం –

‘’అవతు భగవతీ వర శ్యామ లాంగీ ధరిత్రీ –భవతు శుభ మపారం బ్రాహ్మణానాంబుధానాం

నయతు నృపతి లోకః సత్పధం మానవౌఘాన్ –జయతు విమల కీర్తి ర్భూషిత ర్వేంక టాద్రిః’’

54-యలగూరి నరసింహ కవి

పుట్టుక ,కాలం తెలియని ఈ కవి 18ఆశ్వాసాల రుక్మిణీ కళ్యాణ కావ్యం రాశాడు .దీనికి తానె సాహిత్య చంద్రిక అనే వ్యాఖ్యానమూ రాశాడు .ప్రారంభ శ్లోకాలు పూర్తిగా లేవు .భారతిని స్తుతిస్తూ చెప్పిన శ్లోకం –

‘’కస్తూరీ కృత గండ పలిశ లతికా ——ల్యే భ్రమ  -భ్రున్గ స్త్రీకల గాన యోగా విలాస త్కంఠస్వరం గాయనీ

హస్తాబ్జ ప్రవి లోల కంకణ ఝంకారాభి రామాత్  స్వకం –వీణాయః పరి వాదినీ దిశతు సా భారతీ మంగళం ‘’

ఒక శ్లోకం లో తన పేరు ,కవితా సామర్ధ్యం చెప్పుకొన్నాడు –

‘’ఆలంకారిక మండలేన వినుతౌ నై ఘంటకైర్నిన్దితః –శ్లాఘ్యః శాంతిక నైన కైర్నమసితః పౌరాణి కేగ్రేసరే ‘’

వ్యాఖ్యానంతో బాటు కావ్యమూ తానె రాశానని చెప్పాడు –

‘’సన్నారికేళ ఫల తుల్య తమేస్ఫారం కరోమి నరసింహ కవి ర్వివ్రుత్య –గర్భ స్ఫూర ప్రస వినిర్భర  మస్య సార మాస్వాదంత్విహ భ్రుశం భువిః’’

ఆశ్వాసాంత గద్యం –

‘’ఇతి శ్రీ విద్వత్కవిజనసింహ యలగూరి నరసింహ విరచితాయాం రుక్మిణీ కళ్యాణవ్యాఖ్యాయాం సాహిత్య చంద్రికా ఖ్యాయాం ఆస్టదశ సర్గః

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-1-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101

43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్  సేన్ -3(చివరిభాగం )

చైనాను జాగృతం చేసి ,స్వేచ్చను తెచ్చిన ఘనత సూంగ్ సిస్టర్స్ దే అనటం లో సందేహం లేదు .చింగ్ లింగ్ కు విప్లవ వివరాలు తెలిశాక అమితాశ్చర్యం పొంది తను చదివే మెకన్ లోని వేల్సియన్  కాలేజీ పేపర్ నే బ్లాక్ బోర్డ్ గా చేసి దాన్ని వ్యక్త పరచింది .1912ఏప్రిల్ లో ‘’ది వేల్సియన్ ‘’పత్రికలో ‘’20వ శతాబ్దపు అతి గొప్ప సంఘటన ‘’అని రాసింది .నెపోలియన్ వాటర్లూ తర్వాత ప్రపంచం లో  అతి ముఖ్యమైనది చారిత్రాత్మకసంఘటన  చైనా విప్లవం . 400మిలియన్ల ప్రజలు జీవితం ,స్వేచ్చ ,సంతోషాలను దారుణంగా తిరస్కరించిన సుదీర్ఘ రాజరికం నుండి విముక్తి పొందారు .క్రూర దోపిడీ దారులైన వంశ పాలకుల కబంధ హస్తాలనుండి బయట పడ్డారు .అతి సంపన్నమైన చైనా దేశాన్ని  అతి బీదరికం లోకి నెట్టేసిన దారుణ పాలన చెరనుండి విముక్తులయ్యారు .’’మంచు’’ ప్రభుత్వం అంటే వినాశనం ,రాజ్య  బహిష్కరణ ,అనాగరిక పాలన . నెపోలియన్ ‘’చైనా కదిలితే ప్రపంచాన్ని కదిలిస్తుంది ‘’అన్నాడు .ప్రపంచ జనాభాలో నాలుగవ వంతున్న చైనా దేశం మానవ జాతి అభ్యుదయానికి దారి చూపాల్సి వచ్చింది .

ఇవన్నీ చింగ్ లింగ భావనలే అయినా అవి అపరిపక్వమైనవి .12-2-1912న సామ్రాజ్య వాద శాసనం చక్రవర్తి ని త్యజించి ,ప్రజాస్వామ్య స్థాపనను ప్రకటించింది .వెంటనే చైనా రిపబ్లిక్ పిత ,చైనా మొదటి అధ్యక్షుడి గా  రాజీనామా చేశాడు .మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసినా చీఫ్ మేజిస్ట్రేట్ గా ఉండే శక్తి సామర్ధ్యాలు తనకున్నాయా అని సందేహించాడు .ముందు దేశం లోని ఇబ్బందికర పరిస్తితులను చక్క బరచాలి .తనకేమో పరి పాలన లో అనుభవం లేదు .లోపాలు ,అసంతృప్తులను తొలగించాలి .మొత్తం అధికారం తన చేతిలో లేదు .ఈ పరిస్థితులలో ప్రజా హృదయం తెలిసినవాడు  అందరినీ సమైక్య పరచే వాడు  ప్రెసిడెంట్ గా ఉండటం అవసరం .అందుకని తన వారసునిగ ఉదారవాద నాయకుడు, చింగ్ ప్రభుత్వాన్ని అనేక సంస్కరణల కోసం ఒప్పించిన’’ యువాన్ షై కై’’ ని ఎంపిక చేశాడు .తన పదవిని వీడుతూ సన్యట్ సేన్ ‘’ఉత్తర ,దక్షిణ ప్రాంతాలు చక్ర వర్తి పదివీ త్యాగం వలన  ఏకీ కృతమైనాయి .యువాన్ రిపబ్లిక్ ను సమర్దిస్తానని  వాగ్దానం చేశాడు .రాజ్యంగా వ్యవహారాలలో ఆయనకు అనుభవం ఉంది ,ఆయనకుప్రజాస్వామ్యానికి పూర్తీ విధేయుడని,ఈ పాలనా బాధ్యతలు ఆయనకోసమే ఎదురు చూస్తున్నాయి ‘’అని   వీడ్కోలు ప్రసంగం చేశాడు .

కొద్ది కాలం లోనే సన్యట్ సేన్ పొరపాటు చేశానని గ్రహించాడు .యువాన్ ప్రజాస్వామ్యవాది కాదు నియంత అని తేలిపోయింది . ట్రాన్స్ పోర్ట్ అండ్ ట్రేడ్ కు సన్ డైరెక్టర్  జనరల్ అయ్యాడు .ప్రజాపార్టీ అని పిలువబడే ‘’కౌమిటాంగ్ పార్టీ ‘’వ్యవస్థాపకుడైన సన్యట్ సేన్ ,ప్రాపగా౦డాకు ,సన్నాహానికి అంకితమై పని చేశాడు .అధికారాన్ని  అదనుగా తీసుకొని యువాన్ రాజకీయం ఆడి,దారుణంగా ప్రవర్తించాడు .విప్లవానికి ముందే అతను అధికార పగ్గాలు పట్టుకోవ టానికి పధకాలు అమలు చేసుకొన్నాడు ‘’సన్యట్ సేన్ అండ్ చైనీస్ రిపబ్లిక్ ‘’అని పాల్ లించార్జర్ రాసిన పుస్తకం లో యువాన్ ను ,అవకాశ వాద విద్రోహి హంతకుడు ,దారుణ రాక్షసుడు ,ప్రజాస్వామ్య ఘాతకుడు అయిన వాడిగా  ‘’చైనీస్ జూడాస్ ‘’అని పిలిచాడు .యువాన్ వేసిన పధకం లో భాగమే సన్ ప్రెసిడెంట్ గా పదవీ త్యాగం అన్నాడు ఆయన .’’చైనా దెశభక్తుల ఎరుపు రక్త ప్రవాహాన్ని  మరింత ఎరుపెక్కింఛి పారించిన  ‘’యెర్ర’’ వాడు యువాన్ ‘’అంటాడు .వీరిద్దరి మధ్య ఉన్న విభేదం  చైనాకు శాపమే అయింది .

ఇబ్బందులు వేగం గా దూసుకోచ్చాయి .ఒక్క ఏడాదిలోనే యువాన్ తో విడిపోయాడు సన్.చైనా ఉత్తర ,దక్షిణాలుగా చీలిపోయింది .తను గద్దెపై కూర్చోపెట్టిన వాడితోనే తలపడాల్సి వచ్చింది .ఇప్పటికే యువాన్ కు   సుశిక్షిత అతి పెద్ద సైన్య విభాగ౦ చేతిలో ఉంది .నాంకింగ్ వద్ద జరిగిన యుద్ధం లో సన్యట్  సేన్ కు మళ్ళీ ప్రవాసం తప్పలేదు .1915డిసెంబర్ లో జపాన్ లో ఉన్నాడు .అప్పుడు యువాన్ తనను చక్ర వర్తిగా ప్రకటించుకొన్నాడు .ప్రాంతాలు ఎదురు తిరిగాయి .అనుచరులు చాలామంది అతన్ని వదిలిపెట్టారు .దీనితో దారుణ మారణ కాండ చెలరేగింది నిర్దాక్షిణ్యంగా అతి అమానుషంగా యువాన్ ప్రవర్తించాడు .బందిపోట్లు,దుర్మార్గుల రావణ కాండ పెరిగిపోయింది .ముఠాలు ,కక్షలు కార్పణ్యాలు పెచ్చు పెరిగాయి .దేశమంతా అట్టుడికి పోతోంది .ఆరునెలల ఈ దానవ దారుణ పాలనా తర్వాత యువాన్ చచ్చాడు .సన్యట్ సేన్ చైనా తిరిగి వచ్చాడు .తానూ వదిలి వెళ్ళిన కార్యక్రమాలను కొన సాగించాలనుకొన్నాడు కాని పరిస్థితులు అనుకూలంగా లేవు .దేశమంతా అనేక వర్గాలుగా విడిపోయింది .కొత్త అనాగరక సైన్య ముఠాలు ఏర్పడి ,అదుపులోకి తీసుకోక ముందే అదృశ్యమైనాయి .ప్రతి పల్లె గల్లీ రాజ కీయ నాయకుడూ జాతీయ నాయకుడనిపోజులిస్తున్నాడు .చట్ట న్యాయాలఉల్లంఘన ,దోపిడీ పెరిగిపోయి ప్రజా బాధ ఎవరికి విన్న విచుకోవాలో తెలియని విచిత్ర వింత నికృష్ట పరిస్తితి ఏర్పడింది .

చిన్నతనం నుంచే చింగ్ లింగ్  సూంగ్ సన్యట్ సేన్ అంటే మోజు పడింది .ఆమె ఆమె అక్క చెల్లెళ్ళు సేన్ ను బిజీ ,గ్రేషియస్ అంకుల్ –దయా అందమున్న బిజీ అంకుల్ అనేవారు  .జార్జియాలో ఉన్నప్పుడు ఆమె చైనా విప్లవ విజయం గురించి రాసింది .ఇప్పుడు సేన్ ను అధికంగా ప్రేమించింది .ఇప్పుడామెకు 20,సేన్ కు 50వయసు .ఆమె కుటుంబం విస్మయం చెంది తిరస్కరించింది  .వయసులో ఉన్న తేడాల వల్లకాదు .అప్పటికే సన్ కు వివాహమవటం ,సేన్,చింగ్ లింగ్లిద్దరూ క్రిస్తియన్లు కావటం కారణం .రెండవ భార్యగా ఈమెను పొందటానికి  రెండు వైపులా  కుటుంబ పెద్దలు ఒప్పుకోవాలి అనేది సంప్రదాయం .అమెరికాలో చదివిన లింగ్ తలిదండ్రులకు  మెల్లగా చెప్పింది,బ్రతిమాలింది , ఒత్తిడి చేసింది, బెదిరించింది .అన్నీ ప్రయత్నాలు విఫలమై ఇంటినుంచి పారిపోయి సన్యాట్ సేన్ ను పెళ్ళాడేసింది . .

1920లో సేన్ కాంటన్ లో పని మొదలుపెట్టాడు .దక్షిణ చైనాలో పరిస్థితులు అనుకూలంగా ప్రశాంతం గా ఉన్నాయి .యుద్ధ వీరుడు చెన్ చుయాన్ మింగ్ ,అందరూ ద్వేషించే క్వాన్గ్సి ముఠాను ఓడించాడు .ఈయన సన్ కు  స్నేహితుడైనదువల్ల సేన్ మళ్ళీ నిలదొక్కుకోవటానికి వీలైంది .మళ్ళీ సేన్ ను ప్రెసిడెంట్ గా ప్రశంసించి ప్రజలు బ్రహ్మ రధం పట్టారు కాని అది ఒక్క దక్షిణ చైనాకే పరిమితమైంది .చెన్ను  ఉత్తర ప్రాంతం లో కూడా దూసుకు పోయే ప్రయత్నం చేయమన్నాడు .దీనివల్ల సివిల్ వార్ ల వలన దెబ్బ తిన్న ఐకమత్యం మళ్ళీ పునరుద్ధరించటానికి సాధ్యమౌతుందని చెప్పాడు .ఈ విషయమై సందేహించి ముందుకు వెళ్ళటానికి తిరస్కరించాడు .దీనితో మనసు గాయమై తానె ఒక సైన్యాన్ని చేర్పాటు చేసి ఉత్తరం వైపు కదిలాడు సేన్..ధన లోపం వలన తీవ్ర ప్రచారం చేయలేక తిరిగొచ్చాడు చెన్ ను  పదవి నుండి తొలగించాడు .అహం దెబ్బతిని సేన్ కు వ్యతిరేకి అయి ఎదురు దాడి చేశాడు .చెన్ సైన్యం చేయిదాటిపోయి,అదుపు తప్పి , ,సేన్ హెడ్ క్వార్టర్ పై దాడి చేశాయి . సన్యట్ సేన్ను పారి పోయేట్లు చేశారు..భార్య చింగ్ లింగ్ ముసలి పల్లెటూరి ఆవిడ వేషం లో తప్పించుకోన్నది .

యుద్ధం ముఠాలు దేశాన్ని బలహీన పరుస్తున్నాయి .అందర్నీ కలప టానికి సేన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు .రష్యా విప్లవాన్నీ ,దాని వలన జరిగిన దేశాభి వృద్ధిని గమనించాడు .రష్యా విధానం చైనాకు పనికిరాదన్నాడు కారణం ‘’అక్కడ కమ్యూనిజం కాని ,సోవియేటిజం కాని విజయవంతంగా స్థాపించటానికి తగిన పరిస్థితులు లేవు .’’అన్నాడు సేన్.చియాంగ్ కై షేక్ రష్యామిలిటరీ సలహాదారులనుండి  సహాయం ,సూచనలు తీసుకోవచ్చునని కమ్యూనిస్ట్ విధానం లో కౌమిటాంగ్ ను  పునర్నిర్మించ వచ్చని అనుకొన్నాడు .పరిస్థితులు తీవ్ర రూపం దాల్చటంతో,తన స్థానాన్ని పదిల పరచుకోవటానికి   హిం సామార్గం  ,మూక హత్యలు తప్పని సరైనాయి .విద్యార్ధులు ,వర్కర్లు దీన్ని ఆమోదించినా రాజకీయ నాయకుల నుండి భూస్వాములనుండి ,మిగిలిన కన్జర్వేటివ్ లనుండి  మద్దతు లభించలేదు ,

చైనా రెండు ప్రాంతాల్లో ఎన్నో ఆట౦కాలేర్పడ్డాయి .ఉత్తరాన ,పెకింగ్ ,యాన్గ్ ఛీ  లోయ లోనూ యుద్ధాలు జరుగుతున్నాయి .చియాంగ్ కై షేక్ సహాయంతో సేన్ స్వయంగా  సంఘర్షణ కి దిగాడు .ఫ్రెంచ్ ఒడంబడికలేర్పడ్డాయి ,విచ్చిన్నమైనాయి .కొత్త ఒడంబడికలు ,వెన్నుపోట్లు  అరుగుతూనే ఉన్నాయి .తీవ్ర పరిస్తితులలో శత్రువులు మిత్రులు అందరు కలిసి సన్యట్ సేన్ నే ప్రజా నాయకత్వం వహించమని కోరారు .ఇది అవాస్తవమైనదని తెలుసుకొన్నాడు .కాని అంగీకరించక తప్పలేదు .పెకింగ్ కు బయల్దేరి వెళ్లేముందు అనారోగ్యం తో ఉన్నాడు .

తనకు ఇన్ఫ్లుఎంజా వచ్చిందని ,లివర్ జబ్బు దీనికి కారణమని గ్రహించాడు .1925లో పెకింగ్ చేరే సరికి విపరీతమైన జ్వరం ,వచ్చి పల్స్ బీట్ 120ఉంది .కేన్సర్ అని అనుమానించారు .నెలాఖరికి పల్స్ బీట్ ఇంకా పెరిగిపోయి గుండె తట్టుకోలేని స్థితి వచ్చింది .చివరికి ఆపరేషన్ తప్పని సరైతే,అప్పటికే కేన్సర్ చాలా ముదిరి పోయిందని తేలింది .బాధ తగ్గించ టానికి అల్ట్రా వయొలెట్ కిరణ చికిత్స ,నిద్రమాత్రలు వాడారు .కాని ఆశ కనిపించలేదు .ఊపిరి పీల్చటం కష్టమై పోతున్నా నోటినుండి ‘’స్వేచ్చ ,ఐక్యత  ‘’అనే పదాలు పదే పదే వచ్చేవి ఆ స్వాతాంత్ర్య ప్రియుడి నోటినుండి.డాక్టర్ వెల్లింగ్ టన్ క్లూ హాస్పిటల్ లో చేర్చారు .అక్కడే 12-3-1925న సన్యట్ సేన్ మరణించాడు .

సేన్ ప్రారంభించిన విముక్తి ఉద్యమం ఆయన తో ఆగి పోలేదు .అనేక సివిల్ వార్ ల తర్వాత 1946లో చియాంగ్ కై షేక్ ఆధ్వర్యం లో జాతీయ ప్రభుత్వమేర్పడింది .ఇదీ ఎక్కువ కాలం లేదు .ప్రభుత్వ గౌరవం క్రమగా పతనమై పోయింది .అంతర్యుద్ధాలు అవినీతి అశాంతి పెరిగి  ,ఇంతకంటే ఏ ప్రభుత్వమొచ్చినా బాగుండుననిపించింది .1949లో జాతీయ ప్రభుత్వం కూలిపోయి అక్టోబర్ లో మావ్ సే టుంగ్ చైర్మన్ గా ‘’కొత్త కమ్యూనిస్ట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’’ అవతరించింది  .ఏడాది తర్వాత చియాంగ్ కై షేక్ ,అతని సైన్యం కొన్ని దీవుల మీద మాత్రమె అధికారాన్ని కలిగి ,ఫార్మోజా ను ప్రధాన కార్యాలయం చేసుకొన్నారు .అమెరికా సాహాయం తో ముఖ్య  భూభాగాన్ని ఆక్రమించుకొనే ఉద్దేశ్యం లోచైనా  కమ్యూనిజాన్ని నీరు కార్చేశారు  .చివరికి ఏమౌతుందో తెలియదుకాని ఇదంతా చైనా  రిపబ్లిక్ పిత సన్యట్ సేన్ మొదటి చివరి కల .

చైనా జాతి పిత గా  సన్యట్ సేన్ ను ఆరాధిస్తారు  చైనాలోనూ ,తైవాన్ లోను .చైనా విప్లవ వీరులలో సేన్ అగ్రగామి .ఆయన పేరుమీద అనేక వీధులు విద్యసంస్తలున్నాయి .ఆయనకు నివాళి గా చైనీస్ కల్చరల్ రినైసేన్స్ ను ఆయన జన్మదినం నవంబర్  12న ఏర్పాటు చేశారు .అమెరికాలోని న్యూయార్క్ లోఉన్న సెయింట్ జాన్ యూని వర్సిటీలో సన్యట్ సేన్ మెమోరియల్ హాల్ ను ఆయన గౌరవార్ధం నిర్మించారు .ఆయన శత జయంతిని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో చైనా యువత ఘనంగా నిర్వహించారు .ఆయన జీవితంపై సినిమాలు నాటకాలు ఒపెరాలు .టివి షోలు వచ్చాయి .ఆయన పేరిట ప్రత్యెక స్టాంప్ లను విడుదల చేశారు .

Inline image 1

 

Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-1-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్

పశువుల కాపరి వంశం లో జన్మించి అనాధయై అనాదుల పాలిటి ఆపద్బా౦ధవిగా అమ్మగా నిలిచినా త్యాగ మూర్తి సింధూ తాయ్ సప్కల్ .మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పింప్రి మేఘే అనే పల్లె టూరిలో 14-11-1948నపశువులకాపరి అభిమంజి సాతే కు సింధు జన్మించింది .కటిక పేదరికం లో ఉన్నా ,ఆమె తల్లికి ఇష్టం లేకపోయినా తండ్రి సింధు ను చదివించాడు .పశువుల మేపే మిషతో ఆమెను స్కూల్ కు పంపేవాడు .అక్కడ భారది చెట్టు బెరడులనే పలక గా ఉపయోగించి విద్య నేర్చింది .పలకా బలపం కూడా కొన లేని దీన స్థితి .నాలుగవ తరగతి చదువుతుండగానే బాల్య వివాహం చేయటం తో ఆమె చదువు ఆగిపోయింది .

పదేళ్ళ ఈ పిల్లకు వార్ధా జిల్లా నవార్ గావ్ కు చెందిన 30ఏళ్ళ పశువుల కాపరి శ్రీహరి సప్కల్ అనే అతనికిచ్చి పెళ్లి చేశారు .ఇరవై ఏళ్ళకే ముగ్గురు పిల్లలను కన్నది .స్థానిక బడా మోతుబరి నాయకుడు ఎండిన పశువుల పేడను అడవి అధికారులతో కుమ్మక్కై గ్రామస్తులకు చిల్లి కానీ కూడా ఇవ్వకుండా దొంగచాటుగా అమ్మేవాడు .ఈ విషయం గమనించిన సింధు అతని దౌష్ట్యానికి ఎదురు తిరిగి గ్రామస్తుల సహకారం తో పోరాడి ఉద్యమించింది .ఉద్యమ తీవ్రతను గుర్తించిన జిల్లా కలెక్టర్ హుటాహుటిన అక్కడికి వచ్చి పరిస్తితిని తెలుసుకొని సింధుపోరాటం లో న్యాయం ఉందని , ఆ మోతుబరి దే తప్పు అని గ్రహించి తీవ్రంగా మందలింఛి అతనికి వ్యతిరేకంగా ఆర్డర్ జారీ చేశాడు .ఇది నచ్చని ఆ బడా పెద్దమనిషి అవమానం తో రెచ్చి పోయి ఆమె భర్త ను లొంగదీసుకొని 9నెలల నిండు గర్భ వతి అయిన భార్యను ఇంటి నుంచి గెంటించేట్లు చేసి ఆమెపై పగ తీర్చుకొన్నాడు .గత్యంతరం లేక ఆమె ఇల్లు వదిలి ,పుట్టింటికి ఎన్నో కిలో మీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్ళింది .అక్కడ వాళ్ళు కూతుర్ని ఆదరించలేదు పొమ్మన్నారు .ఎక్కడో ఒక పశువుల పాకలో ఆ రాత్రే ఆడపిల్లను కన్నది . ఆత్మ హత్య చేసుకోవాలనే ఆలోచనను మనసులోకి రానీయ కుండా ఎదిరించి ధైర్యంగా నిలబడాలన్న కోరిక ఆమె లో బలీయంగా పెరిగింది .
సింధూ సప్కాల్ రైల్వే ప్లాట్ ఫారాల మీదా అడుక్కొని పొట్ట పోసుకోన్నది .తన పిల్ల లాగా లోకం లో ఎందరో అనాధ బిడ్డలున్నారని గ్రహించి ,తన కూతురుతో పాటు వారినీ చేరదీసి వారందరికోసం ఇంకా ఎక్కువగా తీవ్రంగా భిక్షమెత్తి సంపాదించి వారిని పోషించింది .తన దగ్గరకొచ్చిన ప్రతి అనాధను చేరదీసి తానే వారికి తల్లి అయి పోషించింది .తన పిల్లకూ వీరికి విచక్షణ లేకుండా చేయాలని నిర్ణయించుకొని తన స్వంత కూతుర్ని పూనే లోని శ్రీమంత్ దగ్దు సేట్ హల్వాయ్ కి దానం చేసిన ఉదారస్వభావం సింధూ ది .

ఆ తర్వాత సింధు తన జీవితాన్నంతా అనాధ జన సేవలోనే గడిపింది .అందుకే ఆమెను అందరూ ‘’అమ్మా (తాయ్)అనేవారు ఆప్యాయంగా .దాదాపు 11౦౦ మంది అనాధ పిల్లలను ఆమె పెంచి పోషించింది .ఈ రోజుకు ఆమె కుటుంబం బహు విస్త్రుతమై 207గురు అల్లుళ్ళు ,36మంది కోడళ్ళు,1000మంది మనవలు మనవ రాళ్ళతో సుసంపన్నంగా ఉంది . ఇప్పటికీ రేపటి భోజనం ఆమెకు సమస్యగానే ఉంటుంది .ఆమెదత్తతకు తీసుకొన్న అనాధ పిల్లలు ఉన్నత విద్య నేర్చి డాక్టర్లు గా లాయర్లుగా రాణిస్తున్నారు.వారు కూడా అమ్మలాగానే స్వంతంగా అనాధ శరణాలయాలు నిర్వహిస్తున్నారు . ఆమె కూతురు కూడా విద్యావంతురాలై ఉద్యోగం చేస్తోంది .ఇంతకంటే ఆ తల్లికి కావాల్సిందేముంది ? మాతృత్వానికే ఒక మహోన్నత ఆదర్శ మూర్తిగా నిలిచింది సింధూ సప్కల్ . ఆమె పెంచిన పిల్లలో ఒకామె ‘’అమ్మ జీవితం ‘’పై పి.హెచ్ .డి చేస్తోంది .అంకిత భావం తో చేస్తున్న అనాధ జన సేవకు,త్యాగ నిరతికి ,కఠోర శ్రమకు గుర్తింపుగా అమ్మకు 275కు పైగా గౌరవ పురస్కారాలు లభించాయి .ఆమెకు అందజేయబడిన ధనాన్ని భూమి కొని వారికొక ఆవాసం కల్పించ టానికి ఖర్చు చేస్తోంది ఆ మహా తల్లి .నిర్మాణం జరుగుతోంది. దయగల దాతలు విరాళాలు అందజేస్తూ తోడ్పడుతున్నారు .ప్రపంచం నలు మూలల నుండి ఆర్ధిక సాయం కొరుతోంది అమ్మ.పూనే లోని హద్సపార్ లోని మంజేరిలో నిర్మిస్తున్న ‘’సన్మతి బాల నికేతన్ ‘’లో 300 మంది నివాసం ఉండటానికి వీలుంది .

అమ్మకు 80 ఏళ్ళ వయసులో భర్తతన తప్పు తెలుసుకొని మన్నించమని వస్తే అతనిని తన కొడుకుగా అంగీకరించి,చేరదీసిన కరుణామయి అమ్మ. తాను భర్త తో సహా అందరికీ అమ్మనే అంటుంది ఆ అమ్మ . ఆశ్రమాన్ని సందర్శించేవారికి ఆమె అతనిని తన ‘’పెద్ద ముసలికొడుకు ‘’అని పరిచయం చేస్తుంది . వయసు మీద పడుతున్నా రెట్టించిన ఉత్సాహం తో శ్రమిస్తుంది అమ్మ .అలసట ఆమె నిఘంటువులో లేదు .నిత్యోత్సాహి అమ్మ .వ్యతిరేక భావనలేవీ ఆమె మనసులోకి రానీయదు .ధనాత్మక దృక్పధమే అమ్మ మార్గం .అందుకే అందరికీ మార్గ దర్శి అయింది .

అమ్మ పై మరాఠీ భాషలో ‘’మీ సింధూ తాయ్ సప్కల్ ‘’అనే చలన చిత్రం2010లో నిర్మించారు .అది ఎందరికో ప్రేరణ నిచ్చింది . లండన్ లో జరిగిన 54అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈ సినిమా ‘’ప్రీమియర్ ‘’చిత్రంగా ప్రదర్శించటానికి ఎన్నికైంది .ఆమె ఆదివాసీల 84గ్రామాల పునరావాసలకోసం తీవ్రంగాఉద్యమించింది .అప్పటి అటవీశాఖ మంత్రి చేదీలాల్ గుప్తాను కలిసి పరిస్తితి వివరించింది .ఆ గ్రామ వాసులకు తగిన ఆవాసం కలిపించే వరకు వారిని అరణ్య ప్రాంతం నుండి కదల్చం అని హామీ ఇచ్చాడు .ప్రధాని ఇందిరా గాంధి టైగర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించటానికి వచ్చినప్పుడు సింధు ఎలుగు బంటి దాడికి కళ్ళు కోల్పోయిన ఒక ఆదివాసి ఫోటోను ఆమెకు చూపి సహాయం అందజేయమని కోరింది .అడవిలో ఒక ఆవు కాని కోడికాని చనిపోతే నష్టపరిహారాన్ని ఇస్తుంటే అతనికి ఇవ్వటానికేమిటి ఇబ్బంది?అని ధైర్యం గా చెప్పేసరికి ప్రధాని అప్పటికప్పుడు నస్టపరిహారాన్ని ఆ కళ్ళు కోల్పోయిన ఆదివాసీకి అంద జేయమని ఆర్డర్ జారీ చేసింది .అమ్మలోని పోరాట పటిమకు, సాటి మనుషులపై ఉన్న సానుభూతికి ఇది నిదర్శనం అని జనం ఆశ్చర్యం గా చెప్పుకొన్నారు .

అనాధ ,బహిష్కరింప బడిన ఆదివాసీ పిల్లల దయనీయ స్థితికి అమ్మ గుండె కరిగి నీరయింది .వారికి వీలైనంత ఆహారం అందజేసేది .వాళ్ళు స్వయం సమృద్ధి సాధించే వీలు కలిపించేది .కొద్దికాలం లోనే దీన్ని ఒక ఉద్యమగా ముందుకు తీసుకు వెళ్ళింది .దేనినైనా అమ్మ సాధించి తీరుతుందనే నమ్మకం అందరిలోనూ కలిగించిన అమ్మ కాని అమ్మ సింధూ తాయ్ సప్కల్ ఎందరికో ఆదర్శం మరెందరికో ప్రేరణ .

-గబ్బిట దుర్గా ప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ ఎ .సి .పి .శస్త్రి గారి స్పందన – దైవ చిత్తం

దుర్గా ప్రసాద్ గారికి,

గురువులకు ,పెద్దలకూ పాదాలకి నమస్కారం చెయమన్నారు.
అందుకే మీ పాదాలకు నమస్కారము. ఇంతకంటే మీకంటే నేను చాలా చిన్నవాడిని అని చెప్పుకోవటం ఎట్లాగో తెలియటం లెదు. అసలు  మీలాంటి అనుభవం ఉన్న science teacher నా చిన్న పుస్తకం చదవటానికి ఒపుకోవటమే ఒక condescension లాంటిది . ఇక అనువాదం చేయటం  ఆ  చింతామణి మంత్రం అనుగ్రహమే . చింతామణి మంత్రం నేను చేయను కాని గాయత్రి అప్పుడప్పుడు చేస్తుంటాను,. బహుశా  దాని మహిమేమో . లేకపోతె మీ లెర్నింగ్ ఎక్కడ నేనె క్కడ   మనం పరిచయం అయిన 36 గంటలలో ప్రత్యక్షం గా కలవటం .. 17 రోజులలోపలే మీరు నా పుస్తకం అనువాదం చేయటం … సినిమాలలో montages లో జరుగుతయ్యిఇట్లాంటివి . Truth is stranger than fiction అన్నMarie Corelli (కర్రెక్టేనా) మాట నిజమైన్ది. English రచయితల జీవిత చరిత్రలు, సాహిత్యం  వ్రాసిన మీరు, science teacher గా, హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన , అనుభవం ఉన్న మీకంటే నా చిన్న పుస్తకం అనువాదం చేసే అర్హత ఎవరికీ ఉంది .నా అదృష్టాన్ని  గురించి పోగుడుకోవాలంటే ఎ మాటలు వాడాల్నా అని అలొచిస్తున్నాను.  మీకు ఇది బాల్య క్రీడ.కల్ప వృక్షం భగవంతుడి స్వరూపమే  అయినా  దానికి భూమి లో ఉండే చెట్ల గుణం ఒకటి వుంటుంది. ఇతరులకు ఉపకారం చేస్తూ ,ఇతరులు తనకు ఉపకారం చేసినట్లు మాట్లాడుతుంది . ఇది మహా మహుల లక్షణం .
నేను కుడా టీచర్ కొడుకును కాబట్టి మీ వ్యక్తిత్వం లోని nobility  , ఔన్నత్యం నాకు పరిచయమే . నేను దానిని అర్థం చేసుకో గలుగుతున్నాను .
ఈ ఋణం నేను ఎటూ తీర్చుకోలేను . నా వెంటే ఉంటుంది
నేను ఒక్కటే ఉపమానం చెప్పగలను. ప్రజలకు  లాటరి లో లక్షలు వస్తే ఆనందం పొందుతారని విన్నాను ,అంతకంటే నాకు సంతోషం ఎక్కువ ఉన్ది. ..పేద కు పెన్నిధి దొరకటం అంటే ఇదేనేమొ.
గాంధి గారిని ఎవరో అడిగారట .. ప్రపంచానికి మీ మెసేజ్ ఏమిటని ..ఆయన అన్నాడుట .. “My life  is my message: అన్నాడట ఆయన . అట్లాగే మాటలు తక్కువ చేతలు ఎక్కువ … ఇవన్ని నేర్చుకొనేందుకు నాకు వయస్సు లేదే అని బాధ .. ఏమైనా నేర్చుకోవటానికి ప్రయత్నం చెస్తాను. శ్రీ తూములూరి దక్షిణామూర్తి శాస్త్రి గారిని ఇంతవరకు పర్సనల్ కలవలేదు . నిత్య కళ  అయిన ‘సమయ ‘ భూమిని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుందట  . అలాగే వారు కనపడకుండా నాకు చాలా సహాయం చెశారు. వారిపుస్తకావిష్కరణకు వచ్చినప్పుడు వారియెడల నాకున్న భక్తిని నా నమస్కారం తో పాటుఅందజేయండి .
 ఇప్పటికింతే . మీరు హైదరాబాద్ వచ్చి, మా ఆతిథ్యం   స్వీకరించినపుడు .. నేను ఉత్తరం లో కాకుండా ప్రత్యక్షం గా మీ పాదాలకు నమస్కారం చేసినపుడు,  తీరిక గా మాత్లాడు కుందాము . అదృష్టం ఉంటె ” పుల్లేరు నుండి ఓల్గా దాకా “పుస్తక ఆవిష్కరణ సందర్భం గా ఉయ్యూరు  లో 25 న  కలుస్తాను.
అప్పటివరకు
అయిష్టంగా లేఖా విరమణ చేస్తున్న
మీ అనుచర స్నేహితుడు
ACPSastry
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 51-నరసింహ

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

51-నరసింహ

ఈ కవికాలాదులు తెలియవు.కాని’’కృష్ణ యశో భూషణం ‘’కావ్య కర్త .ఇది రెండు అధ్యాయాలలో 50,58శ్లోకాలతో ఉంది .ఇది వైశ్య కుటుంబం లోని నార్కేడిమిల్లి వంశానికి చెందిన కృష్ణ చరిత్ర .మొదటి శ్లోకం –‘

‘’శ్రీమద్ధరాధర సుతా తనయస్య హస్త శాఖా రవింద మామితశ్రియమా తనోతు –క్రత్వాది కర్మసు భవంతి విధూత విగ్రహః కృత్వా సురాసురా ముఖా ఖలు యత్సపర్యం ‘’

తనకావ్యాన్ని ఈక్రింది విధంగా తెలియ జేశాడు –

‘’కేచిచ్చబ్ద విచార బద్వర్తయః కేచిద్రసా నందినః –కేచిత్ శ్లేష పరంపరాప్రణయినః కేచిద్గుణ గ్రాహిణః

కేచిల్లక్షణ తత్పరా స్సుమనసః కేచి త్క్రుతౌ దూషకాః –కోహం జాతమహే న దైవ బలతస్తేషాంహి నూనం సతాం ‘’

కృష్ణను గురించి చెప్పిన శ్లోకం –

‘’ఆభాతి గోత్ర మమితోత్తమ వైశ్య ధామ క్షోణీతలే మహతి నార్కేడమిల్లి నామ –క్షీ రార్నవస్సకల దీపిత రత్న శాలీ నిత్యం యదా ప్రుధుతరంగవిరాజ మానః ‘’

తర్వాత కృష్ణ పూర్వీకులను వర్ణించాడు .చివరి శ్లోకం

తయా సమేత స్త్వనుకృష్ణ యాహ్వాయ స్స్తదా రసాయం పరిపాలయన్నిరన్ –అతిస్టదట్స న్త్యా విశుద్ధ విగ్రహ స్స పుత్రా పౌత్రః ప్రభు లోక పూజితః

52-కాదంబరి నాటక కర్త –నరసింహ (14వ శతాబ్దం )

ఎనిమిది అంకాల కాదంబరి నాటకాన్ని భట్ట భాణుని కాదంబరి ఆధారంగా రాసిన వాడు నరసింహ కవి .14వ శతాబ్దం మధ్యవాడు .తండ్రి గంగాధరుడు .తాత సిద్ధ నాధుడు .కాకతి ప్రతాప రుద్రుని ఆస్థానకవి అగస్త్యునికి తండ్రి బావ గారు. అన్న విశ్వనాధుడు సౌగందికాపహరణం రాశాడు .మధురావిజయం రాసిన గంగాదేవికిగురువు .చాలా సంక్లిష్ట రచన అయిన కాడంబరిని నాటకం గా మలచటం ఆషామాషీకాదు .అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు నరసింహ .మంచి ఊహాపోహలతో కమ్మని కవిత్వం తో నాటకాన్ని రక్తి కట్టించాడు.ప్రకృతిని విషాదాన్ని గొప్పగా వర్ణించాడు ‘కవి గొప్ప మేధావి అది కవిత్వం లో దర్శనమిస్తుంది .

‘’సౌహిత్యం విదధాతియస్సుమనసం  శాశ్వత్ప్రన్నైదయ –స్శాంతో యమ సముదాహరాంతి మహతో దేవస్య దేహాంతరం ‘’

సూత్రధారుడు ,పారిపార్శ్వకుల మాటలలో కవి గొప్ప తనాన్ని చెప్పించాడు

‘’రసికః కవిరదద్భుతా పద గుంఫోలలితస్పుటీరసః –పరిణద్రుపాదర్శినీ వయం నిపుణాస్తత్కి మతోపినః ప్రియం ‘’

నరసింహుడుకాళిదాసునిఅభిజ్నా శాకు౦తలమ్ ను ఆదర్శంగా తీసుకొని దీన్ని రచించాడు .రధ ,లేడి వర్ణనం అచ్చంగా కాళి దాసువే ..దుష్యంతుడు శకున్తలను రహస్యంగా కలుసుకోన్నట్లు మహా శ్వేతను చంద్రా పీడుడు కలుస్తాడు .శాకుంతలంలోని ఆరవ అంకం ఇందులోని ఆరవ అంకం కూడా ఒకే మాదిరిగా ఉన్నాయి .శాకుంతలంలోని వసంతఋతువు ఆరవ అంకం లో ఉంటె ఇందులో శరదృతు వర్ణన ఎనిమిదిలో ఉంది .వర్ణనలో పోలికలు బాగా కనిపిస్తాయి .శాకుంతలాన్ని యెంత గాఢంగా అనుసరించాడో ఈ ఉదాహరణ తెలియ జేస్తుంది

కాదంబరి –హా దిక్ హా దిక్ ఇదానీ మేవ తదా కృత ప్రతిజ్ఞా ఏతాద్రుసస్య అననుభూత పూర్వస్య కస్యాపి వికరస్య విషయోస్మి సంవృతా ‘’

శాకుంతలం –కిం ను స్వలివం ప్రేక్ష్య తపోవన విరోదినౌ వికారస్య గమనీయాస్మి సంవృతా ‘’

శాకున్తలతో పోలికలే కాక శ్రీ హర్షుని రత్నావళి తోనూ భవ భూతి ఉత్తర రామ చరిత తోనూ  పోలికలున్నాయి .నాలుగవ అంకం లో అంతర్నాటకం ప్రవేశ పెట్టాడు .ఇది భవ భూతి అంతర్ నాటకం గా కనిపిస్తుంది .పాత్రలు సూటిగా రంగం పై కనిపించవు .మాజిక్ తో తెర మూతపడుతుంది .ఈ దృశ్యాలను చూసి ప్రేక్షకులు ఆనందాన్ని విషాదాన్ని అనుభవిస్తారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-1-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీమైనేని గోపాల కృష్ణ గారి కి జన్మ దిన శుభా కాంక్షలు

నిత్యోత్సాహి అనుక్షణ పఠనాభిలాషి సాహిత్యైక జీవి ,పరోపకార హిత ధ్యేయి,,సంస్కృతీ సంప్రదాయాను చరణ శీలి ,సర్వ జన హితైషి నాకూ సరసభారతికి అత్యంత ఆత్మీయులు ,మార్గ దర్శి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 81వ జన్మ దినోత్సవం ఈ నెల 10 తేదీ సందర్భంగా హార్దిక శుభా కాంక్షలు . మరింత ఆరోగ్యం గా వారు సార్ధక జీవితం గడపాలని వారికీ వారి కుటుంబానికి సర్వ శ్రేయస్సులను భగవంతుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాం.

 శ్రీ గోపాలకృష్ణ గారి ఆయురారోగ్యాలకోసం వారి కుటుంబ క్షేమం కోసం శ్రీ సువర్చలా౦జనేయ  స్వామి దేవాలయం లో ధనుర్మాస సందర్భంగా వారి పుట్టిన రోజు జనవరి 10న ఉదయం 5-30గం లకు స్వామి వారలకు ”అరిసెలతో విశేష పూజ ”నిర్వహిస్తున్నాం .స్వామి వారి అనుగ్రహం వారి కి ,వారి కుటుంబానికి సర్వదా రక్షగా ఉండాలి .-దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆనవా సంబంధాలే ఇతి వృత్తాలు ,రామాయణం నిత్య నూతనం

Inline image 1
Inline image 2
 
Inline image 3

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాట్యాన్ని బోధనాంశం చేయాలి మంజు భార్గవి

Inline image 1Inline image 2


Inline image 3
 
 
 
Inline image 4
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శివుడు -శంఖం ,జాతిని మంత్రించిన ఉద్ఘోష ,క్రిమిలేయర్ భావన చరిత్ర

Inline image 1


Inline image 2
 
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -100

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -100

43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్  సేన్

.తన పరిపక్వతను, భర్తగానూ  రుజూ చేసుకొటానికి సన్యట్ సేన్ కు  18  ఏళ్ళు వచ్చాయి .ప్రక్క ఊరిలోని రైతుకూతురిని ఆయనకు వధువుగా వారి ఆచారం ప్రకారం నిర్ణయించారు  .దేవుడి విగ్రహం వేలు విరిచేసిన విషయ౦ మర్చిపోయారు .ముచ్చటగా పెళ్లి జరిగి పెళ్ళికొడుకు హాంగ్ కాంగ్ వెళ్ళాడు .పెళ్ళికూతురు కోడలిగా అత్తవారింట్లో విధులు నిర్వర్తిస్తోంది .19వ ఏట యువ బృందం సేన్ ను మిషనరీ అని ముద్ర వేసింది .అప్పటికే సేన్ మరో విషయం పై తీవ్రం గా  దృష్టి పెట్టాడు .అప్పటికి అమలు లోఉన్నకుటుంబాలలో కొడుకుల్ని బానిసలుగా అమ్మట౦ , కూతుళ్ళను ,వేశ్యలుగా మార్చటం వంటి   అనాగరక చర్యలపై తిరుగు బాటు చేశాడు .ఈ నిర్బంధం లో ఉన్న వారితో తానూ ఒకడై పోరాడాడు .దేశం లోని అవినీతి ,పాలకుల బలహీనతలు ,ఇతర దేశాల దాడులను ఎదుర్కోలేని పిరికితనం చూసి ఉద్రేక పడ్డాడు .వీటి పరిష్కారానికి సంస్కరణలు రావాలని కోరుకొన్నాడు. షిప్ యార్డ్ వర్కర్లు  సమ్మె చేస్తుంటే వారికి అండగా నిలిచి ,సామ్రాజ్యవాదులను పారద్రోలవచ్చని ఆశించాడు ప్రజలకు సూటిగా సేవచేయాలనే తలంపుతో మోడరన్ మెడిసిన్ లో చేరాడు  ,.1887లో కాంటన్లోని పోక్ సి హాస్పిటల్ లో అసిస్టంట్ గా చేరాడు .డాక్టర్ జేమ్స్ కాన్ ట్లీహాస్పిటల్ ప్రారంభించాక చేరిన మొదటి విద్యార్ధి సన్ యట్ సేన్ .అయిదేళ్ళ తరువాత గ్రాడ్యుయేట్ అయిన మొదటి బాచ్ లో వాడూ ఆయనే .ఈ కాలం లో రహస్య కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రాపగాండా తో పాటు సర్జరీ లోనూ నైపుణ్యం సాధించాడు .వయసు 29లో కన్ఫ్యూసియాస్ వేదాంతి చెప్పిన ప్రముఖ సూక్తిని ప్రకటించి దానినే జీవితం లో నినాదం గా తీసుకొని ఉద్యమించాడు  .’’ఈభూమి ,విశ్వం ,అందరిదీ ‘’ అన్నదే కన్ ఫ్యూసియాస్ సూత్రం అదే సేన్ కు నినాద మంత్రమైంది .’’చావుకు సిద్ధపడే ‘( డేర్ టు డై)అనే పటిస్ట బృందాన్ని తయారు చేసి మొట్టమొదటి విప్లవ వ్యూహం పన్నాడు .దాన్ని కనిపెట్టి అతని అనుచరుల్ని అరెస్స్ట్ చేసి ఉరితీశారు .వారికి దొరకకుండా తప్పించుకోన్నవాడు సన్యట్ సేన్ ఒక్కడే .

చార్లీ సూంగ్ (యావో జు )అనే అమెరికాలో చదివిన  ,మెధడిస్ట్ పారిశ్రామిక వేత్తతో సేన్ కు బాగా పరిచయమైంది .అతని రెండవ కూతురుచింగ్లింగ్  సేన్ కు రెండవ భార్య అయింది  సూంగ్ గారి మిగిలిన కూతుర్లకూ ప్రసిద్ధ వ్యక్తులతో వివాహాలు జరిగాయి .ఇందులో పెద్దకూతురు ఎలింగ్ హెచ్ హెచ్ కుంగ్ అనే చైనీస్ మోర్గాన్ అని పిలువ బడే బాంకర్ భార్య .చిన్నమ్మాయి మీ లింగ్ జనరలిస్మో చాగ్ కై షేక్ కు భార్య అయింది .సేన్ వయసు సూంగ్ వయసు ఒకటే . ,ప్రగతిశీల రాజకీయ  భావ వ్యాప్తి ,సాధన కోసం  ఆయన కూడా యవ్వనం లో మిషనరీజీవితానికి స్వస్తి చెప్పాడు .ఆయన  సన్యట్ సేన్ కు సెక్రెటరి అసిస్టెంట్ మిత్రుడు అయ్యాడు .ఆయనకున్న ముద్రణా వ్యవస్థ పైకి మత సాహిత్యముద్రణయే కాని చివరికి రెచ్చగొట్టే ఆశ్చర్యకర పత్రాలను ముద్రించేది .ఇలాంటిది ఎవరూ అచ్చు వేయటానికి సాహసించి ముందుకు రాలేదు అని ‘’సూంగ్ సిస్టర్స్ ‘’పుస్తకం లో ఎమిలి హాహన్ రాశాడు .ఇంపీరియల్ కోర్ట్ వీటిని గమనిస్తూ ,ఇవి రక్తపాత ధోరణిగా ఉన్నాయని భావించింది .అందుకనే సేన్ ఈయనపైనే  ఆధారపడ్డాడు .ఆయనకూడా తన కుటుంబ సంక్షేమానికి తాన జీవితానికి ముప్పుగా భావించినా ,సేన్ కొత్త లోకా విష్కారానికి సహాయ సహకారాలు అంద జేశాడు   సూంగ్ గారు సవ్య సాచిలాబైబిల్ను దాని  సూక్తులను ఒక చేత్తో, విప్లవ సాహిత్యాన్ని రెండో చేత్తో ప్రింట్ చేసి వదులుతున్నాడు .చివరికి బైబిల్ ను బజారులో విసిరేసి ప్రభుత్వాన్ని పడగొట్టటం యెట్లా అని చర్చించాడు .

విప్లవ కుట్ర విఫలమైన తరువాత సన్యట్ సేన్ ను బలవంతంగా చైనానుంచి బయటికి పంపించేశారు .ప్రవాస జీఇతం లో ఎన్నో కష్టాలుపడి హవాయి అమెరికా ఇంగ్లాండ్ దేశాలు తిరిగి సామ్రాజ్య వాదుల నెదిరించటానికిమద్దతునూ ధనాన్నికూడగట్టాడు  .అతని తలపై యాభై వేల డాలర్లునజరు  పెట్టి ప్రభుత్వం ప్రకటన చేసింది .అత్యంత ప్రమాదకర పరిస్తితులనుండి అతి చాక చక్యం గా బందీ కాకుండాకొద్దిలో  తప్పించుకొన్నాడు .ఇంగ్లాండ్ లో ఆయన్ను కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి చైనీస్ లేగేషణన్ లో ఉంచింది .తల తీయటానికి చైనాకు పంపించేముందు ,అందరి కళ్ళుగప్పి  తన  మెడికల్ సహా ధ్యాయి ,పాతమిత్రుడు సర్ జేమ్స్ కాన్ ట్లీ కి తనసంగతి రహస్యంగా తెలియజేశాడు .ఆయన దీనిపై  ప్రజలను ,బ్రిటిష్ ప్రభుత్వాన్ని తనకున్న పలుకు బడితో  కదిలించి సేన్ విడుదలకు మార్గం సుగమం చేశాడు .ఈ సంఘటన తో మన చైనా డాక్టర్ పేరు ప్రపంచమంతా మారు మోగిపోయింది .సన్యట్ సేన్ పేరు నిర్భీతికి ,నిశ్చల నిర్ణయానికి మారు పేరై నిలిచింది .’’ఇంతవరకు తయారైన  ఏ తుపాకీకంటే వేగమైన వాడు  సేన్  ‘’అన్నాడు ఆయన అనుచరుడొకడు .’’ఆయన పరిస్థితిని బట్టి  మెరుపు వేగంగా అనువర్తించే వేగం ,తుపాకి గుండు వేగం కన్నా ఎక్కువ ‘’ఆయనేఅన్నాడు  ముక్తాయింపుగా .కొద్దికాలం జపాన్ లో శరణార్ధి గా ఉన్నాడు .ఆయన్ను పట్టిస్తే చెల్లించే ధర పెంచింది ప్రభుత్వం .భయ సంకోచాలేమాత్రం లేకుండా మిలిటరీ తోనూ ,అండర్ గ్రౌండ్ అనుచరులతోనూ సంబంధాలను రహస్యంగా కొన సాగిస్తూనే ఉన్నాడు .జెనరల్ హ్వాంగ్ తో కలిసి ‘’పేట్రియట్స్ అసోసియేషన్ ‘’(దేశభక్త సంఘం )ఏర్పరచాడు .1910లో సౌత్ సి ఐలాండ్స్ లో విఫల నాయకుడిగా ప్రవక్తగా ,వేటాడ బడేవ్యక్తిలా గడిపాడు. అయినా నిరాశ చెందలేదు .సమాచారాలు  అందటం ఆలస్యమఔతున్నాయె తప్ప అయన ప్రయత్నాలేవీ ఆగిపోలేదు. ఒకోసారి వార్తలు అడ్డ గించబడేవి,కాని పవిత్ర యుద్ధం కొన సాగుతూనే ఉంది .

అమెరికా  వెళ్లాక విప్లవం అనే దాన్ని సన్యట్సేన్ ఆచరణలో పెట్టాడు .,అది 1911 సెప్టెంబర్ లో హాన్ కౌమీద బాంబు దాడితో ప్రారంభమైంది .తర్వాత డజన్ జిల్లాలో జరిగింది .దీన్ని చూసి ప్రభుత్వసైన్యం  తీవ్ర దిగ్భ్రాంతి చెందింది .జపాన్ లో షాంగ్ కై షేక్  సన్యట్ సేన్ ప్రభావం లో పడిపోయాడు .అప్పుడే ఆతను మిలిటరీ స్కూల్ నుండి బయటికొచ్చాడు .వెంటనే  అతన్ని హాన్చౌ లో ఆర్మీ చీఫ్ గా నియమించారు .కొలరాడో లో ఉన్న సన్ కు ఈ వార్త చేరింది .తూర్పు వైపుకు వెళ్లి సెయింట్ లూయీ వార్తా ప్పత్రిక ద్వారా తనను  చైనాకొత్త  రిపబ్లిక్ కు మొదటి అధ్యక్షుడిగా నియమించ బడినట్లు వార్తచదివి తెలుసుకొన్నాడు సంతోష పడ్డాడు .లండన్ వెళ్లి ,1912జనవరి మొదట్లో  చైనా చేరాడు .నాంకింగ్ లోని జాతీయ సమావేశం లో  తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు సన్యట్ సేన్ ..

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-1-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 48శివ లీలార్ణవ రచయిత-కలువే నంజరాజు

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

48శివ లీలార్ణవ రచయిత-కలువే నంజరాజు

కలువే వీర్రాజు అనే క్షచంద్ర వంశ క్షత్రియుని కుమారుడు నంజరాజు .భారద్వాజస గోత్రం .తండ్రి సైన్యాధ్యక్షుడై తర్వాత  18వ శతాబ్దం లో మైసూరురాజుఅయ్యాడు .తండ్రిలాగానే కొడుకు నంజరాజుతెలుగు కన్నడ సంస్కృతాలలో  కవి. ఎందరో కవిపండితులకు ఆశ్రయమిచ్చి ‘’నవ భోజ రాజు ‘’అని పించుకొన్నాడు .ఇతని ఆస్థానకవి నవ కాళిదాసు ‘’నంజరాజ యశో భూషణం ‘’కావ్యం రాసి అంకితమిచ్చాడు . . నంజరాజకవి ‘’హాలస్య మహాత్మ్యం ‘’’’కాశీ మహిమార్ధ దర్పణం ‘’అనే రెండు తెలుగు కావ్యాలు రాశాడు .

సంస్కృతం లో నంజరాజు ‘’శివపాద కమల రేణు సహస్రం ‘’అనే వెయ్యి శ్లోకాల కావ్యాన్ని శివునిపై రచించాడు .దీనినే శివ లీలార్ణవం అంటారు ఇది వేదాంత దేశికుల పాదుకా సహస్రం కు అనుకరణ .ఇది 25 పద్దతులుగా విభజింప బడింది .ప్రతిదానికీ  .ప్రస్తావన ,ప్రభావ ,భావన ,రూప ,ప్రసాదాన ,శృంగార ,కుసుమ ,ప్రణామ ,స్తుతి ,సంచార ,నియమ ,స్వాతంత్ర్య ,తాండవ ,రత్న ,అర్చన ,నక్షత్ర ,విడంబన ,భక్తీ ,శాస్త్ర ,యోగ ,విశ్రాణన ,దయా ,లక్ష్మి ,శైశవ ,చిత్ర అని పేర్లు పెట్టాడు .మొదటి శ్లోకం –

‘’ఈశం శైల సుతా నిభాస్య రారజో చండీశ్వరం నందినం –నత్వా భ్రుంగి రిటింత్రిషస్టమహితాశ్చభక్త్యున్నతాం క్త౦ ‘’

చివరి శ్లోకం

భద్రాకారం వహతు  సదా నః స్వాన్తోమూర్తిం శివ పాద రేణోభవ్యే-భవ్యేదాసేమయి కరుణా ర్ద్రే భంగే స్తాపం శమయ సుధా దృష్టీనాం’’

ఆశ్వాశాంత గద్యలో –‘’ఇతి శ్రీ చంద్ర కుల జలధి కౌస్తుభ శ్రీ కలువే శ్రీ వీర రాజ గర్భ పయః పారావార తనూభవాభి నవ భోజ రాజ బిరుదాంకిత నంజ రాజ విరచితే శివ లీలార్ణవ నామ్నిశివ పాద కమల రేణుకా సహస్రే చిత్ర పద్ధతిః సమాప్తా ‘’.నంజ రాజు రాసిన రెండవ గ్రంధం ‘’గీతాగంగాధరం ‘’ఇదీ శివ స్తుతియే .గీత గోవింద పద్ధతిలో ఉంటుంది .నాలుగు కాండల కావ్యం .దీనికి అదే ఆస్థాన పండితుడైన  కాశీ పండితుడు రాసిన శ్రవణానందిని అనే వ్యాఖ్యానం ఉంది .మొదటి శ్లోకం

‘’శ్రీ శైలజా చరణా పరసక్తి చిత్తః శ్రీ కంఠ పాద సరసీ రుహ చంచరీకః –శ్రీ వీర రాజ నృప శేఖర సత్కుమారఃశ్రీ నంజరాజ సుకవిఃకురుతెప్రబంధం ‘’.తరువాత శ్లోకాలలో వంశ చరిత్ర చెప్పుకొన్నాడు .చివరగా –‘’

వీర నృపాల నందన న౦జమహీపతివిరచిత గీతం –ధీరజనాయ తనోతు శుభాని సదా శివ వర్ణన పూతం ‘’అని పూర్తీ చేశాడు

49-తట్టిపల్లి నర కంఠీరవ శాస్త్రి ‘(19వ శతాబ్ది చివరి కాలం )

వట్టిపల్లి వెంకట లక్ష్మి ,సాంబ శివల పుత్రుడే కాశ్యప గోత్రీకుడైన నర కంఠీరవ శాస్త్రి ‘.తిరుపతి సంస్కృత కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్.19వశతాబ్ది చివరికాలం వాడు .20వ శతాబ్ది ప్రధమ భాగం లో మరణించాడు .ఎన్నోకావ్యాలు రాసినా కొద్ది లఘుకావ్యాలే దొరికాయి .అందులో శ్రీ వెంకటేశ్వరస్తోత్రం ,శ్రీ జ్ఞాన ప్రసూనా౦బి కా స్తోత్రం మాత్రమె మిగిలాయి .మిగిలినవన్నీ వ్రాతప్రతులుగా ఉండి పోయాయి .16ఏళ్ళ వయసులోనే ఆర్యా ఛందస్సులో 296శ్లోకాలాలో అభినవ వాసవ దత్తరాశాడు శివునిపై శ్లోకం తో మొదలు పెట్టాడు

వందామహే మహేశం వందారు జనాభి లాషిత మందారం –బృందారక మణి మకుటీసుందానిత సూన  .మురభితా ౦ఘ్రి యుగం ‘’

తర్వాత పార్వతి గణేశ సరస్వతిలను వాల్మీకిని స్తుతించాడు .వివరంగా వంశ చరిత్ర చెప్పాడు .

జ్ఞాన ప్రసూనామ్బికా నవ రత్న మాల లో 9అశ్వధాటి శ్లోకాలున్నాయి .అమ్మవారు కాళహస్తిలోని దేవత ‘

’కంఠారవో దధుప కంఠారిదుర్విహకంఠీర  వేంద్రా గమనో –త్కంఠానికామ సహితి కంఠాను కర్షికలక కంఠామలాప లలితా

శృంఠీభవ హనుజ క౦ఠీరవ ప్రకర  కుంఠీకృతిక్షమ బలా –కుంఠీ కరోతు నర కంఠీరవాఖ్య కవి క౦ఠీరవస్య దురితం ‘’.ఈకవి కొన్ని గ్రంధాలకు సంపాదకత్వం వహించాడు అవి –వెలు వెంటి గరుడా చాల యజ్వ రాసిన తప్త చక్రాంక విధ్వంసనం , ,అయ్యాన విద్వత్ రాసిన వ్యాస తాప్తర్యా నిర్ణయం.

50-నారాయణప్ప మంత్రి

ఈ కవి కాలాదులేమీ తెలియ రాకపోయినా ‘’అభినవ భారతం ‘అనే 24సర్గల మహా కావ్యం రాసినట్లు తెలుస్తోంది .మొదటిదానిలో ప్రారంభం చివరిదానిలో సమాప్తం దొరకలేదు .దేవయాని  శర్మిష్ట ల కద ఇది .మొదటి సర్గలో శంతనుని వివాహ వర్ణన ఉన్నది

‘’విజ్ఞాప్య మాత్రే సుర సిద్ధ సూను రంబాలికా౦బికయా సహాంబం –పాణిగ్రహం కార యితుం చ తాసాం విచిత్ర వీర్యేణ సముదాతో భూత్’’

చివరలో యుదిస్టిరుని పరిపాలన ఉంది

‘తస్మిన్ మహీం శతాని ధర్మ సూనౌ ప్రజాః స్వధర్మే నిరతాఃసమస్తా –కలిస్తదానీంన భూమౌ ప్రవర్తితః కర్తాయుగశ్చధర్మః ‘’ఆశ్వాసాంత గద్యలో  –‘’ఇతి నరసప్ప మంత్రి కృతాభినవ భారతే మహాకావ్యే త్రయో వింశతి సర్గః ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -99

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -99

43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్  సేన్

సన్ వెన్ అని చైనా వాళ్ళు ఆప్యాయం గా పిలుచుకొనే సన్యట్ సేన్22-11-1866న చైనా దేశం అవినీతి ,కుట్రా కుతంత్రాలతో కుది౦చుకుపోతూ పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు చైనాలోని ‘’టౌన్ ఆఫ్ బ్లూ వాలీ ‘’అని పిలువబడే చోయ్ హాంగ్ లో జన్మించాడు .అద్భుత చియాంగ్ వంశ రాజురికం  విచ్చిన్నమైపోతోంది .విదేశేయులు ద్వారాల దగ్గర నిలబడటమే కాక వారిని ఊది పారేస్తున్నారు .అన్నాం ఫ్రెంచ్ సంరక్షణలో ,హాంగ్ కాంగ్ బ్రిటిష్ వారికి దక్కి ,మరో అయిదు ఓడరేవులుప్రారంభమై  పాశ్చాత్య వర్తకులను ఆహ్వానించాయి .టైపింగ్ తిరుగు బాటు దారులను ఓడించినా ,వారింకా సామ్రాజ్య సైనికులను వేధిస్తూనే ఉన్నారు .

చైనాలో కుటుంబం లేక వంశం పేరుముందు ఉంటుంది .’’సన్’’ అంటే వారసుడు అని అర్ధం .’’యట్ ‘’అంటే విశ్రాంతి అని అర్ధం .తల్లి తనకొడుకు విలాసంగా జీవి౦చరాదని కోరుకొంటుందనే భావానికి సూచన ‘’.సేన్ ‘’అంటే తల్లికి ఉండే మరో కోరిక ‘’చిరంజీవి ‘’గా వర్ధిల్లాలని తెలుపుతుంది .ఈ కుర్రాడి స్కూల్ లో పేరు ‘’వెన్ ‘’అంటే విద్యావంతుడు అని అర్ధం .చైనీయులుతమ పేర్లను ఆషామాషీగా భావించరు.దానికొక పరమార్ధం ఉందని పేర్లు పెడతారు . సేన్ తండ్రి ‘’సన్ తట్ సంగ్’’చదువురాని వరి పండించే రైతు .కౌలుకు భూమిని తీసుకొని వ్యవసాయం చేసేవాడు .ఇంటిని మట్టి ,గానుగ సున్నం తో కట్టుకొన్నాడు .ఇంట్లో నేల నెర్రెలు విచ్చి ఉండేది .ముగ్గురు కొడుకులలో సేన్ చివరివాడు .ఇతను పుట్టే సరికి తండ్రికి54,తల్లికి40 వయసు .ఇద్దరాడపిల్లలు ,విధవలైన ఇద్దరు ఆంటీలు .ఇంతమంది ఇరుకిరుకుగా ఆ ఇంట్లోనే గడిపేవారు .కస్టపడ్డప్పటికీ సేన్ బాల్యం సంతోషంగానే గడిచింది .గాలిపటాలు చేపలవేట ,సెలవల్లో మందుగుండు సామగ్రి తయారు చేయటం తో కాలక్షేపం .మిగిలిన ఊరి పిల్లలకంటే ఒక విషయం లో వేరుగా ఉండేవాడు .నాగలి దున్నటం ఆచారం ఇస్టము౦ డేకాదు .స్వేచ్చగా స్వాతంత్ర గీతం పాడుతూ దేశ దేశాలు తిరిగే పక్షిలా ఉండాలనుకోనేవాడు .ఆవిషయాన్ని బహిరంగం గా చెప్పలేదు కాని అతని మనసులోని కోరిక మాత్రం అదే .పక్షి చేసే కిలకిలా రావం వింటే ఈభావామే పొటమరించేది..తెలియని సుదూర దేశాల గురించి కలలు కనేవాడు .ఒక ముసలి సైనికుడు గ్రామీణ మాండలికం లో అసాదారణమైన టైపింగ్ ల యుద్ధాలు ,వాళ్ళు యుద్ధ వీరులను ఎదిరించటాలు ,బానిసత్వం పై ద్వేషం ,అందరికీ సమానంగా భూమిని పంపిణీ చేయటం ,శిలువకు తప్ప దేనికీ వంగని ధైర్య సాహసాల గురించి  చెప్పిన కదలు విని  ఊగిపోఎవాడు .

బాల్యం లో అందరిలాగానే కస్టపడి స్కూల్ కు వెళ్లి చదివాడు .ముఖం దేవాలయ బడి , గోడకు పెట్టి ,పంతులగారి వెదురు బెత్తం దెబ్బలకు అటూ ఇటూ కదుల్తూ చైనావారి ఒకటో తరగతికిచెందిన  మూడక్షరాల క్లాసిక్  బట్టీ పడుతూ ఉండేవాడు .ఇతని కుగ్రామం  చాలా వెనుక బడినదే. ఎదిగే వయసులోనే ఈ ఊరు వదిలి వెళ్లి పోవాలని అనుకొనేవాడు . ఈ చాన్స్ 15ఏళ్ళ వయసులో వచ్చింది .ఇతనికంటే పదిహేనేళ్ళ పెద్దవాడైన అన్న ‘’ఆ మీ ‘’ హవాయి ద్వీపానికి వెళ్లి సంపన్నుడయ్యాడు .ఒక సారి ఇంటికొచ్చి తమ్ముడిని తనకు సహాయం గా తీసుకొని వెళ్ళటానికి తలిదండ్రుల అనుమతి కోరాడు .హానాలూలు చేరే టప్పటికి సేన్ బలమైన గడ్డం ,సున్నితమైన నోరు ఉన్న  14 ఏళ్ళ కుర్రాడే .  అన్నకు అక్కడ ఒక ఫారం తో బాటు జెనరల్ స్టోర్స్ కూడా ఉంది .అక్కడ స్టోర్స్ లో పని చేస్తూ హవాయ్ ,జపాన్ మూలాలను గ్రహించి ,జ్ఞాన సంపాదనకోసం ఆరాట పడ్డాడు .అన్న తమ్ముడిని చర్చ్ ఆఫ్ ఇంగ్లీష్ స్కూల్ లో చేర్పించాడు .ఇక్కడ లెక్కలు బైబిల్ ,చరిత్ర నేర్చాడు .తండ్రి క్రైస్తవానికి మారాడు .కనుక ఈ చిన్నకొడుకు తాను  కూడా క్రిస్టియన్ అనే అనుకొన్నాడు .ఇంగ్లీష్ భాషలోనే క్లాసులు జరిగేవి .తమ్ముడు ప్రజ్ఞావంతుడై ,పాశ్చాత్యులకంటే మరీ వేస్త్రెన్ గా మారిపోతున్నాడని అన్న అనుకొనే వాడు .17ఏళ్ళ వయసులో ఇంగ్లీష్ గ్రామర్ పరీక్షలో సేన్ బహుమతి పొందాడు .కుర్రాడు ముదిరాడు అని గ్రహించి సమాజం లో తన స్థానానికి ప్రమాదమని  అన్న తమ్ముడిని చైనాకు తిరిగి పంపించేశాడు .

యువ  సన్యట్ సేన్  చదువు తో తిరిగి వచ్చి ఇబ్బందిపెట్టాడు .సంప్రదాయాన్ని అనుసరించటానికి ఒప్పుకోలేదు విగ్రహారాధన ,పూర్వీకుల ఆరాధన ,పూజ లపై తిరగ బడ్డాడు .ఇంట్లో ఉన్న దేవతా విగ్రహాలలో ఒక దాని వేలు విరగ్గొట్టాడు .ఊరంతా ఆశ్చర్యపోయింది ఇతని ప్రవర్తనకు.బహిష్కరించి హాంగ్ కాంగ్ కు పంపేసింది .కొన్ని నెలల తర్వాత్ క్వీన్స్ కాలేజిలో చేరి బైబిల్ చదివి అత్యుత్సాహంగా క్రైస్తవం గురించి దిమ్మ తిరిగేట్లు మాట్లాడటమేకాక ఇద్దరు విద్యార్ధుల్ని మతం పుచ్చుకోనేట్లు చేశాడు .ఇంతలో యెంత మార్పో ?

సశేషం

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ వేటూరి ఆనంద మూర్తి గారి లేఖ

image (7)

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వర్తమానం లో జీవించు ,శరీరం మీ ఏకైక కానుక- కృష్ణ పాండవీయం కి యాభై – ఎడారిలో కోయిల రంగనాధ్

Inline image 1  జీవితం మInline image 1


Inline image 2
Inline image 1
Inline image 2
Inline image 1
Inline image 2

Inline image 2


Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనకు తెలియని మన తెలుగు

manaku teliyani mana telugu

Posted in సేకరణలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -18(చివరిభాగం ) శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

  దైవ చిత్తం -18(చివరిభాగం )

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

                      పదకొండవ అధ్యాయం  

పేజి -173,పేరా-3

.నాలుగు శక్తులలో  బలహీనమైనది అయినా గురుత్వాకర్షణ విశ్వ నిర్మాణాన్ని రూపొందిస్తుందికనుక ఈ పుస్తకం లో గురుత్వాకర్షణ గురించి చెప్పే సూత్రాలకే అధిక ప్రాధాన్య మిచ్చాను .

శాస్త్రి గారి భాష్యం –ఇది ఎందుకంటె పురాణాలు వివిధ దేవతలను వేర్వేరు శక్తులకు ప్రతినిధులను చేసి,తర్వాత దైవమైన గణేశుని కి పేరు పెట్టాయి .ఆయనది  గెలాక్సీలనన్నిటినీ  అఖిల నక్షత్ర మండలాలను అంటే నక్షత్ర గణాలను కలిగి ఉన్న గజ వక్త్ర౦గల శరీరం .అందుకే గణేశుడు  .ఆయన ఎంత శక్తి వంతుడు అంటే దేవతలు కూడా ఏదైనా మంచి పని చేయాలనుకొంటే,ఏదైనా సృష్టించాలంటే  ముందు ఆయనను పూజించి,ప్రసన్నం చేసుకొని విఘ్నాలు రాకుండా చూసుకొంటారు. దీనిని ఆయన వ్యతిరేక శక్తుల అంటే గెలాక్సీ ఎడమ ,కుడి చుట్టగా ఉన్న నక్షత్ర సముదాయాలు బాహువులుగా ఉన్నవాడని గ్రహించాలి .ఈనాక్షత్రాలు ఎడమ వైపు ఉంటె కొంత ప్రభావాన్ని చూపిస్తాయి .కుడి వైపు ఉంటె వ్యతిరేక ప్రభావాన్ని కలగ జేస్తాయి .  మొత్తం మీద ఒక ప్రభావం రెండో దానికి అది మంచి అయినా చెడు అయినా విఘ్నం కలిగిస్తుంది  .ఈ అనివార్య పరిస్థితి ని గుర్తించి దేవుడు కూడా ఈ విఘ్నాల విషయం లో ఏమీ చేయ లేక చేతు లెత్తేశాడని  పురాణాలు పేర్కొన్నాయి. కాని భగవంతుని దయతో నివారింప బడని చెడు పని లేదు .అందుకనే ఆటంకాలు కలగ కుండా చేయమని దయ చూపమని  ముందుగానే వినాయకుని ప్రార్ధిస్తారు .  ఇది తర్కానికి అతీతమైన  భావోద్వేగ విషయం (ఎమో షనల్).మొత్తం మీద గణేశుడు ముఖ్యవిశ్వోద్భవ శక్తి(కాస్మోలాజికల్ ఫోర్స్ ) ఐన   గురుత్వాకర్షణ దైవం.ఈ కీలక భావన వినాయక చవితి కధలో 27నక్షత్రాలకు భర్త అయిన చంద్రుడితో పగ రూపం లో చెప్పబడింది .అలాగే  భాగవతం లోని గజేంద్ర మోక్ష కద కన్యా రాశికి చెందిన హస్తా నక్షత్ర రూపమైన ఏనుగు  ,చివరికి మకరం (మకర రాశి )నుండి  రక్షి౦పబడుతుంది  .ఈ ప్రతీకాత్మికతను గణేశుని ప్రార్ధనలో చివరికి చెప్పే శ్లోకం ద్వారా రుజువు చేయ వచ్చు

‘’వక్ర తుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభా –అవిఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘’

దీని అర్ధం ‘’ఓ గణేశ దేవా !ప్రపంచాన్నిఅన్ని వైపుల నుంచి  పాలించే తుండం కలిగి ఉన్నావు .నువ్వు కోటాను కోట్ల నక్షత్రాలు ఒక చోట చేరితే వచ్చే కాంతితో సమానమై విరాజిల్లుతున్నావు .నేను నీకు సర్వ సమర్పణమయెట్లు చేసి  నేనుయజ్ఞం గా భావించి  నిర్వర్తించే  ఏ క్రతువుకు  కూడా విఘ్నం రాకుండాకాపాడు

పేజి -174,పేరా-3

ఒక వేళ ఏకీకృత సిద్ధాంతం సాధ్యమైతే ,అది నియమాల ఏర్పాటు ,,సమీకరణాలు మాత్రమె .ఈ సమీకరణాలు  విశ్వాన్ని వర్ణించటానికి సాధ్యమౌతాయా ?లెక్కల సూత్రాలు ఎన్ని ఉన్నా విశ్వం ఎందుకు అన్న ప్రశ్నకు ,దాని వివరాలకు  సమాధానం ఇవ్వగలవా?అసలు ఈ విశ్వం ఎందుకు ఇంత కస్టపడి బట్ట కట్టాలి –మనగలగాలి?ఏకీకృత సిద్ధాంతం దాని అస్తిత్వాన్ని చెప్పగలదా?విశ్వానికి సృష్టికర్త అవసరమా ,ఒక వేళ అవసరమైతే ఆయన విశ్వానిపై మరేదైనా ప్రభావం చూప గలడా?

శాస్త్రి గారి మహా భాష్యం –హాకింగ్ గారి మహా ప్రశ్న ‘’ఈ విశ్వానికి పదార్ధం ఎక్కడి నుంచి తేబడింది ?అని .ఉపనిషత్ సాహిత్యం దీనికి చక్కని సమాధానం చెప్పింది .ఆత్మయేవిశ్వానికి  మూలం ,ఆధారం వనరు ,రూప కర్త (డిజైనర్ ).అవే ఉపాదాన కారణ౦ –ఇచ్చేది  విశ్వ నిర్మాణ రూపానికి నిమిత్త కారణం .మరోరకంగా సులభంగా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే –స్టీఫెన్ హాకింగ్ శాస్త్ర వేత్త సృష్టికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలను ప్రయత్నించి’’ దైవ చిత్తాన్ని’’(మైండ్ ఆఫ్ గాడ్ ) తెలుసుకొనే ప్రయత్నం చేశాడు , భారతీయ అద్వైత  వేదాంతం తగిన సమాధానం ఎప్పుడోనే చెప్పింది .మామూలు భాషలో చెప్పాలంటే సృష్టికి కారణం ఆత్మ మాత్రమే .తాత్వికంగా (ఫిలసాఫికల్ )చెప్పాలంటే ఆత్మ సృష్టించటం లేదు .అది అలాగే ఉంది (ఇట్ జస్ట్ ఈజ్ )మనం మనకున్న పరిమిత జ్ఞానం తో ఇప్పుడున్న విశ్వాన్ని దర్శిస్తున్నాం అంతే.దేవుడు లేక ఆత్మ ను చూసి అది సృష్టి అని పొరబడుతున్నాం .నిజానికి సృష్టికి మొదలు ,తుది అనేవి లేనేలేవు .ఉదాహరణ పూర్వకం గా చెప్పాలంటే ఇంద్ర ధనుస్సు ప్రత్యక్ష సాక్షం .వ్యక్తి ఒక ప్రత్యెక స్థానం లో ని బిందువు వద్ద ఉండి ,నిర్నీత దిశలో ఉన్న సూర్యుని చూస్తేనే ఇంద్ర ధనుస్సు కనిపిస్తుంది .వ్యక్తి కదిలిన , లేక సూర్యుడు కదిలిన క్షణం లో అది  కానీ పించదు .అన్నది మన అనుభవమే .సృష్టి కూడా అలాంటిదే .రజ్జు సర్ప భ్రాంతిలో మనం పొరబడుతున్నాం ఈ విషయాలు పూర్వపు అధ్యాయం లోనే మనం చెప్పుకొన్నాం .’’దిమైండ్ ఆఫ్ గాడ్ ‘’అంటే దైవ చిత్తం లేక దేవుని మనసు అంటేఅర్ధం  –దేవుడు ఈ విశ్వంగా కనిపించటమే .

కాని దేవుడికి ఆది, అంతం లేవు .దీన్ని అందరూ అంగీకరించారు .విశ్వానికి కూడా ఆద్యంతాలు లేవు గణితం ,తర్కం ఆధారంగా వాదిస్తే –‘’అవి రెండూ ఒకటి కావా ?అవును రెండూ ఒకటే .ఇదే స్వామీ అద్వైత సిద్ధాంతం .హాకింగ్ గారి ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’అంటే ఇదే – దైవ చిత్తం –దేవుని మనసు .

సంపూర్ణం

మనవి -నా మీద అత్యంత ఆదరాభిమానాలతో తాము రాసిన ”దిమైండ్ ఆఫ్ గాడ్ ”పుస్తకాన్ని డిసెంబర్ 20 వ తేదీన నాకు తమ ఇంటి వద్ద అందజేసిన శ్రీ ఏ .సి పి.శాస్త్రి గారికి ధన్యవాదాలు .దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తాను అని అప్పుడే వారికి చెబితే మహద్భాగ్యం అన్న సౌజన్యం వారిది .మర్నాడు 21తేదీ నుండి వారి పరిచయం తో పాటు ”దైవ చిత్తం ”ను రాయటం మొదలు పెట్టి ఈ రోజుకు అంటే 7వా తేదీకి  18ఎపిసోడ్ లుగా రాసిపూర్తీ చేసి  మీకు అందజేశాను . ఇందులో గుణాలన్నీ శాస్త్రి గారివి హాకింగ్ గారివి . దోషాలన్నీ మాత్రం నావే  అని సవినయం గా మనవి చేస్తున్నాను .శాస్త్రి గారి ఆలోచనలను భావాలను ఎంతరకు తెలుగులోకి తేగలిగానో నాకు తెలియదు .వారి చిత్తాన్ని అర్ధం చేసుకోన్నానో లేక నా చిత్తం వచ్చినట్లు రాశానో అనే సందేహం .ఏమైనా ఒక మంచి విలువైన గ్రంధాన్ని అనువదించే మహద్భాగ్యం నాకు కల్పించి నందుకు శాస్త్రి గారికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .ఈ వ్యాస పరంపర లో నేను చేసిన పొరబాట్లు ,అర్ధం చేసుకో కుండా రాసిన విషయాలు అర్ధం చేసుకొన్నా సరైన భాషలో చెప్పాల్సిన రీతిలో చెప్పక పోవటం ఏవైనా ఉంటె నా దృష్టికి తీసుకు రావలసినదిగా శ్రీ శాస్త్రిగారినీ ,సాహితీ బంధువులను కోరుతున్నాను .

 

 

 

.

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –7-1-16-ఉయ్యూరు

 

 

 

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉడతలు లేని ఊరు ,పిచ్చికలు లేని గూడు పొంచి ఉన్న ముప్పు ,తమిళనాడు గెలుగు గోడు

Inline image 1
 
Inline image 2
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమ్మేద్దాం …బాస్ ,అమరావతిప్లాన్ పక్కా కదన రంగం లో నేవీ నౌక.. తెల్ల ఇసుకలో తేలిపోదాం ,నంది వెనక రంది

Inline image 1Inline image 1


Inline image 2


Inline image 2Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సౌదీ దూకుడు ,”’ఇజీనగరమ్ లో తెలుగు వర్సిటి ”

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉత్తర కొరియా హైడ్రో బాంబ్

Inline image 1


Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ చిత్తం -17 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

   దైవ చిత్తం -17

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

పేజి -165,చివరి పేరా

కానీ అసలు అలాంటి ఏకీకృత సిద్ధాంతం ఉంటుందా ?లేక మనం ఎండమావుల వెంట పరిగెడుతున్నమా?3 రకాల అవకాశాలున్నాయి 1-పూర్తి సంపూర్ణ ఏకీకృత సిద్ధాంతం ఉంది మనదగ్గర దమ్ము శక్తి ఉంటె ఏదో ఒక రోజు దాన్ని కనిపెట్ట గలం.2-ఈ విశ్వానికి అంతిమ సిద్ధాంతం లేనే లేదు కానీ అనంతమైనసిద్ధాంత క్రమం ఉండి.విశ్వాన్ని మరింతగా ఖచ్చితంగా వివరించ గలుగుతుంది .3-అసలు విశ్వానికి సిద్ధాంతమే లేదు ,సంఘటనలను ఒక కొంతపరిమితి దాటి  ముందస్తు అంచనా వేయలేము ,ఒకోసారి అవి యాదృచ్చికంగా ,ఏక పక్షంగా ఏర్పడచ్చు .

శాస్త్రి గారి వ్యాఖ్యానం –ఈ మూడి టిలో వేద జ్ఞానం చివరిదాన్ని నిర్ణయించుకొని అందులో రెండవది ఒక భాగం అని చెప్పినట్లనిపిస్తుంది .ఈ కింది విధంగా దాన్ని విస్తరించి చెప్పచ్చు .

  ప్రపంచం   7 లయల కు లోబడి నడుస్తుంది అని ప్రవచించింది .అవే సంస్కృతం లో గాయత్రీ ,త్రిష్టుప్ ,జగతి ,అనుష్టుప్ ,ఉష్ణిక్ మొదలైన ఛందస్సులు  .అని ఇదివరకే తెలుసుకొన్నాం కనుక విశ్వం ఈ ఏడు ఛందస్సుల అధీనం లో పాలింప బడుతోంది.  ఇందులో గాయత్రి ,త్రిష్టుప్,జగతి అనే మూడు ఛందస్సులు సమస్త విశ్వాన్ని పాలిస్తున్నాయి  .   వీటినే అలంకార యుతంగా వసు, రుద్ర ,ఆదిత్య గా ,8,11,12 సంఖ్యలుగా చెప్పారు .ఇవి వేదసాహిత్యం లో ముఖ్యంగా భగవద్గీతలో  పదే పదే చెప్ప బడినాయి .వీటిని విష్ణు (వసు ),రుద్రా (త్రిష్టుప్ ),ఆదిత్య (గాయత్రి )గా గుర్తించి చెప్పారు .ఇందులో విష్ణువు సృష్టి కర్త ,రక్షకుడు. రుద్రుడు నాశన లేక లయ కారకుడు .ఆదిత్యుడు కొనసాగించేవాడు .వీరి రాజ్యాలు స్వతంత్రమైనవి(ఇండి పెండేంట్) ,వేరోకదాని ఆధారం లేనివి(ఒవెర్లాప్ ) ,,రద్దు అయ్యేవికావు(సూపర్ సీడ్).ఈ ముగ్గురు దేవతలు’’ శక్తి దేవి’’కిలేక ఆమె కుమారుడు గణపతి కి  అధీనమై ఉంటారు.గణేశుడు గేలాక్సీలు ,నక్షత్ర మండలాలతో  కూడిన సకల విశ్వానికి ప్రతినిధి .ఆయన శక్తి  సామర్ధ్యాలు అగణితమైనవి   -అపరిమేయమైనవి .

   పేజి -166,పేరా -2

   దేవుడు మనసు మార్చుకొని ఉండచ్చు అని దేవుని ఊహిస్తూ సెయింట్ అగస్టీన్ చెప్పింది అవాస్తవం( ఫాలసి )కు ఉదాహరణ .ఆయన దేవుడు కూడా ఒక ప్రాణి అని ,కాలం తో పాటు ఉంటాడని దేవుడు సృష్టించిన విశ్వం లో కాలం ఆయన  ఆస్తి ,అనీ ఆయన సృష్టించినపుడు దేనికోసం  సృస్టిం చాడో ఆయనకు తెలుసుననీ చెప్పాడు .

  శాస్త్రి గారి వ్యాఖ్య –ఈ విషయం లో మనం పాశ్చాత్య ఆలోచనా పరులను అభి నందించాలి .వేదం ‘’కాలం అనేది దేవుని పీఠంఅనీ దానిపై నుండే లోకాలను పరిపాలిస్తాడని చెప్పింది .కాలం శేషం .సృష్టి మొత్తం వినాశానమైనా కాలం మిగిలి ఉంటుంది కనుక శేషం అన్నారు .కనుక దేవుని సృష్టిలో మొదటిది కాలమే అని నిర్ణయమైంది .అందుకే మహర్షి వేద వ్యాసుడు విష్ణుమూర్తి  కల్పాల(సృస్టుల ) ) మధ్య విరామ కాలం లో  ముడతలుగా ముడుచుకొన్నఆది శేషునిపై పవళించినట్లు వర్ణించాడు .ఇదే కాల చక్ర భ్రమణం అని ,శేషుడు అంటే కాలం విష్ణువు ను సేవిస్తున్నాడని ,ఆయన పడగలనీడలో హరి నిద్రిస్తున్నాడని అంతరార్ధం .సృష్టి ప్రారంభించాలి అని ఆయన అనుకోన్నప్పడల్లా కుమారుడైన బ్రహ్మను సృష్టి చేయమని ఆదేశిస్తాడు .విష్ణుమూర్తి మాత్రం’’ పాము పడక’’ దిగకుండా కాల సింహాసనం పై దర్జాగా విశ్రాంతి పొందుతూ ఉంటాడు .ఆయన అక్కడే ఉన్నాడు ఉంటాడు .ఆయనకు ఆది అంతాలు లేవు .బ్రహ్మ సృష్టి ప్రక్రియ ప్రారంభించగానే కాలం ప్రారంభమవుతుంది .సృష్టి నశిస్తే దానితో పాటు కాలమూ సమాప్తమౌతుందని ఇదివరకు అధ్యాయాలలోనే వివరంగా చెప్పుకొన్నాం .కనుక కాలం సృష్టికి ఆస్తి.

 సమాప్తి –పేజి -168,పేరా 1

  నువ్వొక స్పెషలిస్ట్ అయితే ,అప్పటికీ ,సైంటిఫిక్  సిద్ధాంతాలలో కొన్ని విషయాలు మాత్రమె నీకు తెలిసి అర్ధం చేసుకోగల్గుతావు .సైన్స్ అభివృద్ధి యెంత వేగం గా ఉందంటే స్కూళ్ళలో కాలేజీ యూని వర్సిటీలలో నేర్చింది అంతా ‘’కొంచెం ‘’అవుట్ ఆఫ్ డేట్ ‘’అయి పోతుంది .అంటే కాలానికి తగినది కాదని పిస్తుంది .అతి కొద్దిమంది మాత్రమె వేగంగా పురోగమించే జ్ఞాన సరిహద్దు (నాలెడ్జ్ ఫ్రాంటియర్)అందుకోగలరు .వారు తమ కాలాన్నంతటినీ వెచ్చించి ఇందులో కొద్ది జాగా లోమాత్రమె  ప్రత్యెక నైపుణ్యాన్ని చూపగలరు .మిగిలిన జనాభా కు ఈ  పురోగమనం విషయం , అది కలిపించే   ఉత్సాహం భావోద్రేకం అసలేమీ తెలియదు .

శాస్త్రీ జీ మహా భాష్యం –నిజానికి  ‘’’ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’(కాలం సంక్షిప్త చరిత్ర  )అనే స్టీఫెన్ హాకింగ్ శాస్త్ర వేత్త రాసిన గ్రంధం లో ని పదవ అధ్యాయం లో ఉన్న మూడు పేజీలలోని ప్రతి మాటను ‘’యూని ఫైడ్ దీరీ ఆఫ్ ఫిజిక్స్ (యూని ఫైడ్ దీరీ  ఆఫ్ యూని వర్స్) ను అన్వేషించే వారందరూ బట్టీ పట్టి జ్ఞాపకం ఉంచుకో దగినదే . దీనినే సాధారణ భాషలో’’ సత్యం ‘’అంటారు .వేదందీన్ని గుర్తించింది . నిత్య జీవిత సంగ్రామం లో సతమతమయ్యే ప్రజల దృష్టిని దీనికోసం మళ్ళించవద్దని ,జీవితాన్ని సత్యాన్వేషణలో త్యాగం చేయాలను కొన్నవారి కి మాత్రమె దీనిపై శిక్షణ నివ్వాలని నిష్కర్ష గా చెప్పింది .భగవంతుని సర్వ సమర్పణ  చేసినవారు అవగాహన చేసుకొన్న వారు   సత్య స్వభావాన్ని చేరటానికి అవగాహన  సమర్ధం కాదని అనుభవించటం ద్వారానే సాధ్యమని చెప్పారు .దీనికి కఠినమైన ,శీలం, నైతికత ,ఆధ్యాత్మిక నియమావళి కావాలి .ఈ విషయాలనన్నిటినీ కేనోపనిషత్ ఒక్క వాక్యం లో చెప్పింది –

‘’మానవులారా –నమ్మండి –ఆత్మ తెలుసుకొన్నాను అన్నవాడికి తలియ బడదు  ,నాకు తెలియదు అన్నవారికి ఆత్మతెలియ  బడుతుంది .-

‘’అవిజ్ఞాతం విజానతాం-విజ్ఞానాతం అవిజ్ఞానతం’’

  వారిలో రెండవ  వర్గంలోని జ్ఞాని- స్టీఫెన్ హాకింగ్ – భగవంతుడు ఆయన్ను ఆశీర్వ దించుగాక .

   సశేషం

             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -16 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -16

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

పదవ అధ్యాయం –భౌతిక శాస్త్ర ఏకీకరణ

పేజి -155,పేరా -1

మొదటి అధ్యాయం లో వివరించినట్లుగా ,విశ్వం లోని అన్ని విషయాలకు కలిపి ఒకే విధమైన సిద్ధాంతం నిర్మించటం చాలా కష్టం .దీనికి బదులు కొంత పరిమితి తో జరిగే విషయాలను ,మిగిలిన ప్రభావాలను వదిలేసి లేక ఉజ్జాయింపుగాకొన్నిటికే   చేసి పాక్షిక సిద్ధాంతాలను తయారు చేయటానికి ముందడుగు వేశాం.

శాస్త్రీజీ కామెంట్ –ఈ కష్టం హిందూ పురాణాల లోనూ ఉంది .వివిధ పురాణాలు వేర్వేరు సందర్భాలలో రచింప బడినాయి .వీటినన్నిటినీ సమీకృతం చేయటం కష్టమే కాని అసాధ్యం మాత్రం కాదు .కొన్ని పురాణాలు శివుడే విశ్వానికి సృష్టి కర్త  ఆయనే శాశ్వతం అని ప్రకటించాయి . ప్రధానంగా  శివుడు అగ్ని రూపుడు. వేదం అగ్ని సృష్టికి కారణమని చెప్పింది .కొన్ని పురాబాలు విష్ణువే సృష్టికర్త అని చెప్పాయి ఆయనను నారాయణుడు అన్నాయి. అంటే జ్ఞానానికి నీటికి నివాసం  అని అర్ధం .పురాణాలు నీరే అని భావించి సృష్టికి నీరే కారణమన్నాయి ,ఋగ్వేదం ఇతర దేవతలకంటే వరుణదేవుడికిపై స్థాయి నిచ్చి  ప్రాధాన్యమిచ్చింది .పురాణాలు వివిధ సందర్భాలలో రాయబడినాయని ముందే చెప్పుకొన్నాం .ఋగ్వేదం ఈ దేవతలందరికి మహర్షులు వేరు వేరు పేర్లు పెట్టారని .వీరంతా సత్యం కు ప్రతి రూపాలని సత్యం ఒక్కటే నని చెప్పింది .అదే ‘’ఏకం సత్ విప్రా బహుదా వదంతి ‘’అంటే సత్యం ఒక్కటే .ప్రవక్తలు వివిధ నామాలు పెట్టారు .

పేజి -157,పేరా -1

ఏడవ అధ్యాయం లో చెప్పినట్లు అనిశ్చిత సూత్రం లేక సిద్ధాంతం (అన్ సర్టే నిటి ప్రిన్సిపుల్)అంటే అర్ధం ఖాళీ స్థలం కూడా వాస్తవిక ,అవాస్తవిక అంటేకణాలు ,ప్రతికణాల జంటలతో నిండి ఉంటుంది అనటం లో ఇబ్బంది  వస్తోంది .ఈ కణాలకు అనంత శక్తి ఉండి ఉండాలని ,అందువలన అయిన స్టీన్ ప్రసిద్ధ  సిద్ధాంతం E=mc2 ప్రకారం వాటికి అనంత ద్రవ్య రాశి ఉండి ఉండాలి .గురుత్వాకర్షణ బలంవిశ్వాన్ని  వక్రత చెంది౦చి అనంత చిన్న విశ్వాలుగా మార్చి ఉండచ్చు

వ్యాఖ్య –ఇదే శక్తి సిద్ధాంతం .అంటే శక్తియే జగత్ సృస్టి కారణం  .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-1-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సంఘం – బందా వేంకట రామారావు

IMG_20160106_111413

Posted in కవితలు | Tagged | Leave a comment

ఇసుక నేలపై పరిగెత్తిన ప్రాజెక్ట్ క్రికెట్ ”థౌజండ్ వాలా ”,ప్రతి రోజూ ఒక కొత్త సంవత్సరమే

Inline image 1

Inline image 2

Inline image 1

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ చిత్తం -15 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -15

 

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

కాల శరం (ది యారో ఆఫ్ టైం)

పేజి -145-పేరా 2

కాలం తో ఎంట్రోపిలేక రుగ్మతలేక కల్లోలం  అనేది’’ కాలశరం’’ కు ఒక ఉదాహరణ .ఇది గతానికి, భావిష్యత్తు కూ విభజన రేఖగా ఉంటుంది .కాలానికి  మార్గ నిర్దేశం చేస్తుంది .

ఇది దేర్మో డైనమిక్స్ లో రెండవ సూత్రాన్ని అనుసరిస్తుంది –ఆ సూత్రం ‘’మూసేసిన వ్యవస్థ లేక ఎంట్రోపి కాలం తో బాటు పెరుగుతుంది ‘’

శాస్త్రి గారి వ్యాఖ్యానం –ఈ వాక్య నిర్మాణమే విడ్డూరంగా ఉంది .అది ఇలా ‘’మూయబడిన ఏ వ్యవస్థలోనైనా రుగ్మత లేక ఎంట్రోపి,ఎప్పుడూ కాలం తో పెరుగుతుంది ‘’అని ఉండాలి. భారతీయ సాహిత్యం ముఖ్యంగా వేదాంత సాహిత్యం మానవ శరీరానికి ఒక భావ యుక్తమైన మంచి నిర్వచనం చెప్పింది .అదే శరీరం.దీని నిర్వచనం  –‘’శరావత్ గచ్చతే ఇతి శరీరః ‘’  అంటే బాణం లాగా దూసుకు పోయేది .అందుకని హాకింగ్ శాస్త్ర వేత్త ఈ అధ్యాయానికి ‘’కాల శరం ‘’అని పేరు పెట్టాల్సింది .

పేజి 146,పేరా- 1

ఒక వ్యవస్థ ఆదేశింప బడిన అతి తక్కువ స్థాయి నుండి ప్రారంభ మైనదని అనుకొంటే ,కాలం గడిచిన కొద్దీ ఆ వ్యవస్థ సైన్సు సూత్రాలనాధారం గా మార్పు చెందుతుంది (ఇవాల్వ్ ).దాని స్థితి మారుతుంది మరి కొంతకాలం తర్వాత ఆ వ్యవస్థ ,ఆదేశించినదానికంటే అస్త వ్యస్తంగా కల్లోలంగా  మారే అవకాశం ఉండచ్చు .ఎందుకంటె ఇంకొన్ని ఇలాంటి స్థితులే ఉన్నాయికనుక . ఈ వ్యవస్థ మొదట్లో ఒక ఉన్నత ఆదేశానికి విదేయం గా ఉండి ఉంటె ఈ రుగ్మత కాలాన్ని బట్టి పెరుగుతుంది .

వ్యాఖ్య –ఈ చర్చచూడటానికి  చాలా సాధారణమైనదే అనిపించినా చాలా నైరూప్యమైనది (ఆబ్ స్ట్రాక్ట్)ఈ  పరిస్థితిని వేదం గుర్తించి చర్చించింది .పురాణాలు అనుసరించాయి .ఇక్కడ యజుర్వేద రుక్కును తెలియ జేయాలి .ఈ రుగ్మత లేక అస్త వ్యస్త త అంటే రాక్షసులే .దీన్ని దర్శ పూర్ణ మాస యజ్ఞం,సోమయాగాలలో చర్చించారు .యజుర్వేదం లో ఈ మంత్రం మరలమరల వస్స్తుంది

‘’యో ఆస్మాన్ ద్వేష్టి యంచ వయం ద్విష్మా ‘’భావం –మనల్ని ద్వేషించే శత్రువు ,మనం  ద్వేషించే శత్రువే .

నిజానికి  దీన్ని యజుర్వేదం గుర్తించింది ,ఋషులు అనుసరించారు .అందుకే ప్రతి వైదిక కర్మ శాంతి కోసమే. అశాంతి అస్తవ్యస్థత కల్లోలం  రూపు మాపటమే . దీని మహర్షులు గుర్తించారు ,విశ్వ౦ పై దయ చూపించే దేవుడే శంకరుడు .అస్తవ్యస్త రుగ్మతా స్థితియే రుద్రుడు. దేవతలు ఆదేశాలు .అసురులు ఎంట్రోపి..లేక రుగ్మతలేక కల్లోలం  .సృష్టి ప్రారంభం లోనే ఈ ఇద్దరికీ నిర్దిష్ట విధులను ఆదేశించారు .ఇదే హయ్యర్ ఆర్డర్ –అంటే ఉత్తమ స్థితి .దీని తత్వాత రాక్షసులు ఘోర తపస్సు వలన బ్రహ్మాది దేవతలవరాల వల్ల శక్తి వంతులయ్యారు .చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు అప్పుడు విష్ణు మూర్తి దగ్గరకు  పరిగెత్తటం,ఆయన జోక్యం చేసుకోవటం ఉండనే ఉంది. దీనిపై చెప్పాల్సింది చేటలలో చాలా ఉంది .

పేజి -147 పేరా-2

కంప్యూటర్ మెమరీ రెండు స్థితులలో ఏదో ఒకదానిలో ఉండే మూలకాల తో కూడిన వ్యవస్థ .చిన్న ఉదాహరణ –అబాకస్ –అంటే పిల్లలు లెక్కలు నేర్పించే చిన్న పూసల చట్రం.అతి సాధారణంగా ఇందులో అనేక  తీగలు ,ప్రతి తీగమీద ఒక పూసా ,దాన్ని ఒకటి లేక రెండు స్థానాలలో జరిపే వీలు ఉంటుంది .కంప్యూటర్ మెమరి లో ఒక విషయాన్ని రికార్డ్ చేసేముందు అది రుగ్మతలేక అస్తవ్యస్త లేక కల్లోల స్తితిలో ఉ౦టుంది.ఒక అంశాన్నికంప్యూటర్ మెమరి లో   రికార్డ్ చేసే ముందు  సమాన సంభావ్య స్తితుల కోసంరెండు స్థితులలో ఉండి ,మెమరీ విస్మరణ స్థితిలో ఉంటుంది  .అబాకస్ తీగలమీద పూసలు చెల్లా చెదరుగా ఉంటాయన్నమాట .సిస్టం తో గుర్తుంచు కోవలసిన దానితో మెమరి అనుసంధానమైన తర్వాత  వ్యవస్థ రెండిటిలో  ఏదో ఒక స్థితిలోకితప్పకుండా  వచ్చేస్తుంది . అబాకస్ పూసలు తీగలపై ఎడమ లేక కుడి వైపు చేరిపోతాయని అర్ధం .కనుక జ్ఞాపకశక్తి  లేక మెమరి ఒకానొక అస్తవ్య స్థితి నుండి ఆదేశించే స్థితిలోకి వస్తుంది .మెమరీసరైన స్థితిలో నే ఉంచటానికి కొంత శక్తిని వినియోగించాలి (పూసలను కదిలించటానికి ,కంప్యూటర్ కు శక్తిని అందించటానికి లాగా ) .ఈ శక్తి చెదరిపోయి ఉష్ణం గా  మారి ,విశ్వం లో రుగ్మతను,కల్లోలాన్ని  మరింత పెంచుతుంది . ఆదేశిత  మెమరీ కంటే ఈ అస్తవ్యస్థత ఎక్కువగా ఉంటుంది. ఈ విధం గా కంప్యూటర్ కున్న కూలింగ్ ఫాన్ వెలువరించే ఉష్ణంఅంటే  ఒక సారి కంప్యూటర్ మెమరీ లో రికార్డ్ అయ్యాక ,విశ్వం లోని మొత్తం రుగ్మత కల్లోలం మరింత పెరుగుతుంది .కంప్యూటర్ గతాన్ని జ్ఞాపకం చేసుకొనే కాల మార్గం ఆ స్థితిలో ,రుగ్మత పెరిగే దానితో సమానం గా ఉంటుంది

శాస్త్రి గారి భాష్యం –ఈ భావాలన్నీ మన పురాణాలలో ఉన్నవే. సృష్టికర్త లేక చతుర్ముఖ బ్రహ్మ దేవాసురలను  అంటే ఆర్డర్ మరియు డిసార్దర్ లను సృష్టించాడు .రాక్షసులు తపస్సు చేస్తే   డిసార్డర్ పెరిగి ప్రపంచం లో ఉష్ణం పెరిగిపోతుంది .పురాణాలు ఈ ఉష్ణాన్నే ప్రపంచాన్ని కాల్చటం గా భస్మం చేయటం గా  చెప్పాయి .దీనితో సువ్యస్థితం ఉన్నది అస్తవ్యస్తమై పోతుంది కల్లోలానికి గురౌతుంది .దేవతలు  అంటే సువ్యవస్థ విష్ణువును చేరి రక్షించమని ప్రార్ధిస్తారు .విష్ణుమూర్తి ఏదోఒక అవతారం దాల్చి ,అవ్యవస్త కున్న  మూల రూపాన్ని,కారణాన్ని  ధ్వంసం చేసి  మళ్ళీ వ్యవస్థను సుస్థిరం చేస్తాడు .అందుకే విష్ణు మూర్తి అవతారాలు అనంతం .అందులో దశావతారాలు చాలా ముఖ్యమైనవి. కపిల ,వేద వ్యాస మొదలైన మహర్షులు విష్ణువు  అవతార స్వరూపులే .

పేజి -148,పేరా -2

సాధారణ సాపేక్ష సిద్ధాంతం  విశ్వం ఎలా ప్రారంభమైందో  ఊహించ  లేక పోయింది .కారణం సైన్సుకు తెలిసిన అన్ని సూత్రాలు బిగ్ బాంగ్ సింగులారిటి(ఏకత్వ ) సిద్ధాంతం తో తుడిచి పెట్టుకు పోయాయి .

వ్యాఖ్య –దీన్ని మనం ఆత్మ యొక్క ‘’సంకల్ప పూర్వస్తితి ‘’అన వచ్చా ?హాకింగ్ దీనినే ప్రీ డెసిషన్ స్టేజ్ – అన్నాడు అంటే అప్పుడు సైన్స్ సూత్ర్రలేమీ లేవన్న మాట .ఆత్మ అంటే సృస్టికర్తయేఅని ఇది వరకే చెప్పుకొన్నాం .ఆయనే సూత్రాలను ,శాస్త్రాన్ని చేస్తాడని ఉపనిషత్తులు ఉద్ఘోషి స్తున్నాయి .వీటిని ఉపనిషత్తులు కవితాత్మకం గా ‘’సో అకామయత ,బహుస్యాం ప్రజయేత్’’అన్నాయి .  భావం –ఆత్మ అనేకాన్ని సృజించాలలను కొన్నది అంటే ఏక రూపం బహురూపం కావాలని భావించింది .ఈ నిర్ణయానికి లేక భావనకు ముందు ఆత్మఒకటే ఉంది ,రెండవది ఏదీ లేదు  .బహురూపంగా విస్తరించాలన్న   ఆత్మ సంకల్పం సైన్స్ సూత్రాలు అనుసరించాయి  ఈ సూత్రాలు లేక పొతే సృష్టి కి అవకాశం లేదు .సృష్టి తనతో సూత్రాలను తెచ్చుకొంటు౦ది .లయం అయిఅనప్పుడు తన తో పాటు తీసుకొని వెడుతుంది .

పేజి -152,పేరా -3

ఏమైనా మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ,  ఆహార రూపం లో ఉన్న కనీసం వెయ్యి కేలరీల సువ్యవస్తిత  ఉష్ణాన్ని ,అవ్యవస్థిత శక్తి గా నే చుట్టూ ఉండే గాలి నుంచి గ్రహించి  వేడి ,చెమట రూపం లో మార్చి ఉంటారు  , ఇది విశ్వం లో ఇరవై మిలియన్ మిలియన్ మిలియన్ మిలియన్ యూనిట్ల రెట్లు  అవ్యవస్తను ఏర్పాటు చేసి ఉంటుంది . ఈ పుస్తకం లోని ప్రతి విషయాన్నీ నువ్వు గుర్తుంచుకోవాంటే   నీ బుర్రలో పది   లియన్ మిలియన్ మిలియన్ రెట్ల డిసార్డర్,కల్లోలాన్ని   పెంచుతుంది .

శాస్త్రిగారి మహా భాష్యం –ఇది సైన్సు చెప్పిన విషయం కనుక మనం తప్పక నమ్మాలి .ఇదే విషయాన్ని మన పురాణాలు చెప్పాయంటే నమ్ముతామా ?.ఇంతకీ అవి ఏం చెప్పాయి ?’’ఎవరైనా తపస్సు చేస్తుంటే ప్రపంచం లో వేడి పెరిగి అవ్యవస్థ మౌతుంది .సువ్యవస్థ కు రాజైన ఇంద్రుడు అప్సరసలను పంపి ,ఆ ఉష్ణానికి కారణమైన దానిని నాశనం చేసి ,అవ్యవస్తను కూల్చేస్తాడు సంస్కృతం లో అప్సర అంటే నీటి ప్రవాహం .వేద విజ్ఞానం యెంత గొప్పదో యెంత ఆలోచనా పరమైనదో దీని వలన తెలుస్తోంది .మహర్షులు తపస్సు చేస్తున్నా ఈ వేడి పుట్టి జగత్ సంక్షోభానికి కారణమవుతుంది .దీనిని అఆపటానికి కూడా  నీరే కావాలి . ఈవేడికి అగ్ని పర్వతాలు బద్దలౌతాయి సముద్రాలు పొంగుతాయి ,దిక్పాలకులు ఒణుకుతూ బెదిరి పోతారు .వీటినిచిత్రాలుగానూ చూసే ఉంటాం   . మునుల తపస్సును అప్సరసలు ఆపలేక పొతే ,తనకంటే బ్రహ్మజానులైన వారిని ఇంద్రుడే దిగి వచ్చి నచ్చ చెప్పటం తెలుసు మనకు .రాక్షసుల తపస్సు వేరొక రకం .వారికి ఇంద్రుని కూలద్రోసి .అవ్యవస్తను కల్లోలాన్ని కలిగించి ఇంద్రపదవి పొందటం అనే ఆశతో తపస్సు చేస్తారు  .వీళ్ళ తపో భంగాని కి  అప్సరసల అంద చందాలు ,కులుకు ఒయ్యారాలు ఏవీ పనిచేయక అప్సరసలే’’ నీరు కారిపోతారు’’.అప్పుడువిశ్వ  సృస్టికర్తే దిగి వచ్చి ఆ పాపాత్ములముందు రాజ దండం తో ఒంగి వాళ్ళు కోరిన వరాలిచ్చి సంతృప్తి పరుస్తాడు  జగత్కల్లోలాన్ని తగ్గిస్తాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-1-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేమోటాలాజి పిత పుస్తకావిష్కరణ సరసభారతి ఉయ్యూరు

కేమోటాలాజి పిత పుస్తకావిష్కరణ

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ  -ఉయ్యూరు

 

నేను రాసిన ”కెమో టాలజి పిత కొలచల సీతారామయ్య కొలచల సీతారామయ్య (పుల్లేరు నుండి ఓల్గా దాక )పుస్తకాన్ని శాసన మండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర  ప్రసాద్ సౌజన్య సహకారాలతో సరస భారతి ఆధ్వర్యం లో ముద్రించి,జనవరి చివరి 25వ తేది సోమవారం ఉదయం 10 గం లకు ఉయ్యూరు ఏ జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాలలో ,కాలేజీ తో సంయుక్తంగా నిర్వ హిస్తున్న సభలో   ఆవిష్కరిస్తున్నామని తెలియ జేస్స్తున్నాను . కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు ,డా శ్రీ జి వి పూర్ణ చంద్,’’భారత్ టుడే’’ప్రధాన సంపాదకులు శ్రీ జి వల్లీశ్వర్ ,’’హ్యాం రేడియో’’నిర్వాహకులు శ్రీ సూరి శ్రీరామ మూర్తి దంపతులు ,సీతారామయ్య గారి బంధువులు ,మరెందరో ప్రముఖులు పాల్గొనే  ఈ సభకుసాహిత్యాభిమాను లందరూ   విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

కొలచల సీతారామయ్య

”పుల్లేరు కాలువ  ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి1918లో  కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కస్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దానివలన  ఏమీరాబడి లేకుండానే  అతని దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ  హీనంగా భావించ కుండా  చేస్తూ శ్రద్ధగా  చదివి   కెమిస్ట్రిలో  మాస్టర్  డిగ్రీపొంది ,అ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి, అభి వృద్ధి చెందుతున్న రష్యా  దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశం తో రష్యా చేరి,ఓల్గా తీరం లోని  మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు, పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమోటాలజి ,””ఫాదర్ ఆఫ్ ట్రైబో  కేమిస్ట్రి ”బిరుదులు  పొంది, సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42రోజులు మాత్రమే ఉండి,రష్యాలో ఉన్నా   మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని జీవితాంతం రాష్యాలోనే గడిపిన ఉయ్యూరుకు చెందిన సాహసి ,చరిత్రదృష్టిలో  పెద్దగా పడని ”అజ్ఞాత మార్గ దర్శి”    ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన  ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతారామయ్య గారి జీవిత ప్రస్థానమే ”పుల్లేరు నుండి ఓల్గా దాకా ”

పూర్తీ వివరాలతో  ఆహ్వాన పత్రిక  ఒక వారం తర్వాత అంద  జేస్తాం –దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు -6-1-16-ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

27వ విజయవాడ పుస్తక మహోత్సవం లో 5-1-16 మంగళవారం సాయంత్రం శ్రీ అరవిందుల సావిత్రి పై ”highlights in Savitri ఆంగ్ల గ్రంధా విష్కరణ ,”బుచ్చి బాబు శత జయంతి” సభా దృశ్యాలు

27వ విజయవాడ పుస్తక మహోత్సవం లో 5-1-16 మంగళవారం సాయంత్రం శ్రీ అరవిందుల  సావిత్రి పై ”highlights in Savitri ఆంగ్ల గ్రంధా విష్కరణ ,”బుచ్చి బాబు శత జయంతి” సభా దృశ్యాలు

విజయవాడ పుస్తక మహోత్సవం లో 7-1-16గొల్లపూడి ,శంకరనారాయణాదులు వండి వడ్డించే నవ్వుల విందు

 

 

 

 

 

navvula vindu 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మౌన గురువు రమణ మహర్షి

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమిత్ కు షాకు ?సింగపూర్ బౌద్దాలయాలు

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వదువులకోసం దూర తీరాలకు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాకలు తీరిన కమ్యూనిస్ట్ బర్దన్ ,7గురు అమర వీరులు

Inline image 1
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పఠనం వ్యసనం కావాలి ,పఠాన్కోట పాఠాలు

Inline image 1
 
 
Inline image 2

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ భయంకర్ రచనలు

sakshi ysr boidata scan0009

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment