ఉయ్యూరు బ్రాహ్మణ సంఘం – వన సమారాధన


kbhojanam 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆత్మా సమానత్వం సాధించటం ఎలా ?అరవింద యోగి తనకున్నదానితో సేవ -ఆది శంకరులు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బెజవాడ కృష్ణానదిపై ఐకాన్ బ్రిడ్జి తెలుగు రాష్ట్రాలకు పర్యావరణ షాక్

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

100 ఏళ్ళ తర్వాత చెన్నైలో భారీ వర్షం -సర్వం మునక

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -95

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -95

41-ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ చేసిన -విలియం బట్లర్ యేట్స్-2(చివరిభాగం )

కవిత్వాన్నే మాధ్యమంగా ఎంచుకొని విలువైన ,ముందు చూపున్న కవిత్వం రాశాడు .ముప్ఫై ఏళ్ళు వచ్చేసరికి ఆరు కవితా సంపుటాలు రాసి ప్రచురించాడు .పుస్తకాలు స్లిమ్ గా ఉన్న అందులోని కవితాసారం బలమైనది గా ఉంది .కొన్ని ప్రతీకలకు మాత్రమె పరిమితమైనాడు .’’sentimentality is deceiving one;s self ,rhetoric is deceiving other people ‘’అనేది యేట్స్ అభిప్రాయం .34వయసులో ‘’దివిండ్ అమాంగ్ ది రీద్స్ ‘’ప్రచురించాడు ఇందులోనూ ఏదో ‘’ట్రాన్స్ ‘’లో ఉండి రాసినట్లు అనిపిస్తుంది కవిత్వం .

‘’All things uncomely and broken ,all things worn out and old –the cry of a child by the road way ,the creeak of a lumbering cart –the heavy steps of the ploughman ,splashing the wintry mold –are wronging your image that blossoms a rose in the deeps of my heart ‘’

ఇంకా మానవాతీత శక్తి ప్రభావాన్నే వివరిస్తున్నాడు .తన జీవిత కధను ‘’ది సాంగ్ ఆఫ్ వాన్దరింగ్ ఏగ్నెస్ ‘’ అనే సంగీత నాటిక  లో రాసుకున్నాడు .

‘’I went out to the hazel wood –because a fire was in my mind –and cut and peeled a hezel wand –and hooked a berry to a thread –and when white moths were on the wing –and moth like stars were flickering out –I dropped the berry in a stream –and caught a little silver trout ‘’

నలభైలలో ప్రచురించిన ‘’రేస్పాన్సి బిలిటీస్’’,’’ది వైల్డ్ స్వాన్ ఎట్ కూలే ‘’కవితల్లో మార్పు కొట్టొచ్చినట్లు కన్పించింది .ప్రభావ శీలమైన కవిత్వం జాలువారింది .విషయానికి పరిమితమై రాశాడు .ఈ మార్పును స్వయంగా ‘’లేబిరింత్ ఆఫ్ ఇమేజెస్ ‘’లో చెప్పుకొన్నాడు –

‘’I made my song a coat –coveredwith embroideries-out of old mythologies –from heel to throat ‘’అని యదార్ధం ఒప్పుకున్నాడు .మానసిక సత్యమేకాక ఆధ్యాత్మిక నమ్మకం కావాలనుకొన్నాడు .

దెయ్యాలు లేక శక్తులు లేక స్పిరిట్స్ ను ఆహ్వానించి వారినే ‘’కమ్మ్యూని కేటర్’’లుగా భావించి యేట్స్ భార్యా భర్తలు ఎన్నో రాయించారు.ఇవన్నీ కలిపి ‘’ది విజన్ ‘’పేర 52వ ఏట విడుదల చేశాడు .దీని రెండవ భాగం ప్రచురించే నాటికి యేట్స్ సమాజంలో మహా గౌరవనీయ వ్యక్తీ అయ్యాడు .ఐరిష్ ఫ్రీ స్టేట్ కు ఆరేళ్ళు సెనేటర్ గా సేవలందించాడు .ఆయన అనుసరిస్తున్న గోప్యత(ఈసోటేరిక్) వలన రాజకీయాలకు ,కవిత్వానికి ఏ ఇబ్బందీ కలగ లేదు  .పైగా బాగా కలిసొచ్చింది కూడా .1923లో సాహిత్యం లో యేట్స్ నోబెల్ బహుమతి పొందాడు .ఆయన ఒక ప్రపంచానికి మాత్రమే పౌరుడు కాదు. రెండు ప్రపంచాల పౌరుడు .అవి ఒకటి కనిపించే ప్రపంచం ఒకటి మనకు కనిపించని ఆయనే చూడగలిగే మార్మిక ప్రపంచం .యాభై- అరవై మధ్య వయసులో రాసిన కవిత్వం అత్యంత విలువైనది అవసరమైనది మార్గ దర్శకమైనది గా ఉంది .అంతకు పూర్వం లేని సాధికారత కవిత్వం పై సాధించాడిప్పుడు .కనిపించని దయ్యాలు ఫైరీ టేల్స్ ,పుక్కిటి పురాణాలు వదిలేసి ప్రజలు తక్షణ సమస్యలపై స్పందించి రాశాడు .మొదట్లో  ప్రీ రాఫల్డై ట్  గా ఉన్నప్పుడు తన ముఖాన్ని అంతులేని తారాసమూహం లో దాచుకొన్నాడు .ఇప్పుడు మానవ రక్త సంబంధం తో అమితానందం పొందుతున్నాడు .ఈ స్తితిని చెప్పుకొంటూ ‘’I am content to follow to its source every event in action or in thought ‘’.

‘’ఏ డైలాగ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ సోల్ ‘’కవితలో తన్ను తాను  ఆవిష్కరించుకొన్నాడు –

‘’When such as I cast out remorse –so great a sweetness flows into the breast we must laugh and we must sing –we are blest by every thing –every thing we look uponis blest ‘’సాంస్కృతిక జాగృతిని తన మాతృదేశం ఐర్ లాండ్ కు ఇచ్చిన ఘనత యేట్స్ కవి ది .’’Romantic ireland’s dead and gone –it is with O’Leary in the grave ‘’అని చెప్పాడు .మర్యాద, మన్నన గౌరవం తన దేశం లో మంట గలిసి పోయినందుకు వ్యధ చెందాడు .కోపం ద్వేషం అసహనం అందలం ఎక్కినందుకు బాధ పడ్డాడు .అందుకే కవిత్వం లో హెచ్చరిక జారీచేశాడు –

‘’you thinkit horrible  that lust and rage-should dance attendance upon  my old age –they were not such a plague when I was young –what else have I to spur me into song ?అని ప్రశ్నించాడు .ఇప్పటిదాకా ఉన్న ఊహా ప్రపంచం కుప్ప కూలి పోయింది వాస్తవం బోధ పడింది .ఐర్లాండ్ కు దూరంగా రపల్లోఅనే చిన్న పట్నంఇటాలియన్ రివేరా   లో  ఉన్నాడు .ఇది దక్షిణ ఫ్రాన్స్ లో ఉంది .యూరప్ పర్యటన చేశాడు .అక్కడి విలువల పతనాన్ని సహించలేక పోయాడు .’’things fall apart –centre can not hold ‘’అని ఆవేదన చెందాడు .మెరుపులతో ‘’సెకండ్ కమింగ్ ‘’రాసి విభ్రాంతి కలిగించాడు .

చనిపోయే దాకా యేట్స్ రాస్తూనే ఉన్నాడు .ఆయన చివరి ముఖ్య రచన ‘’బైజా౦టి యం’’.ఇందులో కవితా ప్రతిభ అంతా ప్రదర్శించాడు .కవిత్వార౦భంఎలా ఉండాలో మచ్చుకి చూపించాడు ఇమేజెస్ ఎలా వాడాలో అత్యద్భుతంగా వాడి చూపాడు .70వ ఏట శారీరకంగా బలహీనుడయ్యాడు శ్వాసపీల్చటం కష్టమయ్యేది .బాధలు ఎక్కువయ్యాయి. తానిక బతకటం కంటే చావటమే నయం అని భార్య కు చెప్పుకొన్నాడు .1938 చివర్లో చలి ఎక్కువగా లేక పోయినా చలికి  తట్టుకోలేక పోయాడు .జనవరిలోతీవ్రంగా  గుండె జబ్బు వచ్చింది .కోమాలో ఉన్నాడు .చివరికి గుండె ఆగి 28-1-1939న 74వ ఏట  ఈ ఐరిష్  స్వాతంత్ర యోధుడు మహాకవి  సెనేటర్ మరణించాడు .

యేట్స్ మరణానంతరం ఆయన జీవిత చరిత్రలు చాలా వచ్చాయి .ఆయన సింబాలిజం పై అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి .ప్రముఖ విమర్శకుల చేత రాయించిన ఇరవైనాలుగు  వ్యాసాల ను ‘’దిపెర్మనెన్స్ ఆఫ్ యేట్స్ ‘’పేరిట వెలువడింది .జాన్ కరో రామ్సన్ ‘’యేట్స్ అండ్ హిస్ సింబల్స్ ‘’పుస్తకం రాశాడు .ఆయన కవిత్వం ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది .యువకవులపై యేట్స్ ప్రభావం అనంతం .సమకాలీన కవిత్వాన్ని తన స్వంత శైలి,గాఢత్వాలతో పరిపుష్టి చేశాడు .ఏది రాసినా మహోన్నత భావం తో చెప్పి మెప్పించిన కవి యేట్స్ .

నిప్పులు కురిపించే కవిత్వం రాసిన అమెరికన్ కవి ఎజ్రా పౌండ్ కు యేట్స్ సన్నిహితుడు .రవీంద్రుని ఆంగ్ల గీతాంజలికి యేట్స్ ముందుమాట రాశాడు .ఇంగ్లాండ్ కవులు స్పెన్సర్ షెల్లీ  ప్రీ రాఫెలైట్స్ ల ప్రభావం ఉన్నవాడు . పోను పోను  వాస్తవానికి చాలా  దగ్గరగా భౌతిక పరంగా రాశాడు .

1899లో యేట్స్ దంపతులు మిత్ర బృందం తోకలిసి ‘’ఐరిష్ లిటరరీ దియేటర్ ‘’స్థాపించారు . “We hope to find in Ireland an uncorrupted & imaginative audience trained to listen by its passion for oratory … & that freedom to experiment which is not found in the theatres of England, & without which no new movement in art or literature can succeed.”[51]

అని దీని మేనిఫెస్టో రాశాడు యేట్స్ .రెండేళ్ళ తర్వాత ఇది మూతపడింది .1909లో లండన్ లో అమెరికన్ కవి ఎజ్రా పౌండ్ ను కలిశాడు అప్పటినుండి వారి స్నేహం చివరివరకు ఉంది .

నోబెల్ ప్రైజ్ ను స్వీకరిస్తూ యేట్స్ కవి   “I consider that this honour has come to me less as an individual than as a representative of Irish literature, it is part of Europe’s welcome to the Free State.”[66] ‘’అని తన మనోభావాన్ని తెలియ జేశాడు .స్వతంత్ర ఐర్లాండ్ దేశం ఏర్పడిన తర్వాతమైనారిటి ప్రొటెస్టెంట్ లకు మెజారిటీ కేధలిక్కులకు మధ్య విద్వేషాలు పెరిగాయి. దీనికి సమాధానం గా సెనేట్ లోనూ బయటా యేట్స్ అద్భుత ప్రసంగాలు చేసి చారిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సాధించాడు ఆయన మాటలలోనే –‘’  “quixotically impressive” ambitions of the government and clergy, likening their campaign tactics to those of “medieval Spain.”[71] “Marriage is not to us a Sacrament, but, upon the other hand, the love of a man and woman, and the inseparable physical desire, are sacred. This conviction has come to us through ancient philosophy and modern literature, and it seems to us a most sacrilegious thing to persuade two people who hate each other … to live together, and it is to us no remedy to permit them to part if neither can re-marry.”[71] ఇది ఆయన సాధించిన అద్భుత విజయం .

తన సమాధి మీద తన కిష్టమైన తన కవితా పంక్తులను చెక్కించే ఏర్పాటు చేశాడు

– Cast a cold Eye
On Life, on Death.
Horseman, pass by!.

ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ కవులలో యేట్స్ అతి ముఖ్యకవి .’’సింబలిస్ట్ పోయేట్’’గా గుర్తింప బడ్డాడు .ప్రతి పదానికి పైకి కనిపించే అర్ధం కంటే లోపలి అంతరార్దా లను ఆవిష్కరిస్తూ కవిత్వం రాయటం యేట్స్ ప్రత్యేకత .ఫ్రీ వెర్స్ తో  కదను తొక్కుతూ ఆధునిక కవులు ఉంటె సాంప్రదాయ బద్ధమైన కవిత్వం తో జిగేల్ మనిపించాడు .మొదట్లో ఐరిష్ మిత్ అండ్ ఫోక్ లోర్ ప్రభావం తో రాసినా తర్వాతజనం తో మమేకమై రాశాడు .కొందరు విమర్శకుల దృష్టిలో యేట్స్ 19 వ 20వ శతాబ్దాల కవిత్వ వారధి .హిందూ  దియసాఫికల్ భావాలను మంత్రాలు తంత్రాలను నమ్మినవాడు ‘’డ్రీమర్ ఆఫ్ డ్రీమ్స్ .’’అంటారు ఆయనను .జార్జి మూర్ పై ప్రభావం చూపాడు .బెర్నార్డ్ షాను తన’’జాన్ బుల్ ‘’అనే నాటకానికి పని చేయించాడు .నాటక ప్రయోగాలతో మాంచెస్టర్ ప్లేయర్స్ ను ఆకర్షించాడు .అమెరికా ,యూరప్ లలో చిన్న దియేటర్ నిర్మాణానికి ప్రోత్సహించాడు. నాటక రంగానికి ఐరిష్ ఇంగ్లిష్ నటులు ప్రముఖులనే కాక ,ఆక్స్  ఫర్డ్ కేం బ్రిడ్జి , హార్వర్డ్  సోఫిస్టికేట్స్ ను కూడా వాడుకోవటం యేట్స్ ప్రత్యేకత .

 

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హనుమంతుడు గొప్ప గూద చారి లోకకల్యాణా నికి పాటుపడని వారు వ్యర్ధులు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జాతీయ వాదానికి పరీక్షా సమయం -వైఫై ని తలదన్నే లైఫై

Inline image 1
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనంత ఒడిలో మమతల తల్లి -గతుకు బాటలో బతుకు వేట

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -94

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -94

41-ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ చేసిన -విలియం బట్లర్ యేట్స్

‘’కవులు గుర్తింపబడని ప్రపంచ శాసన సభ్యులు ‘’అన్నాడు షెల్లీ కవి .ఆమాటను నిజం చేశాడు అక్షరాలా యేట్స్ కవి .అయన కవి ,కవితా నాటక కర్త , ,స్వతంత్ర ఐర్లాండ్  దేశానికి సెనేటర్ గా 1922నుండి 1928వరకు సేవ చేశాడు .ఇలా షెల్లీ మాట నిజం చేశాడు .

విలియం బట్లర్ యేట్స్ ఐర్లాండ్ లో డబ్లిన్ దగ్గర సాండి మౌంట్ లో 13-6-1865లో ప్రొటెస్టెంట్ కుటుంబం లోజన్మించాడు .తాత ముత్తాతలు ఆంగ్లికన్ మినిస్టర్లుగా పని చేశారు .తండ్రి జాన్ ప్రముఖ ఆర్టిస్ట్ .,సోదరుడు జాక్ ప్రసిద్ధ చిత్రకారుడు .వీరిద్దరి ప్రభావం విలియం పైన ఉంది .19వ ఏట డబ్లిన్ లోని మెట్రోపాలిటన్ ఆర్ట్ స్కూల్ లో చేరాడు .చిత్రకారుడు టర్నర్ దగ్గర పని చేసి కొంత నేర్చినా ద్రుష్టి రచనమీదే ఉండేది .చివరికి తన భావ వ్యక్తీకరణకు బ్రష్ కంటే పెన్ను బాగా సహకరిస్తుందని నిశ్చయించుకొని రాతకే మొగ్గు చూపాడు .

విలియం యవ్వనం ఇంగ్లాండ్ –ఐర్లాండ్ మధ్యనే గడిచింది .పదకొండేళ్ళ వయసులో లండన్ దగ్గరున్న హామర్ స్మిత్ లోని గోడాల్ఫిన్ స్కూల్ లో చేరాడు . కాని .తన దేశం లో తనకిష్టమైన స్లిగో కు తిరిగి వెళ్లాలని కోరుకున్నాడు .జీవితం లో ఎక్కువ భాగం స్వదేశానికి దూరం గా గడిపినప్పటికీ మాతృదేశం ఐర్లాండ్ పై ఎప్పుడూ మక్కువతో ఉండేవాడు .22వయసులో లండన్ వెళ్ళాడు .అక్కడ ఎర్నెస్ట్ రైస్ తో కలిసి ‘’రైమర్స్ క్లబ్ ‘’స్థాపించాడు .ఇది ప్రీ రాల్ఫ డైట్ ల భౌతిక భావ వ్యాప్తికి అడ్డు కట్ట  వేసి ,ధార్మిక భావ వ్యాప్తికోసమే  ఏర్పాటు చేయబడింది  .ఈ వయసులో బక్కగా పలుచగా ఎత్తుగా ఉండేవాడు .ముఖం చిన్నదిగా ,మిరుమిట్లుగొలిపే కళ్ళతో ఉండేవాడు .

శీతాకాలం లో ఈ క్లబ్ కు వచ్చి మేధో సదస్సులలో పాల్గోటమే కాక వెచ్చదనాన్నీ పొందేవాడు విలియం .గుర్రం మీద డబ్లిన్ నుండి లండన్ కు వెళ్ళటానికి చేతిలో డబ్బులు లేక అనేక సార్లు నడిచి వెళ్ళే వాడిని అని  ఆయనే చెప్పుకొన్నాడు .మధ్యాహనం ‘’టీ’’కి ఎవరో స్నేహితుల మీద ఆధార పడే వాడు .వీలయితే వారి ఆతిధ్యం పొంది భోజనం చేసేవాడు .ఇంకేవిధమైన పోషకాహారం తీసుకొనే ఆర్ధిక స్తితి లేనివాడిగా గడిపాడు .ఆస్తికతను ఒక జీవిత విధానం గా అలవరచుకొన్నాడు . యవ్వన దశలో హక్సిలీ ,తిండాల్ ల  మెటీరియలిజం అంటే ఇష్టపడే వాడు కాదు .తన స్వీయ జీవిత చరిత్ర లో ‘’నేనుకవిత్వ విధానం అనే  ఒక కొత్తమతాన్ని కనిపెట్టాను .అనేక తరాలుగా కవులు కళాకారులు తత్వ వేత్తలు అందించిన విజ్ఞాన రహస్యాలను చిన్న కధలుగా చెప్పాను .ఈ భావ వ్యాప్తికోసం ఒక ప్రపంచం నిర్మించాలనుకొన్నాను .’’అని రాసుకొన్నాడు .

యేట్స్ కొత్త మత అన్వేషణ లో సగం అభూతకల్పన ,సగం మాజిక్ ఉన్నాయి .అందుకని దియసాఫిస్ట్ లకు దగ్గరయ్యాడు .1887లో రష్యా దేశపు మార్మిక వేత్త  మేడం బ్లావట్ స్కి కి శిష్యుడైనాడు . ఆమె చేసేదంతా అభూత కల్పనా అని రుజువైనా యేట్స్ కు ఆమె పై విశ్వాసం తగ్గలేదు .పుష్పాలలో దెయ్యాలని ఆహ్వానించటం ,తలక్రింద ప్రత్యేక దిండులను ఏర్పరచి కళలు కనమని చెప్పి వాటి అర్ధాలను వివరించేవాడు. ఈ జబ్బును తోటి క్లబ్ సభ్యులకూ  అంటించాడు..పంచేంద్రియాలకు అతీతమైన దేదో ఉందని చెప్పేవాడు . మెటీరియలిజానికి వ్యతిరేకంగా ఈ పని చేస్తున్నాడు .అద్భుతకధలన్నిటినీ నమ్మింప జేసేవాడు .చిన్ననాటి జానపద కధలనూ వండి వడ్డించేవాడు .ఇవన్నీ తన జీవితం లో కన్న కలలే అనేవాడు .

సహజంగా సిగ్గు పడే విలియం హృదయం   ఆత్మ స్పర్శకు ,ఈ కల్పిత కధలకు మధ్య విలవిలలాడిందికొంతకాలం  .దేనికి సమాధానం చెప్పాలో అర్ధంకాలేదు .ఈ ద్వంద్వాలలో ఊగిసలాడాడు   .తనకాలం లో పెరుగిపోతున్న మెటీరియలిజానికి బ్రేకులు వేయటమే యేట్స్ ఉద్దేశ్యం .ఈ ఊహా ప్రపంచమే లేక పొతే తానేదీ రాయగలిగి ఉండేవాడిని కానన్నాడు .’’సెల్టిక్ రివైవల్ ‘’ఉద్యమం వచ్చేసరికి విలియం లో స్పిరిటిజం తో బాటు జాతీయతా భావం కలిసి పోయాయి .ఐర్లాండ్ లో రెండు మహా ఉద్యమాలు మొలకెత్తాయి .అందులో 1893లో ఐరిష్ ప్రాచీన సాహిత్యాధ్యయనం పునరుద్ధ రించాలని ,గేలిక్ ను జాతీయ భాష గా చేయాలని   ప్రారంభమైన ‘’గేలిక్ లీగ్’’ఉద్యమం ,  తర్వాత కొన్నేళ్ళకు  మెరుగైన  వ్యవసాయం ,వర్తక వాణిజ్యం ,మెరుగైన జీవితం కోసం ,మొదలైన ‘’సహకార ఉద్యమం ‘’.ఈ రెండు ఉద్యమాలు ఐరిష్ జాతీయ సంస్కృతీ వికసనం కోసమే ఏర్పడ్డాయి .

ఈ ఉద్యమాలలో ఐరిష్ కవులు ,జానపద గేయ కర్తలు కళాకారులు ,విద్యావేత్తలు ,ఆర్ధిక సామాజిక వేత్తలు ,వ్యవసాయదారులు నిపుణులు అందరూ చేయి చేయి కలిపి పని చేశారు .జార్జి రసెల్ ‘’ఏ యి ‘’అనే మారుపేరుతో కవిత్వం రాసి ప్రేరణ కలిగించాడు .ఈ మహోద్యమాలలో తానూ మమేకంయ్యాడు యేట్స్ .ఉద్యమాలు తీవ్ర రూప దాల్చి తీవ్రవాదమైంది .ఉద్యమాన్ని అణచి వేసే ప్రయత్నాలూ తీవ్రంగా సాగాయి .తిరుగుబాటు ప్రతిచోటా తీవ్రమైనది.కొద్దిమందితో ప్రారంభమైన ఉద్యమం దేశమంతా ప్రాకింది .ఐరిష్ పునరుద్ధానం విప్లవం తో ముగిసింది .కవుల రక్తతర్పణం తో ‘’ఐర్’’ఏర్పడింది .గేలిక్ లీగ్ సంస్థాపకుడు ,కవి డగ్లాస్ హైడ్ ఐర్లాండ్ కు మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యాడు .

ఐరిష్ సాహిత్యం  దియేటర్ లోనూ మార్పు తెచ్చింది .దీనిలో యేట్స్ ప్రవేశించి,లీనమై  చలనం తెచ్చాడు .బౌద్ధిక ఉద్యమం లో చురుకుగా పని చేసిన మాడీ గానే అనే అమ్మాయిని యేట్స్ ప్రేమించాడు .ఆమెనే దృష్టిలో పెట్టుకొని నాటకాలు రాశాడు .అంతరార్ద నాటకాలు రాసి ప్రఖ్యాతి చెందాడు .క్రమంగా ఐరిష్ కవులలో మార్గ దర్శి అనిపించుకున్నాడు .పారిస్ లో జే. ఏం .సిన్జ్ అనే నాటక రచయితనుకలిసి ‘’ఆరన్ ‘’అనే ఆదిమ జాతి ప్రదేశానికి ,ఆ ప్రజల మధ్యకు తిరిగి రమ్మని పిలిచాడు . బైబిల్ ను వారి భాషలోకి అనువాదం చేయించాడు ఆయనతో .ఐరిష్ జాతీయాలను పలుకు బడులను అందులో చొప్పించి రాయించాడు .

Inline image 1    సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 27-ఉదయ రాజు గంగాధర కవి

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

27-ఉదయ రాజు గంగాధర కవి

దత్తాత్రేయ చంపు రాసిన ఉదయ రాజు దత్తాత్రేయుని కుమారుడే’’మద్ర కన్యా పరిణయ చంపు  ‘’రచించిన గంగాధర కవి . ఇతని కొడుకు లక్ష్మణ భోజరాజు అసంపూర్తి ‘’ రామాయణంచంపు  ‘’పూర్తీ చేశాడు .కరీం నగర్ జిల్లా శనిగరం నివాసి .నియోగి బ్రాహ్మణుడు ఇప్పటికీ ఈకుటు౦బం వారు కరీం నగర ,వరంగల్ జిల్లాలో ఉన్నారు .

‘’మద్ర కన్యా పరిణయం ‘’5 ఉల్లాసాల కావ్యం .శ్రీకృష్ణుడికి బృహత్సేనుడి కుమార్తె లక్ష్మణకు జరిగిన వివాహ వృత్తాంతం ఇది .కావ్యాన్ని కవి –‘’కళ్యాణ మవ్యహతమాతనేతు సంవ్యాన లీలా క్రుద భూద్రజస్యః-కర్ణానిలేనాహృతేంశు కాంతే,యో వల్లభాయాఃస్మిత పల్లవేన ‘’అంటూ ప్రారంభించాడు .తన తండ్రి దత్తాత్రేయ గురించి కొంత చెప్పాడు .కావ్యాన్ని పూర్తీ చేస్తూ –

‘’నందావా నిందావా మత్క్రుతి రేషాద్యయత్క్రుతోత్పన్నా –శైశవ వాణీవ పితుః నంద తనూజస్య నందినీ భూయాత్ ‘’

28-మహా మహోపాధ్యాయ మానవల్లి గంగాధర శాస్త్రి (1854-1914)

19వ శతాబ్దం లో మహా పండితకవి అని పించుకొన్న మానవల్లి గంగాధర శాస్స్త్రి సింహ శాస్స్త్రి కుమారుడు  కర్ణాటకలోని బెంగుళూరు దగ్గర యాసర గుట్ట లో 1854లో జన్మించాడు .తండ్రితో బాటు కాశీకి కుటుంబం వలస వెళ్ళి’’కావ్యాత్మ సంధానం’’రాశాడు తండ్రి దగ్గర ,రాజా రామ శాస్త్రి ,బాలశాస్స్త్రి ల వద్ద విద్య నేర్చాడు .1879లో కాశీ కాలేజిలో 25ఏళ్ళకే సంస్కృత ఆచార్యుడయ్యాడు 1887లో విక్టోరియా రాణీ జూబిలీ మహోత్సవాలలో మహా మహోపాధ్యాయ బిరుదు పొంది సన్మానం అందుకొన్నాడు .1914లో మరణించాడు  గంగాధరుని ఏడుగురు శిష్యులూ మహా మహోపాధ్యాయ బిరుదాన్కితులవటం ఆ గురువు విద్యా పాటవానికి మహా గొప్ప ఉదాహరణ .

గంగాధర శాస్త్రి –‘’వాక్య పదీయం ,’’వైయాకరణ సిద్ధాంత కౌముది ‘,ప్రౌఢ మనోరమ ,’’,శబ్ద రత్న ,’’,శాస్త్ర సిద్ధాంత లేశ సంగ్రహం ‘’,తత్వ బిందు ‘’,న్యాయ మంజరి ‘’,గౌతమ న్యాయ సూత్రాలు ,జైమిని మీమాంస సూత్రాలు ,కుమారిల భట్టు ‘’తంత్ర వార్తిక ‘’,లౌకిక న్యాయ సంగ్రహం ,జగన్నాధుని రసగంగాధారం వంటి ఉద్గ్రంధాలకు సంపాదకత్వ బాధ్యత త్తీసు కొన్నాడు

స్వయంగా ‘’అలి విలాసి  సంలాప’’గంగాధర శతకం ,తనగురువులైన రాజారామ శాస్త్రి ,బాల శాస్త్రి ల జీవిత చరిత్రలు రాశాడు .ఇన్నిటిలో లభ్యమైనది ఒక్క ‘’అలి విలాసి సంలాపం ‘’మాత్రమె .ఈ ఖండ కావ్యం లో 9 శతకాలున్నాయి .వెయ్యి శ్లోకాల సమాహారం .దీన్ని 1908లో రాసినట్లు చెప్పాడు .అనేక విభిన్న విషయాలను వీటిలో చెప్పాడు .తన ఉద్దేశ్యమేమిటో ఉపోద్ఘాతం లో చెప్పాడు .మొదటి శతకం శివుని గూర్చి చెప్పినది .-‘’విద్యా విద్యాత్ ఏవ యత్ర సతతం వేద్యో యో రాగిణాం-యమ వైద్యం మనసా ప్రపద్య విషత్యయా లేష్వభీకా బుధాః’’మంచి ఆలోచన రేకెత్తించే సుందర శ్లోకాలురాశాడు .-‘’సఫల్లవా న్తాంతవనోప యుక్తా మనర్హ పుష్పా వసరాభి సారం –శ్రితాం సుసంపన్నరవంశకుంతే  రిచరాత్త తారుణ్య ఫలామిమాందికం ‘’

గంగాధర కవి రాసిన ‘’హంసాస్టకం ‘’కు సోదరుడు రామశాస్త్రి తైలాంగ్ వ్యాఖ్య రాశాడు .ఇందులో శివునిపై ఉన్న మంచి శ్లోకం ఒకటి

‘’యః షండ వక్త్ర గజాననా ద్భుతా విష్కారణావ్యంజితా—అచిన్త్యో త్పాదన వైభవాం గిరి సుతాం మాయాంనిజంకే దధత్ ‘’

ఈ అష్టకం లో రెండు అర్ధాలు వచ్చేటట్లు రాశాడు హంస అంటే మానస సరోవర హంస అని ఒక అర్ధం ,హంస అంటే ఆత్మ అని మరో అర్ధం రెండినీ సమన్వయము చేస్తూ ప్రతిభావంతంగా రూపొందించాడు .ఇందులోని రెండు శ్లోకాలు చూద్దాం –

‘’బ్రహ్మాహం సత్స్వ రూపం చితి సుఖ మవిదన్ మాయయా క్షిప్య మాణా-తత్సంప కాన్రిపత్యై శరణ ముప గతః సద్గురూం జ్ఞాత వత్వం ‘అని మొదలుపెట్టి –

‘’శ్రావం శ్రావం తదుక్తిస్చిర తర మననా పాస్తదుస్తర్క జాలః –సాక్షాత్కారైక శోషా ద్విగలితనిఖిలోపప్లవో హంస ఏవ ‘’

ఆసుకవిగా ప్రఖ్యాతుడైన గంగాధర శాస్త్రి ఉత్తర భారతం లో ఎన్నోసంస్కృత  శతావధానాలు నిర్విఘ్నం గా నిర్వహించి కీర్తి గడించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కాలాన్ని జయించిన మహా మనీషి గురజాడ -వేదగిరి రామ్ బాబు మార్చింగ్ సాంగ్ -మహాప్రస్థానం

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగమేశ్వరాలయం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వామపక్షాల మహా డైలమా ,కవిత్వం వ్యాపార పరత్వం

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిలువుగాళ్ళ పై చెంచులు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సింగర్ జంట

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గురజాడ దిద్దుబాటుకు విప్లవ కద కవితలు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 24-కృష్ణ మూర్తి కుమార

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

24-కృష్ణ మూర్తి కుమార

మంజులాచార్య అనే కృష్ణ మూర్తి కుమార  వశిష్ట గోత్రీకుడైన సర్వజ్ఞపండితుని కుమారుడు .’’వల్లవీ పల్లవోల్లాస భాణ’’కర్త .పల్లవ శేఖర ,రస లాలితల మధ్య ప్రేమ సంబంధాన్ని తెలియ జెప్పేది ఇదే పేరు మరో భాణం రాశాడు శిస్టుకృష్ణమూర్తి కూడా ..క్రిష్ణమూర్తిభాణాన్ని సింహాచల వరాహ నరసింహ స్వామి వస౦ త ఋతు ఉత్సవాలలో ఆడేవారు .కవికూడా విశాఖ జిల్లా లేక గోదావరి జిల్లా  వాడై ఉంటాడు .శిస్టుకవికంటే ముందువాడు అయి ఉండాలి .

కృష్ణ మూర్తి కవి తన భాణ రచనను ‘’శ్రీకాంతా తవ జీవితం ఖలు తతో వక్షః స్తలే లక్ష్యతే –నై కాంతా మయి చిత్త వ్రుత్తి రిహ బుద్వోతిముగ్దా గతిః’’అనే శ్లోకం తో ప్రారంభించాడు .ఇందులో ఉన్న  భావోద్వేగాలను నాందీ వాక్యానంతరం తెలియ జేశాడు .-‘’అద్రుత స్థన మండలం స్వ వపుషా ముచ్చూ వాస లీలా పుషా –మున్మీల ద్రతి లాభ మీలిత దృశా ముత్దాన నభేద స్ప్రుశం ‘

తన వంశం గురించి ఆరు శ్లోకాలలో కవి చెప్పుకొన్నాడు .సూర్య పండితునికి బుచ్చయా చార్య ,వెంకట పండిత ,సర్వజ్ఞపండిత కుమారులని ,,సర్వజ్నుని కొడుకు మంజులాచార్య అంటే తానేనని చెప్పాడు .తన రచనా వైభవాన్ని ,శైలిని గురించి ఘనంగా చెప్పుకొన్నాడు –‘’క్కచిత్ ప్రసూన కేసర ప్రసూన వల్లరీ లల-న్మాదూలికా నిరర్లక్షర జ్జ్హారీ సహోదరీ

కచిత్ప్రభిన్న దంత దాన మారుతా విల –భ్రమాత్కరాభ్రదంత దంభ బుమ్హితో రువైశ్వరీ ‘’ రసలాలతిక అనే నాయిక గురించి వచనం లో వర్ణించాడు .-‘’సంప్రతి సకల వారచకోర లోచనా జన మాస్ట కన్యస్తు మణిః-కుఛ వసుంధరా ధర సముల్లల ద్వదు రాజ్ఞాన శంకః కారణాచసరస రముక్త మణిః-కటీ తటసమారూఢ సారశన చారుతహీర ఘంటికసరద్రుణిః-కామన జన మోహపారావార రసలాలతికాయా యవీయసీ ‘’.ఈ ప్రేమ కదా నాగ పురం అనే కల్పిత నగరం లో జరిగినట్లు,ఆపుర వర్ణనా చేశాడు .

25-తడకమళ్ళ కృష్ణ మార్య(18 వ శతాబ్దం )

18 వ శతాబ్దానికి చెందిన తడక మల్ళకృష్ణ మార్య కవి ‘’తారావళి ‘’అనే లఘుకావ్యం రాశాడు .27శ్లోకాలలో ఉన్న శ్రీరామ స్తుతి ఇది .  1879లో రాసిన ‘’ద్రుగ్గణితం’’లో కవి వివరాలున్నాయి .రంగరాయ ,కనకా౦బలు పెంపుడు తలిదండ్రులు .అసలు తలిదండ్రులు కుట్టిమాంబ ,రంగ రాయలు .సోదరుడు వెంకన్న పండితుడుచిత్తూర్ జిల్లా  కార్వేటినగరం పాలకుడు  బొమ్మ రాజు ఆస్థాన మంత్రి .కవి తెలుగు సంస్కృత ఆంగ్ల మళయాళ భాషలలో మహా పండితుడు .నుంగం బాకం కేలండర్ తయారు చేయటానికి ప్రోత్సహించాడు .ఇప్పుడు కవి గారి రెండు శ్లోకాలు చూద్దాం –

‘’శ్రీవాస వత్స చిహ్నా౦చిత వక్షస్థల ధారా సుతా జానే –త్వమహి దయా దృష్ట్యా మందాక్రాంతం రక్షమాం దయాశరదే ‘’

రత్న కిరీట ధరా చ్యుత రామానంత ముకుంద దయాశరదే –కిమసౌ శనిరివ కిం కురుతే మాం పరిపాలయ దాశరధే ‘’’

శ్రీరాముని దయా ,కృపా వుంటే శని కూడా ఏమీ చేయలేడు అనే నిశ్చల మనస్సును ఆవిష్కరించాడు .

26-రంగ రాజు కేశవ రావు (—1904)

రంగ రాజు కేశవరావు జననం ఎప్పుడో తెలియదుకాని మరణం 1904..వరంగల్ జిల్లా ఖిలశాపురం వాసి .ఈత తప్ప సకల కళా ప్రపూర్ణుడు..పర్షియన్ ఆరబిక్ లతో బాటు చాలా భాషలలో లోతైన పాండిత్యం ఉంది .గొప్ప వీణా వాదనా నిపుణుడు..మంచి చిత్రకారుడు కూడా .సంగీతం పై వివిధ భాషలలో పుస్తకాలు రాశాడు .నవాబ్ ఇఖాబలుద్దౌలా బహదూర్ ఈయనకున్న పార్సీ భాషా పాండిత్యానికి కవిత్వానికి మెచ్చి  ‘’కవి శిరోమణి ‘’బిరుదునిచ్చి సత్కరించాడు .కవి వైష్ణవుడు .వివిధ దేవతలపై స్తోత్రాలు సంస్కృతం లో రాశాడు .అందులో ‘’శఠ కోప స్తుతి ‘’ఒకటి వేదాంత దేశికుని పై 62శ్లోకాలు రచించాడు .తన గురువు హనుమకొండ నివాసి అయిన  నృసింహా చార్య పై 24 శ్లోకాలు చెప్పాడు .భుజంగ ప్రయాత వృత్తం లో 12శ్లోకాలో గురు స్తుతి చేశాడు .సంస్కృతం లో చాలా పెద్ద గ్రంధాలు రాశాడు .కాని అచ్చుకాలేదు .భుజంగ ప్రయాతం లో నృసింహ గురు స్తుతి –

‘’పయోజాసనస్తం క్రుతాన్జల్యుపేతం స్ఫురద్రను భాసం స్ఫుటాబ్జ చ్చాద దక్షం

స్తితంవక్త్రుకామో వివ్రుత్యేవ వక్త్రం హనుమద్గిరీశం భజే భాష్యకారం .’’

27-ఇంద్రకంటి కొండయ

ఇంద్రకంటి నారాయణ అంచమ  పుత్రుడు కొండయ .పుట్టిన తేదీ కాలం అలభ్యం .కాశ్యప గోత్రం .నెల్లూరు తూర్పు గోదావరి జిల్లాలో ఇంద్రకంటి  వారున్నారు. బహ్వ్రచ శాఖకు చెందినవాడు ‘’మహేశ్వర మానస మహోత్సవం ‘’,శృంగార రస భ్రున్గారం అనే ఉద్గ్రంధాలు రాశాడు  మొదటిది శివాలయాలలో అర్చన విధానమంతా వర్ణించి చెప్పాడు .దీని నకలును కొడుకు లింగభట్టు రాశాడు

‘’తత్పుత్రేణైవ లిఖితా లింగ భట్టేన సూరిణా  –తాద్రుశేన  మహేశస్య పూజా మానసికీ శుభా ‘’అని కొడుకు చెప్పుకొన్నాడు

రెండవ రచన ‘’శృంగార రస భ్రున్గారం ‘’భాణం.శ్రీశైల ఉత్సవాలలో ప్రదర్శించేవారు .నాందీ ప్రస్తావన లో మల్లికార్జున స్వామి స్తుతి –

‘’కైలాసం పరిహృత్య శైల సుతయా సాకం గణేశ్చస్వయం –శ్రీ శైలేత్ర హి మల్లికార్జున ఇతి ఖ్యాతో స్తి సర్వేశ్వరః ‘’

శృంగార రస భ్రున్గార నామకం రూపకం సతాం –ఏషామభి నినీషామిరిరి౦జయిషయా హృదః ‘’

28-కోదండ రామయ్య

ఎక్కడ ఎప్పుడు పుట్టాడో కోదండ రామయ్య ఎవరికీ తెలియదు. బొబ్బిలి లో నివసించాడని భావిస్తారు .’సూర్య శతక ‘’కర్త గా గుర్తుండి పోయాడు

‘’శ్రియా సమేతం శ్రిత పారిజాతం వియత్ప్రదీపం వితత ప్రతాపం –నయ ప్రచారం నగ రాజ ధీరం దయా సముద్రం తపనం నమామి ‘’

తేజో మయే మండల మధ్య భాగే సి౦హా సనే రత్న మయేబ్జపీఠే-ఆశీ నము గ్రాయుధ దీప్ర హస్తం చాయాపతిం చండకరం  నమామి ‘’

సూర్య శతకాన్ని ముగిస్తూ చెప్పిన శ్లోకం –

‘’కోదండ రామార్య కృత స్తుతిం యేపఠింత శ్రుణ వంతిచ భక్తీ యుక్తాః-తేషాం శ్రియం పుత్రా కళత్ర సౌఖ్యం ,స్వర్గం చ మోక్షం దిననాద దేహి ‘’అని దీన్ని రాసినవారికిభక్తిగా  చదివినవారికి భార్యా బిడ్డలతో కలకాలం సౌఖ్యం పొంది చివరకు మోక్షం  ప్రసాదించమని సూర్య దేవుడిని వేడుకొన్నాడు .

సశేషం

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -29-11-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృష్ణ విశ్వవిద్యాలయం -మచిలీపట్నం -మూడవ స్నాతకోత్సవ ఆహ్వానం -ముఖ్య అతిధి -డా నోరి దత్తాత్రేయుడు

krishna university 1 001 ku2 001 ku3 001 bapu1 001 bapu2 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

భాషా ప్రామాణికత నేటి ఆవశ్యకత

భాషా ప్రామాణికత నేటి ఆవశ్యకత

– ఆచార్య వెలుదండ నిత్యానందరావు 944166688123/11/2015

కవిగా, పండితునిగా, పరిశోధకునిగా, అధ్యాపకునిగా సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు. 87 ఏళ్ళ వయస్సులోనూ ఆయన రచనా దాహం తీరలేదు… రోజుకు ఐదారు పేజీలయినా చదువకుండా, రాయకుండా ఉండలేని ఆయన పట్టుదల యువతరానికి సదా స్ఫూర్తిదాయకం. పురాణేతిహాసాలు, ప్రబంధ కావ్యాలనుండి కాకుండా జానపద గ్రామీణ ఇతివృత్తాల్ని స్వీకరించి నవ్య ప్రబంధ రీతి కవిత్వం రాశారు. వీటిలో సమకాలీనతని ప్రతిబింబించారు. మూలమెరిగి గ్రంథ పరిష్కరణ చేసిన కొద్దివారిలో వీరొకరు. సృజనాత్మక పరిశోధనా పాండిత్యం జమిలి చిరునామా వీరు. ప్రాచీన గ్రంథ పరిష్కరణలో అందె వేసిన చేయి. ఓనాడు ‘్భరతి’ పత్రికలో వీరి రచన పడని సంచికలు తక్కువ. వార్ధక్యం వీరి వెంటే ఉన్నా అది ఆయన సాహిత్య సంకల్పం ముందు వాలిపోయిన నీడే.
విశ్వవిద్యాలయాల కావల, నగరాల ఛాయ పడని పాలమూరు జిల్లా నాగర్‌కర్నూలులో ఉంటూ తానే ఒక సాహిత్య కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ కవి, రచయిత డా. కపిలవాయి లింగమూర్తి గారితో ఒకరితో ఒకరు.
==================
మీరు కృషిచేసిన సాహిత్య ప్రక్రియల గురించి వివరించండి…
మా తాతగారి తండ్రి కాలంనుంచే మా ఇంట్లో పెద్ద గ్రంథాలయం ఉండేది. మా మేనమామ గారైన పెద్ద లచ్చయ్య గారికి సాహిత్యంలో ప్రవేశం ఉండేది. వారి సాహచర్యంవలన నాకు రచనా వ్యాసంగం, సాహిత్యం అబ్బింది. నాకు ఏ పద్యమైనా పాఠమైనా ఒకసారి కంఠతా చదవగానే వచ్చేది. నేను పదునాలుగవ యేట మొట్టమొదట పాటలు రాశాను. తర్వాత పద్యాలు వ్రాయడం మొదలు పెట్టాను. వ్రాసిన మొదట పద్యం మా మేనమామగారికి చూపించగా ఆయన బాగుందన్నాడు. దానితో నేను వ్రాయడం ప్రారంభించినాను. నేను సాహిత్యంలోని ఇంచుమించు అన్ని ప్రక్రియలలో కృషి చేశాను – పద్యం, గద్యం, గేయం, వచనాలు, శతకం, కథ, నవల, కావ్యం, ద్విపద, నాటకం, చరిత్ర, ఉదాహరణం బాలసాహిత్యం, సంకీర్తనం, బుర్రకథలు, హరికథలు, సంకలనం, అనువాదం, పీఠికలు రాసే అవకాశం లభించింది. వానిలో 80 ముద్రితాలు, 30 అముద్రితాలు ఉన్నాయి.
మీరు రాసిన శతకాల్లో ఇతరులు చెప్పని వినూత్నత ఏమిటి…?
నేను 13 శతకాలు వ్రాసినాను. ప్రతి శతకంలో ఓ కొత్తదనం ఉంది. పాండురంగ శతకం ఏకప్రాస, ఏకవృత్తాత్మకం. తిరుమలేశ శతకం ధ్వనిపూర్వకమైన అధిక్షేపశతకం. భర్గ శతకంలో అన్ని పాదాలలో ఒకే యతి ఉంటుంది. దుర్గ శతకం స్ర్తివాచకమైన ఆటవెలదిలో స్తుత్యాత్మకంగా అలంకారాలను వివరించాను. సాయి త్రిశతి అని మూడు గేయ శతకాలు. ఇవి మూడు మూడు రకాల ఛందస్సులతో – షిర్డి సాయి రామరామ శతకం, పర్తిసాయి శతకం, భజగోవిందం పద్ధతిలో, ప్రేమ సాయి శతకం తోహర పద్ధతిలో కూర్చినాను. సుందరీ సందేశం స్ర్తి వర్ణనాత్మకమైన నిర్మకుట శతకం. ప్రాచీన కావ్యాల్లో ఉండే స్ర్తి వర్ణనలన్నీ సీస పద్యాలుగా కూర్చినాను.
అన్నింటికంటే చెప్పదగింది ఆర్యా శతకం ఇది చిత్ర పది. ఇదో ప్రత్యేకమైంది. దీనిలోని శబ్ద చిత్రమే ఆ పదం చెప్పే అర్థాన్ని వ్యంజిస్తుంది. ఈ శతకాలలో వచ్చిన నూరు పద్యాలు వచ్చిన చిత్రం మళ్లీ రాకుండా ఉంటాయి. ఇట్టిది ఇంతవరకు తెలుగు సాహిత్యంలో రాలేదు. ప్రబంధాలలో వసుచరిత్ర శతకాలలో నా ఆర్యా శతకం ప్రత్యేకమైనవి.
మాంగల్య శాస్త్రం రాశారు. వాటి విశేషాలు వివరించండి..
స్వర్ణ శకలాలు తెలుగు సాహిత్యంలోని 90 కావ్యాలలో ఆయా కవులు ప్రస్తావించిన స్వర్ణ్భారణాలను విశ్వకర్మలను గురించిన పద్యాలను తీసుకొని వాటిని గుణ దోష పూర్వకంగా చెప్పాను. మాంగల్య శాస్త్రం వ్రాయడానికి పుణ్యక్షేత్రాలలో ఉండే శిల్ప భంగిమలు, వాటికున్న ఆభరణాలు, దేవతావిగ్రహాల ఆభరణాలు ఆయా ప్రాంతాల స్ర్తిలు ధరించే ఆభరణాలు, పురాణాలు కావ్యాల్లో ఉండే ఆభరణాలకు వ్యాఖ్యానాలు అన్నీ సేకరించి ఆభరణాలపై సమగ్ర గ్రంథం చేయడానికి ప్రయత్నించాను. ఇవన్నీ బొమ్మలతో ఉన్నాయి. ఇది భారతీయ ఆభరణాలపై వచ్చిన సమగ్రమైన గ్రంథం.
మూడు తరాల విద్యా పరిణామం ఎలా ఉంది?
చదవాలి. వ్రాయాలి. అర్థం చేసుకోవాలి. చదువంటే చదివే నాటికీ పుస్తకం చదువుతుంటే ధారాళంగా చదివేవారం. చదివింది అర్థం చేసుకొని చెప్పేవారం. అప్పటికి వారి పరిశీలనా శక్తి, విజ్ఞానతృష్ణ అద్భుతంగా ఉండేవి.
నేను కళాశాలలో చదువు చెప్పేనాటికి (1972-83) కూడా విద్యార్థులకు ఆసక్తి ఉండేది. వారు గురువులు చెప్పేది శ్రద్ధగా వినేవారు. వారు కూడా ఇప్పుడు మంచి రంగాలలో స్థిరపడ్డారు. ఆనాటి వాళ్లకు నిరంతరం చదవాలి, రాయాలి, రాసినదాన్ని దిద్దుకొందామన్న తపన, ఆరాటం ఉండేది. ఇపుడే మేం రాసిందే గొప్ప, అదే ప్రమాణం అనే అహంకారం, అజ్ఞానం ప్రబలింది. భావపరిణతి, భాషాప్రామాణ్యం లుప్తమయాయి. చదువుకు మూడు దశలు 1. శాస్తద్రృష్టం, 2. గురుర్వాక్యం, 3. ఆత్మనిశ్చయం. ఏ విషయమైనా మొదట గురువులతో వినవలె. ఆ తరువాత దాన్ని తన పాఠంలో అనగా శాస్త్రంలో చూచుకోవలె. గురువుగారు చెప్పింది, శాస్త్రంలో ఉన్నది ఒక్కటేనా కాదా అని తర్కించుకున్నాక అప్పుడు తాను ఒక నిశ్చయానికి రావలె. కాని ఈనాటివారికి శ్రుతపాండిత్యం అనగా వినికిడి జ్ఞానం తప్ప పఠనజ్ఞానం లేదు. చదువు అనేది వౌఖిక క్రియ – ఈనాడు ఎంతో గొప్ప డిగ్రీ కలవారైనా తెరచి గొంతెత్తి ధారాళంగా చదవలేకపోతున్నారు. దానికి కారణం – అది అభ్యాసంలో లేకపోవడమే. అట్లాగే ఉక్తలేఖనం (డిక్టేషన్) అంటే మనం చెప్పింది చెప్పినట్లు అక్షరదోషం లేకుండా రాయలేకపోతున్నారు. దీనికి కూడా కారణం అలవాటు లేకపోవడమే. కాబట్టి చదువు, వ్రాత, వినటం అనే మూడు సమానంగా సాగవలెను. విషయం అర్థం కావడంతోనే సరిపోదు. అది భావితరానికి అందించవలెనంటే అతనికి సరైన భాషలో నిర్దుష్టంగా కాగితం మీద పెట్టడం కూడా రావాలి గదా.
సాహిత్య లోకానికి అవసరమైన మీ పరిశోధనాత్మక రచనలేమిటి?
కావ్యగణపతి, కళ్యాణ తారావలి, స్వర్ణ శకలాలు, రుద్రాధ్యయం, హనుమత్సందేశం, పామర సంస్కృతం, మంగల్య శాస్త్రం, పాలమూరు జిల్లా దేవాలయాలు, భాగవత కథాతత్వం యయాతి చరిత్ర వ్యాఖ్యానం ముఖ్యమైనవి.
మహబూబ్‌నగర్ జిల్లా కవి పండిత వంశాల గురించి చాలా విస్తారంగా రాశారు కదా. వాటి వివరాలు చెప్పండి. మరి అది పుస్తక రూపంలోకి ఎందుకు రాలేదు. ఇది 1978-83 నాటి సంగతి. బహుశా కొన్నింటికి నేను లేఖకుడిని కూడా కావచ్చు. రాత ప్రతి ఉందా పోగొట్టుకున్నారా? సంస్థలు కానీ, వ్యక్తులు కానీ ముందుకు వస్తే ప్రచురించడానికి అవకాశమిస్తారా?
ఒకే వంశంలో ఎక్కువగా కవులున్న కుటుంబాలను తీసుకొని దాదాపు 230 పండిత వంశాలను గురించి వ్రాసినాను. వాటిలో వట్టె నంబివారు, పల్లావారు, తెల్కపల్లి రామచంద్రశాస్ర్తీ కుటుంబీకులు, సంబరాజు వంశస్థులు, వెల్లాలవారు మొదలైన వారెందరో ఉన్నారు. దీని మూలప్రతి పోయింది. కాని చాలావరకు వ్యాసాలు ‘పరిశీలన’ అనే స్థానిక పత్రికలో వచ్చినాయి. వాటన్నింటినీ సేకరించి ఎవరైనా పుస్తకంగా ప్రచురిస్తామంటే ఆనందంగా అంగీకరిస్తాను.
చరిత్ర పరిశోధనలో మీ ప్రత్యేకత ఏమిటి?
స్థానిక చరిత్రలు ఇంకా వెలుగులోనికి తీసుకురావాలి. ప్రముఖ రాజుల చరిత్రలు గాక సామంతుల చరిత్ర కూడా అధ్యయనం చేయాలి. రాజుల వంశాలు, శాసనాలు వివరాలు అన్ని చోట్ల లభిస్తాయి. ఎలాగూ అవి ప్రజలందరికీ తెలుస్తాయి.
నేను ఎక్కడికివెళ్లినా స్థానిక చరిత్రలు, ప్రజల నోళ్ళలో నానుతున్న చరిత్రలు, కథలు అన్ని సేకరించి గ్రంథస్థం చేసినాను. పాలమూరు జిల్లా దేవాలయాలు, ఇంకా చాలా వ్యాసాలో స్థానిక చరిత్ర వివరించాను. ఈ తరం దాటిపోతే గ్రామాల స్థానిక చరిత్ర కూడా మనకు లభించదు. ఈ చరిత్ర సేకరణలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. కొంతమంది వ్యక్తులు వివరాలు చెప్పడానికిష్టపడేవారు కాదు. పాలమూరు జిల్లా దేవాలయాలు. మహాక్షేత్రం, మామిళ్ళపల్లి, సోమేశ్వర క్షేత్ర మహత్మ్యం, భైరవకోవ మహాత్మ్యం, ఉమామహేశ్వర కథ నేను రాసిన స్థానిక చరిత్రల్లో ముఖ్యమైనవి.
సామెతలు, మాండలిక పదాలు సేకరించారు కదా. ఇవి కేవలం పాలమూరు జిల్లాకు చెందినవేనా? మొత్తం తెలంగాణకు వస్తుందా? దీని స్ఫూర్తిగా ఇతర జిల్లాలవారు కృషి చేయవచ్చా?
నేను గోలకొండ పత్రిక చదివినపుడు ఆ భాష అంత శుద్ధ వ్యావహారికంగా ఉండేది. దానితో నాకు జానపదుల భాషలో రచనలు చేయవలెనని అభిలాష కలిగింది. అప్పటినుండి అంటే దాదాపు 50 సంవత్సరాల నుండి పదాలు, సామెతలు, జాతీయాలు సేకరించడం మొదలుపెట్టాను. ఇవి దాదాపు 6000 పదాలు. ఇవి ప్రధానంగా పాలమూరు జిల్లాకు చెందినవే కానీ, ఇతర జిల్లాలో కూడా ఉండవచ్చు. దీనిలోని పదాలన్ని శబ్దర్థచంద్రికలో లేని పదాలే. దానికి అనుబంధంగా ద్వంద్వాలు, ఊతపదాలు, జాతీయాలు, భాషీయాలు, న్యాయాలు కూడా ఉన్నాయి. జానపదులు గుర్తించిన పక్షులు, అంగవికారాలు, న్యాయాలు ఇలా ఎన్నో సేకరించినాను. వీటన్నింటిని ‘పామర సంస్కృతం’ పేరిట ముద్రణకు సిద్ధం చేసిపెట్టాను.
వ్యాపారధోరణి, యాంత్రిక నాగరికత, ఆధునికత్వం ప్రబలిన నేటి కాలంలో ప్రాచీన సాహిత్య అధ్యయనంవల్ల, చారిత్రక పరిశోధనలవల్ల కలిగే ప్రయోజనమేంటి?
తెలుగు భాష తీయనైనది. తెలంగాణ భాషకు ప్రామాణికత ఏర్పరచుకోవాలి. వ్యాకరణం ఏర్పరచుకోవాలి. భాషల ప్రామాణికత ఉండాలి. ఎవరు ఏది ఎట్లా వాసినా సక్రమమే అంటే భాష పాడవుతుంది. నా దగ్గరకు పీఠికల కోసం వచ్చిన వారికి ముందు పూర్తిగా చదివి వారికి నాకు తోచిన సవరణలు, వివరణలు చెప్పిన తర్వాతే పీఠికలు వ్రాసినాను. ఈ రోజు పుస్తకాలలో భాషాదోషాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
భాషలో మాండలికలు ఉపయోగించాలి గాని భాషను ఖూనీ చేయరాదు. సూర్యనారాయణీయం అనే ఒక వ్యాకరణ గ్రంథం ఒకటి ఉంది. అది తెలంగాణ పద్యాల స్వరూప స్వభావాలను భాషా ప్రయోగాలను వివరించింది. ఇది నేటి తెలంగాణకు సరిపోతుంది. భాష విషయకంగా తెలంగాణ భాష చాలా స్వచ్ఛమైన భాష. మహబూబ్‌నగర్ జిల్లాలో సంస్థానాలు ఎక్కువగా ఉండటం చేత, పండితులు ఇక్కడ ఎక్కువగా వర్థిల్లడం చేత భాష రక్షించబడింది. ఈనాడు చాలామంది రచయితలకు ప్రూఫ్ రీడింగ్ చేత కావడంలేదు. అసలు శబ్ద స్వరూపం పట్ల దృష్టే లేదు.
అవశ్యం ఈ అంశాలను పరిశోధనకు స్వీకరిస్తే బాగుంటుంది అని మీరనుకొనేవి కొన్ని చెప్పండి…
తెలంగాణాలో జాగీర్లు, మక్తాలు చాలా వున్నాయి. వాటిపై పరిశోధనలు జరగాలి. వాటిని వెలుగులోనికి తెస్తే చాలా సాహిత్యం బయటకు వస్తుంది. చరిత్రకెక్కని గ్రామాలగూర్చి పరిశోధనలు జరగాలి. ప్రభుత్వం పనిచేపడితే బాగుంటుంది. గ్రామస్థుల సహకారంతో ఈ పని చేస్తే ఫలితాలు బాగుంటాయి.
మన డిండి (దింది)కీ చాలా పెద్ద చరిత్ర ఉంది. దాని కడుపునిండా ఎంతో చరిత్ర దాగివుంది. నేను చూడగానే దానిలో కలిసిపోయిన ఆలయాలు చాలా ఉన్నాయి. దాని వెంట కెయిరనలు (వీరగల్లులు)కు కూడా కొదువలేదు. దాని సమగ్రంగా బయటకు తీస్తే మన తెలంగాణ చరిత్రలో దుందుభీ తీర నాగరికత అని ఓ కొత్త అధ్యాయమే రాయవచ్చు. ఎన్నో కొత్త అంశాలు వెలుగులోకి రాగలవు. మహబూబ్‌నగర్ జిల్లా ఆవంచ, డిండి లాంటి ప్రాంతాల్లో చాలా గ్రామాలు పోయాయి. నాటి చరిత్ర బయటకు తీయగలగాలి.
మీ దృష్టిలో పరిశోధనలు ఎలా ఉండాలంటారు? ఎలా ఉన్నాయంటారు?
పరిశోధనలు అనేవి నాలుగు కాలాలకు నిలిచేవిగా ఉండాలి. పరిశోధన ఏదో పట్టా కోసం మొక్కుబడిగా కాకుండా ప్రామాణికంగా ఉండాలి. ప్రామాణికత అనేది నేడు పలుచనైపోయింది. ఈనాటి పరిశోధనలలో భాష, వస్తువు రెండు కూడా అపరిపక్వంగానే ఉంటున్నవి. ఇపుడు మనకు అలవాటు అయిన భాషను వాడుకుంటూనే దాన్ని పూర్తిగా తిరస్కరించకుండా తెలంగాణ భాష, పలుకుబళ్ళు, దేశ్య పదజాలాన్ని విరివిగా వాడుకుంటూ విస్తృతీకరించాలి. ఆంగ్లాది అన్యదేశ్యాలకు మాత్రం తెలుగు సమానార్థకాలు వాడడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ విషయంలో కన్నడ, తమిళ వాళ్ళకు ఉన్న పట్టుదల మనకు కూడా రావాలి.

కోరి కొలువైన కైలాసవాసుడు

04/06/2015

విజయనగరాన్ని విజయరామ గజపతి పరిపాలిస్తున్న రోజులల్లో నండూరి వెంక మ్మ తనకున్న పొలాన్ని పండిస్తూ కాలం గడుపుతోంది. ఒకరోజు పండిన ధాన్యాన్ని పురిలో భద్రపరచింది. ఆ రోజు రాత్రి ఆమె కలలో శివుడు కనిపించి తాను వీరరాజేశ్వరునిగా ఆ స్థలంలో వెలుస్తున్నానని, ధాన్యపు పరిలో తన ప్రతిరూపమైన శివలింగం నీకు కనిపిస్తుందని వెంటనే దానిని బయటకు తీసి అదే స్థలంలోప్రతిష్టించమని చెప్పి అదృశ్యమయ్యాడు.
ఆ మరునాడు వెంకమ్మ ధాన్యపు పురిలో వెదికింది. ఆ ధాన్యపు పురిలో కాంతులీనుతూ శివలింగం కనిపించింది. వెంటనే వెంకమ్మ విజయరామ గజపతి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా తెలియచెప్పింది. మహారాజు ఒక మంచిరోజున వీరరాజేశ్వరస్వామిని ప్రతిష్టించారు. అనంతర కాలంలో మూడు కోవెళ్ళుగా ప్రసిద్ధి చెందింది. ఈ సముదాయంలో వీరరాజేశ్వరస్వామి, నీలకంఠేశ్వరస్వామి, గౌరీ శంకరులు ఉండటంతో మూడు కోవెళ్ళుగా ప్రసిద్ధి చెందింది. 1978 సంవత్సరంలో మూడు కోవెళ్ళు దేవాదాయశాఖ అధీనంలోనికి వెళ్ళింది.
ఈ కోవెలలలో సీతారామస్వామి, జగన్నాథస్వామి పూజలు అందుకుంటున్నారు. వీర రాజేశ్వరస్వామికి ఇరువైపులా వినాయక సుబ్రహ్మణ్య స్వాములతోపాటు రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. మూడు కోవెళ్ళలో కొలువైన వీరరాజేశ్వరుని దర్శనం ముక్తిదాయకం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరో మనిషి రోబో

మరో మనిషి రోబో

-బి.వి.ప్రసాద్28/11/2015

ఆదిమానవుడు ఆధునిక మనిషిగా మారాడు. విలాసం కోసం, వినోదం కోసం ఎన్నో మార్గాలను వెతుకుతున్నాడు. తమ అవసరాలు తీర్చుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. కూర్చున్న చోటు నుండి కదలకుండా అన్ని పనులూ జరిగిపోయేలా యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నాడు. అలాంటి జీవితానికి దోహదం చేసే యంత్రాలే రోబోలు.నిన్నటి వరకూ రోబోలను మర మనుషులు అని చెప్పినా, నేడు ఆధునిక కాలంలో మనిషి కోరుకుంటున్నవన్నీ చేసిపెట్టే మరో మనిషి రోబో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదం చేయబోతోంది.

రోబోల గురించి చెప్పనక్కర్లేదు, తెలుగులో రోబో సినిమా రావడానికి ముందే హాలీవుడ్‌లో ఐ రోబోట్ సంచలనం సృష్టించింది. రోబోలపై ప్రపంచానికి క్రేజ్ కలిగించిన చిత్రం అది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలను ఈ సినిమాలో రూపొందించారు. అన్ని పనుల్లోనూ అవి సాయం చేస్తుంటాయి. కాని తనను తయారుచేసిన సృష్టికర్తనే చంపాలని అనుకుంటుంది. తనలాంటి ఎన్నో రోబోలను తయారుచేసి విధ్వంసానికి కాలుదువ్వుతుంది. డైరెక్టర్ శంకర్ తీసిన రోబో సినిమా కూడా మన దేశంలో ఒక సంచలనం. ఇందులో మరమనిషి అనేక విన్యాసాలను చేస్తుంది. అలాగే టివిల్లో వచ్చే కార్ల కంప్యూటర్ల ప్రకటనల్లో కూడా మరమనిషిని చూస్తున్నాం. అవి మనల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ పరిశ్రమల్లో అతి క్లిష్టమైన పనులను కూడా చేయడానికి 50 ఏళ్ల క్రితమే మరమనుషుల్ని ఉపయోగించినట్టు ఆధారాలున్నాయి. మనిషి కూడా చేయలేని పనులను సునాయాశంగా మర మనిషి చేయగలుతోంది. అయితే మరమనిషి ముప్పును సినిమాల్లో ప్రదర్శించారు. రోబో సినిమాలో చిప్ మార్చడంతో జరిగిన ప్రళయం కళ్లకుకట్టినట్టు చూపించారు. దేశ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని తయారు చేసిన ఈ రోబో చిప్ మార్చడంతో భయానకంగా విరుచుకుపడుతుంది. రోబోల ఉత్పత్తిలో అనూహ్యంగా ప్రగతి సాధిస్తున్న తరుణంలో శాస్తవ్రేత్తలకు , ప్రజలకు ఆ చిత్రాలు ఒక హెచ్చరిక. ముందున్న ముప్పును గుర్తుచేశాయి. కాని అలాంటి సంఘటనలే ఇటీవల నాలుగైదు చోటు చేసుకోవడంతో రోబోల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. రోబోలు వినాశకారిగా మారడం మనం సినిమాల్లోనే చూశాం. కాని ఇప్పుడవి నిజంగానే అనుభవంలోకి వచ్చాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న రోబోలు సహ కార్మికులను చంపేస్తున్నాయి. సహాయకారిగా ఉండాల్సిన రోబో మనుషులను ఎందుకు చంపేస్తున్నాయి? ఓ సినిమాలో చెప్పినట్టు ఈ రోబోలు భవిష్యత్‌లో వినాశకారిగా మారితే మనిషి పరిస్థితి ఏమిటి?
రోబోల చేతిలో మనిషి ప్రాణాలు పోగొట్టుకోవడం మనదేశంలో ఇదే మొదటిసారి. ఢిల్లీ సమీపంలోని గూర్గావ్‌లోని మానేసర్ ఎస్ కె హెచ్ మెటల్స్ కంపెనీలో 63 మంది కార్మికులు, 34 రోబోలు పనిచేస్తున్నాయి. ఒక రోబో చేతిలో 24 ఏళ్ల రామ్‌జీ లాల్ నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీలో అనేక రకాల పనులు చేసేందుకు ముందే ప్రోగ్రాం చేసిన రోబో అది. బరువైన మెటల్ షీట్లను అది ఎత్తుతుంది. రోబో ఎత్తిన ఒక షీట్ ఒకవైపు ఒరిగి పోయి ఉండడాన్ని గమనించిన రామ్ జీ లాల్ అది కింద పడితే డ్యామేజీ జరుగుతుందని భావించి దానిని సరిచేసేందుకు ముందుకువెళ్లాడు. అంతే రోబో అతనిని కూడా మెటల్‌కు సంబంధించినదిగా భావించి నలిపేసింది. గత ఏడాది జూన్ 29న జర్మనీలోని వోక్స్‌వేగన్ ఫ్యాక్టరీలోనే ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కార్మికుడిని రోబో ఒక లోహపు ప్లేట్‌కు అదిమి గుండెలపై గట్టిగా నొక్కి చంపేసింది.
1979లో మిచిగాన్ ఫోర్టు కర్మాగారంలోనూ లైన్ వర్కర్‌ను రోబో పొట్టనపెట్టుకుంది. తర్వాత 1984లో జపాన్‌లో ఇంజనీర్ కెంజి ఉరాడాను రోబో చంపేసింది. ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలే అని సరిపెట్టుకోవాలా? లేదా హింసకు పాల్పడేలా ప్రోగ్రామింగ్ ఇన్ స్టాల్ చేశారా ఇలాంటి సాఫ్ట్‌వేర్ ఉంటుందా అనేది ఆలోచించాలి. రోబో ఒక యంత్రం కిందకే వస్తుంది కనుక యంత్రాల ముప్పుగానే దీనిని పరిగణించాలి.
మనిషి ఆవిష్కరణల్లో
మరో మైలు రాయి రోబో..
మనిషి దాహం తీరనిది, తన ఉనికిని కాపాడుకునేందుకు జాతి మనుగడకు రోజుకో ఆవిష్కరణ చేస్తునే ఉన్నాడు. మనిషి పరిణామ చక్రంలో లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. చక్రాన్ని ఆవిష్కరించిన తర్వాత యంత్ర పరికరాలు, వస్తు ఉత్పత్తి, పారిశ్రామికీకరణ, అంతర్జాతీయ వర్తకం, టెలిఫోన్, రేడియో, టివి, పర్సనల్ కంప్యూటర్, పేజర్లు, ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్లు, స్మార్టు ఫోన్లు ఇలా స్వరూపం మారిపోతూ వస్తోంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, వినోదం, ప్రయాణం, విజ్ఞానం, వైద్యం, షాపింగ్, ఆర్ధిక లావాదేవీలు అన్నీ ఫోన్లలోనే సాగిపోతున్నాయి. ఈ క్రమంలో వినూత్న ఆవిష్కరణ మర మనిషి. విపత్తు, వినాశనం, వికాసం మూడూ కలగలసిన విధ్వంసకర ఆవిష్కరణ మరమనిషి. మరమనిషి అని మనం రోబోను చెప్పుకుంటున్నాం. ఒక వాస్తవికమైన యాంత్రిక కృత్రిమ ఉపకరణమే మరమనిషి. దీనిని సాధారణంగా కంప్యూటర్ లేదా ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ మార్గనిర్దేశంతో పనిచేసే ఒక విద్యుత్ యాంత్రిక ఉపకరణంగా పిలుస్తాం.
మనిషి చేసే ప్రతి పనిని చేయగలిగే శక్తిసామర్ధ్యాలు రోబోలకు ఉన్నాయి. కర్మేంద్రియాలే కాదు, జ్ఞానేంద్రియాలు కూడా రోబోలకు ఉన్నాయని చెప్పవచ్చు. త్వక్కు, చక్షువు, రసన, శ్రోతం, ఘ్రానం రోబోలకు ఉంటున్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంథం, మనస్సు, బుద్ధి రోబోలకు దక్కుతున్నాయి. తాజాగా అహంకారం కూడా కలుగుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇచ్చిన ప్రోగ్రాం ఆధారంగా సొంతంగా పనులు నిర్వహించగలుగుతోంది. భౌతిక రోబోలు, వాటి సాఫ్ట్‌వేర్ ఉపకరణాలను కలిపి మనం రోబోట్ అంటున్నాం. రోబోట్‌లతో చాలా ప్రయోజనాలున్నాయన్నది నిర్వివాదాంశం. రానున్న రోజుల్లో ఇంటి పని నుండి యుద్ధాల వరకూ రోబోలు చేయని పని అంటూ ఉండదు. ఆ విధంగా చూస్తే భవిష్యత్ మొత్తం మరమనుషులదే. కానీ మనిషి తనకు సాయపడుతుందని తయారుచేసుకున్న రోబోలు చివరికి మనిషి ప్రాణానికే సంకటమవుతున్నాయి
1960లో జార్జి చార్లెస్ డోవోల్ అనే శాస్తవ్రేత్త తొలిసారిగా పారిశ్రామిక మరమనిషిని డిజైన్ చేశాడు. ఏంజెల్ బెర్జర్ సహకారంతో డోవోల్ తయారు చేసిన మొట్టమొదటి రోబోట్‌ను జనరల్ మోటార్స్‌కు విక్రయించారు. 1961లో డోవెల్ ఫ్యాక్టరీ నుండి యునిమేట్ అనే పేరుతో తొలి పారిశ్రామిక మరమనిషిని తయారుచేసి న్యూజెర్సీలోని జనరల్ మోటార్స్‌కు అమ్మేశాడు. ఆ తర్వాత పరిశోధనలు కొనసాగించి డిజైన్‌లో లోపాలను సరిచేసి విస్తృత స్థాయిలో 1966 నుండి రోబోల ఉత్పత్తి మొదలైంది. న్యూజెర్సీలో ఇన్‌స్టాల్ చేసిన తొలి రోబోను డై కాస్టింగ్ మెషిన్ నుండి ఎర్రగా కాల్చిన ఇనుప ప్లేట్లను తీసి దొంతరగా పేర్చడానికి రోబోట్‌లను వాడారు.
కదిలే సామర్ధ్యం ఉండటం, యాంత్రిక అవయవం కలిగి ఉండటం, వాటిచుట్టూ ఉన్న వాతావరణాన్ని గ్రహించి నియంత్రించగలగడం, మేథావి ప్రవర్తనను ప్రదర్శించడం, ముఖ్యంగా మానవులు లేదా ఇతర జంతువుల ప్రవర్తనను అనుకరించడం రోబోల నిత్యకృత్యంగా ఉంది. గతంలో మానవ ప్రమేయం లేకుండా వాటి సాఫ్ట్‌వేర్ ఆధారంగా నియంత్రించబడే పరికరాలను పిలిచేందుకు మాత్రమే ఉపయోగించేవారు. స్వయంచాలక నియంత్రణ, పునఃక్రమణిక చేయగలిగే బహుళ ఉపయోగ యంత్రమే రోబో. పదార్థాలు, భాగాలు, సాధనాలు తరలించే పునఃక్రమణిక చేయగలిగే బహుళ క్రియా ఉపకరణాలు లేదా వైవిధ్యభరితమైన క్రియలు నిర్వర్తించేందుకు వివిధ క్రమణిక చర్యలు ద్వారా పనిచేసే ప్రత్యేకించిన పరికరాలను రోబోట్‌లుగా నిర్వచించవచ్చు. అనూహ్యమైన జోక్యం చేసుకోవలసిన క్లిష్టత ఉన్న కఠిన నియంత్రణ పర్యావరణాల్లో రోబోలను ఉపయోగిస్తున్నారు. అవయవాలను నియంత్రించే సామర్థ్యం ఉండటంతో పాటు మానవ లక్షణాలను కలిగి ఉన్న లేదా మానవ ప్రవర్తననే జంతు భాషలో చెప్పగలిగితే అటువంటి వాటిని రోబోలుగా చెబుతున్నాం. స్వయం చాలక పియానో కూడా రోబోనే.
చెక్ రచయిత కారెల్ కాపెక్ తొలిసారి రోబో అనే మాటను వినియోగించాడు. రస్సుమ్స్ యూనివర్సల్ రోబోట్స్ అని తన నాటకంలో వాడాడు. రోబోలుగా పిలిచే కృత్రిమ మనుషులను తయారుచేసే కర్మాగారంలో ఈ నాటకం ప్రారంభం అవుతుంది. ఇక్కడ యాండ్రాయిడ్స్ (యంత్ర మనుషులను ) తయారుచేస్తుంటారు. మనుషుల ఆధునిక భావాలకు దగ్గరగా అవి ఉంటాయి. కారెల్ కాపెల్‌కు ముందు దీనిని చిత్రకారుడైన తన సోదరుడు జోసఫ్ కాపెక్ దీనిని ఉపయోగించారని కూడా చెబుతుంటారు. గాడిద చాకిరి చేసే కఠోర పరిశ్రమ చేయగలిగే ఒక యంత్ర బానిసే రోబో. అలాంటి రోబోల గురించి వివరంగా అర్ధం చేసుకునేందుకు విస్తరించిన శాస్తమ్రే రోబోటిక్స్. రోబోలు నేడు బాగా అభివృద్ధి చేయబడుతున్నాయి. ఆధునికీకరించబడుతున్నాయి. రోబోట్ల ప్రవర్తనను ఏ విలువలు నియంత్రిస్తాయనే ప్రశ్నలతో పాటు ఏదైనా సాంఘిక , సాంస్కృతిక నైతిక లేదా న్యాయపరమైన హక్కులు పొందగలవా అంటూ నిపుణులు, పరిశోధకులు పెద్ద ఎత్తున చర్చను ప్రారంభించారు. కంప్యూటర్లు, రోబోట్లు మానవుల కంటె తెలివిగా వ్యవహరించే రోజు వస్తుందని వెర్నోర్ వింజే పేర్కొన్నాడు. దీనిని అతడు ఏకైతత్వంగా వ్యవహరించాడు. ఈ పరిస్థితి మానవులకు కొంత వరకూ లేదా బహుశా తీవ్ర ప్రమాదకారిగా చెప్పవచ్చు. 2009లో కంప్యూటర్లు, రోబోలు స్వతంత్రత సాధించగలగాలి అనే అంశంపై చర్చించారు. వాటి సామర్థ్యాలు ఎంత వరకూ ముప్పు కలిగిస్తాయి లేదా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయన్నది కూడా చర్చించారు. కొన్ని రోబోలు వివిధ రూపాల్లో పాక్షిక స్వాతంత్య్రతను సాధిస్తాయని నిపుణులు తేల్చారు. సొంతంగా విద్యుత్ వనరులను గుర్తించడం, ఆయుధాలతో దాడి చేసేందుకు లక్ష్యాలను స్వతంత్రంగా ఎంచుకునే స్థితికి వస్తాయని వారు గుర్తించారు. కొన్ని కంప్యూటర్ వైరస్‌లను నాశనాన్ని తప్పించుకోగలవని, అవి బొద్దింక మేథాశక్తిని సాధించగలిగాయని పేర్కొన్నారు. వైపరీత్యాలు, ప్రమాదాలకు కూడా అవకాశం ఉందని వారు గమనించారు. వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు పోకడలు కలిసి రోబోట్ కచ్చితత్వం, స్వతంత్రత విస్తృతమయ్యేందుకు దోహదం చేయగలవని వివిధ మాధ్యమ వర్గాలు , శాస్ర్తియ వర్గాలు చెబుతున్నాయి. మిలటరీ పోరులో రోబోల వినియోగాన్ని నిపుణులు , పరిశోధకులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఆయుధ సహిత రోబోట్‌లను ఇతర రోబోటు నియంత్రించి ఉంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అసోసియేషన్ ఆఫ్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ సంస్థ ఈ అంశాలను లోతుగా అధ్యయనం చేస్తోంది. స్నేహపూర్వకంగా, మానవత్వంతో వ్యవహంరిచేలా చేసేందుకు ఉద్దేశించిన చర్యలతో రోబోలను అనుసంథానం చేస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు రోబోట్లను భద్రతా వ్యవస్థల సాధన సామగ్రిని అమర్చేందుకు పాటించాల్సిన నియమాలు అమలులోకి తేవడం ప్రారంభించాయి. అవి అసిమోవ్స్ రోబోటిక్స్ మూడు సూత్రాలను పోలిన చట్టాలు. సర్వీసు రోబోలను జపాన్ పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాల్లో భాగం చేసేసింది. ఈ క్రమంలోనే ప్రామాణిక కంప్యూటర్ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఏర్పడింది. రోబోట్‌ల నిర్వహణ వ్యవస్థ అనేది కొన్ని క్రమణికలు (ప్రోగ్రాంలు) ఉండే సర్వ ప్రవేశ (ఓపెన్ సోర్స్) వ్యవస్థ. దీనిని స్టాన్‌ఫోర్టు విశ్వవిద్యాలయం , మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , జర్మనీలోని మ్యూనిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్నాయి. ఉపయోగించిన నిర్దిష్ట హార్టువేర్‌తో సంబంధం లేకుండా ఒక రోబోట్ మార్గనిర్దేశకం , అవయవాలను ప్రోగ్రాం చేసేందుకు రోబోట్ నిర్వహణ వ్యవస్థ ఉపయోగపడుతుంది. రోబోట్ కంప్యూటర్‌పై బూట్ అయినపుడు అన్ని రకాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని గ్రహిస్తుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా రోబోటిక్స్ డెవలపర్స్ స్టుడియోలో రోబోట్‌ల వ్యవస్థ కోసం విండోస్‌ను రూపొందించింది.
తొలి రోజుల్లో గృహాల్లో కర్మాగారాల్లో రోబోట్‌లను ఉపయోగించినా, అనేక కొత్త అంశాలు కనుగొనేందుకు సుదీర్ఘకాల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. 9 మీటర్ల పరిమాణంలో యంత్రాలు లేదా రోబోట్‌లను తయారుచేసేందుకు ఉద్దేశించిన నానో రోబోటిక్స్ ఇప్పటికీ ఎక్కువగా ఊహాత్మక సాంకేతిక పరిజ్ఞానంగానే ఉంది. వీటిని నానోబోట్‌లు లేదా నానైట్స్ అని పిలుస్తారు. వీటిని పరమాణు యంత్రాల నుండి రూపొందిస్తారు. పరిశోధకులు ఇంత వరకూ ఎక్కువగా సంక్లిష్ట వ్యవస్థలకు సంబంధించి బేరింగ్‌లు, సెన్సార్‌లు సింథటిక్ మాలిక్యులర్ మోటార్‌లను తయారుచేయగలిగారు. సూక్ష్మ స్థాయిలో పనిచేయగలిగే వైరస్‌లు లేదా బాక్టీరియా పరిమాణంలో ఉండే రోబోట్‌లను తయారుచేయడం కూడా సాధ్యపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. సూక్ష్మ శస్తచ్రికిత్సల సమయంలో వీటిని వాడుతున్నారు. సిలికాన్ శరీర నిర్మాణంతో సౌకర్యవంతమైన యాక్యుయేటర్‌లు (వస్తువులను కదిపే సాధనాలు), ఎయిర్ మజిల్స్, ఎలక్ట్రోయాక్టివ్ పాలిమర్స్, ఫెర్రో ఫ్లూయిడ్‌లు వంటి వాటిని మనం సాఫ్ట్ రోబోట్‌లు అంటున్నాం. ఫిజిలాజికల్, న్యూరల్ నెట్‌వర్కుల వినియోగంతో నియంత్రించబడటంతో పాటు ధృడమైన అస్తిపంజరంతో రోబోట్‌లకు భిన్నంగా కనిపిస్తాయి. వివిధ రకాల ప్రవర్తనను ప్రదర్శించగలిగే శక్తి వీటికి ఉంటుంది.
రీకాన్ఫిగరబుల్ రోబోట్‌లు కూడా రూపొందబోతున్నాయి. అంటే ఒక ప్రత్యేకమైన పనికోసం తమ భౌతిక రూపాన్ని మార్చుకోగలిగే రోబోట్‌లను తయారుచేయడం కూడా సాధ్యపడుతుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. దీనికి పోలిన సూపర్ రోబోలు క్యూబ్ , చతురస్రాకారాల్లోకి ఇప్పటికే మారుతున్నాయి. చీమలు, తేనెటీగలు వంటి పురుగుల సమూహాల స్ఫూర్తితో పరిశోధకులు వేలాదిసూక్ష్మ రోబోలను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాగి ఉన్నవాటిని కనుగొనడం, శుభ్రపరచడం, గూఢచర్యం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. చీమల దండు సమూహ తెలివితేటలు ప్రదర్శిస్తున్నట్టే మహాజీవవ్యవస్థగా పనిచేసేలా రోబో సమూహాలు తయారు చేస్తున్నారు. ఇంత వరకూ సృష్టించిన వాటిలో అతిపెద్ద సమూహాల్లో ఐరోబోట్ స్వార్మ్ ఒకటి.
రోబోల్లో సగభాగం ఆసియా ఖండంలోనే ఉన్నాయి. 32 శాతం రోబోలు ఐరోపాలోనూ, 16 శాతం అమెరికాలోనూ, ఒక శాతం ఆస్ట్రేలియాలోనూ, ఒక శాతం ఆఫ్రికాలోనూ ఉన్నాయి. మొత్తం రోబోట్‌లలో 30 శాతం జపాన్‌లోనే ఉన్నాయి. అంతేకాదు ప్రపంచ రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానానికి జపాన్ నేతృత్వం వహిస్తోంది. జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో భవిష్యత్ రోబోట్‌లకు సంబంధించిన ఆలోచనలు సానుకూలంగా ఉన్నాయి. ప్రసిద్ధ ఆస్ట్రోబాయ్ కారణంగా ఇక్కడ రోబోటిక్ అనుకూల సమాజం ప్రారంభం కావడం సాధ్యంగానే కనిపిస్తోంది. ఆసియా సమాజం రోబోలను మానవులతో సమానంగా భావిస్తున్నాయి. వృద్ధుల సంరక్షణ, పిల్లలతో ఆడుకోవడం, వారికి బోధనలు చేయడం లేదా పెంపుడు జంతువుల స్థానాన్ని భర్తీ చేయడం వంటి వాటికి వినియోగిస్తున్నారు.
****

చాలా వరకూ రోబోట్లు నిర్దేశిత పనినే చేస్తాయి. అయితే సాధారణ ఉపయోగార్ధం స్వతంత్ర రోబోట్‌లు వివిధ పనులను స్వతంత్రంగా నిర్వర్తించగల సామర్ధ్యం కలిగి ఉంటాయి. తెలిసిన ప్రదేశాల్లో స్వతంత్రంగా కదలగలుగుతాయి. వాటి సొంత రీ చార్జింగ్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఎలక్ట్రానిక్ డోర్లు, ఎలివేటర్లతో సంకర్షణ జరపడం, ఇతర ప్రాథమిక విధులను నిర్వర్తించడం చేస్తాయి. కంప్యూటర్లు మాదిరిగానే నెట్‌వర్కులు, సాఫ్ట్‌వేర్‌లతో అనుసంథానం అవుతాయి. వ్యక్తులను, పక్షులను, వస్తువులను , జంతువులను గుర్తించడం, మాట్లాడటంతో పాటు సహచర్యాన్ని అందించగలుగుతాయి. ఉపయోగకరమైన పనులు చేయగలుగుతాయి. అంతే కాదు ఏకకాలంలో వివిధ రకాల పనులు కూడా చేయగలుగుతాయి. వివిధ సందర్భాల్లో వేర్వేరు పాత్రలను పోషిస్తాయి కూడా. కొన్ని రోబోట్‌లు మానవులను అనుకరించేందుకు , వ్యక్తుల ఆకారాన్ని ప్రతిబింబించేందుకు ప్రయత్నిస్తాయి. ఇటువంటి వాటినే మనం హ్యుమనాయిడ్ రోబోట్‌లు అంటున్నాం. మానవుల కంటే అధిక ఉత్పాదకత, కచ్చితత్వం, సహనం ప్రదర్శించగలిగే సామర్థ్యం రోబోట్‌లకు ఉంది. ఆటోమొబైల్ రంగంలో రోబోట్‌ల ఆధిపత్యం మొదలైంది. ప్రతి కర్మాగారంలో రోబోట్‌ల వినియోగం పెరిగింది. కనే్వయర్‌పై ఉన్న వాహన చట్రం వెల్డింగ్ చేయడం, అంటించడం, రంగు వేయడం చేస్తోంది. ప్యాకేజింగ్ కంపెనీల్లో వస్తువులను భద్రపరచడం, కనే్వయర్ బెల్టుపై నుండి డ్రింక్ కార్టన్లను వేగంగా తీయడం, వాటిని పెట్టెల్లో పెట్టడం, యంత్ర కేంద్రాల్లో బరువులు ఎక్కించడం లేదా దించడం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో రోబోలు ఖండాలు లేదా పళ్లేల నుండి సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ కాంపొనెంట్‌లను తీసుకుని ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులపై అత్యంత ఖచ్చితత్వంతో అమరుస్తున్నాయి. ఇటువంటి రోబోలు గంటకు వేలాది భాగాలను అమర్చుతున్నాయి . ఆటోమేటెడ్ గైడెడ్ వెహికిల్స్‌గా కూడా రోబోలు పనిచేస్తున్నాయి. ఉపరితలంపై గుర్తులు లేదా తీగలు లేదా దృష్టిని ఉపయోగించే మొబైల్ రోబోలు సరకుల గిడ్డంగులు కంటైనర్ పోర్టులు లేదా ఆస్పత్రుల వంటి భారీ వసతుల్లో సరకులు రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విస్మృత యాత్రికుడు పైదిమర్రి రాజా రామ చంద్ర రావు,గురజాడ కు కవితా నివాళి

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంరామ సర్వ సేనాని -మహమ్మద్ భక్త్ ఖాన్ -ప్రభ ,అయ్యోపాపం కాంగ్రెస్

Inline image 1Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాముడి ఈవితాన్నే మార్చేసిన మాయా జింక రూప మారీచుని అరుపు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాజకీయభోగరాజు పట్టాభి సీతారామయ్య

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

28 -11- 15 శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బాచుపల్లి లోని మా రెండవ అబ్బాయి శర్మఇంటిదగ్గరలో బావమరది ప్రసాద్ ,కళా దంపతులు కొత్తగా కొన్న స్వగృహం లో మాకు ఆతిధ్యం 

28 -11- 15 శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బాచుపల్లి లోని మా రెండవ అబ్బాయి శర్మఇంటిదగ్గరలో  బావమరది ప్రసాద్ ,కళా దంపతులు కొత్తగా కొన్న స్వగృహం లో మాకు ఆతిధ్యం

Posted in సమయం - సందర్భం | Leave a comment

రామారావు గూడెం బంధువు ఛి సౌ కల్పన దంపతులబాచుపల్లి స్వగృహం లో27-11-15 సాయంత్రం మేము

This gallery contains 34 photos.

More Galleries | Tagged | Leave a comment

అంబేద్కర్ జపం లో అసహజ ధోరణులు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మజ్యోతి – డిసెంబర్ – సంచిక – శ్ర్రీ రామాలయం – భద్రాచలం

http://www.samskruti.org/people/ramora/ramoraindex.htmlAatmajyothi Dec 2015 for Web
0066
0067

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 21-తిరుచానూర్ కృష్ణ కవి

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

21-తిరుచానూర్ కృష్ణ కవి

తిరుపతి దగ్గరున్న అలివేలు మంగాపుర(తిరుచానూర్ )) నివాసి చిరుచానూర్ కృష్ణకవి .కవికాలం తెలియదు .’’సత్యభామా పరిణయం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .శేష నరసింహ కుమారుడు కృష్ణ కూడా ఇదే పేరుతొ నాటకం రాశాడు .కృష్ణకవి కవిత్వం మచ్చుకి –

‘’లక్ష్మీ మండ కురయాత్యసో శశికళా చూడావ చూడాయితా –శంభోర్య ప్రధమాన విభ్రమ భ్రుతః

వవ్రే సర్వ సురాసురస్య మిష తః స్పర్ధవతః కోమలా –రుడేశ్వర్యమనాన్య తుల్యా మమ్రుతో త్మాధో త్సవే శడంకరం ‘’

కవి పేరు తెలిపే శ్లోకం

‘’ద్ద్రాక్షా వీక్ష ప్రతీ సుక్రుదయ సరసతాభి శ్రురిశ్రుశ్వ సాక్షాత్ –నీచా మోచపి వాచాం మధురి మధురి సా పాద దూలిర్మదూ లిః

పీయూషం యోష వేషం వహతి నవ పాయో జోష మస్తో స ఏష –ధ్వన్యా ధ్వన్య ధ్వనీనో భువి జయతి తరాం కృష్ణ నామా కవీన్ద్రః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26 -11 -15 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 22-శేషం కృష్ణ పండితుడు (16 -17 శతాబ్దం )

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

22-శేషం కృష్ణ పండితుడు (16 -17 శతాబ్దం )

శేషం(శేష ) వారు గొప్ప విద్వత్ కుటుంబానికి చెందినవారు. గోదావరిజిల్లాకు చెందిన శేషం నరసింహ వారణాసికి 16 వ శతాబ్ది మొదట్లో  వెళ్లి బెనారస్ దగ్గరున్న తాండవ రాజ్యమేలే గోవింద చంద్రుని ప్రాపు సంపాదించాడు .ఆ కాలం లో మహా వ్యాకరణ వేత్తగా ప్రఖ్యాతుడు .అక్కడ వ్యాకరణ విద్యాలయం స్థాపించి నేర్పాడు .ఇందులోచదివిన వారిలో భట్తోజీ నాగోజీ లున్నారు .నరసింహుని ఇద్దరుకోడుకులు చితామణి,కృష్ణ లు గొప్ప విద్యావేత్తలు రచయితలూ .కృష్ణ కుమారులు  వీరేశ్వరుడు నారాయణుడు .ఇందులో వీరేశ్వరుడు పండిత రాజు భట్టోజి ,అన్నం భట్టు లకు గురువు .శేషా లేక శేషం కుటుంబం వారణాసి వాస్తవ్యులైనా ఆంధ్ర దేశీయులే .

శేష కృష్ణ గిరిధారి అనబడే గోవర్ధన దారి అక్బర్ ఆస్థానం లో ఆర్ధిక మంత్రి అయిన రాజా తోడర్ మల్ కుమారుడు . కనుక కృష్ణ కవి 16 వశతాబ్దం చివరిదాకా 17 వశతాబ్దం ప్రారంభకాలం దాకా జీవించి ఉండ వచ్చు .ఈ కవి కంస వధ  మురవిజయం ,ముక్త చరిత్ర సత్యభామా పరిణయం అనే నాటకాలను ,పారిజాత హరణం ,ఉషాపరిణయం ,సత్యభామా విలాసం ,క్రియా గోపన రామాయణం చంపూ కావ్యాలు రాశాడు .ఇవికాక ప్రక్రియా ప్రకాశంఅనే వ్యాఖ్యను రామచంద్ర విరచిత ప్రక్రియా కౌముది పై రాశాడు  ,స్ఫోటత్వం ,యంగ్లు ఘంటా శిరోమణి అనే వ్యాకరణ గ్రంధాలను ,శేష కృష్ణ కారిక రచించాడు కాని లభ్యమైనవి కంసవధ నాటకం ,పారిజాతహరణం చంపు మాత్రమే .

కంస వధ 7 అంకాల నాటకం .1588 లో రాశాడు .భాగవత కద.గురువు గిరిధారి ప్రోద్బలం తో రాసినట్లు చెప్పాడు

‘’తస్యాస్తి తండన కులామల మండస్య శ్రీ తోడర క్షితి పతే స్తనయో న్యాజ్ఞః –ఆనాకలా కుల గృహం స విదగ్ధ గోస్టీమేఖో దితి గురుర్గిరి దారీ నామ్నా ‘’

ఈ నాటకాన్ని కాశీ విశ్వేశ్వర ఉత్సవాలలో ప్రదర్శించేవారు .సూత్రధారుడు కవిని పరిచయం చేస్తాడు .మహా వ్యాకరణ వేత్త అయిన కృష్ణకవి వ్యాకరణ జ్ఞానం లేక పొతే యెంత గోప్పకవినైనా లోకం చులకనగా చూస్తుంది అన్నాడు

‘’రసాలంకార రసాసపి వాణీ వ్యాకర ణోజ్నితా-రివత్రేవనం రంజయతి సజ్జనాన్ ‘’

సాధారణం గా అన్ని శ్రవ్యకానాట కాలు లాకుండా ప్రదర్శన యోగ్యం గా ఉంది .మొదటి అంకం లో కంసుడు ఆకాశవాణి చెప్పింది విని కృష్ణుడిని సంహరించే అన్ని విధానాలు అమలు చేయమని ఆజ్ఞాపిస్తాడు .రెండవ అంకం లో కృష్ణలీలలు శకటాసుర ,కేశిని పూతన సంహారాలు ఉంటాయి .మూడవ దానిలో కంసుడు బలరామ కృష్ణు లను మధురకు ఆహ్వానించి చంపే కుటిల ప్రయత్నం చేయటం ఉంది .నాలుగవ అంకం లో శ్రీకృష్ణ బలరామూల మధురానగర ప్రయాణం ,యమునా ,గోకుల బృందావన వర్ణన ,చెలికత్తె విలాసవతి ద్వారా రాధ కృష్ణుడి కి  పంపిన సందేశం ,రాసక్రీడ ఉంటాయి .అయిదులో బలరామ కృష్ణులు చాకలి నుండి బట్టలు తీసుకోవటం సుదాముని ఆతిధ్యం ,కుబ్జకు సుందర రూపమివ్వటం ,మధురానగర ప్రవేశం ఉన్నాయి ఆరు లో కువలయాపీడ ఏనుగును చాణూర మర్దన మల్లులను చంపటం ,చివరికి కంస వధ ఉన్నాయి .ఏడవ చివరి అంకం లో దేవకీ వసుదేవులను కంసుని చెరనుండి విడిపించటం ,ఉగ్రసేనుడిని  రాజుగా అభిషిక్తుడిని చేయటం తో నాటకం పూర్తవుతుంది .

శేష కృష్ణ కవితా ప్రతిభ ఆద్యంతం కనిపిస్తుంది .కవికి జ్యోతిశ్శాస్త్రం లో ప్రవేశామున్నట్లు అర్ధమౌతుంది .బలరామ కృష్ణులు మధురకు బయల్దేరే ముహూర్తం దివ్యంగా ఉండేట్లు దైవజ్నుని చేత చెప్పించాడు .కాలిందీ నది సోయగాన్ని కమనీ యంగా వర్ణించాడు –

‘’పశ్యన్నేతాం చపల శఫరీ లోచనాంపంకజస్య –కోక ద్వంద్వస్తన భారనతాం బాల శైవాల కేశీం.

భ్రున్గశ్రేణీ మధుర వచనాం రాజ హంస ప్రచారం –వ్యాసక్తో పిక్షణమిహ పునః ప్రేయసీం స్మరితోస్మి ‘’

రాధ విరహ వేదనను పరమాద్భుతంగా విలాసవతి చేత చెప్పించాడు –

‘’మాలా వ్యాలానుకారా పరిమళ బహుళ స్నిగ్ధ చంపాను శంపా –పంపా కంపానిలోస్యా మలయా జని లయాశీ విషోద్గర ఘోరః

నస్యా దస్యా విభవ్య జ్వరమిహ కత మస్యో త్సకంపాను కంపా -ఝంపా సంపాత జగ్ర త్రుహిన కర హరి ప్రోద్గమో న్నాస భాజః ‘’

‘’పారిజాత హరణ చంపు ‘ను  తాండవ రాజు సోదరుడు నరోత్తముని ప్రేరణ పై రాశాడు –‘’

‘’సానందం మకరంద బిందు నికర ప్రస్యంద బందీ భవన్ –మందీ భూతి మిలింద  తు౦దిల దలన్మందార మందాదరం

భూయః సౌరభ లోభ సంభ్రమ భరాత్  భ్రుంగీ భిరంగీ కృతే –భామాయః కిల పారిజాత కుసుమే జీయాత్రుష్ణ౦ మనః ‘’అలాటి దివ్యపారిజాతాన్ని కోరకుండా ఎవరు ఉండగలరు .నందితిమ్మనతెలుగులో రాసిన ‘’పారిజాతాపహరణం ‘’ను  శేష కవి బాగా అధ్యయనం చేసి రాసినట్లు కనిపిస్తుంది .దీని పై  నంది కవి ప్రభావం అడుగడుగునా ఉంది .గంభీర రచనలో సిద్ధ హస్తుడైన కవి అతి సరళంగా సుందరంగా పారిజాత సుమాల౦త కోమలంగా కవిత్వం చెప్పాడు . తిమ్మన పద్యాలను ఒకరకంగా సంస్క్రుతీకరించాడని చెప్పచ్చు .సత్యభామ కోపాన్ని అనునయించే కృష్ణుడి పాట్లు –

‘’త్వం చంద్రికా చేత్తదహం చకోరే స్త్వందీపికా చేత్తదహం ప్రకాశః –కాదిమ్బినీ త్వం యది చాతకోహం ,మా మన్యదా మానిని మా స్మబుద్ధః ‘’.

మిగతా పారిజాత కావ్యాలలో పుణ్యక కవ్రతాన్ని వివరంగా వివరిస్తే మన శేష కవి ఒకే ఒక శ్లోకం లో చెప్పేశాడు –‘’

‘’అమర ముని సమాజే తత్ర సాత్రాజితీ సా గురుభి రధ నియుక్తా నారదాయా ర్చ యిత్వా –అదిత విదిత పుణ్యో పుణ్యకే పారిజాతం విదివదఖిల భర్త్రా వాసు దేవేన సార్ధం ‘’

ప్రతి సర్గ చివర్లో తన పోషకరాజు పేరును ప్రస్తావించాడు శేష కృష్ణ పండితకవి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27 11 15 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

‘’

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

26 -11 15 గురువారం -మధ్యాహ్నం -హైదరాబాద్ -సెక్రెటరి కాలనీలో మా బావ మరది ఆనంద్ స్వగృహం లో

26 -11 15 గురువారం -మధ్యాహ్నం -హైదరాబాద్ -సెక్రెటరి కాలనీలో మా బావ మరది ఆనంద్ స్వగృహం లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 19-వసుచరిత్ర నాటక కర్త –సుసర్ల కామ శాస్త్రి

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

19-వసుచరిత్ర నాటక కర్త –సుసర్ల కామ శాస్త్రి

బొబ్బిలిలో సుసర్ల చాయాంబ ,సుబ్రహ్మణ్య లకు కామ శాస్త్రి జన్మించాడు .బొబ్బిలి రాజు రంగారావు బహద్దూర్,వెంకట గిరి రాజా  ఆస్థానకవి .వెంకట గిరిలో వెలుగోటి వెంకట కృష్ణ యాచేంద్ర కు ప్రీతిపాత్రుడై ,ఆయన సలహాతో ‘’గిరికా కళ్యాణం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .దీని మాతృక తెలుగు లో రామ రాజ భూషణుడు రాసిన ‘’వసు చరిత్ర ‘’ప్రబంధం .వసుచరిత్రను ముందుగా సంస్కృతం లో అనువాదం చేసినవాడు కాళహస్తి కవి అని మనకు తెలుసు .శ్రీధర పేరి సూరి దీనినే ‘’వసుమంగళనాటకం ‘’గా రాశాడు .బాబానృపాలుడూ ఇదే పని చేశాడు .కామ శాస్త్రి ఆ కోవలో మూడవ వాడయ్యాడు .

కామ శాస్త్రి ఈ నాటకం లో కొన్ని కొత్త పాత్రలను ప్రవేశ పెట్టాడు కొన్ని మార్పులూ చేశాడు .నాటక శాస్త్ర మర్యాదలనన్నిటి కి సమాధానం గా కోత్త  సా౦కేతికతో దీన్ని చేశాడు .కాని టెక్నాలజీ యే మిగిలింది కానీ నాటక కళ  దెబ్బతిని పోయింది .నాందీవాక్యం –‘’శ్రేయసే భూయసే భూయా ద్రాజ చూడామణి గిరావః –గిరిజా వదనా౦ భోజ చంచరీక ద్రుగస్చలః .’’

అయిదు అన్కాలకు 1-గిరికా దర్శనం 2 అమరావతి ప్రస్తానం 3 మహేంద్ర కృత ప్రతిజ్ఞ 4-కోలాహల కన్యాదాన ప్రతిజ్ఞా 5 –గిరిక కల్యాణం అని పేర్లు పెట్టాడు .రామరాజకవి వాడిన శ్లేషలను  సంస్కృతం లోకి దింపే ప్రయత్నం చేశాడు .వసురాజును చూసి గిరిక లేవ బోతుటే వద్దని మర్యాదగా చెప్పిన శ్లోకం

‘’గుణాల నాలాధిక సౌకుమార్యకా –న్యనయద్రుగంబా పానల చుమ్బితానిచ –క్షామాణితన్వంగి మద్విదేషు తే మ్రుదూని గాన్నాన్యుప చార కర్మణి ‘’అని మర్యాద ఇస్తాడు .

అయిదవ ఆకం లో వసు గిరిక కల్యాణం వర్ణించాడు .అచ్చమైన తెలుగు ఇంటి పెళ్ళిలా మన పద్ధతిలోనే చేయి౦ చేశాడు పెళ్లి .ఫలశ్రుతి చెప్పాడు

‘’శ్రీ వెంకట గిరి నిలయః కరుణా రాసా వృష్టి శమిత జన తాపః –పాయాన్నః కృష్ణ ధనః సమవర్ధిత సుకృతి జన కడంబో యం ‘’

20 – మిశ్రమ భాణం రాసిన –కాశీపతి(17 20

కౌండిన్య గోత్రీకుడు ఉమాపతి పుత్రుడు కాశీపతి .1734లో మైసూరు రాజు సైన్యాధ్యక్షుడైన ఆంధ్రుడైన కలులే నాగ రాజు పోషణలో ఉండేవాడు .విలువైన 1- తన పోషకుడు నంజరాజు రాసిన ‘’సంగీత గంగాధరం ‘’ శ్రావణ నందిని అనే వ్యాఖ్యానాన్నిరాశాడు .2 –ముకున్దనందన భాణం రాశాడు .రెండింటిలోను గణపతిని ఒకే విధంగా స్తుతించాడు

‘’వందే వందారు మందార మిందు చూడస్య నందనం –అమందానంద సందోహ బంధురం సి౦ధు రాననం ‘’

వ్యాఖ్యానం లో కొన్ని చారిత్రిక విశేషాలు తెలియజేశాడు .రెండవది అయిన భాణం భద్రగిరి చూదేశ్వర ఉత్సవాలలో ప్రదర్శించేవారు .ఈ ముకుంద నందం విషయం  లో, వివరణలో వినూత్నమైనదిగా కనిపిస్తుంది .ఇది మిశ్రభాణం. .ఆ రోజుల్లో వినూత్నమైనది అరుదైనదికూడా .సంస్కృత ప్రాక్రుతాలను కలిపి రాశాడు .రాజు భుజంగ  శేఖరుడి క్రీడలు శ్రీ కృష్ణ గోపికా క్రీడల్లాగా ఉంటాయి ..తర్కం లో దిట్ట ఐన కవి కవిత్వం లో అదే పదును చూపాడు .సూత్రధారుడు కవి ప్రతిభను చక్కగా వివరించాడు –

‘’తర్క కర్కశ వక్ర వాక్య గహనే యా నిష్టురా భారతీ –సా కావ్యే మ్రుదులోక్తి సార సురభౌ స్యాదేవ మే కోమలా ‘’

కవి ఊహకూ సరల కవిత్వానికి మరో ఉదాహరణ

‘’భూయో నిపీయ లావణ్యా౦బుధి మప్రభాత౦ –పుంజీభవన్నుదయతే త పంచ్చలేన

ఔర్వీ గ్నిరంభార పయోనిది మత్చ్య పాతుం –నీలో దుబుద్ధద కడంబమితి ప్రతీమః ‘’’

కాశీపతి కవిత్వం లో కాళిదాస, జయ దేవ, లీలాశుకుల కవిత్వం మిశ్రితమై కనిపిస్తుంది

‘’తప్తాంబురుహం తదూరు యుగళం తాద్రుక్ నితంబ స్థలం –తన్మధ్యం స గభీర నాభి వలయస్తా వాను రోజ క్రమః

తదంకం తదపాంగ ముగ్ధ వలనం తే నీల నీలాలాలకాః-సా తన్వీతి తదంక కేషు హృదయం దావన్న విశ్రామ్యతి ‘’

ఇది ముకుందుడైన శ్రీకృష్ణుని గురించి రాసినదే అయినాకాదంబినీ అంటే మబ్బు కుమార్తె  సౌదామిని అంటే మెరుపు ,కళానిధి కళత్ర చంద్రికా మొదలైన పేర్లు కూడా వస్తాయి కనుక ఇది పూర్తిగా భాణ  లక్షణాలను కలిగి లేదు కొన్ని సామెతలనూ పనిలో పనిగా కవి చెప్పాడు. ఆ నాటి కాలం లో శృంగార వీరవిహారం గురించి వర్ణించాడు. తనకు ఇష్టమైనవి ,అయిస్ట మైనవీ చెప్పాడు. గూర్జరులను గూర్జర స్త్రీ లను  విమర్శించాడు .ఇలా యే భాణం లోనూ లేదు ,

ఆంద్ర దేశం లో ఈ బాణం విస్తృత ప్రచారం లో ఉండేది .దీని చాలామంది కవులు అనుఅరించారు అనుసరించారు .కొందరు అందులోని వాక్యాలను ప్రేరణగా తీసుకొన్నారు .అందులో ముఖ్యమైనది –‘’మద్యం విష్ణు పదం కుచౌ శివపదం వక్త్రం విధాతుః పదం ‘’వంటివి .చిలకపాటి రామానుజ శర్మ దీన్ని పూర్తిగా అనువదించాడు .మరో సూక్తి ‘’చౌర్యేనైవ కృతం హికుక్షి భరణం జన్మ ప్రభూ  ‘’ ను అవధానకవులు తిరుపతికవులు తమ ‘’పాణిగ్రహీత ‘’లో అనువాదం చేసి రాశారు .కనుక ఎందరికో ప్రేరణ నిచ్చి కొత్తమార్గం తోక్కించింది కాశీపతి రాసిన ‘’ముకున్దానంద భాణం  ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25 11- 15 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 17-కవి కు౦జరుడు (1235)

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

17-కవి కు౦జరుడు (1235)

అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుని శిష్యుడే కవి కుంజరుడు.అంటే కవులలో మద గజం అని అర్ధం .రాజ శేఖర చరిత్ర నీతిబోధక  కావ్య నిర్మాత .దీనికే ‘’సభా రంజన ప్రబంధం ‘’అనే పేరుంది .కమ్మని కధలు చెబుతూ నీతి బోధ చేశాడు .ఇవి రాజశేఖర రాజాస్థాన కధలే .వీటిని రాజు సుబుద్ధికి వివరించాడు .కుంజర కవే అభినవ కాళిదాసు రాజశేఖరుని ఆస్థానకవి అని చెప్పాడు .రాజశేఖరుడు పినాకినీ తీర విద్యానగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు .కుంజర కవికావ్యానికినారాయణుడు వ్యాఖ్య రాశాడు .

కావ్యారంభం చేసినాక రాజుకు భా౦డవ్యుడికి జరిగిన సంభాషణ ఉంటుంది .

రాజు –స్కందే కృషీవల హలం కలయన్ క యాసి ?

భా౦డవ్య –గచ్చామి తే నికటమేవ విభో

రాజ –కిమర్దం ?

భాండవ్య—హ హంత కర్షణ పరాస్తవ వైరి భూషః

రాజ –(గద్యం నితంత సంతుష్ట స్తస్మే నిజ కర్ణా గతేస్వ కుండలే ప్రయచ్చత్

ఆశ్వాసాంత గద్యలో ‘’ఇతి శ్రీ కవి కుంజర కృతౌ రాజ శేఖర చరిత్రే సభా రంజన ప్రబందే ప్రధమోల్లాసః ‘’

కవి కుంజర ఇందులో 28కధలు 1-దుర్జయ 2-సూక్ష్మమతి 3-సారంగా 4 దైవజ్న వల్లభ 5 సోమ 6 కామలీల కవ యిత్రి 7 కాశీపతి 8 సానంద 9-రత్నాకర 10 కుటుంబ కవి మొదలైన శీర్షికలు పెట్టి కధలు వివరించాడు .ఈ పేర్లు అన్నీ అసలైన వో కాదో తెలియదు .కై ఇందులో శ్రింగార శేఖర ,మందర ,లలితపాల ,శ్రీకామ కమలాకర మొదలైన వారు అభినవ కాళిదాసు నేతృత్వం తో తమకు జరుగుతన్న అన్యాయానికి గాను దుర్జయుని దెబ్బ తీశారు .రాజుకు దుర్జయుని దురాలోచన తెలిసి బహిష్కరించాడు .

కుంజర కవి వెల్లాల కవి శిష్యుడు కనుక ,రామచంద్రకవి తరువాతి వాడుకనుక కాలం 1235 గా చెప్పవచ్చు .కవికి వచ్చిన బిరుదేకాని అసలు పేరు వేరుగా ఉండిఉంటుంది .రాజ శేఖరుని సమకాలీన రాజులు రాజేంద్ర చోళుడు ,పాండ్య రాజు విజయ వర్మ ,మాల్వలోని దారానగర రాజు ,సింహళ పాలకుడు ,కొంకణేంద్రుడు హూణ క్షోణిధరుడు మొదలైన వారున్నారని తెలుస్తోంది .దీనిని బట్టి చూస్తె అభినవ కాళిదాసు భోజరాజాస్తానకవి అనిపిస్తాడు .అక్కడినుండి రాజశేఖరుని ఆస్థానం చేరి ఉంటాడు .ఇవన్నీ ఊహాగానాలే .చారిత్రిక సత్యాలుకావు .వెల్లాల కవి భోజ రాజ ఆస్థానకవి అనటం  అసంబద్ధమని పిస్తుంది .రాజ శేఖరుని దగ్గరకు రాకముందు మరొక దక్షిణ దేశ రాజు ‘’పుణ్య కోటి’’ ఆస్థానం లో ఉండేవాడినని ‘’అభి కవి ‘’స్వయంగా రాసుకొన్నాడు .కనుక కవి కుంజరునిరాజ శేఖర చరిత్ర ,రామ చంద్ర కవి ‘’ప్రక్రియ కౌముది ‘’కి తరువాత నే రాయబడింది అని అర్ధమౌతోంది .

18-కవి రాక్షసుడు (11 -13 శతాబ్దం )

గొప్ప లక్షణ గ్రంధ కర్త అని 14వ శతాబ్ది తర్వాతి తెలుగు లాక్షణికులు వ్యాకరణ కర్తలు ,అలంకార శాస్త్ర రచయితలూ  . కవులచేత ప్రశంసి౦ప బడిన కవి రాక్షసుడు మహా కవి బహు గ్రంధ రచయిత.ఇతని రచనలు –కవి రాక్షసీయం ,ఆది నారాయణ చరిత్రం ,అనే తెలుగు రచనలు ,కవిరాక్షసీయం అనే ద్వ్యర్ధి  కావ్యం ,సదార్ధ నిర్ణయం అనే నిఘంటువు సంస్క్రుతం లో రాసినట్లు చెప్పబడ్డాడు ..ఆంద్ర కవులు ఇతనికాల౦ 11-13శతాబ్దాల మధ్య అన్నారు  .దాక్షారం నివాసి అన్నారు .రాక్షస నిఘంటువులో  67శ్లోకాలు మాత్రమె ఉన్నాయి .అసలు పేరు కాక బిరుదనామమే కవి రాక్షసుడు ‘ఈ బిరుదు రావటానికి కారణం కవే చెప్పాడు –

‘సాక్షరేషు భవతీహ జగత్యం సర్వ ఏవ హృది మత్సర యుక్తః –సాక్షరం కవి జనేషు తమేనం లోక ఏష ‘’కవి రాక్షస మహా ‘’

కవిరాక్షసీయం పై నాలుగు వ్యాఖ్యలున్నాయి .1-నాగ నారాయనుడి  ‘’సిద్ధార్ధ దీపిక  ,తెలుగుకవి లోకనాదుడురాసిన వ్యాఖ్యానం కాక అజ్ఞాత రచయితలవి మరో రెండున్నాయి .

కవి రాక్షసీయం 105 శోకాల గ్రధం .ప్రతి శ్లోకానికి రెండు అర్దాలుంటాయి .అందులో మొదటిశ్లోకం

‘’గుణ దోషో బుదో గృహ్నాన్ ఇందు క్ష్వేలా వివేశ్వరః –శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చాతి’’

చివరి శ్లోకం

‘’మహాన్ స ఏవ పురుషో యస్య సత్యానురోదినః –ఆక్షిప్త పారిజాతేన బాహునా రక్ష్యతే జగత్ ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-11 15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 16-వెల్లాల ఉమామహేశ్వరుడు (1235)

నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
16-వెల్లాల ఉమామహేశ్వరుడు (1235)
అభినవ కాళిదాసు అని పించుకొన్న వెల్లాల ఉమా మహేశ్వరుడు అక్కయ సూరి శిష్యుడు .మహా పండిత  కవి .కవికాలం ఇదమిద్ధం గా చెప్పలేం .భాగవత చంపు ,అభినవ భారత చంపు ,భాగవత పాద షట్పది ,కలి  విడంబనం ఇతని కృతులు .సంస్కృతం చదివే వారందరికీ భాగవత చంపు అనుభవం లోకి వచ్చేదే .భారత చంపు అంతగా రాణి౦చక పోవటానికి కారణం ప్రత్యర్దికవి అనంత భట్టు రాసిన భారత చంపువు .ఈ చ౦ పువు అ చంపువుకు గ్రహణం పట్టించింది .మూడవ కావ్యం శ్రీ శంకరాచార్య స్తుతి .నాలుగవది ఓరియెంటల్ లైబ్రరీకే పరిమితం
  అభినవ కాళిదాసు దక్షిణ దేశ ప్రభువు రాజశేఖరుని ఆస్థాన కవి అన్నాడు కవి కున్జరుడు .కాని ఇది సరిపోవటం లేదు .కవి కున్జరుని అభిప్రాయం ప్రకారం తన గురువు అభినవ కాళిదాసు రాజ శేఖర రాజు ఆస్థానం లో పలుకుబడిగల కవి కొత్తవారినేవ్వరినీ ప్రోత్సహించానివాడు అయిన దుర్జయుని కవితా ప్రతిభతో జయించాడు .దీన్ని బట్టి వె ల్లాలకవి 1235కాలం వాడని నిర్ణయించారు .తల్లి తిరుమలాంబ తత్వ చంద్రిక ,విరోధ వరూధిని ,ప్రసంగా రత్నాకరం ,అద్వైత కామ దేను ,వేదాంత సిద్ధాంత సారం ,శృంగార శేఖర భాణంకూడా రాశాడు .వీటిని బట్టి వెల్లాల కవి అన్ని శాస్త్రాలలో గొప్ప పా౦డి త్యం ఉన్నవాడని తెలుస్తోంది .అభినవ కాళి దాస బిరుదు సమర్ధనీయం అని పిస్తుంది .మహోపాధ్యాయ పక్షధార ఎల్లయ్య శిష్యుడు  అక్కయ సూరి రాసిన వ్యాఖ్యానం బట్టి వెల్లాల కవి గొప్పతనం ప్రదర్శితమైంది .మంధన ,బెల్లం కొండ రామ రాయ కవుల వ్యాఖ్యానాల వలన మనకవి ప్రతిభ అర్ధమవుతుంది .
  భాగవత చంపు రాయటానికి కారణాలు కవి చెప్పుకొన్నాడు -”అభినవ పద పూర్వ కాళిదాసః ప్రగల్భః -త్రినయన దయితాయాః ప్రేమ దిమ్భర స్తృతీయః-విరచ యతి తయైవ ప్రేరితః ప్రేమ పూర్వ -హరి గుణ పరిణద్దం  చారు చంపూ ప్రబంధం ”.
అభినవ కాళిదాసు తనపై మహా కవి కాళిదాసు ప్రభావం ఎలా ఉన్నదీ తెలియ జేశాడు .తన కావ్యమంతా ధ్వని ప్రధానమైనదని కనుక జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోవాలని చెప్పాడు .ఆరు విలాసాలతో ఉన్న ఈ చంపు శ్రీ కృష్ణుని జీవితం లో ముఖ్య ఘట్టాలను వివరిస్తుంది .చవర్లో రాధ ను కూడా ప్రవేశ పెట్టాడు .వారిద్దరి శృంగార చేస్టల వర్ణన కూడా ఉంది .అలక చెందిన పెద్దభార్య రుక్మిణీ దేవిని అనునయించటం తో ముగించాడు .
  ఇతని శృంగార శేఖర భాణం శృంగార శేఖర ,ఉత్పలమాల ప్రేమ వ్యవహారం .కామ కోటి వల్లభ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .కవిగోత్రం కాశ్యాప అని దీనిలో చెప్పాడు .చివరలో చెప్పిన శ్లోకం చూద్దాం –
”అనితర రసాదీనం భూయాదానంగా పదం -హృదయ మసు క్రుంచ్చ్రున్గార ద్వేతశ్రుమ్ఖలితం
రస ధారా కలాపీడం శ్యామామయం కరుణామయం -శమయుత పునర్జన్మ వలేశం మమాపి పర౦ మహః ”
  సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-15 -కాంప్ -బాచుపల్లి -హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సామాన్యుని దగ్గరకు ఉపనిషత్తులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆదిరాజు వీరభద్ర రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వివిధ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 15-ఉపమాక వెంకటేశ్వర (1850)

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

15-ఉపమాక వెంకటేశ్వర (1850)

1850కి చెందిన ఉపమాక వెంకటేశ్వర కవి విశ్వనాధ ,కామాంబ లకుమారుడు .నిట్టల ఇంటి పేరు .విజయ నగరం జిల్లా వాడు .కవిత్వం లో అఖండుడు .ఆశ్చర్య పరచే కవితా ప్రాభవం ఉన్నవాడని గుర్తింప బడ్డాడు .’’రామాయణ సంగ్రహం ‘’కావ్యం 29సర్గలలో  1866లో రాశాడు .ఒకేపంక్తి లో అక్షరాల మార్పు వలన నాలుగు రకాల అర్ధాలు వచ్చే గర్భ కవిత్వం రాశాడు .అందుకని ఈ రామాయణానికి ‘’చతుశ్చిత్ర గర్భ రామాయణం ‘’అనేపేరోచ్చింది .

బాలకాండలోనే తన వంశ చరిత్రను రెండవ పాదం మొదటి అక్షరాలలో చెప్పాడు .-

‘’అదస్య కాండస్యాద్యపాద ద్వితీయ పాదాదిమ వర్ణ మారభ్యా న్త్యపాద ద్వితీయ పాదాది వర్ణ పర్యంతం తైర్వర్నోరూదితాచిత్రణి’’అని క్లూ ఇచ్చాడు .’’శ్రీ నిట్టలోపమాశర్మణా విశ్వనాధ తయేన కమామ్బాలతా ప్రసవేన జయద్వాయ జాత సూరవిశ్వనాధ రామ భద్ర రామది పుత్రా వతాచ రామ పాద కమల యుగ సచ్చా రాలోమానసేన విబుధా చరణకన్జసేవినా భవ తమో రుణోయంశ్రీ రామాయణ సంగ్రహే నామభూతకాల (చరి)తే బభూవ ‘’

దీని లో కవిచేప్పినదాన్ని బట్టి ఆయనకిద్దరు భార్యలని కుమారులపేర్లుసూర ,విశ్వనాధ ,రామ భద్ర ,రామ అని తెలుస్తోంది .

ఉపమాకవిఈ కావ్యం లో  కవిత్వం తోఎన్నో ఫీట్లు చేశాడు .ఇందులో  నాలుగు లఘు కావ్యాలు ఉన్నాయి . అవి1- గౌరీ వివాహం . ఇది శివ పార్వతి కల్యాణం .అయోధ్య కాండ నుంచి యుద్ధ కా౦డవరకు శ్లోకాలలోని మొదటి అక్షరాలలో ఈ కద వస్తుంది  .2-శ్రీ రంగాది క్షేత్రం మాహాత్మ్యం –అయోధ్య నుండి ,యుద్ధకాండం వరకు  ప్రతి శ్లోకం లోని రెండవ పాదం  లో 63 శ్లోకాలలో శ్రీరంగం పురుషోత్తమం ,రామేశ్వరం ,అవి ముక్తం ,సింహా చలం ,కంచి ,సాకేతం ,ద్వారక ,మధుర ,శేషాచలం ,ప్రయాగ ,గౌతమి భద్రాచల క్షేత్రాల చరిత్ర ను నిక్షిప్తం చేశాడు .3-భగవదవతార చరిత్రం –ఇది విష్ణు  అవతార చరిత్ర .ఇది శ్లోకం లోని మూడవ మూడవ పాదాలను కలిపితే వస్తుంది .ఇదివచనం .4-ద్రౌపదీ కల్యాణం –అయోధ్య నుండి యుద్ధ కా౦డవరకు ఉన్న శ్లోకాలలో నాలుగవ పాదాలన్నీ కలిస్తే ఈ కావ్య రూపం దర్శన మౌతుంది

ఈ మహా కావ్యం లో చివరి గొప్ప ప్రదర్శన మరీ ఆశ్చర్య పరుస్తుంది – బాల కాండ లోని ప్రతి శ్లోకం మొదటి  అక్షరాల సముదాయం శ్రీ రామ కవచం ‘’గా రూపు దాలుస్తుంది .దీన్నిదర్శిద్దాం –

‘’రామ సదా పాహి శిరో మామక మగజే –శమానస నందకర ఫాల తలం త్వం మమ చ

క్షేత్ర యుగళ మాగమాంతర శ్రిత పద నయన యుగం –సీతాప్రియ మదీయం చ నాసికాం వాలిహర ‘

చివర్లో కవి –

సీతా కర సారస యుగ పాతాతి విశద మణివిరాజిత మౌళిం-సీతా యుత మరుణామణి ప్రోతసనగం భజే శుభే రామం ‘’శ్లోకం చెప్పి ముగించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-11 -15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 14-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

14-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )

శాండిల్య గోత్రానికి చెందినలక్కమా౦బా  రామేశ్వరుల పుత్రుడు ఈశ్వరప్ప .సదాశివుని శిష్యుడు .’’పార్వతీపరిణయచంపు’’రాశాడు. 16 వశతాబ్దం వాడు .ఈయన వారసుడు సుబ్బన్న ఈవ్రాత ప్రతిని సిద్దార్దినామ సంవత్సర భాద్రపద బహుళ తదియగురువారం -16-9-1619కాపీచేశాడు .కనుక కవి కాలం  16శతాబ్దికి పూర్వం అని భావించవచ్చు.

ఇందులోఅవతారిక లో  44శ్లోకాలున్నాయి . 223 శ్లోకాలు గద్యాలు అయిదు ‘’సన్నాహాలు ‘’ఉన్నాయి .మొదటి అయిదు శ్లోకాలు వివిధదేవతలపై,తనగురువు పై  చెప్పినవి .గురువు కవి రెండవ అన్నగారు కావచ్చు.ఎనిమిది నుండినలభై మూడవ శ్లోకంవరకు కవివంశ  వర్ణన ఉంది  .మూడవదానిలో  అన్నసుబ్రహ్మణ్యం గీర్వాణ ఆంధ్రాలలో గొప్పకవి అనిచెప్పాదు .ఈకావ్య రచనకు హేతువు గురించిచేప్పు కొన్నాడు .’’ప్రాచ్యం రోహిత పట్ట కందుక రుచిం జిత్వా నిశానాయకే –జాతే వంచిత హేమ మంజుల రుచో జంబీర రససేచ్చయా ‘’

మొదటికాండ లోహిమ వంతుడికి ,మేనక కు మైనాక ,పార్వతి ల జననం వర్ణించాడు రెండవ దానిలో నారదుని రాక ,సంధ్యా ,చీకటి ,రాత్రి  వర్ణనం నక్షత్ర చంద్ర ,సూర్యోదయ వర్ణన ,పార్వతి చెలులతో ఆటలు ,హిమ వంతుడి రాక ఉన్నాయి మూడులో భద్ర తీర్ధం లో శివునితపస్సు ,పార్వతిశివునికి చేసే సేవలు ,ఇంద్రాది దేవతలు వచ్చితారకాసురుని ఆగడాలు చెప్పి రక్షణ కోరటం ,బ్రహ్మ హితవుపై మన్మధుని సాయం కోరటం ,మన్మధుడు శివుడు తపస్సు చేసే చోటుకు రావటం ఉన్నాయి నాలుగులో మన్మదుడుశివునిపై బాణం వేయటం మసి కావటం ,రతీ విలాపం ,శివుడి అభయం ,నిరాశ తో పార్వతి తండ్రి ఇంటికి వెళ్ళటం ,పార్వతి తపస్సు ,బ్రాహ్మణ బ్రహ్మచారి వేషం లోశివుడు వచ్చి మనసు మార్చుకోమనటం ,ఆమెనిరాకరణ,నిజ రూపం లో శివుని ప్రత్యక్షం ,శివుడు పార్వతీ కల్యాణానికి ఒప్పుకోవటం సప్తర్షులరాయబారం ,చివరికి సకల దేవత సమక్షం లోశివపార్వతీ కళ్యాణం వర్ణించ బడ్డాయి .

ఈశ్వరప్ప  కాళిదాస కుమార సంభవాన్ని అనుసరించాడు .కావ్యం హిమాలయ వర్ణన తో ప్రారంభ మైంది .

‘’శ్రీ మనస్త్రి సమస్త పర్వత పతిర్నమ్నాహిమాద్రిర్మహాన్ –కస్చిద్రద్ర వ్యపతే ర్దిశ ప్రకట యన్నాత్మీయ విస్తారతాం ‘’

పార్వతీదేవి పాద ముఖ వర్ణన –‘’రాత్రీ శుదాంశురిపురేత్య విజ్రుమ్భణం మే –హన్తీతి పర్వత సుతాంప్రతి సాదు జప్వా

పధం తదీయ చరనావతారం ప్రపద్య –తత్సంజ్నయా విజయతే కిము నిత్య ఝ్రుమ్భం ‘’

శివుడు బ్రహ్మ చారి   వేషం లో వచ్చి పార్వతి తో సంభాషించటం –‘’జానామి జానామి తవానుభావం తస్యాన్న విస్టన్విజ్రుతానూ ప్రవేశ్యే

మాలికా రూప కపాళీ కాళీ ధర ,రాశాభ మురూ యదు శ్పాలి కా భీస్టేదః –అంగార గీభవ ద్రూతి కర స్శూలికీ  కిం వ్రుతస్సత్వయా భీకరచేస్టయా ‘’అని పార్వతిని శివుదివిక్రుతవేశం వివరించి బెదర గొట్టేప్రయట్నం చేశాడు .

వివాహ సమయంలో పెండ్లికోడుకైన శివుడేలాఉన్నాడు?

‘’జటా జూటా రాశంభో స్సపాది హరి తోష్నీశ వసనం –సుధాంశు స్తత్రత్యః ప్రభావతి మహా భాషిక మపి ‘’చివరలోశివ పార్వతులశృంగార క్రీడా వర్ణనం చేశాడు

‘’కళ్యాణ ప్రదాయే స్తాయో స్త్రిజగతా మాస్వాదితా మూల్యత్ –త్తంభూలాది ర్యయొః కృత బహిర్జాత వ్య వా యా స్థయొః’’

ఆస్వాతంతగాద్యం –‘’ఇతి శ్రీ మదీశ్వర ప్పాభిదాన బుధ విరచిత పార్వతీ పరిణయ నామ దేయ చంపూ ప్రబందే పంచామాస్సంనాహః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ – 21-11-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 16-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )

నాలుగవ  గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

16-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )

శాండిల్య గోత్రానికి చెందినలక్కమా౦బా  రామేశ్వరుల పుత్రుడు ఈశ్వరప్ప .సదాశివుని శిష్యుడు .’’పార్వతీపరిణయచంపు’’రాశాడు. 16 వశతాబ్దం వాడు .ఈయన వారసుడు సుబ్బన్న ఈవ్రాత ప్రతిని సిద్దార్దినామ సంవత్సర భాద్రపద బహుళ తదియగురువారం -16-9-1619కాపీచేశాడు .కనుక కవి కాలం  16శతాబ్దికి పూర్వం అని భావించవచ్చు.

ఇందులోఅవతారిక లో  44శ్లోకాలున్నాయి . 223 శ్లోకాలు గద్యాలు అయిదు ‘’సన్నాహాలు ‘’ఉన్నాయి .మొదటి అయిదు శ్లోకాలు వివిధదేవతలపై,తనగురువు పై  చెప్పినవి .గురువు కవి రెండవ అన్నగారు కావచ్చు.ఎనిమిది నుండినలభై మూడవ శ్లోకంవరకు కవివంశ  వర్ణన ఉంది  .మూడవదానిలో  అన్నసుబ్రహ్మణ్యం గీర్వాణ ఆంధ్రాలలో గొప్పకవి అనిచెప్పాదు .ఈకావ్య రచనకు హేతువు గురించిచేప్పు కొన్నాడు .’’ప్రాచ్యం రోహిత పట్ట కందుక రుచిం జిత్వా నిశానాయకే –జాతే వంచిత హేమ మంజుల రుచో జంబీర రససేచ్చయా ‘’

మొదటికాండ లోహిమ వంతుడికి ,మేనక కు మైనాక ,పార్వతి ల జననం వర్ణించాడు రెండవ దానిలో నారదుని రాక ,సంధ్యా ,చీకటి ,రాత్రి  వర్ణనం నక్షత్ర చంద్ర ,సూర్యోదయ వర్ణన ,పార్వతి చెలులతో ఆటలు ,హిమ వంతుడి రాక ఉన్నాయి మూడులో భద్ర తీర్ధం లో శివునితపస్సు ,పార్వతిశివునికి చేసే సేవలు ,ఇంద్రాది దేవతలు వచ్చితారకాసురుని ఆగడాలు చెప్పి రక్షణ కోరటం ,బ్రహ్మ హితవుపై మన్మధుని సాయం కోరటం ,మన్మధుడు శివుడు తపస్సు చేసే చోటుకు రావటం ఉన్నాయి నాలుగులో మన్మదుడుశివునిపై బాణం వేయటం మసి కావటం ,రతీ విలాపం ,శివుడి అభయం ,నిరాశ తో పార్వతి తండ్రి ఇంటికి వెళ్ళటం ,పార్వతి తపస్సు ,బ్రాహ్మణ బ్రహ్మచారి వేషం లోశివుడు వచ్చి మనసు మార్చుకోమనటం ,ఆమెనిరాకరణ,నిజ రూపం లో శివుని ప్రత్యక్షం ,శివుడు పార్వతీ కల్యాణానికి ఒప్పుకోవటం సప్తర్షులరాయబారం ,చివరికి సకల దేవత సమక్షం లోశివపార్వతీ కళ్యాణం వర్ణించ బడ్డాయి .

ఈశ్వరప్ప  కాళిదాస కుమార సంభవాన్ని అనుసరించాడు .కావ్యం హిమాలయ వర్ణన తో ప్రారంభ మైంది .

‘’శ్రీ మనస్త్రి సమస్త పర్వత పతిర్నమ్నాహిమాద్రిర్మహాన్ –కస్చిద్రద్ర వ్యపతే ర్దిశ ప్రకట యన్నాత్మీయ విస్తారతాం ‘’

పార్వతీదేవి పాద ముఖ వర్ణన –‘’రాత్రీ శుదాంశురిపురేత్య విజ్రుమ్భణం మే –హన్తీతి పర్వత సుతాంప్రతి సాదు జప్వా

పధం తదీయ చరనావతారం ప్రపద్య –తత్సంజ్నయా విజయతే కిము నిత్య ఝ్రుమ్భం ‘’

శివుడు బ్రహ్మ చారి   వేషం లో వచ్చి పార్వతి తో సంభాషించటం –‘’జానామి జానామి తవానుభావం తస్యాన్న విస్టన్విజ్రుతానూ ప్రవేశ్యే

మాలికా రూప కపాళీ కాళీ ధర ,రాశాభ మురూ యదు శ్పాలి కా భీస్టేదః –అంగార గీభవ ద్రూతి కర స్శూలికీ  కిం వ్రుతస్సత్వయా భీకరచేస్టయా ‘’అని పార్వతిని శివుదివిక్రుతవేశం వివరించి బెదర గొట్టేప్రయట్నం చేశాడు .

వివాహ సమయంలో పెండ్లికోడుకైన శివుడేలాఉన్నాడు?

‘’జటా జూటా రాశంభో స్సపాది హరి తోష్నీశ వసనం –సుధాంశు స్తత్రత్యః ప్రభావతి మహా భాషిక మపి ‘’చివరలోశివ పార్వతులశృంగార క్రీడా వర్ణనం చేశాడు

‘’కళ్యాణ ప్రదాయే స్తాయో స్త్రిజగతా మాస్వాదితా మూల్యత్ –త్తంభూలాది ర్యయొః కృత బహిర్జాత వ్య వా యా స్థయొః’’

ఆస్వాతంతగాద్యం –‘’ఇతి శ్రీ మదీశ్వర ప్పాభిదాన బుధ విరచిత పార్వతీ పరిణయ నామ దేయ చంపూ ప్రబందే పంచామాస్సంనాహః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ – 21-11-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సర్వపాపా హారం పాద గయాక్షేత్రం

Inline image 1

 

 

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శరత్ జ్యోత్స్నా రాణి అంతరంగం

Inline image 1Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అబ్బావుద్ ఖతం

Inline image 1Inline image 1


Inline image 2

 
Inline image 2
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 13-ఏకాంకిక కర్త-అయ్యవారు శాస్త్రి

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4

13-ఏకాంకిక కర్త-అయ్యవారు శాస్త్రి

17వ శతాబ్ది మధ్యలో కర్నూలు పాలకుడు ఆనంద రావు దేశాయ్ ఆస్థానం లో అయ్యవారు శాస్త్రి ఉన్నాడు .’’సభార౦జనం ‘’అని పిలువ బడే ‘’హితకారి ‘’అనే ఏకాంకిక నాటకం రాశాడు .దీన్ని 29తాటాకులపై లిఖించాడు .అందులో మొదటి అయిదు పత్రాలు కనిపించలేదు .కనుక కవి గురించి ఆయన పోషకుల గురించి వివరాలు తెలియటం లేదు .లభించిన ఆధారాలను బట్టి సంస్కృతాంధ్రాలలో దిట్టమైన కవి .కందనోలులేక కర్నూలు  నుపాలించిన మహారాష్ట్ర పాలకుడు నిత్యానందరావు లేక ఆనంద రావు దేశాయ్ ఆస్థానకవి .బహుశా ఆనందరావు మహారాష్ట్ర రాజ ప్రతినిధి కావచ్చు .శివాజీ పాలనలో కర్నూలును పాలించిన మరో ఆన౦దరావు కూడా ఉన్నాడు .ఆనందరావు శివాజీ మహారాజును కీర్తించినందు వలన ఈయనే అయ్యవారు శాస్త్రిగారి పోషకుడు అని భావించారు .మహబూబ్ నగర్ జిల్లాలో జటప్రోలు సంస్థానం లో ‘’అయ్యవారు పల్లె ‘’అగ్రహారం ఉంది .ఇది ఈయనకు ఈనాముగా బహూకరించ బడి ఉండచ్చు .

కవి చెప్పిన దాన్నిబట్టి ఇది ఏరకమైన ఎకా౦కికయో తెలియదు .బీజ,ముఖ సంధులు మొదటి అయిదు పత్రాల అలభ్యతవలన తెలియ రావటం లేదు .అంతా వర్ణన మయం .నాటిక చివరి భాగం కూడా స్పష్టంగా లేదు .రసికా వతంస అనే ఇందిరా మందిరరాజు ,హితకారి  అనే రెండే రెండు ముఖ్య పాత్రలున్నాయి .హితకారి అనేవాడు మంత్రి కొడుకు .దౌవారికుడు హితకారి ని రాజు సమక్షం లో ప్రవేశ పెట్టి నిష్క్రమిస్తాడు .హితకారి ,రసికావతంసుడు కలిసి వన విహారం చేస్తారు .వనపాలుడనే తోటమాలి ,రాజానుచరుడు కొంత హాస్య సంభాషణ నడుపుతారు . దీనితో కద సమాప్తం .రాసికావతంసుడు ,హితకారి ఒక రోజు కార్యక్రమగా రాజంతః పురం నుండి వన సందర్శనం చేయటం,కాసేపు తోటలో తిరిగి ,పిచ్చాపాటీ మాట్లాడుకొని మళ్ళీ తిరిగి రావటం  ఇందులో కధ.దారిలో వారికి కనిపించిన సకల సజీవ నిర్జీవ విషయాలను వర్ణించాడు కవి .శాస్త్రి గొప్ప పండితకవి అనిపిస్తాడు .వైశేషిక న్యాయం నుంచి వైద్య శాస్త్రం వరకు ఆయనకు ప్రతి విషయం లోను లోతైన పరిజ్ఞానం ఉందని తెలుస్తుంది .ఇద్దరూ బయల్దేరేముందు వారి వేషధారణ రసికుడు అద్దం లో తన అందాన్ని చూసుకోవటమూ వర్ణించాడు –మనమూ ఒక సారి ఆ అడ్డం లోకి తొంగి చూద్దాం –

‘’ఆదర్శ న భవతే దర్శనతోన్తః ప్రవేశ యసి సర్వాన్ –యస్య ముఖ శ్రీ ర్లోకే తస్య బేర్ సర్వలోకాఃస్యుః’’

రాజు తన ముత్యాల  కర్నా భరణాన్ని చూస్తూ—‘’’ముక్త ఫల ముఖో ల్లాస కరే రాజం అవోగ్రగః

సువృత్త చతురాకారో న కః ప్రభుహితో భవేత్ ‘’అంటాడు .తోటకు వెళ్లేముందు హితకారి తమ ఇందిరామందిర పట్టణ వైభవాన్ని వర్ణిస్తాడు

‘శ్రీ మత్సర్వ పురీ రమా విజయ లక్ష్మీ లక్షణ ప్రభవా-సీమాన్తాయితసూర్య సోమ సరణీ శృంగార రంగన్ముఖా

సత్ప్రాకార నితంబ బింబ రాశనా కల్పాయిత స్వర్దునీ –మేధ్యాసౌ న కదం హిసర్వ విబుధ శ్రీ మందిరేయం పురీ ‘’అని దాని శోభను వర్ణిస్తాడు .

వనం లోకి ప్రవేశించాక కనబడిన ప్రతి వృక్షాన్ని వర్ణిం చాడు కవి .ఈ వర్ణన లలో శాస్త్రీయ కోణమూ ఉంది .అశ్వత్థ నింబ ,వట ,తి౦త్రిణి ,కపిత్త ,బిల్వ ,ప్లక్ష ,ఉదుంర ,చూతమొదలైన వృక్ష వర్ణన ఉంది .తరువాత కనిపించిన సింహ శార్దూల కురంగ వనావర్త ,మున్నగు జంతువర్ణన చేశాడు .అప్పటికే మధ్యాహ్నమైంది. అక్కడ భవానీ దేవాలయం లో అమ్మవారికి పూజ చేశారు .అప్పుడు అక్కడి సరోవరం లో విహరించే హంస ,కుముద మత్స్య ,చాతక చకోర చక్రవాక పక్షుల వర్ణనా పనిలోపనిగా కానిచ్చేశాడు .చకోరపక్షి వర్ణ చూడండి –

‘’చకోరే తారకోదార యోగో యస్తోనిరంతరం –నహి చే చ్చంద్రికా పానంకదం ఖేచరముద్రయా ‘’

ఇంతలో కొన్ని మాటలు వినిపిస్తే అవి వనపాలురు రాజును చూడాలనే ఉత్సాహపు మాటలంటాడు హితకారి .వాళ్ళు రాజుకు ఫలాలు పుష్పాలు కానుకగా సమర్పిస్తారు .వాళ్ళు తెచ్చిన ఖర్జూర ద్రాక్ష ,మాతలు౦గ దాడిమి మొదలైన ఫల వర్ణన తర్వాత మల్లికా ,గంధఫలి (సంపెంగ )కేతకీ పుష్ప వర్ణన  చేస్తాడు .మిట్ట్మమధ్యాహ్నమైనఉక్కపోస్తోంది రాజుగారికి విసరటానికి విజామర వర్ణ న చేశాడుకవి .చమట పట్టిందికనుక స్నానం చేయాలి .ఆ తతంగాన్నీ బాగానే పూర్తీ చేశాడు .చండీ ఆలయం లో పూజారి వీరికోసం ఎదురు చూస్తున్నాడు .వెళ్లి పాల్గొన్నారు .భవానీ దేవిని కవి వర్ణించాడు –

‘’అంబ జగతో వలంబ నమంబాత్వే నైవ విహితామిహ భూయః –అవలంబయ  మాం కృపయే త్యుక్తిః పునరుక్తమితిమయానోక్తా ‘’అని వరుసగా అయిదు శ్లోకాల ప్రార్ధన చేశాడు .అమ్మవారి ప్రసాద స్వీకారం తర్వాత భోజనాలకు ఉపక్రమించారు .భోజన సామాగ్రినంతా వర్ణించాడు తినుబండారాల వర్ణనా నోరూరిస్తుంది .పాటోలఅంటే పొట్లకాయ వర్ణనా ఉంది –‘’పాటోలాదీర్ఘ క్రున్త్యాపి లాఘవం కేన సాధితం –పాషాణ వహనాదిభ్యః కిమార్జితాం ‘’

గుమ్మడికాయ అంటే కూష్మా౦ డాన్నిఅంతే రుచిగా వర్ణించాడు –‘’కూష్మాండ సర్వమదురోప్య బలాదుర్భఘసాఘ్రు వ్రుత్తోసి –బాల్యే సర్వ పిధ్యం భవదాచారణం  కిమేత దుపపన్నం ‘’

వన్నీ 24ఆకులలో ఉన్నాయి చివరి 25వ పత్రం లభ్యం కాలేదు .26లో తిరుగు ప్రయాణ వర్ణన ఉంది .దారిలో స్త్రీ,అంతఃపుర ,సింహాసనం  కళ్ళజోడు ,కలం ,రాసే వస్తువులు ,దీపం ,కత్తిమొదలైన వర్ణన ఉంటుంది .తర్వాత రాజు కళావతితో కాలక్షేపం చేసే సమయమైనదని హితకారి గుర్తు  చేస్తాడు .కళావతి రాణి అని మనకు అప్పుడు తెలుస్తుంది .చివరకు హితకారిరాజును ఆశీర్వదిస్తాడు .

‘’రాజన్ సామ్రాజ్య లక్ష్మీ విభవావిలాసితః సర్వ దిక్కుమ్భి కుంభ –ప్రోదాన్ముక్తా ఫలశ్రీ సహచర యశసా ఖ్యాత విద్రుద్రజ శ్రీ ‘’దీనికి జవాబుగా రాజు

‘’జయంతి బహుదా సుధా మధుర బందుతా బంధుర –ప్రబంధ రచనా చమత్కృతి కృతార్ధ స్ద్వే భవాః

ప్రసూన చయ సౌరభేః ప్రసవి దేను దుగ్ధ దాన్చితే –ర్వచో భి రభిత స్స్తభాం ప్రభావ ఏవ సంభావితం ‘’

రాజును తనకు సెలవిప్పించమని హితకారి కోరటం ,ఇతనికోసం ఇంటిదగ్గర భార్య కృపావతి ఎదురు చూస్తూ ఉండటం తో ఏకాంకిక పూర్తీ అవుతుంది .బిరుదు రాజు వారు దీన్ని ‘’వీధి ‘’అనే నాటక భాగం గా పేర్కొన్నారు .నాకేమో ఇది ఒక ‘’ట్రావేలోగ్ ‘’అంటే పిక్నిక్ లాగా ఉందని  పించింది .ఏమైనా అయ్యవారు శాస్త్రి తానొక ‘’గైడ్ ‘’గావ్యవహరించి కద నడిపించాడు .ఒక కొత్త ప్రయోగం అనిపించాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 9-మరిగంటి అప్పల దేశికులు (1790)

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4

9-మరిగంటి అప్పల దేశికులు (1790)

శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన మరి గంటి వారు నల్గొండజిల్లా నివాసులు .తర్వాత రాష్ట్రమంతా వ్యాపించారు .తెలుగు సంస్కృతాలలో బహు గ్రంధాలు రచించారు .కుతుబ్ షాహి ,విజయనగర పాలకుల పోషణలో ఉన్నా ఈ కవులు ఒక్క రచనను కూడా ఆ రెండు రాజ వంశీయులకు అ౦కితంచేయక పోవటం మహా విశేషం .తమ ఇస్ట దేవతలకు మాత్రమె అంకితమిచ్చారు .అనుముల నివాసి అయిన మరి గంటి నరసింహా చార్య(1700)తెలుగులో చాలానూ సంస్కృతం లో ‘’శతవైరి వైభవాదివకరం ‘’ఛందో గ్రంధాన్ని రాశాడు . ఈయన మనవడు ,వేంకటాచార్య కుమారుడు అప్పలదేశికుడు నరసింహ పురం లో నివసించాడు .లక్ష్మీ నృసింహ స్వామికి పరమ భక్తుడు .

అప్పల దేశికులు సంస్కృత లఘుకావ్యాలు చాలా రాశాడు .అందులో ముఖ్యమైనవి 1-శ్రీరామ పాద స్తుతి 2శ్రీ గోదా స్తవం 3శ్రీ అర్వపల్లి లక్ష్మీనరసింహ స్తోత్రం 4నరసి౦హాస్టోత్తరం 6స్థంభ గిరి లక్ష్మీ నరసింహ స్తోత్రం .

శ్రీరామ పాద స్తుతి 28శ్లోకాల లఘుకావ్యం .ఒకటి రెండు శ్లోకాలు మచ్చుకి

‘’చిత్రం యాత్ర శిలాతలే సుఘటితం రామేణ పాద ద్వయం –సాక్షాల్లక్ష్మణవారుణాస్త్రవిభావజ్జాతం చ శీతం పయః

సీతాయాః కరుణా కటాక్ష విభవత్సంపాదితాస్సంపదో-మిత్రే రత్న వృతౌ నృసింహ నగరే జీవేయ మాయుశ్శతం’’

అర్వేపల్లి లక్ష్మీ నృసింహస్తోత్రం లో  స్వామి ఉగ్ర ,శాంత స్వరూపాలను వర్ణిస్తూ చెప్పిన శ్లోకాలు కమనీయం

తుండ త్వండ త్తరంగ రావసిత భర పరిష్వంగ నిస్తండలింగ –ద్రుండం గందానుగా త్రున్గ్రం గగనగ గాంధర్వ గర్వ మహోర్మిం

దీప్యత్ స్వేతాత పత్రం  మణిమకుటలసన్మస్తకం యుక్త పార్శ్వం –లక్ష్మీ క్షమాజ ముఖాబ్జాస కరుణా చరణం పూర్నిమాచంద్ర వక్త్రం –సర్వోత్తంసంసమస్తాభరణవిలసితం కోటి సూర్య ప్రకాశం

నేత్రానంద ప్రదం తం మహా హ్రిది కలయే అర్వపల్లీ నృసింహం .

నరసింహ స్తోత్రం 27శ్లోకాల నక్షత్ర మాలిక .బీజాక్షర నిక్షిప్తం .

‘’శ్రీ వత్సాంకం త్రినేత్రం శశి సమ ధవళం చక్ర హస్తం సురేశం –వేదాంగో వేదనాదః వినుత సురపతి ర్దేవ రూపః పరేశః ‘’శ్రీ గోదాస్తవం’’నుండి ఒక ఉదాహరణ

‘’కనక లతికా స్నిగ్ధం ముగ్దాంబుజాయతలోచనా –మమృత లహరీ భోగ్యం యోగ్యం మురారి మహో రసః ‘’

అప్పలదేశికులు ఎన్నో తిరునామాలు, మంగళ హారతులు సంస్కృతాంధ్రాలలో రాశాడు .శ్రీ వైష్ణవులలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి .

10-దశకుమార కదాసార కర్త -అప్పయా మాత్య (15శతాబ్దికి పూర్వం )

దండి దశకుమార చరిత్ర కు శ్లోక రూపకావ్యమే అప్పయామాత్యుని ‘’దశ కుమార కదా సారం ‘’.ఇది మూడు పరిచ్చేదాలలో ఉంది .199అనుష్టుప్ శ్లోకాలో రాశాడు .ఇందులోని అయిదు భాగాలు మూడు పరిచ్చేదాలుగా మలిచాడు .రాజవాహనుని చరిత్రతో పూర్తీ అవుతుంది .మొదటి పరిచ్చేదం లో మొదటి భాగం లోని పూర్వ పీఠిక ఉంది .రెండవ పరిచ్చేదం లో రెండు నాలుగు భాగాల కద ఉంటుంది .మూడవ దానిలో అయిదవ భాగ కద ఉంది .కవిత్వం సరళంగా సుందరంగా అందంగా ఉంటుంది .కవి పేరుతప్ప మిగిలిన వివరాలు తెలియ రాలేదు .విజయనగర రాజ మంత్రి అయి ఉండవచ్చునని ఊహిస్తున్నారు .ఆంద్ర నియోగి బ్రాహ్మణుడు అని పేరును బట్టి ఊహ

కావ్యాన్ని ‘’శ్రీ వాగుమాం పరం శాంత మేక వీరం మహేశ్వరీం-సంపత్సంహిత్య సౌభాగ్య సమ్యక్ సిధ్యర్ధ మర్యయే ‘’అని మొదలు పెట్టాడు .ఆయనే చెప్పినదాన్ని బట్టి కవి సనాతన ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు .ఏకవీరా దేవి భక్తీ కాకతీయుల కాలం లో ఎక్కువగా ఉండేది .ఆకాల సాహిత్యం ,శాసనాలు దీనికి రుజువు .ఖచ్చితం గా మనకవి ఫలానా కాలానికి చెందినవాడు అని చెప్పలేముకాని 15శతాబ్దికి పూర్వం ఆని చెప్పచ్చు .సాంద్రమైన దశకుమార చరిత్రను అతి సరలాఆ భాషలో రాశాడు అప్పయామాత్య .మధురపదజాలం ముగ్ధ మనోహరంగా ఉంటుంది .కావ్యం చివరలో

‘’రమ్య కాంతేగృహే సార్ధం ప్రియయా రాజవాహనః –విహారన్ వల్లభ్యసుగోస్టచామాభ్య రదనా పూర్వక మేష పృస్టః

చతుర్దశానాం జగతాం ప్రపంచం సంక్షేపతః స్పష్ట ముదాజహార

ఇతి శ్రీ మదప్పయా మాత్య విరచితే దశ కుమార కదా సారే సోమదత్త కధాకధనం నామ తృతీయః పరిచ్చేదః ‘’

11-యదుగిరి భూషణ చంపు కవి-అప్పలాచార్య

శ్రీశైల కుటుంబానికి చెందిన లక్ష్మీ ,రాఘవాచార్యుల కుమారుడే అప్పలాచార్య.తిరుపతి నివాసి .’’యదుగిరి భూషణ చంపు ‘’రాశాడు .యదుగిరి అనే మెల్కోటే అనే వైష్ణవముఖ్య క్షేత్ర  పవిత్రతను ఇందులో వర్ణించాడు .గీర్వాణా౦ ద్రాలలో గొప్పకవి .వీర రాఘవ శిష్యుడు .కవికాలం తెలియదు .కావ్య ప్రారంభ శ్లోకం –

‘’శ్రీమానబ్జాభవాదిమస్తక తటన్యస్తప్రశ స్త ప్రభా –వాస్తుస్నిగ్దా చిరత్న రత్న మకుటా సంగో లసత్ప్రన్నగః ‘’

గురువు వీరరాఘవుని పై చెప్పిన శ్లోకం చూద్దాం –

‘’శ్రీ భాష్యామృత పూరితం గురుతరం శ్రీ వైష్ణవైశ్చాతకైః-నిత్యం సేవితమాత్మ సస్యాని కరనాత్యంతతాపోద్రుతాం –దిన్వంతమ్రసవత్తయా హృది భజే శ్రీ రాఘవా స్వామినం ‘’

చివరి శ్లోకం  -‘’సాదురన్న హృదయ౦గమోజ్జ్వలం భాను కూటనిభనాయకో జ్జ్వలం

మాననీయ గుణ బంధ పోషణం రాజతే యదుగిరీశ భూషణాం’’.

ఆశ్వాశా౦త గద్య లో –‘’ఇతి శ్రీ త్సేందవ కన్దరదేవా లబ్ధ సంస్కృతాంధ్ర భాషా చతుర్విధ కవితా ధురంధరస్య ,శ్రీ వేంకటాద్రి నివాస చరన కమల కిమ్కరస్య ,శ్రీ మద్వీర రాఘవ గురు చరణనీరజ భ్రున్గస్య శ్రీ శైలాన్వాయ దుగ్ధ సింధు జస్య ,శ్రీ రాఘవార్య తనూజస్య ,శ్రీ లక్ష్మీ గర్భ శుక్తి కా మణోరప్పలాచార్యస్య ,క్రుతిషు యదుగిరి భూషణాఖ్యం చంపూ కావ్యం సమాప్తం .

12-ప్రహసన కర్త -బొమ్మకంటి అయ్యలనాధుడు (17వ శతాబ్దం )

బొమ్మకంటి అయ్యలనాధుడు లేక తిరుమలనాధుడు ‘’కుహనా భైక్షవ ప్రహసనం ‘’రాశాడు.దీనిని  రాజ శేఖర పట్టణం లో స్వామి గోపికా రమణుని ఉత్సవాలలో ప్రదర్శించే వారు .ముస్లిం నాయకుడు అహ్మద్ ఖాన్ వేశ్య చంద్ర లేఖ పై వ్యామోహాన్ని ఎండగట్టే  వ్యంగ్యాత్మక రచన .ఇందులో ఒలికే హాస్యాన్ని చవి చూద్దాం.

‘’వేదనామ మ్రుతప్రదాన సమయే సంప్రాప్తకాంతక్రుతిః-లీలావిక్రమ వల్గితస్తన భరే భాస్వద్విభూషావలిః

సాన్తర్హస్వవచః ప్రపంచ తురస్నిగ్దా ల్లసా లొకనైః-పశ్యన్నాస వవంచితా సుర గణోనారాయణః పాతునః ‘’

సూత్ర దారికి నటి కి మధ్య సంభాషణలలో రచయిత గురించి కొంత తెలుస్తుంది .చివరలో షండ భిక్ష సంభాషణ ఉంటుంది .

షండ-‘’భో భో గృహాంతరాలస్తితా చంద్ర లేఖా కుపితోతిగ్రుహాన్నిర్గతో  హ్మదుఖానః –తదదా భవద్విర వహితైః స్థాతవ్యం

భిక్షు –వత్స కోయమాను రణానమివాహ్మదుఖాన ఘంటాయః ‘’ఈభాషణం లో ఖాను మోహించింది చంద్ర లేఖ అని తెలుస్తుంది

తెలుగులో కూచిమంచి జగ్గకవి రాసిన ‘’చంద్ర లేఖా విలాపం ‘’మన అయ్యలనాదునికి ప్రేరణగా కనిపిస్తుంది .ముస్లిం పాలకులు ఆంధ్రాన్ని పూర్తిగా ఆక్రమించిన తర్వాత రాయ బడిన ప్రహసనం గా దీన్ని భావిస్తారు .కనుక అయ్యలనాధుడు 17వ శతాబ్దికి  చెందిన వాడని చెప్ప వచ్చు .బొమ్మకంటివారు గొదావరీ  తీరంలోని  తెలగాణ్యబ్రాహ్మణులు . ఇదే ఇంటిపేరుతో ఖమ్మం జిల్లాలో నియోగులు కూడా ఉన్నారు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ – 19-11-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment